పూర్వము సంస్కృత భాష గ్రాంథిక భాషగాను,
ప్రాకృత భాష వ్యావహారిక భాషగాను ఉండుట చేత
సంస్కృత నాటకములు వ్రాసిన మహాకవులు
ఉత్తమ పాత్రల మట్టుకే సంస్కృతము ఉపయోగించి
తదితర పాత్రలకు ప్రాకృత భాష వాడేవారు.
అశోకుడి కాలంలో ముద్రించబడిన శాసనాలు
ప్రాకృత భాష లో రాయబడ్డాయి
"వజ్జాలగ్గం హాలుని గాథా సప్తశతి లాంటి ప్రాకృత గాథా సంకలనం.
దీని రచయిత శ్వేతాంబర జైనుడయిన జయవల్లభుడు.
ఈ వ్యాసంలో రామచంద్ర గారు
ప్రస్తుత తెలుగు పదాలకు మూల రూపమైన
౨౩ శబ్దాలను పరిచయం చేసి,
వాటి సందర్భాన్ని తెలుపుతూ,
ఆ పదాలు సంస్కృత తద్భవాలు అన్న వాదనను,
పూర్వపక్షం చేస్తారు.
వీటిలో కొన్ని పదాలు, “వింతర”,”ఓ”,”ఆవట్టయే,”విసూరణం” వగైరా.."
ప్రాకృత వాఙ్మయంలో రామకథ – తిరుమల రామచంద్ర
"పుస్తకం" లో
తిరుమల రామచంద్ర గారి పుస్తకాలని పరిచయం చేస్తూ
రవి రాసిన మాటలు
"వజ్జలగ్గ"
“గోష్టియందొకానొక ప్రస్తావనమునదు పలుకు చాటువులకు
వజ్జాలగ్గమని పేరట.
వజ్జయనగా పధ్ధతియని జయవల్లభుడే వ్యాఖ్యానించెను
లగ్గమనగా లగ్న శబ్ద భవమగునా..”
అంటారు పుట్టపర్తి యీ వజ్జలగ్గ గురించి
అతి చిన్న వయసులోనే ప్రాకృత భాషల గురించి
ఆధికారికంగా చెప్పి అందరినీ పుట్టపర్తి ఆశ్చర్యపరిచారు
ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో
ప్రాకృత భాషల గురించి పుట్టపర్తి మాట్లాడుతున్నప్పుడు
ఉపన్యాసం ఐపోయాక
ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి
సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశా రట
పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి గారు
ఉద్యోదనుడు ప్రాకృత భాషలో రచించిన
కువలయమాల అనే రచనను అనువదించారు...
మరి యీ వజ్జ లగ్గ గురించి పుట్టపర్తి వారేం చెప్పారో చూడండి
పూర్వము సంస్కృత భాష గ్రాంథిక భాషగాను,
ప్రాకృత భాష వ్యావహారిక భాషగాను ఉండుట చేత
సంస్కృత నాటకములు వ్రాసిన మహాకవులు
ఉత్తమ పాత్రల మట్టుకే సంస్కృతము ఉపయోగించి
తదితర పాత్రలకు ప్రాకృత భ…