You are on page 1of 3

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రా రంభించారని నమ్ముతారు.

మత్స్యావతారము ధరించిన విష్ణు వు సో మకుని

సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి 

వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తు ను చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా

సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షా ధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది

పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తు గా ఉగాది

పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టా భిషిక్తు డైన దినం కారణంగా ఈ పండుగ ప్రా శస్త ్యంలోకి వచ్చిందని మరొక గాధ.

"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది'

'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధ ము. ఉత్త రాయణ,

దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది

అయింది. యుగాది శబ్దా నికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైతశు


్ర క్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైతశు
్ర ద్ధ పాడ్యమి

నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణ యసింధుకారుడు పేర్కొనియున్నాడు


.
సంప్రదాయాలు

ప్రతి సంవత్సరం చైతమ


్ర ాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణ య సింధు ధర్మ

సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తు న్నాయి. ఉగాదిరోజు

తైలాభ్యంగనం

నూతన సంవత్సరాది స్తో త్రం

నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)

ధ్వజారోహణం (పూర్ణ కుంభదానం)

పంచాంగ శ్రవణం

మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్ట డం, తలస్నానం చెయ్యడం,

కొత్త బట్ట లు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తు న్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు,

కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లె ల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం

వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా?

ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి

'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర

సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూ ంటారు! అందువల్ల నే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ

నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పూజాదులు

అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొ త్త బట్ట లు ధరించి పూజ చేసుకొంటారు. అయితే

ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ

తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి

"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధ ం. ఉగాది నాడు షడ్రు చుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం,
ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొ డుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట

సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తు ంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి

కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడికి మనశాస్త్రా లలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రా శనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు

కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దో షాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని

శాస్త్రీయంగా తయారు చేసే పద్ద తిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు

అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రా లు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట

మధుమాస సముద్భవ

నిబామి శోక సంతప్తా ం

మమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రా లు చెప్తు న్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని,

వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత

ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తు ంది.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి

కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని

ఆయుర్వేదశాస్త ం్ర పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొ ట్ట తో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి

శాస్త ం్ర లో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి

ఉపకరిస్తు ందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తు ందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత

పచ్చడిని సేవించటం చైతశు


్ర క్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా

వసంత నవరాత్రు ల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దో షాలు హరిస్తా యి. కాలక్రమంలో

ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు , ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే

ఉపయోగించటం కనిపిస్తు ంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొ ంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు,

తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ

కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధ తంతా చాలామంది

మరచిపో యారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త ్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణ కుంభ లేక ధర్మ కుంభ

దానాన్ని చేస్తు ంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.

ఉగాది ప్రసాదం

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం

అవుతుంది కనుక వేసవి తాపం తట్టు కోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తు ంది అలాగే వడపప్పు

కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తు ం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తు ంది.ఇలాంటి ఆహారాన్ని

ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్త ం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే

ఆచారం ఉంది.ప్రస్థు త కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో
సంభవించే గాలి లేమిని విసనకర్రా లు కొంత తీరుస్తా యి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రా రంభం అవుతుంది.

పంచాంగ శ్రవణం

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా

ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తా రు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా

గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొ ందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబో తున్నాయి? ఏరువాక

ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గ ంగా ఉండేది.

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌క్యాలెండరు"ను ఉపయోగిస్తూ

వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను

వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లో కి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది.

అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రా లు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ

శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రా మాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం

చూస్తూ నే ఉన్నాము. కాగా ప్రస్తు తం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల

మీద వ్రా యబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తా రు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రా యం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధ ం. తిధి,

వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7 వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11

కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్త రాభిముఖంగా కూర్చుని

పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రా యం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తా రు.అంటే

నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తా రు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తు ందో

తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

You might also like