Professional Documents
Culture Documents
Ayush Protocal
Ayush Protocal
ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో సహజ సిద్ధంగా లభించే.. మనం నిత్యం భోజనంలో ఉపయోగించే కొన్ని
పదార్థా లతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ
తులసి ఆకులను తినడం.. ఆహారంలో దాల్చినచెక్క, మిరియాలు, శొంఠి, కిస్మిస్ఉండేలా చూసుకుంటే
సరిపోతుందంటున్నారు.
Advertisement
Learn More
Powered by PlayStream
కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎవరికివారు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేలా ఇప్పటికే ఆయుష్ప్రొటోకాల్ను
ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం, 30 నిమిషాలపాటు యోగా/ప్రాణాయామం
చేయడం, బెల్లం తినడం, నిమ్మకాయ షర్బత్తాగడం, పరగడపున 10 గ్రాముల చ్యవన్ప్రాశ్తీసుకోవడం మంచిదని
ఆయుష్ప్రొటోకాల్చెబుతోంది.
ఆయుష్వైద్యులు కూడా మృత్యుంజయ రస, సంజీవనీ వటి, తులసీ వంటి ఆయుర్వేద ఔషధాలను వాడటం
ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. కరోనా కల్లోలం సమసిపోయేదాకా.. 150 మిల్లీలీటర్ల
వేడినీటిలో అర చెంచా పసుపు వేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలని, నాసికా రంధ్రాలకు నువ్వుల నూనె లేదా
కొబ్బరి నూనెలేదా నేతిని పూయాలని సూచిస్తు న్నారు.
సాధారణ నియమాలు
ప్రతిరోజూ యోగాసనాలు వేయండి. ప్రాణాయామం చేయండి. కనీసం అరగంట పాటు ధ్యానం చేయండి.
హెర్బల్టీ తాగండి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసుకొని తయారుచేసిన హెర్బల్టీ మరింత
ఉపయుక్తం. రుచిని కోరుకునే వారు బెల్లం, నిమ్మరసం జత చేసుకోవచ్చు. రోజులో రెండుసార్లు ఇది తీసుకోవాలి.