You are on page 1of 2

చిత్తూ రు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూ రు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ

జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ(70) గురువారం రాత్రి

మరణించారు. గత నెల 10 వ తేదీన ఆమెకు కరోనా వైరస్‌సో కడంతో

సొ ంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేర్చి చికిత్స

అందిస్తు న్నారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి

ఈ నెల 3 వ తేదీ నుంచి విషమంగా మారడంతో వెంటిలేటర్‌మీద

ఉంచారు.చిత్తూ రు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951

సెప్టెంబరు 21 న జన్మించారు. బెంగళూరులో మెట్రిక్యులేషన్‌దాకా

చదివారు.విద్యార్థిగా వున్నప్పటినుంచే ఆమె పుట్ట పర్తి సాయిబాబాకు

భక్తు రాలు. చిత్తూ రు షుగర్‌ఫ్యాక్టరల


ీ ో అసిస్టెంట్‌ఇంజనీర్‌గా

పనిచేస్తు న్న డీకే ఆదికేశవులుతో దగ్గ రుండి ఆమె వివాహం

జరిపించారు. అప్పటివరకు సాధారణ ఉద్యోగి, వ్యాపారవేత్తగా ఉన్న

ఆదికేశవులు పెళ్లి తర్వాత పారిశ్రా మికవేత్తగా ఎదిగారు. కాంగ్రెస్‌లో

పేరున్న నాయకుడిగా ఎదిగిన ఆయన 2004 లో టీడీపీ తరపున

చిత్తూ రు ఎంపీగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండుసార్లు

పనిచేశారు.2009 లో ఆదికేశవులు అనారోగ్యంతో మరణించాక గృహిణిగా


ఉన్న సత్యప్రభ రాజకీయాల్లో కి వచ్చారు. 2014 లో టీడీపీ తరపున

చిత్తూ రు ఎమ్మెల్యేగా గెలిచారు. 

You might also like