Professional Documents
Culture Documents
వరలక్ష్మీ వ్రతకల్పము
వరలక్ష్మీ వ్రతకల్పము
పూజా సామగ్రి:
పసుపు, కుంకుమ, పండ్లు , పూలు, తమలపాకులు, అగరువత్తు లు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు,
తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి
వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్త యిదువలకు.
(వెండి/ఇత్త డి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి
దొ రకకపో తే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట
పూజావిధానం:
దీపము వెలిగించాలి.
ఆచమ్య:
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణ వే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః,
అనిరుద్ధా య నమః, పురుషో త్త మాయ నమః, అధో క్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః,
మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ
మహావిష్ణు రాజ్ఞ యా ప్రవర్త మానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే
ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య
ప్రదేశే...సమస దేవతా బ్రా హ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్త మాన వ్యావహారిక చాంద్రమానేన .......సంవత్సరే
విశిష్టా యాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి
వృద్ధ ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య
శుభఫలావాప్త ్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షో డశోపచార పూజాం
అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును
అథ ధ్యానమ్:
ఆవాహనం:
ఆసనమ్:
పాద్యమ్:
అర్ఘ్యమ్:
ఆచమనీయం:
పంచామృత స్నానం:
శుద్ధో దక స్నానం:
వస్త ం్ర :
వస్త య
్ర ుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
యజ్ఞో పవీతం:
తప్త హేమకృతం సూత్రం ముక్తా దామ విభూషితమ్!
గంధం:
అక్షతలు:
ఆభరణం:
పుష్పం:
అథాంగపూజా!
అని సంకల్పము చేసి అష్టో త్త ర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధా యై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టా యై నమః
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తా యై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం ఋద్ధ యే నమః
ఓం అనఘాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తా యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తా యై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రా యై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సణ
్త్రై సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం నవదుర్గా యై నమః
ఓం మహాకాళ్యై నమః
(దీపము చూపవలెను)
నైవేద్యం షడ్రసో పేతం దధిమద్వాజ్య సంయుతం!
తోరగ్రంథి పూజా!
వరలక్ష్మీ వ్రత కథ
సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షు లను జూచి యిట్ల నియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ
సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు,
యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొ నర్చిన సర్వ సౌభాగ్యంబులు,
పుత్ర పౌత్రా దులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ
మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రా ది సంపత్తు లు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును
శ్రా వణమాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి
యిట్ల నియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ
దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా
సవిస్త రముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్ట ణము గలదు. ఆ పట్ట ణము బంగారు
ప్రా కారముల తోడను, బంగారు గోడలు గల యిండ్ల తోనూ గూడియుండెను. అట్టి పట్ట ణము నందు చారుమతి
యనునొక బ్రా హ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్త ను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును
ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్త కు పూజచేసి పిదప అత్త మామలకు ననేక విధంబులైన
అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను
వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రా వణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి
శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి
స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్త యే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థ లాలయే!! అని అనేక విధంబుల స్తో త్రము చేసి ఓ జగజ్జ ననీ! నీ కటాక్షంబు
కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున
జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి
ననేక వరములిచ్చి యంతర్థా నంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం
జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో ! మనము కలగంటిమని స్వప్న వృత్తా ంతము భర్త కు మామగారికి మొదలయిన
వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్త మమయినదని శ్రా వణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం
చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రా వణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లు ండగా
వీరి భాగ్యోదయంబు వలన శ్రా వణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు
మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి
స్నానాదుల జేసి చిత్ర వస్త ం్ర బులను గట్టు కొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి
మంటపం బేర్పరచి యందొ క ఆసనంబువైచి దానిపై కొత్త బియ్యం బో సి మర్రి చిగుళ్ళు మొదలగు
పంచపల్ల వంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ
మిగుల భక్తియుక్తు లై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా
భవసర్వదా!!” అను శ్లో కముచే ధ్యానావాహనాది షో డశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల
తోరంబును దక్షిణహస్త మునకు గట్టు కొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము
జేసిరి. ఇట్లొ క ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లు ఘల్లు మను నొక శబ్ద ము కలిగెను. అంత
కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో !
వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్త ములందు
గృహంబులకు పో వుటకు వారి వారి యిండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లు ను నా స్త్రీలు
వరలక్ష్మీదేవిని పూజించి స్థ లమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు
కల్పోక్త పక
్ర ారముగా పూజచేయించిన బ్రా హ్మణోత్త ముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు
వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రా హ్మణోత్త మునిచే నాశీర్వాదంబు
నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని
యుండు వాహనములపై యిండ్ల కు బో వుచు ఒకరితో నొకరు ఓహో ! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు.
వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి
మహాభాగ్యం, సంపత్తు లు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొ గుడుచు తమ తమ యిండ్ల కు బో యిరి. పిదప
చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రా భివృద్ధి గలిగి,
ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్త మమైన
వ్రతమును బ్రా హ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొ నర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి
సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల
కార్యములు సిద్ధించును.
వాయన దానము:
--- శుభమ్ --