Professional Documents
Culture Documents
1. శ్రీమద్భగవద్గీత మొదటి భాగము (1 నుండి 6 అధ్యాయములు) అర్ధము - డా. శ్రీ కుప్పా విశ్వనాధ శర్మ గారు - సంకలనము - వేలూరి అన్నప్ప శాస్త్రి
1. శ్రీమద్భగవద్గీత మొదటి భాగము (1 నుండి 6 అధ్యాయములు) అర్ధము - డా. శ్రీ కుప్పా విశ్వనాధ శర్మ గారు - సంకలనము - వేలూరి అన్నప్ప శాస్త్రి
(ప్రధమ ఖండము)
సంకలనము
గురుదేవులకు వందనములతో
పరిచయము
ఓం నమో వేంకటేశాయ
పేజి సంఖ్య
ఉపోద్ఘాతము 1
1
పర్యాయములు ప్రస్తా వన ఉన్నది. వాటిలో ఒక్కొక్కప్పుడు దేవతలు
(ధర్మము) జయిస్తుంది. ఒక్కొక్కప్పుడు రాక్షసులు (అధర్మము)
జయిస్తుంది. ఆ సందర్భములలో ధర్మ సంస్థా పన కొరకు
భగవంతుడు దేవతలకు సహాయపడుతూ ఉంటాడు. అలాగే మన
జీవితములో మన మనస్సులో కూడా చిన్న లేక పెద్ద విషయములలో
ధర్మము, అధర్మము మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ
సందర్భములలో మనము ధర్మ నిర్ణయము చేసుకొని, కర్మలు చేస్తే
పుణ్య ఫలితములు, అధర్మ నిర్ణయము చేసుకొని కర్మలు చేస్తే పాప
ఫలితములు పొందుతూ ఉంటాము. ఆ కర్మ ఫలితములు
అనుభవించుటకు ఆ, ఆ విధమైన జన్మలు ఎత్తు తూ ఆ పుణ్య, పాప
ఫలితములు అనుభవిస్తా ము. ఆ విధముగానే మనము పుణ్య కర్మలు
చేయుటకు, పాప కర్మలు చేయకుండా ఉండుటకు మరియు
చివరకు మోక్షము కలిగి, భగవంతుడిలో ఐక్యము పొందుటకు,
భగవంతుడు (శ్రీకృష్ణుడు) మనకు శ్రీమద్భగవద్గీత రూపములో
ఉపదేశము చేసినాడు.
2
పొందవచ్చును. శ్రీమద్భగవద్గీతలో నిత్య జీవితములో ఎదురయ్యే
సమస్యలను పరిష్కరించే ఉపాయములు, సద్గుణములను
అలవరచుకునే ఉపాయములు మరియు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి
తోడ్పడే సాధనములను వివరముగా ఉపదేశము చేశాడు.
3
ముద్రించబడి ఉన్నవి. కాని ఈ విశ్లేషణలో బ్రహ్మ విద్య (ఆత్మ
జ్ఞానమును) ప్రత్యేకించి వివరిస్తూ, వాటికి సంబంధించిన
వేదములలోని, ఉపనిషత్తు లలోని, బ్రహ్మ సూత్రములలోని, యోగ
సూత్రములలోని పురాణములలోని, మహాభారతములోని, నీతి
సూక్తు ల వివరములు సమయస్పూర్తిగా చెప్పి, వాటి అర్ధము
కూడా వివరిస్తూ, భగవానుడు శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో
చెప్పదలచునుకున్న బ్రహ్మ విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ, వాటికి
సంబంధించిన ఉదాహరణలతో వివరించబడినది. ఇది ఈ విశ్లేషణ
యొక్క ప్రత్యేకత. ఈ విశ్లేషణ శాస్త్రీయ విధానములో
వ్రాయబడినది.
కురు క్షేత్రము
4
శ్రీ గురు ప్రార్థన
శ్రీనివాస ప్రార్ధనా
అధ సంకల్పః
5
శ్రీ గీత ప్రార్థనా
ధృతరాష్ట్ర ఉవాచ ।
సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥2॥
7
అప్పుడు మీ కుమారుడు, మహారాజు దుర్యోధనుడు,
గురువైన ద్రోణాచార్యులు దగ్గరకు వెళ్లి ఆయనతో
మాట్లా డుతున్నారు.
9
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ॥ 7 ॥
10
పైన చెప్పిన వారే కాకుండా, చాల మంది వీరులు, శూరులు
(దుశ్శాసనుడు, ఏకలవ్యుడు, శల్యుడు – పాండవులకు మేనమామ)
వీళ్ళందరూ నా కోసము వాళ్ళ జీవితములను వదులుకుందుకు
సిద్ధముగా ఉన్నారు.
11
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥11॥
12
దుర్యోధనుడికి సంతోషము కలిగించేలా, కురువృద్ధు డు,
మహా ప్రతాపవంతుడు అయిన భీష్మ పితామహుడు (అధర్మ
పక్షములో ఉన్న ధార్మికుడు),
13
మాధవః = మా = మహాలక్ష్మి + ధవః = పతిః = శ్రీ కృష్ణ
పరమాత్మ, అర్జు నుడు (యోగముతో పరమాత్మను తనలో
స్థా పించుకున్న శరీరము), దివ్యమైన తమ దివ్యమైన శంఖములను
(ఓంకారము) పూరించారు.
17
శంఖా నాదము, ఆ శంఖములకు పేర్లలో వ్యాస భగవానుడి
రహస్యము – శంఖ నాదము యోగాభ్యాసమునకు ప్రాధమిక
సూచన. శంఖమునకు, హృదయమునకు సంబంధము. అదే
మనస్సు, అందులోనే పరమాత్మ ఉన్నాడు.
18
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 17 ॥
పురుష సూక్తం
19
ద్రు పదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు (ఉప
పాండవులు),
20
అథ = మంగళము. ధృతరాష్ట్రు డి పుత్రు లందరూ నుంచుని
ఉన్నారు. వాళ్ళందరినీ, కపిధ్వజ = అర్జు నుడు (అర్జు నుడి రధముపై
ఉన్న జండాలో అర్జు నుడి బల పరాక్రములను అభివృద్ధి చేస్తూ, రక్షణ
కల్పిస్తూ ఆంజనేయస్వామి ప్రత్యక్షముగా ఉంటారు. అందుకు
అర్జు నుడికి కపిద్వజ అని పేరు వచ్చినది). ఇంక బాణములు వేసే
సమయములో, ధనుస్సును పైకి లేపి పట్టు కొని (సవ్యసాచి =
అర్జు నుడు రెండు చేతులతోనూ ధనుస్సును పట్టు కొని, రెండు
చేతులతోనూ బాణములు వేయగలడు), శ్రీ కృష్ణ పరమాత్మతో ఇలా
అన్నారు:
అర్జు న ఉవాచ ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థా పయ మేఽచ్యుత ॥ 21 ॥
21
ఎక్కడ నా రథము ఉంటే, నేను రెండు వాపులా పరిశీలించి
చూసి, వీరందరూ యుద్ధము చేయుటకు వచ్చి, చక్కగా నిలబడి
ఉన్నారు.
22
సంజయ ఉవాచ ।
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థా పయిత్వా రథోత్తమం ॥ 24 ॥
24
మామగారు, ఉపకారము చేసిన వాళ్ళు, కౌరవ సేనలలోనూ,
పాండవ సేనలలోనూ కనిపించారు.
అర్జు న ఉవాచ ।
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం ॥ 28 ॥
25
అర్జు నుడు ఇలా అంటున్నాడు I కృష్ణ = “కర్షణాత్ ఇతి
కృష్ణః” - కర్షణాత్ = మనలోని పాపములను, బాధలను ఆకర్షించి,
బయటకు పీకి, నాశనము చేసేవాడు. వీళ్ళందరూ నా వాళ్ళు కృష్ణా!
వీళ్ళు యుద్ధము చేయుటకు వచ్చారు. వీళ్ళను చూస్తే, నాకు ఏదో
అవుతోంది
28
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ 33 ॥
29
పోగొట్టు కొనుటకు సిద్ధముగా యుద్ధములో రెండు వైపులా ఉన్నారు.
ఇటువంటి యుద్ధము మనకు అవసరమా?
30
నిహత్య ధార్తరాష్ట్రా న్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ॥36॥
31
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రా న్స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ 37 ॥
32
ఉన్నవాడు) ద్రోహము చేస్తే వచ్చే పాపమును గురించి కూడా
ఆలోచించు కోవటంలేదే.
33
అప్పుడు ధర్మము క్రమముగా క్షీణించి పోతుంది. అప్పుడు
దాని స్థా నములో అధర్మము ఆక్రమించుకుంటుంది. అప్పుడు
మిగిలిన కాస్త ధర్మమును కూడా ఆవరిస్తుంది. అందుచేత ఈ
యుద్ధము మనకు వద్దు .
34
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥ 42 ॥
35
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రు మ ॥44॥
36
మన బంధువులను, మన ఆచార్యులను, మన మిత్రు లను
అంతా మనవారిని చంపుటకు మనము ఈ యుద్ధము చేయుటకు
సిద్ధముగా ఉన్నాము.
సంజయ ఉవాచ ।
ఏవముక్త్వార్జు నః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ 47 ॥
38
(ఉప + ని + షత్ – దగ్గరగా పరమాత్మ స్వరూపమును తెలిపే
జ్ఞానము - రహస్య విజ్ఞానము) తప్పకుండా ఉంటాయి. అంటే
1131 ఉపనిషత్తు లు ఉండాలి. కానీ మన పూర్వీకులు 108
ఉపనిషత్తు లు రక్షించి ఉంచారు. కాని 10 ముఖ్య ఉపనిషత్తు లు
(ఈశ, కేనో, కఠో, ప్రశ్న, ముండకో, మాండూక్యో, త్తైత్తరీయో,
ఐతరేయో, ఛాందోగ్యో, బృహదారణ్యకో). 1131 ఉపనిషత్తు లను ఈ
భగవద్గీతా గ్రంధములో చూసుకోవచ్చు. అలా కూర్చి ఉపదేశము
చేయుట పరమాత్మ మాత్రమే చేయగలడు. ఎన్నో యోగ శాస్త్ర
రహస్యములు, సిద్ధాంతములు (కర్మ, జ్ఞాన, సంఖ్య, యోగ,
ఆసనములు, ఆహార నియమములు, ఆచారములు, రహస్యమైన
విషయములు చెప్పబడినవి).
39
సిద్ధిస్తుంది. దాంతో సహా ప్రాపంచకమైన, లౌకిక ప్రయోజనములు
కూడా లభిస్తా యి.
మంగళా శ్లోకములు
అధ క్షమా ప్రార్ధనా
40
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం
దేవ నారాయణ నమోస్తు తే ll
అధ భగవత్ సమర్పణమ్
అధ లోకక్షేమ ప్రార్ధనా
అధ మంగళమ్
41
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే అర్జు న సాంఖ్యయోగోనామ ద్వితీయోధ్యాయః
ll
42
సంజయ ఉవాచ ।
తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణాకులేక్షణం ।
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ॥ 1 ॥
సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు.
అర్జు నుడు నా వాళ్లను సంహరించుట సరైన పద్ధతి కాదు (నా వాళ్ళ
మీద ప్రీతి) అనే దయతో, ఆవేశము (సరైన ఆలోచన ఉండదు)
వచ్చిన వాడిలా ఉన్నాడు. అర్జు నుడి కళ్ళు నీళ్ళతో నిండి ఉన్నాయి
(సరిగ్గా కనిపించదు). దృష్టి స్థిరముగా ఉండక కదిలిపోతోంది (దూర
దృష్టి ఉండదు).
శ్రీభగవానువాచ ।
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం ।
అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జు న ॥ 2 ॥
43
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l అర్జు నా
(పరిశుద్ధమైన తెల్లని స్వభావము కలవాడు) అకాలములో, ఈ విషమ
పరిషత్తు లలో, ఎందుకు ఈ కశ్మలం (కల్మషము, మాలిన్యము,
దోషము, కర్తవ్య విముఖత, మాయ) నిన్ను ఆవరించినది?
అర్జు న ఉవాచ ।
కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన॥4 ॥
అర్జు నుడు ఇలా అంటున్నాడు I ఓ మధుసూదనా l నాకు
పూజార్హులైన నా పితామహుడైన భీష్ముడిని, నా గురువైన
ద్రోణాచార్యలను నేను యుద్ధములో ఎలా సంహరించాలి?
45
హత్వార్థకామాంస్తు గురునిహై వ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధా న్ ॥
5॥
46
యానేవ హత్వా న జిజీవిషామః స్తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥
6॥
47
మను ధర్మ శాస్త్రము: “ధర్మ నిర్ణయ నిమిత్త మిష్యతే వేదవిత్
పరిష యేవదే మానవే” – ధర్మ నిర్ణయము చేయాలంటే, వేద,
శాస్త్రములు తెలుసున్న విద్వాంసుల దగ్గరకు వెళ్ళాలి.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం।
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం ॥
8॥
49
నాకు శోకము ఉన్నదని నేను, నీతో విన్నవించుకున్నాను. నా
శోకమును పోగొట్టు కొను ఉపాయమును నేను ఆలోచించ
లేకపోతున్నాను, నిర్ణయించ లేకపోతున్నాను. ఈ శోకము నా
ఇంద్రియములన్నింటినీ ఎండిపోయి, బాధకు గురిచేస్తు న్నది. దీనిని
భరించలేక పోతున్నాను.
సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప ।
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ॥ 9 ॥
సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు. తన
మనస్సులో ఉన్న భావములని ఉన్నట్లు చెప్పిన, హృషీకేశం
50
(మనస్సులో దాగి ఉన్న పరమాత్మునితో), గుడాకేశః (నిద్రాది –
తమో గుణము దోషములను కొంత జయించినవాడు, సత్త్వ
గుణములను కొంచెము పెంచుకున్నవాడు) పరంతప (తనలోని
శత్రు వులను కొంత నాశనము చేసుకున్నవాడు) అయిన అర్జు నుడు,
శ్రీభగవానువాచ ।
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ 11 ॥
51
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l (భగ =
సమగ్రస్య చ – సమస్తమైన 1. ఐశ్వర్యస్య – సామర్ధ్యము, 2.
ధర్మస్య, 3. యశసః - కీర్తి, 4. శ్రీయః – సంపద, మోక్షము, 5.
వైరాగ్యస్య, 6. జ్ఞానః).
52
కూర్మ పురాణము – “ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం
ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భ్హగవాన్ ఇతి” –
ఎవరికైతే సృష్టి (ఉత్పత్తి), ప్రళయము, జీవులు ఎక్కడి నుండి
వస్తు న్నారో మరియు ఎక్కడికి వెళ్ళుతున్నారో, జ్ఞానము మరియు
అజ్ఞానము గురించి తెలుసో వానిని భగవాన్ అంటారు.
53
విడిచిపెట్టిన తరువాత కూడా తప్పకుండా ఉంటాము. ఈ
శరీరమును ధరించక ముందు, ధరించినప్పుడు, విడిచిపెట్టిన
తరువాత కూడా ఉంటాము. మనము నిత్యము (పుట్టు క,
మరణము లేకపోవుట).
54
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ॥ 14 ॥
55
ద్వంద్వములను నిర్లక్ష్యము చేసుకొనుట) నేర్చుకో. ఇవి దేహ
ధర్మములు, అనిత్యమైన శరీరము నేను (ఆత్మ) కాదు అనే భావన
ఉంటే, అప్పుడు చలి/వేడి, సుఖము/దుఃఖము లేక
ప్రియము/అప్రియము అనేవి నిన్ను బాధ పెట్టదు. నాకు (ఆత్మ)
అనిత్యమైన వస్తు వులతో (శరీరము) సంబంధము లేదు అని
అనుకుంటే, ఆ వస్తు వులవలన వచ్చే ఏ శోకమూ నిన్ను చేరదు.
భారతా (నీ తండ్రి వైపు వారు చాలా గొప్ప వారు).
56
దుఃఖము = ఇష్ట పడని భావన. ప్రతికూలమైన దుఃఖము
మూడు విధములుగా ఉంటుంది. 1. ఆది ఆధ్యాతికము దుఃఖము
– మన శరీరములోని అవయవములు, ధాతువులు పనిచేయవలసిన
తీరులో పనిచెయ్యనప్పుడు, లేక మన మనస్సులో మనకు తెలియని
బాధ, పీడా, దుఃఖము. 2. ఆది భౌతికము దుఃఖము – మన
చుట్టూ ఉండే పంచ భూతముల వలన మనకు కలిగే దుఃఖము. 3.
ఆది దైవికము దుఃఖము – మనకు స్పష్టముగా తెలియని
కారణముతో (మన వశములో లేని, దైవము కలిగించినవి
అనుకుందాము) కలిగే దుఃఖము.
58
చేయలేదు. ఆత్మ స్వరూపము అవ్యయము (క్షయము లేనిది),
వినాశనము లేని, శాశ్వతమైనది.
59
తెలియట లేదు. వీటి మధ్య ఉన్న బేధము తత్త్వ జ్ఞానులు కూడా
చెప్పుతున్నారు.
60
యుద్ధములో ఎవడైతే వీడు చంపేవాడు, సంహరించేవాడు,
కొట్టేవాడు అంటున్నాడో, ఈ ఆత్మ స్వరూపము నన్ను
సంహరిస్తు న్నది, చంపుతున్నది, కొట్టు చున్నది అని
అనుకుంటున్నారో
61
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే
॥ 20 ॥
63
సామాన్యముగా జనులు కట్టు కున్న బట్టలు చిరిగిపోతే, దాని
విడిచి కొత్త బట్టలు కట్టు కుంటారు (కొత్త బట్టలు కట్టు కున్నవాడు,
పాత బట్టలు కట్టు కున్న వాడు కంటె వేరుకాదు కదా),
65
అవయవములు ఉండవు. వస్తు వు కాదు. ఈ నాలుగు భూతములు
– పరస్పరము విరోధము ఉన్నా – ఆత్మ స్వరూపమును మీద తమ
స్వభావమును చూపించ లేవు).
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయం అక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థా ణుః అచలోఽయం సనాతనః ॥ 24 ॥
అవ్యక్తోఽయమచింత్యోఽయం అవికార్యోఽయముచ్యతే
।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥25॥
66
ఆత్మ స్వరూపము అవ్యక్తము (ఏ జ్ఞానేంద్రియములతోనూ
తెలుసుకోలేము). ఆత్మ స్వరూపమును ఊహించలేము,
ఆలోచించలేము. ఆత్మ స్వరూపము ఏ రకమైన వికారములను
(మార్పులు) పొందదు. ఈ విషయమును సమస్త వేదములు,
శాస్త్రములు, అనుభవజ్ఞులు చెప్పుతున్నాయి.
అందువలన, ఆత్మ స్వరూపమును ఈ విధముగా
తెలుసుకుంటే ఏ విధమైన మోహము, శోకము రాదు. ఈ
విషయమును తెలుసుకొని, నీ మోహము వలన కలిగిన శోకమును
విడిచిపెట్టి, యుద్ధము చేయను అనే సంకల్పమును విడిచిపెట్టు . నీ
కర్తవ్యమును నీవు నిర్వహించు. నీ అజ్ఞానముతో కలిగిన
మోహమును తొలగించుకునే మార్గము ఇదే.
68
మన ఇంద్రియ జ్ఞానానికి మించినది. మన ఇంద్రియ జ్ఞానమునకు
మించిన దానిని, మన ఊహాగానములతో వాదించ కూడదు. ఆ
జ్ఞానము మన ఋషులు వారి తపస్సు యొక్క శక్తితో, దివ్య దృష్టితో
దర్శించి, వాటిని మన వేద సాహిత్యంలో నమోదు చేశారు. అవే
మనకు ఆధారము.
69
భారత వంశములో పుట్టిన వాడా l (భరత వంశములో
జన్మించిన వాడా) ఈ శరీరములు (జన్మ) ఎక్కడి నుండి, ఎలా
వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. మధ్యలో కొంత సేపు బాగా
కనిపిస్తు న్నవి.
70
చెప్పినా, ఎంత విన్నా ఈ విషయము అర్ధము అగుటలేదు. కేవలము
వినికిడి ద్వారా ఈ ఆత్మ స్వరూపమును తెలుసుకోలేరు.
ఉదాహరణ:
71
ఛాందోగ్యోపనిషత్ – 6-11-3 – “జీవాపేతం వావ కిల ఇదం
మ్రియతే న జీవో మ్రియతే ....” జీవుడు ఈ శరీరము నుండి
వెళ్ళిపోతే, శరీరమునకు మరణము. జీవుడికి మరణము లేదు.
72
ఓ పార్థా l నీవు ప్రయత్నము చేయకుండానే, నీకు స్వర్గ
ద్వారములు తెరుచుకున్నాయి. నీవు స్వర్గ ద్వారము దగ్గరకు వెళ్లి
ఉన్నావు.
73
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయాం ।
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ॥ 34 ॥
74
మహారథులు, మహావీరులు), ఇంతమంది సేనలను చూసి,
అర్జు నుడికి భయము వేసింది. ఆ భయముతో యుద్ధము
చేయకుండా ఆగిపోయాడు – అని అనుకుంటారు.
75
నేను నిన్ను నీ స్వధర్మము (యుద్ధము) చేయమంటున్నాను.
అందులో నీవు మరణిస్తే, నీకు వీర స్వర్గము లభిస్తుంది. నీవు
జయిస్తే, నీవు ధర్మమును స్థా పించావని పేరు కలిగి, రాజ్య భోగములు
అనుభవిస్తా వు.
77
పాపములన్నీ, బంధములన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆత్మ
తత్త్వము పూర్తిగా అర్థమవుతుంది.
78
అయిపోయినది. దీనిలోనే ఉండాలని అనుకుంటాము. దీనినుండి
బయట పడాలని ప్రయత్నమే చేయము.
80
వాళ్లచేత సత్కర్మలు చేయించి, వాళ్లకు పరమాత్మ తత్త్వము, ఆత్మ
జ్ఞానము పూర్తిగా అర్ధము చేసుకునే స్థితికి పరిశుద్దము చేయుటకు
– కర్మ కాండ).
82
కొద్దిగా శ్రేయో మార్గము వైపు మరలించినట్లయితే శ్రేయో మార్గమే
సముచితమైన మార్గము అనే స్థిరమైన విశ్వాసము, నిర్ణయము
మరియు నిశ్చయము కలుగుతుంది. కోరికలతో నిండిపోయిన
బుద్ధిలోకి నిశ్చయాత్మకమైన బుద్ధి రాదు.
83
అదే విధముగా ద్వంద్వములు (సుఖ/దుఃఖములు కాని,
లాభ/నష్టములు కాని, జయ/అపజయములు కాని, చలి/వేడి కాని)
దేనినీ లెక్క చేయక, సమతా బుద్ధితో సహిస్తూ ఉండు. అప్పుడు ఈ
గుణముల ప్రభావము తగ్గుతుంది. నిరంతరమూ ధైర్యముగా,
సాత్వికమైన జ్ఞాన మార్గములో ప్రయాణించు. ఎత్తి పరిస్థితుల్లోనూ
యోగము (లేని దానిని పొందుటకు ప్రక్రియ, కొత్తది పొందుట)
కోసము ఆశ పడవద్దు . నిరంతరము ఏదో వస్తు వును కోరుకొని, అది
లభించిన తరువాత దానిని రక్షించుకునే ప్రయత్నమునకు (క్షేమము)
దూరముగా ఉండు. నిరంతరమూ అప్రమత్తతతో, జాగ్రత్తతో
పరమాత్మ ధ్యానమును చేస్తూ ఉండు. (అంతా పరమాత్మ మీద
భారము వేయి. నీ యోగ, క్షేమములు పరమాత్మే చూసుకుంటాడు).
84
అలాగే వేదములలో అన్ని చిన్న. చిన్న కోరికలు తీర్చే చిన్న,
చిన్న ఉపాయములు ఉన్నాయి. ఆ, ఆ కోరికలు కోసము సత్కర్మ
ఆచరణ (3-16 శ్లోకము చూడుము) చేస్తే, ఆ ప్రయోజనము
మాత్రమే సిద్ధిస్తుంది. మరొక సత్కర్మ ఆచరణ చేస్తే, మరొక
ప్రయోజనము మాత్రమే సిద్ధిస్తుంది. అన్ని ప్రయోజనములు కంటె
గొప్పదైన ప్రయోజనము ఎల్లప్పుడూ, అనంతముగా సిద్ధించాలంటే,
బ్రహ్మ జ్ఞానమును సంపాదించుకోవాలి. వేరే దృష్టి లేకుండా, ఆ బ్రహ్మ
జ్ఞానము మీద దృష్టి ఉంచి, దానిని నిలబెట్టు కోవాలి. అప్పుడు ఈ
ప్రయోజనములు అన్నీ సిద్ధిస్తా యి.
85
అనుభవిస్తు న్న సుఖములు, ఆనందము, ఆత్మ జ్ఞానము వలన కలిగే
బ్రహ్మానందము యొక్క, తుంపరలు మాత్రమే.
86
నీకు కర్మ చేయుటకు మాత్రమే అధికారము ఉన్నది. ఆ కర్మ
ఫలితము మీద నీకు ఏ విధమైన అధికారమూ లేదు. ఆ కర్మకు నీవు
కారణమని నీవు ఎప్పుడూ అనుకోవద్దు . నీవు చేసే కర్మలతో నీవు ఏ
విధమైన సంగము, సంబంధము పెట్టు కోవద్దు . (నీవు చేసే కర్మలు
పరమాత్మ ఆరాధనగా, పరమాత్మ ప్రీతి కొరకు అనే భావనతో
చేయము).
87
ప్రవేశించుటకు అర్హత కలుగుతుంది. అది నిన్ను ముందుకు
తీసుకెళ్లు తుంది.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥49॥
ఓ ధనంజయా (అర్జు నా) l తత్త్వ జ్ఞానము యొక్క
సర్వోత్తమమైన ఫలితము (మోక్షము) కంటె, సత్కర్మ ఆచరణ వలన
కలిగే ఫలితము చాల దూరముగా (తక్కువగా) ఉంటుంది. బుద్ధి
యోగము (సమతా భావన, తత్త్వ జ్ఞానము) వలన మాత్రమే
మోక్షము పొందగలరు.
88
శ్రేయో (మోక్ష) మార్గములో ప్రయత్నము చేసే ప్రతి
సాధకుడు, సమత్వ బుద్ధితో (ద్వంద్వ ములపై సమతా భావనతో)
సత్కర్మలు చేసేవాడు క్రమముగా తన మనస్సును శుద్ధము
చేసుకొని, తత్త్వ జ్ఞానమును సంపాదించుకొని తన పుణ్య,
పాపములు (కర్మ బంధములు) అన్నింటినీ పోగొట్టు కోగలుగుతాడు.
90
ఫలము (అనంతమైన మోక్షము) పరమాత్మ ఇస్తా డు (తక్కువ శ్రమ,
ఎక్కువ ఫలితము). కర్మ బంధన పోయి, సంసార చక్రము నుండి
విముక్తి కలిగి, మోక్షము పొందుతాము (తాళము చెవిని తాళము
కప్పకు ఎడమ ప్రక్కకు త్రిప్పితే తాళము విడిపోతుంది).
92
తరువాత, నీకు నిర్వేదం (ఏ కోరికలకు లొంగని వైరాగ్యము)
సిద్ధించినప్పుడు, నీవు వినవలసిన అంశములు ఏమీ ఉండవు. విన్న
అంశములకు పెద్దగా ఇప్పుడు విలువ ఉండదు. (నీకు వైరాగ్యము
సిద్ధించకపోతే నీవు ఆ విషయములను వింటూ ఉండవలసినదే).
93
ఉంటుంది. నీ మనస్సు నిశ్చలముగానూ, నిశ్చయముగానూ ఉంటే,
నీ బుద్ధి యోగమును పొందుతుంది. పరిశుద్ధమైన, నిశ్చలమైన
మనస్సులో, అచలమైన బుద్ధిలో, సమాధిలో పరమాత్మ భాసిస్తుంటే
నీకు బుద్ధి యోగము పరిపూర్ణముగా సిద్ధించినట్లు .
అర్జు న ఉవాచ ।
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ॥54॥
94
విధముగా బోధిస్తు న్నాయి? ఏ విధముగా ఉండాలి? ఇటువంటి
వారిని ఎలా గుర్తించాలి?
శ్రీభగవానువాచ ।
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥ 55 ॥
95
మనమందరమూ (ప్రతి జీవి) దేనిని నిరంతరమూ
కోరుకుంటున్నామో అదే ఆనందము. ఆనందము అంటే -
అనుకూలమైన భావన, నిష్కారణమైనది, అనుకూల భావన దేనితో
సమాప్తము అవుతుందో అది ఆనందము – జీవుడు లేక ఆత్మ
శాశ్వత ఆనందము స్వరూపము. ప్రపంచములో ఉన్న వస్తు వులన్నీ
ఆనందము కోసము. ఆనందము మాత్రము వస్తు వు కాదు. మనకు
ప్రేమ మనమీదే ఉంది. కారణము లేని ప్రేమ ఇతర ప్రాణులు,
వస్తు వులు మీద లేదు. మనకు అనుకూలమైన ప్రాణి లేక వస్తు వు
అయితే వాటి మీద ప్రేమ. క్రమక్రమముగా కోరికలు తగ్గించుకుంటే,
ఏ కోరికా లేని స్థితి ఏర్పడినప్పుడు హృదయములో ఉన్న శాశ్వతమైన
బ్రహ్మానందము అనుభవములోనికి వస్తుంది. మనము మన
ఇంద్రియముల ద్వారా ప్రపంచములోని జీవులు మరియు
వస్తు వులను అనుభవించి ఆనందిస్తు న్నాము. మన ఇంద్రియములు
పరాన్ముఖులై (బయట ప్రపంచము వైపు) ఉన్నాయి. మన మనస్సులో
గూడుకట్టు కున్న కోరికలన్నీ సమూలముగా, పూర్తిగా పోగొట్టు కొని,
మన ఇంద్రియములను అంతర్ముఖము (లోపల హృదయము
లోనికి) త్రిప్పుకొని హృదయములో ఉన్న పరమాత్మను
(హృషీకేశుడిని) దర్శించ కలిగితే ఆ బ్రహ్మానందము
అనుభవములోనికి వస్తుంది.
96
తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి - 2-8-1 నుండి 4 వరకు –
“స ఏకో మానుష ఆనన్డః I శ్రోత్రయస్య చకామహతస్య II తేయే
శతం మానుషా ఆనన్దాః...........తే యే శతం ప్రజాపతే రానన్దాః I స
ఏకో బ్రాహ్మణ ఆనందః” – మానవుల ఆనందము కంటె నూరు
రెట్లు మనుష్య గంధర్వ ఆనందము. మనుష్య గంధర్వ ఆనందము
కంటె నూరు రెట్లు దేవ గంధర్వ ఆనందము. దేవ గంధర్వ
ఆనందము కంటె నూరు రెట్లు పితృ దేవతల ఆనందము. పితృ
దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అజానజ దేవతల
ఆనందము. అజానజ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు కర్మ
దేవతల (పుణ్య కర్మలు చేసి వాటి ఫలితముగా దేవతలు అయిన
వాళ్ళు) ఆనందము. కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
దేవతల ఆనందము. దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
ఇంద్రు డి ఆనందము. ఇంద్రు డి ఆనందము కంటె నూరు రెట్లు
బృహస్పతి ఆనందము. బృహస్పతి ఆనందము కంటె నూరు రెట్లు
ప్రజాపతి ఆనందము. ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు
బ్రహ్మానందము. ఆ బ్రహ్మము మానవుల హృదయములో ఉన్నది.
97
కంటె, ధనము కంటె ఆత్మే ప్రియమైనది. శ్రేష్టమైన పదార్ధముల కంటె
ప్రియమైనది.
98
తెలుసుకొనుచున్నాడు. బ్రాహ్మణులు ఓం కారమును వేదమని
తెలుసుకొనిరి.
99
ఏ విషయము, వస్తు వు మీద అధికమైన ప్రేమ, ఆశ,
అనురాగము ఉండరాదు. ఏ వస్తు వు మీద కోరిక ఉండదు (అనిత్య,
అల్ప సుఖముల మీద కోరిక ఉండరాదు).
100
శుభము కలిగినప్పుడు తనని తాను అభినందించుకొనుట
(సుఖముల మీద ఆశ తగ్గించుకొని), అశుభము, కష్టము
కలిగినప్పుడు ఇతరులను, పరిస్థితులను, దైవమును ద్వేషించి,
దూషించనివాడి (కష్టములను ఓర్చుకునే స్వభావము పెంచుకుంటే)
బుద్ధి పరమాత్మ తత్త్వము మీద స్థిరముగా ఉంటుంది. అతడే స్థిత
ప్రజ్ఞుడు.
101
అనే భయముతో) వాటి, వాటి స్థా నములలో వాటిని నిగ్రహించి ఉంచ
గలిగే వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠతముగా (బుద్ధి స్థిరముగా) ఉంటుంది.
102
మన లోపల బలంగా దాగి ఉన్న కోరిక (రసము, తీవ్రమైన
అభిలాష, రాగము, మోహము, వ్యామోహము, తృష్ణ స్పృహ) అలాగే
మిగిలిపోతోంది. ఆ రసము మనలో అలానే ఉంటే, అది తరువాత
మరింత ఉద్వేగముతో రెచ్చిపోతుంది. అప్పుడు సర్వ నాశనమునకు
దారి తీస్తుంది. ఆ రసము పోయేందుకు, ఇంద్రియ నిగ్రహము
ద్వారా, ఆ పరమాత్మను చూడగలిగితే, ఆ కోరిక (రసము) పూర్తిగా
పోతుంది. కోరికలు పోయిన తరువాత ఉండే ఇంద్రియ నిగ్రహము
స్థిరముగా ఉండి సర్వోత్కృష్టమైన ఫలము ఉంటుందని దృష్టిలో
పెట్టు కో (3 వ అధ్యాయము, 37 నుండి 43 వ శ్లోకము వరకూ, 4 వ
అధ్యాయము 21 వ శ్లోకము చూడుము).
103
హరించి బలవంతముగా మళ్ళీ బయటకు వచ్చి ప్రాపంచకమైన
విషయముల వైపు ప్రసరించే ప్రమాదము ఉన్నది. ఇంద్రియములు
మనస్సును బయటకు లాక్కుని పోతాయి. ఒక్కొక్కప్పుడు మనస్సు
ఇంద్రియములను బయటకు లాక్కుని పోతుంది.
104
వ్యక్తితో మనకు సంగము ఏర్పడి, ఆసక్తి పెరిగి, సంబంధము
ఏర్పడుతుంది.
105
యధోరగస్త్వచం జీర్ణం స వై పురుష ఉచ్యతే” – నా కోపము
(అహంకారము పూరిత కోపము) – వెయ్యికోట్ల వంతు క్షణములో
కోపము (మనస్సు సమతుల్యము కోల్పోవుట) పైకి లేస్తుంది. ఆ
క్షణములో మనము ఆ కోపమును ఓర్పుతో, ఓపికతో (పాము తన
పాడయిపోయిన చర్మము యొక్క పొరను జాగ్రత్తగా ఎలా
వదులుకుంటుందో అలా) ఆపుకోగలిగినవాడే, అదుపు
చేసుకున్నవాడే మనిషి.
రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ॥64॥
106
(పుణ్య కర్మలతో మనస్సుని, బుద్ధిని పవిత్రము చేసుకుంటే)
ఇంద్రియములను తన స్వాధీనములో ఉంచుకొని – మనస్సు
అదుపులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు మనస్సులో
ప్రసన్నత ఏర్పడి, బుద్ధి స్థిరముగా ఉంటుంది. అప్పుడు నీలూ
యోగ్యత పెరుగుతుంది.
108
ఈ భావన స్థిరము చేసుకోలేకపోతే, కష్టములు నిన్ను
వేధించటము మానవు. అప్పుడు నీ మనస్సుకు శాంతి కూడా
ఉండదు. మనస్సుకు శాంతి లేకపోతే, సుఖము ఉండదు. మనస్సు
ప్రశాంతత లేకపోతే, ఎంత ఆనందము కలిగినా దానిని
అనుభవించలేరు (నోట్లో ఉప్పు రాయి ఉంటే, పంచదార తిన్నా తీపి
తెలియదు. మన కంటె ఎదుటి వాడికి ధనము ఎక్కువ ఉంది అనే
బాధ (అశాంతి) ఉంటే, మన ధనమును మనము
అనుభవించలేము).
109
మనస్సు కూడా అనుసరిస్తే, సాధకుడి బుద్ధి స్థిరత్వము, సామర్థ్యము
కోల్పోయి, సాధకుడు తన లక్ష్యమును (పరమాత్మను)
చేరుకోలేకపోతాడు. ఆ పరిస్థితిని రానీయకుండా, ఇంద్రియములను,
మనస్సుని ప్రాపంచకమైన విషయముల వైపు పోకుండా
నిగ్రహించుకోవాలి.
110
అజ్ఞానము అన్న చీకటిలో ఉన్న సాధారణ ప్రజలకు
పరమాత్మ తత్త్వము అర్ధము కాక, నిశా (రాత్రిలా) అంధకారములో
ఏమీ కనిపించని, అర్ధము కాని పరిస్థితి. కాని ఇంద్రియములను,
మనస్సును సంయమము చేసుకున్న (నిగ్రహించుకొన్న) పరమాత్మ
తత్త్వము మీద దృష్టి ఉన్న స్థిత ప్రజ్ఞుడు రాత్రిని, పట్ట పగలుగా
భావిస్తా డు. రాత్రి చీకటిగా ఉన్నా (జ్ఞానము అనే వెలుగులో ఉన్న) స్థిత
ప్రజ్ఞుడికి పరమాత్మ తత్త్వము, స్వరూపము స్పష్టముగా
అర్థమవుతుంది, కనిపిస్తుంది.
112
ఎవరైతే జ్ఞానము అనే వెలుగులో, పరమాత్మను తమ
హృదయాంతరాళములలో దర్శించుకుంటూ ఉంటారో, పరమాత్మ
యొక్క ఆనంద స్వరూపమును ఎవరైతే అనుభవించగలుగుతారో,
వాళ్ళు ఎల్లవేళలా, అన్ని పరిస్థితుల్లోనూ స్థిరముగా ఉండగలరు.
113
ఉంటుందో చూసే ఒక అలవాటు ఉండేది. అలా ఆయన ఆ
పంచదార కాకరకాయకు ప్రాణము పోసి, ఏదో పని మీద ప్రక్కకు
వెళ్ళారు. ఆ పంచదార కాకరకాయ నడుచుకుంటూ బయటకు
వెళ్ళితే, అక్కడ కాకరపాదుకు చాలా కాకరకాయలు
వ్రేల్లా డుతున్నాయి. ఆ గురువుగారు వాటికి కూడా ప్రాణము
పోసినందున అవి ఈ పంచదార కాకరకాయతో – మనము చేదుగా
ఉంటాము అని చెప్పాయి. తరువాత ఈ పంచదార కాకరకాయ,
తిరిగి వచ్చి తన ప్లేటులో కూర్చొంది. అప్పుడు గురువుగారు ఆ
కాకరకాయను తీసుకొని నోట్లో పెట్టు కోబోతే, ఆ కాకరకాయ, నన్ను
తిన వద్దు . నేను చేదుగా ఉంటాను అని అంది. గురువుగారు నీవు
కాకరకాయ కాదు, నీవు అసలు పంచదార (ఆత్మ). నీ స్వభావము
తీపి. నీవు అజ్ఞానముతో ఈ కాకరకాయ రూపమును (శరీరము),
దాని స్వభావమును (నేను తెల్లగా, పొట్టిగా, లావుగా ఉంటాను) నీ
మీద ఆరోపించుకుంటున్నావు. అని చెప్పి దానిని జ్ఞానము అనే
నీటితో కడగగానే, దాని పైన ఉన్న ఆకుపచ్చ రంగు పోయి, ఆ
కాకరకాయకు జ్ఞానము కలిగి తన అసలు స్వభావమైన తెల్ల దనము,
తన తీపి దానికి తెలిసినది.
114
ఓ పార్థా (విశాలమైన భావనలు కలిగిన వాడా) l నేను
ఇంతవరకూ చెప్పిన స్థిత ప్రజ్ఞుడి లక్షణములను (ఏ రకమైన
ప్రాపంచకమైన కోరికలు లేకపోవుట, ఇంద్రియముల సంయమనము,
మనస్సును నిగ్రహించుకొని, పరమాత్మ మీద దృష్టి పెట్టు కొని,
పరమాత్మ జ్ఞానమును స్థిరముగా పొందుట) సాధించుకున్న ఉత్తమ
సాధకుడి స్థితి – బ్రాహ్మీ స్థితి – పరబ్రహ్మను అనుభవములోనికి
(బ్రహ్మ జ్ఞానము) తెచ్చుకున్న స్థితి స్థిరముగా ఉన్నవాడికి మోహము
(అజ్ఞానము – “నేను” - శరీరము, “నాది” - ప్రపంచము) ఉండదు.
మంగళా శ్లోకములు
115
యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l
అధ క్షమా ప్రార్ధనా
అధ భగవత్ సమర్పణమ్
అధ లోకక్షేమ ప్రార్ధనా
అధ మంగళమ్
116
కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l
117
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే అర్జు న కర్మయోగోనామ తృతీయోఽధ్యాయః
ll
అర్జు న ఉవాచ ।
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 1 ॥
అర్జు నుడు ఇలా అడిగాడు. నీవు చెప్పినట్లు జ్ఞాన మార్గము,
కర్మ మార్గము కంటె చాలా ఉత్తమమైనది అయినట్లయితే, ఓ
జనార్ధనా (జన్మకు కారణమైన అజ్ఞానమును పోగొట్టేవాడా).
118
కలగాపులగముగా ఉన్నవి. నీ వాక్యములు నా బుద్ధి కొంచెము
మొహమునకు గురి అయినట్లు గా ఉన్నది. నాకు భ్రమను
కలిగిస్తు న్నట్లు గా ఉన్నది.
శ్రీభగవానువాచ ।
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ॥ 3 ॥
120
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥ 4 ॥
121
ప్రతీ జీవి ప్రతి క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేదు.
ప్రతీ జీవీ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి.
122
తమో గుణము: ఆవరించి (మూసేసి), బద్ధకము కలిగించి,
నిద్ర పుచ్చుతుంది.
123
జ్ఞానేంద్రియములతో (1. కళ్ళు, 2, చెవులు, 3. నోరు -
నాలుక, 4. ముక్కు, 5. చర్మము) ద్వారా ప్రాపంచకమైన
124
(కర్తను నేను, ఫలితము నాకు రావాలి) లేకుండా చేస్తా డో,
అటువంటి వాడు విశేషమైన ఫలితములను పొందుతారు (సత్కర్మ
చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది).
125
యజ్ఞార్థా త్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ॥9॥
126
ఉదాహరణ: కౌశికి మహర్షి – కౌశికుడు (బ్రాహ్మణుడు)
వృద్ధు లైన తన తల్లిని, తండ్రిని విడిచి, అడవులలో తపస్సు చేస్తూ
ఉండగా, చెట్టు మీద కొంగ రెట్టవేస్తే, దానిని కోపముతో చూస్తే, అది
మాడి చనిపోయింది (ఆ తపస్సు చాలా కొంచము సిద్ధి కలిగించింది
– చిన్న ఫలితము కలిగిందని సంతోషించాడు). తరువాత భిక్షకు
వెళ్ళితే, ఒక గృహిణి (పతివ్రత), తన భర్తకు సేవ చేసిన తరువాత భిక్ష
వేస్తే, ఆవిడ మీద కోపముతో చూస్తే, నేను కొంగను కాదు నీ కోపమైన
చూపులకు మాడిపోవుటకు అని అంటుంది. ఆ విషయము
ఆవిడకు ఎలా తెలిసిందని అడగగా, ఆవిడ, ప్రక్క ఊళ్ళో ధర్మ
వ్యాధుడు దగ్గరకు వెళ్లి అడగమంది. ఆ కౌశికుడు, ఆ ధర్మ
వ్యాధుడు (బోయవాడు, మాంసము అమ్మే ఒక శూద్రు డు) దగ్గరకు
వెళ్లి అడగగా, అతను చాలా సేపు తరువాత కర్తవ్యము, స్వధర్మము,
పితృదేవతల సేవ, సత్కర్మ గురించి వివరముగా బోధిస్తా డు. అప్పుడు
కౌశికుడు కర్తవ్యము, స్వధర్మము, సత్కర్మ చక్కగా ఆచరించి, రాగ,
ద్వేషములు పోగొట్టు కొని, గొప్ప సిద్ధి కలిగి కౌశికి మహర్షి అయి, ఒక
గోత్రమునకు అధిపతి కూడా అయ్యారు (అత్యుత్తమమైన ఫలితము
లభించింది). ఇది అన్ని వర్గముల వారికీ, అన్ని వృత్తు ల వారికీ
వర్తిస్తుంది.
128
ఓం తచ్చం॒ యోరావృ॑ణీమహే । గా॒తుం య॒జ్ఞాయ॑ ।
గా॒తుం య॒జ్ఞప॑తయే । దైవీ᳚ స్వ॒స్తిర॑స్తు నః । స్వ॒స్తిర్మాను॑షేభ్యః ।
ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జం । శం నో॑ అస్తు ద్వి॒దే
ప ।
శం చతు॑ష్పదే । ఓం శాన్తి ః॒ శాన్తి ః॒ శాన్తి ః॑ ॥ - మనకు ఎవరు
మంగళకరమును అనుగ్రహిస్తా రో ఆయనను ప్రార్ధిద్దా ము.
యజ్ఞములు సవ్యముగా జరగాలని ప్రార్ధిద్దా ము. యజ్ఞములను
చేసేవారిని ప్రార్ధిద్దా ము. మనకు దేవతలు శుభము చేయుగాక.
మానవులందరికీ శుభము కలుగుగాక. చెట్లు , చేమలు ఉర్ధ్వముగా
పెరుగుగాక. మనతో నివసిస్తు న్న రెండు కాళ్ళు జీవులకు, నాలుగు
కాళ్ళు జీవులకు మంగళము జరుగుగాక. శాంతిః – ఆది
ఆధ్యాత్మికము దుఃఖము – శరీరములోపల రోగము లేక దెబ్బ వలన
కలిగే దుఃఖము నుండి శాంతించుగాక. శాంతిః – ఆది భౌతికము
దుఃఖము – ఇతరులు వలన మనకు కలిగే దుఃఖము నుండి
శాంతించుగాక. శాంతిః – ఆది దైవికము దుఃఖము – దైవ
విపత్తు లు భూ కంపము, అగ్ని ప్రమాదములు, భారీ వర్షములు,
వరదలు వలన కలిగే దుఃఖము నుండి శాంతించుగాక.
130
మానవులు, దేవతలు పరస్పరము (ఒకరికొకరు)
ఉపకారములు చేసుకోండి. యజ్ఞము (సత్కర్మ ఆచరణ) ద్వారా
మీరు అత్యుత్తమమైన సత్ఫలితములను, మరియు జ్ఞాన ప్రాప్తిని
కూడా పొందుతారు (యజ్ఞములు మానవుల తోబుట్టు వులు).
131
ఇష్టా న్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ॥ 12 ॥
మానవులు, యజ్ఞ కర్మలతో దేవతలకు భాగము ఇచ్చి వారిని
తృప్తిపరిస్తే, మీ సత్కర్మ ఆచరణతో దేవతలను సంతృప్తిపరిస్తే,
దేవతలు అవసరమైన సమయములలో, మానవులకు (దేవతలు
ప్రకృతిని అనుభవించుటకు అనుకూలముగా చేసి, మరియు
మానవుల శరీరమునకు, ఇంద్రియములకు శక్తి, బలము చేకూర్చి)
భోగములు ఇచ్చి, కోరికలను తీరుస్తా రు.
132
ఎవరైతే యజ్ఞములను చేసి, పుణ్య కర్మలతో దేవతలను
సంతృప్తి పరిచి, ఆ యజ్ఞములు చేసిన తరువాత మిగిలిన యజ్ఞ
శేషమును (దేవతలా ద్వారా లభించిన భోగములని భావించి)
దేవతల ప్రసాదముగా అనుభవిస్తా రో (అన్నములను భుజిస్తా రో,
ఇంద్రియములతో విషయములను గ్రహిస్తా రో), యజ్ఞ శేషమును
అమృతము అంటారు కాబట్టి, యజ్ఞ శేషమును అనుభవించే వారు,
అమృతమును త్రాగుతున్న దేవతల వంటి వారు. వాళ్లను
సత్పురుషులు (దేవతలు) అంటారు. ఏ పాపములు వాళ్ళ దగ్గరకు
చేరవు.
133
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ 14 ॥
ప్రాణుల యొక్క శరీరములు అన్నము వలన పుట్టి, అన్నము
వలన పెరుగుతాయి. మేఘముల నుండి పడే వర్షము వలన
ధాన్యము, అన్నము కలుగుతుంది.
134
కొత్త శరీరములు పుట్టి, ఆ అన్నముతోనే పెరుగుతాయి. ఇది
నిరంతరమూ ఆగకుండా జరిగే ప్రక్రియ.
135
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ॥ 15 ॥
136
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ 16 ॥
137
ఈశావాస్యోపనిషత్ – 2 – “కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే
చ్ఛతగ్ం సమాః l ఏవం త్వయి నా న్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే” –
శాస్త్ర సమ్మతమైన సత్కర్మలు మాత్రమే చేస్తూ మానవుడు వంద
సంవత్సరములు జీవించాలని కోరుకొనవలెను. జీవితము పైన
మమకారము ఉన్నంత వరకూ దుష్కర్మ మాలిన్యములను
పోగొట్టు కొనుటకు ఇది తప్ప వేరే మార్గము లేదు (జాన
మార్గమునకు అర్హత లేనివారు అందరూ, ముందు వారికి విధించిన
సత్కర్మ ఆచరణ (3-16 శ్లోకము చూడుము) చేస్తూ, అంతఃకరణ
శుద్ధి పొంది, జ్ఞాన మార్గములో ప్రవేశము కొరకు అర్హత
సంపాదించుకునే వరకూ కర్మ మార్గము పాటించ వలసినదే –
సత్కర్మ ఆచరణ చేసుకుంటేనే వారి జీవితమూ సార్ధకము
అవుతుంది. లేకపోతే, వారి జీవితము పాప పూరితమవుతుంది.
మానవులు అభివృద్ధిచెందుటకు వేదములలో, శాస్త్రములలో ఈ
రెండు మార్గములే చెప్పబడినవి. మూడవ మార్గము, దారి లేనే
లేదు).
ఉదాహరణ:
139
ఆయనకు చాలా కాలము వరకూ సంతానము కలగలేదు. తనకు
కలిగిన ప్రత్యవాయమును తొలగించుకొనుటకు పశ్చాత్తా పము
చేసుకున్న తరువాతే సంతానము కలిగినది.
140
కేవలమూ ఇంద్రియములను సంతృప్తి పరచుకుంటూ
జీవితమూ గడిపే, జీవితములో దిగజారిన మానవుడు, అతని కంటె
కొంచము పై స్థా యిలో, సత్కర్మలు చేసుకుంటూ జీవితమూ గడిపే
సాధారణ మానవుడు. వీళ్ళ కంటె భిన్నముగా మరొక
మహానుభావుడు – ఆత్మరతిః – తనలో తాను రమించువాడు (తన
ఆత్మలో ఉన్న పరమాత్మతో క్రీడించువాడు.
141
అక్కరలేదు, చేయవలసిన అవసరము లేదు. అటువంటి వారికి కర్మ
మార్గముతో సంబంధము లేదు.
143
సంగమముతో, ఫలాపేక్షతో, నేనే కర్తను అనే అహంభావముతో చేసే
కర్మలు) ఆ పాల జిగురు అంటుకుంటుంది.
147
విద్వాంసులకు ఆశ్వపతి మహారాజు దక్షిణలు ఇస్తే, వాళ్ళు దక్షిణలను
నిరాకరించారు. ఆశ్వపతి మహారాజు దక్షిణలను ఎందుకు
నిరాకరిస్తు న్నారు అని అడగగా, వాళ్ళు మాకు దక్షిణలు వద్దు . మాకు
తత్త్వ జ్ఞానము దక్షిణగా ఇవ్వండి అని అడిగారు. అందుకు ఆశ్వపతి
మహారాజు సంతోషించి, వాళ్లకు తత్త్వ జ్ఞానము ఉపదేశము చేశారు.
148
నాకు, ఈ లోకములో కాని, పై లోకములో కాని, ఆ పై
లోకములో కాని (మూడు లోకములలో), నేను ఏదో చేసి
సాధించుకోవలసినది ఏదీ లేదు.
149
“యచ్ఛాప్నోతి య దాదత్తే యచ్ఛాతి విషయా నిహ య
చ్ఛాస్య సంతతో భావ స్తస్మా దాత్మేతి కీర్త్యతే” – ఈ ప్రపంచము
అంతా వ్యాపించి ఉన్న స్వరూపమే ఆత్మ తత్త్వము (8 వ
అధ్యాయము, 22 వ శ్లోకము చూడుము)
150
ధర్మ సంకరమునకు (కలగలుపుకు) నేనే కారణము
అవ్వవలసి వస్తుంది. నేను సృష్టించుకున్న నా ప్రజలను (జీవులు నా
అంశములే), నేనే దెబ్బతీసినట్లు అవుతుంది. నేను సృష్టించుకున్న,
నా ప్రపంచమును, నేనే నాశనము చేసుకున్నట్లు అవుతుంది.
151
ఇలా చేస్తే సర్వోత్తమమైన ఫలితము లభిస్తుందని, సాధారణ
మానవులను ప్రోత్సహిస్తూ, వారికి సరైన దారి చూపించుటకు,
అందరినీ ఉద్దరించుటకు ఇలా చేస్తూ ఉండాలి.
152
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తా హమితి మన్యతే ॥ 27 ॥
153
ఆరోపిస్తూ, ఆ కర్మల ఫలితములు కూడా ఆత్మకు కట్టబెట్టి, ఆత్మకు
సంసార చక్రములో బంధనము మనమే కలిగిస్తు న్నాము.
155
వాళ్ళు తెలిసీ, తెలియని వాళ్ళు. అందుచేత వాళ్ళు తెలివి
తక్కువ వాళ్ళు. అలాంటి తెలివి తక్కువ వాళ్లను, అన్నీ తెలుసున్న
తత్త్వజ్ఞాని, తత్త్వ జ్ఞానము గురించి చెప్పుతూ వాళ్లను గందరగోళ
పరచకూడదు. (నీవు శాస్త్రముల ద్వారా నిర్ణీతమైన సత్కర్మ ఆచరణ
చేస్తూ, నీ అవసరమైన కోరికలను తీర్చుకుంటూ, అధర్మ ఆచరణ
చేయకుండా, కోరికలు తగ్గించుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళే మార్గము
ఇంకొకటి ఉన్నదని తెలుసుకో అని మాత్రమే చెప్పాలి).
156
(ఆవేశము, విచారము) లేకుండా, నీ కర్తవ్యమైన యుద్దమును నీవు
చేయము. నీవు నీ యుద్దమును మానవద్దు .
158
చేయలేని స్థితిలో, తమ జీవితమును వ్యర్ధము చేసుకొని, వాళ్ళు
చాల నష్టపోతున్నారు.
ఉదాహరణ:
159
శ్రీ కృష్ణుడు, ఉదంకుడితో ఏదైనా కష్టముగా ఉందా అని
అడిగితే, ఉదంకుడు ఇది ఎడారి ప్రదేశము, ఇక్కడ త్రాగటానికి
మంచి నీళ్ళు దొరకట లేదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు
నీళ్ళు కావాలనుకున్నప్పుడు, నన్ను తలచుకో. నేను నా అన్నగారితో
చెప్పి నీళ్ళు (ఆకాశ గంగను) పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
తరువాత కొన్నాళ్ళకు ఉదంకుడికి నీళ్ళు అవసరమై, శ్రీకృష్ణుడిని
తలచుకున్నాడు. అప్పుడు దేవేంద్రు డు, ఉదంకుడిని పరీక్షించుటకు,
ఒక నల్లటి శూద్రు డి రూపములో, వొళ్ళంతా చెమటతో, కుక్క తోలు
సంచిలా కనిపించే బంగారు పాత్రలో ఆకాశ గంగా జలము
తీసుకొచ్చి, ఉదంకుడికి ఇస్తే, ఉదంకుడు దానిని అసహ్యించుకొని
నిరాకరించాడు. తరువాత శ్రీకృష్ణుడు వచ్చి, నేను దేవేంద్రు డితో
పంపిన ఆకాశగంగ ఎలా ఉంది అని అడిగితే, ఉదంకుడు
తెల్లబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నా మీద నీకు కూడా
నమ్మకము లేకపోతే, నేను చెప్పినా వినకపోతే, నేను ఇచ్చినా
తీసుకోకపోతే అది నా తప్పు కాదు. నేను చెప్పినది అర్ధము
చేసుకోక, వినకుండా, చెప్పినది ఆచరించకపోతే, అది నా తప్పు
కాదు. నేను ఒక్కడినీ ఏమీ చెప్పినా, ఏమి చేసినా ఏమీ
ప్రయోజనము ఉండదు. నేను చెప్పిన దానిని ప్రజలు విని, అర్ధము
చేసుకొని, ఆచరిస్తేనే ఏమైనా అవుతుంది. లేకపోతే ప్రజలే
నష్టపడతారు, దానికి ప్రజలే బాధ్యులు.
160
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 33 ॥
161
జన్మాంతర (పూర్వ జన్మ) సంస్కారములను అనుసరించి ప్రతీ
ఇంద్రియమునకు దానికి సంబంధించిన పదార్ధము మీద రాగము
కాని, ద్వేషము కాని నియతముగా (ఎప్పుడూ) ఏర్పడతాయి. ఆ
రాగ ద్వేషముల వశములో, తమ, తమ ప్రవృత్తు లు కలిగి
ఉంటున్నారు.
162
స్వధర్మమును మరణము వరకూ చేయువలసినదే. అదే
శ్రేయస్కరము. నీది కాని పర ధర్మములు చాలా భయము
కలిగిస్తా యి (నరకము, చెడ్డ సంస్కారములు కలిగిస్తా యి, జ్ఞాన
మార్గము ప్రవేశమునకు అర్హత కోల్పోతారు).
అర్జు న ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః।
అనిచ్ఛన్నపి వార్ ష్ణేయ బలాదివ నియోజితః ॥ 36 ॥
ప్రతి మానవుడు సవ్యమైన మార్గములో నడవాలనే
అనుకుంటాడు. తను సర్వోత్తముడు అనికూడా అనుకుంటాడు.
కాని ఆ దారిలో నడవడు, నడవ లేడు కూడా. ధర్మ మార్గమును
విడిచిపెట్టి, పాప మార్గము మీద ఆసక్తిని బాగా పెంచుకుంటాడు.
మానవుల పాప మార్గములో నడిచే స్వభావము ఎక్కువై పోతున్నది.
163
శత్రు త్వము, పగ పెంచుకొనుట), శాస్త్ర ఉల్లంఘన (చేయవద్దనినవి
చేయుట, చేయమన్నవి చేయకుండుట).
శ్రీభగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణం ॥37॥
165
బృహదారణ్యకోపనిషత్ – 1 లేదా 3-5-3 –
“కామస్సంకల్పో విచికిత్సా శ్రద్దా అశ్రద్ధా థృతిరథృతిః హ్రీర్దీర్భీ రిత్యే
తత్సర్వం మన ఏవ తస్మాదపి పృష్టత ఉపస్పృష్టో మనసా విజానాతి
.......” – కామము, సంకల్పము, సంశయ జ్ఞానము (సందేహము),
ఆస్తిక్య బుద్ధి (పరమాత్మను నమ్ముట), అశ్రద్ధ, ధారణ (జ్ఞాపక శక్తి),
లజ్జ (సిగ్గు), ప్రజ్ఞ (తెలివి, సామర్థ్యము), భయము ఇవన్నీ మనస్సు
చేయుచున్నది.
166
cosmic intelligence) – సమిష్టి అహంకారము – చిత్తము
(స్మరణ లేక జ్ఞాపక శక్తి, బుద్ధి, మనస్సు, అహంకారము). మనస్సుతో
సహా కామము పుట్టినది.
167
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ॥ 39 ॥
ఉదాహరణ:
168
పాండవులకు పూర్వజుడు నహుస చక్రవర్తికి ఆరుగురు కుమారులు.
పెద్ద కుమారుడు యతికి రాజ్య కాంక్ష లేనందున, రెండవ
కుమారుడు యయాతి రాజు అయ్యాడు. యయాతికి ఇద్దరు
భార్యలు – దేవయాని (శుక్రా చార్యుని కుమార్తె) మరియు శర్మిష్ఠ
(రాక్షస రాజు రుషకేషుడు కుమార్తె). యయాతి ద్వారా
దేవయానికి ఇద్దరు కుమారులు యదు, తుర్వసు మరియు శర్మిష్టకి
ఇద్దరు కుమారులు ద్రు హ్యు, అను కలిగారు. యయాతి శర్మిష్ఠతో
సంతానము పొందాడని కోపముతో దేవయాని తండ్రి
శుక్రా చార్యుడు, యయాతికి ముసలితనము రావాలని శపించాడు.
యయాతికి భోగముల మీద కోరిక తీరక, భోగములు
అనుభవించుటకు యవ్వనము అవసరము అని ఆలోచించి, తన
కుమారులను, వారి యవ్వనము తనకు ధారపోయమని అడిగారు.
యదు (ఈ యదు వంశములోనే కృష్ణుడు జనించాడు), ద్రు హ్యు,
అను నిరాకరించారు. యయాతి వాళ్లను “మీరు ఎప్పటికీ మహారాజు
కాలేరు” అని శపించాడు. అందరి కంటె చిన్న కుమారుడైన పురు
అంగీకరించాడు.
169
పురుతో యయాతి ఇలా అన్నాడు – భాగవతము - 9-19-14 - “న
జాతు కామః కామానాముపభోగేన శామ్యతి I హబిశా కృష్ణవత్మేవ
భూయ యేవాభివర్ధతే” – ఇంద్రియ సంతృప్తి కోసము తృష్ణతో
(కోరికలతో) ఇంద్రియ వస్తు వులను ఆనందిస్తూ ఉంటే, ఆ కోరికలు
నెయ్యి పోసిన అగ్ని వలె బలపడి మరింత బలపడి పెరుగుతుందే,
కాని ఇంద్రియ తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. కోరికలను
తీర్చుకొనుట అసంభవము.
ఇంకొక ఉదాహరణ:
170
కర్మేంద్రియములు (5), జ్ఞానేంద్రియములు (5) ప్రవృత్తు లకు
మనస్సు కేంద్రము. మనస్సు ఇంద్రియ తృప్తికి సంబంధించిన
భావములకు నిలయము. తరువాత బుద్ధి కామ (కోరికలు)
సహితమైన ప్రవృత్తు లకు కేంద్రము.
171
వాతము, 2 పిత్తము, 3 శ్లేష్మము) కూడిన దేహమే ఆత్మ అని
భావిస్తూ, దేహమునకు సంబంధించిన వాళ్ళే తన బంధువులు
అనుకుంటూ, కేవలము వినోదము, వివిధ ప్రదేశములను చూచుటకే
తీర్థ యాత్రలు చేసే మానవుడిని గాడిదగా గాని, పశువుగా గాని
భావించవలెను.
174
కామ రూపమైన శత్రు వుని (సామాన్యమైన శత్రు వు కాదు)
జయించవలెను. శత్రు వులను జయించగల గొప్ప బాహువులు కల
అర్జు నా (మనకు – ఆత్మకు - శత్రు వైన కామమును కూడా అలా
జయించమని సంకేతము) I కామము అనే శత్రు వు ఎక్కడ ఉందో, ఏ
రకముగా మారుతుందో, ప్రవర్తిస్తోందో తెలియదు.
ఉదాహరణ
175
బిస్కటులు ఎగరవేశాడు. ఆ కుక్కలు వాటిని తినేసి మరలా తోకలు
ఊపుతున్నాయి. ఇలా చాలా సార్లు జరిగింది. దీనిని ఒక మంత్రిగారు
చూసి, రాజుగారితో అలా బిస్కటులు వేస్తుంటే కుక్కలు వెళ్లిపోవు,
కుక్కలకు ఆహారము పెట్టకుండా ఉంటే, వాటికి ఆకలి వేసి,
ఆహారము కోసము బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పాడు.
మంగళా శ్లోకములు
176
అధ క్షమా ప్రార్ధనా
అధ భగవత్ సమర్పణమ్
అధ లోకక్షేమ ప్రార్ధనా
అధ మంగళమ్
177
మానవుడు పుట్టిన క్షణము నుండి, మరణించే క్షణము
వరకూ పొందే జ్ఞానమును విద్య అంటారు. మానవుడు తన
జీవనముకు కావలసిన విద్యను సిద్ధము చేసుకునే జన్మ
పొందుతారు. శిశువుకు ప్రాధమిక జ్ఞానము తల్లి ఇస్తుంది. ఆ
విధముగానే మానవ జాతి యొక్క సృష్టికి ముందే మానవ జాతి
యొక్క జీవన విధానములకు, అభివృద్ధికి, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి
అవసరమయ్యే జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క వ్యవస్థ సిద్ధమై
ఉండాలి అని నిశ్చయించి, పరమాత్మ ముందు వేదములను
తయారు చేసి, తరువాతే మానవులను సృష్టి చేశాడు. మానవ జాతి
సృష్టి తరువాత, మానవ జాతిలో, కొంతమంది ప్రధానులను
ఎన్నుకొని, వారి, వారి యోగ్యతలను అనుసరించి, వారికి ఆ, యా
వేద భాగములను పరిచయము చేశాడు. మానవ జాతికి ప్రధమ
గురువు పరమాత్మ. మానవులలో ఉత్తమోత్తములకు నివృత్తి
మార్గమును (జ్ఞాన యోగము) ఉపదేశము చేశాడు. కొంత ఉత్తమ
మానవులకు ప్రవృత్తి మార్గమును (కర్మ యోగము) బోధించాడు.
మానవులు జీవన విధానములోని నియమములను పాటించుటకు,
మానవులు సన్ మార్గములో నడిపించుటకు యోగ్యులైన వారిని
మానవుల పాలకులుగా నియమించాడు. వారికి పాలనా
విధానములకు సంబంధించిన విద్యలను (వేద సారములు) వాళ్ళకు
ఉపదేశము చేసి, వాళ్ళ ద్వారా మానవులను సన్ మార్గములో
178
నడిపించే విధానము ఏర్పాటుచేశాడు. ఈ యోగము సమతా బావ
పూర్వకముగా కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. రాగ, ద్వేషములకు
అతీతముగా కర్తవ్యములు నిర్వహించాలి. ఏ రకమైన దోషములకు
(బుద్ధి దోషములు 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4.
లోభము, 5. దైన్యము, 6. దర్పము, 7. లజ్జ, 8. అభిమానము)
అవకాశము ఇవ్వకూడదు. మనస్సును నిరంతరమూ శుభ్రముగా
ఉంచుకుందుకు సత్కర్మ ఆచరణ చెయ్యాలి.
శ్రీభగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం।
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥1॥
179
సారముగా వచ్చినవి, మోక్షము కలిగించేవి, ఏ విధమైన నాశనము
లేనివి.
181
దీర్ఘ కాలములో, కాలక్రమేణా ఆ గొప్ప జ్ఞాన, కర్మ యోగము
(ఇంద్రియములను అదుపులో పెట్టు కొని, సుఖముల లాలస
లేకుండా, దోషములు లేకుండా చేయవలసిన యోగము)
శిథిలమైపోయింది. పరంతప = శత్రు వులను తపింపచేయువాడివి
(ఓడించగలవాడివి, కాల్చివేసేవాడివి) – మానవుల లోపల ఉండే
శత్రు వులను కాల్చివేసేవాడివి.
182
స్నేహితుడుకు మార్గము తెలియక సతమతమైనప్పుడు, ఆ
స్నేహితుడికి నిస్వార్దముతో సరైన సలహా ఇచ్చి, మంచి మార్గములో
పెట్టు వాడు. మానవులందరికీ పరమాత్మ, జగద్గురువు అయిన
శ్రీకృష్ణుడు అసలైన, ఉత్తమమైన స్నేహితుడు.
అర్జు న ఉవాచ ।
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ॥4॥
శ్రీభగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జు న ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ॥ 5 ॥
183
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు I ఇలాంటి
జన్మలు (అవతారములు) నేను ఎన్నో ధరించాను, తీసుకున్నాను.
నాకే కాదు, నీకు కూడా చాలా జన్మలు అయినాయి. అర్జు నా (తెల్లని
వాడు. తెల్ల మద్ది చెట్టు – పెద్ద చెట్టు గా ఏపుగా పెరిగినా, తత్త్వము
తెలియనివాడా – ఇది మనందరికీ వర్తిస్తా యి) I
184
కాని అవన్నీ నాకు (పరమాత్మకు) తెలుసు. పరమాత్మకు ఏ
విధమైన అజ్ఞానము, కర్మ సంబంధము లేదు కనుక పరమాత్మకు
జన్మ ఉండదు. అందుచేత పరమాత్మ యొక్క అవతారములు పుణ్య,
పాప కర్మల ఫలితముగా వచ్చిన కావు. ఈ ప్రపంచమును అధర్మము
నుండి రక్షించుటకు, ధర్మమును స్థా పించుటకు, పరమాత్మ
తనంతట తాను అవతారము (పై నుండి క్రిందకు దిగి వచ్చుట)
స్వీకరిస్తా డు. ప్రధానమైనవిగా పది (10) లేక ఇరవై ఒకటి (21) అని
అంటారు. కాని పరమాత్మ యొక్క అవతారములు అనంతము,
లెక్క ఎవ్వరికీ తెలియదు.
185
సత్ = ఉనికి, సత్యము, నిత్యము. ఋగ్వేదము – 1-164-
46 – “ఇంద్ర ॑ మిత్రా వర్ణమగ్నిమ ॑ హురతో దివ్య ः స్పార్పర్నో
గరుత్మాన్. ఏకం సద్విప్ర బహుధ వేదాంత్య िं అగ్ని యమ
మాతర్వనామహు ः ‘‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి.’’ -
అందరూ అతన్ని ఇంద్ర, మిత్రా (సూర్యుడు), వరుణ, అగ్ని అని
పిలుస్తా రు; మరియు అతను అందమైన రెక్కలు కలిగిన స్వర్గపు
గరుడ. సత్యం ఒక్కటే, కానీ విప్రులు, పండితులు (లేదా
నేర్చుకున్నవారు) దీనిని అనేక పేర్లతో పిలుస్తా రు లేదా అతన్ని అనేక
విధాలుగా వివరిస్తా రు; వారు అతన్ని అగ్ని, యమ, వాయువు అని
పిలుస్తా రు.
187
అన్ని విధముల రక్షణ కల్పించి కాపాడుటకు, అధర్మ మార్గములో,
దుర్మార్గములో సంచరించే వాళ్లను వినాశనమునకు
(దండించుటకు)
189
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః l10l
తపస్సు
190
ముండకోపనిషత్ 1-1-8 – “తపసా చీయతే బ్రహ్మ తతోన్న
మభిజాయతే” అక్షర బ్రహ్మము జ్ఞాన తపస్సుతో అభివృద్ధి
అగుచున్నది. 1-1-9 – “య స్సర్వజ్ఞః సర్వవిద్యస్త్య జ్ఞానమయం
తపః" – సామాన్య వృత్తిలో సర్వజ్ఞుడు, విశేష జ్ఞానముతో సర్వవేత్త.
అట్టి వానికి జ్ఞానమే తపస్సు.
191
ఎవరెవరు ఏ, ఏ విధముగా నన్ను ప్రార్ధిస్తా రో, ఆశ్రయిస్తా రో
ఆ, యా విధమునకు అనుగుణముగా వాళ్లను నేను
అనుగ్రహిస్తు న్నాను.
192
చేసినా, వాటికి ఫలితములు ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే తప్ప
మరొకరు కాదు.
193
మోక్షము అనేది ఒకటి ఉన్నది అని ఆలోచించే సమయము వాళ్లకు
లేనే లేదు. పరమాత్మ, వేదాంతము (ఆత్మ జ్ఞానము), ఉపాసన,
వైరాగ్యము, మోక్షము అనగానే ఇప్పుడే ఎందుకు, రిటై ర్ అయ్యాక,
ముసలితనము వచ్చాక అప్పుడు ఆలోచిద్దా ములే అంటారు. రిటై రు
అయి, ముసలివాడయ్యాక, అప్పటికే మూడు వంతుల పైన
జీవితము అయిపోయి, అంతవరకూ నిషిద్ధమైన కర్మలు,
అన్యాయములు, అక్రమములు చాలా చేసేసి నరక లోకములో, నీచ
జన్మలకు సీటు రిజర్వేషను చేసేసుకొని, అంతవరకూ
భోగములకు, సుఖములకు అలవాటై న శరీరముతో అప్పుడు
వేదాంతము నేర్చుకుని, అవలంబించేందుకు ఓపిక లేక కాలము
వృధా చేసుకుంటారు. అందుకు మానవులకు లౌకికమైన,
ప్రాపించక భోగములపైన, సుఖములపైన అంతులేని కోరికలు, వాటి
ఫలములపై ఉన్న ఆసక్తి మాత్రమే కారణము. భూలోకములో తప్ప,
పై లోకములలో యజ్ఞములు, సత్కర్మలు చేయుటకు అవకాశము
లేదనే చెప్పాలి.
194
వలన కలిగే ప్రభావము, ప్రయోజనములను, ఫలితములను
అనుసరించి, వాళ్ళు చేయగల కర్మలకు అనుగుణముగా నేను
మానవులను నాలుగు వర్ణముగా నా చేత సృష్టించబడ్డా రు.
195
శిష్యులకు ఉపదేశించుట మొదలైన కర్మలను నిర్దేశించి సృష్టి
చేశాను.
రజో గుణము
196
తమో గుణము
అజ్ఞానము, అహంకారము
197
(కోరిక, స్పృహ, ఇచ్చ, కాంక్ష) కలిగి, కోరికతో కర్మ ఏర్పడి, కోరికతో
చేసే ఆ కర్మకు కర్తృత్వ భావము (కర్త) ఏర్పడి, ఆ కర్తృత్వ భావనతో
చేసిన కర్మ యొక్క ఫలితము తీసుకోవలసి ఉంటుంది. ఏ పని ఎవరు
చేస్తే, ఆ పని యొక్క ఫలితము వాళ్లకు దక్కుతుంది. అహంకారము
(నేను అనే భావన) ఆత్మ మరియు శరీరము యొక్క
సంపర్కముతో, తాదాత్మ్యముతో ఏర్పడుచున్నది.
198
కర్మలకు కర్తృత్వ భావన, కర్తృత్వ భావన వలన కర్మ ఫలములు, కర్మ
ఫలముల వలన జన్మ, మరణ చక్రము (సంసారము) ఏర్పడి,
మానవుడు ఈ చక్ర భ్రమణములో తిరుగుతూనే ఉన్నాడు.
199
కళ్ళులా వెలుగు ఇస్తు న్నాడు. కాని ప్రపంచములో జరిగే ఏ క్రియలకు,
సూర్యుడికి ఏ విధమైన సంబంధము లేదు, బాధ్యతా లేదు.
సూర్యుడు ప్రపంచములో జరిగే క్రియలకు సాక్షి మాత్రమే.
ప్రపంచమంతా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మకు,
ప్రపంచములో జరిగే క్రియలకు కర్తృత్వము ఉండదు. కర్తృత్వము
లేనందున ఆ క్రియతో ఫలముతో పరమాత్మకు ఏ సంబంధము
లేదు.
201
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం ॥ 15 ॥
ఉదాహరణ
202
వహించిన తరువాత, దుర్మార్గులైన రాజులపై దండ యాత్ర చేసి, వాళ్ళ
దగ్గర నుండి కప్పములు తెచ్చి, ఆ ధనముతో విశ్వజిత్ అనే మహా
యాగము చేశాడు. ఆ యాగములో రాజ్య రక్షణకు అవసరమయ్యే
ధనము తప్ప, తనకు ఒక్క భోజనమునకు కావలసిన ధనము తప్ప,
తన దగ్గర ఉన్న మిగిలిన ధనమును అంతా దక్షిణగా ఇచ్చెయ్యాలి.
రఘు మహారాజు అలానే ఆయన సంపదలన్నీ దక్షిణగా ఇచ్చేశాడు.
తను మట్టి పాత్రలలో ఆహారమును వండుకుంటూ, రాజ్య పాలన
చేస్తు న్నాడు.
203
వెళ్ళకూడదు. నీకు ఏమి కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు
కౌస్తు డు తన వృత్తాంతము చెప్పాడు.
204
రఘు మహారాజు ఒప్పుకోలేదు. కౌస్తు డుతో నేను ఏదో చేసి
నీ పని చూస్తా ను. నీవు ఉండు అన్నాడు. తరువాత రఘు మహారాజు
ఆలోచనలో పడ్డా డు. ఖజానాలో మిగిలి ఉన్న ధనము రాజ్య
పాలనకు మాత్రమే ఉపయోగించాలి. ఇంకొక పనికి ఉపయోగించ
కూడదు. అధర్మముగా పరిపాలిస్తు న్న రాజులను ఇదివరకే
దండించేశాడు. అలాంటివారు ఇంక ఎవ్వరూ లేరు. ధర్మముగా
పాలించే రాజులపైన దండెత్తకూడదు. ఏమి చెయ్యాలి అని
ఆలోచించి, ఆలోచించి ధనాధిపతి కుబేరుడి మీదకు దండెత్తితే తగిన
ధనము వస్తుంది అని నిర్ణయించి, తన నిర్ణయమును ప్రకటించాడు.
మర్నాడు ఉదయమునే కుబేరుడి మీదకు యుద్ధమునకు
బయలుదేరుటకు, నియమము ప్రకారము, ఆ రాత్రి రధములోనే
నిద్రపోయాడు. ఈ విషయము తెలిసిన కుబేరుడు, రఘు
మహారాజు యొక్క ప్రతాపము (తన పూర్వజుడు అయిన సగర
మహారాజు అశ్వమేధ యాగము గుర్రమును అపహరించి, సముద్ర
గర్భములో కపిల మహర్షి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న
చెట్టు కు కట్టిన ఇంద్రు డినే భయపెట్టిన వాడు) కూడా తెలుసును
కాబట్టి, కుబేరుడు భయపడి ఆ రాత్రే రఘు మహారాజు ఖజానా
అంతా పూర్తిగా నింపేశాడు. రఘు మహారాజు మర్నాడు ఉదయమే
లేచి, కుబేరుడితో యుద్ధమునకు బయలుదేరుటకు సిద్ధము
అవుతుండగా, ఖజానా అధికారులు రాజు గారి దగ్గరకు వచ్చి,
205
ఖజానా అంతా నిండిపోయింది అని చెప్పారు. కుబేరుడు భయపడి
ఖజానా నింపేశాడని తెలుసుకొని, యుద్దము విరమించి, ఆ
కౌస్తు డుని పిలిపించి, కుబేరుడు నింపిన ధనము అంతా, నేను నీ
కోసము సంపాదించాను. కాబట్టి నీవు (కౌస్తు డుని) ఆ ధనమంతా
తీసుకొని వెళ్ళమన్నాడు. కౌస్తు డు నేను గురు దక్షిణ ఇవ్వటానికి
నాకు కావలసినది, నిన్ను అడిగినది 14 కోట్ల బంగారు నాణెములు
మాత్రమే. అంతకంటే ఎక్కువ నేను తీసుకోను. నాకు ఇంత ధనము
వద్దు , నేను ఇంత ధనము తీసుకు వెళ్ళను అంటాడు. రఘు
మహారాజు ఈ ధనమంతా నేను నీ కోసమే సంపాదించాను. కాబట్టి
ఆ ధనమంతా నువ్వు తీసుకెళ్లా లి అంటాడు. ఇంకా ఆ వివాదము
జరుగుతూనే ఉన్నది. కోట్ల సంవత్సరములు అయినా వాళ్ళ మధ్య
ఈ వివాదము ఇంతవరకూ తేలలేదుట.
206
మేధావులకు, పండితులకు, కవులకు, మహానుభావులకు ఏది కర్మ,
ఏది క్రియ, ఏది అకర్మ గురించి స్పష్టతే లేక సందేహములతో మొహ
పడుతున్నారు.
ఉదాహరణ
207
ఏ కర్మ చేస్తు న్నా, ఆ కర్మ (చేయవలసిన కర్మ) గురించి
పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఆ కర్మకి విరుద్ధమైన కర్మల
(వికర్మ, చేయ కూడని కర్మ) గురించి కూడా పూర్తిగా అవగాహన
ఉండాలి.
ఉదాహరణ
208
చేయనివాడు - అకర్మ) రాజుగారు మర్చిపోయే రకము. ఆయన
మనలను అడగడు, అని ఆలోచించి ఎండిపోయిన ఆకులతో సంచి
నింపేశాడు. వాళ్ళు రాజ్యములోకి రాగానే రాజుగారి ఆజ్ఞ ప్రకారము,
రాజ భటులు ఆ ముగ్గురు మంత్రు లను బంధించి, వాళ్లను వాళ్ళు
తెచ్చిన సంచులతో, వేర్వేరుగా కారాగారములలో బంధించి, ఏ
ఆహారమూ ఇవ్వకుండా, వాళ్ళు తెచ్చుకున్న పళ్ళను తినమని
చెప్పారు. కర్మ సరిగ్గా చేసిన మొదటి మంత్రి, తాను తెచ్చిన మంచి
పళ్ళను తిని చక్కగా ఉన్నాడు. అడ్డదిడ్డముగా పని చేసేవాడు –
వికర్మ చేసిన రెండవ మంత్రి, తను తెచ్చిన కొన్ని మంచి, కొన్ని కుళ్లిన,
కొన్ని పచ్చిగా ఉన్న పళ్ళను తిని, కొంత సేపు చక్కగా ఉండి, కొంత
సేపు బాధ పడ్డా డు. ఇంక అసలు పని చేయనివాడు – అకర్మ చేసే
మూడవ మంత్రి, తను తెచ్చిన ఎండిన ఆకులను తినలేక పస్తు ఉండి
ఆకలితో చాలా బాధ పడ్డా డు.
209
ఎక్కడైనా ఏ కర్మ జరుగుటలేదు అని అనిపించినా, అక్కడ కర్మ
జరుగుతున్నది అని తెలుసుకుంటాడు.
ఉదాహరణ
210
ఒక రాజు కుమారుడు, గురువుగారి ఆశ్రమములో విద్య
నేర్చుకుంటున్నాడు. గురువు గారు, ఆ రాజ కుమారుడికి కర్మ
గురించి చెప్పుతూ – “కర్మ అనేది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి
నుండి వచ్చిన శరీరమునకు మాత్రమే పరిమితము. ఆత్మ
స్వరూపమునకు ఆ కర్మతో ఏ సంబంధము లేదు. కాని ప్రతీ వ్యక్తీ,
తనలో తాను నేను (ఆత్మ) కర్మ చేస్తు న్నాను అని అనుకుంటాడు. ఏ
కర్మా చేయకున్నా, మన అజ్ఞానముతో, ఆ కర్మలను ఆత్మకు
ఆరోపిస్తు న్నాము” అని గురువుగారు ఆ రాజ కుమారుడికి
చెప్పారు. ఆ రాజ కుమారుడు తనకు ఏ మాత్రమూ అర్ధము కాలదు
అని చెప్పి, దిక్కులు చూస్తు న్నాడు.
212
మానవులు అజ్ఞానముతో (శరీరమే ఆత్మ అని భ్రమించి),
నేను (ఆత్మ) కర్మ చేస్తు న్నాను అని అనుకొని, ఆ కర్మ ఫలములు
నాకు (ఆత్మకు) కావాలనే కోరికతో, శరీరము చేసే కర్మలను ఆత్మకు
ఆరోపిస్తు న్నారు. ఆత్మకు శరీరముతో ఏ సంబంధము లేదు అనే
ఆత్మ జ్ఞానము కలిగితే (అజ్ఞానము తొలగిపోయినట్లే), తన చేసే
కర్మలు శరీరమే చేస్తోంది, తాను (ఆత్మ) చేయుట లేదు అనే
జ్ఞానముతో చేసే కర్మలు, వేయించిన విత్తనముల వలె మొలకెత్తవు.
213
ఆవిడ తండ్రిగారు మదాలసను ఒక ఋతధ్వజుడు అనే రాజ
కుమారుడుకు ఇచ్చి వివాహము చేశారు. కొన్నాళ్ళకు
ఋతధ్వజుడు మహారాజు అయ్యాడు. మదాలస అన్ని
విషయములలోనూ ఒక రాజుగారి భార్యగా అన్ని పనులు చలాకీగా
చక్కగా చేస్తుంది. కొన్నాళ్ళకు ఆవిడకు ఒక కుమారుడు (విక్రాంత్)
కలిగాడు. ఆవిడ ఆ కుమారుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆమె
పాటల (మదాలస గీతములు) ద్వారా, ఆ కుమారుడికి తత్త్వ
జ్ఞానము బోధించుట మొదలుపెట్టింది. విక్రాంత్ కి తత్త్వ జ్ఞానము
బాగా అర్ధమయింది. వాడికి 5 వ ఏట వెళ్లి తండ్రితో నాకు
రాజ్యములో ఉండాలని లేదు. అడవులకు వెళ్లి తపస్సు
చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత రెండవ
కుమారుడు (సుబాహు) పుట్టా డు. తల్లి మదాలస వాడికి అలానే
తత్త్వ జ్ఞానము నేర్పింది. వాడు అలానే అడవులకు వెళ్ళిపోయాడు.
తరువాత మూడవ కొడుకు (శతృమర్ధన్) వాడికి కూడా అలానే
చేశాడు. ఋతధ్వజుడు ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా
జరుగుతోందని ఆరాతీసి, తన భార్య మదాలస పిల్లకు పుట్టినప్పుడు
నుండే పాటలతో తత్త్వ జ్ఞానము నేర్పుతోంది అని తెలిసి, అలాంటి
పాటలు పాడకూడదు అని ఆమెకు ఆజ్ఞ వేశాడు. మదాలస సరే అని
ఒప్పుకుంది. తరువాత నాలుగవ కుమారుడు పుట్టా డు. వాడికి
మదాలసే పేరు పెట్టు తాను అని అంది. ఋతధ్వజుడు
214
ఒప్పుకున్నాడు. మదాలస వాడికి అలర్క (పిచ్చి కుక్క) అని పేరు
పట్టింది. దానికీ ఋతధ్వజుడు ఏమీ అభ్యంతరము చెప్పలేదు.
మదాలస అలర్కుడికి ధర్మ మార్గములు, ప్రవృత్తి ధర్మము బాగా
నేర్పింది. మదాలస ముసలివాళ్లు అయ్యారు. అలర్కుడు పెరిగి
పెద్దవాడైన తరువాత అతనికి పట్టా భిషేకము చేసి మహారాజును చేసి,
వానప్రస్థము వెళ్లు తూ. మదాలస అలర్కుడికి ఒక ఉంగరము ఇచ్చి,
నీకు భరించరాని దుఃఖము కలిగినప్పుడు, దీనిలో నేను పెట్టిన
ఉపదేశమును తీసి చదువుకో. తరువాత దత్తా త్రేయ స్వామీ దగ్గరకు
వెళ్లి, నేను పంపానని చెప్పు. ఆయన నీకు కావలసిన ఉపదేశము
చేస్తా రు అని చెప్పి, అడవులకు వెళ్లిపోయినది. అలర్కుడు చాలా
కాలము రాజ్యము చక్కగా పాలించాడు. అతనికి భోగములపై కోరిక
ఎక్కువగా పెరిగి, భోగ లాలసలతో జీవితమును గడుపుతున్నాడు.
216
కూడా మోక్ష మార్గములో నడిపించింది. చిన్నతనములో తత్త్వ
జ్ఞానము చెప్పకపోతే, అలర్కుడిలాగ చాలా కాలము కష్టములను
అనుభవించ వలసివస్తుంది.
217
తత్త్వ జ్ఞానికి ఏ విధమైన కోరికలు ఉండవు తన చిత్తమును
(స్మరణ లేక జ్ఞాపక శక్తి, బుద్ధి, మనస్సు, అహంకారము), శరీరము,
ఇంద్రియములు, అవయవములు అన్నీ అదుపులో, నియంత్రణలో
ఉంచుకున్నాడు (పతంజలి మహర్షి యోగ సూత్రములలోని
ప్రత్యాహారము), తన శరీరమునకు బయట ఉండే వస్తు వులు
అన్నిటినీ వదులుకున్నాడు, విడిచిపెట్టేశాడు (యమ, నియమ లోని
అపరిగ్రహము).
218
ఉండాలంటే, ఇంద్రియములను అలా బయటకు వెళ్ళనీయకుండా
నిగ్రహించి, మనలోపలే ఉంచుకోవాలి.
యోగము
220
పవిత్రము చేసుకొనుట. 2. సంతోషము – ఉన్నదానితో తృప్తి
పడుట. 3. తపస్సు - మౌనము అనేది గొప్ప తపస్సు. 1. ఆకార
మౌనము – మాట్లా డ కుండా ఉండుట. 2. కాష్ట మౌనము –
మాట కాకుండా, ఏ విధమైన ఇంగితము – అభిప్రాయములు,
ఆలోచనలు కూడా లేకపోవుట. 4. స్వాధ్యాయము – 1. యోగ్యులు
అయినవారు చేసే వేదములు అధ్యయనము, 2. మోక్షము కోసము
శాస్త్రముల, మంత్ర జపములు అధ్యయనము. 5. ఈశ్వర ప్రణిధానం
– మనము చేసే ప్రతి సత్కర్మను, ఫలాపేక్ష లేకుండా, ఈశ్వరుడికి
సమర్పించుట, పరామేశ్వరార్పణము (యోగ సూత్రము 2 : 32).
221
ప్రాణాయామము వివరములకు 4 అధ్యాయము 29, 30 శ్లోకములు
చూడుము.
222
చాలా సేపు కొనసాగించగల సామర్థ్యమును ధ్యానము సాధన (యోగ
సూత్రము 3 : 2).
223
దుఃఖము కలిగితే కుంగిపోడు. చలి పుడితే బాధపడడు, విచ్చగా
ఉంటే సంతోషపడడు.
224
అటువంటి సిద్దు లు మూడు రకములు – 1. నిత్య సిద్ధు లు
= బ్రహ్మ మానస పుత్రు లు సనకాది పంచకము = సనకః, సనందనః,
సనాతనః, సనత్ సుజాతః, సనత్ కుమారః. 2. జీవన్ముక్తు లు –
జనకాది మహారాజు సిద్ధు లు – కర్మ మార్గములో ఉన్నా మహా
జ్ఞానులు. 3. పరమాత్మ – అవతారము ఎత్తి మానవులుగా ఉన్న
సిద్ధు డు శ్రీకృష్ణ పరమాత్మ.
225
ఎవరైతే ఏదైనా కావాలనే కోరికతో, కర్మలు (పుణ్యమైనా లేక
పాపమైనా) చేస్తే, ఆ కర్మలు బంధనములు అవుతాయి. ఆ కర్మ
ఫలములు అనుభవించుటకు జన్మలు ఎత్తవలసినదే.
226
అంతా, మనకు కనిపించేది అంతా పరబ్రహ్మయే అయి ఉన్నది. సృష్టి,
స్థితి, లయలు బ్రహ్మము నందే కలుగుచున్నవి. కావున శాస్త్రముతో
బ్రహ్మను ఉపాసించవలెను. పరమాత్మ యజ్ఞ మయుడు.
227
సామాన్యులు చివరి రెండూ రూపము, నామము అయిన
ప్రపంచ తత్త్వమును మాత్రమే గుర్తించి, వాటితో సంబంధము
పెట్టు కొని, వాటిపై కోరికలు పెంచుకొని, వాటి కోసము కర్మలు చేసి,
కర్మల బంధనములకు లోనై జనన, మరణ (సంసార) చక్రములో
తిరుగుతూనే ఉంటారు.
228
యజ్ఞము అంటే “దేవతోద్దేశ్యేన ద్రవ్యతో త్యాగో యాగః” –
ఒక దేవతను మనస్సులో ఉంచుకొని, మనకు సాధ్యపడే, మన దగ్గర
ఉండే విహితమైన (శాస్త్రములో చెప్పబడిన) ద్రవ్యమును, “ఇది నాది
కాదు, ఇది ఆ దేవతకు చెందుగాక” అని మానసికముగా ఆ దేవతకు
చెందేలా అగ్నిలో సమర్పించుట. ఇందులో “అర్పణం” – సమర్పించే
సాధనము – దర్వి (చెక్క గరిటె), దర్విలో ఉంచే ద్రవ్యము “హవిః”,
ఆ హవిస్సును ఏ అగ్ని ద్వారా ఆ దేవతకు సమర్పిస్తు న్నామో అది
“యజ్ఞాగ్ని”, ఆ యజ్ఞమునకు విహితమైన “కాలము”, ఆ యజ్ఞము
ఏ ప్రదేశములో చేస్తు న్నారో ఆ “ప్రదేశము”, ఆ యజ్ఞ క్రియ “హుతం”,
ఆ యజ్ఞము చేసే కర్త “యజమాని”, ఆ యజ్ఞము యొక్క
“గంతవ్యము (ఫలము)” – ఇవన్నీ బ్రహ్మ స్వరూపములే అనే దృష్టి
కలిగి ఉండాలి. ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తు వులోనూ, ప్రతి క్రియ
లోనూ మూల ముడి పదార్ధము పరబ్రహ్మమే. వాటిలో పరమాత్మను
మనస్సులో ఏకాగ్రతతో గోచరము చూసుకోగలిగితే, పరమాత్మ
అనుభవము కలుగుతుంది.
230
“శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞాః జ్ఞాన యజ్ఞం పరంతపా” –
ద్రవ్యములతో చేసే యజ్ఞములు శ్రేయస్సును కలిగిస్తా యి.
యజ్ఞములలో జ్ఞాన యజ్ఞము సర్వోత్కృష్టమైన యజ్ఞము, గొప్ప
తపస్సు.
సంయమము
231
విషయములను లోపలకి తీసుకువచ్చే చంచలముగా ఉండే
మనస్సును మన హృదయములో స్థిరముగా కట్టివేయుబడిన స్థితి
– ధారణ. అలా హృదయములో కట్టివేసి కూర్చోపెట్టిన మనస్సు
హృదయము లోపలే ఉండి, కొన్నిసార్లు పరమాత్మ మీద
లగ్నముయినా, మరి కొన్నిసార్లు ఇదివరకే తెలుసుకున్న,
సంపాదించుకున్న ప్రాపించక విషయములను గుర్తు చేసుకునే
తపనలో ఇటూ, అటూ ఊగిసలాడుతూ ఉండే స్థితి – ధ్యానము.
ధ్యానము సాధనను పెంచుకొని, ఇతర ప్రాపించక విషయముల
మీదకు మనస్సు వెళ్ళకుండా, నిరంతరము పరమాత్మ మీదే
మనస్సు స్థిరముగా లగ్నమయ్యే స్థితి – సమాధి (మానవుడు
సాధించవలసిన ఉత్తమమైన స్థితి). ఈ మూడు స్థితుల కలిపితే
సంయమము అంటారు.
మనస్సు
232
క్షిప్తము: క్షిప్తము అనగా నిరంతరము కదిలిపోవుట,
చంచలముగా ఉండే దశ. ఇది రజో గుణము యొక్క ప్రభావము.
233
లగ్నమయ్యే దశ. ఈ స్థా యికి రావాలంటే చాలా సాధన చేయాలి. ఈ
దశ కలిగితే సమాధి సాధించినట్లు (మనస్సు ఒకే విషయము మీద
స్థిరముగా ఉండుట. చాలా రకములు సమాధులు కూడా
ఉన్నాయి).
235
ఆత్మ స్వరూపములో సాధించిన సంయమము ద్వారా తత్త్వ
జ్ఞానముతో జ్వలిస్తు న్న యోగాగ్నిలో, పైన వివరించి మొత్తము 17
చేసే కర్మలను హోమము చెయ్యాలి. ఆ యోగాగ్నిలో ఈ క్రియలు
అన్నీ లయించిపోతాయి.
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ॥ 28 ॥
236
ఈ లోకములో కొంతమంది ద్రవ్య యజ్ఞము, కొంతమంది
తపో యజ్ఞము, కొంతమంది యోగ యజ్ఞము చేస్తా రు
ద్రవ్య యజ్ఞములు:
237
యోగ్యమైన వారికి మన దగ్గర ఉన్న ద్రవ్యమును, మన
ఆదాయములో 6 వ వంతు దానము చేయుట.
తపో యజ్ఞము
యోగ యజ్ఞము
ప్రాణాయామము
240
అపాన వాయువు నిశ్వాసము (అపాన వృత్తి) అంటారు. ఈ రెండూ
జరుగుతున్నంతసేపు మనము జీవించి ఉంటాము. ఇవి ఆగిపోతే
మనము మన ప్రాణము పోయినట్లు . సద్గురువు యొక్క నిరంతర
పర్యవేక్షణతో, శాస్త్రీయ అభ్యాసముతో సరైన రీతిలో ఈ ప్రాణ
(ఉచ్ఛ్వాస), అపానములను (నిశ్వాస) క్రియలను
నియంత్రించగలిగితే, నిరోధించుకుంటే దానిని ప్రాణాయామము
అంటారు. పతంజలి మహర్షి యోగ సూత్రములలో 2.49 నుండి
2.53 వరకూ ఈ ప్రాణాయామము, దీని ప్రయోజనముల గురించి
వివరించారు.
241
ప్రాణాయామమునకు, లోపలకి తీసుకునే ప్రాణాయామమునకు
మధ్య నిర్దిష్టమైన కొంత సేపు ఆపుట (సంక్రాంతి కాలము -
సంక్రమణము) మనకు తెలియకుండానే సహజముగా
జరుగుతుంది. దీనిని బహిర్ కుంభకము అంటారు. దానంతట అదే
జరిగే అంతర్ కుంభకము మరియు బహిర్ కుంభకము కలిపి
అంతర్బహిర్ కుంభక ప్రాణాయామము అంటారు. పూరక, రేచక,
అంతర్బహిర్ ప్రాణాయామములు ఏమీ చేయకుండా నిర్దిష్టమైన
కొంత సేపు చేసే ప్రాణాయామమును కుంభక ప్రాణాయామము
అంటారు.
243
నియతమైన ఆహారము - “అర్ధం సవ్యంజనానస్య, తృతీయం
ఉదకస్యచ, వాయు సంచారనార్ధంతు చతుర్ధ అవశేషయేత్” – మన
కడుపులో సగము వరకు ఘనమైన ఆహారమును తినవలెను. అక్కడ
నుండి ఒక పావు భాగము జలము త్రాగవలెను. చివరి పావు
భాగములో గాలి సంచరించుటకు ఖాళీగా వదలిపెట్టా లి.
244
అర్ధము చేసుకునే సామర్థ్యము కలుగుతుంది. పతంజలి యోగ
సూత్రములలో (1-33 నుండి 1-39 వరకు) వివరముగా ఉన్నది. .
245
జన్మించిన ఓ అర్జు నా I మీ వంశము యొక్క కురు మహారాజు ఎన్నో
యజ్ఞములు చేసి గొప్ప సాధన చేసినవాడు.
247
భూత యజ్ఞము – మన చుట్టూ ఉండే పశు పక్ష్యాదులకు
చక్కగా ఆహారమును అందించవలెను. భూత దయ నిరంతరము
కలిగి ఉండాలి.
248
విధముగా ఫలితము లభిస్తుంది. మనము అతిధులను
మధ్యమముగా అన్నాదులను సమర్పించినట్లయితే మనకు తిరిగి
అదే విధముగా ఫలితము లభిస్తుంది. మనము అతిధులను నిరాశ
పరిచినట్లయితే మనకు ఫలితము కూడా అంతే తీవ్రముగా
ఉంటుంది.
249
కర్మ ఫలముల కంటె అత్యుత్తమమైనది. ఆ కర్మ ఫలములు అన్నీ ఆ
జ్ఞాన ఫలములో కలిసిపోయి, కర్మ ఫలములు సూన్యమైపోతాయి.
250
అప్పుడు సద్గురువులు నీకు జ్ఞానము కలిగేంతవరకూ,
కలిగేటట్లు గా తప్పక ఉపదేశము చేస్తా రు (యోగ్యుడైన శిష్యుడికి
గురువు చెప్పి తీరాలి. ఇది నా ఆజ్ఞ). వేదాంతములలో
(ఉపనిషత్తు లలో) చెప్పిన తత్త్వ జ్ఞానము పొంది, (పరమాత్మను కళ్లతో
చూసినట్లు గా) పరమాత్మ అనుభవమును కూడా పొందిన
సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి.
251
ముండకోపనిషత్ – 1-2-13 – “తస్మై స విద్యా
నుపసన్నాయ సమ్యక్ ప్రశా న్తచిత్తా య శామాన్వితాయ, యేనాక్షరం
పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్” –
గురువును ఆశ్రయించిన శాంత, శమ, దమ మొదలైన సద్గుణములు
కల శిష్యులకు, ఆ గురువు అక్షరమును (పరమాత్మను), సత్యము
అయిన పరమాత్మను తెలుసుకొనుటకు సాధకమగు బ్రహ్మ విద్యను
ఉపదేశించవలెను. (బ్రహ్మ విద్య సద్గురువు ద్వారానే కలుగుతుంది.
మరొక దారి లేదు. పుస్తకముల ద్వారా కలగదు).
253
అప్పుడు రాజుగారు 600 గోవులను, ఒక కంఠ హారము,
ఒక రధమును తీసుకొని రైక్వుడి దగ్గరకు వెళ్లి, వాటిని తీసుకొనమని,
మీరు పూజార్హులు, మీకు తత్త్వ జ్ఞానము తెలుసును, నేను మీకు
శిష్యరికము చేస్తా ను, నాకు ఆ తత్త్వ జ్ఞానము బోధించండి అని
ప్రార్థించాడు. దానికి ఆ రైక్వుడు, రాజుగారితో నీవు ఇవన్నీ నాకు
ఇచ్చి, విద్యను కొనుక్కోవాలను అనుకుంటున్నావు. నీ పద్ధతి నాకు
నచ్చలేదు. ఇవన్నీ తీసుకొని నీవు వెళ్లిపో అన్నాడు.
256
ప్రపంచములో అందరూ చేసిన అన్ని పాపములను
మూటగట్టి, అవన్నీ నీవే చేసావు, అందరికంటే నీవే ఎక్కువ
పాపాత్ముడివి అని అనుకుందాము.
257
ద్రవ్య ఆపేక్ష, 2. అనిష్ట చింతనము, 3. వితథాభినివేశము (పర
లోకము లేదు, దేహమే ఆత్మ అనే అభినివేశము) [ఇవి మానసిక
పాపములు], 4. కఠినోక్తి, 5. అసత్యోక్తి, 6. పరోక్షమున పరదూషణ
చేయుట, 7. అసంబద్ధ ప్రలాపము [ఇవి వాచిక పాపములు], 8. పర
ద్రవ్యము అన్యాయముగా గ్రహించుట, 9. నిషిద్ధ హింస, 10.
పరదారగమనము [ఇవి శరీర పాపములు] [మనుస్మృతి 12-5,6,7]
259
బ్రహ్మ సూత్రములు – 4 వ అధ్యాయము (ఫల
అధ్యాయము), ప్రధమ పాదము, 9. తదధిగమాధికరణము - 13.
“తదధిగమ ఉత్తర పూర్వాఘయోర శ్లేషవినాశౌ తద్వ్యపదేశాత్ “–
ముందు జన్మలలో చేసిన కర్మలు (సంచిత కర్మలు), ఈ జన్మలో
పరమాత్మ జ్ఞానము కలగక ముందు చేసిన కర్మలు (ఆగామి కర్మలు),
పరమాత్మ జ్ఞానము కలిగిన తరువాత చేసిన కర్మలు తీసుకొని
ఉపనిషత్తు ల వేదాంతముతో ఆలోచించి చెప్పినది:
260
జ్ఞానము కలగక ముందు చేసిన పాప కర్మలను, జ్ఞానము కలిగిన
వెంటనే జ్ఞానమనే అగ్ని కాల్చి భస్మము చేయును.
262
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥ 38 ॥
జ్ఞానము చాలా పవిత్రమైనది. జ్ఞానము కంటె పవిత్రమైనది ఈ
లోకములో ఇంకొకటి లేనేలేదు.
ఉదాహరణ:
263
ఒక అడవిలో ఒక సాధకుడు చాలా కష్టపడి పూజా సామగ్రిని
సిద్దము చేసుకొని, అమ్మవారిని ప్రత్యక్షము చేసుకునే ఒక
ప్రత్యేకమైన, ఉన్నతమై పూజ చేయుటకు కూర్చొని, మంచి
ఘడియలకు వేచి ఉన్నాడు. అంతలో ఒక పులి వచ్చి ఆ సాధకుడిని
చంపి తినేసింది. అక్కడ దగ్గరలో ఇదంతా చూస్తు న్న ఇంకొక వ్యక్తి ఆ
పులిని చూసి భయపడి చెట్టెక్కాడు. ఆ పులి మొదటి సాధకుడిని
తినేసి, కడుపు నిండగానే అక్కడ నుండి వెళ్ళిపోయింది. తరువాత
ఆ రెండవ వ్యక్తి చెట్టు మీద నుండి క్రిందకు దిగి, అక్కడ అమ్మవారి
విగ్రహము, పూజకు పూలు ఎలాగూ ఉన్నాయి కదా అని ఆ పూలు
అమ్మకు సమర్పించాడు. ఆ సమయమునకు మొదటి సాధకుడు
ఎదురు చూస్తు న్న మంచి ఘడియలు వచ్చాయి. వెంటనే అమ్మ
ప్రత్యక్షమయినది. రెండవ వ్యక్తి ఆశ్చర్యపడి, అమ్మ నీవు
ప్రత్యక్షమైనందుకు చాలా సంతోషము. కాని ఒక సందేహము – ఆ
మొదటి వ్యక్తి ఎంతో కష్టపడి ఈ అడవిలో నీ పూజకు అన్నీ
సమకూర్చుకున్నవాడిని ఆ పులి అలా తినేసింది. అతనికి ఏమీ
ఫలితము లేదు. నేను ఏమీ కష్టపడకుండా ఇక్కడ అన్నీ సిద్ధముగా
ఉన్న పూలను నీకు సమర్పించాను అంతే. నీవు ప్రత్యక్షమయి నాకు
ఫలితము కలిగింది. ఈ రకముగా అయితే మానవులకు కర్మ
సిద్ధాంతము మీద నమ్మకము ఎలా కలుగుతుంది.
264
నీవు అనేక గత జన్మలలో చేసుకున్న అనేక సాధనల
ఫలితముగా నీకు అన్నీ సిద్ధముగా దొరికేలా నేనే చేశాను. నీకు
ఇప్పుడు ఆ సాధనలకు ఫలితము ఇచ్చాను. చనిపోయిన మొదటి
వ్యక్తికి సిద్ధి కలుగుటకు పై జన్మలలో ఇంకా చాలా సాధన
చేసుకోవాలి.
265
కాని ఒక్కసారి ఆత్మ జ్ఞానము లభించిన వెంటనే, క్షణ
మాత్రము లోనే, ఆ సాధకుడు సర్వోత్తమమైన శాంతిని
పొందుతారు.
266
కనబడుచున్నదో చెప్పమని అడిగెను. శ్వేతకేతు అందులో చూసి
ఏమీ కనిపించుట లేదు అని చెప్పెను. అప్పుడు ఆరుణ మహర్షి ఆ
కనిపించని సూక్ష్మ భాగము నుండియే, ఇంత పెద్ద మర్రి చెట్టు
పుట్టు చున్నది.
267
పురాణములను నేను నమ్మను అని అనుకునే వాళ్ళు
పొందవలసిన సర్వోత్తమమైన ప్రయోజనమును పొందలేక
నాశనమైపోతారు. ప్రతీ దానిమీద అపనమ్మకము ఉన్నవాళ్లు ,
నమ్మాలా లేక వద్దా అని ఆలోచించేవాళ్లు కూడా వాళ్ళు పొందవలసిన
సర్వోత్తమమైన ప్రయోజనమును పొందలేక నాశనమైపోతారు.
“స్వార్ధాః భ్రష్టో భవంతి” స్వార్ధముతో ఉన్నవాళ్లు భ్రష్టు లైపోతారు.
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయం ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ॥ 41 ॥
268
కర్తవ్య భావన, ఫలాపేక్ష, రాగ ద్వేషములు లేకుండా
సత్కర్మలను ఆచరిస్తూ, ఆ కర్మలను పరమాత్మకు పూర్తిగా
సమర్పించి, మనస్సును శుద్ధి చేసుకొని, పరమాత్మ తప్ప వేరొకటి
లేనేలేదు అనే స్థిరమైన బుద్ధితో, ప్రాపించక విషయముల వైపు
మనస్సు మరలకుండా సర్వత్రా ఆత్మ దృష్టితో ఎవరైతే ఉంటారో,
వారికి తత్త్వ జ్ఞానము కలుగుతుంది. ఆ తత్త్వ జ్ఞానము మనస్సులో
ఉండే ప్రతి సందేహమును పటాపంచలు చేస్తుంది.
ఉదాహరణ:
269
పనులు చేస్తూ, ఎప్పటికైనా మనవాడైన పరమాత్మ దగ్గరకే వెళ్ళాలి,
అక్కడే ఉండాలి అనే భావన ఉండాలి.
270
మనస్సు మరలకుండా ఉంటుందో), సమస్త కర్మలు క్షయము
అవును (జన్మ పరంపర నుండి విముక్తి కలుగుతుంది).
అజ్ఞానము
271
జ్ఞానము – భ్రమతో, తప్పుగా తెలుసుకొనుట (ఎండ మావులను
నీళ్ళుగా భావించుట. అనర్థము కలుగుతుంది).
272
మాటలన్నీ వదిలేయండి. పరమాత్మను తెలుసుకుంటే
అమృతత్త్వము కలుగుతుంది. జన్మ, మరణ ప్రవాహములో వచ్చే
కష్టములు దరిచేరవు. పరమాత్మను తెలుసుకుంటే జన్మ, మరణ
ప్రవాహమును దాటుటకు వంతెనగా ఉపయోగపడుతుంది.
మంగళా శ్లోకములు
అధ క్షమా ప్రార్ధనా
అధ భగవత్ సమర్పణమ్
273
అధ లోకక్షేమ ప్రార్ధనా
అధ మంగళమ్
274
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే కర్మసంన్యాసయోగో నామ
పంచమోఽధ్యాయః l।
అర్జు న ఉవాచ ।
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి।
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ॥ 1 ॥
శ్రీభగవానువాచ ।
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ॥ 2 ॥
275
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l అన్ని
కర్మలను వదలిపెట్టి , జ్ఞాన మార్గములో తత్త్వ జ్ఞానము కోసము
తీవ్రముగా నిరంతరము ప్రయత్నము చేసే సన్యాసము. రాగ
ద్వేషములు లేకుండా, కర్తృత్వ అభిమానము (భావన) లేకుండా,
కర్మ ఫలముల మీద ఆసక్తి లేకుండా, సమతా భావముతో చేసే
సత్కర్మ ఆచరణ. ఈ రెండూ మార్గములు సర్వోత్తమమైన శ్రేయస్సు,
అఖండ ఆనందము, పరమ పురుషార్థము కలిగిన ఫలితములను
తప్పకుండా ఇస్తా యి.
276
ఎవరికైతే ద్వేషము లేదో, ఎవరికైతే ఏ విధమైన ఆశలు లేవో
వారిని మాత్రమే జ్ఞానము కలిగిన నిత్య సన్యాసి అని అనాలి.
సన్యాసము అంటే రాగ, ద్వేషములను సన్యాసము (విడిచిపెట్టు ట)
చేసుకొనుట .
278
సాంఖ్యము అయినా, యోగము లేదా సత్కర్మ ఆచరణ, ఈ
రెండింటిలో నీ అర్హతకు, యోగ్యతకు తగిన ఏ ఒక్క దానినైనా సరే
(చిత్త శుద్ధి కలిగి, ఏకాగ్రత ఉన్న వారికి సాంఖ్యము, సందేహములు
ఉండి ఏకాగ్రత, చిత్తశుద్ధి లేని వారికి యోగము (సత్కర్మ ఆచరణ),
బాగా సాధన చేస్తే రెండింటి ఫలితములను పొందుతారు. (ఈ
వివరణ 3-3 శ్లోకములో కూడా పరమాత్మ చెప్పాడు). .
279
సాంఖ్యము, కర్మ యోగముల యొక్క ప్రయోజనము ఒక్కటే అని
ఎవరైతే అర్ధము చేసుకోగలుగుతారో, వాళ్ళే సరిగ్గా అర్ధము చేసుకొని
చూస్తు న్నట్లు .
ఉదాహరణ
280
ఇచ్చతో నా లాభము ఇంత. మొత్తము దీని ఖరీదు ఇంత అనే
చెప్పేవాడు. వినియోగదారులు అతని నిజాయితీని,
అమాయకత్వమును గౌరవించి, బేరము అడగకుండా కొనేవారు.
ఒకరోజు ఆ సాలెవాడు చెట్టు క్రింద కూర్చొని ఉండగా, ఒక దొంగల
ముఠా దొంగతనముకు వెళ్ళుతూ, అమాయకముగా ఉన్న
సాలెవాడిని చూసి, వాళ్ళు దొంగిలించే ధనము మోయుటకు
పనికొస్తా డని, ఒరేయ్ మాటా రారా అన్నారు. వాడు భగవత్ ఇచ్చతో
సరే అని వాళ్లతో వెళ్ళాడు. వాళ్ళు ఒక బాంకులో డబ్బును
దొంగిలించి, మూటకట్టి, వాడి నెత్తి మీద పెట్టి మోసుకొని రారా
అన్నారు. వాడు భగవత్ ఇచ్చతో ఆ మూటను మోస్తూ ఆ దొంగల
వెనకాలే వెళ్ళుతున్నాడు. ఇంతలో పోలీసులు వాళ్లను వెంబడించారు.
ఆ దొంగలు పారిపోయారు. ఆ సాలెవాడు డబ్బు మూటతో సహా
పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు వాడిని ఏమి చేసావురా అని
అడిగితే, వాడు జరిగిన దంతా పూస గుచ్చినట్లు భగవత్ ఇచ్చతో
ఇలా చేశానండీ అని చెప్పాడు. పోలీసులు వాడిని సరే భగవత్
ఇచ్చతో శ్రీకృష్ణ జన్మ స్థా నములో ఉండు అని లోపల వేశారు. కోర్టు లో
కేసు జరుగుతోంది. న్యాయమూర్తి విచారణ చేస్తూ ఉంటే, ఆ ఊళ్ళో
వాళ్ళంతా వచ్చారు. ఊళ్ళో వాళ్ళు జడ్జిగారితో, అయ్యా వీడు చాలా
అమాయకుడు, మంచివాడు. వీడు దొంగతనము వంటివి చేయడు,
ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు అని చెప్పారు. దానితో
281
న్యాయమూర్తి లాయర్లను వద్దని, వాడిని ఏమి జరిగిందో అంతా
చెప్పమని అడిగారు. వాడు భగవత్ ఇచ్చతో ఇలా జరిగింది అని
జరిగిన దంతా పూస గుచ్చినట్లు చెప్పాడు. న్యాయమూర్తి ఊళ్ళో
వాళ్లను, ఆ సాలెవాడిని నమ్మి, భగవత్ ఇచ్చతో వీడు దొంగతనము
చేయలేదు అని నమ్మి, భగవత్ ఇచ్చతో వీడిని విడుదల చేస్తు న్నాను
అని న్యాయ తీర్పు ఇచ్చాడు.
282
గొప్ప బాహువులు కల ఓ అర్జు నా I సన్యాసము అంటే ఒక
యోగము. సత్కర్మ ఆచరణ లేకపోతే, సన్యాసమును సవ్యముగా
పాటించలేరు. రాగ, ద్వేషములు లేకుండా సమతా బావ
పూర్వకముగా, కర్తృత్వ భావము లేకుండా, సత్కర్మ ఆచరణ
సవ్యముగా చేసుకొని, మనస్సు పరిశుద్ధమైన తరువాత మనస్సు
పరిపాకము అయిన తరువాత సన్యాసము తీసుకుంటే,
సన్యాసమును సవ్యముగా పాటించగలరు. అప్పుడే ఏ విషమైన
అడ్డంకులు లేకుండా, తత్త్వ జ్ఞానము కొరకు సాధన చేయగల
సామర్థ్యము, మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితి
లేకుండా సన్యాసము తీసుకుంటే, అది సన్యాసమే కాదు. అటువంటి
సన్యాసము దుఃఖమయము అవుతుంది.
ముని:
283
పరమాత్మ అంశముగా ఆత్మ కూడా నిత్య శాశ్వతమైన దివ్య
ఆనందము స్వరూపము కాబట్టి, ఆనందము కావాలి అని
అనుకుంటుంది. ప్రతి జీవికి ఈ ప్రపంచము నుండి ఆనందము
పొందాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రపంచము నుండి ఏది పొందినా
జీవాత్మకు తాత్కాలికమైన ఆనందము మాత్రమే దొరుకుతోంది.
తాత్కాలికమైన ఆనందము రుచి చూసే సరికి అయిపోయి,
దుఃఖము మిగిలిపోతుంది. మళ్ళీ, మళ్ళీ ఆనందము కోసము
ప్రయత్నముతోనే జీవితము అంతమై పోతుంది. అందులోనూ
మనము ఆనందము అని భ్రమపడుతున్న ఈ ప్రాపించక ఆనందము
అసలు ఆనందమే కాదు. దానిని సుఖము అని అనవచ్చును.
అటువంటి తాత్కాలికమైన సుఖముతో మన దివ్యమైన నిత్య ఆత్మ
స్వరూపము ఎప్పటికీ తృప్తి పడలేదు.
284
ఆనందము కావాలా, అనిత్యమైన సుఖము కావాలా, ఏ వస్తు వు
నిత్యమైనది, ఏ వస్తు వు అనిత్యమైన, ఏది కావాలి, ఏది అక్కర్లేదు
అనే విచారణ (మననము) చేసుకొని, తరువాత శాశ్వతమైన
ఆనందము కావాలని నిర్ణయించుకున్న తరువాత శాశ్వతమైన
ఆనందము కలిగించని, అనిత్యమైన ఈ ప్రపంచము, ఈ ప్రాపించక
విషయముల మీద మనకు వైరాగ్యము కలుగుతుంది. “ఇహ జగతి
సర్వ ఏవ జంతుః నిరు పత్రవం సుఖమ్ మవాస్తు ద్విపరమతు
తతోపమానం దుఃఖమ్ ఇతి స్పుర్హాన్ కరోతి” – ఏ ప్రాణి అయినా
సరే, నాకు ఏ విధమైన కష్టములు లేని శాశ్వతమైన ఆనందము
కావాలి అని కోరుకుంటారు. కాని చాలా మంది ఆ ఆనందము
కోసము ప్రయత్నము (ఆత్మ జ్ఞానము) చేయుట లేదు? దానికి
కారణము, వాళ్ళ జన్మ, జన్మల నుండి మనస్సులో పేరుకుపోయి
ఉన్న కుసంస్కారములతో, వాళ్ళ మనస్సు పరిశుభ్రముగా లేదు.
పాలు కాచుటకు, పాత్రను పరిశుభ్రము చేసుకున్నట్లు గా, ఆత్మ
జ్ఞానము పొందాలంటే, ముందు మనస్సులో ఉన్న
కుసంస్కారములు లేకుండా, శుభ్రముగా కడుక్కోవాలి. సత్కర్మ
ఆచరణతో మంచి సంస్కారములు అలవరచుకొని,
కుసంస్కారములను (కామము, కోరిక, రాగము, స్పృహ, తృష్ణ,
ఇచ్ఛ, కాంక్ష, వాంఛ, ఆపేక్ష, ఆసక్తి, ఈహ) పోగొట్టు కొని చిత్తశుద్ధి
కలిగి, శమము (కర్మేంద్రియముల నిగ్రహము), దమము
285
(జ్ఞానేంద్రియముల నిగ్రహము) కలిగి, తితీక్ష (ద్వంద్వములను –
సుఖము-దుఃఖము, లాభ-నష్టము, చలి-వేడి, మొదలైన వాటిపైన
సమతా భావము) కలిగి, ఉపరతి (సన్యాసము) మనస్సు శుభ్ర పడి
ఆత్మ జ్ఞానము పొందుటకు అర్హత కలుగుతుంది.
286
ఇంద్రియములను, మనస్సును గెలిచి, వాటిని తన అదుపులో
ఉంచుకొని, వైరాగ్యము కలిగి మననము చేసుకుంటే,
ఉదాహరణ:
287
నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ ।
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ॥
8॥
288
నోటితో మాట్లా డుతున్నప్పుడు, మన శరీరము నుండి వ్యర్ధ
పదార్ధములు విసర్జించేటప్పుడు, చేతులతో ఏ పనైనా చేసినప్పుడు,
కనురెప్పలను తెరుస్తు న్నప్పుడు మరియు మూస్తు న్నప్పుడు,
290
దేవదత్తము – ఆవలింత చేస్తుంది, 10. ధనంజయము – ప్రాణము
పోయిన తరువాత, శరీరమును ఉబ్బి పోయేలా చేస్తుంది, కపాలము
పగులినప్పుడు శబ్దము కలిగిస్తుంది).
291
అంతఃకరణమునకు విశ్రాంతి లభిస్తుంది. ఆ సమయములో అవి
తమ శక్తు లను పుంజుకుంటాయి. వాటికి అవసరమైనంత విశ్రాంతి
లభించి, తమ, తమ శక్తు లను పుంజుకున్న తరువాతే అవి మరలా
పని చేయుటకు తిరిగి జాగృతి అవస్థకు వస్తా యి.
292
ఎలాగైతే తామరాకు పైన నీళ్ళు ఉన్నా తామరాకుకు,
నీళ్ళకు సంబంధము లేకుండా, అంటకుండా ఎలా ఉంటాయో,
అలా అటువంటి వారికి ఏ పాపములు అంటవు. అలాగే ఆ కర్మలు,
ఆ క్రియలు ఆ వ్యక్తీ చేస్తు న్నట్లు కనిపిస్తు న్నా, కర్తృత్వము లేని ఆ
వ్యక్తికీ, ఆ కర్మలు, క్రియలకు ఏ విధమైన సంబంధము ఉండదు.
293
సాధారణ సాధకులు ఆ సత్కర్మలను నేను (జీవాత్మ)
చేస్తు న్నాను, ఆ సత్కర్మల ఫలములు నాకు కావాలి అనే భావనతో
చేస్తా రు. కాని యోగులు ఈ శరీరము యొక్క చేతులు
పూజిస్తు న్నాయి లేదా నమస్కరిస్తు న్నాయి అని భావిస్తా రు. ఈ
శరీరము యొక్క ఇంద్రియములు, వాటి విషయముల వైపుకు
పోతున్నాయి అని భావిస్తా రు. ఆ కర్మలను కేవలము సాక్షిగా
చూస్తు న్నట్లు భావిస్తా రు. ఏ కర్మలతోనూ, ఏ విషయములతోనూ
వాళ్ళు సంబంధము, సంగము పెట్టు కోరు.
294
యోగము లేనివాడు (యోగము = అదృష్టము – కనిపించని,
చూడలేని దానిని పొందుట, అంతకు ముందు లేని దానిని
పొందుట). కోరికలతో కర్మలు చేస్తూ, కర్మ ఫలముల మీద ఆసక్తితో
కర్మలు చేస్తూ, ఆ కర్మలతో, ఆ కర్మ ఫలములతో తీవ్రమైన
సంబంధము ఏర్పడి, వాటి బంధములో కూరుకుపోతాడు, కట్టు బడి
పోతాడు.
296
ఇంద్రియములను, మనస్సుని, బుద్ధిని తన ఆధీనములోనికి
తెచ్చుకున్నవాడు,
297
వశములో ఉన్న మనస్సుతో అనుకుంటారు. నేను (జీవాత్మ) ఈ
దేహములో ఉన్నాను అని అనుకుంటూ చాలా సుఖముగా,
శాంతముగా ఉంటాడు.
298
ముందుగా ఆలోచించి, చేయాలనే ఉద్దేశముతో + చేసిన కర్మలు)
సూక్ష్మ రూపములో అంతరాత్మలో ముద్రించబడి, దాగి ఉండి, ఆ
సంస్కారములను అనుసరించి (అలవాటుగా, స్వభావముగా మారి)
ఆ, యా ఇంద్రియములను, శరీర భాగములను ఆ సంస్కారముల
అనుగుణముగా కర్మలను చేయుటకు ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది.
299
సుఖము కాని, దుఃఖము కాని సంపాదించుకునేందుకు
సామర్థ్యము లేక, ఏ పనీ చేయలేక కష్ట పడుతున్నాడు. ఈశ్వరుడు
ఒకడిని ఇటు వెళ్ళు అని స్వర్గము లోనికి పంపేశాడు. మరొకడిని
నీవు ఇటు వెళ్ళు అని నరకము లోనికి తోసేశాడు.
300
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥ 15 ॥
301
ప్రేరేపించబడి, ఆ సంస్కారములకు అనుగుణముగా మనము ఈ
జన్మలో కర్మలు చేస్తా ము.
302
మానవుడు ఏది సాధించదలచుకున్నాడో, ఆ లక్ష్యము మీద
వాడి బుద్ధి స్థిరముగా ఉండాలి. ఆ లక్ష్యముతో మనస్సులో
మమేకము అయిపోవాలి. వాడి ప్రయత్నము, క్రియ, సాధన, నిష్ఠ
అంతా ఆ లక్ష్యముతోనే పరిసమాప్తమైపోవాలి. తను ఎంచుకున్న
ఏకైక లక్ష్యమే చాలా ఉన్నతమైనది. ఆ లక్ష్యము తప్ప మరొకటి
దేనిమీదా దృష్టి ఉండకూడదు. “తదేవ పరమం అయనం యేషాంతే
తత్పరాయణః”.
ఉదాహరణ - ధృవుడు:
303
రాజుగారి ఒడిలో నుండి లాగేసి, తన కుమారుడు ఉత్తమను
కూర్చిపెట్టింది. సురుచి ధృవుడితో నీకు, నీ తండ్రి ఒడిలో కూర్చొనే
అధికారము లేదు. అది అధికారము కావాలంటే, నీవు మహావిష్ణువు
కోసము తపస్సు చేసి, నాకు కుమారుడిగా పుట్టేటట్లు వరము
కోరుకొని, నాకు పుత్రు డిగా పుట్టి తేనే, నీకు ఆ అర్హత కలుగుతుంది
అని అన్నది. దానితో ఆ చిన్న పిల్లవాడికి మనస్సులో తీవ్రమైన బాధ
కలిగి, తన తల్లి సునీతకి చెప్పి, తన తండ్రి ఒల్లో కూర్చోవాలనే
లక్ష్యముతో, అడవులలో తపస్సు చేయుటకు బయలుదేరాడు.
304
అందరిలో నివసించే తత్త్వముగా భావిస్తూ తపస్సు చేసుకోవాలి,
అని చెప్పి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షర
మంత్రమును ఉపదేశము చేస్తా డు. ఆ కుర్రవాడు మహావిష్ణువు
దర్శనము చేసుకొని ఆయన దగ్గర వరము పొందాలనే లక్ష్యముతో,
శ్రద్ధగా ఘోర తపస్సు చేశాడు (తనిష్టాః). ఎనిమిది నెలలకే సిద్ధి కలిగి
మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత సుందరమైన, తేజోమయమైన
మహావిష్ణువును చూసిన పిల్లవాడికి, నోట మాట రాలేదు. అలా
చూస్తూనే ఉండిపోయాడు. మహావిష్ణువు తన శంఖమును ఆ
పిల్లవాడి బుగ్గకు ఆనించాడు. దానితో ఆ పిల్లవాడు మహావిష్ణువును
గొప్పగా స్తు తిస్తా డు. అప్పుడు మహావిష్ణువు నీ మనస్సులోని కోరిక
నాకు తెలుసు. నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ తల్లి, తండ్రి అంతా నిన్ను
చక్కగా ఆహ్వానిస్తా రు. నీ తండ్రి తరువాత, నీవు 36 వేల
సంవత్సరములు యజ్ఞములు, యాగములు, సత్కర్మలు చేస్తూ
రాజ్యము పాలించి, తరువాత జన్మలో సప్త ఋషుల మండలమునకు
కూడా పైన, నా (విష్ణు) పదమైన, అన్ని లోకములకు,
అంతరిక్షమునకు ఇరుసు (axis) అయిన ధృవ మండలములో
జీవులకు ఆదర్శముగా ఉంటావు అని ఆశీర్వదించి
మాయమైపోయాడు. తరువాత నాలో చేరుతావు అని అన్నాడు
(తత్పరాయణాః).
305
ఇక్కడ దృష్టి పెట్టవలసిన విషయము – ధృవుడి ఎనిమిది
నెలల తపస్సుకే మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు, ధృవుడు
మోక్షము ఎందుకు కోరలేదు? మహా విష్ణువు కూడా ధృవుడికి
మోక్షము ఎందుకు ఇవ్వలేదు? ఇందులో ఉన్న సూక్ష్మమైన అంశము
– ధృవుడికి గురువైన నారదుడు ఉపదేశించిన మంత్రము, దాని
అర్ధము “విశ్వమంతా వ్యాపించి అందరిలో నివసించే పరమాత్మగా
భావించి” మరియు నారదుడు ప్రత్యేకముగా ఆ అర్ధమును
మనస్సులో భావిస్తూ తపస్సు చేయమన్నాడు. కాని మాయ
ప్రభావము వలన ధృవుడి మనస్సులో రాజస గుణము ప్రభావము
ఉండి, తన పినతల్లి సురుచి, ఆమె కుమారుడు ఉత్తముడి పైన
తనకు ద్వేషము ఉన్నందున వాళ్లను నా శత్రు వులుగా భావించి,
వాళ్లలో తప్ప మిగిలిన వాళ్ళందరిలో పరమాత్మను భావించి తపస్సు
చేశాడు. ఆ చిన్న లోపము వలన ధృవుడు వెంటనే మోక్షము
పొందలేకపోయాడు. ఇంకా కొన్నాళ్ళు సత్కర్మ ఆచరణ చేసి,
చిత్తమును శుద్ధి చేసుకొని, క్రమముగా పరమాత్మను పొందుతాడు.
ధృవుడిలో ఈ చిన్న లోపము వలన, పరమాత్మ, ధృవుడికి
ఫలితమును (చాలా కాలము) ఆలస్యము చేస్తు న్నాడు.
306
విద్య (ప్రాపంచకమైన విద్య, ఆత్మ విద్య), ఆ విద్య ద్వారా
వినయముతో అలరారుతున్న, ప్రకాశించుచున్న బ్రాహ్మణుల యందు
కాని, పశువులలో ఉత్తమమైన గోవుల యందు కాని, అన్ని జీవులలో
పెద్దైన ఏనుగులలో కాని,
307
భతృహరి శతకములో చక్కగా వివరించారు – “యదా
కించిజ్ఞొహం గజ ఇవ మదాంధః సమభవమ్. తదా సర్వజ్ఞొస్మీత్యభవ
దవ లిప్తం మమ మనః| యదా కించిత్ కించిత్తు బుధజన సకాశా
దవగతమ్ I తదా మూర్ఖెస్మీతి జ్వర ఇవ మదొమె వ్యపగతః” – నాకు
మిడిమిడి జ్ఞానము ఉన్నప్పుడు, నాకు ఎంతో తెలుసు, నాకు
తెలుసున్నంత ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు అని నాకు
ఏనుగుకు ఉన్నంత మదము ఉండేది. నేను పండితులలో
సహవాసము చేసి, చాల కొంచము, కొంచము వాళ్ళ ద్వారా
తెలుసుకున్న తరువాత, నేను తెలుసుకున్నది ఏమిటంటే – నాకు
ఏమీ తెలియదనీ, అన్నీ తెలుసు అని అనుకునే ఒక మూర్ఖుడిని అని,
నాకు తెలియనిది ఈ ప్రపంచములో ఎంతో ఉన్నదనీ తెలిసిన
తరువాత నాకున్న మద జ్వరము పూర్తిగా చల్లబడిపోయినది.
309
వస్తు వులతో అనుభవించే కర్మల వలన, ఆ వ్యక్తితో, వస్తు వుతో
సంబంధము కలిగి ఉన్నా, వాళ్ళు పరబ్రహ్మతో ఉన్నారు కాబట్టి, ఆ
వ్యక్తు లు, వస్తు వులు వలన కలిగే ఏ దోషములు, బంధనములు
వాళ్ళకు అంటవు.
311
చెప్పిన తరువాత, అప్పటికి శిష్యుడికి గురువుగారు చెప్పినది సరిగ్గా
అర్ధమయినది.
313
వస్తు వు మీద రాగ, ద్వేషములు కలిగి ఉండనక్కరలేదు. ఏ రకమైన
ఉద్వేగములు పొందరాదు. ఈ ప్రపంచము సృష్టి (పుట్టు క), స్థితి
(ఉండుట, ఉనికి), లయము (లీనము) బ్రహ్మము నందే
కలుగుచున్నవి. ఏ వస్తు వు పరమాత్మ కంటె వేరు, భిన్నము కాదు.
ఈ ప్రపంచము పరమాత్మ యొక్క ఒక రూపాంతరమే. అందుచేత
ఒక వస్తు వు మనకు కలిగిందని సంతోషము పొందాలని కాని, లేదా
నాకు అక్కరలేని వస్తు వు నేను కోరుకోకుండా, ఏదో వస్తు వు నాకు
వచ్చి పడింది అని నాకు దుఃఖము కలగాలని కాని వాటికి
అవకాశము కలిగించకూడదు.
314
సుషుప్తి అవస్థలో (మనస్సు అలసిపోయి, కలలు ఆగిపోయిన
తరువాత గాఢ నిద్రలో) ఇంద్రియములు, మనస్సు అలసిపోయి,
పనిచేయుట మానివేస్తా యి. అప్పుడు బాహ్య విషయములు
మనస్సులోకి రావు. ఆ సమయములో నాకు సుఖముగా నిద్ర
పట్టినది అని అంటాము. ఆ సమయములో చాలా ఆనందము
అనుభవిస్తా ము, శరీరమునకు అలసట తీరి, చాలా హాయిగా,
ప్రశాంతముగా ఉంటుంది. అది కేవలము క్షణ మాత్రము ఉంటే
దానిని సుషుప్తి సుఖము అంటారు. అది శాశ్వతముగా ఉంటే దానిని
ఆత్మ సుఖము, ఆత్మానుభవము, బ్రహ్మానందము అంటారు. ఈ
సుఖము బాహ్యమైన వస్తు వుల ద్వారా కలిగే సుఖము కంటె ఎన్నో
రెట్లు ఎక్కువ సుఖమును కలుగుతుంది.
315
“యస్య కామ సుఖం లోకే, యస్య దివ్యం మహాత్ సుఖం,
తృష్ణా క్షయ సుఖస్యైతే నార్హత షోడశీమ్ కళాః” మనము కోరుకొని,
కష్టపడి తెచ్చుకున్న బాహ్యమైన ప్రాపంచక సుఖములు, పైన దివ్య
లోకములలో కలిగే దివ్య సుఖములు, ఇవన్నీ సుషుప్తి స్థితిలో కలిగే
సుఖము కంటె కనీసము 16 వ వంతు సుఖము కూడా ఉండవు.
ఆత్మ సుఖము ముందు ఈ సృష్టిలో ఉన్న అన్ని సుఖములు
దిగదుడుపే.
316
మొదట ఇంత కష్టపడి ఈ సుఖము సంపాదించుకున్నాము,
ఈ సుఖము త్వరలో అయిపోతోందే అనే దుఃఖము (ఐస్క్రీం
కరిగిపోయినట్లు ). కష్టము, శ్రమ ఎక్కువ, కలిగే సుఖము తక్కువ
అనే దుఃఖము. ప్రక్క వాడికి మనకంటే ఎక్కువ సుఖము ఉంది అనే
దుఃఖము, బాధ.
317
పుణ్యము ఖర్చు అయిపోతోంది. పూర్తిగా ఖర్చు అయిపోతే, మరొక
లోకములో ఇంకొక జన్మ ఎత్తా లనే దుఃఖము ఉంటుంది. దుఃఖము
లేని జన్మ ఉండదు.
318
నాశనము అయిపోతున్నాయి. సుఖము కలిగిన తరువాత, సుఖము
రాక ముందు ఉన్న కష్టముల కంటె, ఎక్కువ కష్టములు
కలుగుతున్నాయి.
319
సుఖము, తృప్తి లేదు అని తెలుసుకోవలసినదే. అల్లా జీవితమంతా
మనస్సులో శాంతి అనేది ఉండనే ఉండదు.
320
భోగములు అనుభవించ లేకపోతున్నాను. నాకు తిరిగి ఆ కొండంత
శరీరమే కావాలి అని వరము కోరింది. బ్రహ్మదేవుడు తథాస్తు
అన్నారు. మళ్లా ఆ కొండంత శరీరము కలిగింది.
321
ఈ జన్మలోనే కోరిక తీవ్రమైనప్పుడు కలిగే వేగము, ఆ కోరిక
తీరకపోతే కలిగే కోపముతో వచ్చే తీవ్రమైన వేగము, ఎవరైతే తట్టు కొని
ఇవి సరైనవికాదు అనే సహనమును ఎవరైతే పెంచుకుంటారో, ఈ
శరీరము వదిలిపెట్టి వెళ్ళే ముందే ఈ విధమైన ఆలోచన, సాధన
చేసుకుంటారో, అటువంటి వారే నిజమైన యోగము ఉన్నావారు.
వారికే నిజమైన సుఖము అందుతుంది.
యోఽంతఃసుఖోఽంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ॥ 24 ॥
322
స్థితిని సాధించుకోగలిగితే, బాహ్య వస్తు వుల ద్వారా దుఃఖములు
కలగవు మరియు నిజమైన, శాశ్వతమైన ఆనందము కలుగుతుంది.
324
పూర్తిగా తొలగిపోయి, పరమాత్మ తత్త్వ జ్ఞానము కలిగి, మోక్షము
లభిస్తుంది.
326
ఎవరి కోసము, ఎవరి ప్రేరణతో, ఎవరి ద్వారా పనిచేస్తు న్నాయో
తెలుసుకొని, తన ఇంద్రియములను, మనస్సును అంతర్ముఖము
చేసుకొని, శరీరము లోపలికి చూచేలా మరల్చి, ఆత్మ తత్త్వమే
పరమాత్మ తత్త్వము అని తెలుసుకోగలుగుతున్నాడు.
ఉదాహరణ:
327
వివాహము చేశారు. ధర్మ వ్యాధుడు గొప్ప జ్ఞాని, చాలా మంచివాడు
అని తెలుసుకొని వాళ్ళు ఆ వివాహము చేసుకున్నారు. ఆ
కుటుంబములో ఎవ్వరూ ఏ విధమైన హింస చేయరు. కాని వాళ్ళ
మనస్సులో ఉన్న ఒక చిన్న అభిప్రాయ బేధముతో ఆ అమ్మాయిని,
ఆమె తండ్రి ఒక వేటగాడు. జంతువులను, పక్షులను హింసించి,
చంపి తన పొట్ట నింపుకుంటాడు, ఆమె తండ్రి హింస చేసే వాడు అని
అనేవారు. ఇంకా ఆమె ధ్యానములో పద్దతి, వాళ్ళ ధ్యానములో
పద్ధతులతో తేడా కూడా ఉండేది. దాని మీద కూడా సూటిపోటి
మాటలు అనేవారు. తన తండ్రి గురించి, తనని అలా అంటూంటే,
ఆమెకు బాధ కలిగేది. ఒకరోజు ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు
వదలి, తన తండ్రి దగ్గరకు వెళ్లిపోయినది. అక్కడ వాళ్లకు కూడా
ఏమీ చెప్పలేదు. కొన్నాళ్ళకు ఆమె వాలకము చూసి, తండ్రి అడిగితే,
ఆమె జరిగిన దంతా తండ్రికి చెప్పింది. తండ్రి, నీవు చేసినది మంచి
పద్దతి కాదు. నీవు నీ అత్తవారి ఇంట్లో, వాళ్ళ పద్దతుల ప్రకారమే
అలవాటు చేసుకొని, అక్కడే ఉండాలి. నా గురించి వాళ్ళు అనే
విషయము నేను వాళ్లకు చెప్పుకుంటాను. నీవు ఇలా పుట్టింటికి
రావటము తప్పు అని మందలించి, నీవు మీ అత్తవారింటికి
వెళ్లిపొమ్మని అని చెప్పాడు. ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారి ఇంటికి
వెళ్ళిపోయింది.
328
ధర్మ వ్యాధుడు వీలు చూసుకొని, ఒకరోజు తన కుమార్తె
అత్తవారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు చక్కగా ఆహ్వానించి,
పలకరించారు. భోజనము వేళ అయింది. అందరూ కూర్చొని
ఉన్నారు. భోజనము వడ్డించి తినటము మొదలుపెట్టా రు. ధర్మ
వ్యాధుడు అన్నము ముట్టు కోలేదు, చేతులు నలుపుకుంటూ
కూర్చొన్నాడు. వాళ్ళు చూసి భోజనము చేయండి అని అడిగారు.
అప్పుడు ధర్మ వ్యాధుడు “ఈ అన్నము తిని, నేను ఇంత హింస
చేయలేక పోతున్నానండి” అని అన్నాడు. దానికి వాళ్ళు ఇందులో
హింస ఏమి ఉంది. మీరు చేసే హింస కంటె ఇదేమీ హింస కాదు అని
వాళ్ళు అన్నారు. అప్పుడు ధర్మ వ్యాధుడు, నేను బోయ
కుటుంబములో పుట్టా ను. వేట నా కుల వృత్తి. నేను నా
కుటుంబమునకు అవసరము వరకే వేటాడి, అంతవరకే హింస చేస్తూ
జీవిస్తు న్నాను. కాని ఈ అన్నములో నాకు ఎంతో ఎక్కువ హింస
కనిపిస్తు న్నది. ధాన్యమును, మొలక నుండి తెంపిన దగ్గర నుండి,
ధాన్యమును దంచి, ఉడక పెట్టి ఈ అన్నము వండే వరకూ, ఆ
బియ్యమును ఆశ్రయించి ఎన్నో జీవులకు ఎంతో హింస జరిగినది.
అది నాకు కనిపిస్తు న్నది. అందుచేత ఈ అన్నమును నేను తినలేక
పోతున్నాను అని అన్నాడు. ధర్మ వ్యాధుడు చెప్పినది వాళ్లకు అర్ధము
కాక, ఆయన అన్న దానికి వివరముగా చెప్పమని ప్రార్థించారు.
అప్పుడు ధర్మ వ్యాధుడు, మన జీవితము నడవటానికి తెలిసో,
329
తెలియకో తప్పనిసరిగా ఎంతోకొంత హింస జరుగుతూనే ఉంటుంది.
మనము జీవించుటకు అవసరమైనంత వరకూ, శాస్త్రము మనకు
అనుమతించిన హింసను దాటి ఎక్కువ హింస చేసే ఆ ఎక్కువగా
చేసినది మాత్రమే హింస అవుతుంది. శాస్త్ర పరిమితి లోపల జరిగే
హింసలకు కొన్ని ప్రాయశ్చిత్తములు (పఞ్చసూనా – జంతువులను
చంపే దోషములకు - పంచ యజ్ఞములు) చేసుకోవలసి ఉన్నది.
అలా శాస్త్రీయమైన మార్గములలో పోగొట్టు కోవచ్చు. ఇది విన్న
తరువాత వాళ్ళు హింస గురించి అర్ధము చేసుకొని, వాళ్ళు చేసిన
తప్పులకు క్షమించమని ప్రార్థించారు.
330
దుఃఖములను, కష్టములను శాంతింపచేసుకొని, కేవలము బ్రహ్మ
స్వరూపముగా ఉండి, మోక్షము అనే పరమానందమును
అనుభవిస్తూ ఉంటారు. శరీరము ఉన్నంత వరకూ జీవన్ ముక్తు లుగా
ఉంటూ, శరీరము వదిలిన తరువాత విదేహ ముక్తు లు అవుతారు.
ఉదాహరణ:
331
మహర్షి, గురువునైన నన్ను కాదని ధిక్కరిస్తవా అని కోపము వచ్చి,
12 సంవత్సరములు బ్రహ్మ రాక్షసుడి ఉండు అని కల్మషపాదుడిని
శపించారు. కల్మషపాదుడు కూడా వశిష్ట మహర్షిని శాపించాలని
నీళ్ళు తీసుకొని మంత్రించిన సమయములో, ఆయన భార్య వచ్చి
మీరు గురువులను అలా శపించకూడదు అని నివారిస్తే, ఆ
మంత్రించిన నీళ్ళు తన కాళ్ల మీద పడితే అక్కడ కల్మషపాదుడి కాళ్లు
నల్లగా అయిపోయింది. ఆ రోజు నుండి ఆయనకు కల్మషపాదుడు
(పాదము మీద నల్లని కల్మషము ఉన్నవాడు).
332
కుమారుడు పరాశర మహర్షి (అప్పటికి ఇంకా చిన్న పిల్లవాడు –
కాబోయే వేదవ్యాస మహర్షి తండ్రి) వశిష్ట మహర్షి ఆశ్రమములో
ఉన్నారు. తన వంద మంది పుత్రు లు చనిపోయినా, విశ్వామిత్రు డిని
ఏమీ అనని శాంత స్వభావమునకు ప్రతీక, బ్రహ్మ జ్ఞాని అయిన వశిష్ట
మహర్షి లాంటి వాళ్ళు కూడా, చిన్న వెంట్రు క అన్నములో వచ్చిన
దానికి తన క్షణికమైన కోపము యొక్క వేగమునకు లోనై, తనే
శాపము ఇచ్చిన కల్మషపాదుడు ద్వారా, తనకు మిగిలిన ఒకే ఒక్క
సిద్ధు డైన కుమారుడిని కూడా కోల్పోయాడు.
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ 28 ॥
336
కర్మేంద్రియములను,జ్ఞానేంద్రియములను, మనస్సును,
బుద్ధిని నియంత్రించుకొని, అదుపులో పెట్టు కొని, పరమాత్మ గురించి
నిరంతరము మననము చేసుకుంటూ, ప్రధాన లక్ష్యమైన మోక్షము
కోసమే స్థిరమైన నిశ్చయముతో ప్రయత్నము, సాధన చేసుకోవాలి.
ఉదాహరణ:
ఒక ఊళ్ళో దొంగ వెంట పోలీసులు పడుతున్నారని
పారిపోయి కాశీ క్షేత్రము చేరుకున్నాడు. ఆ రోజు సూర్య గ్రహణము
ఉన్నది. చాలా మంది భక్తు లు గంగా నదీ తీరములో, గంగలో
స్నానము చేసి, సాదువులకు బంగారము దానము చేస్తు న్నారు. అది
చూసి తన పని చాలా తేలిక అయిందని సంతోషించి, గంగా
338
స్నానము చేసి, సాధువు వేషము వేసుకొని, గంగా నదీ తీరములో
సాధువుల ప్రక్కనే కూర్చొని ధ్యానము చేస్తు న్నట్లు నటిస్తు న్నాడు.
అక్కడ ఒక భక్తు డు సాదువులకు బంగారము దానము చేస్తా అంటే,
ఆ సాదువులు ఒక్కొక్కళ్ళు నాకు వద్దు , బంగారము నేను ఏమి
చేసుకుంటాను నాకు వద్దు , సూర్య గ్రహణ సమయములో
బంగారము దానము తీసుకుంటే పాపము వస్తుంది నాకు వద్దు అని
నిజమైన సాదువులు నాకు వద్దు , నాకు వద్దు అని అంటూ ఉండగా,
ఆ దొంగ అవన్నీ ఏకాగ్రతతో వింటూ, తన వంతు వస్తోందని లోపల
సంతోషిస్తు న్నాడు. చివరికి అతని వంతు వచ్చింది. ఆ భక్తు డు
బంగారము దానము తీసుకోమని సాధువు వేషములో ఉన్న ఆ
దొంగను అడగగా, ఆ దొంగ తనకు తెలియకుండానే,
అప్రయత్నముగా మిగిలిన అందరి సాదువులు లాగ, నాకు వద్దు అని
అనేశాడు.
339
సత్కర్మ ఆచరణ చేస్తూ, ఆ సత్కర్మల ఫలితములను
త్యజించి, ఆశించకుండా, అపేక్ష, కోరిక లేకుండా చేయాలి. ఆ
సత్కర్మలకు నేను కర్తను, నేను చేశాను అనే భావమును,
అహంకారమును విడిచిపెట్టు కోవాలి. కర్మల ఫలములను,
కర్తృత్వము, రాగ ద్వేషములను, అజ్ఞానమును విడిచిపెట్టు కోవాలి.
మంగళా శ్లోకములు
అధ క్షమా ప్రార్ధనా
అధ భగవత్ సమర్పణమ్
అధ మంగళమ్
341
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోఽధ్యాయః
ll
శ్రీభగవానువాచ । అనాశ్రితః
కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 1 ॥
342
యోగి, ధ్యాన యోగము యోగ్యత కలిగినవాడు). కోరికలతో కర్మ
ఫలితము కోసము కర్మలు చేసేవాడు కర్మ ఫలమును
ఆశ్రయించుకొని ఉన్నవాడు ఫలితము కోసము ఏదైనా చేస్తా డు.
అటువంటి వాడికి ఉన్నత స్థితి ఉండదు. కర్మల ఫలితము - జన్మ –
కర్మ – పునర్జన్మలలో తిరుగుతూ ఉంటాడు.
343
ఆసక్తి కలుగుతుంది. కర్మ ఫలముల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, ఆ
ఫలములో కోసము, కర్మల మీదే ఆసక్తి కలుగుతుంది. పరమాత్మ
తత్త్వము మీద ఆసక్తి కలగదు. దీనికి ముఖ్య కారణము, మనస్సు
అలజడితో కదిలిపోతూ, పరిశుద్ధముగా లేనందునే. ఏ విషయము
మీదైనా సరే చెప్పినది అర్ధము చేసుకోవాలంటే, మనస్సులో ఏ
అలజడి లేకుండా, శాంతముగా, స్థిరముగా ఉన్నప్పుడే ఆ
విషయము అర్థమవుతుంది. మనస్సు శాంతముగా, స్థిరముగా
లేకపోతే మనస్సు ఆ విషయము మీద కేంద్రీకరించలేక, అర్ధము కాక
ఆ విషయము మీద ఆసక్తి కలగదు.
ఉదాహరణ:
ఉత్తముడు అనే రాజుగారు చాలా ఉత్తముడు, రాజ
కుటుంబమునకు చెందని, ఒక సామాన్యమైన కుటుంబములో
అమ్మాయిని ప్రేమించి, వివాహము చేసుకున్నాడు. ఆ అమ్మాయికి
రాజ కుటుంబములో, రాజ మర్యాదలతో, రాజ గౌరవములతో ఎలా
వ్యవహరించాలో తెలియదు. కొత్తగా రాణి అయిన ఆ అమ్మాయి,
రాజుగారిని ప్రేమించే సమయములో పిలిచినట్లు , ఏక వచనముతో
పిలిచేది. అది ఆ రాజ కుటుంబములో ఇతరులకు, రాజుగారిని
అగౌరవించినట్లు అనిపించేది. అది రాజుగారికి కొంచము ఇబ్బందిగా
ఉండేది. కొన్నాళ్ళకు రాజుగారు మానసిక అశాంతికి లోని, ఆమె
ప్రవర్తనను సహించలేక, ఆమెను తీసుకు వెళ్లి అడవిలో వదిలిపెట్టా రు.
344
ఆ దగ్గరలో ఒక మహర్షి ఆశ్రమము ఉంటే, ఆ మహర్షిని
పలకరించాలని ఆ మహర్షి ఆశ్రమమునకు రాజుగారు వెళ్ళారు. ఆ
మహర్షి ఆ రాజుగారిని ఆహ్వానించటానికి, కాళ్లు కడుక్కుందుకు
అర్ఘ్యము ఇవ్వటానికి ముందుకు వెళ్ళుతుంటే, ఆ ప్రక్కనే ఉన్న ఆ
మహర్షి యొక్క శిష్యుడు, ఆ మహర్షి చెవిలో, ఈ రాజుగారు, తాను
ప్రేమించి, వివాహము చేసుకున్న భార్యను అడవిలో వదిలి పెట్టేశాడు.
అందుచేత ఈ రాజుగారు అధర్మముడు, పాపాత్ముడు, ఇతడు
అర్ఘ్యమునకు అర్హుడు కాడు అని చెప్పాడు. అప్పుడు మహర్షి నీవు
చెప్పినది నిజమే, కాని ఇతడు ఉత్తముడు. రాజుగా ఇతరులకు
ఆదర్శముగా ఉండవలసినవాడు, తెలిసో లేదా తెలియకో అతడు
తన భార్యను వదిలేసి, చాలా పెద్ద తప్పు చేశాడు. కాని ఆమె ప్రవర్తన
వలన, రాజ్య పాలన సవ్యముగా జరగట లేదని భావముతో,
మానసిక అశాంతికి గురి అయి, మనస్సులో అలజడి కలిగి, ఇదే
పరిహారము అని అనుకొని ఇలా చేశాడు. మనము సరిగ్గా నచ్చ
చెప్పితే అర్ధము చేసుకుంటాడు, అని శిష్యుడితో చెప్పి, తన చేతిలో
ఉన్న చెంబు ప్రక్కన పెట్టేశాడు. రాజుగారు అది చూసి, మీరు నాకు
అర్ఘ్యము ఇస్తుంటే, మీ శిష్యుడు ఎందుకు వద్దంటున్నాడు అని
అడిగాడు. అప్పుడు మహర్షి, నీవు నీ భార్యను అడవిలో వదిలివేసావు.
నీవు అధర్మము, పాపము చేసావు. అందుచేత నీకు అర్ఘ్యము
ఇవ్వకూడదు. భార్య ఎంత అసౌకర్యముగా నడచుకున్నా, ఎన్ని
345
ఇబ్బందులు పెట్టినా సరే, ఆమెను సరైన దారిలో మార్చుకునే
ప్రయత్నము చేసుకోవాలి. కాని అలా విడిచిపెట్టటము అనేది, మన
సంప్రదాయములో లేనేలేదు. రాజుగా నీవు, నీ ప్రజలకు ఆదర్శముగా
ఉండాలి. నీవే ఇలా చేస్తే, ఇంక నీ ప్రజలు కూలా నీలాగే చేస్తా రు.
అప్పుడు మానవులకు సంస్కృతీ చిహ్నముగా ఉన్న మన వివాహ
వ్యవస్థ దెబ్బతిని, రాజ్యములో అరాచకము పెరిగిపోతుంది. ఇప్పటికే,
మీ భార్యను ఒక రాక్షసుడు ఎత్తు కుపోయాడు. దైవవశాత్తు ఆ
రాక్షసుడి కుమార్తె, నీ భార్యను తన గదిలో పెట్టు కొని, ఆమెను ఆ
రాక్షసుడి నుండి రక్షిస్తోంది. నీవు వెంటనే వెళ్లి, నీ భార్యను ఆ
రాక్షసుడి చెర నుండి విడిపించి, ఇక్కడకు తీసుకురా. అంతవరకు
నీకు అర్ఘ్య, పానములు ఇవ్వను అని చెప్పాడు.
347
కలిగి, అర్ధము చేసుకునే స్థితి కలగాలంటే పరిపూర్ణమైన మానసిక
పరిపక్వత, పరిశుద్ధత, స్థిరత్వత, ప్రశాంతత ఉన్నప్పుడే
కలుగుతుంది.
349
తెలుసు, నీవు ఎలా పుడతావో నాకు తెలుసు. సంకల్పముతో
(బాగుంది లేదా బాగా లేదు అనే విచారణతో) నీవు (కోరిక)
పుడతావు. కాబట్టి నేను ఆ సంకల్పము, విచారణ చేయకుండా
ఉండి, నీకు పుట్టే అవకాశమే ఇవ్వను.
350
మెట్టు మీద కాలు పెట్టిన తరువాత, సత్కర్మలను సన్యాసము
చేసుకొని, ధ్యాన యోగము అనే రెండవ మెట్టు మీద స్థిరముగా
ఉండవలెను. ఒక్కసారి పై మెట్టు ఎక్కిన తరువాత, అక్కడ నుండి
క్రిందకు దిగజారకుండా వివేక యుక్తమైన మన మనస్సుతోనే
చేసుకోవాలి. ఈ ఉద్దరణ కార్యక్రమములో, మన ఆత్మ మరియు
మన మనస్సు మనకు బంధువులు అవుతారు.
ఉదాహరణ:
ఒక రైతు తన కుమారుడుకు వ్యవసాయము ఎలా చేయాలో
నేర్పిస్తు న్నాడు. పొలమునకు తీసుకు వెళ్లి, బీడు భూమిని చూపించి,
ఇప్పుడు నెల గట్టిగా బీడు కట్టి ఉండు. నెల మెత్త బడుటకు
ముందు భూమిని దున్నాలి అని చెప్పి, ఇద్దరూ కలిసి భూమిని
దున్నారు. భూమి కొంత మెత్తబడిన తరువాత నీళ్ళు పెట్టి మరలా
దున్నారు. తరువాత పిల్లవాడు పొలమునకు రాలేదు. తండ్రి
బీజములు నాటాడు. కొన్ని రోజుల తరువాత పిల్లవాడు పొలమునకు
ముందుగా వచ్చి పొలమును దున్నుతున్నాడు. అప్పుడు తండ్రి
వచ్చి, పిల్లవాడితో నేను బీజములను నాటాను, ఇప్పుడు పొలమును
దున్న కూడదు అని చెప్పాడు – “ప్రాత్ బీజా వాపాత్ కర్షణం,
తదనంతరం ఆకర్షణం” - బీజము నాటే వరకూ భూమిని దున్నాలి.
బీజము నాటిన తరువాత భూమిని దున్న కూడదు.
351
అలాగే యోగ బీజములు మనస్సులో చల్లు కొని,
నాటుకునేంతవరకు, సత్కర్మ ఆచరణ చేస్తూ మనస్సును
పరిశుద్దపరచుకోవలెను. మనస్సును శుద్ధము చేసుకొని, వైరాగ్యము
కలిగి, ప్రాపించక విషయముల మీద ఆసక్తి, కోరికలు విడిచిపెట్టు కొని,
పరమాత్మ అనే లక్ష్యము మీద ఏకాగ్రత కలిగిన తరువాత మనస్సులో
ఏ రకమైన ఆలోచనలు, కదలికలు, అలలు కలగకుండా ఉండుటకు,
సత్కర్మ ఆచరణలను ఆపుకొని, యోగమును దృఢము చేసుకొని
యోగాభ్యాసము చేయవలెను.
352
లేకపోయినట్లయితే, అప్పుడు యోగాభ్యాసము చేయుటకు అర్హత
కలిగినట్లు .
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।l 5 l।
354
మానవుల దగ్గర నుండి, యోగాభ్యాసము చేసే వాళ్ళ వరకూ, అన్ని
వర్గములకు అన్ని పరిస్థితిలలోనూ వర్తిస్తుంది.
ఉదాహరణ:
355
అందరికీ కూడా తెలిసిపోయింది. చివరికి భారవిగారికి, తన తండ్రి
మీద కోపము, ద్వేషము పెరిగి, ప్రతీకారము తీర్చుకోవాలి అనే
అభిప్రాయము కలిగింది (పేరు గడించాలనే కోరిక, తండ్రి మీద అది
ద్వేషము, క్రోధముగా మారి, ప్రతీకార రూపము దాల్చింది). రాత్రి
తండ్రి పడుకుండగా, ఆయన తల మీద పెద్ద బండరాయి వేసి
చంపెయ్యాలని, బండరాయి పట్టు కొని, గోడ వెనక నక్కి ఉండగా,
తల్లి భర్తతో మన పిల్లవాడిని అందరూ గొప్ప పండితుడు అని
మెచ్చుకుంటుంటే, మీరెందుకు అది ఒప్పుకోవట లేదు, వాడిని అలా
ఎందుకు తిరస్కస్తు న్నారు అని అడిగింది. దానికి ఆయన “ప్రత్యక్షే
గురువు స్తు త్యాః, పరోక్షే మిత్ర బంధువాః, న కదాచన పుత్రకాః” –
గురువులను, మన కంటె పెద్దవాళ్లను ఎదురుగుండా, ప్రత్యక్షముగా
పొగడవలెను. మిత్రు లను, బంధువులను వాళ్ళు లేనప్పుడు
(పరోక్షముగా) పొగడవలెను. కాని పుత్రు లను ప్రత్యక్షముగా మరియు
పరోక్షముగా కూడా పొగడకూడదు. తల్లితండ్రు లు అలా వాళ్లను
స్తు తి చేసే వాళ్లకు ఆయువు క్షీణిస్తుంది, వాళ్లకు శ్రేయస్సు కూడా
కాదు. మన కుమారుడు గొప్ప విద్వాంసుడు, మేధావి అని నాకు
కూడా తెలుసు. ఇతరులు వాడిని పొగుడుతుంటే నాకు లోపల
ఆనందముగానే ఉంటుంది. వాడు ఇంత కంటె ఇంకా ఉన్నత స్థితికి
వెళ్ళాలి అనేదే నా కోరిక. నేను కూడా వాడిని పొగిడితే, వాడు పై
స్థా యికి వెళ్ళుటకు ప్రయత్నము చేయడు. అందుచేత నేను
356
వాడికేమీ తెలియదు అని అంటే, వాడు ఇంకా ఎక్కువ ప్రయత్నము
చేసి ఇంకా పై స్థా యికి వెళ్ళతాడు అనే ఉద్దేశముతో నేను అలా
అంటున్నాను అని అన్నాడు. తండ్రి పైన చెప్పిన శ్లోకము భారవికి
కూడా వచ్చు, తెలుసు. కాని కోపము వస్తే, వివేకము కోల్పోయి,
మనస్సు వివేకముతో ఆలోచించలేదు, తెలుసున్నవి కూడా గుర్తు కు
రావు. ఎవరైనా మంచి సలహా ఇచ్చిన, మనస్సు స్వీకరించదు.
అటువంటి సందర్భములలో తనకు తానే శత్రు వు అయిపోతాడు.
358
వచ్చాయి. ఒకరోజు ఒక్క కూర వండితే, మరుసటి రోజు ఒత్తి
పచ్చడితో పెట్టు తున్నారు. ఒక నెల దాటింది. ఒక రోజు మామగారు
అల్లు డితో, ఈ రోజు ఆవులను కాచే కాపరి (పాలేరు - పనివాడు)
రాలేదు. నీవు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా. కాస్త నీవు ఆవులను
అడవులకు తీసుకు వెళ్ళితే బాగుంటుంది అని అన్నాడు. భారవి
(మనస్సులో ప్రాయశ్చిత్తము అనే విషము ఉంది, అందుచేత
విషయము అర్ధము చేసుకొని) అలాగే ఆవులను అడవికి తీసుకు
వెళ్ళాడు. అక్కడ ఒక తాటాకు తీసుకొని ఈ శ్లోకము వ్రాశాడు
“సహసా విగధీత న క్రియామ్, అవివేక పరమాపదామ్ పదమ్,
మృణుతేహి వ్రిమృష్య కారిణమ్ గుణవృద్ధా స్వయమేవ పంపదః” -
ఏ పనీ తొందర పడి (ఆవేశముతోనో, అకస్మాత్తు గానో)
చేయకూడదు. వివేకముతో ఆలోచించకుండా, అవివేకముతో చేసే
పని చాలా ఆపదలను తీసుకువస్తుంది. ఆలోచించి, సరైన నిర్ణయము
తీసుకొని పని చేసే వాడికి, సంపదలు వెతుక్కుంటూ, తమంతట
తామే వచ్చేస్తా యి.
సాయంత్రము అయ్యింది. మామ గారి ఇంటికి ఆవులను
తిరిగి తీసుకువస్తుంటే, దారిలో ఒక శ్రేష్టిగారు, ఆ తాటాకు మీద ఏమి
వ్రాసావు అని అడిగాడు. ఇలా శ్లోకము వ్రాసాను అని అంటే, ఒక
రూపాయి ఇస్తా ను. ఆ తాటాకు నాకు ఇస్తా వా అని అడిగాడు ఆ
శ్రేష్టిగారు. భారవి సరే అని ఆ శ్లోకమును ఇచ్చేశాడు. భారవి గారు
359
కష్టపడి, ఆరు నెలలు మామగారి ఇంట్లో గడిపాడు. చివరి రోజుల్లో
గంజి పోసి భోజనము పెట్టేవారు. ఆఖరుకు నీవు మా ఇంట్లోంచి
వెళ్ళిపోతావా, లేదా మేము నిన్ను ఇంట్లోంచి గెంటివెయ్యమా అని
కూడా అడిగేశారు. ఆరు నెలలు అయిపోయాక భారవి గారు
వెళ్ళిపోయారు.
360
కోపము వచ్చి, తొందరపడి, వివేకము లేకుండా తన భార్యను
చింపేసి ఉంటే చాలా పెద్ద ఆపద వచ్చేది, మనకు మనమే అపకారము
చేసుకుంటాము, మనకు మనమే శత్రు వులము అయిపోతాము.
ఎవరికి వారు బంధువుగా మారాలి. ఆలా ఉండటానికి వివేకమును
వాడుకోవాలి. ఆ వివేకముతో, మనస్సును, బుద్ధిని,
ఇంద్రియములను అదుపులోకి తెచ్చుకొని, ప్రతి పని జాగ్రత్తగా
చెయ్యాలి అని పరమాత్మ ఉపదేశము చేస్తు న్నాడు.
ఉదాహరణ:
361
తెలియకుండా ఈ వ్యాపారి డబ్బు ఎక్కడ దాచాడు. ఈ విషయము
ఆ వర్తకుడి దగ్గర నుండి తెలుసుకోవాలి అని అనుకోని, మరుసటి
రోజున ఆ దొంగ, వర్తకుడితో అంతా చెప్పేసి, నేను మీ దగ్గర
దొంగతనము చేయను, మీరు డబ్బు సంచి ఎక్కడ దాచారో
చెప్పండి. మీరు ఈ రహస్యము చెప్పిన తరువాత నేను వెళ్ళిపోతాను
అని వాగ్దా నము చేశాడు. వర్తకుడు నవ్వి, నేను గొప్ప వ్యాపారిని. నా
డబ్బును ఎలా జాగ్రత్తగా దాచుకోవాలో నాకు బాగా తెలుసు. నా
జాగ్రత్తతో నేను ఉంటాను. నేను నా డబ్బు సంచిని నేను, నీ తల
క్రిందనే దాచి పెట్టా ను. అక్కడ నీవు వెతకవు అని నాకు బాగా
తెలుసు, అని చెప్పాడు.
362
పరమాత్మకు, సాక్షి, చైతన్య స్వరూపుడు, త్రిగుణాతీతుడు. కాని ఆ
పరమాత్మను ఏ ప్రాణీ గమనించుట లేదు.
363
చలి లేదా వేడి, సుఖము లేదా దుఃఖము మరియు నాకు
ఇక్కడ గౌరవము లభిస్తోందా లేదా అవమానము కలుగుతోందా అనే
విషయముల మీద (ఇవన్నీ బయట వస్తు వుల నుండే వస్తా యి)
సమానత్వముగా భావిస్తూ
364
పరమాత్మ యొక్క జ్ఞానముతో, విజ్ఞానముతో తృప్తి కలిగిన
ఆత్మతో (ప్రాపించక విషయముల మీద కలిగే జ్ఞానము, విజ్ఞానము
మీద నాకు ఏ విధమైన తృప్తి లేదు అనే నిర్ణయము స్థిరముగా
ఉండాలి), పైన చెప్పిన ద్వంద్వములు కలిగినప్పుడు, మనస్సు
చలించ కుండా, ఏ వికారములు లేకుండా కూటము
(బంగారమును లేదా ఇనుమును కాల్చి, ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి
కొట్టి, వాటి ఆకారమును తెరచి దిద్దు తారు) వలె స్థిరముగా
ఉంటూ, ఇంద్రియములను నిగ్రహించి, జయించుకొని
365
మంచి ప్రాణ మిత్రు డు, సాధారణమైన మిత్రు డు, శత్రు వు,
ఉదాసీనుడు, మధ్యస్థు డు, మనము ద్వేషించే వ్యక్తి, మన బంధువు,
ఉదాహరణ:
366
రమణ మహర్షి ఆశ్రమములో యోగి రామయ్య గారు
(నెల్లూరు) అనే శిష్యుడు ఉండేవారు. ఒకరోజు గది గుమ్మము మీద
పడ్డగా బలిసిన నల్లని త్రాచుపాము పడగెత్తి ఉన్నది. అది కదలట
లేదు. దానిని చూసి అందరూ భయపడుతున్నారు. యోగి
రామయ్య గారు వచ్చి, అందరినీ తప్పుకోమని, ఆ పాము ముందు
కూర్చొని, ఆ పాము వైపు తదేకముగా చూసారు. ఆ పాము మెల్లగా
పడగ దించింది. రామయ్య గారు ఆ పాము మీద మెల్లగా చేతితో
తట్టి, వెళ్లిపో అని సంజ్ఞ చేశారు. ఆ పాము మెల్లగా వెళ్ళిపోయింది.
అందరూ ఆ పాము వెళ్ళిపోవటానికి, మీరు ఏమి చేశారు అని
అడిగారు. ఆయన చెప్పిన సమాధానము – “నేను నా మీద నా
కుండే ప్రేమను ఆ పాముకు పంచాను. ఆ పామును నాతో
సమానముగా చూశాను. ఆ పాము నేను ఒకటై పోయాము. నాకు
నేను అపకారము చేసుకోనట్లు , ఈ పాము కూడా నాకు అపకారము
చేయదు”
ఉదాహరణ:
368
దూరపు బంధువులము అంటున్నారు. కొంతమంది, నీవు మమ్ము
మర్చిపోయావు, నీకు గుర్తు చేయుటకు మేము వచ్చాము
అంటున్నారు. కొంతమంది నీవు మాకు చాలా అపకారము చేసావు,
నీవు మాకు శత్రు వు అంటున్నారు. కొంతమంది, నీవు చాలా
మంచివాడవు అని పోగొడుతున్నారు. కొత్త అల్లు డికి లోపలకు ఒక
మూల నుంచుని ఉన్నాడు. అతనితో వచ్చిన వాళ్ళు బయట
పాకచూరు క్రింద నుంచుని ఉన్నారు. వాళ్లకు కోపము వచ్చింది.
అంతా గందరగోళముగా ఉంది. ఆ రోజు కృష్ణా అష్టమి
అయినందున, పరమాత్మను పూజ చూసుకోవాలని సంకల్పించి, ఆ
పేద భక్తు డు హే కృష్ణా అని పిలిచాడు. శ్రీకృష్ణుడు ఆ పాక ముందు
వచ్చి నుంచున్నాడు. ఆ పాక తడికలకు ఉన్న చిల్లు లు ద్వారా
బయట ఉన్నవాళ్లు అందరూ పరమాత్మ శ్రీకృష్ణుడిని చూశారు. ఆ
ఇంటి యజమాని బయటకు వచ్చి, పరమాత్మను లోపలి రండి అని
ఆహ్వానించాడు. పరమాత్మ నీ ఇల్లంతా అందరితో నిండిపోయి
ఉంది. నీవు ఎక్కువగా గౌరవించే నీ అల్లు డికే నీ ఇంట్లో
కూర్చుందుకు చోటు లేక ఒక మూల నుంచుని ఉన్నాడు. నేను
లోపలికి అడుగు పెట్టటానికి కూడా చోటు లేదు. నేను ఎక్కడికి
రాను, నీవు నాకు ఎలా పూజ చేస్తా వు అని అడిగాడు. దానికి అతను
నేను అల్లు డికి బట్టలు పెట్టి, అతని బంధువులను గౌరవించి
చంపించేస్తా . ఇతరుల అందరికీ ఏదో ఒకటి చెప్పి వాళ్లను కూడా
369
చంపించేస్తా . మీరు లోపాలకి రండి. నేను మీకు శ్రద్ధగా పూజ చేస్తా
అని చెప్పాడు. దానికి పరమాత్మ ఇంత చిన్న ఇంట్లో ఇంతమందిని
పెట్టు కున్నావు. ఇలాగే నీ మనస్సులో కూడా ప్రాపించక
విషయములతో నిండిపోయింది. అందులో నాకు కొంచము కూడా
స్థా నము లేదు. నీవు పూజ చేస్తా ను అంటున్నావు. పూజ అంటే,
బాహ్యమైన పూజ కాదు. నీ మనస్సులో (హృదయములో) నన్ను
ధ్యానించాలి. నీ మనస్సు ఇన్ని ప్రాపించక విషయములతో
అల్లకల్లోలముగా ఉంటే, నన్ను పూజించుటకు నీ మనస్సుకు
ఏకాగ్రత ఎలా ఏర్పడుతుంది. నన్ను ధ్యానించాలంటే, నీ మనస్సులో
నుండి ఈ ప్రాపించక విషయములను (కల్మషములను) ఖాళీ చేసి, నీ
మనస్సుని పరిశుభ్రము చేసుకుంటే, అప్పుడు నేను ఉండేందుకు
సరైన స్థా నము కలుగుతుంది. అప్పుడు నీ మనస్సులో
(హృదయములో) ప్రశాంతత ఏర్పడి, నన్ను ధ్యానించుటకు నీకు
ఏకాగ్రత కలుగుతుంది.
370
పెట్టు కొని, స్థిరముగా యోగములోనే లగ్నము చేయుటకు
(పరమాత్మతో అనుసంధానము చేయుట) సాధన ఎల్లప్పుడూ
చేయాలి. యోగము సిద్ధించుటకు మనస్సుకు ఏకాంత వాసము
(ఒంటరిగా) అభ్యాసము చేసుకొని.
371
ఉండే స్థిరమైన ఆసనము మీద చాలా సేపు కూర్చోగలుగుట)
సాధించుకొనుటకు,
372
మీద శుభ్రమైన వస్త్రమును పరిచి, పరమాత్మకు (ఆత్మ
తత్త్వమునకు) ఈ విధమైన ఆసనము కల్పించినట్లు భావన
చేసుకోవాలి.
373
బ్రహ్మ సూత్రములు - చతుర్థ అధ్యాయము (ఫల
అధ్యాయము) ప్రథమ పాదము - 7. ఏకాగ్రతాధికరణము - 11.
“యత్రైకాగ్రతాతత్రా విశేషాత్” – ఏకాగ్రత కలుగుటకు ఎక్కడ
అవకాశము ఉంటుందో, అక్కడే యోగ సాధన చేసుకోవాలి.
374
“ఆసీన స్సంభవాత్ – యోగాభ్యాసము కూర్చొని మాత్రమే చేయాలి
అని నిర్ణయించారు. నుంచుని, పడుకుని చేయకూడదు.
375
ధ్యానమును కేంద్రీకరించాలి. అప్పుడు కళ్ళు వేరేవాటిని చూడలేవు,
దృష్టి ఏకాగ్రత ఏర్పడుతుంది. అందుకోసమే అలా చెప్పారు.
అభిప్రాయము ముక్కును చూడటము కాదు.
ఉదాహరణ:
376
కోతులు మాట వినటలేదు, కాబట్టి గురువుగారు చేసేది లేక
ఒప్పుకొని, కోతులను కూర్చోపెట్టి, ఆ కోతుల ముందు రెండు అరటి
పళ్ళు పెట్టి, ఈ అరటి పళ్ళను చూడకూడదు, వీటి గురించి
ఆలోచించకూడదు అనే నియమమును పెట్టి, ఆ కోతులను కళ్ళు
మూసుకుని కూర్చొని ధ్యానము చేయమన్నారు. ఆ కోతులు
ధ్యానమునకు కూర్చొని, మనము కళ్ళు మూసుకుని ధ్యానము
చేస్తుంటే, ఆ అరటి పళ్ళను ఎవరైనా తీసుకుపోతారేమో, అనే
ఆలోచనతో, మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే, గురువుగారు కూడా కళ్ళు
మూసుకుని ఉన్నారు. అప్పుడు ఆ కోతులు మెల్లగా ఆ అరటి
పళ్ళను తీసుకొని, అక్కడ నుంచి పారిపోయాయి. ఆ కోతుల వంటి
ప్రవృత్తి, చాలా మంది మానవులలో కూడా ఉంటుంది. మన
మనస్సులో అటువంటి వస్తు వుల ప్రభావము, కోరికలు రాకుండా
ఉండుటకు, ముందు కళ్లతో అటువంటి వస్తు వులను చూడకుండా
ఉండాలి. అందుచేత పరమాత్మ, ఏ వైపులకూ చూడరాదు అని
ప్రత్యేకించి చెప్పాడు.
377
తెలుసుకుని, పశ్చాత్తా పము కలిగి, తరువాత తపస్సును కొనసాగించి,
బ్రహ్మర్షి అయినారు.
378
పరమాత్మ చెప్పిన పద్ధతులలో తన మనస్సును
యోగాభ్యాసములో స్థిరముగా ఉంచుకొని, యోగాభ్యాసము
నిరంతరము, నిర్విరామముగా చేసుకుని సిద్ధిని పొందిన యోగి,
చిత్త వృత్తు లు పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్న యోగి
379
వదులుకుంటాడు. 5. చిత్త వృత్తు ల నుండి విముక్తి కలుగుతుంది. 6.
చిత్తము జ్ఞానము అనే అగ్నిలో కరిగిపోతుంది. 7. యోగికి
ఆత్మానుభవము కలిగి తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఒక్కొక్క
భూమికలో ఒక్కొక్క రకమైన శాంతి కలుగుతుంది అని కూడా
బోధిస్తా రు. యోగ సిద్ధి కలిగిన తరువాత యోగ భూమికలు,
సోపానములు (మెట్లు ఆరోహణ – క్రమముగా మెట్లు ఎక్కుట)
ఉంటాయి. ఆ యోగ భూమికలను ఎక్కుతూ, దాటుకుంటూ
ఏడవ భూమిక దాటిన తరువాత నిర్వాణ స్థితిని పొందుతాడు.
ఉదాహరణ:
380
అంతటితో యుగ సాధన ఆగిపోతుంది. ఆ యోగి అత్యున్నతమైన
స్థా యి అయిన నిర్వాణ స్థితిని పొందలేడు.
382
వాయు సంచారనార్ధంతు చతుర్ధ అవశేషయేత్” – రోజుకు రెండు
సార్లు , మన కడుపులో సగము వరకు ఘనమైన ఆహారమును
తినవలెను. అక్కడ నుండి ఒక పావు భాగము జలము త్రాగవలెను.
చివరి పావు భాగములో వాయువు సంచరించుటకు ఖాళీగా
వదలిపెట్టా లి. అప్పుడే సమాన వాయువు అన్న శక్తిని శరీరములో అన్ని
భాగములకు సమానముగా పంచగలుగుతుంది.
యోగాభ్యాసము నియమములు:
383
5. శరీరము నడుమ భాగము నుండి శరీరము మధ్య
భాగము, మెడ, శిరస్సు సరైన సరళ లేఖలో స్థిరముగా ఉంచకపోతే
యోగాభ్యాసము చేయరాదు.
384
మొదలైనవి) మితిమీరి పనిచేయకూడదు. నియమితమైన క్రియలు,
చేష్టలు ఉండాలి _ “హితాహిత ప్రాప్తి పరిహారనుకూల క్రియలు” –
శరీరమునకు హితమైనవి (శరీరమును పోషించుట, రక్షించుట,
శరీరము శుద్ధి, శుభ్రము) చేసుకుని, హితముకానివి చేయకుండా
ఉండాలి. నిద్ర, మెలకువ నియతముగా, సమానముగా ఉండాలి.
రాత్రి సమయమును నాలుగు భాగములుగా (ఒక జాము – 3
గంటలు) చేసుకొని, మొదటి భాగము (నిశా ప్రధమ భాగము), చివరి
భాగము (బ్రాహ్మీ ముహూర్తము) వదిలి, మధ్యలోని రెండు
భాగములలో (సుమారు 6-7 గంటలు) నిద్రపోవాలి. రాత్రి ఈ రెండు
భాగములలో మెలకువగా ఉండకూడదు. ఆ తరువాత
నిద్రపోకూడదు. ఇటువంటి నియమములను పాటించాలి.
385
అటువంటి సందర్భములో కనిపించే విషయములు లేదా
కనిపించని స్వర్గము మొదలైన విషయములు మీద మనస్సులో ఏ
విధమైన కోరికలు లేని స్థితిలో, ఆ యోగికి జ్ఞాన సహితమైన నిర్వికల్ప
సమాధి అనుభవిస్తా డు.
386
హృదయములో పరమాత్మ స్వరూపమైన జ్యోతి స్పష్టముగా
ప్రతిఫలిస్తుంది.
ఉదాహరణ:
387
అశ్వమేధ యాగము చేయుటకు యోగ్యత లేని కారణముతో
దేవతలు ప్రత్యక్షముగా హవిస్సు తీసుకుందుకు రాలేదు అని
చెప్పారు. అంగ మహారాజు అశ్వమేధ యాగము వదిలేసి, పుత్ర
కామేష్టి యాగము (పుత్రు డు కావాలి అనే కోరికతో – కోరిక మొదలై
ఒక మెట్టు క్రిందకు దిగాడు) మొదలుపెట్టా రు. ఆ యాగము
ఫలితముగా మహా పరాక్రమవంతుడైన వేణుడు అనే కుమారుడు
కలిగాడు. చిన్నప్పటి నుండే పరాక్రమము చూపిస్తు న్నాడు. కాని
కొంచము పెద్ద అయిన దగ్గర నుండి పరమ దుర్గుణములు
ప్రదర్శిస్తు న్నాడు. అసలు ఈ లోకములో యజ్ఞము యాగములు
ఎందుకు చేయాలి, యజ్ఞములు, యాగములు అసలు
చేయకూడదు అని అంటున్నాడు. యజ్ఞ యాగములు చేయకపోతే,
దేవతలు ఎలా ప్రీతి చెందుతారు, దేవతలు శక్తిని ఎలా
పుంజుకుంటారు, దేవతలు మానవులను వర్షములతో, పంటలతో
ఎలా అనుగ్రహిస్తా రు. కాని వేణుడు దేవతలు అనేవాళ్ళు లేనేలేదు,
విష్ణు అంటే మహారాజే విష్ణువు. అందుచేత మహారాజే విష్ణువు అని
వాదిస్తా డు. విష్ణువు అంటే నేనే. అందుచేత యజ్ఞములు,
యాగములు, పూజలు, ఉపాసనలు నాకే చేయండి, ఇతరులకు
(దేవతలకు) ఏమీ చేయకూడదు అని ఆజ్ఞాపించాడు. అంగ
మహారాజు ఎంత చెప్పినా వినలేదు. వేణుడు మహాబలశాలి.
అందుచేత మంత్రు లు, సేనాధిపతి, సామంత రాజులు అందరూ
388
వేణుడి పక్షములో చేరిపోయారు. ఎవ్వరూ అంగ మహారాజు మాట
వినట లేదు, ఏ ధర్మ కార్యములు చేద్దా మన్నా చేయలేకపోతున్నాడు.
అంగ మహారాజు తన తండ్రి, అన్నలు యొక్క గొప్పతనము
తలచుకొని, తాను నిష్కామకర్మ, యజ్ఞ యాగములు చేయాలనే
మంచి సంకల్పముతో రాజ్యము స్వీకరించి, ఇప్పుడు ఏ ధర్మ
కార్యము చేయలేని దుస్థితికి దిగజారిపోయానే అని చింతించాడు.
ఉత్తమ స్థా యికి చేరుకున్న యోగులకు, ధర్మాచరణ మీద కూడా
అతి శ్రద్ధ ఉండకూడదు. ధర్మాచరణకు ధనార్జన, కర్మలు ఉంటాయి.
ఆ స్థితికి చేరిన వాళ్లకు ఇది “అడుసు తొక్క నేల, కాళ్లు కడగ నేల”
అవుతుంది. నేను పేరుకు మాత్రమే మహారాజును. వేణుడు రాజు
కాకపోయినా రాజ్యాధికారము చెలాయిస్తు న్నాడు. నేను ఈ
రాజ్యమును వదిలి, నా అన్నలలాగా అడవులకు వెళ్లి, నా యోగ
సాధన చేసుకోవాలి అని నిర్ణయించుకొని, ఎవ్వరికీ చెప్పకుండా, ఒక
అర్ధరాత్రి, రాజ్యము వదలి అడవులకు వెళ్ళు, యోగ సాధన చేసుకొని
సిద్ధిని కూడా పొందాడు.
389
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 19 ॥
390
చేసుకొని, పరమాత్మ యొక్క ప్రతిబింబము స్పష్టముగా ప్రతిఫలిస్తూ
ఉండగా, ఒకే తీరులో పరమాత్మ యందే లీనమై ఉంటుంది.
శ్వేతాశ్వతరోపనిషత్ – 2-11, 12 – “
నిహారధూమార్కానలానిలానాం ఖద్యోతవిద్యుత్ స్పటికశశీనాం .....
న తస్య రోగో నజరా నమృత్యుః ప్రాప్తస్య యోగాగ్ని మయం
శరీరమ్” - యోగాభ్యాసము చేయు సమయములో యోగి యొక్క
చిత్తవృత్తి మొదట మంచు వలె, వాయువు వలె కనిపించును.
తరువాత ధూమము వలె, తరువాత సూర్యకిరణముల వలె,
తరువాత అగ్ని వలె, తరువాత సూర్యుని వలె, తరువాత మెరుపు
విద్యుత్ వలె, తరువాత స్పటికము వలె కనిపించును.
యోగాభ్యాసము సిద్ధించిన తరువాత ఆ యోగి శరీరము
యోగాగ్నిమయము అవును. అటువంటి యోగి పంచ
భూతాత్మికమైన శరీరములో ఉండే ప్రతి కణము యోగాగ్నిమయమై
ప్రజ్వరిల్లు తూ ఉంటుంది. అటువంటి యోగి మనస్సులో పరమాత్మ
స్పష్టముగా భాసిస్తా డు. యోగాగ్నిమయమైన యోగి యొక్క
శరీరమునకు వ్యాధి, వార్ధక్యము, మరణము ఉండదు. ఆ యోగి
వీటన్నిటికీ అతీతమైన స్థితికి పొందుతాడు.
391
మనస్సులో పడుతూన్నా, అది ఇటూ, అటూ కదిలిపోతూ లేదా
వెలిగి, ఆరి, వెలిగి, ఆరిన విద్యుత్బల్బు వలె లేదా ఉందా లేదా
అన్నట్లు , కదిలిపోతూ కనిపించి కనిపించని తక్కువ స్థా యిలో
ఉంటుంది.
ఉదాహరణ:
392
అస్త్రము యొక్క ప్రభావము పాండవులలో ఎవరో ఒకరి మీద
పనిచేయాలి కాబట్టి, ఆ అస్త్రము యొక్క ప్రభావము అభిమన్యుడి
భార్య ఉత్తర గర్భములో ఉన్న శిశువు మీద పడింది. సదోపవాసి, నిత్య
బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడు తేజోమయమైన పురుష రూపములో
ఉత్తర గర్భములో గదను తిప్పుతూ, ఆ గర్భములో ఉన్న శిశువును
ఆ అస్త్రము యొక్క ప్రభావమును నుండి రక్షిస్తు న్నాడు. ఆ శిశువు
గర్భములో ఆ దృశ్యమును చూస్తు న్నాడు. ఆ శిశువు పుట్టిన
తరువాత, పసికందుగా, తాను గర్భములో చూసిన తేజోమయమైన
పురుషుడు వంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ఇటు, అటు
అందరినీ పరికించి చూస్తు న్నాడు. అలా చూస్తు న్నాడు కాబట్టి, ఆ
పిల్లవాడికి పరీక్షిత్ (పరీక్షగా చూసేవాడు) అని పేరు పెట్టా రు.
తరువాత ధర్మరాజు సుమారు 36 సంవత్సరములు రాజ్యపాలన
చేశారు.
394
రోజులలో పాము కాటుతో మరణించాలి అని శపించాడు. తరువాత
శమీక మహర్షి సమాధి నుండి బయటకు వచ్చి, తాను సమాధిలో
ఉండగా జరిగిన విషయములు తెలుసుకొని, పరీక్షిత్ మహారాజు తన
మేడలో చనిపోయిన పాము వేసినందుకు ఏమీ అనుకోలేదు, కాని
తన కుమారుడు, పరీక్షిత్ మహారాజును శపించినందుకు, ఇదేదో కలి
పురుషుడి ప్రభావమో లేదా దైవ సంకల్పమో అని అనుకొని, చాలా
బాధపడి, ఆ శాపమును ఎవ్వరూ వెనక్కు తీసుకోలేరు, కాబట్టి, తన
కుమారుడిని వెళ్లి, ఆ విషయమును పరీక్షిత్ మహారాజుకు
తెలియచేయమని అన్నాడు.
395
(నివాతస్థ దీపము వలె) లేదా ప్రాపంచకమైన ఆలోచనలు సమాప్తము
చేసి, పరమాత్మ యందు లగ్నమైపోతుందో,
396
యోగాభ్యాసములో నిర్వికల్ప సమాధి చేరుకున్నవారి పరిశుద్ధమైన
బుద్ధికి మాత్రమే అనుభవమునకు వచ్చును.
397
ప్రజాపతి ఆనందము. ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు
బ్రహ్మానందము. ఆ బ్రహ్మము మానవుల హృదయములో ఉన్నది.
398
సరస్వతీ దేవికి కూడా శక్యము కాదు. శబ్దములను మించిన
అనుభవము ఉంటుంది).
ఉదాహరణ:
399
రమణ మహర్షి గారికి వీపు మీద కాన్సరు పుండు వేసింది.
చాలా పెద్ద పుండు అయింది. డాక్టర్ ఆపరేషను చేయాలి,
ఆపరేషనుకు మత్తు మందు ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పారు. రమణ
మహర్షి గారు మత్తు మందు ఇంజక్షన్ నిరాకరించి, ఇంజక్షన్
చేయకుండానే ఆపరేషనుకు అంగీకరించారు. ఆపరేషను
సమయములో ఆ బాధ రమణ మహర్షి గారి మనస్సును చేరలేదు,
బాధించలేదు.
401
వాక్యములు నిజమైనవి, సత్యములు ఆనే దృఢమైన విశ్వాసముతో
సాధనను కొనసాగించాలి. అప్పుడు పరమాత్మ అనుగ్రహము కూడా
లభిస్తుంది.
ఉదాహరణ:
402
అని వాటి దృఢమైన నిశ్చయమును, నారద మహర్షికి చెప్పాయి.
నారద మహర్షి ఎంత చెప్పినా వినకుండా, ఆ పిట్టలు, అవి అనుకున్న
పనిని చేస్తూనే ఉన్నాయి. నారద మహర్షి, గరుత్మంతుడి దగ్గరకు వెళ్లి,
ఈ పిట్టల విషయము చెప్పి, నీ జాతి పిట్టలు అంత కష్టపడుతుంటే,
నీవు ఏమీ పట్టించుకోకుండా, తల మీద కిరీటము పెట్టు కొని
హాయిగా ఉన్నావు. నీవు ఏ విధమైన పక్షులకు రాజువు అని
అడిగాడు. గరుత్మంతుడికి సముద్రు డిపై కోపము వచ్చి, ఆ
సముద్రము దగ్గరకు వచ్చి వేగముతో తన రెక్కలను ఆడించి,
నీళ్ళను చిందరవందర చేసి ఆ పిట్టల గుడ్లు , ఆ పిట్టలకు ఇస్తా ను అని
చెప్పి, తన రెక్కలను ఆడిస్తూ నీళ్ళను చిందరవందర చేస్తుంటే,
సముద్రు డు, గరుత్మంతుడితో నీవు చాల శక్తి కల పెద్ద గ్రద్దవి, అవి
చిన్న పిట్టలు, మీ మధ్య విరోధములు కూడా ఉన్నాయి. ఆ చిన్న
పిట్టలను గ్రద్దలు ఆహారముగా తింటాయి కూడా. నీవు, నేను గొప్ప
శక్తిమంతులము. మన ఇద్దరి స్నేహము చాలా మంచిది. ఆ చిన్న
పిట్టల సంగతి వదిలేయి అని అన్నాడు. గరుత్మంతుడు సముద్రు డి
మాటలను ఒప్పుకోలేదు. మర్యాదగా ఆ పిట్టల గుడ్లను నీ అలలతో
సముద్ర తీరమునకు తోసి, ఆ పిట్టలకు ఆ గుడ్లను తిరిగి ఇచ్చేయి.
లేదా, నేను నా రెక్కలతో నీ నీళ్ళను చిందరవందర చేసి, ఈ భూమి
మీద సముద్రము లేకుండా చేస్తా ను అని అన్నాడు. సముద్రు డు
403
భయపడి, తన అలలతో సముద్ర తీరమునకు తోసి, ఆ పిట్టలకు ఆ
గుడ్లను తిరిగి ఇచ్చేస్తా డు.
ఉదాహరణ:
405
మనుష్యులకే తెలుస్తుంది అని అన్నాడు. అది విన్న ఆ వ్యక్తి మిగిలిన
ఆ హల్వా ముక్క తినగలడా? లేదా కొంత తిన్న హల్వా కడుపులో
నుండి బయటకు వస్తుందా? అందరూ ఊహించుకోగలరు.
406
ఉదాహరణ:
407
తరువాత, ఒకతను అడవిలో దారి తప్పి, ఆ శివాలయము వైపు వచ్చి,
ఆ శివాలయములో ఉన్న ఆ కుండను చూసి, దాని మీద వ్రాసిన
దానిని చదివి, ఎలాగూ దారి తప్పి, నా అదృష్టము కొద్దీ ఇక్కడకు
వచ్చాను. తొందర పనులు కూడా ఏమీ లేవు. ఈ కుండ మీద
వ్రాసినట్లు నేను చేసి, శివుడిని ప్రత్యక్షము చేసుకొని, నా కోరికలు తీర్చే
వరము పొంది వెళ్లి పోదాము అని అనుకొని, ఆ కుండను తీసుకొని,
ఆ కుండతో ఆ మెట్లు దిగుతూ, నదీ జలమును పైకి తీసుకు వస్తూ,
శివుడికి అభిషేకము చేస్తూ ఉన్నాడు. 50 సార్లు పూర్తి చేశాడు. చాల
కష్టము అని అనిపించింది. ఎవరో వ్రాసిన దానిని గుడ్డిగా నమ్మి
చేస్తు న్నానా, అని అనుమానము వచ్చింది. ఇటూ అటూ చూశాడు.
ఏమీ కనిపించలేదు. తరువాత కష్టపడి ఇంకొక 40 సార్లు (మొత్తము
90 సార్లు ) పూర్తి చేసి, శివుడు వస్తుంటే ఆయన ముందు ఎంతో
మంది ప్రమద గణములతో, ఎన్నో వాయిద్యములతో పెద్ద
ఊరేగింపుతో వస్తా డు కదా అని ఊహించుకొని, ఏమైనా అటువంటి
శబ్దములు, అలజడిలు దూరములో ఉన్నాయా అని చూశాడు. ఏమీ
కనిపించలేదు, ఏమీ వినిపించ లేదు. ఆ కుండ మీద వ్రాసిన దానిపై
అనుమానము వచ్చి, మిగిలిన 18 సార్లు చేయాలని అనిపించ లేదు,
కాని కష్టపడి ఇంకొక 17 సార్లు (మొత్తము 107 సార్లు ) పూర్తిచేసి,
దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి, అలా దూరములో శివుడు వస్తు న్నాడేమో
అని అన్ని వైపులా చూసి, ఏ అలజడి కనిపించక, వినిపించక పోయే
408
సరికి, ఆ కుండ మీద వ్రాసిన దానిపై అతని అనుమానము ధృఢమై,
కోపము వచ్చి ఆ కుండను ఎత్తి కొట్టి, పగల కొట్టా డు. వెంటనే ఆ
శివలింగము నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఎరా ఎంత బుద్ధి
తక్కువ పని చేసావు, ఇంకొక సారి నీవు శ్రద్ధగా నాకు అభిషేకము
చేసినట్లయితే, నీ ప్రయత్నము సఫలమయ్యేది. ఆ మహర్షి
జీవితమంతా కష్టపడి, తపస్సు చేసుకొని, మీ లాంటి వాళ్లకు మంచి
చేయాలని ఉద్దేశముతో చేసిన పనిని నీవు వృధా చేసావు.
ఇంకొకళ్ళకు కూడా అవకాశము లేకుండా ఆ కుండను పగలకొట్టా వు
కూడా. నీకు పూరి విశ్వాసము లేక, ఫలితము మీద ఆశతో 107
సార్లు మొక్కుబడిగా చేసిన దానికి అటువంటి ఫలము మాత్రమే
దక్కుతుంది, కాని ఆ మహర్షి సంకల్పించిన పూర్తి ఫలము నీకు
దక్కదు అని చెప్పి అదృశ్యమయ్యాడు.
409
కేవలము పరమాత్మ స్వరూపము మీదే మనస్సును
స్థిరముగా కేంద్రీకరించి, వేరే ఏ ఇతర విషయము గురించి కొంచము
కూడా ఆలోచించకూడదు.
410
పతంజలి యోగ సూత్రము – 1-2 –“యోగ చిత్త వృత్తి
నిరోధః” – మనస్సులోని ఆలోచనలను నిరోధించుట,
నిలిపివేయుట, ఆపివేయుట. మనస్సు ఐదు విధములుగా
ప్రవర్తిస్తుంది. 1. క్షిప్త – చంచలమైన అటు, ఇటు పరిగెత్తే స్థితి (కోతి
మనస్సు), 2. ముద్ద – బద్ధకమైన, నిద్ర పోయే స్థితి (గాడిద
మనస్సు), 3. విక్షిప్త – కొంచము సేపు కేంద్రీకరించే స్థితి
(సీతాకోకచిలుక మనస్సు), 4. ఏకాగ్ర – ఒకే దానిమీద, లక్ష్యము
మీద (ఆత్మ తత్త్వము మీద) కేంద్రీకరించే స్థితి, 5. నిరుద్ధ - మనస్సు
పూర్తిగా కేంద్రీకరించి ఆలోచనలు పూర్తిగా ఆగిపోయి, ఆత్మలో
లయమైన నిశ్చలమైన స్థితి.
411
కష్టపడి ఆ యా విషయములు నీ కెందుకు అని మనస్సుకి
ప్రేమతో ప్రియముగా నచ్చ చెప్పి, మనస్సుని మళ్ళీ, మళ్ళీ వెనక్కు
తీసుకు వచ్చి, తన లక్ష్యమైన ఆత్మ తత్త్వము మీదే కేవలము
స్థిరముగా కేంద్రీకరించి ఉంచాలి.
412
ఐదు జ్ఞానేంద్రియములను ప్రాపంచక విషయముల నుండి వెనక్కు
మరల్చి, వాటి, వాటి స్థా నములలో స్థిరముగా నిలుపుకొని, మనస్సుని
కూడా ఆ యా విషయములను ఆలోచించకుండా, బుద్ధిలో స్థిరమైన
నిశ్చయముతో ఆత్మ స్వరూపము మీద స్థిరముగా ఉంచుకొనే స్థితిని
సాధించుకోవాలి. 2-3-11 - “తాం యోగమితి మన్యన్తే స్థిరా
మిన్ద్రియ ధారణాం I అప్రమత్త స్తదా భవతి, యోగో హి
ప్రభవాప్యయౌ” – ఈ స్థితిని యోగము అని అంటారు. యోగములో
ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని స్థిరముగా ఉంచుకోవటమే
ప్రధానము. మనస్సు ఏ విధమైన ఆలోచనలు, అలజడి లేని
ప్రశాంతమైన స్థితిని సాధించుకున్న తరువాత జాగ్రత్తగా ఆ స్థితిలో
స్థిరముగా ఉంచుకోవాలి. ఏ మాత్రము అజాగ్రత్తతో ఉన్నా మనస్సు
ఆలోచనలలోకి పారిపోతుంది. అప్పుడే యోగము సిద్ధిస్తుంది.
413
ఈ సుఖము కలగాలంటే, మనస్సులో ఏ విధమైన ప్రకృతి
యొక్క గుణముల దోషములు లేశమంత కూడా ఉండకూడదు. ఏ
విధమైన పుణ్య, పాపములు అనే కల్మషములు కూడా
ఉండకూడదు. ఆ స్థితిలో యోగి పరమాత్మతో ఐక్యమై, లీనమై,
మమేకమైపోతుంది.
414
ఈ విధమైన యోగమును ప్రయత్నము, సాధన చేస్తూ,
నిరంతరము మనస్సులో ప్రసన్నత నిలబెట్టు కున్న యోగికి
మనస్సులో ఏ విధమైన దోషములు, కల్మషములు లేకపోవుట వలన
417
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తా త్మా సర్వత్ర సమదర్శనః ॥ 29 ॥
419
అటువంటి సాధకుడికి నేను అతి దగ్గరలో, అతనిలోనే
ఉన్నట్లు అవుతుంది. అతడు నా దృష్టిలో ఏ విధమైన నాశనము,
దుఃఖము పొందడు.
420
వేదములు కూడా పరమాత్మ తత్త్వమును, స్వరూపమును
ఇది అని నిర్ణయాత్మకముగా చెప్పలేక “తత్” = అది (దూరములో
ఉన్న దానిని చెప్పినట్లు గా “అది” అని చెప్పాయి). అటువంటి
పరమాత్మను సాధకుడు పరిశుద్ధమైన మనస్సులో ఈ ప్రపంచములో
పరమాత్మ తప్ప ఇంకొకటి లేనేలేదు అనే భావముతో
స్థా పించుకున్నట్లయితే, పరమాత్మను తన హృదయములో (అతి
దగ్గరలో) స్పష్టముగా దర్శించి, పరమానంద అనుభవమును
పొందుతాడు. హృదయములో మరియు ఈ ప్రపంచమంతా
పరమాత్మ వ్యాపించి ఉన్నా, ఆ భావమును మనస్సులోకి తెచ్చుకోని
వ్యక్తికి, హృదయములో ఉన్నా, ఆ పరమాత్మ అనుభవము పొంగా
లేక, అతనికి పరమాత్మ లేనట్లే (ఎక్కడో దూరములో అవ్యక్తముగా
అది ఉన్నట్లే).
ఉదాహరణ:
422
స్వామిని చూడటమే (సర్వత్రా సమ దర్శనము) సరైన ధ్యానము,
ఉపాసన అని బోధించారు. అప్పుడు త్రివిక్రమయతి నృసింహ
సరస్వతి స్వామీ క్షమాపణ పొంది, ఆయన శిష్యుడై, ఆయన
ఉపదేశముల దారిలో యోగాభ్యాసము చేసుకొని, ఉత్తమ స్థితికి
పొందాడు.
423
కలిగిన తరువాత, ఆ, యా వస్తు వులను ప్రక్కకు తొలగించి, లేవని
భావించి, ఇంకేమీ చూడకుండా, నిరంతరము కేవలము పరమాత్మ
ఒక్కడినే దర్శించగల స్థితి పొందే వరకూ సాధన చేయాలి.
424
ఎవ్వరూ చూడట లేదు అని అనుకున్నారు. మరుసటి రోజు
గురువుగారి పాఠమునకు, శిష్యులు అందరూ కూర్చొన్నారు.
గురువుగారు నేను నిన్న ఇచ్చిన పండును ఎవ్వరూ చూడకుండా
తిన్నారా అని శిష్యులను అడిగారు. శిష్యులు, వాళ్ళు ఎలా,
ఎక్కడెక్కడ దాగి తిన్నది వివరముగా చెప్పి, మేము ఎవ్వరూ
చూడకుండానే తిన్నాము అని జవాబు చెప్పారు. అప్పుడు
గురువుగారు, నేను నిన్న మీకు చెప్పిన పాఠము, ఎవ్వరికీ అర్ధము
కాలేదు అని అన్నారు. శిష్యులకు అర్ధము కాక, నిన్నటి పాఠమునకు,
పండు తినటానికి సంబంధము ఏమిటి అని అడిగారు. అప్పుడు
గురువుగారు, పరమాత్మ చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నది అని
చెప్పాను కదా. అంటే అర్ధము ఏమిటి? చైతన్యము అంటే జ్ఞాన
స్వరూపుడు. అటువంటి జ్ఞాన స్వరూపుడు అంతటా వ్యాపించి
ఉండగా, మీరు ఎవ్వరూ చూడకుండా (అంటే పరమాత్మ కూడా
చూడకుండా) ఎలా తినగలిగారు. మీరు ఎవ్వరూ చూడకుండా
తిన్నాము అంటే, మీకు నిన్నటి పాఠము అర్ధము కాలేదు అనే
అర్ధము కదా అని గురువుగారు అన్నారు.
425
ఓ అర్జు నా I పరమాత్మ సమ దర్శనము కలగాలంటే, తనకు
తాను ఎంత సుఖముగా ఉండాలని, ఏ కష్టము, ఏ దుఃఖము
రాకూడని ఎలా కోరుకుంటాడో, అలాగే మనకు కనిపించే ప్రతి
మానవులని, ప్రతి పాణిని, ప్రతి జీవిని (ఏ ప్రాణీ మినహాయింపు
కాదు).
426
ప్రతి మానవుడికి ప్రదానమైన లక్ష్యము తత్త్వ జ్ఞానము
కలగాలని ఉండాలి. తత్త్వ జ్ఞానము కలగాలంటే, చిత్తవృత్తి నిరోధము
(మనస్సులో ఏ విధమైన ఆలోచనలు కలగకుండా, పరమాత్మ మీదే
మనస్సును కేంద్రీకరించుట) కలగాలి. చిత్తవృత్తి నిరోధన కలగాలంటే,
జన్మ, జన్మల నుండి మనమే సంపాదించుకున్న, మన మనస్సులో
సూక్ష్మ రూపములో పేరుకున్న చెడు వాసనలు క్షయము లేదా చెడు
సంస్కారములు నాశనము అవ్వాలి. మనలో చెడు వాసనలు లేదా
చెడు సంస్కారములు ఉన్నంత వరకు మనస్సులో రాగము,
ద్వేషముల అలజడి కలుగుతూనే ఉంటుంది. మనస్సులో ఈ
అలజడి ఉన్నంత వరకూ చిత్తవృత్తి నిరోధము కలగనేకలగదు.
చిత్తవృత్తి నిరోధము కలగకపోతే, పరమాత్మ తత్త్వ జ్ఞానము
పొందుటకు అర్హత కూడా కలగదు. ఈ చెడు వాసనలు లేదా
సంస్కారములను నాశనము చేసుకోవటానికి మంచి వాసనలు,
మంచి సంస్కారములు, సమతా భావన పెంచుకోవాలి. అప్పుడే రాగ,
ద్వేషములు పోయి, చెడు సంస్కారములు నాశనము లేదా చెడు
వాసనా క్షయము అయి, చిత్తవృత్తి నిరోధము కలిగి, మనస్సు
ప్రశాంత స్థితిని పొంది, పరమాత్మ తత్త్వ జ్ఞానము క్రమముగా సాధన
చేసుకోవాలి.
427
చెడు వాసనలు లేదా చెడు సంస్కారములు మూడు
రకములు – 1. లోక వాసన – నేను అందరికీ మంచిగా ఉండాలి,
నచ్చాలి అనే కోరిక. ఏ వ్యక్తి, ప్రతి వ్యక్తిని పరిపూర్ణముగా
సంతోషపరచలేడు. ఏ వ్యక్తి, అందరికీ అమోదకరముగా ఉండే
ఆస్కారము లేదు. ఏ వ్యక్తి అందరికీ నచ్చటము సాధ్యము కాదు.
ఈ లాంటి సాధారణ తెలివితో దీనిని పోగొట్టు కోవచ్చు. 2. శాస్త్ర
వాసన – ప్రతి శాస్త్రము, విజ్ఞానము నాకే అందాలి, నాకే తెలియాలి
అనే కోరిక. తత్త్వ జ్ఞానమును బోధించే శాస్త్రములు అభ్యసించి, చెడు
శాస్త్రములు వలన కలిగిన వాసనలు పోగొట్టు కోవాలి. 3. దేహ వాసన
– ఈ దేహము లేదా శరీరము నేను, ఈ దేహములో ఉండే అన్ని
చెడు గుణములు నావే, ఈ నా దేహము అన్ని సుఖములు
ఆనందించాలి, ఈ నా శరీరమునకు ఏ విధమైన కష్టము, దుఃఖము
కలగకూడదు అనే భావన (అహంకారము). ఇటువంటి భావనలను
పతంజలి యోగ శాస్త్రములో 1-33 చెప్పిన మైత్రి – అన్ని జీవుల మీద
స్నేహ భావన, కరుణ – అన్ని జీవుల మీద జాలి, దయ, ముదిత –
అన్ని జీవులతో మంచితనము, ఉపేక్ష – సర్వ జీవుల యందు
సమత్వ భావన (14-10, 14 శ్లోకములు) అనే సత్త్వ గుణములతో
సాధించుకోవచ్చును. “సర్వే భవంతు సుఖినః సర్వే సంతు
నిరామయాః l
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్” – ఈ
428
ప్రపంచములో ప్రతి ప్రాణి సుఖముగా ఉండాలి, ఈ ప్రపంచములో ఏ
జీవికి ఏ దోషములు, రోగములు ఉండకూడదు, అందరూ వారి, వారి
జీవితములలో ఉన్నత స్థా యికి ఎదగాలి, శుభ ఫలములు
అందుకోవాలి. ఈ ప్రపంచములో ఏ ప్రాణి దుఃఖము పొందకూడదు,
అనే లోక క్షేమ భావనతో ఈ దేహ వాసన పోగొట్టు కోవచ్చును.
ఉదాహరణ:
429
నిర్ణయము తీసుకున్నాడు. కాని జీవితము గడవటానికి కావలసిన
డబ్బు లేదు. కాబట్టి ఆఖరి సరిగా ఒక పెద్ద బ్యాంకులో, ఒక పెద్ద
దొంగతనము చేసి, ఆ డబ్బుతో జీవితమంతా గడిపేయవచ్చును అని
ఆలోచించి, ఒక మంచి ముహూర్తము కోసము ఒక జ్యోతిష్కుడు
దగ్గరకు వెళ్లి, తన బ్యాంకు దొంగతనము గురించి చెప్పి, మంచి
ముహూర్తము పెట్టమని అడిగాడు. జ్యోతిష్కుడు, అటువంటి
ముహూర్తము శాస్త్రములో లేవు, నేను పెట్టను అని అనగా, ఆ
జ్యోతిష్కుడికి 25% వాటా ఇస్తా ను అనే ఆశ చూపించి,
ముహూర్తము పెట్టమని బతిమలాడాడు. జ్యోతిష్కుడు మెత్తబడి,
ఏదో అమావాస్య అర్ధరాత్రి ముహూర్తము పెట్టా డు. తరువాత
బ్యాంకు సెక్యూరిటీ ఆఫీసరు మరియు ఆ బ్యాంకులో పనిచేసే
ఉద్యోగికి ఆ దొంగతనమునకు సహకరిస్తే ఒక్కొక్కరికి 25% వాటా
ఇస్తా ను అని చెప్పితే, మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్లకు
కూడా వాటా ఆశ చూపించి, మెల్లమెల్లగా నచ్చచెప్పి ఒప్పించాడు.
అనుకున్న ముహూర్తము, ప్లా ను ప్రకారము ఆ దొంగ, దొంగతనము
మొదలు పెట్టా డు. అప్పుడు ఆ దొంగకు ఇందులో మూడు వాటాలు
ఆ సహకరించిన వాళ్లకు ఇవ్వాలి, కాబట్టి తనకు మిగిలేది చాలా
తక్కువ, అందుచేత బ్యాంకులో ఉన్నదంతా దొంగిలించాలి అనే
దురాశతో అన్నీ వెతికి, వెతికి, బద్దల కొట్టి, మూటకట్టే సరికి తెల్లవారి
పోయింది. అప్పటికి పోలీసులు వచ్చి, ఆ దొంగను తరువాత ఆ
430
మిగిలిన ముగ్గురునీ కూడా పట్టు కొని బంధించి, కోర్టు లో కేసు
జరిగి, జడ్జిగారు ఆ నలుగురికీ సమానముగా జరిమానా మరియు
జైలు శిక్ష వేశారు.
అర్జు న ఉవాచ ।
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం ॥ 33 ॥
ఓ మధుసూదనుడా I నీవు రక రకాల యోగము
(చిత్తవృత్తి నివారణ, చిత్త శుద్ధి, మనో సామ్య స్థితి, ఈ సృష్టి
పరమాత్మ యొక్క రూపాంతరము, పరమాత్మ సర్వ, సమానత్వ
వ్యాపకత్వము మొదలైన విషయములు) ముఖ్యముగా
సమానత్వము గురించి విస్తా రముగా వివరించి చెప్పావు.
431
నీవు చెప్పినప్పుడు, ఆ విషయము ఒక్క క్షణ కాలము ఏదో
అర్థమైనట్లు అనిపిస్తోంది. కాని మరు క్షణములో ఆ భావన
మారిపోతోంది. నీవు చెప్పిన భావన మనస్సులో స్థిరముగా ఉండట
లేదు, కదిలిపోతోంది. ఎందుచేతనంటే మనస్సు నిరంతరము ఏవేవో,
ఎన్నెన్నో ఆలోచనలు కలుగుతూ, కదిలిపోతూ, చంచలముగా
ఉంటుంది.
432
యొక్క కారణము తెలుసుకొని, ఆ కారణమును సంహరించే
సామర్థ్యము కలవాడు.
శ్రీభగవానువాచ । అసంశయం
మహాబాహో మనో దుర్నిగ్రహం చలం ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 35 ॥
435
మాత్రము నిజము. జీవితములో ఏ లక్ష్యమును సాధించుకోవాలన్నా,
దృఢమైన సంకల్పము, నిర్ణయము తీసుకొని, నిరంతరము
అభ్యాసము చేసుకోవాలి. అదే విధముగా మనస్సును కూడా
నిగ్రహించుటకు, ప్రాపించక విషయముల మీద వైరాగ్యము
పెంచుకొని, నిరంతరము ప్రయత్నము, అభ్యాసము చేసుకోవాలి.
437
బలపడిన తరువాత, వాసనలు, సంస్కారములు – ఔత్సుక్యము,
తృష్ణ లేశ మాత్రము లేకుండా సంపూర్ణముగా నిర్మూలించుకున్న
తరువాత, మనస్సులో ఏ ఆలోచన, కోరిక పుట్టే అవకాశమే లేని
స్థితిని సంపూర్ణ పరమ వైరాగ్యము అంటారు. ఈ స్థితిలో మాయ
యొక్క మూడు గుణములు యొక్క ప్రభావము ఏ మాత్రము
ఉండదు. ఈ వైరాగ్యము కలిగిన తరువాతే తత్త్వ జ్ఞానము కలిగే
అర్హత కలుగుతుంది. 3-28 శ్లోకము చూడుము.
438
మనస్సులోని ఆలోచనలు నది నీటి ప్రవాహము లాగ
ఎలాగూ వేగముగా ప్రవహించే స్వభావము ఉంది. దానిని అలా
వదిలేస్తే ఆ నది నీరు సముద్రములోకి పారి వృధా అయిపోతున్నట్లు ,
మనస్సులోని ఆలోచనలు అలా వదిలేస్తే, జీవితము వృధా
అయిపోతుంది. నది నీరు సముద్రములోకి ప్రవహించకుండా
ఆనకట్ట వేసి, పంట పొలములలోకి తెచ్చుకొని అక్కడ ఆ నీటిని
పొలములలో ఆపుకొని, వ్యవసాయమునకు ఉపయోగించినట్లు ,
మానవుల మనస్సులోని ఆలోచనలు కోరికలు అనే చెడు మార్గము
వైపు ప్రవహించకుండా అటువైపు వైరాగ్యము అనే ఆనకట్ట వేసుకొని,
ఆ ఆలోచనలనే ప్రవాహమును మంచి మార్గము వైపుకు (పరమాత్మ
వైపుకు) ప్రవహించేలా చూసుకునే అభ్యాసము చేసుకొని, మానవుల
అంతిమ లక్ష్యము (పరమాత్మ తత్త్వ జ్ఞానము) దగ్గర ఆపుకునే
చిత్తవృత్తి నిరోధన సాధించుకొని, ఉత్తమ ఫలితములు
పొందవచ్చును.
439
ఏ ప్రయత్నము, సాధన చేయకుండా, బద్ధకముతో
ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకోలేని వ్యక్తికి యోగము
లభించదు.
ఉదాహరణ:
440
ఆదాయము ఉండదు. కాబట్టి, నేను మీ అమ్మాయిని వివాహము
చేసుకొని, ఉద్యోగము మానేసి, ఇంట్లోనే ఉంటూ, ఆ 50
ఎకరములతో వచ్చే ఆదాయముతో బతికితే, మీకు ఏమైనా
అభ్యంతరమా అని అడిగాడు. ఆ ఆసామి మాకు ఏ అభ్యంతరము
లేదు అని చెప్పాడు. పెళ్లి సంబందము కుదుర్చుకొని, బాగా
ఘనముగా వివాహము చేశాడు. ఆ పెళ్ళికొడుకు ఉద్యోగము
మానేసి, ఆ పల్లెటూరుకి మకాం మార్చి, పంచ, లాల్చీ కట్టు కొని,
పడక కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తు న్నాడు. 6 నెలలు, దాటింది.
ఏ ఆదాయము రాలేదు. 10 నెలలు దాటించి ఏ ఆదాయము
రాలేదు. మామగారిని పిలిపించి, మీరు చెప్పినది నమ్మి, ఉద్యోగము
మానేసి, ఇంట్లో కూర్చొన్నాను. 10 నెలలు దాటిపోయింది. మీరు
చెప్పినట్లు 50 ఎకరముల మంచి ఆదాయము వస్తుందన్నారు. నేను
ఆదాయము కొరకు ఇంట్లో కూర్చొన్నాను. ఇంతవరకూ ఏ
ఆదాయము రాలేదు. మీరు నన్ను మోసము చేశారు, అని ఫిర్యాదు
చేశాడు. మామగారు నీకు ఇచ్చినది మంచి మాగాణి భూమి.
వ్యవసాయము చేసుకుంటే మంచి ఆదాయము వస్తుంది అని
అన్నాడు. దానికి అల్లు డు తెల్లబోయి, వ్యవసాయము అంటే ఏమిటి,
వ్యవసాయము ఎలా చేస్తా రు అని అడిగాడు. మామగారు నాతో
పొలముకి రా నేను చూపిస్తా ను అని అల్లు డిని పొలముకి
తీసుకువెళ్లా డు. ఏడాది నుండి ఆ భూమిని దున్నక బీడు కట్టి
441
ఉంది. ఈ పొలమును దున్నాలి, కలుపు మొక్కలు తీసేయాలి, నీరు
పట్టా లి, నారు తెచ్చి ఊడ్చి (వరి మొక్కలు నాటాలి) ఇంకా, ఇంకా
ఏమేమి చేయాలో అంతా చెప్పాడు. వ్యవసాయము అంటే ఏమీ
తెలియని ఆ అల్లు డు, ఆ బీడు కట్టిన పొలమును చూసి ఇది క్రికెట్లు
పిచ్చిలా గట్టిగా ఉంది. దీనిని దున్నటమేమిటి, ఎలా దున్నుతారు,
కలుపు మొక్కలు ఏమిటి, నారు ఏమిటి, ఊడ్చుట ఏమిటి, పంట
అంటే ఏమిటి, పంట ఎలా పండుతుంది, అని ఎన్నెన్నో ప్రశ్నలు వేసి,
ఇది నాకు తెలియదు, నేను చేయలేను, మీరు నన్ను మోసము
చేశారు అని అన్నాడు. మామగారు నేను చెప్పినది నిజమే. ఎంత
గట్టిగా ఉన్న భూమి అయినా సరే, నీవు సరైన ప్రయత్నము చేసుకొని,
కష్టపడి దున్ని, నీరు పెట్టితే అది మెత్తబడుతుంది. నీవు నిరంతరము
ఈ వ్యవసాయము చేసుకునే పనులు చేసుకుంటూ కష్ట పడితే
తప్పకుండా మంచి పంట, ఫలితము లభిస్తుంది అని చెప్పాడు.
అర్జు న ఉవాచ ।
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 37 ॥
442
పూర్తిగా ఉన్నా, నీవు చెప్పిన తత్త్వ జ్ఞానము వరకు ఉండే ప్రతి
దశలోని ఇంద్రియ, మనస్సు నిగ్రహము, సమతా భావన మొదలైన
వాటిలో మనస్సుని యోగ స్థితిలో స్థిరముగా ఉంచలేక, మనస్సు
కదిలిపోయి
443
నా సందేహమునకు, ప్రశ్నకు ఒక కారణము, బీజము
ఉంది. ఇటు కర్మ మార్గము వదులుకొని, ఏ కర్మ ఫలితము లేక,
అటు జ్ఞాన మార్గములో ప్రయత్నము సరిపోక ఏ ఫలితము దక్కే
అవకాశము లేక ఉభయ మార్గములకు భ్రష్టు డు అయిపోతాడా?
444
అర్ధము, 3. కామము, 4. మోక్షము) ఇవ్వగలిగే సామర్ధ్యము
ఉన్నవాడివి.
ఉదాహరణ:
445
దక్కుతుంది అని జ్ఞాన మార్గము సాధన మొదలుపెట్టితే (భూరుగు
కాయ పెద్దదని, ఆ చిలుక దాని కోసము ఆశ పడినట్లు ) ఆ జ్ఞాన
మార్గము సాధన పూర్తి చేయలేక ఉభయ భ్రష్టు (రెండు వైపులా
నుండి నష్టము కలిగింది, ఎటూ కాకుండా పోయింది) అయితే ఆ
సాధకుడి పరిస్థితి ఏమిటి?
446
ఈ సంశయములోని ఏ చిన్న అంశము నాలో
మిగలకుండా నీవు తొలగించాలి శ్రీకృష్ణ భగవానుడా I
శ్రీభగవానువాచ ।
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి ॥ 40 ॥
447
ఆ సాధకుడు శాస్త్రీయమైన మార్గములోనే ఉన్నవాడికి,
మంచి పనులు చేసేవాడికి ఏ రకమైన దుర్గతి (నరకము, చెడు
ఫలితము) మాత్రము రాదు. వాళ్లకు అధోగతి ఉండదు అని
శాస్త్రములు (ఉపనిషత్తు లు) చెప్పుతున్నాయి. తాత = తండ్రి,
నాయనా (నాకు పుత్రు డితో సమానమైనవాడైన ఓ అర్జు నా).
448
ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత (ఈ దేహమును
చాలించిన తరువాత), అత్యుత్తమమైన పుణ్య లోకములు (అశ్వమేధ
యాగము చేసినవారు వెళ్ళే లోకములు) చేరి, అక్కడ చాలా
సంవత్సరములు (అక్కడే శాశ్వతముగా ఉంటాడా అన్నంత
కాలము) నివాసము ఉండి, అక్కడ సుఖములను అనుభవించి,
వాళ్ళ చేసుకున్న సాధన యోగ్యతను బట్టి, హిరణ్యగర్భ బ్రహ్మ
దేవుడు) లోకమునకు లేదా సత్య లోకము దాకా వెళ్లి, మరలా తిరిగి
జన్మ పొందవలసిన సమయము వచ్చినప్పుడు
449
వాసనలు ఉన్నవాడు, ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగే మంచి
మరియు సంపన్నుల కుటుంబములలో జన్మించి, ఒక వైపు ఆ
ఐశ్వర్యము, భోగములు అనుభవిస్తూ, తన భోగ వాసనలను
తీర్చుకుంటూ, రెండవ వైపు తన యోగ సాధన కూడా సాగిస్తూ
ఉంటాడు.
451
కొంతమంది చెడు స్నేహితులు ఆ మహారాజు దగ్గరకు చేరారు. ఆ
చెడు స్నేహితులు మహారాజు గమనించ లేకపోయాడు. ఆ
స్నేహితులు చెడు సావాసముతో, ప్రోత్సాహముతో సత్కర్మ
ఆచరణలు, యోగాభ్యాసము మానేసి, భోగ లాలసలు
అనుభవించటము మొదలుపెట్టా డు. ఒకరోజు ధర్మ కీర్తి మహారాజు
వేటకు అడవిలోకి వెళ్ళాడు. అడవిలో దారితప్పి, రాజభటులు
చెల్లా చెదరు అయిపోయి, అడవిలో ఏదీ దొరకక, ఆకలి, దప్పికలతో
బాగా అలసిపోయి సాయంత్ర సమయమునకు, ఒక నదీ తీరము
చేరాడు. ఆ దగ్గరలో ఒక ఋషి ఆశ్రమము ఉంది. ఆ రోజు ఏకాదశి
అయినందున, ఆ ఆశ్రమములో అందరూ పగలంతా ఉపవాసము
చేసి, రాత్రి జాగరణ చేయాలని దీపములు వెలిగించి, పరమాత్మ నామ
సంకీర్తన చేసుకుంటున్నారు. ఆ ఆశ్రమము వరకూ వెళ్ళే ఓపిక లేక,
ఆ నామ సంకీర్తన ఆ నదీ తీరము నుండే వింటూ ఉండగా,
క్రమముగా ఆ మహరాజులో ఒక ఆర్తి మొదలయింది - “నేను ఎలా
ఉండేవాడిని, ఎన్ని సత్కర్మలు, యోగ సాధన చేశాను, ఈ చెడు
స్నేహితుల సావాసముతో ఇప్పుడు ఎంత క్రిందకు స్థా యికి
దిగజారిపోయాను” అనే ఆలోచనలతో బాధ, పశ్చాత్తా పము
పడుతూ ఆ ఏకాదశి రోజున ఆహారము దొరకక ఉపవాసమే ఉండి,
ఆ ఋషులు చేస్తు న్న పరమాత్మ నామ సంకీర్తన వింటూ
ప్రాణములను విడిచిపెట్టా డు.
452
మరుసటి జన్మలో ఒక ఋషి కుమారుడిగా పుట్టా డు.
పుట్టిన వెంటనే ఆ శిశువుకి, తాను క్రితం జన్మలో ధర్మ కీర్తి మహారాజు
అని, ఆ జన్మలోని స్మృతులు అన్నీ జ్ఞాపకమునకు వచ్చి, అప్పుడే ఈ
జన్మని వ్యర్ధము చేసుకోకుండా, తన యోగ సాధన సిద్ధించే వరకూ
సాధన చేసుకోవాలి, గత జన్మలో చివరి క్షణములో తనకు
తెలియకుండానే చేసిన ఏకాదశి వ్రతమును శ్రద్ధగా పాటించాలని అనే
నిర్ణయము తీసుకొని, ఆ పిల్లవాడు పుట్టిన 11 వ రోజున ఏకాదశి
అయినందువలన, ఆ పిల్లవాడు ఆ రోజు పాలు కూడా తాగలేదు. ఆ
ఆశ్రమములో అందరూ మొదట్లో కంగారు పడినా, ఆ పిల్లవాడి తండ్రి
మహర్షి కాబట్టి, దివ్య దృష్టితో చూసి, ఈ పిల్లవాడి గత జన్మల
సంస్కారములు అన్నీ తెలుసుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగాక, ఆ
మహర్షి కుర్రవాడికి యోగ్యమైన గురువు దగ్గరకు పంపాడు. అతడి
పశ్చాత్తా పముతో, పూర్వ జన్మలో అతనిలో పెరిగిన భోగ లాలస
పూర్తిగా పోయి, సరైన యోగ సాధన చేసుకున్నాడు. ఆ తరువాత
జన్మలో అతను ఇంకా ఉత్తమ జన్మ అయిన మహర్షి జన్మని పొంది,
యోగాభ్యాసము చేసుకొని, తత్త్వ జ్ఞానము పొంది, సిద్ధిని
పొందాడు.
453
యోగ భ్రష్టు డు పూర్వ జన్మలో తన సాధన ఏ దశలో
ఆగిపోయింది, తరువాత జన్మలో ఆ దశ నుండి తన సాధన
కొనసాగించుకునే బుద్ధిని పొందుతాడు.
454
అమావాస్య చీకటి ఎంత దట్టముగా ఉన్నా,
సూర్యోదయము యొక్క మొదటి కిరణము పడగానే, అంత
దట్టమైన చీకటి పటాపంచలై, ప్రకాశము ఎలా వెదజల్లు తుందో,
అలాగే కుసంస్కారములు ఎంత కాలము ఉన్నా, పూర్వము
చేసుకున్న యోగాభ్యాసము ప్రభావముతో కుసంస్కారములు
పటాపంచలై, సన్మార్గము వైపు మళ్లించబడతాడు.
456
కృషి, పరిశోధన చేశాడు. అలా చేసి, చేసి చాలా సంవత్సరముల
తరువాత అనంతమైన కలన గణితము అనే ఒక సిద్దాంతమును
కనిపెట్టా డు. అతని పేరు జార్జ్ బర్కలీ. ఇందులో అతని పూర్వ జన్మ
సంస్కారము ఉన్నా, ఈ జన్మలో అతని ప్రయత్నము కూడా తోడైతే
లక్ష్యము తప్పకుండా సిద్ధిస్తుంది. వర్షపు బిందువులు కలిసి, కాలువ,
అది పారి తరువాత నది, అది పారి తరువాత సముద్రము
అయినట్లు , జన్మ జన్మల సాధన కలిసి జ్ఞాన సముద్రము అయి
సిద్ధిస్తుంది.
457
పరమాత్మ, అనిత్యము - ప్రపంచము) వస్తు వుల వివేకము, శమము
(కర్మేంద్రియముల నిగ్రహము, దమము (జ్ఞానేంద్రియముల
నిగ్రహము), మనో నిగ్రహము, తితీక్ష (ద్వంద్వములు – సుఖ
దుఃఖములు, లాభ నష్టములు, శీతోష్ణములు మొదలైనవి) సమ
స్థితి, ఉపరతి (అనవసరమైన విషయముల నుండి విరమణ,
వైరాగ్యము), జిజ్ఞాస – గురువును ఆశ్రయించి సత్యమును
(పరమాత్మను) తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ప్రకటించి,
అర్థించుట. 2. విచార – పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నము,
విచారణ. 3. తనుమానసి – పరిశుద్ధమైన మనస్సు. 4. సత్వాపత్తి –
పరమాత్మ తత్త్వ జ్ఞానము అనుభవము లోనికి వచ్చుట. 5. అసంసక్తి
– ప్రాపించక విషయములపైన, వస్తు వులపైన వైరాగ్యము. 6. పదార్థ
భావన – నిర్మలమైన, నిష్కళంకమైన సత్యము, ఆత్మానుభవము. 7.
తురీయము -సర్వోత్తమమైన, సర్వోత్కృష్టమైన వర్ణించలేని
పరమానంద అనుభవము.
458
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జు న॥46॥
459
నిష్కామ కర్మలు చేసే కంటె యోగాభ్యాసము చేసేవారు
ఉత్తములు.
460
భక్తితో నిరంతరము పరమాత్మనే ఎవరైతే సేవిస్తూ ఉంటాడో,
అటువంటి యోగ సాధకుడు ఉత్తమమైన యోగ సాధకుడు.
మంగళా శ్లోకములు
అధ క్షమా ప్రార్ధనా
అధ భగవత్ సమర్పణమ్
అధ లోకక్షేమ ప్రార్ధనా
462
కర్మ షట్కము అనే మొదటి ఆరు అధ్యాయముల సంగ్రహము
463
లేదని, స్థితప్రజ్ఞుడి లక్షణములను, ఆత్మ తత్త్వ జ్ఞానము పొందుటకు
ప్రధాన సాధనములను బోధించాడు.
464
పొందాలి అనే వంకతో, సాధారణ మానవులు కర్మ మార్గము
విడిచిపెట్టకూడదు. సత్కర్మ ఆచరణ ద్వారా పరమాత్మ తత్త్వ
జ్ఞానము ఎలా పొందాలో కూడా చెప్పాడు.
465
తరువాత ఏ రకమైన యోగాభ్యాసము చేసుకోవాలో వివరించాడు.
యోగాభ్యాసమునకు ప్రదేశము, ఆసనము, ఆహారము
నియమములు వివరించి, నిస్పృహ సర్వ కామేభ్యః – ఏ విధమైన
కోరికలు లేకుండా, మనస్సులో ఏ విధమైన మాలిన్యములు
లేకుండా పరిశుభ్రము చేసుకొని, ఏ విధమైన ఆలోచనలు,
అల్లకల్లోలములు లేకుండా ప్రశాంతత, నిశ్చల స్థితిని, ఏకాగ్రతను
సాధించటమే యోగము యొక్క లక్ష్యము. యోగ శాస్త్రములోని
అనేక రహస్యములను చెప్పి, మానస క్రియలను ఎలా
నిరోధించుకోవాలో వివరించాడు. ఆ ఏకాగ్రతను పరమాత్మ మీదే
కేంద్రీకరించి, పరమాత్మ తత్త్వ జ్ఞానము కొరకు సాధన చేసుకోవాలి.
466
ముఖ్యమైన శ్లోకములు
467
468