Professional Documents
Culture Documents
ప్రయాణం లో పదనిసలు
27 -10 -2008 -న నేను నా శ్రీమతి ప్రభావతి మూడవ సారి అమెరికా ట్రిప్ ముగించు కొని ఇండియా
బయల్దే రే రోజు మిచిగాన్ లోని స్టెర్లింగ్ హెఇఘ్త్స లో అమ్మాయి అవిజయలక్ష్మి ,అల్లు డు అవధాని
మనుమలు శ్రికేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ల తో ఆరు నెలలు కాల క్షేపం బాగా జరిగంి ది మూడు త్రిప్పులలో
మొత్త ం 1200 పైగా అన్ని రకాల పుస్త కాలు చదివాను 1200 పజీలకు పైగా నొతెస్ ను నా అనుభవాలను
రాసుకున్నాను ఈసారి ఇంకో కొత్త విష్యం .వుయ్యూరు నివాసి వుయ్యూరు ఏ సి .లిబరే కి భూరి విరాళం
ఇచ్చిన మైనేని గోపాల కృష్ణ గారి తో నిత్యం ఫో న్ లో సంభాషణ మెయిల్ లో పలకరింపులు ఆయన చాలా
మంచివి ఖరీదైన పుస్త కాలు నాకు పంపటం టం జరిగింది ఆయన అలబామా లోని హుంత్స్ విల్లి లో
వుంటారు అమ్రికాన్ యూనివెర్సిటీ లో లైబర
్ర ియన్ గా రిటైర్ అయి నలభై య్చిఏళ్ళ నుంచి . అక్కడే
వుంటున్నారు వీరిద్వారా సౌత్ కాలిఫో ర్నియా లో నలభై ఏళ్ళ కు పైగా వుంటున్నా వుయ్యూరు
వాస్త వ్యులు అంతర్జా తీయ ద్రవ్య నిధి లో ముప్ఫై అయిదేళ్లకు పైగా పనిచేసి ప్రపంచ లో గొప్ప ఆర్ధిక వేత్త
గా ప్రసిద్ధి చెందిన ఆరికే పూడి ప్రేమ చంద్ గారి తో పరిచయం కలిగింది వారి తో ఫో న్ లో మాట్లా డటం
వారు రచించిన వారి జీవిత చారితర పుస్త క మ్ on the fringes of the government గోపాల కృష్ణ
గారు నాకు పంపటము నేను వెంటనే చదివి ముప్ఫై పేజీలలో నా భావాలను వారిద్దరికిరాసి పంపటం
ఇద్ద రు నన్ను అభినందించటం నాకు చిరస్మరణీయం ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ప్రేమ చంద్
గారిని వుయ్యూరు ఆహ్వానించి decmber 21 న మైనేని గారి sponsorship తో ఘనం గా సంమానించటం
మరిచి పో నీ విషయం
ప్రయాణం తో ప్రా రంభించి శాఖ చంక్రమణం చేసానా?నా కోసం లాప్ తప ల్ర్దేర్ ఇచ్చాడు అల్లు డు
మొన్నే రావాల్సింది రాలేదు కాలు కాలిన పిల్లి లా తిరుగు తున్నాం ఇంకో పావుగంటకు ఎయిర్ పో ర్ట్ కు
బయల్దే రతామనగా పార్సెల్ వచ్చింది విజ్జి గబా గబా దాన్ని విప్పి మా సూట్ కేసు లో
సద్దింది టయోట లో బయల్దే రాం .ఒంటి గంటకు చేరాం .బాగ్గా గే ఇచ్చేసాం
.usairwaysflight సామాన్లు హైదరాబాద్ లో తీసుకోవాలి .sharlette కు అయిదింటికి చేరాం
.రాత్రి ఎనిమిదికి జర్మనీ లోని frankfurt కు ఫ్లైట్ .అది లేట్ అయింది కంగారు ఎక్కువైంది విజ్జి ఫో న్
చేస్తూ నే వుంది frankfurt నుంచి సరాసరి హైదరాబాద్ ఫ్లైట్ అందు తుందో లేదో భయం ఇంతవరకు
అన్ని సార్లు హాయిగా వెళ్లి వచ్చాం ,28 ఉదయం ఫ్రంకఫుర్ట్ చేరాం లుఫ్తా న్సా వాళ్ల కౌంటర్ కోసం
ఎవరిని అడిగి నా చెప్పటం లేదు హైదరాబాద్ ఫ్లైట్ టైం దగ్గ ర పడింది భయం ,కంగారు ఆందో ళన టు
ఎదురుగా వున్నవే కనిపించలేదు చివరికి నానా తిప్పలు పడి కౌంటర్ దగ్గ రకు ఇద్ద రం చేరాం .వాళ్ళను
అడిగితె అమెరికాన్ఫ్లిఘ్ట్ ఆలస్యమవటం వల్ల హైదరాబాద్ ఫ్లైట్ సమయానికే
వెళ్లి ందని వచ్చి రాని ఇంగ్లీష్ లో చెప్పారు మర్నాటి ఉదయం దాకా వెయిట్ చెయ్యాల్సిందే నని
అందరికి అలాగే టికెట్స్ మార్చి ఇచ్చామని కూర్చోమని చేఎవారు ఇంగ్లీష్ మాట్లా డారు అంతా జర్మనీ
లోనే మనకూ అది రాదు ఇంతలో మా అదృష్ట వశాత్తు ఇంగ్లిష్ వచ్చిన ఒకతను కనిపించాడు .మా బాధ
చెప్పాను ఇక్కడ ఉండలేమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ మని అడిగా .పాపం మంచివాడు లోపలి వెళ్లి
ఆఫీసుర్ల తో మాట్లా డి నా దగ్గ రకు వచ్చాడు .
మధ్యాహ్నం రెండింటికి ఏమిరతెస్ ఫ్లైట్ లో దుబాయి అక్కడినుంచి ఇంకో ఫ్లైట్ లో
హైదరాబాద్ పంపిస్తా ము వెళ్తా ర అని అడిగాడు మహద్భాగ్యం అన్నాను వెయిటింగ్ తప్పు తుంది తింది
బాధ వుండదు కాలక్షేపం అవుతుంది సరే నాన్నను వెంటనే alternate ఏర్పాట్లు
చేసి టికెట్స్ మార్చి ఏమిరతెస్ వాలను ఒప్పించి గొప్ప సాయం చేసాడు ఆ రోజు మంగళ వారం మా
ఆంజనేయ స్వామి అతని రూపం లో వచ్చాదేమోనని .అందరు మర్నాటి ఉదయం
దాకా ఉండాల్సి వస్తు ంటే మా ఇద్ద రికే యే ఏర్పాట్లు జరగటం మిరచ్లె అని పించింది మా అమ్మాయి విజ్జికి
చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు అతని సూచన మీద ఎనిమిది డాలర్ల యూరో కార్డు కొని అతని సలహా
మీద టెలిఫో న్ బాక్స్ దగ్గ రకు వెళ్లి అతనితో నెంబర్ కొట్టించి మాట్లా డను అది కంగారుపడి పో తోంది
ఏమయిందో నని హైదరా బాద్ మర్నాడు ఉదయం చేరతామని చెప్పా మననం .అతను మమ్మల్నిద్ద ర్నీ
ఏమిరాటే కౌంటర్ దగ్గ రకు చేర్చి వెళ్ళాడు ..రెండు గంటలకు ఫ్లైట్ బయల్దే రింది.చాలా విశాలం గా అన్ని
ఆధునిక సదుపాయాలతో వుంది పింక్ కలర్ డ్రెస్ లతో ఎయిర్ హో స్తేస్స్ చాల మర్యాదగా త్రేఅట్ చేసారు
భోజనం బాగుంది మిగత ఎయిర్ లైన్స్ కంటే ఇది వేలరెట్లు బాగుంది రాత్రి పదింటికి దుబాయి చేరాం
.అద్భుతం గా వుంది విమానాశ్రయం ఒక దో మే లాగ వుంది సిగరెట్టే తాగటానికి వేరుగా ప్రా ర్ధా న్ ఆ
చేసుకోవతైకి వేరుగా గదులు వున్నాయి క్కడ చుస్తొ ంస్ డ్యూటీ లేదు అంతా కోట్ల మే౩ద ఎగబడి
కావాల్సినవి కొనుక్కున్నారు బంగా రామ్ చవకట నేనేమి కొనలీడు కాకినాడకు చెందిన తెలుగ భార్య
భార్త కనిపించారు కబుర్ల తోసమయంగాదిచింది తెల్ల వారు jhaa మున మూడింటికి హైదరాబాద్ ఫ్లైట్
ఏకకము సీట్లు అన్నీ ఖాళీ దీపావళి రోజులు మన వాల్ ప్రయాణం చేయరత అందుకనే ఖాళీ లేకపో తె
రోజు విపరీతమైన రాద్దిత .ఏమిరాటే ఫ్లిఘ్త్స్ రెండిట్లో నూ హాయిగాముడేసి సీట్లలో పడుకొని ప్రయాణం
చేసాం .దుబాయి చూసే ఆవ కాసం frankfurt ఫ్లైట్ తప్పిపో వటం వల్ల తమాషా గాకుదిరింది మర్నాడు
ఉదయం ఎనిమిదిన్నరకు హైదరాబాద్ చేరాం లగ్గా గే మాతో వచ్చేసింది . customs లో ఇబ్బంది జరగా
లేదు పిల్లలంతా శంషాబాద్ ఐర్పం పాలి కారు అందరం మా రెండో అబ్బాయి వాళ్ళింటికి
మియాపూర్ వెళ్ళాం. . కొంచెం ఇబ్బంది పడ్డ కన్ని గంటల ఆలస్యం గా హఎరబడ్చేరతం మాకు తమాషాగా
,వింతగా వుంది .పనిలో పని దుబాయి శీనులం అయాము అన్న ఆనందం కల్గింది. మాతో పాటు మీరు
కూడా ప్రయాణం చేసి అలిసి పో యి వుంటారు విశ్రా ంతి తీసుకోండి .
11 -04 -12 అమెరికా ప్రయాణం
దాదాపు పది రోజుల తరువాత మిమ్మల్ని పల్కరిస్తు న్నాను .మేమిప్పుడు అమెరికా లో ఉన్నాం .నేను నా భార్య ఇద్దరం ఈ
నెల నాల్గ వ తేది రాత్రి ఉయ్యూరు లో బయల్దే రి అయిదు ఉదయం హైదరాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చేరాం
.మర్నాడు ఉదయం మా క్కయ్య ,బావ లను బో యినపల్లి లో వాళ్ళింట్లో కలిశాము .అంతకు ముందు మా కుటుంబ డాక్టర్ ఛి
యాజీ ని విజయ నగర్ కాలని లో క్లినిక్ లో కలిసి మామూలు హెల్త్ చెకప్ చేయిన్చుకోన్న్నాం .ఆ తర్వాత ,ఉయ్యూరు
గ్రా మస్తు లు ,ప్రతుత అమెరికా నివాసి ,35 ఏళ్ళకు పైగా ప్రపంచ బాంక్ లో అత్యున్నత స్తా యి లో పని చేసి ,రిటైర్ అయి ,ప్రతి
సంవత్సరం ఇండియా వస్తు ,జన్మ భూమి పై ఉన్న అభిమానాన్ని కాపాడు కొంటు ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త ్ర వేత్త శ్రీ
ఆరిక పూడి ప్రేమ్చంద్ గారిని దర్గా కు దగ్గ రలో ఉన్న విస్పర్ వాలీ లో ,ముందు అనుమతితో కలిసాము .నేను నా భార్య ,పెద్ద
కోడలు ,మనవడు భువన వారినీ వారి సతీమణి గారిని సందర్శించం .చాలా ఆదర పూర్వక స్వాగతం పలికారు .మేము
అమెరికా వెళ్తు న్న సంగతి అంతకు ముందే వారికి తెలియ జేశాను .వారు చాలా ఆనందించారు .ఒక అరగంట వారింట్లో గడిపి
,బాచుపల్లి లో ఉన్న మా రేదో అబ్బాయి శర్మ వాళ్ళింటికి వెళ్లి భోజనం చేశాం .సాయంత్రం వోల్డ్ బో యిన్ పల్లి లో ఉన్న మా
తొమ్మిది తెల్లవారు ఝామున నాలుగు గంటల కతార్ ఫ్లైట్ లో బయల్దే రి దో హా న్యూయార్క్ ల మీదుగా పదవ తేది మంగళ
వారం రాత్రి నార్త్ కరోలిన లో ని చార్లో ట్టే కు అంటే మా అమ్మాయి వాళ్ళింటికి రాత్రి తొమ్మిది గంటలకు కులాసా గా చేరాం
.ప్రయాణం హాయిగా జరిగింది .మా ఆవిడకు వీల్ చైర్ ఏర్పాటు ఉండబట్టి ,ఎక్కడి కక్కడ వేగం గా పనులు పూర్తి అయాయి
.చాలా శ్రద్ధ వహించారు అన్ని చోట్లా .వారందరికీ ప్రత్యెక ధన్య వాదాలు తెలియ జేయాల్సిందేమా ఆవిడ వి .సి .అయితె (వీల్
చైర్ )నేను వి.సి.కి ఫాలోయర్ అయాను ..ఎయిర్ పో ర్ట్ కు మా అమ్మాయివిజయ లక్ష్మి అల్లు డు అవధాని మనుమలు శ్రీ కెత్
,అసుతోష్ ,పియూష్ లు వచ్చారు ..రాత్రి నిద్ర బానే పో యాం ..ఇవ్వాళ ఇక్కడికి ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎళ్ళా
వెంకటేశ్వర రావు గారు వస్తు న్నారు .మా
అమ్మాయి గారింట్లో నే మధ్యాహ్న భోజనం .సాయంత్రం ఆరు గంటలకు పబ్లి క్ మీటింగ్ .రావటం తోనే మంచి కార్య క్రమం తో
ఇక్కడి జీవితం పారంభం అవుతున్నందుకు ఆనందం గా ఉంది .మన సరస భారతి ఇక నుంచి రోజూ మిమ్మల్ని పలకరిస్తూ నే
ఉంటుంది .
నిన్న అంటే పన్నెండో తారీకు నుంచి ఉదయం స్నానం చేసిన తరువాత సంధ్యా వందనం ,పూజా ప్రా రంభించాను
.మొన్న బుధ వారం రాత్రి షార్లెట్ లో ''ఎల్లా ''వారి స్టా ర్ నైట్ గురించి రాశాను .షార్లెట్ లోని భారతీయులంతా షార్ప్ గ
ఉన్నారన్న భావం కనిపించింది .ఏళ్ళ వారు ఆ రోజూ స్టా ర్ ఆఫ్ attraaction గా నిలిచారు.
ఇవాళ ఉదయం పూజా కార్య క్రమం పూర్తి అయిన తరువాత .ఇక్కడ విజ్జి స్నేహితురాలు శ్రీ మతి ప్రియా అనే అమ్మాయి
ఇంటికి వచ్చింది .ఆమెది గుంటూరు అని భర్త వెంకట్ ది నెల్లూ ర్ ఆని ,వారిద్దరూ ఒక ఇల్లు ఇక్కడే కట్టిస్తు న్నామని మే నెలలో
దాన్ని బిల్డ ర్ స్వాధీనం చేస్తా డని ,గృహ ప్రవేశానికి ముహూర్త ం చూడ మని కోరింది .ఇద్దరి నక్షత్రా లను బట్టి ఈ నెల 16 సో మ
వారం ,25 బుధ వారం రెండు ముహూర్తా లు బాగా ఉన్నాయని చెప్పాను .మళ్ళీ జూన్ పది హీను తర్వాత కాని ముహూర్తా లు
లేవని తెలియ జేశాను .ఈ రెంటి లో ఏది వీలయితే ఆ రోజూ పాలు పొ ంగించమని సలహా చెప్పాను .సంతోషం గా ఆమె వెళ్ళింది
నేను ఉయ్యూరు నుంచి ఇక్కడికి బయల్దే రే ముందు వారం తెలుగు విద్యార్ధి మాస పత్రిక సంపాదకులు ,నాకు
ఆప్తు లు స్నేహితులు శ్రీ కొల్లూ రి కోటేశ్వర రావు గారు ఫో న్ చేసి ,కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ పంపిస్తు న్నానని వాటిని తెలుగు లోకి
అనువాదం చేసి పంపమని కోరారు .దానికి సమాధానం గా నేను అమెరికా వెళ్తు న్నానని వీలుని బట్టి అక్కడికి తీసుకొని వెళ్లి
చేసి మెయిల్ చేస్తా నని చెప్పాను .టెక్ యువర్ వోన్ టైం అన్నారాయన .అంతకు ముందే విజయ వాడ ఆకాశ వాణి డైరెక్టర్ శ్రీ
మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నేను రాసిన ''దర్శ నీయ దేవాలయాలు ''పుస్త కం చదివి వెంటనే ఫో న్ చేసి అందులో కృష్ణా
జిల్లా దేవాలయాలా గురించి అర్జెంట్ గా అయిదారు రోజుల్లో పు రాసి పంపమని కోరారు .వెంటనే మొదలు పెట్టి మూడు రోజుల్లో
దాన్ని మార్చ్ 31 శుక్రవారం ఉదయం 07 -15 నిమిషాలకు ఏప్రిల్ 06 శుక్రవారం ,ఏప్రిల్ 13 శుక్రవారం ప్రసారం చేశారు
.అలాగే ఏప్రిల్ ఒకటి శ్రీ రామ నవమి నాడు శ్రీ సువర్చలాంజ నేయా దేవాలయం లో సీతా రామ కళ్యాణ మహో త్సవం
సమయం లో నేను రాసిన ''శ్రీ హనుమత్ కధా నిధి ''పుస్త కాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు ఇది వరకే తెలియ జేశాను .ఆ
పుస్త కం చదివిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు వెంటనే ఫో న్ చేసి ''హనుమజ్జయంతి -విశేషాలు ''అనే వ్యాసం నేను అమెరికా వెళ్ళే
లోపు రాసి పంపించమని ఆదేస్శించారు .అంతే ఏప్రిల్ మూడు మంగళ వారం తెల్ల వారు జామున మూడున్నరకు లేచి
రాయటం మొదలు పెట్టి అయిదు గంటలకు పూర్తి చేసి నాల్గ వ తేది ఉయ్యూరు నుంచి హైదరా బాద్ బయల్దే రే రోజూ కొరియర్
లో పంపాను .అందుకని అసలేమీ సమయం చాలక కొల్లూ రి వారి అనువాదం జోలికి వెళ్ళ లేక పో యాను .ఈ రోజూ
సాయంత్రం కూర్చుని ఆయన పంపిన 16 పేజీలలో రెండు పేజీలు అనువదించి మెయిల్ చేశాను .ఇదీ ఈనాటి కార్య క్రమం.
విజ్జి వాళ్ళింటికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు జరుగు తోంది .ఎదురు గా రెండు ఇల్లు శర వేగం గా
తయారవ్సుతున్నాయి .అంతా చెక్కలతో నేగా .చాలా తేలిక .ఇక్కడి పని వాళ్ళు మెక్సికో వాళ్ళు .ఇల్లు చూడటానికి వెడితే
ఒకతను ''నమస్తే ''అన్నాడు .ఏదేశం అని అడిగితె మెక్సికో అని చెప్పి వాళ్ళు నేపాల్ దేశం నుంచి వలస వచ్చి నట్లు
చెప్పాడు .పనిలో ఎక్కడా అలసత్వసం కని పించలేదు .ఎవరి పని వాళ్ళు చేసుకొని పో తున్నారు .
ఉదయం ఆరు గంటలకే లేచి పూ జాదికాలు పూర్తి చేసి టిఫిన్ తిని అందరం కార్ లో ఎనిమిదింటికి ఇక్కడికి రెండు
గంటల ప్రయాణ దూరం లో barligtan రోడ్లో ఉన్న ''గ్రీన్ బరో ''కు బయల్దే రాం ఒక గంట ప్రయాణం తరువాత బందరు కు
చెందిన అడుసు మిల్లి రామ కృష్ణ ,ఉషా కుటుంబం తో కలిసి ఐ హో ప్ హో టల్ దగ్గ ర ఆగి కాఫీ తాగి విజ్జి తెచ్చిన ఇడ్లీలు వాళ్లకు
పెట్టా ం. గ్రీన్స్ బరో అనే చోట దేవాలయం ఉంది అక్కడ రాదా కృష్ణ ,రామ పరివారం ఆంజనేయ స్వామి బాలాజీ అందారు
దేవుళ్ళు ఉన్నారు ఇవాళ తమిళ ఉగాది సందర్భం గా అక్కడ షార్లెట్ సాయి భజన సమాజం లోని అయిదు కుటుంబాల
వారిని ఆహ్వానించారు .అందు లో మేము ఉన్నాం .పదిన్నరకు స్వామి రాజేంద్రన్ కార్య క్రమ వివ రాలను తెలియ జేశారు
.అందరు కలిసి తామిలా నూతన సంవత్స రాదిని జరుపు కోవాలని ఈ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు .నాద ప్రియుడు భజన
ప్రియుడు భగ వంతుడని నాదో పాసన కు మించింది లేదని ,త్యాగయ్య అన్నమయ్య ,పురందర దాసు మీరా మొదలైన
వారంతా దీనితోనే తరించారని చెప్పారు షార్లెట్ లోని సుబ్బు అధ్యక్షత లో ఉన్న భక్త బృందాన్ని ఆహ్వానించామని వారు నామ
సంకీర్తనతో మనల్ని తన్మయులను చేస్తా రని అన్నారు సరిగ్గా పద కొందు గంటలకు భజన ప్రా రంభ మైంది అంతా యువకులే
ముప్ఫై మంది మహిళలు నలభై మంది పురుషులు పది మంది పిల్లలు హాజ రైనారు .డో లక్ మద్దెల హార్మని తప్పెట లతో
భజన చాలా హాయిగా సాగింది మా అమ్మాయి విజ్జి ,ఉషా ,సౌమ్య ,చిన్న పిల్లలు సాయి సహానా ,ఆనుషా వగైరా అందరు
అద్భుత మైన గానం తో మై మర పించేట్లు భజన చేశారు అన్ని భాషల పాటలు పాడారు పిబరే రామ రసం ,''భక్త జన వాత్సల్
;;శంకరా చార్య స్తో త్రా లు అన్నీ కమ్మ గా పాడారు .వాయిద్యాల వాళ్ళు శ్రు తి మధురం గా వాయించి వన్నె తెచ్చ్చారు .సుబ్బు
షార్లెట్ సాయి భజన మండలి అధ్యక్షుడు ఏ.రవి బి రవి .సత్యనారాయణ ,సత్య గోపాల్ ,సుబ్బు భక్తీ రసాన్ని ప్రవహింప జేశారు
.భజన తో అందరు తన్మయులయారు .అందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే అందరు సాయి భక్తు లే .నాకు అని పించింది అమెరికా
లోని భారతీయులందరి హృదయాల్లో సత్య సాయి ,షిర్డీ సాయి నెలకొని నడి పిస్తు న్నారేమో నని .సంస్కృతీ ప్రవాహం
అవిచ్చిన్నం గా ఇక్కడ ప్రవహిస్తు న్నందుకు పర మానందం గా ఉంది .వార సత్వాన్ని తరువాతి తరాలకు అంద జేస్తు న్నారు
.రెండు గంటల పాటు నాదో పాసన సాగింది .ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అన్ని వయసుల వారు ఉండటం విశేషం
ఇండియా నుంచి ఒక పూజారిని సెలెక్ట్ చేసి ఈ రోజే ఆయనకు బాధ్యతలు అప్పగించారు .ముప్ఫై అయిదేల్లు ండ
వచ్చు హైదరా బాద్ కు చెందిన వాడు భువన గిరి మురళీ కృష్ణ శర్మ .ప్రస్తు తం ఒక్కడే వచ్చాడు .తరువాత భార్య పిల్లలు
వస్తా రట .పడ మూడు మంది అప్ప్లై చేస్తే అన్ని స్క్రీనింగులు అయి ఇతన్ని సెలెక్ట్ చేసింది కమిటీ .అంటే నియామకం అంత
పకడ్బందీ గా జరిగిందన్న మాట .అతను కుర్తా ళం పీఠాది పతి పూర్వాశ్రమం లో ప్రసాద రాయ కుల పతి గారి శిష్యుడు .వేదం
చదివి అధ్యాపనం చెప్ప గల సమర్ధు డు .అన్ని వైదిక కార్య క్రమాలు నిర్వ హించ గలడు విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ట హో మాలు
యజ్ఞా లు యాగాలు నిర్వ హించ గలడు నాలుగైదు భాషల్లో ప్రా వీణ్యం ఉంది .భక్తీ చానెల్ లో ''నోములు -వ్రతాలు ''శీర్షిక ను
నిర్వ హించి నంది బహు మతి పొ ందాడట .అలంకార బ్రహ్మ ,మహాదా చార్య బిరుదు లు పొ ందిన వాడు .ఉపనయనం
వివాహాది కార్య క్రమాలను నిర్వ హించ గలడు అంటే సర్వ సమర్దు డినే పూజారిగ్స నియమించారన్న మాట .పూజారిని
ఆ తర్వాత హారతి ప్రసాద విని యోగం .అందరికి పులిహో ర చక్ర పొ ంగలి ,రవ్వ కేసరి ,పెరుగు వడ ,చేర్ర్రి పండ్ల ముక్కలు
,ఆపిల్స్ ఆరంజ్ చపాతి, కూర ,మజ్జిగ ,పానకం ప్రసాదం గా తిన్నంత పెట్టా రు .అందరు తృప్తిగా తిన్నారు .అక్కడే ఉయ్యూరు
లో కోట శ్రీ రామ మూర్తి గారి కుమారుడు ప్రభాకర్ అన్న భార్యకు మేనల్లు డు ,భార్య పరిచయ మయారు వాళ్ళ ఇంటి పేరు
భాగవతుల వారు .కూచి పూడి నివాసులు ఇలా యాదృచ్చికం గా కలవటం భలే తమాషా గా ఉంది
స్వామి రాజేంద్రన్ గారు ఉగాది సందర్భం గా షార్లెట్ నుంచి వచ్చిన కుటుంబాలను వారింటికి ఆహ్వానించారు
దంపతులు చాలా మంచివారు .ఆయన అక్కడ సాయి సమాజానికి అధ్యక్షులె కాదు ఆలయ నిర్వాహకులు కూడా .వారింట్లో
నిలువెత్తు సత్య సాయి ఫో టో ఉంది .సుబ్బు బృందం కొంత సేపు మళ్ళీ భజన చేశారు మా మనుమడు శ్రీ కేత్ కూడా ఒక
భజన గీతం పాడాడు .అందరికి కాఫీ టీ బిస్కట్లు ఇచ్చారు అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దే రి
ఇంటికి రాగానే మొబైల్ వాన్ లో ఫర్నిచర్ అమ్మటానికి వచ్చారు మంచం వగైరా ఐదింటిని 1500 డాలర్లు పెట్టి
వెళ్ళే టప్పుడు దారిలో ఒక పెద్ద వాన్ మీద ''UNITED HOUSE OF PRAYER FOR ALL PEOPLE ''అని రాసి ఉన్న
దాన్ని చూశాం .వారి విశాల దృక్పధానికి జోహార్ అని పించింది .అదేమిటో నాకు తేలీ లేదు కాని వారి భావన నచ్చింది .
ఉదయం ఆరు గంటలకే మెలకువ వచ్చి లేచి ప్రముఖ కధకులు ,విమర్శ్శకులు ,పడ చిత్ర రామాయణ కర్త అయిన
శ్రీ విహారి గారి ''అయోధ్యా కాండం ''పుస్త కం చదవటం మొదలు పెట్టా ను .దీనికో ఫ్లా ష్ బాక్ ఉంది .సుమారు నాలుగైదేళ్ళ
కిందట ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో శ్రీ విహారి రాసిన పద చిత్ర రామాయణం లోని సుందర కాండ ను
పరిచయం చేసే కార్య క్రమం జరిపాం .దాని స్పాన్సర్ శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారు .శ్రీ మాది రాజు రామ లింగేశ్వర రావు
గారు పుస్త కాన్ని పరిచయం చేసి అందులోని విశేషాలను వివ రించారు .పూర్ణ చంద్ ,శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ వంటి
ప్రముఖులు హాజ రైనారు .అప్పుడు నేను కూడా అందులోని సొ గసుల్ని గురించి చెప్పాను .ఆ తర్వాత హైదరా బాద్ నుండి
విహారి గారు ఫో న్ చేసి నేను చెప్పిన విష యాలు ఎవరు చెప్పనివని దాన్ని ఒక వ్యాసం లాగా రాసి పంపమని కోరారు .అలానే
రాసి పంపాను .దాన్ని ''బాల కాండ ''లో ప్రచురించారు .ఆ పుస్త కం నాకు పంపారు .దాన్ని చదివి నేను ''బాల కాండ పద
చిత్రా లలో -పలు విచిత్రా లు ''అన్న శీర్షిక తో నా స్పందన రాసి ఆయనకు పంపాను .ఆ తర్వాత ఎప్పుడో విజయ వాడ లో ఒక
సభ లో కలిసి నేను రాసినది చాలా అద్భుతం గా ఉందని దాన్నంతటిని ఒక్క అక్షరం కూడా వదిలి పెట్టకుండా ''అయోధ్య
కాండ''లో ప్రచురిస్తు న్నానని చెప్పి ఆ పుస్త కం ఆవిష్కరణ తర్వాత నాకు నాలు గు నెలల కిందట పంపారు .చదవటం కుదర
లేదు నిజంగా నే నేను రాసింది అక్షరం కూడా వదల కుండా అందులో వేసి ,అన్న మాట నిలుపు కొన్నారు విహారి .దాన్ని
ఇక్కడికి తెచ్చుకొన్నాను చదువుకోవటానికి .అదే ఇవాళ మొదలు పెట్టా ను .కధ అందరికి తెలిసిందే అయినా విహారి చెప్పిన
తీరు ప్రయోగించిన జాతీయాలు ఆవిష్కరించిన భావాలు మనసు ను పట్టేస్తా యి భిన్న ఛందస్సు లను వాడి అర్ధ పుష్టి
స్నానం సంధ్య ,పూజ తర్వాత ప్రభావతి తప్ప మేమందరం ఒక పావు గంట ప్రయాణ దూరం లో ఉన్న సాయి సెంటర్ కు
వెళ్లా ం .ప్రతి ఆది వారం ఇక్కడ సాయి భక్తు లూదయమ్ పది నుండి పన్నెండు వరకు కలిసి సత్సంగ్ భజన నిర్వ హిస్తా రు
.ఇరవై మంది ఆడ వారు ,పదిహేను మంది మగ వారు ,పది మంది పిల్లలు వచ్చారు .పిల్లలకు నీతి బో ధ క్లా స్ ఉంటుంది ఒక
గంట సేపు .పది నుండి పద కొండు గంటల వరకు సత్సంగ్ జరిగింది .పిల్లల్ని పెంచటం లో ఇబ్బడులు వాటిని అదిగా మించే
మార్గా లు సత్య సాయి ఈ విషయం లో చేసిన మార్గ నిర్దేశకాల గురించి అందరు తమ మనసు లోని ఆటలను తెలుపు
కొన్నారు సుబ్బు మానిటరింగ్ చేశాడు .నిలు వెట్టు సత్య సాయి ఫో టో ,దాని ప్రక్కన కుర్చీలో సత్య సాయి ధరించే కాషాయ
చొక్కా ఒక కుర్చీలో ఏర్పాటు చేశారు .ఫో టో కు ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ ,దాని పై గులాబి పూలు ఆయన రాక కోసం
అన్నట్లు గా ఏర్పాటు చేశారు .ఒక పెద్ద స్క్రీన్ మీద సాయి సూక్తు లు ,ఫో టో ను కంప్యుటర్ ద్వారా చూపించారు .
పద కొండు నుంచి పన్నెండు వరకు సుబ్బు బృందం భజన కార్య క్రమం నిర్వ హించారు .అందరు తలో గీతం పాడి
భజన అన్ని భాషల్లో ను చేశారు .ఆ తర్వాత హారతి .విభూతి ప్రసాదం .పుష్ప అనే ఒకావిడ తన ఇంటిలో కింది భాగాన్ని
సత్సాన్గా నికి ఇచ్చింది .ఇక్కడే ప్రతి వారం సమా వేశాలు జరుగు తాయి .ఇక్కడే ఉయ్యూరు లో నా గురువు గారు
తారు వాత బెల్లంకొండ ఉషా రవి వాళ్ల అమ్మాయి పుట్టిన రోజూ పండుగకు అందరం అంటే భక్త బృందం లో ఒక
పాతిక మందిమి వెళ్లా ం .వెళ్ళే తప్పటికే ఒంటి గంట దాటింది .కమ్మటి భోజనం తయారు చేసింది ఉష .పూరి కూర చాలా
బాగున్నాయి .మినప సున్ని ఉండలు ,కిచిడీ అన్నం ,పెరుగన్నం ,మినీ ఆవడ ,కోకా ఐస్
పెట్టా రు .పిల్ల లందరికి తలో అయిదు ఫ్దా లర్ల గిఫ్ట్ కార్డు లిచ్చారు రవి ఉషా దంపతులు .పవన్ భార్య రాధ పిల్లలు కూడా
వచ్చారు .అడుసు మిల్లి అతను ''అంకుల్ ఎలా కాలక్షేపం చేస్తు న్నారు ?''అని అడిగితె ,వివరం గా చెబితే నోరు వెళ్ళ బెట్టా డు
.ఇంటికి వచ్చే సరికి నాలుగున్నర అయింది రవి వాళ్ళున్న ఏరియా ను కాన్కార్డ్ అంటారట .అమెరికా లో ఏ ఊరు అయినా
,ఏ ప్రదేశం అయినా ఒక్కటే .అన్నీ ఒకటి లానే దాదాపు గా ఉంటాయి .ఇళ్ళు అన్నీ ఒకటిగా ఉన్నట్లే .మొత్త ం మీద అందరం
తరచుగా కలుస్తు న్నండుకుపరిచయాలు పెరుగు తున్నందుకు హాయిగా ఉంది సాయంత్రం శ్రీకేత్ కు తెలుగు tution పవన్
వాళ్ల ఇంటి దగ్గ ర ఉంటె విజ్జి వాళ్ళమ్మను కూడా తీసుకొని వెళ్ళింది .వీళ్ళింటికి నడి ఛి వెళ్ళేంత దగ్గిరే .అరవై మంది పిల్లలకు
తెలుగు నేర్పుతున్నారు రాదా ,ఇంకో అమ్మాయి కలిసి .మంచి పని చేస్తు న్నందుకు అభి నందనలు .
మాధవికి ,మైనేని గారికి మెయిల్ రాశాను .విజ్జి ,వేద వల్లి కొడుకు హరి కి ఫో న్ చేసి మాట్లా డింది .వాడికి ఉన్న
చోటు నుండి traansfer అయిందట .కొత్త చోటు లో త్వరలో చేరుతాడట .అక్కడికి వెళ్ళే లోపు వాళ్ల అమ్మ మాతో పంపిన
మేము ఇక్కడికి వచ్చి పది రోజులు దాటింది .రోజూ ఎక్కడో ఒకరింట్లో సాయి భజన ,ఆహ్వానం
అందు కొంటున్నాం . .వెళ్లి వస్తు న్నాం .రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు .భక్తీ ,శ్రద్ధలతో ఇక్కడి భక్తు లు నిర్వ
హించటం ఆసక్తి కరం గా ఉంది .చిన్న పిల్లల తో సహా యువకులు ,వృద్ధు లు పాల్గొ నట మే కాదు, పాడుతూ తమ భక్తీ
కమ్యూనిటి సెంటర్ ''లో షార్లెట్ సాయి సేవా సంఘం వారు గ్రీన్ బరో మొదలైన ప్రా ంతాలలో ఉన్న మిగిలిన సాయి సెంటర్
వాళ్ళను అందర్నీ ఆహ్వానించి ఉదయం పది గంటల నుండి రాత్రి ఏడు వరకు ఒక కార్య క్రమాన్ని నిర్వ హించారు .దాదాపు
నూట యాభై మంది హాజ రైన పెద్ద సమా వేశం .ఉదయం అందరికి టిఫిన్, కాఫీ ఇచ్చారు .పది గంటలకు సభ ప్రా రంభ మైంది
''.టెడ్ హెన్రి '' ఫ్లా రిడా కు చెందిన అమెరికన్ సాయి భక్తు డు. సత్య సాయి తో తనకున్న పరిచయం ,అనుభవాలను గురించి
సుమారు ముప్పావు గంట మాట్లా డారు .ఆయన మొన్న సత్యా వాళ్ళింట్లో పరిచయం అయారు .సుమారు
అరవై ఏళ్ళుంటాయి .మంచి పర్స నాలిటి . ఆ తర్వాత కాలి ఫో ర్నియ కు చెందిన శ్రీ మతి సీమా మిల్ల ర్ .ఆ తరువాత శ్రీ సునీల్
కస్తూ రి తమ అనుభవాలను వర్ణించారు .వీరందరూ సాయి తో ప్రత్యక్ష పరిచయం ఉంది ఆయన అభిమానాన్ని పొ ందిన వారే
.కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు అయింది .అప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు .పొ ంగల్ తో లంచ్ .
మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ సమా వేశం ప్రా రంభం .చిన్న పిల్లలు సత్య సాయి, మదర్ తెరెసా ,కబీర్,
ఉండేదని పించింది .ఇక్కడఅవగాహనా లోపం కని పించింది .
మూడు గంటల నుంచి మళ్ళీ మిల్ల ర్ ,కస్తూ రి ల అనుభవ సందేశాలు .ఆ తర్వాత టీ బ్రేక్ .అయిదింటి నుంచి
వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన సాయి కేంద్రా ల వారు ఆలాపించిన భజనల తో ఆధ్యాత్మిక వాతా వరణాన్ని కల్గించారు .
దీనికి ముందు అతిదులైన టెడ్ ,మిల్ల ర్ .కస్తూ రి లకు జ్ఞా పికలు అందించారు .రేవతీ రామ చంద్రన్ గారి అమ్మాయి కి ,ఇంకొక
అతను సైన్సు లో అవార్డ్ పొ ందినందుకు సత్యా వాళ్ళిద్దరిని పరిచయం చేసి జ్ఞా పికలను అంద జేశారు .వారిద్దరూ తమ కృషిని
రాత్రి ఏడు గంటలకు డిన్నర్ .చపాతి ,రెండు కూరలు ,వెజిటబుల్ బిర్యాని ,పెరుగన్నం ,సేమ్యా పాయసం .తో విందు
సుష్టు గా ఉంది .మా అమ్మాయి విజ్జి ,రాధ .సీతా, ఉషా ,మొదలైన వారంతా ఇంత మన్దికీ ఇన్ని రకాల అయిటంస్ ఇంటి
దగ్గ ర తయారు చేసి తీసుకొని వచ్చి ఆప్యాయం గా వడ్డించి అతిధి మర్యాదలు చేశారు .నాన్ స్టా ప్ గా కాఫీ ,తేనీరు అందిస్తూ నే
ఉన్నారు .పిల్లలకు బిస్కట్లు .పీజా బర్గ ర్లు పెడు తూనే ఉన్నారు .భజన బృందం లో సత్య గొప్ప హార్మని విద్వాంసుడు .ఇంకో
సత్య మంచి తబలా వాద్య కారుడు .కంజీర రవి బాగా వాయిస్తా డు .డాక్టర్ సదా శివ గారబ్బాయి పియానో కళా కారుడు
.వీరందరినీ సమీకరించి నిర్వహణ చేయటం లో సుబ్బ రాజ్ కృత క్రు త్యుడయారు .ఈ భజన బృందం మంచి
నాకు అని పించిన విషయాలు --ఒక హాలిడే రిసార్ట్ కు వచ్చిన భావం కలిగించేట్లు ంది .కాని ఒక ఆధ్యాత్మిక
కేంద్రా నికి వచ్చిన అనుభూతి కల్గించ లేక పో యారు .ఏ సమయం లో పడితే ఆసమయం లో కాఫీ టిఫిన్ తింటున్డ టం
సమావేశానికి ఇబ్బంది కరం అని పించింది . బహుశా ఇక్కడి పధ్ధతి ఇంతే నేమో ? కాని ఇళ్ళ దగ్గ ర ఎవరు ఇలా చేయటం
నాకు ఈ పది రోజుల్లో నూ కని పించలేదు .నిర్ణీత సమయం లోనే వాటిని అంద జేయాలి .లేక పొ తే అనుకున్న ఫలం రాదు
.పిల్లలను ప్రభావితం చేసే అంశాలతో వారిని ఆకర్షించే ,వారి జీవితాలను ప్రభావితం చేసే విధానం గా కార్య క్రమాలున్డా లి
.మంచి కధలను మానిటర్ ద్వారాతెలియ జేయాలి .వాళ్ళు నేర్చుకోన్నని ప్రదర్శించే వీలు కల్పించాలి .అలాగే అవధాని రావణ
భుజంగ స్తో త్రం, నమక చమకాలు, ఉపనిషత్తు లు స్వయం గా నేర్చు కొంటున్నాడు .ప్రో త్సాహకరం గా వారినిసభకు పరిచయం
చేయాలి .ఇంకేదైనా విద్యలో ప్రా వీణ్యం ఉన్న వారిని పరిచయం చేయాలి .ఉపన్యాసాలు సుదీర్ఘం అని పించ కుండా జాగ్రత్త
పడుతూ మధ్య మధ్యలో బాగా పాడే వారితో మంచి పాటలను పాడిస్తే ఇంకా బాగా కార్య క్రమం రక్తి కట్టేది .వారికీ గొప్ప
ప్రో త్సాహం లభించేది .మూస ప్రో గ్రా మ్స్ వల్ల ఆశించిన ఫలితం రాదు .సృజనకు ఎక్కువ ఆదరణ నివ్వాలి .
సత్య సాయి ఉన్న కాలమ్ ''బంగారు యుగం ''అనే భావనతో నిర్వ హించిన కార్య క్రమం ఇది . ఆయన అందర్నీ
''బంగారు ''అని పిలవటం అందరికి తెలిసిన విషయమే .ఆ స్ఫూర్తి ని కల్గించటం లో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసు కొంటె
బాగుండేదని పించింది .కార్య కర్త లు బాగా శ్రమించారు .ఖర్చూ పెట్టా రు .ఆడ వాళ్ళు శ్రమ పడి కమ్మని వంటలు వండి,
వడ్డించారు .దీనికి తగ్గ ప్రతిఫలం రావాలి .అందరు స్వచ్చందం గా సేవ చేయటం బాగా ఉంది .విరాళాల జోలికి పో కుండా ఎవరికి
అప్ప గించిన పని వాళ్ళు చేసుకు పో తున్నారు .మెడికల్ కాంప్ లను .పేద జనులకు ఆహార సరఫరా ను నిర్వహించటం
షార్లెట్ కేంద్రం సాధించిన విజయాలు .సమష్టి బాధ్యత తో అంతా నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని పొ ంద గలుగు
తున్నందుకు అభి నంద నీయులు.సేవా భావం ,అంకిత భావం లతో నిర్వ హిస్తు న్న కార్య క్రమాలివి . అందుకే ''సాయి
అమెరికా వచ్చి మూడు వారాలైంది .ఇప్పటి వరకు వారానికి మూడు భోజనాలు ,ఆరు భజనల తో తీరికే లేక పో యింది
.అయితే నిన్న అంటే 29 వ తేదీ శని వారం ఒక దివ్య క్షేత్రా న్ని సందర్శించి అద్భుత అనుభూతి ని పొ ందాం .అదే ‘’–
caarrington cares ‘’అనే వృద్ధా శ్రమం .అక్కడ సుమారు యాభై మంది అతి వ్రు ద్దు లున్నారు .వారందరూ వీల్ చైర్ కు
పరిమిత మైనవారే .నడవ లేని , కోర్చో లేని , ,గట్టిగా చూడ లేని , ,వినికిడి లేని వారు అందులో చాలా మంది .వారెవరికీ నా
అనే వాళ్ళు ఉండి ఉండరు .పని చేసే శక్తి లేని వారు .ఎవరైనా సాయం చేస్తే నే వారు ఏదైనా తిన గలరు .కంప్యుటర్ పని
కూడా ఎవరో సాయం చేస్తే చూడ గలరు .కళ్ళు ఉన్నా కని పించని వారు ,చెవులున్నా విని పించని వారు కాళ్ళు ఉన్నా
నడవ లేని శక్తి హీనులు .దాదాపు అందరి పరిస్థితీ అదే .ఒకామె అచ్చం గా ప్రఖ్యాత శాస్త జ్ఞు
్ర డు ‘’స్టీఫెన్ హాక్ ‘’లా గా అన్నీ చైర్
లోనే .పాపం మెడ మాత్రం ఆమెకు తెలీకుండా అటూ ఇటు తిరుగు తూ వుంటుంది ..ఇలాంటి ఆశోపహతులు దైవోప హతుల
కోసం caarrington అనే చోట చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజా సహకారం తో నిర్వహిస్తు న్న శరణాలయం ఇది .స్తా నిక వాలంటీర్ ల
సాయం తో వృద్ధు ల సేవ చేస్తు న్నారు .వారికి ఏ కొరతా లేకుండా అన్నీ తామే అయి బాధ్యత గా’ నిర్వహిస్తు న్నారు .నాకు
యేమని పించిందంటే మానవత్వం కొలువై ఉన్న దేవాలయం అని పించింది .
‘’ cares ‘’అనే దానికి పూర్తి వివరణ caring and remembering every one special .నిజంగా అంత విధి నిర్వహణ తో
వారందరికి అన్నీ తామే అయి వాలంటీర్లు సేవ చేస్తు న్నారు .చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య వుంది ఈ ఆశ్రమం .కళ్ళకు
ఆనందాన్నిచ్చే రక రకాల రంగుల పూలు .లోపల సకల ఆధునిక సదు పాయాలతో గదులు .ఆధునిక సౌకర్యాలన్నీ అందు
బాటు లో ఉంచారు .మంచి పుస్త కాలున్న గ్రంధాలయం .ఒక పది మంది కూచుని హాయిగా చూసే అవకాశం తో టి.వి..రేడియో
.పరి శుభ్రమైన పరిసరాలు .అర్జెంట్ గా ఏ బాధ వచ్చినా చూసే డాక్టర్లు .అందుబాటు లో అన్ని మందులు .వంట గది
.అందులో పని చేసే వంట వాళ్ళు .ప్రత్యెక లాండ్రీ .అపరిశుభ్రత కు తావే లేని ప్రదేశం .కాళ్ళకు కట్ల తో, చేతికి పుళ్ళ తో ,అన్ని
రకాల అవకరాలతో మనకు మొదట చూడంగానే ‘’అయ్యో ‘’అని పించే సన్నివేశం .కాని వారందరి ముఖం లో చిరు నవ్వు
,కళ్ళల్లో ఆశా జ్యోతి ,గుండె దిటవు ,మనో ధైర్యం ,జీవించ గలుగు తున్నామనే ధైర్యం ,సమాజం తమకు చేస్తు న్న సేవల పట్ల
కృతజ్ఞ తా భావం వారందరి లో ప్రస్ఫుటం గా కన పడింది .మరణించే దాకా ఆరోగ్యం గా జీవింప జేయాలన్న సత్సంకల్పం
నిర్వాహకుల్లో ఉంది .అంకిత భావం తో సేవా భావం తో మానవ సేవే మాధవ సేవ అనే పవిత్ర ఆశయం తో ,ఇది మనం
చేయాలన్న కనీస విధి అన్న ధ్యేయం తో అక్కడి వాలంటీర్లు ఆ వృద్ధ నారాయణులకు చేస్తు న్న సేవ చూస్తు ంటే వారికి చేతు
లెత్తి నమస్కరించ బుద్ధేస్తు ంది.ఒక పవిత్ర దేవాలయం లో ఉన్నట్ల ని పిస్తు ంది అలాంటి గొప్ప అనుభూతి ని కల్పించిన దాని
నిర్వాహకుల్లో ఒక రైన వాలంటీర్ ప్రెసిడెంట్ – steve linden man , రెండవ వారైన activitydirector –robin dieker కు ఎన్ని
ప్రశంసా వాక్యాలు చెప్పినా తక్కువే .అందర్నీ కంటికి రెప్ప లాగా చూసుకొంటున్న వారి దైవీక్రు త మానవ సేవకు ధన్య వాదాలు
,కృతజ్ఞ తలు .వారం లో వారికి రోజు వారీ ఇచ్చే మెను అంటే భోజన వివరాలు బో ర్డ్ మీద కని పిస్తు ంది .
ఈ సంస్థ ను లాభ నష్టా లు తో సంబంధం లేకుండా నిర్వ హించటం ఒక విశేషం .వాలంటీర్ లను దగ్గ ర లో ఉన్న కమ్యునిటీ
నుంచే తీసుకోవటం మరో ముందడుగు .వాలంటీర్స్ అందరు కుర్ర వాళ్ళే .యువతీ యువకులే .వారందరి ధ్యేయం ఈ వృద్ధ
దేవతలకు అన్ని రకాల సేవలు అందించటమే .ఈ సంస్థ ను 1994 లో ప్రా రంభించి అందరి మన్ననలను అందు కొంటూ
సక్రమం గా నిర్వ హిస్తు న్నారు .అక్కడ బో ర్డ్ మీద వాలంటీర్ అంటే ఏమిటో ,రెసిడెంట్ అంటే ఏమిటో సేవ అంటే ఏమిటో
ఖచ్చిత మైన వివ రాలున్నాయి .సేవకు లెవ్వరు ఆ ఆవరణ లో పొ గ తాగటం నిషేధం .అవసరానికంటే ఎక్కువ పదార్ధా లు
అందజేస్తే ఇంకా వద్దు .సమృద్ధిగా ఉన్నాయని బో ర్డ్ పెట్టటం ఇక్కడ ప్రత్యేకం గా కన్పించింది .ఇలాంటి సేవా కేంద్రా లు ఇక్కడ
ఎన్నో ఉండ వచ్చు .అయితే ఇంత సమగ్రం గా ఉన్న సేవా కేంద్రా న్ని ,ఇంతటి సంతృప్తి తో ఆశ్రమ వాసులు ఉండటాన్ని
చూడటం ఇదే మొదలు నాకు .అందుకే ఈ స్పందన .
అలాంటి పవిత్ర దివ్య క్షేత్రం లో నిన్న మధ్యాహ్నం కాలు పెట్టా ం .ఇక్కడి సత్య సాయి సెంటర్ వారు చిన్న పిల్లల తో ఒక ఆంగ్ల
నాటికను తయారు చేసి ఆ వృద్ధు ల ముందు ప్రదర్శించే అవకాశం తీసు కొన్నారు .పిల్లలు దాదాపు నెల రోజుల నుదీ బాగా
ప్రా క్టిస్ చేసి తయారై వచ్చారు .వారి వెంట తలిదండ్రు లు కూడా .గీత అనే అమ్మాయి దీనికి దర్శకత్వం వహించింది
.మధ్యాహ్నం రెండున్నరకు ప్రా ర్ధ న తో ప్రా రంభ మైంది .వృద్ధు ల్ని ,ఆసక్తి .ఓపికా ఉన్న వారిని ఒక ముప్ఫై మందిని ముందే
వీల్ చైర్ లలో వాలంటీర్లు తీసుకొని వచ్చి కూర్చో బెట్టా రు .వారందరిలో ఏదో వింత ఆశ గోచరించింది .పిల్లలు బాగా నే
నటించారు .ఆ నాటిక సారాంశం మాటలు చెప్పటం కాదు చేతల్లో మంచి చేయాలి సాయ పడాలి అన్న నీతి .మా మనవడు శ్రీ
కెత్ క్రిస్తియన్ ఫాదర్ వేషం వేశాడు .పిల్లలందరూ మన సాంప్రదాయ దుస్తు లే ధరించారు .అన్ని భాషల పిల్లలు ఉన్నారు
.కొందరు భక్తీ గీతాలు పాడారు .దాదాపు ఒక గంట వారందరికి వినోదం కలిగించారు. ఆ వృద్ధు ల కళ్ళల్లో ఆనందం తాండ
వించింది .మాటలతో చెప్ప లేని వారు పిల్లల్ని దగ్గ రకు తీసుకొని ముద్దు పెట్టు కొన్నారు .కొందరు షేక్ హాండ్ ఇచ్చారు
.కృతజ్ఞ తలను కొందరు చక్కగా వ్యక్తీక రించారు .ఇంత మంది పువ్వుల్లా ంటి ,నవ్వుల్లా ంటి ,దేవుడి ప్రతి రూపాల్లా ంటి ,పవిత్ర
హ్రు దయాల్లా ంటి చిన్నారు లను చూసి వారందరూ చలించి పో యారు .ఆనంద బాష్పాలు రాల్చారు .మాట పెగలని వాళ్ళు
పెదిమలు కదిలించి భావ వ్యక్తీకరణ చేశారు .ఇందరు పిల్ల దేవతల మధ్య హాయిగా ,ఆనందం గా మనస్సు పరవశం చెందేట్లు
గడిపాము అన్న భావం వారందరి లో స్పష్ట ం గా దర్శించ గలిగాం .వారికి ఎంత సంతృప్తి కలిగిందో ,మాకూ అంతే తృప్తి కల్గింది
వారందరికీ మనో రంజనం కలుగ జేసి నందుకు .మా లాంటి వారితో ఆ వృద్ధ నారాయణులు కర స్పర్శ చేసి అభి నందించారు
.మేమందరం వారి మధ్య గడి పి నందుకు ధన్య వాదాలు చెప్పారు .మాతో ఫో టో లు తీయించు కొన్నారు .మరుగున పడిన
భావా లన్నీ ఒక్క సారి బహిర్గతమై నాయి మాకూ ,వారికీ . మనసు నిండా నవ్వారు ,కాళ్ళ నిండా చూశారు ,మాలా చేయ
లేని వారు గుండె నిండా సంతోషాన్ని నింపు కొన్నారు .వారెవరికి మృత్యు భయం లేనట్ల ని పించింది .ప్రశాంతం గా దైవ సన్నిధి
కి చేరుతాము అన్న ధీమా వ్యక్త మయింది .నిరుడు కూడా ఇలానే సాయి సెంటర్ వారు వచ్చి వినోదాన్ని పంచి వెళ్లా రట
.దాన్ని జ్ఞా పకం చేసుకొన్నారు ఒకరిద్దరు .దీన్ని సక్రమంగా నిర్వ హించటం లో సాయి సెంటర్ నిర్వాహకులు సుబ్బరాజ్ ,సత్య
,పవన్ డాక్టర్ సర్వేష్ వగైరా ల కృషి ప్రశంస నీయం.ఈ విధం గా వారానికి ఒకసారో రెండు సార్లో వివిధ సంస్థల వాళ్ళు ఇక్కడికి
వచ్చి వారికి మనోల్లా సం కల్గిస్తా రట.
ఆశ్రమ నిర్వహణ అంటే ఇలా సేవా ,అంకిత భావాలతో నిర్వహించాలని ఆదర్శం గా చూపిన caarrington cares వారికి మరో
మాటు ధన్య వాదాలు అంద జేస్తు న్నాను .
నిన్న శనివారం ,ఈ రోజు ఆదివారం అంటే అయిదు ఆరు తేదీలులు సరదాగా గడిచి పో యాయి .నిన్న అంటే మే
అయిదవ తేది శని వారం సాయంత్రం అందరం సౌత్ కెరొలినా లో ట్రూ హో మ్స్ లో ఉంటున్న రాంకీ ఉషా దంపతుల ఇంటికి
అందరం కలిసి వెళ్ళాం .ఇక్కడి నుంచి పావు గంట ప్రయాణం .రాంకీ ఉషా ఇద్దరు ఉద్యోగులే .ఇక్కడికి వచ్చి నప్పటి నుండి
బాగా పరిచయం అయినవాళ్ళు .మంచి వాళ్ళు .అంకుల్ ,అంటి అని మా ఇద్దర్ని ఆప్యాయం గా పిలుస్తు ంటారు .ఏరి కోరి
వాస్తు బాగా ఉందని వీళ్ళందరికీ దూరమైనా అక్కడ ఇల్లు కట్టించు కొన్నాడు .మూడంతస్తు ల ఇల్లు .మూడు గర జులు
.విశేషం ఏమిటంటే వాళ్ళింట్లో ఈశనివారం భజన నిర్వహించారు .మామూలుగా వచ్చే సుబ్బు సత్యాలు ,రాహుల్ ,మేము
డాక్టర్ సర్వేష్ కుటుంబాలు పవన్ కుటుంబం ఇంకా వాళ్ళ కు తెలిసిన వారందరూ వచ్చారు .సాయంత్రం ఆరున్నర నుండి
ఎనిమిది వరకు భజన బాగా జరిగింది విజ్జి రెండు ,శ్రీ కెత్ రెండు భజనలు బాగా పాడారు .డాక్టర్ గారి భార్య ,కొడుకు, సౌమ్య,
సుబ్బు కూతురు ,ఉషా రాంకీ భార్య ఉషా ,పిల్లలు అందరు పాడారు .ఆ తారు వాత అందరికి మంచి డిన్నర్ .పూరీ ,రెండు
కూరలు ,ఆవకాయ ,గులాబ్ జాం పులిహో ర ,పరవాన్నం మామిడి పండ్ల ముక్కలు ,పుచ్చ కాయ ముక్కలు ,సాంబారు
పెరుగు వగైరాలతో విందు భోజనం .నేను దాన్ని ‘’భారద్వాజ విందు ‘’అన్నాను .అందరు మెచ్చారు .దంపతులిద్దరూ చాలా
మర్యాదగా అందర్ని కనుక్కొంటు కోసరి వడ్డించి తిని పించారు .మంచి స్నేహ ,మర్యాద పూర్వక ఆతిధ్యం .
నిన్న వైశాఖ శుద్ధ చతుర్ద శి ‘’శ్రీ నృసింహ జయంతి ‘’.అను కోకుండా నృసింహ జయంతి భోజనం చేశాం .నిన్న
చంద్రు డు భూమికి చాలా దగ్గ ర గా రావటం వల్ల చంద్ర ప్రకాశం మామూలు కంటే సుమారుపది హేను శాతం ఎక్కువ గా ఉంది
.ఇంటికి వచ్చేటప్పుడు ఆ వైభవం చూశాం .’’వేయి పడగలు ‘’నవలలో విశ్వనాధ వెన్నెల రేయిని సుమారు నాలుగు పేజీల్లో
అత్యద్భుతం గా వర్ణించాడు .దాన్ని పూర్తిగా బట్టీ పట్టా ను .కాని ఇప్పుడేమీ జ్ఞా పకం లేదు .అంత గొప్పగా వర్ణించాడు మహాను
భావుడు అ.అది జ్ఞా పకం వచ్చింది .దాని తో పాటు ఉయ్యూరు లో నరసింహ జయంతి చేసే విధానం ఒక సారి స్మృతి పధం
లోకి వచ్చింది .మా మేన మామ గంగయ్య గారింట్లో నరసింహ జయంతి నాడు ఇంటిల్లి పాదీ కటిక ఉప వాసం చేసే వారు
.ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకం ,నృసింహ స్వామికి సహస్ర నామ పూజ .మామయ్య అతి శ్రద్ధ గా చేసే వాడు
.మా తాతయ్య నరసింహం గారు కూడా అలానే చేసే వాడు .అంతా మడి తో ఉండే వాళ్ళు .పూజ అయినతర్వాత అంతకు
ముందు రోజున ఆహ్వానించిన వారందరికి పానకం ,వడ పప్పు మామిడి పండు ,తాటాకు విసన కర్ర, తాంబూలం లో పెట్టి ఇచ్చే
వారు .వేసవి కాలం కనుక దాహానికి పానకం .,విసన కర్ర తాపో ప శమనం .అప్పుడు అందరు వెళ్ళిన తరువాత వండుకొన్న
పిండి ని అందరు భోజనం చేసే వారు .దాని లోకి వంకాయ పులుసు పచ్చడి ,లేక కంది పచ్చడి నంజు కొని ,పెరుగు పో సుకొని
తినే వారు .అదే భోజనం .మర్నాడు ఊరిలో కొందరిని పిలిచి భోజనం పెట్టె వారు .మేము ఎలాగూ తప్పదుకదా .ఉదయం పద
కొండు గంట లకే భోజనాలు .వాళ్ళందరూ నరా సింహ స్వామి ఉపాసకులు .మంగళ గిరి తరచు వెళ్లి వస్తు ండే వాడు మామయ్య
.అలాగే ఉయ్యూరు పుల్లేరు కాలువ చివర ఉన్న చెరుకు పల్లి శాస్త్రు లు గారు అసలు పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రు లు గారు
ముందు రోజే అందరి ఇళ్లకు వెళ్లి నరసింహ జయంతి ప్రసాదం తీసు కోవటానికి రమ్మని పిలిచే వారు .వారు వృద్ధు లైతే
వారబ్బాయి శ్రీ రామ మూర్తి ,భార్యా వచ్చి పిలిచే వారు .వారింటి లోను సాయంత్రం దాకా ఉపవాసం ,పూజా అభిషేకం జరిగేవి
.తర్వాతా అందరికి పానకం వడ పప్పు మామిడి పండు విసన కర్ర, తాంబూలం ఇచ్చే వారు .మర్నాడు దాదాపు ఊరి లోని
బ్రా హ్మణు లందరికి భోజనం .షడ్ర సో పెతం గా పెట్టె వారు .మరీ మరీ వడ్డించే వారు .నృసింహ జయంతి అంటే ఆ రెండు రోజులు
,ఆ రెండిళ్ళు మనసు లో మెదలక తప్పవు .ఆ అనుభవం ఇక్కడ రాంకీ వాళ్ళ ఇంట్లో దక్కిందని ఆనందించాం .అమెరికా లో ని
మెక్సి కన్లు మే అయిదు ను గొప్ప పండుగ గా చేసు కొంన్టా రు .చాలా వైభవం గా నిర్వహించు కొంటారు. బంధు మిత్రు లను
ఆహ్వానించుకొని విందు చేసు కొంటారట .ఈ విషయం రాంకీ భార్య ఉష తెలియ జేసింది .రాంకీ కుటుంబానికి సరస భారతి
ప్రచురించిన ‘’శ్రీ హనుమ కధా నిది ‘’,’’మా అక్కయ్య కవితా సంపుటి ‘’,శృంగేరి వారి పంచాంగం ఇచ్చాం .మేమిద్దరు వచ్చి
నందుకు చాలా సంబర పడ్డా రు .
ఈ రోజు వైశాఖ పూర్ణిమ ఆది వారం .బుద్ధ పౌర్ణమి గా అన్న మా చార్య జయంతి గా జరుపు కొంటాము
.ఇవాళ ఉదయం జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఆహ్వానం పై మేము వాళ్ళింటికి వెళ్ళాం .శ్రీ హనుమ కధా సంపుటి ‘’వారికి
ఇచ్చాను .ఈ రోజు వారింట్లో ‘’అహో బిలమఠంస్వాములు’’ తిరు మంజనం ‘’జరి పారు .ఆ పీఠానికి చెందిన ఇక్కడి స్వాములు
రాత్రే వాళ్ళింటి కి వచ్చి నిద్రించి మూర్తు లను తెచ్చి ఉదయం స్నానం ,సంధ్య లను మడి తో నిర్వహించి శ్రీ కృష్ణు డి కి అభిషేకం
చేశారు .నలుగురు స్వాములు వచ్చారు .వారంతా ఇక్కడ పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారే .జహో బిల జియ్యర్ మతావ లంబులు
.అంటే విశిష్టా ద్వైత మతావలంబులు .భగవద్రా మానుజుల శిష్య పరం పర వారు .అసలు విషయం ఒకటి ఉంది . శ్రీ శంకర
జయంతి నాడే శ్రీ రామానుజ జయంతి కూడా .పంచె లను గోచీ పో సు కొని కట్టు కొని ఊర్ధ ్వ పుండ్రా లు ధరించి శుచి ,శుభ్రం
లతో వారే వంట చేసి .ప్రసాదాలనూ చేశారు .ఇంత పధ్ధతి తో అమెరికా లో అహో బిల స్వాములు అంత నియమ నిష్ట లతో ఈ
కార్య క్రమాన్ని జరిపించటం చాలా ఆశ్చర్యం గా ఉంది . .జగదీశ్ కూడా గోచీ పో సి పట్టు బట్ట కట్టి నడుముకు అన్గోస్త ం్ర
బిగించారు .భార్య లక్ష్మి కూడా తమిళ దేశం లో పెద్ద ముత్తైదువులు కట్టినట్లు గా పట్టు బట్ట కట్టింది .పిల్లలు సాంప్రదాయ వేష
ధారణ లో ఉన్నారు ..వచ్చిన పాతిక కుటుంబాలలో ఇరవై కుటుంబాలు తెలుగు వారే .అందరు చక్క గా తెలుగు
మాట్లా డుతున్నారు .ఆనందం వేసింది ఆడ పిల్లలు కూడా కీర్తనలను శ్రా వ్యం గా పాడి ముగ్ధు ల్ని చేశారు .విష్ణు సహస్ర నామ
పారాయణం సామూహికం గా స్త్రీలు చేశారు .స్వాములు లోపల పూజ చేశారు .తెర అడ్డ ం గా ఉంచారు .ఆ తర్వాత శ్రీ కృష్ణ
అష్టో త్త ర పూజ చేశారు .తిరుప్పావై చది వారు .హారతి ఇచ్చి ‘’పల్లా ండు పల్లా ండు పలు వావిరి ‘’అన్నది చది వారు .అందరికి
తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు .వెన్న ను నైవేద్యం పెట్టి ప్రసాదం గా అంద జేశారు . వారు మళ్ళీ తమ దేవుళ్ళను జాగ్రత్త గా వెండి
భరిణ లలో దాచు కొని అన్నీ సర్దు కొన్న తర వాత అందరికి భోజనాలు వడ్డించారు దేవుళ్ళను తాక కుండా దగ్గ ర గా చూసే
వీలు .ఫో టోలు తీసే సౌకర్యం కల్పించారు .అందరికి పంక్తి లో వడ్డ న చేశారు ..అంటే అందరం కిందే కూర్చుని భోజనం చేశాం
.అలా సాంప్ర దాయాన్ని తు .చ .తప్పకుండా పాటిస్తూ చేసింది అహో బిల మఠానికి సంబంధించిన స్వాములు .అంటే
ఆహో బిలాన్ని ,అక్కడి వారికి అర్చా ,కైంకర్య .,అభిషేక పూజా వైభవాన్ని ఇక్కడ నార్హ్ కరోలినా లో సంప్రదాయ బద్ధం గా
కన్నుల పండువు గా చేసి తరింప జేశారు .జగదీశ్ దంపతులు చాలా భక్తీ శ్రద్ధల తో నిర్వ హించారు .ఆడ వాళ్ళు అందరికి
వడ్డించారు .చక్ర పొ ంగలి ,పులిహో ర రెండు రకాలు కూరలు , బీన్స్ కూర ,దో స కాయ పచ్చడి ,అన్ని రకాల పండ్ల ముక్కలు
,అన్నం కీరుపాయసం సాంబారు ,పెరుగన్నం ,వడియాలు పొ ంగలి లల తో మంచి భోజనం పెట్టా రు .అందరు అది మహా
ప్రసాదం గా భావించి కళ్ళకద్దు కొని తిన్నారు .అందరి లోను ఒక పవిత్ర లోకం లో విహరించిన అను భూతి పొ ందారు. దాదాపు
నలభై మంది విందు లో పాల్గొ న్నారు .అందరికి మర్యాద పూర్వకం గా ,గౌరవ పురస్సరం గా లక్ష్మి దంపతులు ఆదరించారు
.వీరిద్దరిని మేము వచ్చి నప్పటి నుంచి తరచూ కలుస్తూ నే ఉన్నాం .నేను కూడా పంచె ను గోచీ పో సికట్టి తెల్ల చొక్కా వేసుకొని
వెళ్లా ను .చాలా మంది కొత్త వాళ్ళు ఇక్కడ పరిచయం అయారు .అందరు ఇంత కలుపు గోలు తనం గా ఆప్యాయం గా కలిసి
మాట్లా డుకోవటం భోజనాలు చేయటం గొప్ప అను భూతినిచ్చింది .దేశం కాని దేశం లో భాషా భేదాలను విడిచి సో దర భావం తో
అందరు చేరటం అభిలష నీయ విషయం .పీఠం వారు నెలాఖరుకు ఇంకో చోట ఇంకో రాష్ట ం్ర లో కార్య క్రమం నిర్వ
హిస్తా రాట.ఇలా అమెరికా అంతా పర్య టించి ప్రజల వద్దకు తమ ఇష్ట దైవాన్ని తీసుకొని వచ్చి తరింప జేసే కార్యక్రమాన్ని
చేస్తు న్నారు .అందుకే అహో బిలం వారు చేస్తు న్న ఈ కార్య క్రమం ‘’అహో !ఓహో !’’అన్నట్లు ంది .వచ్చిన ముత్తైదువు లందరికి
జాకెట్ పళ్ళు చేతి నిండా ఇచ్చి పంపారు .మా ఇద్దరికీ నమస్కారం చేయాలని భావించి కుర్చీల్లో కూర్చో బెట్టి లక్ష్మి ,జగదీశ్
దంపతులు నమస్కరించి అక్షింతలు వ్వేయిన్చుకొన్నారు .పిల్లలతో కూడా చేయించి మాతో గ్రూ ప్ ఫో టో తీయిన్చుకొన్నారు
మమ్మల్ని అమ్మా నాన్న ల్లా గా గౌరవించటం వారి సంస్కారం .. .
ఇంటికి వస్తు ంటే దారి లో ఒక పొ లం లో ‘’పిక్ యువర్ స్త్రా బెర్రీస్’’అనే బో ర్డు ఉంది .మేమందరం ఆ పొ లం లో
దిగి ఆ తాజా పండిన పళ్ళను కోసుకొని డబ్బు ఇచ్చి తెచ్చు కొన్నాం .పిల్లలు ముఖ్యం గా పీయుష్ పండిన పండ్ల ను కోయటం
లో దిట్ట అని పించాడు .నాకు చెప్పి, పండిన వాటినీ కోయించాడు .మొత్త ం మీద వీకెండ్ బాగా గడిచింది .,రాంకీ ఇంట్లో ను
,జగదీశ్ వాళ్ళ ఇంట్లో విందు లతో అహో బిల సందర్శన తో నూ.
అమెరికా వచ్చి అప్పుడే నెల దాటింది . వచ్చిన ఇరవై ఐదు రోజులకు కాని లైబర
్ర ీకి వెళ్ళ లేక పో యాను
.అయిదవ తేదీ charlotte mecklen burg లైబర
్ర ి కి వెళ్ళాం .అక్కడ ఇరవై పుస్త కాలు తీసుకొన్నాను .ఇక్కడి పధ్ధతి వేరుగా
ఉంది .మనమే పుస్త కాలను చేకౌట్ చేసు కోవాలి .అంతా అయిన తర్వాత లిస్టు వస్తు ంది .నేను ,మా అమ్మాయి విజ్జి చెరో పది
పుస్త కాలను పట్టు కొని కారులో పెట్ట టానికి వెళ్తు ంటే అందరు విజ్జిని ‘’is all this stuff for you ?అని నవ్వుతు అడిగితే ‘’no -
it is my father’s stuff ‘’అని వెనక ఉన్న నన్ను చూపించింది .వాళ్ళు నవ్వుతు’’ ఓహ్ వెరీ గుడ్ ‘’ అని అభి నందించారు
.దానర్ధం ఈ మొహం అన్ని పుస్త కాలు చదివేదేనా అని కాని, అమ్మో ముసలాడు చాలా చదువు తున్నాడే అని మెచ్చి కోలు
కావచ్చు. నాకు రెండో దే అని పించింది నిశ్చయం గా .అమెరికా కాంగ్రెస్ కు, కౌంటీ మాజిస్త్రేట్ మొదలైన వాటికి ఎన్నికలు
జరుగు తున్నాయి .ఎక్కడా హంగూ ,ఆర్భాటం లేదు అరుపులు గోలలూ లేవు .నినాదాలు లేవు .లైబర
్ర ి లో పో లింగ్
జరుగుతోంది .మనకైతే సెలవ ప్రకటిస్తా రు .ఇక్కడ ఎవరి పని వారిదే .ఒక పక్క పో లింగ్ ఇంకో వైపు యదా ప్రకారం లైబర
్ర ి కార్య
క్రమాలు .లైబర
్ర ీ లలో పిల్లలకు ట్యూషన్ చెబుతారు టీచర్స్ .రెండు గంటలు .శని వారం రోజున .డబ్బు తీసుకొంటారు .ఎన్నిక
చాలా పధ్ధతి లో జరగటం నాకు ముచ్చటేసింది .ప్లే కార్డ్స్ పట్టు కొని లైబర
్ర ి బయటి గేటు కు అవతలే ఏజెంట్స్ నుంచుని
ఉంటారు .నవ్వుతు అందర్ని పలకరిస్తా రు .లోపల ఎన్నికల బూత్ ను కూడా చూశా.ఎవరి గోల వారిదే .చక్కగా ఓటేసి వెళ్లి
పో తున్నారు .సీక్రేసి మైంటైన్ చేస్తు న్నారు .బాలెట్ షీట్ చాలా పెద్ద గా కని పించింది .రెండు పార్టీల అభ్యర్ధు ల పేర్లు కని
పించాయి రెండు వరుసలలో .బహుశా నేను చూసింది నమూనా పేపర్ అయి ఉండ వచ్చు .లైబర
్ర ి లో ఎలుగు బంటి అంత
నల్ల ని కుక్కను చూశా . .దంపతులిద్దరూ దాన్ని తెచ్చి చిన్న పిల్లలకు చూ పిస్తు న్నారు .అన్ని రకాల గేమ్స్ ఆడు కోవా
టానికి వీలుంది .నిశ్శబ్దం రాజ్యం చేస్తు ంది ఎప్పుడు .నేను తెచ్చిన ఇరవై పుస్త కాలలో పద్నాలుగు నిన్నటి తో చదివేశా .అందు
లో ఒకటి రెండు అంత గా బాగా ఏక పో తే తిరగేశాను అక్కడదక్కడ చదువుతూ .చదివిన పుస్త కాల లిస్టు రాస్తా చివర్లో .ఈ
వారం లో వర్షం పడింది రెండు మూడు సార్లు .శామ్స్ ,వాల్మార్ట్ ,జి మార్ట్ లకు వెళ్లి పాలు ,పళ్ళు కూరలు తెచ్చు కోవటం
తప్ప బయటికి పెద్ద గా వెళ్ళ లేదు .పన్నెండవ తేది శని వారం మదర్స్ డే కోసం ఒకరింటికి వెళ్ళాం . ఈ వారం లో ఇంటి
చుట్టూ రాళ్ళు పెట్టించి మట్టి పో యించి పూల మొక్కలు కూర గాయల మొక్కలు పెట్టింది విజ్జి .శ్రీ కెత్ కరాటే క్లా స్ కు వెళ్ళాం
శుక్రవారం .
ఈ నెలలో దాదాపు సరస భారతి కి నలభై అయిదు కు పైగా ఆర్టికల్స్ రాసినట్లు గుర్తు .’’చినుకు మాస పత్రిక’’ లో నేను
రాసిన ‘’అన్నం పెట్టిన చేతుల తోనే—‘’అనే ఆర్తికల్ మే సంచిక లో పడింది . ఇదిsynthetic అమోనియా తయారు చేసి
సస్యవిప్ల వానికి నాంది పలికిన హేబర్ అనే శాస్త జ్ఞు
్ర డి గురించి .స్టేట్ లీడర్ ,సన్ఫ్లవర్ మాగజైన్లలో నేను రాసినవి వస్తు న్నాయి
.ఆధునిక స్త్రీ కవుల గురించి ఆర్టికల్స్ రాశాను .ఇంకా కొన్ని నోట్స్ రూపం లో ఉన్నాయి .వాటిని డెవలప్ చేయాలి .ఏ బయటి
ప్రో గ్రా ములు లేక పో వటం టో ఈ వారాన్ని ‘’weak గా గడచిన week’’ అన్నానంటే రైం బాగుందని.
కళ తప్పిన మదర్
మే పన్నెండు శని వారం మదర్స్ డే.ప్రపంచం అంతా గొప్పగా జరుపుకుంటుంది ,జరుపు కొన్నది .ఇక్కడికి అరగంట
ప్రయాణ దూరం లో మా అల్లు డు అవధాని మేనత్త గారి ఊరుకు చెందిన కుటుంబ స్నేహితులు మదర్స్ డే కార్యక్రమం వారింట్లో
జరుపుతున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళాం .మేనత్త కుటుంబానికి వీరికి నలభై ఏళ్ళ కు పైగా స్నేహం .తరచు ఆ రెండు
కుటుంబాలు కలుసు కొంతాయట . .స్నేహాన్ని ఇంత బంధం గా ,పదిలంగా భద్ర పరచు కొంటున్న వారిద్దరి కుటుంబాలకు
అభి నందనాలు .దాదాపు ఇరవై తెలుగు కుటుంబాల వారు చేరారు .మా అమ్మాయి వాళ్లకు ఈ కుటుంబం తప్ప మిగిలిన
వారితో పరిచయమే లేదట .అయితే ఆ దంపతులు మమ్మల్ని చక్కగా మర్యాదగా ఆహ్వానించారు .కుశల ప్రశ్నలు వేశారు
సంగతు లన్నీ తెలుసు కొన్నారు .ఇంటి ఆవిడ తాను తెచ్చిన గిఫ్ట్ లను పిల్లలతో వారి తల్లు లకు ఇప్పించి హాపీ మదర్స్ డే
చెప్పించింది .మా అమ్మాయితో వాళ్ళ అమ్మకు అంటే మా శ్రీమతికి ,మా మనవడి తో మా అమ్మాయికి గిఫ్ట్ లు
ఇప్పించారావిడ.మేము అక్కడికి రాత్రి ఏడు గంటలకు చేరాం .ముందుగా అందరికి” ముంత కింద పప్పు” లాంటి
దాన్ని కప్పుల్లో పెట్టి అందించారు .పిల్లలకు బిస్కట్లు జ్యూసులు .మదర్స్ డే సందడి ఏదైనా ఉంటుందేమో నని ఎదురు
చూశాను .ఆ జాడ కని పించలేదు .మగ వాళ్ళందరూ ఒక గది లో హాయిగా పేకాట లో మునిగి పో యారు .ఆడ వాళ్ళందరూ
షరా మామూలుగా చీరలు ,నగలు ,పిల్లల గొప్పతనాల ముచ్చట్ల లో లో మునిగి పో యారు .మా ఇద్దరికీ ఏ మ్బరాసింగ్ గ
ఉంది .కనీసం అక్కడ చేరిన స్త్రీలు తమ తల్లు ల గురించి తలో అయిదు నిమిషాలు గుర్తు చేసుకొంటే సార్ధ కం గా ఉండేది .తాము
సమస్యల్లో వున్నప్పుడు తమ తల్లు లు ఎలా మార్గ దర్శనం చేశారో వాళ్ళు మాట్లా డు కొంటె నా కంటే సంత సించె వాడు
ఇంకోడు ఉండే వాడు కాదు .అదే చాలా బాధ కల్గించింది .అయితే ఒక గొప్ప విషయం ఏమి టంటే అక్కడికి వచ్చిన వారందరూ
దశాబ్దా ల పాటు అమెరికా లో ఉంటున్నా చక్కని తెలుగు లో మాట్లా డు కొన్నారు మాట్లా డారు .మగ వారు ,ఆడ వారు
,పిల్లలతో సహా .ఇది మహత్త రం అని పించింది .ఆడవారు సంప్రా దాయ చీర లతో వచ్చారు .అదీ ముచ్చటేసింది .వీరందరి
సంస్కారానికి ,పో షిస్తు న్న సంస్కృతికి జేజేలే
రాత్రి ఎనిమిదన్నరకు విందు మొదలైంది .రసమలాయి స్వీట్ ,–చపాతి -బంగాళా దుంప కూర ,బీన్స్ కూర
,కాప్సికం కూర ,ఇంకో రక మైన చికిడీ ,.పప్పు, కొబ్బరి చట్ని ,మామిడి కాయ ఆవకాయ ,టమేట ో పచ్చడి అన్నం ,రసం ,
గడ్డ పెరుగు .అందరు చక్కగా మాట్లా డు కొంటూ తిన్నారు .అడిగి అడిగి ఆడవాళ్ళు వడ్డించారు .మదర్ ను జ్ఞా పకం చేసుకోక
పో యినా , మదర్ వంట లాంటి వంట తిన్నాం .అన్నీ ఇంటి ఇల్లా లే చేశారట .మదర్లీ ఎఫెక్షన్ తో చేశారేమో .అందరు లొట్ట
లేసుకొంటు ,ఆమె ను అభినందిస్తూ తిన్నారు .కృతజ్ఞ తలను చెప్పి అందరం పదింటికి బయల్దే రి రాత్రి పదిన్నరకు ఇంటికి
చేరాం .మదర్ పై ఒక చిన్న పద్యం లాంటి కవిత ఆంగ్ల ం లో –
m –merciful ,majestic ,memorable ,magnana mous
o- –omni present ,omni potent ,occcupational
t—talented ,tactful ,terribly inspiring
h—honest ,honourable ,humble ,homely
e—enduring ,ever helpful ,energetic
r—resourceful ,rewarding and with,right judje ment .
is mother – I adore you the mother for all .
నేనీ వారం లో చదివిన పద్నాలుగు పుస్త కాలు –canary capers ,charles lind bergh ,buddhists hindus ,sikhs in
americaa ,lindon johnson ,ice maiden of the andies ,hundred modern poems ,are you happy ?,making
modernism –and picasso ,mrs lincoln ,lenok’s journey ,charlotte then and now ,the abolition of marriage in
americaa ,god and the evolving universe ,how shakespere become shakespere .
అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది
.వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ
సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో ఉదయం అభిషేకం తో ప్రా రంభమైంది .గంధ సిందూరం పూజ .మధ్యాహ్నం
పన్నెండుకు సరస భారతి ఆధ్వర్యం లో ‘’ఆదిత్య హృదయం ‘’పుస్త కావిష్కరణ జరిగింది .రాత్రి చిన్న పిల్లలు నృత్య ప్రదర్శన
చేశారు .మర్నాడు సో మ వారం ఉదయం మామిడి పండ్ల తో పూజ .చాలా ఖరీదు గా ఉన్నా ,ప్రతి సంవత్సరం లానే జరిగింది
.రాత్రి మల్లీ నృత్య ప్రదర్శన .పదిహేనవ తేదీ మంగళ వారం శ్రీ హనుమజ్జయంతి .ఉదయం ఆరు నుండి తమల పాకులతో
పూజ నాన్ స్టా ప్ గా పదింటి వరకు .పదిన్నరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల శాంతి కళ్యాణం .మేము అక్కడ లేక పో యినా
మా అబ్బాయి రమణ దగ్గ ర ఉండి అన్ని కార్య క్రమాలు చేసి ,వాళ్ళిద్దరూ దంపతులు పీట ల మీద కూర్చుని కళ్యాణం జరి
పించారు .ఆ రాత్రి కే.సి.పి.కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా నలభై సార్లు చేశారు .
ఇక్కడ హనుమజ్జయంతి నాడు నేను సహస్ర నామ పూజ చేశాను .నేను వెంట తెచ్చు కొన్న ‘’కళ్యాణం
చేయించే పుస్త కం ‘’తో యదా విధిగా అన్ని మంత్రా లతో తంత్రం లేకుండా కళ్యాణం చేశాను .మా దేవాలయం లోని
సువర్చలాన్జనేయ స్వాముల ఫో టోలు ఇక్కడ మా అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నాయి .విష్వక్సేన పూజ ,పుణ్యః వాచనం
,నవగ్రహ ,ఆష్ట దిక్పాలక పూజ కన్యా వరణం ,మధు పర్కం ,ప్రవర ,మహా సంకల్పం ,చూర్నికా ,లగ్నాష్ట కాలు అన్నీ
యధావిధి గా చదివి కళ్యాణ అక్షింతలు అందరికి వేశాను .కొబ్బరి కాయ కొట్టా ం .పంపర పనస ,మామిడి పళ్ళు ఆపిల్స్
నైవేద్యం .విజ్జి ఉదయమే స్నానం చేసి అప్పాలు ,పులి హో ర చేసింది .వాటినీ ని వేద్యం పెట్టా ను .ఇలా అమెరికా లోను కళ్యాణం
జరిపి నట్లే .
మా అమ్మాయి విజ్జి --మా మనవడు చదివే స్కూల్ లో వాడి వార్షిక పరీక్షలకు అయిదు రోజులు ఉదయమే ఏడింటికే
వెళ్ళింది సో మ నుంచి శుక్ర వరకు .పేరెంట్స్ ను ఇక్కడ వాలంటరీ గా ఇంవిజిలేషన్ చేస్తా రు . .పరిక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరుగు
తాయట . .ఒకే పుస్త కం లో మూడు రోజుల ప్రశ్నా పత్రా లు ఉన్నా ఎవరూ రేపటి పరీక్ష ఆపేర్ లో ఏమి ఉన్నాయో చూడక
పో వటం ఇక్కడి విశేషం అని చెప్పింది .అన్నీ ఆబ్జెక్తివ్ ప్రశ్నలే .ముందు రాసేసినా, చివరి వాడు రాసే వరకు ఎవ్వరు కదల
రాదట .వాడు రాయ లేక పొ తే మళ్ళీ టైం పెంచుతారట .అందరు రాయటం అయిపో తేనే బయటికి వెళ్లటం వాలంటరీ కి రెండు
రోజులు ట్రైనింగ్ ఇస్తా రు .వార్షిక పరీక్షలను’’ ఎండ్ఆఫ్ గ్రేడ్’’అంటారు
బుధవారం –ఒక బీహారీ వాళ్ళ ఇంట్లో భజనకు వెళ్ళాం .ఇరవై మంది ఉన్నారు . స్వీటు అరటి పండు అందరికి
ఇచ్చారు .విజ్జి, మా మనవడు శ్రీ కెత్ కూడా పాడారు .మర్నాడు గురువారం పవన్ అనే మా బంధువుల అబ్బాయి ఇంటి దగ్గ ర
సునీత అనే వాళ్ళ ఇంట్లో భజన .ముప్ఫై మంది హాజరు .రెండు స్వీట్లు ,పులిహో ర ప్రసాదం .శని వారం లైబర
్ర ి కి నేను
మనవడు పీయూష్ వెళ్లి పుస్తా లు ఇచ్చి నేను ఇరవై ఒక్క పుస్త కాలు తెచ్చు కొన్నాను .కిందటి వారం లో చివర చదివిన
ముస్సోలిన్-సామ్రా జ్యం చాలా బాగుంది .ఇన్స్పైరింగ్ .దాని మీద పన్నెండు పేజీల నోట్స్ రాసు కొన్నాను .అలానే హౌస్ ఆఫ్
లింకన్ కూడా బాగున్నాయి .మిగిలినవి బొ మ్మల పుస్త కాలే .తెచ్చిన వాటిలో నిన్నా ,ఇవాళ షార్ప్, అనేది అలాన్ టూనర్
పుస్త కాలు చదివేశాను .
నిన్న అంటే పందొమ్మిదవ తేది శని వారం సాయంత్రం ఇండెపెండెన్స్ రోడ్ లో ఉన్న ‘’హిందూ సెంటర్ ‘’అనే శ్రీ వెంకటేశ్వర
దేవాలయానికి అనీతా ,కిరణ్ అనే వారు పిలువగా వెళ్ళాం .ఇదే మొదలు దేవాలయ దర్శనం చేయటం ఇక్కడ .అనీతా వాళ్ళ
నాన్న గారికి షష్టి పూర్తీ జరిపారు ఆ దేవాలయం లో .అందుకని వాళ్ల అమ్మా ,నాన్న పీట ల మీద కూర్చుని శ్రీ వెంకటేశ్వర
కళ్యాణం చేశారు .సాయంత్రం అయిదున్నర కు ప్రా రంభమై ,రాత్రి ఏడున్నరకు పూర్తీ అయిన్చ్ది .వాళ్ళు పిలుచుకొన్న
వారందరూ వచ్చారు .అనీతా వాళ్ళు హైదరాబాద్ కు చెందినా తెలుగు వాళ్ళు .పూజారులు కల్యాణాన్ని బానే చేయించారు
.అన్నీ యదా విధిగా .కాని తలంబ్రా లు పో యించలేదు ఎందుకనో .పరవాన్నం రవ్వ కేసరి ,పులిహో ర ప్రసాదాలు. అక్కడ
అందరు దేవుళ్ళు ఉన్నారు .అంటే కాంప్లెక్స్ .మా తోను కన్యా దానం ఇప్పించారు .వెంకటేశ్వర కళ్యాణం లో కన్యాదానం
చెయ్యటం ఇదే మొదలు .ఆ తర్వాతా ప్రక్కనున్న విశాల మైన హాల్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు అనీత కిరణ్ లు .రసగుల్లా
,మిరప కాయ బజ్జి ,వడ ,పప్పు ,చపాతి రెండు కూరలు వంకాయ కూర అప్పడాలు చట్నీ ,సాంబారు పెరుగు టో భోజనం
బాగా ఉంది .అంతా వాళ్ళే తయారు చేసి తెచ్చారు .హాలు చాలా అందం గా ఉంది అందు లోని దొమ్ లైట్లు అద్భుతం .షష్టి
పూర్తీ దంపతులు కళ్యాణం అవగానే మా ఇద్దరికీ సాష్టా ంగ నమస్కారం చేసి ఆశీ స్సులు పొ ంది అక్షంతలు వేయించు కొన్నారు
.ఆ తర్వాతా అనీతా వాళ్ళ నాన్న గారితో కేక్ కట్చేయించి అందరికి పంచారు .అంతా ఆయె సరికి రాత్రి పది అయింది .అప్పుడు
బయల్దే రి ఇంటికి పదిన్నర కు చేరాం .
ఇవాళ ఆదివారం నాడు విజ్జి అవధాని గార్లు మూడు కుటుంబాలను మధ్యాహ్నం భోజ నానికి పిలిచారు .ఒకటి రాంకీ
ఉషా కుటుంబం ,రెండు బెల్లంకొండ రవి ఉషా కుటుంబం ,మూడో ది పవన్ వాళ్ళ కుటుంబం .పిల్లా జెల్ల కలిపి ఇరవై మంది
.పవన్ అత్తా గారు మామ గారూ కూడా వచ్చారు .బి.రవి కి .పవన్ కు మన శ్రీ హనుమ కధా నిది పుస్త కాలు ఇచ్చాను
.టమేట పప్పు ,కాబేజీ కూర ,బంగాళా దుంప కూర ,వడియాలు ఆవకాయ .చారు ,పెరుగు .పుచ్చకాయ ముక్కలు పనస
తొనలు అందరు కమ్మగా తిన్నారు .అందరు బయట చెట్ల కింద పట్టా ల మీద ప్రక్రు తి లో కూర్చుని హాయిగా భోజనం చేశారు
.ఉసిరి గింజలు మొలిచి మొక్కలు వస్తు న్నాయి .కనుక దీన్ని వైశాఖ వన భోజనం అన్నాం.అన్నీ విజ్జే చేసింది .ఈ
కుటుంబాలన్నీ చాలా మంచి కుటుంబాలు .సంస్కారం ఉన్న వి .స్నేహ పాత్ర మైనవి .
ముత్తేవి రవీంద్ర నాద గారు వారానికో సారి ఫో న్ చేసి మాట్లా డు తున్నారు .మధుసూదన రావు గారు రెండు
సార్లు మాట్లా డారు ఆయనే ఫో న్ చేసి .మెయిల్ పెడితే మొన్న ఫో న్ చేశారు గోపాల కృష్ణ గారు .ఇలా ఈ వారం అంతా వేడుకల
వారం గా గడిచింది .ఇవాళ మధ్యాహ్నం పాత’’ లవ కుశ ‘’సినిమా జెమిని లో చూశాం . .కళ్ళకు ,మనసుకు ఎంతో రిలీఫ్
ఇచ్చింది. రామ రాజ్యం చూసిన దో షం పో యిందని ఊరట కలిగింది .అందులో కుశుడు వేసిన నాగ రాజు రామోజీ స్టు డియో లో
రెండేళ్ళ క్రితం ‘’వరుడు ‘’సినీ షూటింగ్ లో కలిశాడు .అరవై ఎల్లు వచ్చాయి .పలకరిస్తే చక్కగా మాట్లా డాడు .ఒకటి రెండు సార్లు
ఫో న్ చేసి మాట్లా డాడు .అప్పుడప్పుడు ఉయ్యూరు వస్తూ ఉంటానని చెప్పాడు .ఊరగాయ కావాలంటే మా అమ్మాయి
మాగాయ ఇచ్చింది .చాలా బాగుందని హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా ఫో న్ చేశాడు .మా మనవడు హర్ష వరుడు లో
అల్లు అర్జు న్ కు తోడి పెళ్లి కొడుకు గా నటించాడు .మేమందరం కూడా అందులో పాల్గొ న్నాం .ఎక్కడో వెతుక్కుంటే కని పించ
వచ్చు .సినిమా అటకెక్కింది పాపం .ఇప్పుడే మేనల్లు డు శాస్త్రి కాళి ఫో ర్నియా నుంచి ఫో న్ చేసి మాట్లా డాడు .తప్పకుండా
వారానికి రెండు సార్లైనా మాట్లా డుతుంటాడు .ఆంద్ర లో ఎండలు మండుతున్నాయత .’’సూర్య భగ భగ వానుడు ‘’గా ఉన్నాడని
ఈనాడు రాసింది .ప్రకాశం జిల్లా లో యాభై కి వచ్చి జనం అల్ల ల్లా డి పో తున్నారట .ఇవాళ కాళి ఫో ర్నియా లో సంపూర్ణ చంద్ర
గ్రహణం అనీ ఇప్పుడే మొదలైందని మేనల్లు డు చెప్పాడు .ఇవీ ఈ వారం విశేషాలు .ఫో టోలు తర్వాతా పేడ తాము .
కిందటి వారం మొదట్లో అంతా కొంచెం నీరసం గా గడిచినా ,చివర్లో ఊపు అందుకోంది .లైబర
్ర ి లోతెచ్చిన వాటి లో
పదకొండు పుస్త కాలు చదివాను .దాదాపు అన్నీ బాగున్నాయి .వాటిలో కొన్ని టి పై ఆర్టికల్స్ రాశాను కూడా .అ మేరికా లోని
రీజియన్ మూడు లో ఉన్న సాయి సర్విస్ సెంటర్లు అన్నీ కలిసి ఇక్కడికి సుమారు నూట ఇరవై మైళ్ళ దూరం లో ఉన్న
అప్పలేచియాన్ పర్వతాల సమీపం లో బ్లూ రిద్జి మౌంటైన్ అనే చోట y.m.c.a.హాల్ లో ఈ నేల 26 –28 మద్య మూడు
రోజులు’’retreat’’ కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారు .దానిలో విహార యాత్ర లాగా మేమందరం పాల్గొ న్నాం .ఆ విశేషాలు –
మూడు రోజులు ఉండాలి కనుక ,వాళ్ళు పెట్టేది అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ,లంచ్ ,డిన్నర్ కనుక మేము తిన గలమో లేమో నని
మా అమ్మాయి విజ్జి ముందు జాగ్రత్త పడి మా కోసం మూడు కూరలు ,రెండు పచ్చళ్ళు , ,పెరుగు ముందే రెడీ చేసింది
.అక్కడికి సుమారు మూడు వందల మంది వస్తా రని అంచనా .వీరికి అక్కడ శనివారం ,ఆదివారం ,సో మ వారం ఉదయంటిఫిన్
మాత్రమే అక్కడ వాళ్ళు పేడ తారట.. .అందుకని శార్లేట్ లోని సాయి సెంటర్ వాళ్ళు వాలంట రి రీగా కొన్ని కుటుంబాలను
కొంత తినటానికి ఏదైనా తయారు చేయమని చెప్పారు .మా అమ్మాయి అంత మందికి రెండు పచ్చళ్ళు తయారు చేసింది
.ఒకటి టమేటా పచ్చడి ,రెండో ది దో స ఆవ కాయ . పెరుగు పులిహో ర ,పెరుగన్నం కూడా తీసుకొని వెళ్ళింది .శుక్రవారం రాత్రికే
అంటే ఇరవై అయిదు రాత్రికే చేరే వారికి ,సో మవారం లంచ్ చేసే వారికి ఈ ఏర్పాట్లు .మా కుటుంబానికి వేరే అన్నం ,వగైరా
.ఇవన్నీ మూడు రోజుల నుంచి తయారు చేసి రెడి చేసింది .ఇంకో ఆవిడ చపాతీలు ఇందరికి .కొందరు పళ్ళు .కొందరు పేపర్
ప్లేట్లు కప్పులు ,కాఫీ పొ డి టీ పొ డి ఇలా ఎవరికి వీలైంది వాళ్ళు స్వచ్చందం గా తెసుకొని వెళ్లా రు .ఇక్కడ డబ్బు వసూలు
చేయరు .ఇలానే యే కార్య క్రమం అయినా నిర్వ హించటం వీరి ప్రత్యేకత .పిల్లలకు బిస్కట్లు ,పాలు యోగాట్లు జూసులు కాన్డీ లు
షరా మామూలే .
మేము శుక్రవారం సాయంత్రం నాలుగింటికి కార్ లో బయల్దే రాం .వీకెండ్ కనుక బాగా ట్రా ఫిక్ ఉంది .బలు రిద్జి చేరే సరికి
రాత్రి ఏడున్నర అయింది .మాకు మంచి రూమే ఇచ్చారు .రెండు మంచాలు న్నది .వెంటనే డిన్నర్ మన వాళ్ళు తయారు
చేసింది –పులిహో ర ,పెరుగన్నం అరటి ఆపిల్ పళ్ళు పెట్టా రు .కడుపు నిండా తిన్నాం .అప్పటికే సగం పైగా జనం వచ్చారు
.రాత్రి పన్నెండు వరకు వస్తూ నే ఉన్నారు .వీరందరికీ బాడ్జీలు ఒక్కో రూం కు నాలుగు తాళం చెవులు ,జరిగే కార్య క్రమాల
వివరాల కాగితం కవర్ లో పెట్టి ఇచ్చారు .ఆ రాత్రి పనేమీ లేదు .కొత్త చోటు కనుక నిద్ర పట్టా లేదు .మర్నాడు ఉదయం నుంచి
కార్య క్రమాలు మొదలు
26 శని వారం ఉదయం అయిదున్నర గంటల నుంచి ,సో మవారం ఉదయం పది గంటల వరకు వివిధ కార్య క్రమాలు
.మూడు రోజులు ఉదయమే ప్రభాత భేరి .అందరు లేచి కార్యక్రమాలకు తయారవటం .అయిదున్నర నుండవేద పనసలు
చదువుతూ నగర సంకీర్తన .ఆరున్నరకుభజన .ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్ .ఎనిమిదిన్నార నుండి ఉపన్యాసాలు మధ్యాహ్నం
పన్నెండు వరకు .ఆ తర్వాతా గంట లంచ్ బ్రేక్ .మధ్యలో కాఫీలు .మధ్యాహనం రెండు నుంచి అయిదు వరకు వివిధ వర్క్
షాపులు .ఐదున్నరకు భజన సాయంత్రం ఆరునుంచి ఏడు వరకు డిన్నర్ .ఏడున్నరకు ప్రత్యెక కార్య క్రమం .ఇదీ షెడ్యూలు .
శని వారం బ్రేక్ ఫాస్ట్ కు వెళ్ళాం .ఆకులు అలమలు కోడిగుడ్డు అట్టు వగైరాలున్నాయి .మేము యోగాత్ ,సీరియల్స్ టిని కాఫీ
కలుపు కొని త్రా గం .ప్రభావతి సభలకు రాలేనంది .మేము వెళ్ళాం .ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ‘’సామరస్యం ‘’.ఇది వ్యక్తిలో
,కుటుంబం లో సమాజం లో ఎలా సాధించాలి అన్న దాని పై ప్రసంగాలు వ్యక్తిలో సామరస్యం విషయం పై ఫ్లా రిడా లో ఉండే
జ్ఞా న భాస్కర్ తెనాలి ప్రసంగించారు .పో తన పద్యాలు ,వేదం భగవద్గీత ల నుండి ఉదాహరిస్తూ మాట్లా డారు .తర్వాతా రీట
మరియు భర్త రాబర్ట్ బ్రూ స్ గార్లు కుటుంబం లో హార్మని గురించి ప్రసంగించారు .వీరిద్దరూ సాయి బాబా శిష్యులై ప్రపంచ
దేశాలన్నీ తిరిగి ప్రచారం చేస్తు న్నారట .ఆ తర్వాతా ట్రినిడాడ్ కు చెందినా ఫైజ్ మొహమ్మద్ చక్కని ఉపన్యాసం సమాజం లో
సామరస్యం పై చేశారు .నాకు ఆయన ప్రసంగం బాగా నచ్చింది .
మధ్యాహ్న భోజనాల తరువాత మూడు చోట్ల వర్క్ షాప్ లు జరిగాయి .ఎవరికి వీలున్న చోట వారు పాల్గొ న
వచ్చు .నేను సుందర అయ్యర్ మాట్లా డిన యోగా క్లా సుకి ,గమేజ్ అనే ఆయన మాట్లా డిన కోపం జయించటం ఎలా అనేదానికి
వెళ్లా ను తెనాలి గారు’’ రుద్రం’’పాడి అందరితో అని పించి అర్ధ ం చెప్పారు .భజన ను ఇతర ప్రా ంతాల నుండి వచ్చిన వాళ్ళు
చేశారు .డిన్నర్ తర్వాతా ఆరు బయట చెట్ల కింద కొయ్య బెంచీలు ఏర్పాటు ఉన్న చోట bon fire ‘’అంటే భోగి లేక చలి మంట
ఏర్పాటు చేశారు .దానికి ముందు సుందరయ్యర్ పుట్ట పర్తి లో తన అనుభవాలను చెప్పారు .’’శంకరాచార్య్ల వారు రచించిన
‘’శివోహం శివోహం ‘’ఆ శ్లో కాలను చాలా బాగా పాడి అర్ధ ం చెప్పారు .దీనికి వ హారమణి మృదంగ సహా కారం కూడా ఉంది .ఒక
గంట ప్రసంగం తర్వాతా కట్టెలు కాల్చి భోగి మంట వేశారు .అందరు పిల్లా జెల్లా సరదాగా చూశారు రాత్రి తొమ్మిదింటికి రూం కు
చేరాం .రావటానికి ,పో వటానికి నడవ లేని వారికి కా ర్టు లు ఏర్పాటు చేశారు .రాత్రి మా భోజనం రూం లోనే మేము వండుకొన్న
పదార్దా లతోనే తృప్తిగా తిన్నాం .మధ్యాహ్నం లంచ్ కూడా మేము తినేట్లు లేదు .మధ్యాహ్న భోజనమూ మాదే .ఇలా మొదటి
రోజు జరిగింది ‘
రెండో రోజు ఆదివారం స భలల్లో inter faith మీద ప్రసంగాలు .క్రిస్తియానిటి కి పాస్ట ర్ స్టీల్ ట్రినిడా నుంచి ,హిందూ మతానికి
తెనాలిగారు ముస్లిం మతానికి ఫైజ్ గారు ప్రతినిధులు గా మాట్లా డారు .ఫైజ్ గారి ప్రసంగమే అన్నిటా బాగుంది ..అంతకు
ముందు రీటా దంపతులు సత్య సాయి సేవా కార్య క్రమాల గురించి ప్రసంగించారు .రీటా గారు చీర కట్టు కొని వచ్చారు .మతాల
మీద మాట్లా డినప్పుడు కన్వీనర్ అక్షిత్ వారిని కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టా రు .అవి ఒకటి రెండు
వాక్యాలలో మీ మతం ఏమి చెప్పిందిచెప్పమని ,మతాన్ని మీరేవిధం గ పాటిస్తా రు .మీ మతం లో ఉన్న దో షాలేమిటి .జననం
,మరణం ,పునర్జ నం ల విషయం లో మీ మతం లో ఉన్న గొప్ప దో షం లేక ఇతరులకు కని పించే దో షం ఏమిటి మొదలైన
ప్ప్రశ్న లకు ముగ్గు రు సమాధానాలు బానే చెప్పారు .అందరి కంటే ఫైజ్ గారి వివరణలు చాలా సూటిగా ,సూక్ష్మం గా ఉన్నాయి
మనసుకు పట్టా యి . ఆయన జీహాద్ గురించి చక్కగా వ్వరించారు .జీహాద్ అంటే అంతస్శాత్రు వులను అంతం చెయ్యమని
తప్ప బయటి వారిని హత మార్చమని కాదని ఒకాయన్ పుర్రెకు పుట్టిన బుద్ధితో తమ మతం అపర తిష్ట పాలైందని చెప్పారు
.అందరు చప్పట్లు చరిచారు .అందుకనే అది అవగానే ఆయన దగ్గ రకు వెళ్లి ‘’ఇవాల్టి ముగ్గు రి లో మీరే హీరో’’అని చెప్పి
అభినందించి ,ఫో టో తీయిన్చుకోన్నాను పాస్ట ర్ గారు హిందూ మతం లో కులాల సమస్య ను ఎత్తి తే ఒక ప్రేక్షకుడు దానిపై
సమాధానం చెప్పమని తెనాలి గారిని కోరితే ఆయన మంచి వివరణే చేశారు .నాయనారులు తక్కువ జాతి వారైనా వారిని
అందరు గౌర విస్తు న్నారని పూజ చేస్తు న్నారుఅనీ చెప్పారు ..వారేమి చెప్పారు అని ముఖ్యం కాని వారి కులానికి ప్రా ధాన్యత
లేదని వివ రించారు .అప్పుడు నేను లేచి తెనాలి ని సమర్ధిస్తూ ‘’ఉపనిషత్తు లను రాసింది ఎక్కువ భాగం బ్రా హ్మణే తరులే నని
ఆవి మనకు శిరోదార్యాలని ‘’చెప్పాను .ఔనని తెనాలి తల పంకించారు ..
మధ్యాహ్న భోజనం కూడా రూం లోనే మా భోజనమే చేశాం .మధ్యాహ్నం రీజినల్ ప్రెసిడెంట్ల సమావేశం ,వచ్చ్చే
సంవత్సరానికి ప్రణాళిక మాట్లా డు కొన్నారు .ఫైజ్ గారి వర్క షాప్ .అయ్యర్ గారి దానికి వెళ్లి కాసేపు కూర్చున్నాం .సాయంత్రం
ఐదున్నరకు పవన్ మమల్నిద్దర్ని కార్ట మీద చుట్టూ పక్కల అంతా తిప్పాడు .ఆరింటికి డిన్నర్ మా రూం లోనే మేము
తెచ్చుకొన్నది విజ్జి వండిన రైస్ కుక్కర్ భోజనం చేశాం .రాత్రి ఏడున్నరకు శార్లేట్ సాయి సెంటర్ కు చెందినా చిన్న పిల్లలు ఒక
నాటిక వేశారు . మా మనవళ్ళు శ్రీకేత్ అశుతోష్ ,పీయూష్ లు కూడా వేషాలు కట్టా రు .అందులో సారాంశం సాయి బాబా
తెలిపిన విశ్వ ప్రేమ ..పిల్లలు బానే నటించారు .ఇదే హై లైట్ అని అందరు అన్నారు .అ తర్వాతా గ్రీన్స్ బో రో లోని యువకులు
సాయి బాబా ప్రేరణ విశ్వజనీనత పై మంచి నాటకం వేశారు .దీన్ని రికార్డు చేసి నటించారు .బాగుంది .ఇది అయేసరికి దాదాపు
తొమ్మిదిన్నర అయింది .పదింటికి మా అల్లు డు శార్లేట్ నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళ టానికి వచ్చాడు .పదిన్నరకు రాత్రి
బయల్దే రి అర్ధ రాత్రి పన్నెండున్నరకు రెండు గంటల్లో ఇంటికి చేరి పడు కొన్నాం .మర్నాడు కార్య క్రమానికి డుమ్మా .
పది రాష్ట్రా ల నుంచి ఇరవై సెంటర్ల నుంచి మూడు వందల యాభై మంది రిట్రీట్ కార్య క్రమం లో పాల్గొ న్నారు .అందరు
ఉత్సాహం గ వున్నారు .అన్ని మతాల ,భాషల వాళ్ళు వచ్చారు .సాయి బాబా మీద అంతటి విశ్వాసం వాళ్లకు ఉండటం చాలా
ఆశ్చర్యం వేస్తు ంది . సర్విస్ ,ప్రేమ అనేవే వీరందరికీ ప్రేరణ .ఈ కార్య క్రమాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని సమయ
పాలన తో చాలా అద్భుతం గా నిర్వహించిన వారు మన తెలుగు వారే అయిన సత్తి రాజు సర్వేష్ అనే ప్రముఖ వైద్యుడు .ఈ
విధం గా ఈ వారం విహార యాత్రా వారం గా తమాషా గా గడిచి పో యింది .
మే ఇరవై ఎనిమిది అమెరికా లో మృత వీరుల సంస్మరణ దినోత్సవం .దీన్ని కూడా రిట్రీట్ లో ప్రసంగించిన వారంతా ఈ దేశ
,ఇతర దేశ మృత వీరులకు నివాళులు అర్పించి సంప్రదాయాన్ని కాపాడారు .దీన్ని ఇక్కడ ‘’మెమోరియల్ డే ‘’అంటారు
.ప్రభుత్వ సెలవు దినం కూడా .దీంతో కలుపు కొని శని ఆదివారాలతో మూడు సెలవులు .కనుక వీళ్ళు లాంగ్ వీకెండ్
అంటారు .ఇక్కడ కూర్చుని చూస్తె పర్వత సౌందర్యం నాయనానదకరం గా కని పించింది .విశాల మైన మోడళ్ళు కల వృక్షాలు
చాలా ఎత్తు లో ఉన్నవి కని పించాయి .చాల కొత్త మిషన్లు ఇక్కడ ఉన్నాయి .ఇళ్లకు పనికి వచ్చే కలప అంతా ఈ ప్రా ంతం
నుండే వస్తు ందేమో .ఇక్కడ వందేళ్ళ క్రితం కట్టిన y.m.c.a. భవనం చెక్కు చెదరకుండా అందం గా ఉంది .దీన్ని ప్రభుత్వం
నేషనల్ మాన్యు మెంట్ గా రక్షిస్తో ంది .ఇక్కడ ఉన్న వరండాలో కుర్చీల లో కూర్చుని అపలేశియన్ పర్వత సౌందర్యాన్ని
అందరు దర్శిస్తా రు .
ఈవారం లోచదివిన పద కొండు పుస్త కాలు –chinook nation ,destruction of books ,mightier thaan svord ,the
lost world of troy ,naat turner ,the spark ,funny things in the white house ,tolkeen ,alaan turing ,man is not
alone ,and re –readings
ఈ వారం మొదట్లో కొంత నీరసం గానే గడిచింది .కాని ఆదివారం మాత్రం సంగీత పుష్కరిణీ స్నానం చేసి
పవిత్రు లమయ్యాం .ఆ విశేషాలు త ర్వాత రాస్తా ను .ఈ వారం లో లైబర
్ర ి నుండి తెచ్చిన వాటిల్లో కిందటి వారం చదవగా
మిగిలినవి చదివేశాను .అందులో కన్ఫుశియాస్ ,బీఉల్ఫ్ ,యే న్సేంట్ గ్రీక్స్ ,ది కమింగ్ అనార్ఖి పుస్త కాలు అద్భుతం
.మిగిలినవి తిరగేశానంతె. ..మంగళ వారం రాత్రి సుబ్బు ఇంట్లో భజన కు వెళ్ళాం .అంతే .శనివారం నేను ,నా మనవడు
పీయుష్ లైబర
్ర ి కి వెళ్లి 21 పుస్త కాలు తిరిగి ఇచ్చేసి 22 పుస్త కాలు తెచ్చు కొన్నాను .అందులో వెంటనే జిం బౌయీ ,జానే
ఎయిర్ పుస్త కాలు రెండు చదివేశాను .మా పక్క ఇంటి ఆవిడ గాయత్రి ‘’ఆంద్ర యోగులు ‘’అనే బిరుద రాజు రామ రాజు గారు
రాసిన పుస్త కం ఒకటి మూడో భాగాలు ఇచ్చింది .మొదటి భాగం చదివేశాను .అందులో ము గ్గు రు మహాను భావుల గురించి
‘’సిద్ధ యోగి పుంగవులు ‘’శీర్షికతో సరస భారతి కి నెట్ లో రాశాను .నేను ‘’విహంగ ‘’అనే నెట్ మాగజైన్ కు రాసిన
‘’ఆడదై పుట్ట టమే ఆమె నేరం ‘’అన్న వ్యాసాన్ని రాసిన వారం లోనే జూన్ సంచిక లో ప్రచురించారు .మద్య యుగ గ్రీకు
మహిళ ,బీ ఉల్ఫ్ ,అలెక్షాన్ద్రియా లైబర
్ర ి ,కన్ఫుశియాస్ ,సిల్వియా పాత్ .కాతేరింన్ మానస్ ఫీల్డ్ అనే రచయిత్రు ల పై నోట్స్
రాసుకోన్నాను .వాటిని వ్యాస రూపం లో తరువాత రాయాలి .ఇలా శని వారం వరకు గడి ఛి పో యిది .ఆది వారం మాత్రం’’ ఫో ర్
ఇన్ వన్ ‘’గా మహదానందం గా గడిచి పో యింది .ఆ విశేషాలే ‘’విజిల్ విజార్డ్ వీక్ ‘’
గళ మురళి –శివ ప్రసాద్
మూడవ తేది ఆదివారం ఉదయం పది గంటలకు ఇక్కడి సత్య సాయి సెంటర్ వాళ్ళు సెంటర్ లో ఈల పాట శివ
ప్రసాద్ గారిని ఆహ్వానించి కచ్చేరి చేయించారు .దానికి అందరం వెళ్ళాం .ఆయన దాదాపు110000 ఈల పాట కచేరీలు చేసి
రికార్డు సృష్టించిన మహా సంగీత విద్వాంసు డు .కృష్ణా జిల్లా పామర్రు దగ్గ ర గుడివాడ రోడ్డు లో ఉన్న కొమర వోలు వారి అసలు
ఊరు .అక్కడ గాంధీ ఆశ్రమం కూడా ఉండేది .సెకండరి గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్ కూడా ఉండేది .నేను హెడ్ మాస్ట ర్ గా పని
చేసిన అడ్డా డ ప్రక్క గ్రా మమే అది .అక్కడి నుంచి వీరి పూర్వీకులు బాపట్ల చేరి అక్కడే నివాసం ఉన్నారు .కనుక
కొమరవోలుతో ఈయన కేమీ సంబంధం లేదు .హైదరాబాద్ రవీంద్ర భారతి లో దాదాపు ఇరవై ఆరు ఏళ్లు ఉద్యోగం చేసి
స్వచ్చందం గా పదవీ విరమణ చేసి సంగీతానికే జీవితాన్ని అంకితం చేస్తు న్నారు .గొప్ప సంస్కారం ఉన్నవారు . సత్య సాయి
బాబా సమక్షం లో ఈల కచ్చేరి చేసి ఆయన కు దగ్గ రై ,ఆయన ఆశీర్వచనం, ఆదేశం పై ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తు న్నారు
.సేవ ,ప్రేమ లను ప్రచారం చేస్తూ సాయి సెంటర్ల ను దర్శించి భజనలను ఈల పాట తో చేసి ఆనడం కలిగిస్తు న్నారు .సత్య
సాయి వీరికి రెండు సార్లు బంగారు గొలుసు బహుమతి గా ఇచ్చారు . దాదాపు రెండు గంటల సేపు భజన సంగీతాన్ని విని
పించి ముగ్ధు లను చేశారు . .అమెరికా రావటం ఇది అయిదవ సారి .సత్య సాయి తో తన పరిచయాన్ని వివ రించారు .కంచి
,శృంగేరి జియ్యర్ దత్త స్వామి సమక్షం లో కచేరీలు చేశారు .బాల మురళి కృష్ణ ఆయన్ను శిష్యునిగా స్వీకరించి పెద్దలకు
పరిచయం చేసి ఆయన ఉన్నతికి తోడ్పద్దా రని ఎంతో కృతజ్ఞ త భావం గా చెప్పారు .సత్య సాయి తో పరిచయం తర్వాతే తనకు
పేరు ప్రఖ్యాతి ఆర్ధిక వెసులు బాటు బాగా కలిగాయని చెప్పారు .బాబా మీద 123 దేశాలలో ని భక్తు లకు అచంచల విశ్వాసం
ఉండటం తాను ప్రత్యక్షం గా చూసి ఆశ్చర్య పో తునానని అన్నారు .రష్యా దేశం లో రెండు వందల మంది రష్యన్లు భజన లో
పాల్గొ నటం వింత అన్నారు .దీనికి కారణం ఆయన ప్రవచించిన సేవా ,ప్రేమ అని పిస్తు న్నాయని అన్నారు .సెంటర్ వారు నన్ను
ఆహ్వానించి నాతో శివ ప్రసాద్ గారికి సత్కారం చేయించి శాలువా కప్పించారు .అ గౌరవం నాకు ఇవ్వటం నాకు ఎంతో త్రిల్ అని
పించింది .ఇప్పటికి మూడు ఆల్బమ్స్ సత్య సాయి భజనల్ మీద ఇచ్చానని చెప్పారు .నాలుగోధా నికి స్పాన్సర్ చేస్తా మని
ఇక్కడి జగదీశ్ లక్ష్మి దంపతులు వాగ్దా నం చేశారు .దానికి మూడు వేల డాలర్లు అవుతుందట .అంటే సుమారు రెండు లక్షల
రూపాయలు .వారికి సాయి మీద ఎంత నమ్మకమో అర్ధమయింది .మా అమ్మాయి పనస తొనలు ,రాంకీ ఉషల పులిహో ర
అందరికి పెట్టా రు .
తెలుగు అసో సియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లేట్ యేరియా
ఈ రో జున షా ర్లేట్ లోని తెలుగు వారంతా ఒక పార్క్ లో పిక్నిక్ ఏర్పాటు చేసుకొన్నారు .దానికి మేమూ వెళ్ళాం
.పిల్లలు ఆడు కోవటానికి చిన్న గేమ్స్ ,పెద్దలు వాలీ బాల ఆడారు .మేము సెంటర్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చాం .అప్పటికే
దాదాపు అందరి భోజ నాలు అయి పో యాయి .నాగమణి ,గాయత్రి సహాయం చేస్తు న్నారు .మేమందరం భోజనాలు చేశాం
.పులిహో ర ,పెరుగన్నం ,అన్నం సాంబారు ,చట్ని వెజిటబుల్ బిర్యాని పుచ్చ ముక్కలు ఐస్క్రీం ,కోలా .పెట్టా రు .ఒక అరగంట
అక్కడ ఉన్నాము .వాళ్ల జెనరల్ బాడీ మీటింగ్ జరుగు తోంది .వాళ్ల కార్య వర్గ ం లో ఉన్న జ్యోతి అనే అమ్మాయి సరసభారతి
వ్యాసాలూ చదువు తుండటం వల్ల నా ఫో టో చూసి నన్ను గుర్తు పట్టింది .ఆమె ,పవన్ భార్య రాదా పిల్లలకు ఆదివారాల్లో
తెలుగు నేర్పుతున్నారిక్కడ .అక్కడి నుంచి బయల్దే రి మూడింటికి ఇంటికి చేరాం .
ఈల లీలా లోల –గళ వంశీ –విజిల్ వజీర్ సుల్తా న్
ఇక్కడి హిందూ సెంటర్ వాళ్ళు ,సాయి సెంటర్ వాళ్ల ఆధ్వర్యం లో వెంకటేశ్వర ఆలయం కు అను సంధానం గా ఉన్న
‘’గాంధీ భవన ‘’లో శివ ప్రసాద్ గారి కచేరి ఏర్పాటు చేశారు ..మేము నాలుగున్నరకు అక్కడికి చేరు కొన్నాం .ఐదున్నరకు
కచేరి ప్రా రంభ మైంది .చుట్టూ ప్రక్కల ఉన్న కళాకారులు ప్రక్క వాయిద్యాలు వాయించారు .మంజు నాద అనే ఇక్కడి ఆయన
మృదంగం ,ఒకామె హార్మని ,ఒకాయన తబల ,ఒకాయన ఫిడేల్ లతో సహకరించారు .శివ ప్రసాద్ ‘’వాతాపి గణ పతిం భజే తో
ప్రా రంభించి ,త్యాగరాజు గారి ఎందరో మహానుభావులు ఆ తర్వాత పురందర దాస ,అన్న మాచార్య కీర్తనలలు మొదలైనవే కాక
,రాగ ప్రస్తా రమూ చేసి ఆనంద పారవశాత్వం కల్గించారు .ఎంతో అలవోకగా పాడటం అద్భుతం అని పించింది .నాన్ స్టా ప్ గా
పాడటం మరీ అబ్బుర పరచింది .గమకాలు చమక్కులు వివిధ స్తా యీ భేదాలు స్పష్ట త ,వేగం అంకిత భావం తో అసలు
జనాలకు బాహ్య స్పృహే లేకుండా చేశారు .గంధర్వ లోకాలలో విహరింప జేశారు .వాద్య సహాకారక్మూ వన్నె తెచ్చింది ..రస
గంగా ప్రవాహం లో తడిసి ముద్దా అయ్యాం అందరం .చివరికి రెండు భజనలు పాడారు . .గాంధీ భవనం లో
జరుగుతున్నందున గాంధి గారికి ఇష్ట మైన ‘’వైష్ణవ జనతో ‘’పాడి రక్తి కట్టించారు .శివ ప్రసాద్ ను హిందూ సెంటర్ వారిఉ
శాలువతో జ్ఞా పిక తో సత్కరించారు .ఆయన కృతజ్ఞ త చెప్పారు .కచేరి ప్రా రంభానికి ముందు నేను ‘’సత్య ‘’ తో శివ ప్రసాద్ కు
ఒక బిరుదు ఇద్దా ం అని సూచన చేశాను ‘’మీరు ఏది సూచిస్తే అది ఇద్దా ం ‘’అన్నాడు సత్య .సరే నన్ను వేదిక మీదికి సత్య
ఆహ్వానించాడు
నేను ముందు తెలుగు లో ,ఆ తర్వాతా దాన్నే ఇంగ్లీష లో చెప్పాను ‘’శివ ప్రసాద్ గారికి ముందే ఆంద్ర దేశం లో ఈల
పాటకు గొప్ప ప్రచారం తెచ్చి లిజేండ్ గా నిలిచిన మహాను భావుడు న్నాడు .ఆయనే కే.రఘు రామయ్య .పౌరాణిక నాటకాలలో
నారద ,శ్రీ కృష్ణ ,బిల్వమంగలుడు వంటి వేషాలు వేసి సినిమాలలోను నారద ,శ్రీ కృష్ణ పాత్రలను పో షించిన నటుడాయన .ఆ
కాంత స్వర గంగా ఝరీ ప్రవాహం .ఆయన ఈల పాట బాగా పాడే వాడు .ఆయన్ను ఈల పాట రఘు రామయ్య అనే వారు
.ఈల పాటకు స్టేజి మీద పాడే అర్హత తెచ్చి దానికి ఒక హో దా ,గౌరవం తెచ్చిన మహా గాయకుడు రఘు రామయ్య .ముందు
ఆయన్ను స్మరించాలి .ఈ తరం వారికి తెలియని గాయకుడు .ఆ తర్వాతా ఎవరు దాని జోలికి పో యింది లేదు .మళ్ళీ శివ
ప్రసాద్ గారు దాన్ని సాధన చేసి ఈల పాటకు ఉన్న గౌరవాన్ని అంతర్జా తీయ స్తా యి లోకి తీసుకు వెళ్లి తెలుగు వాడి కీర్తి ని
అంతర్జా తీయం గా ప్రతిష్టించి లెజెండ్ అయ్యారు మళ్ళీ .ఆయన రఘు రాముడు –ఈయన శివుడు .ఇద్దరికీ అభేదమే .వీరు
మరింత ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాను .ఇక్కడి శార్లేట్ ప్రజల తర ఫున శివ ప్రసాద్ గారికి తెలుగు లో ‘’ఈల లీలా
లోల ‘’అనే బిరుదు నిస్తు న్నాం .అంతే కాదు అందరికి అర్ధ ం కావాలని మరో బిరుదు ‘’గళ వంశీ ‘’కూడా ఇస్తు న్నాం వంశీ అంటే
మురళి,వేణువు . కృష్ణు డు వంశీ లోలుడు .ఆయనది మోహాన వంశీ . శివ ప్రసాద్ ఈలలో అనేక లీలలు చూపిస్తూ
తన్మయుయులై మనల్ని కూడా తన్మ యులను చేస్తు న్నారు .అందుకే’’ ఈలలీలా లోల’’ .మురళీ లోల అంటాం కృష్ణు డిని
‘’అని నేను అనగానే జనం చప్పట్లు విపరీతం గా చరిచారు .చాలా బాగా మాట్లా డానని అందరు నన్ను మెచ్చారు .శివ ప్రసాద్
గారు స్టేజి మీద అభివందనం చేసి ,నత మస్త కులైనారు .చాలా ఆనందం వేసింది .ప్రక్కనే ఉన్న బాలాజీ దేవాలయాన్ని
దర్శించి ఇంటికి వచ్చే సరికి రాత్రి తోమ్మిదయింది .
శివప్రసాద్ పరిచయం
రాత్రి మా అమ్మాయి వాళ్ళింటికి శివ ప్రసాద్ గారు భోజనానికి వచ్చారు .వచ్చేసరికే పది అయింది .మా
అమ్మాయి విజ్జి ,నాగమణి సుబ్బు భార్య సీత కలిసి చపాతీలు ,వంకాయ కూరాచేశారు .సాంబారు ,టమేటా చట్నీ ,ఆవకాయ
,పెరుగు టో భోజనం పెట్టా రు .ఆయన నేను కలిసి తిన్నాం .నాగమణి భర్త గారు కూడా ఇక్కడే హో జనం చేశారు .ఆ తర్వాతా
సుబ్బు వాళ్ళు వచ్చి భోజనం చేశారు .భోజనం అయినతర్వాత మేడ పైకి తీసుకొని వెళ్లి కాసేపు ఆయనతో మాట్లా డాను .చాలా
విషయాలు చెప్పారు .అవన్నీ తెలియ జేస్తు న్నాను .
సత్య ప్రసాద్ గారు వారి బాబాయి నుండి ప్రేరణ పొ ందారు .చిన్నప్పటి నుంచి ఈల వేయటం అలవాటు గంటల
తరబడి పాడే వారు .అందరు ఆనందించే వారు .తర్వాతా కర్నాటక ,హిందుస్తా ని శాస్త్రీయ సంగీతాలలో ప్రా వీణ్యం సంపాదించారు
.అమెరికా ,ఆస్ట్రేలియా ,జపాన్ ,బ్రిటన్ ,మారిషస్ ,సింగపూర్ ,మలేషియా ,బాంకాక్ ,బెహ్రా న్ ,ఖతార్ మొదలైన చోట్ల పర్య టించి
ఈల కచేరీలు ఇచ్చారు .
విజిల్ విజార్డ్ ,అంటే ‘’ఈల మహేంద్రజాల’’,మానవ మురళి ,గళ మురళి ,ఆంధ్రా నైటింగేల్ ,కళా సరస్వతి ,ముఖ
మురళి ,శ్వాస మురళి ,ప్రక్రు తి మురళి ,సంగీత కళా సాగర్ వంటి ఎన్నో బిరుదులూ పొ ందారు .విజిల్ వజీర్ సుల్తా న్ అంటే
ఇంకా బాగుంటుందేమో /
త్యాగరాజు ,దీక్షితార్ ,అన్నమయ్య ,లపై కేసెట్లు సిడి లు తెచ్చారు .గత ముప్ఫై ఏళ్లు గా ఈల పాటకు అంకితమై ఉన్నారు
.ఇప్పటికి 11000 ప్రదర్శనలిచ్చారు .
2002 ,2004 ఆంధ్రపద
్ర ేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాల నిచ్చింది .అమెరికా లోని కాన్సాస్ లో జీవన సాఫల్య
పురస్కారం పొ ందారు .2010 లో నట సామ్రా ట్ అక్కినేని నాగేశ్వర రావు వీరికి లైఫ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ,స్వర్ణ
కంకణాన్ని అందించారు .మహతి అవార్డు ,రసమయి పురస్కారం అందుకున్నారు .రఘురామయ్య గారు భా రత మొదటి
ప్రధాని జవహర్లా ల్ సమక్షం లో ఈల కచేరి చేస్తే ,శివ ప్రసాద్ ఆయన కుమార్తె ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె
ఎదుట కచేరి చేశారు .ప్రపంచం మొత్త ం మీద ఈ ఈల అనే కళ మన ఆంద్ర దేశానికి దక్కిన కళ .అవధానం తెలుగు వారికే
స్వంతం అయి నట్లు .అంతర్జా తీయం గా ఇప్పుడున్న ఈల కళా కేకారుడు శివ ప్రసాద్ ఒక్కరే . 1988 లో
పి.వి.నరసింహా రావు గారి తో మాస్కో ఫెస్టివల్ కు వెళ్లా రు .ఈల మీద మొదటి ఎల్.పి. రికార్డ్ ఇచ్చి నందుకు 1991 లో లిమ్కా
బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థా నం సంపాదించారు .మారిషస్ దేశం లో వారి 150 వ స్వాతంత్ర దినోత్స వం లో పాల్గొ న టా నికి చంద్ర
బాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తర ఫున స్పెషల్ ఆర్టిస్ట్ గా పంపబడిన అరుదైన కళా
కారుడు శివ ప్రసాద్ .అమెరికా లోని బ్రిడ్జి వాటర్ లోని బాలాజీ దేవాలయ మహా కుంభాభి శేకానికి ఆహ్వానిమ్పబడి కచేరి
చేశారు .
ఇప్పటికి పది క్లా సికల్ విజిల్ మ్యూజిక్ ఆడియో సిడి లను ఇచ్చిన ఏకైక వ్యక్తీ ఈల కళాకారుడు శివ ప్రసాద్
.శంకరాభరణం ,మోహన రాగాలను ఫూజన్ చేశి ఈల లో విని పించారు .జి ..వి.అయ్యర్ దర్శకత్వం చేసి సంస్కృతం
లో నిర్మించిన ‘’ఆది శంకరా చార్య ‘’చిత్రా నికి బాల మురళీ కృష్ణ సంగీత దర్శకత్వం వహించగా ,ఆయన శిష్యుడైన శివ
ప్రసాద్ ఈల పాట తో బాక్ గ్రౌ ండ్ మ్యూజిక్ నిచ్చి నిండుదనం తెచ్చారు .ఇరవై ఏళ్ళ క్రితం వాగ్గేయ కారుడు బాల మురళి కృష్ణ
తో ఏర్పడిన గురు శిష్య సంబంధం అవిచ్చిన్నం గా కొన సాగుతోంది .తనను తీర్చి దిద్దింది బాల మురళే నని గళ మురళి
అనే బిరుదు ఆయన ఇచ్చిన్దేనని పొ ంగి పో తు చెప్పారు శివ ప్రసాద్ .రేపు శివ ప్రసాద్ గారికి మా ఇంట్లో విందు .రేపు వారితో
లైవ్ రేడయో
ి ప్రో గ్రా ం కూడా నిర్వహిస్తు న్నాం .
ఇలా ఈ ఆది వారం’’ ఫో ర్ ఇన్ వన్ ‘’ గా గడిచింది ,..నాలుగు సార్లు అమెరికా వచ్చినా తెలుగు సంఘం తో కలవటం ఇదే
మొదటి సారి ..’’ఇదో తుత్తి ‘’.
ఈల లీలాలోలుడు ,ముఖ వంశీ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు కిందటి వారం లో మొదటి రెండు రోజులు
అంటే నాలుగు ,అయిదు తేదీలు –సో మ ,మంగళ వారాలు శార్లేట్ నగరం లో ఉండి రసజ్నులకు ఈలా వినోదాన్ని పంచారు
.సో మవారం సాయంత్రం శ్రీ చక్ర వర్తి ,అనిలా దేవి దంపతుల ఇంట్లో సాయి భజన లో పాల్గొ న్నారు .సాయి బృందం లో ని
సభ్యులు బెల్లం కొండ రవి ,ఉషా దమతులు ఇండియా వెళ్లి పో తున్న సందర్భం గా ఆత్మీయ సమావేశం జరిగింది
.వారిద్దరికిహృదయభారం తో వీడ్కోలు చెప్పాము .కేక్ కూడా కట్ చేయించారు .దాదాపు గంట సేపు శివప్రసాద్ తమ ఈల లీల
ను అన్ని రకాలుగా ప్రదర్శించి ,అన్ని రకాల భజన కీర్తనలను పాడి ,జనంతో పాడించి భక్తీ ని రాశీ భూతం చేశారు .ఆయన
మిషన్ చాలా అద్భుతం గా పండింది .ఆ తర్వాతా విందు ఏర్పరిచారు .నలభై మంది కి పైగా హాజరై,ఆసాంతం విని తరించారు
.చపాతి కూర ,బిర్యాని ,సాంబారు ,పెరుగన్నం ,మామిడి పల్ల ముక్కలు ,పుచ్చముక్కలు ,పరవాన్నం తో విందు ఇందించారు
.ఒక రకం గా రెండు విన్డు లందు కొన్నాం .ఒకటి ఈల విందు ,రెండు భోజన విందు .ఆ దంపతుల ఆత్మీయత చాలా బాగా
ఆకర్షించింది .అందరు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి పో యారు .రవి వాళ్లకు మన వాళ్ళందరూ గిఫ్ట్ అంద జేషి ,గ్రూ ప్ ఫో టో
తీయించు కొన్నారు .
మర్నాడు మంగళ వారం మధ్యాహ్నం శివ ప్రసాద్ గారు భోజనానికి మా ఇంటికి వచ్చారు .కారట్ హలవా
,మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,కొబ్బరి చట్ని ,అన్నం ,సాంబారు ,పెరుగు ,ఒడియాలు ,ఆవకాయ తో విజ్జి భోజనం
వడ్డించింది .మేమిద్దరం కలిసి భోజనం చేశాం .ఆయన ఈ వంటా ,వాతా వరణం చాలా బాగా ఉన్నాయని మెచ్చు కొన్నారు
.నాకు వారి సిడి లు రెండు కానుక గా ఇచ్చారు ,మా అమ్మాయింకి ఒకటి ఇచ్చారు .మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు
గంటల వరకు ‘’టోరి’’లైవ్ రేడియో ప్రో గ్రా ం చేశారు ఇక్కడే ఉండి .శ్రీమతి నాగ మణి గారు చాలా హుందాగా ,విశ్వాసం గా
నిర్వహించారు .చాలా నిదానం గా తన జీవితాన్ని ,చదువు ,దీనిలోకి ప్రవేశించిన విధానం ,ఎదిగిన పద్ధతి తనకు వెన్నెముక
గా నిలిచినా వ్యక్తు లు గురించి రెండు గంటలు అనర్గ ళం గా వివ రించి శ్రో తలను ఆకట్టు కొన్నారు .నేను ప్రక్కనే ఉండి ,కొన్ని
ప్రశ్నలడిగి సమాధానం రాబట్టా ను .ఆ రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .శివ ప్రసాద్ గారు ‘’ఆంజనేయ వీర ,హను మంత
శూరా ‘’అనే కీర్తన తో పాటు ఇంకా కొన్ని పాడి మంచి అనుభూతి కల్గించారు .హిందీలో ‘’చౌదవీక చాంద్ హో ‘’తెలుగు లో ‘’నా
హృదయం లో నిదురించే చెలీ ‘’,’’లాహిరి లాహిరి లాహిరి లో ‘’పాడి విని పించి ఎక్కడికో తీసుకొని వెళ్లా రు .ప్రతి పాటకు చప్పట్లు
చరచి భిమానాన్ని చాటాం .నేను ‘’సరసభారతి’’ తరఫున ‘’శ్రీ హనుమత్కదా సుధా ‘’ను వారికి అందరి సమక్షం లో కానుక గా
ఇచ్చాను .ఇండియా వెళ్లి నప్పుడు విజయ వాడ వైపుకు వస్తే తప్పక ఉయ్యూరు రమ్మని కోరాం .తప్పకుండా వస్తా మని హామీ
ఇచ్చారు .నలభై మంది హాజరైన డిన్నర్ లో మా అమ్మాయి అల్లు డు మంచి పదార్ధా లు వడ్డించారు .నాగమణి ,గాయత్రి గార్లు
సహాయం చేశారు .హల్వా ఇడ్లి సాంబారు ఉప్మా ,ఆవకాయ ,అన్నం పెరుగు ,పుచ్చముక్కలు తో పసందుగా విందు .అందరు
ఆత్మీయం గా వచ్చి ఆనందం గా విని ఆనందించారు .ప్రక్కనున్న అమెరికన్స్ కూడా వచ్చి ఎంజ్జా య్ చేయటం చాలా గొప్ప
విషయం .ఇప్పుడు రేడియో లో శివ ప్రసాద్ గారు చెప్పిన సారాంశం తెలియ జేస్తా ను
శివ ప్రసాదీయం
తెలుగు వారికే ప్రత్యెక మైన రెండు ప్రక్రియలు ఉన్నాయి .అవి కవిత్వం లో అవధానం చేయటం .రెండు ఈల తో
సంగీతాన్ని విని పించటం .ఈల పాటకు ఆద్యులు స్వర్గీయ కే.రఘు రామయ్య గారు .ఆయన పాడిన దానికి శివ ప్రసాద్ పాడిన
దానికి తేడా ఉండి .ఆయన చూపుడు వ్రేలును మడిచి నోటిలో ఉంచి ,గాలి పీల్చి వదులుతూ ,ఈల వేస్తా రు ,పద్యం పాడుతారు
. ఆగాలి అయి పో గానే మళ్ళీ పీలుస్తా రు .కనుక మధ్యలో విరామమ ఉంటుంది .ఆయన ఎక్కువగా పద్యాలే ఈల తో పాడే
వారు .అది ఆయన ధో రణి .ఆయన పౌరాణిక నాటకాలు ,సిని మాలలో నారదుడు శ్రీ కృష్ణ పాత్రలు ధరించి బాగా ప్రఖ్యాతి
పొ ందారు .ఆయనకు ఈల పాట ఒక హాబీ .కాని శివ ప్రసాద్ గారికి అది జీవన వేదం .ఉచ్వాస ,నిస్స్వాసాలలో రెండిటి లోను
వీరు ఈలను పలికిస్తా రు .కనుక గాప్ అనేది ఉండదు .ఒక మహా ప్రవాహం గా సాగి పో తుంది .ఆయన ఈల పాట పాడటానికి
కొంచెం కష్ట పడి నట్లు న్తు ంది .వీరి పాట అలవోక గా ,సెలయేరు లా సాగి పో తుంది .కూర్చుంటే ఎన్ని గంట లైనా అలా
పాడేస్తూ నే ఉంటారు .విశ్రా ంతి అక్కర్లేదు ..ఈల వీరికి ‘’శ్వాసావధానం ‘’అని పిస్తు ంది .ఆయన మొదట దాన్ని స్టేజి గౌరవం
కల్పిస్తే ,ప్రసాద్ గారు అంతర్జా తీయ వేదిక ను ఈల కు నిర్మించి ,అదొక గొప్ప కళ గా’’ ఆర్ట్ ఫాం ‘’గా ప్రచారం చేసి ,యేన లేని
కీర్తి తాను పొ ంది ,ఈల కూ సంపాదించారు .
ఈలలో అన్ని స్థా యిల్లో ను పాడగల సత్తా శివ ప్రసాద్ గారిది .యే స్థా యిలోను ఎక్కడా పలకటం లో తేడా రాదు
.అన్ని రకాలైన పాటలు ,అన్ని భాషల్లో పాడుతున్నారు .ఎవరికి వారు శివ ప్రసాద్ తమ వాడే అని పిస్తు ంది .అంత బాగా
మనస్సుల్ని రంజింప జేస్తా రు .బయటకు వెడితే ఎప్పుడు పడితే అప్పుడు పాడ టానికి వీలుగా ‘’ట్రా క్ ‘’తయారు చేసుకొన్నారు
.అది లక్ష రూపాయలకు పైనే ఖర్చు అయింది .అది ఉండటం చాలా హాపీ గా పా డ టానికి వీలవు తోంది .ఇంత అంతర్జా తీయ
కళా కారుడు మామూలు ఇళ్ళల్లో కూర్చుని పాడటం అంటే ,ఆయన ఎంత ఉదార హృదయం గల వారో అర్ధ ం అవుతుంది
.ఆయన అతి సాధారణం గా ఉంటారు .వేడి నీరే తాగుతారు .పెరుగు వేసుకోరు .ఆరోగ్య సూత్రా లను బాగా పాటిస్తా రు .కళా
కారులు వ్యసనాలకు బలి పో వటం తనకు బాధ కలిగిస్తు ందని ,అలాంటి వారి జీవితాలు తన కు గుణ పాథం అని చెప్పారు .
తనను బాగా ప్రో త్స హించిన వారు ముగ్గు రు సంగీత కళా కారులు అన్నారు .ఒకరు వాగ్గేయ కారులు ,పద్మ
విభూషణ్ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు .ఈల ఏమిటి ? వదిలెయ్యి .అది దేనికీ పనికి రాదు అని నిరుత్సాహ
పరిచారు మహా మహా విద్వాంసులు .అప్పుడు బాల మురళి ఆదరించి మద్రా స్ లో తన ఇంట్లో ఉంచుకొని ,తన కుమారుడిగా
చూసి శాస్త్రీయ సంగీతపు మెళకువలు నేర్పారు .తాను పాడి ,ఈయనను అలాగే ఈల తో పలక మని ,దగ్గ రుండి అమిత
వాత్సల్యం తో నేర్పి ఈల కు శాస్త్రీయత కలగటానికి ,తన అభి వృద్ధికి ఎంతో తోడ్పద్దా రని శివ ప్రసాద్ మురిసి పో తారు .బాల
మురళి గారి భార్య అన్న పూర్ణ గారు నిజం గానే అన్న పూర్ణ .రోజు వారింట్లో ఎంత మంది వచ్చి ఆతిధ్యం తీసు కొంటారో
లెక్కలేదు . .అందరికి వండి వడ్డించే ఇల్లా లు ఆమె అని రెండు చేతులు ఎత్తి నమస్కరించారు .పేరు సార్ధ కం చేసుకోన్నారామే
.మను చరిత్ర లో పెద్దన గారు ప్త వ
్ర రాఖ్యుని ఇల్లా లిని ‘’వడ నలయదు వేవురు వచ్చి రేని ,నడి కి రెయైన ‘’అన్న పద్యం
జ్ఞా పకం వస్తు ంది .అంతే కాదు బాల మురళి కుమారులు తనను ఒక సో దరునిగా కుమార్తెలు తమ్మునిగా చూశారని అంటారు
.అల్లు ళ్ళు ,కోడళ్ళు బాల మురళి గారిని ‘’నాన్న గారు ‘’అనే పిలుస్తా రాట .’’మామ గారు ‘’అనరట .అంతటి సంస్కారం వారిది
.మామ గార్ని తండ్రి లా భావించటం బాల మురళికి అరుదైన గౌరవం .అంతే కాదు రాత్రి బాలమురళి నిద్రించ టానికి ముందు
అల్లు ళ్ళు ఆయన కాళ్ళను ,పాదాలను ఒత్తి భక్తీ ని ప్రదర్శించటం తనకు ఆశ్చర్యమేసింది అంటారు శివ ప్రసాద్ .
ఎందరెందరో సంగీత విద్వాంసులకు పరిచయం చేసి వారి ద్వారా నేర్చుకో దగింది నేర్పించారట బాల మురళి .తనకు
తెలీకుండా నే తన తో ఈల పాటల కేసట్టు రికార్డ్ చేయించే పని చేబట్టి ఒక్క రోజు ముందు మాత్రమే చెప్పి చేయించారట .అంత
ముందు చూపు ,ప్లా న్ బాలమురలికి ఉండేదట .తనకు తెలీకుండా రికార్డింగ్ సమయం లో బాల మురళి ,తన పాటలకు కంజీర
వాయించి మరీ ఆశ్చర్య పరిచారట .మిగిలిన కళా కారుల్లా తాను కింద కూర్చుని ,శివ ప్రసాద్ ను కుర్చీలో కూచో బెట్టి ఫో టో
తీయిన్చుకున్నారట పద్మ విభూషణుడు .అదీ ఆయన గొప్ప తనం అన్నారు .బాల మురళి దగ్గ రే సంగీతం నేర్చిన అపర బాల
మురళి అని పించుకొన్న డి .వి.మోహన కృష్ణ శివప్రసాద్ గారికి సహాధ్యాయి .తనే సీనియర్ అంటారు ప్రసాద్ .మోహన కృష్ణ
వివాహం చేయించింది ,ఉద్యగం ఇప్పించిండీ గురువు గారే .
ప్రముఖ శ హనాయ్ విద్వాంసులు ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ గారు శివ ప్రసాద్ గారి ఈల పాట విని ఎంతో
మెచ్చుకొని ,ప్రో త్స హించారట .తన శాహనాయినీ ముందుగా ఎవరు ఆదరించలేదని ,ఆ తర్వా దానికి తాను స్టేజి గౌరవాన్ని
తెచ్చిన తర్వాతే గుర్ర్టింపు లభించిందని ,ఇది మామూలే నని ,నిరాశ చెండ వద్ద ని బో ధించారు .అలాగే శ్రీనివాసన్ గారు
వయోలిన్ వాయిస్తూ శాస్త్రీయ విషయాలను దగ్గ ర కూర్చో బెట్టు కొని నేర్పి తన ఉత్సాహానికి ఉద్దీపన కల్గించారు .ఈ ముగ్గు రు
ప్రో త్సహించక పో తే తనకు శాస్త్రీయ సంగీతం లో అవగాహన వచ్చేది కాదని ,అది అలవడి నందు వల్లే తాను రాణిస్తు న్నానని
వినయం గా చెప్పారు .
తానూ రఘు రామయ్య గారు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఈల కళా కారులం అని గర్వం గా చెప్తా రు శివ ప్రసాద్
.తన’’ మెంటార్’’ కొన ప్రభాకర రావు గారని చెప్పారు .ఇద్దరిది బాపట్ల .తన తండ్రి , తాత గార్ల దగ్గ ర ఆయనకు బాగా పరిచయం
వారంటే విపరీత మైన గౌరవం కొన గారికి ఉండే వనిఅందుకే తనను వీలైన చోట్ల కల్లా తీసుకొని వెళ్లి పరిచయం చేసి తనతో
ఈల పాట పాడించే వారని .అంతగా ప్రో త్సహించే వారు అరుదు అని ప్రభాకర రావు గారు ఆంద్ర ప్రదేశ్ స్పీకర్ గా ,మహారాష్ట ్ర
గవర్నర్ గా పని చేయటం తనకు మంచి అవకాశాలు రావటానికి తోడ్పడ్డా యని బిస్మిల్లా ఖాన్ గారి వద్ద పాడే అదృష్ట ం బాల
మురళి గారి ముందు పాడే అవకాశం అలానే కల్గా యని అన్నారు .ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధి గారికి పది నిమిషాలు ఈల
పాట విని పించే పర్మిషన్ కోన గారు పొ ంది ,తనను తోటి సహవాద్య కారులను తీసుకొని వెళ్లా రట .ఈల మొదలైంది .ఆమె
అన్ని కార్య క్రమాలను వాయిదా వేసుకొంటూ గంఅ సేపు అలానే కూర్చుండి పో యారట .అది మరపు రాని సంఘటన
అన్నారు .ఘన సన్మానం చేసి పంపారట .
ఒక సారి బాపట్ల లోప్రముఖ హరికధకులు ,శాస్రీయ సంగీత విద్వాంసులు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి
హరికదను రామ నవమి పందిరి లో ఏర్పాటు చేశారట .ఆయన తెనాలి నుండి రావాలి .ట్రైన్ఒక గంట లేటు .అందుకని తనను
ఆయన వచ్చే దాకా ఈల పాట పాడ మన్నారట .అలా ‘’అరంగేటం్ర చేశాను’’ అంటారు శివ ప్రసాద్ .తన కుమారుడు ఫ్లూ ట్
వాయిస్తా డని మాన్ద లీన్ ఈల కూడా బాగా చేస్తా డని ,కుమార్తె సంగీతం బానే నేర్చిందని ,తన భార్య సాధారణ గృహిణి అని
తెలియ జేశారు .
మీరు ఏమి సాధించారు ?ఇంకా ఏమైనా సాధించాలని అనుకొంటున్నారా /అని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం
గా ,ఈల కు శాస్త్రీయ స్థా యి కల్పించే తపన ఉందని ,ఈల కు విద్యా కోర్సు ను ఏర్పరచి యునివేర్సిటి స్థా యిలో ఒక సబ్జెక్ట్ గా
చేయాలని ప్రభుత్వం పై ఒత్తి డి తేవాలని అను కొంటు న్నానని చెప్పారు .తనకు సంతృప్తి గా ఉందని ,సత్య సాయి బాబా
అనుగ్రహం తనను ఎంతో ముందుకు తీసుకొని వెళ్తో ందని అందరికి ఈల ద్వారా ఆనందం పంచటం సేవ ,ప్రేమ లను ప్రపంచం
అంతటా చాటి చెప్పటం తన బాధ్యత గా భావించి పని చేస్తు న్నానని తెలియ జేశారు . నేను శివ ప్రసాద్ గారికోరిక తీరాలని
చెబుతూ వారి ఈల కళ ను ప్రభుత్వం గుర్తించి అత్యంత ప్రతిష్టా కరమైన ‘’పద్మ పురస్కారం ‘’వారికి లభించాలని అందరి
తరఫునా కోరాను .శివ ప్రసాద్ పాడ టానికి కూర్చుంటే ,తాళం వేయటం ఊగి పో వటం ,తల అష్ట వంకర్లు తిప్పటం వంటి
ఆర్భాటా లేమీ ఉండవు .ఒక మహర్షి ధ్యాన సమాధి లో ఉండి అనాయాసం గా ,అసంకల్పితం గా సంగీత శ్రో తస్విని జాలు
వారుస్తు న్నట్లు ఉంటుంది .అది మాత్రం శివ ప్రసాద్ గారి ప్రత్యేకత .తాను తన్మయం అయి మనల్ని తన్మయులను
చేస్తా రాయన .కారణ జన్ములు . ఆయన నోట్లో మురళి ఉందా అన్నంత ఆశ్చర్యం వేస్తు ంది .పదాలు తెలుస్తా యి .దాటివేయటం
లేదు .ప్రతి పదం మనకు వినపడుతుంది .అక్షరం తెలీదు కాని అక్షర ధ్వని స్పర్శ ఫీల్ అవుతాం .ఆయనకు అన్ని వేళలా
విజయ పరంపర లభించాలని కోరు కుంటున్నాం .శార్లేట్ నిజం గా ఈలామ్రు త వర్షిణి లో పునీత మైంది .
పదవ తేది శని వారం రేణు అనే విజ్జి కి తెలిసిన అమ్మాయి వాళ్ల నాన్న గారి ,అమ్మగారి ‘’యాభై
వసంతాల వివాహ వేడుక ‘’కు ఆహ్వానిస్తే వెళ్ళాం .తండ్రి గారు ప్రముఖ నాటక ,సినీ నటుడు వల్ల ం నర సింహా రావు గారి
అన్న కుమారుడు .ఈయన పేరు నరసింహారావు .భార్య సత్య వతి .కమ్యునిటి హాల్ హో ,రేణు కుమారుడు రిశభ్ పుట్టిన రోజు
ఆమె మేనల్లు డి గ్రా డ్యుయేషన్ ,ఇదీ మూడు కలిపి చేశారు .మంచి కుటుంబం .ఆయనది కృష్ణా జిల్లా తిరువూరు .హిందుస్తా న్
ఏరో నాటిక్స్ లో పని చేసి రిటైర్ అయారు ..హైదరాబాద్ లో ఉంటున్నారు .అనుకో కుండా ఆయన తో పని చేసిన వడ్ల మన్నాటి
టి శర్మ గారు వచ్చారు. శర్మ గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ కు బి.డి .ఎల్ .లో సహా ఉద్యోగి .అంతే కాక విజ్జి ఆడపడుచు
బుల్లి మామ గారు బాగా తెలిసిన వాడు .అనుకోకుండా తమాషా పరిచయాలు ఇలా జరుగు తుంటాయి .విందు ఇచ్చారు .పది
పైగాఐటమ్స్ వున్నా తిన్నాది పెరుగన్నమే . ఈ విధం గా ఈ వారం అంతా ఈలా వినోదం తో విందులతో సరదా గా గడిచింది
.
ఈ వారం అంతా సందడి గా ,సరదాగా గడిచింది .మంచి పుస్త కాలూ చదివాను .రెండు పుట్టిన రోజు పండుగలు ,ఒక
రేడియో ప్రో గ్రా ం ,ఒక భజన, ఫాదర్’స్ డే లతో ఈ వారం సాగింది .సో మవారం సందడే మీ లేదు .ట్విన్స్ ను జిమ్నాస్టిక్స్ లో
సాయంత్రం చేర్చటానికి వెళ్ళాం .ఆశుతోష్ బాగా చేశాడు .పీయుష్ చేతి నెప్పితో ఉన్నా వాడు చేసిన వన్నీ బయటే చేశాడు
.వచ్చే వారం వాడూ ఇందులో చేరతాడు .శ్రీ కెత్ క్లా స్ వీళ్ళ క్లా స్ అయిన తర్వాత .జి మార్ట్ కు వెళ్లి కూరలు కొన్నాం .పనస
పండు కూడా . ఆ రోజు రాత్రి ‘’ఇదే మంటే ప్రేమంటా ‘’సినిమా కు రాత్రి తొమ్మిదిన్నర ఆటకు వెళ్ళాం .కాని ఫిలిం’’ కీ’’రాలేదని
ఆట వెయ్య లేదు .మర్నాడు మంగళ వారం రాత్రి కి వెళ్ళాం .సినిమా లో దమ్ము లేదు .అయితే సరదా గా కూర్చో బెట్టా డు
డైరెక్టర్ .మాకుటుంబం కాక ఇద్దరే హాల్ లో ఉన్నారు .డబ్బా లేపెసేట ట్లు ంది .శుక్ర వారం జగదీశ్ ,లక్ష్మి దంపతుల అబ్బాయి
ఆదిత్య పుట్టిన రోజు .ఇంటి దగ్గ రే చేశారు .అందరం వెళ్ళాం .మంచి దంపతులు .నలభై మందికి పైగా వచ్చారు .రాత్రి ఏడున్నర
నుండి ఒక గంట భజన ,ఆ తర్వాతా బర్త్ డే పార్టీ .గులాబ్జా ం పులిహో ర ,మరిరెండు స్వీట్లు ,చపాతీ కూర అప్పడం అన్నం
,పెరుగు ,ఐస్క్రీం కేకు .వగైరా .అన్నీ బాగున్నాయి .లక్ష్మి మా మేనకోడలు పద్మ లాగా ఉంటుంది .ప్రభావతిని పొ దివి పట్టు
కొంటుంది .అంత అభిమానం .మేము రావటం అదృష్ట ం గా భావించే దంపతులు జగదీశ్ ,,లక్ష్మి .ఆదిత్య ను మాకు
నమస్కరింప జేసి ఆశీస్సులు పొ ందే టట్లు చేశారు .అందుకే వాళ్ళింటికి వెళ్లటం ఇష్ట ం గా ఉంటుంది .సుమారు నేల క్రితం
ఆహో బాల స్వాములు వీరింట్లో చేసిన పూజకు వెళ్ళాం .మర్నాడు శని వారం మా ఇంటికి దగ్గ ర్లో పిల్లల స్కూల్ కు వెళ్ళే
దారిలో ఉన్న యై.ఏం.సి.యే.భవనం లో విజ్జివాల్ల కు తెలిసిన కన్నడ కుటుంబం వాళ్ల అబ్బాయి బర్త్ డే .వెళ్ళాం .ప్రభావతి
రాలేదు .ఒక క్లౌ న్ వేషం లో అమ్మాయి పిల్లలకు సరదా గా బలూన్లు చేసి సరదా చేసింది .ఐటమ్స్ చాలా పెట్టా రు కాని
తిన్నది చపాతి ,పెరుగు వడ మాత్రమే .అక్కడి నుంచి లైబర
్ర ీ కి వెళ్లి ఇరవై రెండు పుస్త కాలు ఇచ్చేసి ,పద కొండు
తెచ్చుకోన్నాను .బుధ వారం రాహుల్ ఇంట్లో భజన కు వెళ్ళాం అందరం .
శార్లేట్ లో విజ్జి ఫ్రెండ్ నాగమణి గత నాలుగేళ్ళుగా టోరీ రేడియో ప్రో గ్రా ం ను ప్రతి బుధ వారం చేస్తో ంది .మధ్యాహ్నం
పన్నెండు నుంచి రెండు గంటల వరకు .ఈ ప్రో గ్రా ం లోనే మార్ద ంగిక విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వర రావు గారిని ,ఈల లీలా
వినోడదులు కొమర వోలు శివ ప్రసాద్ ను మా ఇంట్లో నుంచే ఇంటర్వ్యు చేశాం .ఆవిడ వాళ్ళింట్లో ఉండి ఫో న్ లో ప్రశ్నలడిగితే
ఇక్కడ ఫో న్ లో సమాధానం చెప్పటం .దీని లింక్ అంతా హైదరాబాద్ లో జరుగు తుంది .లైవ్ ప్రో గ్రా ం .మధ్యలో పాటలు శ్రో తల
ప్రశ్నలు వాటికి సమాధానాలు ఉంటాయి .టోరీ అంటే’’టెలివిజన్ ఆన్ లైన్ రేడియో ఇంటర్ నేషనల్ ‘’అని అర్ధ ం .ప్రపంచ
దేశాలన్నిటికీ చేరుతుంది లైవ్ లో .ఆ విద్వాంసులను నేనే మనింటి నుంచి పరిచయం చేసి ,ప్రశ్న లడిగి సమా చారం
చెప్పించాను . నాగమణి నేను వచ్చిన్దగ్గ ర నుంచి నన్ను ప్రో గ్రా ం చేయ మని అడుగుతూనే ఉంది .నేను వాయిదా వేస్తూ నే
ఉన్నాను అది మొన్న బుధ వారం కుదిరింది .ప్రో గ్రా ం నాగమణి గారింటి వద్దే చేశాం .విజ్జి నన్ను అక్కడ దింపింది .లింక్
కుదరక ఒక అరగంట ఆలస్యం గా అంటే పన్నెండున్నర కు ప్రా రంభమైంది .గంటన్నర అంటే మధ్యాహ్నం రెండుకు పూర్తి
అయింది .’’ ఊసుల్లో ఉయ్యూరు’’ గురించి మాట్లా డాను .
నేను ముందుగా నా పరిచయం చేసుకొన్నాను .ఉయ్యూరు ప్రా ముఖ్యాన్ని ,అది బందరు ,బెజవాడ మద్య ఉందని
చెరకు వరి ,కంద తమల పాకు ,పసుపు ,మొదలైన పంటలకు కేంద్రమని ,ఆసియా లోనే అతి పెద్ద షుగర్ ఫాక్టరి ఇక్కడ
ఉందని ,ఇక్కడి పంచదార చాలా నాణ్యమైనది గా భావిస్తా రని ,మొదలు పెట్టా ను .గత యాభై ఏళ్లు గా సాహితీ రంగం లో
ఉన్నానని .నా చదువు ఉయ్యూరు విజయ వాడ లలో సాగిందని రాజ మాండ్రి లో బి.ఎడ్ .పూర్తి చేశానని ,కృష్ణా జిల్లా పరిషద్
లో ఇరవై రెండేళ్లు ఫిజికల్ సైన్స్ టీచర్ గా పని చేసి ఆ తర్వాతా పద కొండే ళ్ళు ప్రధానో పాద్యాయుడి గా చేసి 1998 జూన్ లో
పదవీ విరమణ చేశానని చెప్పాను .’’విశ్వం లో ఉన్న తెలుగు వారి గుండె చప్పుళ్ళు విని పిస్తు న్న టోరీ కి వందనం ,అభి
వందనం అని ,శ్రో తలకు అభినందనం అన్నాను ‘’టోరి లో టి అనేది టెలివిజన్ అని మీరు భావిస్తే ‘’తెలుగు ‘’ని నేను భావిస్తా నని
,కనుక తెలుగుకు చేస్తు న్న సేవ గా టోరి ని అభినదిస్తు న్నానని అన్నాను .
ఉయ్యూరు ఊసులు ఎలా మొద లైనాయో చెప్పాను .మా ఊళ్ళో అన్నీ తెలిసిన వారు చాలా మంది
ఉన్నారని వారిని గుర్తు ంచు కోవటం కోసం మా తమ్ముడు కృష్ణ మోహన్ తో ముందు రాయిన్చానని ,ఆ తర్వాతా వాటిని పుస్త క
రూపం లో తెచ్చి మా అబ్బాయి రమణ వివాహ రిసెప్ష న్ లో ఏం .ఎల్.సి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరింప జేశామని చెప్పాను
‘’.సరస భారతి’’ అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ ను ఉయ్యూరు లో సుమారు మూడు ఏళ్ళ క్రితం ప్రా రంభించి ప్రతి నేలా ఒక
కార్య క్రమం చేస్తూ , ప్రతి ఏడూ ఉగాది కి కవి సమ్మె లనాలు నిర్వహిస్తు న్నామని ,వాటిని పుస్త క రూపం లో తెచ్చి అంద
జేస్తు న్నామని ,ఇప్పటికి సరసభారతి తొమ్మిది ప్రచురణలను తెచ్చిందని అందులో నేను నాలుగు పుస్త కాలు –ఆంద్ర వేద శాస్త ్ర
విద్యాలన్కారులు ,జన వేమన ,దర్శనీయ దేవాలయాలు ,శ్రీ హనుమత్ కదానిది రాశానని చెప్పాను .ఉగాది పురస్కారాలను
మా తలి దండ్రు లు గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గార్ల పేరిట అంద జేస్తు న్నామని తెలియ జేశాను .మా ఊరి వాడు
కొలచల సీతా రామయ్య రష్యాలో పేరు మోసిన శాస్త ్ర వేత్త అని ,సూరి భగవంతం నెహ్రు గారికి సైంటిఫిక్ అడ్వైజర్ అని గుర్తు
చేశాను .అలాగే ఆరిక పూడి ప్రేమ చాంద్ ఎన్నో దేశాలకు ఆర్ధిక సలహా దారులని చెప్పను .
మాకు రెండు బ్ల్లాగులున్నాయని వాటి వివరాలు చెప్పాను .అవి బాగా ప్రా చుర్యం పొ ందాయని వివ రించాను .నేను
నాకు జ్ఞా పకం ఉన్న మా ఉయ్యూరు విషయాలను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే పేర ‘’ నెట్లో ’’ రాస్తు న్నానని ఇప్పటికి ముప్ఫై
రెండు ఎపిసో డులు రాశానని అన్నాను .ఇటీవల అందరికి తాము పుట్టి ,పెరిగిన గ్రా మాలను గుర్తు కు చేసుకోవటం ,వాటికి సేవ
చేయటం జరుగు తోందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ‘’మా ఊరు ‘’అనే శీర్షిక లో ప్రముఖుల గ్రా మాల విశేషాలను రాస్తు న్నారని
,అలాగే ‘’ఉయ్యూరు ఊసులు ‘’శీర్షిక తో ఈనాడు దిన పత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్ లో ఉయ్యూరు వార్త లనుప్రచురించటం
గమనింప దాగిన విషయమని ,దాని ప్రభావం అంతగా ఉందని చెప్పాను .
ఊసులు అంటే కబుర్లు ,లేక జ్ఞా పకాల దొంతరలు అని వాటికీ సాహిత్య గౌరవం కల్పించామని,అందరు గొప్ప వారే
కానవసరం లేదని సంఘటనలు ,ప్రభావాలు ఆత్మీయతలు గుర్తు చేసుకోవటమే నని అన్నాను . మా ఊసుల్ని చదివి ప్రముఖ
క ధకులు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ,విహారి అమెరికా లోని ప్రేమ్చంద్ ,గోపాల కృష్ణ గార్లు (వీరిద్దరూ ఉయ్యూరు వారే
)మెచ్చారని మొదటి ఇద్దరూ ఇలాంటి ప్రయత్నం తామూ చేద్దా మని ఆలోచిస్తు న్నామని చెప్పారని చెప్పాను .ఆ తర్వాతా నా
మొదటి ఎపిసో డ్ ‘’అమ్మ బో ణీ –నాన్న కాణీ ‘’ తో ప్రా రంభించాను .అమ్మ బో ణీ చేస్తే కూరగాయలన్నీ అమ్ముడు అవుతాయని
ముందు మా ఇంటికి వచ్చే వారని కొన్నా కొనక పో యిన బుట్ట మీద చేయి వేయించే వారని ,అలానే నాన్న కానీ డబ్బు
ఇచ్చినా ఊరంతా బాగా డబ్బులు లభిస్తా యని వేద పండితులు ,కూచి పూడి భాగవతులు మొదటిగా మా ఇంటికి వచ్చి నాన్న
దగ్గ ర డబ్బులు తీసుకొనే వారని చెప్పాను .ఆ తర్వాతా రవీంద్రు డు రాసిన ‘’కాబూలి వాలా ‘’ఆకారం లో ఉండే అత్త రు సాహేబు
గారు ఉండే వాడని ఆయన అత్త ర్లు సేన్ టు మందార నూనె సురమా అగరు వత్తు లు అమ్ముతూ మా ఇంటికి వచ్చే వాడని
చూడ టానికి భయంకరం గా ఉండే వాడని మనిషి మంచి వాడని ఆయన్ను ‘’మహాత్త ర్ సాహెబ్ ‘’పేరుతో రాశానని చెప్పాను
.నాకు రోజుకు కనీసం పది సార్లైనా ‘’అవు –పులి ‘’కధ చెప్పి నిద్ర పో యే ముందు మళ్ళీ చెప్పి నన్ను నిద్ర పుచ్చిన చిన్న
మూతి ఉండే మా పాపాయి పిన్ని గురించి ‘’పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని ‘’రాశానని చెప్పాను .మా ఇళ్లకు ఇంజినీర్
గా సలహాలకు చాణక్యుడిగా ఉండే ‘’కొలచల శ్రీ రామ మూర్తి మామయ్యను కొలతల మామయ్యా గా రాశానని చెప్పాను .మా
మామయ్యా గారింట్లో వేసవి కాలం లో వచ్చ్చే తద్దినాలను ‘’మామిడి పల్ల తద్దినాలు ‘’అనే వాళ్లమని ,తిన్నన్ని మామిడి
పళ్ళు వేసే వారని విస్త ళ్ళ పక్క అవి చిన్న గుట్ట లుగా ఉండేవని ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిదు రోజులు ,ఒడుగులు నాలుగు
రోజులు జరిగే వని ఊరిలో బంధువు లందరికి రెండు పూటలా భోజనాలని వంట పూర్తీ కా గానే ఇంటింటికీ వెళ్లి ’’ భోజనాలు-
సిద్ధం రండి ‘’అని వెళ్లి చెప్పే ఆచారం ఉండేదిఎవరి మంచినీళ చెంబు వాళ్ళు తీసుకొని వెళ్ళే వారని గుర్తు చేశాను .లక్ష్మి అనే
ఆమె ఫో న్ చేసి’’ చాలా మంచి జ్ఞా పకాలు’’అని అభినందించారు .ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు గురించి, అంతరించి
పో యిన చేతి వృత్తు ల గురించి ,వర్షం పడుతున్నా ,తుఫాను వచ్చినా రోజు రాత్రి ఎనిమిది గంటలకు శివాలయానికి వెళ్లి దేవుని
దర్శనం చేసుకొనే చంద్ర మౌళి ,సర్వేశ్వర రావు గార్ల్ గురించి ఉయ్యుర్లో యే మంచి పని కైనా ముందుండే మా నా న్న
,మామయ్యా ,చంద్ర శేఖర రావు ,సదాశివ రావు గార్ల గురించి ,మా గృహ వైద్య నారాయణులు అని మా డాక్టర్ల గురించి
,దసరా ల్లో ఇంటింటికీ తిరిగి ‘’అయ్య వారలకు చాలు అయిదు వరహాలు ‘’అంటూ పిల్లలతో వచ్చే మేష్టర్ల గురించి
,ఆప్యాయతలు ,ఆదరాభిమానాలు గురించి ,గరిక పర్తి కోటయ్య దేవర అనే ప్రముఖ సంగీత విద్వాంసుడు హైదరాబాద్
నవాబును సంగీతం తో మెప్పించి ఆస్థా న విద్వాంసుడై ఆ తర్వాతా బందరు వచ్చి సంగీత విద్యాలయం నెలకొల్పి ఎందరికో
ఉచితం గా సంగీతం నేర్పించి భోజనాలు కూడా ఏర్పరచిన విషయం చెప్పాను .ఆయన కుమార్తె ఉయ్యూరు లో ఇంటింటికీ వెళ్లి
సంగీతం నేర్పేదని మా అక్కయ్యలిద్దరు ఆమె వద్ద నేర్చుకోన్నారని జ్ఞా పకాల దొంతర ను దిన్చేశాను . ‘’ అమెరికా ఊసులు
‘’అని కూడా మొదలు పెట్టి రాస్తు న్నానని అందులో నుంచి కూడా రెండు ఎపిసో డులను అమెరికా ప్రెసిడెంట్ పియర్స్ గురించి
చెప్పా ను ,ఆనాటి అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవెస్ ఆఫ్ గ్రా స్ ‘’అవిత ను ఎమర్సన్ మెచ్చిన విధానాన్ని
,తోరోగారు గాంధీ గారికి గురువైన తీరు, శ్రీ శ్రీ కి ‘’అగ్గి పుల్లా ,సబ్బు బిల్లా కాదేది కవిత కనర్హం ‘’అని నేర్పింది విట్మన్ అని
ఫ్రా ంక్లిన్ గారు లింకన్ కొడుకు చని పో తే రాసిన ఉత్త రం మెమొరబుల్ లెటర్ గా ఉందని చెప్పాను ..టోరీ యువకులకు పిల్లలకు
తగిన ప్రా తి నిధ్యం కల్పించాలని నాకు ఇంతటి మహత్త ర ఆవ కాశం ఇచ్చి నందుకు కృతజ్ఞ తలు తెలియ జేశాను .ఇదీ టోరీ భేరీ
కధా ,కమామీషు
నిన్న అంటే పదిహేడవ తేదీ ‘’ఫాదర్స్ డే ‘’.మా అమ్మాయి విజ్జి ‘’హాపీలు ‘’చెప్పి హల్వా చేసి అందరికి పెట్టి డే ని
మరింత మదురం చేసింది .
ఈ వారం లో చదివిన ముఖ్య పుస్త కాలు –jim bowie ,brante’s jane eyre ,laura ignal wilder ,sylvia
erlie ,franklin pierse ,the greatest minda and ideas of all times ,a view of the ocean ,wyatt
earp ,malcomx ,ruben blades ,the cherokees ,roger williams ,the conquest of alexander the great ,tortured
noble tolstoi ,
జూన్ నేల 18 సో మ వారం నుంచి 24 ఆదివారం వరకు గడిచిన వారం అంతా మా అమ్మాయి వాళ్ల పెళ్లి రోజు,
విందులు, బంధువులరాక తో గడిచింది .సో మ వారం సాయంత్రం చక్ర వర్తి అనిలా దంపతుల గారింట్లో భజనకు వెళ్ళాం .వాళ్ల
అప్ స్తైర్స్ లో భజన మందిరం లో అన్ని రకాల దేవుళ్ళు విగ్రహాల రూపం లో ఉంటారు .వాటికి చక్కని అలంకరణ దుస్తు లు
ఆయన భార్య శ్రద్ధగా చేస్తు ంది .చూడ ముచ్చటగా ఉంటుంది మామిడి పనస ముక్కలతో ప్రసాదం పెట్టా రు .
సో మవారం పద్దేనిమిదో తేది మా అమ్మాయి విజయలక్ష్మి ,అల్లు డు అవధాని ల పెళ్లి రోజు .ఉదయమే పులిహో ర
చేసింది .సాయంత్రం మినప సున్ని ఉండలు చేసి అందరికి పెట్టింది మా అమ్మాయి .మంగళ వారం లైబర
్ర ి కితీసుకొని వెళ్లి
‘’సమ్మర్ రీడింగ్ ‘’లో నన్ను ,పిల్లల్ని సభ్యులనుగా చేసింది . .దీని వల్ల ఎక్కువ గంటలు చదివిన వారికి బహుమతి ,ఏదైనా
పుస్త కం ఆలస్యం గా తిరిగిస్తే ఉండే ఫైన్ ఉండవు .నాపేరు మీద కార్డ్ ఇచ్చ్చారు .దాని పై నాలుగు పుస్త కాలు తెచ్చుకోన్నాను .
అవధాని మేనత్త లక్ష్మి గారు ,భర్త చీమల పాటి దుర్గా ప్రసాద రావు గార్లు నార్త్ కరోలినా లోని రాలీ లో సుమారు
పదహారేళ్ళ నుంచి ఉంటున్నారు .అంతకు ముందు చికాగో, న్యు జెర్సి న్యూయార్క్ వగైరాలలో గత నలభై ఏళ్లు గా ఉంటున్నారు
.విజ్జి వాళ్ల పెళ్ళికి వచ్చారు .నార్త్ కరోలినా కు రాజ దాని రాలీ .కాని పెద్ద సిటి శార్లేట్ .అమెరికా రాష్ట్రా లకు ముఖ్య పట్నాలు
చిన్న ఊళ్లల్లో నే ఉంటాయి .అది ఇక్కడి వింత .రాలీ నుంచి వాళ్ళిద్దరూ ,వాళ్ల రెండో అమ్మాయి బుచ్చి తో మన ఇంటికి శుక్ర
వారం మధ్యాహ్నం వచ్చారు .అందరికి దో సే లు వేసి పెట్టింది విజ్జి .ఆ సాయంత్రం వాళ్ళు పవన్ వాళ్ళింటికి వెళ్లి రాత్రికి ఇక్కడికి
వచ్చారు .వాళ్ల అమ్మాయి స్నేహితురాలింటికి వెళ్ళింది .రాత్రి ఇక్కడే వాళ్ళిద్దరూ భోజనం చేసి పడుకొన్నారు .
శని వారం ఉదయం ఇడ్లి టిఫిన్ చేసింది .నేను ఆయనకు మన హనుమత్ కదానిది ,అక్కయ్య పుస్త కాలు ఇచ్చాను
.చాలా సంతోషించారిద్దరూ .మధ్యాహ్న భోజనం ఇక్కడే .మామిడి కాయ పప్పు తోటకూర పులుసు ,దో సకాయ పచ్చడి
,వంకాయ కూర కెరట హల్వా తో భోజనం చేశాం .సాయంత్రం ,వాళ్ళిద్దరూ మేమందరం కలిసి ‘’ikea’’ అనే పెద్ద షాపింగ్
కాంప్లెక్స్ కు అరగంట ప్రయాణం చేసి కార్ లో వెళ్ళాం .ముసలి వాళ్ళిద్దరూ నడవ లేరు కనుక చెరో కార్ట తీసుకొని చెరో దాల్లో
కూర్చో పెట్టి ఎవరి భార్యల్ని వాళ్ళం తోసుకుంటూ షాపింగ్ మాల్ అంతా తిరిగాం .పైన కూడా ఉంది కాని అప్పటికే అలిసి పో యి
పైకి వెళ్ళ లేదు .ఇంటికి కావలసిన వంట పరికరాలు పరుపులు దుప్పట్లు దిండ్లు కొవ్వొత్తు లు ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి
.లేనిది లేదు .వరైటీ బాగా ఉంటుంది .ప్రభావతి గిమూడు గిన్నేలున్న సెట్టు పది డా లర్ల కు కొన్నది .వాల్లెవో స్టా ండ్స్ ,విజ్జి
ఐస్ కప్పులు కొన్నది .ఇక్కడ రిజిస్ట ర్ చేసుకొన్నా వారందరికి కాఫీ ఫ్రీ .ఇది చూస్తె ఉయ్యుర్లో ‘’సుధీర్ టింబర్ డిపో ‘’జ్ఞా పకం
వచ్చింది .అక్కడ ఉదయం పది గంటలకు ఉన్న వారందరికి ఇడ్లి కాఫీ ఫ్రీ గా పెడతారు .ఎన్ని ఇడ్లీలు తింటే అన్ని .సాయంత్రం
ఆరుగంటలకు కూడా అంతే పునుగులు టీ ఫ్రీ .కొనే వారు ఉండాల్సి వస్తే భోజనం ఫ్రీ . అన్నీ చూసి బేవార్సు కాఫీ అందరం
తాగాం .చాలా బాగుంది .ఇంటికి రాత్రి ఏడు గంటలకు వచ్చాం .
శని వారం రాత్రి పవన్ వాళ్ళింట్లో డిన్నర్ .రాలీ వాళ్ల ఇద్దరమ్మాయిలు మాకంటే ముందే వాళ్ల ఫ్రెండ్ తో పవన్ ఇంటికి
చేరారు .మేము ఎనిమిదింటికి వెళ్ళాం .కాకర కాయ సెనగ పిండి పెట్టి కూర విజ్జి చేసి తీసుకొచ్చింది .తోటకూర పులుసు దో స
పచ్చడి కెరట్ హల్వా కూడా చేసి తీసుకొచ్చింది .వాళ్ళు వేడి వేడి గారెలు అల్ల ం చట్నీ ,పుట్నాల చెట్నీ తో పెట్టా రు .చాలా
తిన్నాం .చాలా బాగున్నాయి గారెలు చట్నీలుకూడా . వంకాయ కూర ఆవకాయ ,కారత్ కూర కంది పొ డి అప్పడాలు ,పొ ట్టు
ఒడియాలు ,అన్నం పెరుగు లతో మృష్టా న్న భోజనం .అన్నీ బానే ఉన్నాయి .గారెలు ఎక్కువ తిన్నాను కనుక మిగిలినవి
వాసన చూసి నట్లు గా అతికోద్దిగా తిన్నాను .ఆతిధ్యం అదిరింది .వాళ్ల ఆడపిల్లలుబుల్లి బుచ్చి భోజనం చేసి స్నేహితురాలితో
వెళ్లి పో యారు .వాళ్ళిద్దరూ పాపం వచ్చీ రాని తెలుగు తో సతమత మవుతున్నా మాట్లా డాలనే తపన ఉన్న వాళ్ళు
.మాట్లా డింది కరెక్టేనా అని అడిగి సరి చేయించుకోవటం మెచ్చ దగింది .రాత్రికి రాలీ దంపతులు పవన్ వాళ్ళింట్లో నే పడక శీను
.మేము ఇంటికి పదిన్నరకు తిరిగి వచ్చాం .
ఆది వారం విజ్జి వాళ్ల ప్రక్క ఇంట్లో ఉండే హైదరాబాద్ వాళ్ళు రవి, గాయత్రి దంపతులు రాలీలను మమ్మల్ని ముందే
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు .అందరం తొమ్మిదిన్నరకు వెళ్ళాం .మళ్ళీ గారెలు రెండు చట్నీలు సంబారు ,తమిళుల
పొ ంగల్ చేశారు .అన్నీ బాగా ఉన్నాయి .జున్ను కూడా చేసి పెట్టా రు .బాగా రుచిగా ఉంది .కాఫీ కూడా బాగుంది .రవి గారి
అమ్మా ,నాన్న హైదరాబాద్ నుండి కిందటి వారం వచ్చారు .వారి తో పరిచయం అయింది .ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ గా
చేసి రిటైర్ అయి విజయ నగర కాలని లో స్వంత ఇంట్లో ఉన్నారు .మన కృష్ణ యాజికి వాళ్ళిద్దరూ petients.అతన్ని గురించి
చాలా సదభి ప్రా యాన్ని వెలి బుచ్చారు మా లాగానే .ఆడ వాళ్ళు ముగ్గు రికి జాకెట్టు పండ్లు వెండి పువ్వు బొ ట్టు పెట్టి ఇచ్చింది
గాయత్రి . రాలీ దంపతులు ఇక్కడున్న రోజులు సరదా గా గడి పారు .విజ్జి కూడా ఆవిడకు తగిన సత్కారం చేసింది .ఆవిడ
మనవాళ్ళకు ముగ్గు రికి చేతుల్లో దా లర్లు పెట్టింది .వాళ్ళు కూడా అమ్మమ్మా తాతయ్యా అంటూ బానే ఉన్నారు .వాళ్ళిద్దరూ
మధ్యాహ్నం పదకొండు గంటలకు కార్ లో బయల్దే రారు రాలీ కి .దారిలో తిన టానికి పులిహో ర చేసి పాక్ చేసి ఇచ్చింది విజ్జి
.ఇలా ఈ వారం సరదాగా ,బంధుజన సందో హం గ గడిచి పో యింది –రాలీ ఇక్కడికి మూడు గంటల ప్రయాణం .సుమారు నూట
ఎనభై మైళ్ళు .ఆయన ఆవిడా రాలీ లో దేవాలయాలలో స్వచ్చంద సేవ చేస్తు ంటారు .భగవత్ సేవలో జీవితాలను పండించు
కొంటున్నారు ‘’దొరకునా ఇటు వంటి సేవా ‘’
ఈ వారం లో చదివిన పుస్త కాలు –north carolina in american revolution ,,the battles of lexington and
concord ,german indians the treaty of paris ,to wake the dead ,the invention of air the navjos ,edgae allan
poe
2-7-12 మైనేని వారి వారం --1
గడచిన వారం అంటే జూలై రెండు సో మ వారం నుండి ఎనిమిది ఆదివారం వరకు విశేషాలు-గురుపౌర్ణమి ,అమెరికా స్వాతంత్ర
దినోత్సవం ,మా అట్లా ంటా ప్రయాణం'.మేము అమెరికా వచ్చి మూడు నెలలయింది .
జూలై మూడవ తేది మంగళ వారం పౌర్ణమి రోజు ను వ్యాస పౌర్ణమిగా ,గురు పూర్ణిమ గా జరుపు కోవటం ఆన వాయితీ .ఆ రోజే
షిర్డీ లో కూడా సాయి బాబా జయంతిని వైభవం గా చేస్తా రు .ఇక్కడి డాక్టర్ మహేష్ డాక్టర్ గౌరీ దంపతులు వాళ్ళ స్వంత ఇంట్లో
గురు పూర్ణిమ మహో త్సవానికి ఆహ్వానించారు .దాదాపు యాభై మంది హాజరై నారు .రాత్రి ఏడు గంటల నుండి ఏడున్నర
వరకు స్తో త్రా లు ,గణేశ ఉపనిషత్తు ,నమక చమకాలు పథనం చేశారు .మా అల్లు డు అవధాని నమక చమకాలు చదివాడు .ఆ
తర్వాత గంట సేపు అంటే ఎనిమిదిన్నర వరకు భజన కార్య క్రమం నిర్వ హించారు .మా అమ్మాయి విజ్జి రెండు భజనలు ,మా
పెద్ద మనవడు శ్రీ కెత్ రెండు భజనలు గానం చేశారు .ఆ తర్వాతఅందరికి విందు .ఇడ్లీ ,గారే ,గులాబ్ జాం ,రెండు చట్నీలు
చపాతీ ,రెండు కూరలు ,సాంబారు ,పులి హో ర ,సాంబార్ ,పెరుగన్నం తో రుచి కరమైన భోజనం ఏర్పాటు చేశారు .డాక్టర్ గౌరీ
ఆడవాల్ల ందరికి బొ ట్టు పెట్టి జాకెట్ ,పసుపు కుంకుమ ,వెండి పూత పూసిన పళ్ళెం ,పళ్ళు ఇచ్చ్చారు . మేమిద్దరం మొదటి
సారిగా వాళ్ళింటికి వచ్చి నందుకు డాక్టర్ సర్వేష్ సంతోషం ప్రకటించారు .ఆయన ఈ రీజియన్ సాయి సంఘానికి ప్రెసిడెంట్ .
ఎన్నో వైద్య కార్య క్రమాలను భార్యా భర్తా నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తు న్నారు .మేము వచ్చిన్ద దగ్గ ర్నుంచి పరిచయం . వాళ్ళ
ఇంటి పేరు ''సత్తి రాజు '',బాపూ గారి ఇంటి పేరే .అయితే బాపు తో పరిచయం లేదని నాకు మొదటి సరి పరిచయమైనప్పుడే
చెప్పారు .
మనం నరకాసుర సంహారం జరిగిన మర్నాడు దీపావళి ని వైభవం గా దీపాలంకరణ తో ,టపాకాయలు కాల్చి జరుపు కొంటాం
.అమెరికా లో బ్రిటీష పాలన తో విసిగి పో యిన పద మూడు కాలనీ వాసులు ,అనేక హెచ్చరికలు బ్రిటీష ప్రభుత్వానికి చేసినా
పేడ చెవిన పెడితే ,తిరగబడి ,అందరు ఏకమై 1776 జూలై 4 న తాము బ్రిటీష ప్రభుత్వాన్ని గుర్తించమని, తాము స్వాతంత్రా న్ని
పొ ందుతున్నామని సంయుక్త ం గా ఒక డిక్ల రేషన్ ప్రకటించి స్వాతన్త్ర్యాన్ని ప్రకటించు కొన్నారు .అప్పటి నుడి జూలై నాలుగును
అమెరికా స్వాతంత్ర దినోత్సవం గా మహో త్సాహం గా జరుపు కొంటున్నారు .ఇప్పటికి 236 ఏళ్ళు .ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర
నుండి పదిన్నర వరకు ప్రభుత్వాధ్వర్యం లో అనేక రకాలైన టపాకాయలు కాల్చి సంబరాన్ని అంబరం అంత ఎత్తు కు తీసుకొని
వెళ్తా రు .ఆ గంటా ఆకాశం అంతా వెలుగుల పున్నమే .రవ్వల జలతారు .ధమ ధమ ధ్వనులే .ఆకాశం అంతా ఎన్నో హరి విల్లు
లతో కనుల విందు చేస్తు ంది .నాన్ స్టా ప్ గా గంట సేపు కన్నులకు పండువే .దీన్ని చూడ టానికి ఎంతో దూరం వెళ్లి టికెట్ కొని
చూసి ఆనందిస్తా రు .అక్కడ దొరికే బాణా సంచా కొని జనం కూడా కాలుస్తా రు .అపార్ట్ మెంటల్ దగ్గ ర కాల్చ రాదు .కౌంటీ లలో,
ఇండిపెండెంట్ హౌస్ లలో కాల్చుకో వచ్చు .మిగిలిన రోజుల్లో ఎప్పుడూ ఈ సందడి కనీ పించదు.మా అమ్మాయి ,అల్లు డు
,మనవాళ్ళు వెళ్లి అమెరికా దీపావళి చూశారు .మేము పదేళ్ళ క్రితం మొదటి సారి వచ్చి నప్పుడు హూస్ట న్ నగరం లో ఆ
వేడుక చూశాం .నాలుగేళ్ల క్రితం షికాగో లో సరస్సులో స్టీమర్ మీద ఉండి ఫైర్ వర్క్స్ చూసి ఆనందించాం .ఏమైనా చూడ
ముచ్చటైన పండుగే .ఎన్నో రకాలు ,ఎన్నో రంగులు ,ఎన్నెన్నో మోడల్స్ కను విందు చేస్తా యి .స్వాతంత్రం లో ఉన్న హాయి ని
అనుభవ విస్తు అమెరికా వారు జరిపే సంబరం ఇది .మా అమ్మాయి ,అల్లు డు ,మనవలు వరుసగా మూడు రోజులు ఇంటి
దగ్గ రే టపాకాయలు కాల్చి వేడుక చేసుకొన్నారు .
క్రిందటి వారమే నేను అట్లా ంటా మీదుగా ,అలబామా వెళ్లి హన్త్స్ విల్ లోని మా స్నేహితులు మైనేని గోపాల కృష్ణ గారింటికి వెళ్లి
వచ్చాను .మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడూ అట్లా ంటా ను చూడ లేదట .అందుకని అందరం కారు లో బయల్దే రి మూడు
రోజుల పర్యటన చేయాలని నిర్ణ యించారు .శార్లేట్ కు అట్లా ంటా సుమారు 260 మైళ్ళదూరం .అంటే సుమారు నాలుగు వందల
కిలో మీటర్ల దూరం లో ఉంది .మూడున్నర గంటల డ్రైవ్ .మధ్యలో విశ్రా ంతి ఒక గంట .అంటే అయిదు గంటల సమయం .అది
జార్జియా రాష్ట ం్ర లో ఉంది .జార్జియా కు రాజ దాని అట్లా ంటా .ఒక పెద్ద పట్నం రాజ దాని అవటం ఇక్కడే చూస్తా ం .నార్త్
కెరొలినా దాట గానే సౌత్ కెరొలినా దాని తర్వాత జార్జియా రాష్ట్రా లు వస్తా యి .బ్రిటన్ రాజు జార్జి రెండు పేరు మీదుగా జార్జియా
రాష్ట ం్ర పేరు వచ్చింది .అమెరికా లో జనాభా లో తొమ్మిదవ స్థా నం లో ఉంది .టెక్సాస్ రాష్ట ం్ర తర్వాతా బాగా వేగవంతం గా అభి
వృద్ధి చెందుతున్న రాష్ట ం్ర .1829 లోజార్జియా మౌంటేన్ ల వద్ద బంగారు నిక్షేపాలు లభించాయి .అందువల్ల గోల్డ్ రష్ పే రిగింది
.ఇక్కడ రెడ్ సెడార్ వృక్షాలు ప్రసిద్ధి చెందాయి .అనేక రకాల పైన్ చెట్లు న్నాయి .ఓక్ ,మాపిల్ చెట్లూ ఎక్కువే .ఈ రాష్ట ం్ర
డెమొక్రా టిక్ పార్టి కి వెన్ను దన్ను గా నిలిచింది .1976 లో ఈ రాష్ట్రా నికి చెందినా జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ అయాడు .ఇక్కడ
పట్టి ,
rye,పెకాన్స్ ,పీచులు బాగా పండుతాయి .ఇక్కడి ''చారోకీ రోస్'' చాల ముచ్చటగా ఉండే పుష్పం .దీన్ని ''పీచ్ స్టేట్ ''అంటారు
.గ్రా నైట్ రాయి కి కేంద్రం .లైవ్ ఓకే వృక్షం వీరి జాతీయ వృక్షం .వీరి రాష్ట ్ర పక్షి- బ్రౌ న్ త్రా షర్ .జార్జియా దగ్గ రే సవాన్నా నది
ప్రవహిస్తు ంది .
అట్లా ంటాలో 1996 లోజూలై19-ఆగస్ట్ నాలుగు మధ్య సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి .centinnial ఒలింపిక్స్ గా దాన్ని పిలిచారు
.197 దేశాలు ,10 ,318 క్రీడా కారులు పాల్గొ న్నారు .ఒలింపిక్స్ నిర్వహించిన అయిదవ అమెరికా సిటి అట్లా ంటా .సమ్మర్
ఒలింపిక్స్ జరిపిన అమెరికా లోని మూడవ సిటి .అప్పుడు దేశానికి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ . ఇప్పుడు అట్లా ంటా లో జూలైఆరు
నుండి ఎనిమిది వరకు ''ఆటా '';;తెలుగు సంబరాలు జరుగు తున్నాయి .
మేము ఆరవ తేది శుక్ర వారం ఉదయం ఎనిమిదిన్నరకుకార్ లో బయల్దే రాం .దారిలో వెంట తెచ్చుకొన్న పులిహో ర తిన్నాం
యోగాత్ అనే పెరుగు తిన్నాం .ఆరగా ఆరగా జ్యూసులు తాగుతూ చల్ల ని మంచి నీళ్ళు జుర్రు తు ,మధ్యాహ్నం పన్నెండున్నరకు
''హాలిడే ఇన్''అనే చోట రెండు రూములు తీసుకొని బస చేశాం .కాసేపు విశ్రా ంతి తెసుకోన్నాం
కోకా కోలా మోడల్ ప్లా ంట్ కు మూడు గంటలకు చేరాం .ఇది డౌన్ టౌన్ లో ఉంది .ఇక్కడే సి.యెన్.యెన్.కేంద్రం ,జార్జియా
ఆక్వేరియం కూడా ఉన్నాయి ఒక గొప్ప రద్దీ కేంద్రం లో ఇవన్నీ ఉండటం అరుదు .అన్నీ దగ్గ ర దగ్గ ర లోనే ఉన్నాయి .ఈ
మూదు ,దీనితో పాటు దూరం గా ఉన్న జూచూడటానికి మా అందరికి కలిసి టికెట్ల ఖరీదు 500 డాలర్లు ;'దాదాపు ఒక్కొక్క
రికి25 దాలర్లు న్తు ంది . '.ముసలి ముథా'' కి కన్సెషన్ రెండు డాలర్లు మాత్రమె ఒక్కో టికెట్ మీద .ప్రభావతికి వీల్ చైర్
తీసుకుందివిజ్జి .దానికోసం ఐడెంటిటి కార్డ్ అప్పగించాలి .తిరిగి ఇచ్చి నప్పుడు కార్డ్ తీసుకో వాలి .దీనికి డబ్బు లేదు .అన్ని
భాగాలను చక్కగా చూపించారు .బాటిల్స్ లో నింపటం సీల్ చేయటం పిల్లలకు సరదా గా ఉంటుంది .దాదాపు రెండు గంటల
కార్య క్రమం .ఇక్కడే కోకా కోలా గురించి 4d ధియేటర్ లో డాక్యు మెంటరి చూపించారు .వస్తు వులు మన ముందుకు వచ్చి న
అను భూతి కలుగు తుంది .నీళ్ళు మీద పడ్డ ట్లు న్తు ంది .కుర్చీలు కదిలి పో తున్న ఫీలింగ్ వస్తు ంది .పూలు చేతికి అంది నట్లు
కన్పిస్తా యి అందరు అందుకోవటానికి చేతులు జాస్తా రు .ఇదంతా ఎఫెక్ట్ మాత్రమె . ఆ తర్వాత 60 రకాల కోకా కోలాలు ఉన్న
ఒక హాల్ లోకి తీసుకొని వెళ్తా రు .అక్కడ పెద్ద డ్రమ్ములలో వివిధ ఖండాలకు చెందినా కోకా కోలా లు ఉంటాయి .వాటి లోంచి
మనకు కావలసిన దాన్ని ప్రక్కనే ఉన్న గ్లా స్ లో పైప్ ల ద్వారా పట్టు కొని ఎన్ని సార్లైనా తాగ వచ్చు .పిల్లలు మస్తు గా
ఎంజాయ్ చేస్తా రు .నేనూ అన్ని రకాలను టేస్ట్చేశాను .అమెరికన్ ,ఆశియన్ వరైటీలు తాగ టానికి బాగా ఉన్నాయి .అక్కడంతా
సందడే సందడి .అందరికి తలా ఒక నిండు కోకా కోలా బాటిల్ ఉచితం గా ఇస్తా రు .అందరం నోక్కేశాం ''.ఫ్రీ గా వస్తే ఫినాయిల్
అయినా రెడీ ''అన్న సామెత రుజువు చేశాం .బయటకు వచ్చి ఉడిపి కృష్ణా భవన్ కు వెళ్లి టిఫిన్ తిన్నాం .పూరీ చపాతి అట్టు
,చాట్ మసాలా అన్ని రకాలు ఉన్నాయి .రుచి గానే ఉన్నాయి .తెలుగు వాళ్ళు ఆటా సంబరాల కు సాంప్రదాయ వస్త ్ర ధారణ తో
చాలా మంది కనీ పించారు ముఖ్యం గా స్త్రీలు చీర సిన్గా రించే కనీ పించారు .హో టల్ బాగా రద్దీ గా ఉంది .అదొక పెద్ద మాల్ లో
ఉన్నది హాలిడే ఇన్ కు రాత్రి పదింటికి చేరాం .హాయిగా నిద్ర పో యాం .ఇక్కడ గదులకు తాళం చెవులు క్రెడిట్ కార్డు ల్లా
ఉంటాయి దాన్ని తాళం దగ్గ ర స్పేస్ లో పెడితే తాళం తెరుచు కుంటుంది .బయటికి వెళ్ళే టప్పుడు కార్డ్ జేబు లో పెట్టు కొని
వెళ్ళాలి .ఇదీ మొదటి రోజు సమాచారం .మిగాతావివరాలు'' పార్ట్ టు''లో తెలియ జేస్తా ను
10-7-12 అమెరికా దీపావళి వారం --2
సి.యెన్.యెన్.సెంటర్
రెండో రోజు -జూలై ఏడవ తేది -శని వారం -ఉదయమే హాలిడే ఇన్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన కాఫీ కలుపుకొని తాగి కారు ఎక్కి
,డౌన్ టౌన్ లోని సి.యెన్.యెన్.సెంటర్ కు చేరాం .అక్కడున్న హో టల్ లో బ్రెడ్ తిని కాఫీ తాగి లైన్ లో చేరాం .ముందుగా పై
అంతస్తు లోకితీసుకొని వెళ్లా రు .అక్కడ వార్త లను ప్రసారం చేసే విధానం చూపించారు .వాతా వరణ వివ రాలు ఎలా ప్రసారం
చేస్తా రో వెదర్ చార్ట్ ఎలా ఉంటుందో బ్రేక్ న్యూస్ ఎలా ప్రసారం చేస్తా రో ,రంగులు ఎలా మారతాయో ఒక అమ్మాయి బాగా వివ
రించి చెప్పింది .అక్కడ ఉన్న సీట్ లో ఎవ రైనా కూర్చుని వార్త లను చదవ మంది .మా మనవడు శ్రీ కెత్ వెంటనే వెళ్లి
కూర్చుని ఎదురు గ ఉన్న స్క్రీన్ చూస్తూ వార్త లు చదివాడు .అందరం చప్పట్లు కొట్టా ం .అక్కడి నుండి మెట్ల మీదు గా కిందికి
దిగి అసలు వార్తా ప్రసారం లైవ్ గా ఎలా జరుగు తుందో చూపించారు .అనుమానాలుంటే అడగమన్నారు .అడిగిన వాళ్ళ డౌట్స్
క్లియర్ చేశారు .ఆ అమ్మాయి చాలా చలాకీ గా ఉండిఅందర్నీ ఉత్సాహ పరిచింది .అక్కడి నుండి ,ఇంకా కిందికి దిగి ఇంకో
చేంబర్ లో జరిగే ప్రసారాలను చూశాం .ఇట్లా ఎనిమిది స్టెప్పులు దిగి చూడాలి .మాకు పరవా లేదు కాని ప్రభావతి ఇంకా మెట్లు
దిగ లేనంది .వీల్ చైర్ సౌకర్యం మధ్యాహ్నం మాత్రమె ఉందని చెప్పింది .ఈ విషయం ముందే చెప్పాలి అని కసిరాం .చెప్పాం
మీరు విని పించు కోలేదేమో అన్నారు సెక్యురిటి వాళ్ళు .లిఫ్ట్ మీదు గా కిందికి దింపితే వచ్చేశాం .పిల్లలకు పెద్ద గా హు షారు
గా లేదు .
ఆక్వేరియం
దగ్గ రలోని జార్జియా ఆక్వేరియం లోకి వెళ్ళాం .ఇక్కడ వీల్ చైర్ స్సౌకర్యం ఉంది .ఉప యోగించు కొన్నాం .ఫ్రీ .విజ్జే వీల్ చైర్
తేవటం ఇవ్వటం ,వాళ్ళమ్మ ను తోయ్యటం అంతా తానే చేసింది .నేను విగ్రహం పుష్టి గా పక్కన ఉన్నానంతే .నదుల్లో ని చేపలు
,కాలి ఫో ర్నియా లోని కోల్డ్ ఫిష్ ,నక్షత్ర చేపలు అనేక రకాలు చూశాం .ఆ తర్వాతఒక ఆడి టోరియం లో ''డాల్ఫిన్''ప్రదర్శన
ఏర్పాటు చేశారు .అరగంట కు పైగా కార్య క్రమం .మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు వరకు .తెర ముందు చిన్న సరస్సు
.దాని లో డాల్ఫిన్లు .వాటిని ఆడించే ఆడ ,మగా కుర్రా ళ్ళు .పైన కామెంట్ చెప్పే వాడు .డాల్ఫిన్లు ఆకాశం లో నక్షత్రా ల నుంచి
వచ్చాయని నమ్మకం . .నక్షత్ర సముదాయం డాల్ఫిన్ ఆకారం గా ఉండటం తెర మీద చూపించారు .అనేక రకాలైన ఫీట్స్ ను
డాల్ఫిన్ల తో చేయించారు .వాటి మీద స్వారి చేశారు .వాటి తో ముందుకు తోయిన్చుకొన్నారు .సౌండ్ ను బట్టి వాటిని డాన్స్
చేయించారు .ఒక్క సారిగా అవి నీటి లోంచి ఆరడుగుల ఎత్తు యెగిరి నీటి లోకి దూకటం బలే సరదా గా ఉంటుంది .బాక్
స్విమ్మింగ్ చేశారు ,చేయిస్తా రు .పాముల్లా మెలికలు తిరిగి ఆడుతాయి .ఎంతో తర్ఫీదు నిచ్చి ఇలా చేయించటం అబ్బురం గా
ఉంది .నుంచొని నడిచి వింత అని పిస్తా యి ..మళ్ళీ డాల్ఫిన్లు నక్షత్ర మండలానికి వెళ్ళే కోరిక ఉందని తెలియ జెప్పుతూ షో
ముగిస్తా రు .చప్పట్లే చప్పట్లు .హాలంతా అదిరి పో తుంది .సౌండ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది .పిల్లలంతా మహా వేడుకగా ఎంజాయ్
చేశారు . తర్వాతఅక్కడే ఉన్న రెస్టా రెంట్ లో పీజా కొద్దిగా తిని కాఫీ తాగాం .ఇక్కడ వాటర్ బాటిల్ ఖరీదు మూడు డాలర్లు
.అదే బయట మూడు డాలర్లు పెడితే ఇరవై బాటిల్స్ ఉన్న కేసు వస్తు ంది .అంత రేట్లు .అయినా జనం తండో ప తండాలుగా
వచ్చి పడుతున్నారు నిర్విరామంగా .ఆ తర్వాత 4d ధియేటర్ లో ఒక షో చూశాం .ఇది మూడున్నరకు మొదలై నాలుగు
వరకు ఉంటుంది .కళ్ళకు వేరే రకమైన కళ్ళ జోడు ఇస్తా రు .వాటి తోనే చూడాలి .అప్పుడే ఎఫెక్ట్ బాగా ఉంటుంది .లేక పో తే
కళ్ళకు ప్రమాదం .ఏదో చిన్న డాక్యుమెంటరి లాంటి యాని మేషన్ సినిమా అది .నీళ్ళు మీద పడ్డా యి సౌండ్ కు
టపాకాయలు పేలినట్లు అందులో కాలి మిగిలినవి మన మీద పడ్డ ట్లు చేస్తా రు .పిల్లలకు అతి ఇష్ట ం గా ఉంటుంది .
నెమ్మదిగా బయట పడి డ్రై చేసుకొంటూ జూకు చేరేసరికి అయిడుమ్బావు .ఆరున్నరకు మూసేస్తా రు .వీల్ చైర్ పది డాలర్ల కు
తీసుకొని వాళ్ళ అమ్మను కూర్చో పెట్టు కొని మా అమ్మాయి తోసుకుంటూ తీసుకొని వెళ్ళింది .నేను పక్కన ఉత్స విగ్రహమే
.పిల్లలు వాళ్ళ నాన్న తో వెళ్లా రు లోపలి .ముందుగా ఏనుగులు రెండు కనీ పించాయి .బాగా నీర సంగా ,తోస్తే పడి
పో ఎట్లు న్నాయి .తర్వాతా చిరుత పులులు హుషారుగా కనీ పించాయి .రంగుల పిచ్చుకల లాంటివి ఉన్నాయి .పెద్ద తాబేళ్ళు
మందు కొట్టిన వాటి లాగా పడుకొని ఉన్నాయి .ఎలుగు బంట్ల వంటివి ఉన్నాయి .వెదురు గడ తింటూ అందులో ఒకటి
ముచ్చట గా ఉంది .సహజా రాణ్యంలా ఉంచారు భద్రత బానే ఉంది .ఫ్లెమింగో పక్షులు నీటి దొరువుల వద్ద మందలు మందలు
గా ఉన్నాయి .మన కొంగల్లా ఉంటాయి .ఎరుపు రంగు శరీరం .పిల్లలు ఎక్కి తిరిగే చిన్న రైలు ఉంది .అది పదినిమిషాల్లో సారి
అంతటిని తిప్పి చూపిస్తు ంది .అందరం ఎక్కి తిరిగాం .మధ్య లో గుహల గుండా రైలు పో తుంది .ఇదో అనుభూతి .దీని దగ్గ రే
''ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ''లో ఉన్నట్లు రంగుల రాట్నం ఉంది .అన్నీ జంతువులూ ,పక్షుల ఆకారాలతో .అందరం ఎక్కి
సరదా గా తిరిగాం .వేగం లేదు .నెమ్మదిగా నే తిరిగింది .ముసలి వాళ్లకు సో ఫా లాగా కూర్చునే సీటు ఉంది .ప్రభ దానిలో
కూర్చుంది .అంతా అయిన తర్వాతాపిల్లలు ,పెద్దలు ఎంజాయ్ చేయటానికి'' రాక్ క్లైమ్బింగ్''ఉంది .సీటు బెల్టు లతో కట్టి ,పైన
ఉన్న తాడును పట్టు కొని ,ప్రక్కల ఉండే ఆధారాలతో పైకి ఎక్కాలి .ఒక ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది .ఒకే సారి ఇద్దరు
రెండు వేరు వేరు సీట్లలో కూర్చుని ఎక్క వచ్చు .మా మనవళ్ళు ఆశుతోష్ ,పీయూష్ లు దానితో ప్రయత్నం చేశారు .ఆఖరి
వాడైన పీయూష్ సగం దాకా ఎక్కి కిందికి దిగాడు .వాడి పైవాడు ఆశుతోష్ మాత్రం పైదా కా వెళ్లి అందర్నీ ఆశ్చర్య పడేట్లు
చేశాడు చీర్స్ చెప్పాం మేమందరం .నేను వంద రూపాయలు గిఫ్ట్ గా ఇస్తా నని వాడికి చెప్పాను .''తాత గారూ వంద ''అంటూ
హో టల్ కు చేరే దాకా అంటూనే ఉన్నాడు .సరాసరి ఇండియన్ మాల్స్ ఉన్న చోటికి వెళ్ళాం .అక్కడ చెరియన్ అనే షాప్ లో
బియ్యం సరుకులు మా వాళ్ళు కొనుక్కున్నారు .శార్లేట్ కంటే చాలా చవక .కూరలు కూడా తాజాగా చౌకగా ఉంటాయి .అక్కడి
నుంచి ''వుడ్ లాండ్స్ మైసూరు విలాస్ ''కు వెళ్లి ,మేమిద్దరం మషాల అట్టు ,తిని మాంగో లస్సీ త్రా గాం.బానే ఉన్నాయి
.పిల్లలు, వాళ్ళు వాళ్ళ కిష్టమైనవి తిన్నారు .రూం కు చేరే సరికి రాత్రి పది అయింది .హాయిగా నిద్ర పో యాం .
జూలై ఎనిమది ఆదివారం -మూడో రోజు --హాలిడే ఇన్ ఖాళీ చేసి కార్ లో బయల్దే రి మధ్యలో స్టా ర్ బక్స్''లో డో నట్ తిని కాఫీ
త్రా గాం .అక్కడి నుండి సుమారు ముప్పావు గంటల ప్రయాణం చేసి ''శ్రీ స్వామి నారాయణ దేవాలయానికి చేరాం . ఫ్రీ గా
ఇచ్చిన వీల్ చైర్ లో ప్రభావతి ని కూర్చో పెట్టి నేను పక్కనన ఉండగా విజ్జి తోస్తూ లిఫ్ట్ ఎక్కి దేవాలయానికి చేరాం .చాలా విశాల
మైన ప్రా ంగణం లో చాలా ఎత్తు లో ఉన్న దేవాలయం స్వామి నారాయణ టెంపుల్ .అంతా పాల రాతి తో చేసిందే .విగ్రహాలు
చాలా అందం గా ముచ్చటగా ,అలంకారాలతో ఆకర్షణీయం గా ఉంటాయి .రాదా కృష్ణు ల విగ్రహం స్వామి నారాయణ విగ్రహం
ఆయన పరంపరకు చెందినా అయిదుగురు శిష్యుల విగ్రహాలు అబ్బుర పరుస్తా యి .ఆలయం లోపలి డో మ్ మీద లతలు పూలు
దశావతారాలు ,అతి సూక్ష్మమైన నగిషీ పనితో మానసాహ్లా దాన్ని ,ఆశ్చర్యాన్ని కలిగిస్తా యి .గుజరాత్ నుండి రాజస్తా న్ నుండి
మార్బుల్ తెప్పించి ,ఇక్కడే చెక్కించి నిర్మించారట .2007 లో ఆలయం పూర్తీ అయి దర్శనార్ధ ం వదిలారు .శివుడు పార్వతి ,శ్రీ
రామ మారుతి విగ్రహాలు కూడా ఉన్నాయి .ఇక్కడి శిల్ప విన్యాసం చూసి ఆనందించాల్సిందే కాని మాటలతో చెప్ప లేము
.లోపల ఫో టోలు తీయటం నిషేధం .వారి బ్రో చర్ తీసుకొని అందులోని వాటిని ఫో టోలు తీశాను .అవి మేము పెట్టి నప్పుడు
చూసి ఆనందించండి . ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది .
కింద ఫో టోలు పుస్త కాలు అమ్మే షాప్ ఉంది .అక్కడ కైలాసం లో శివ పార్వతులున్నట్లు శివుని జటా జూటం మీద నుండి గంగా
జలం పడుతూ ఆవు ముఖం నుండి బయటకు వస్తు శివ లింగానికి అభి షేకం చేస్తు న్నట్లు ఉన్న బొ మ్మ ముచ్చటగా ఉంటె
మా అమ్మాయి యాభై అయిదు డాలర్లు పెట్టి కొన్నది ఆ నీరు నిరంతరం అలా పడుతూనే వుంటుంది . రిసైకిల్ చెందు
తుంటాయి ,మొదట్లో నాలుగు గ్లా సుల నీరు పో స్తే చాలు .పదకొండేళ్ళ క్రితం మా రెండో అబ్బాయి శర్మ ఫామిలి గుజరాత్ లోని
అహ్మదా బాద్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి అహ్మదా బాద్ లోని స్వామి నారాయన దేవాలయం ,అక్షరధాం లను చూశాం
.అది మూడు గంటల కార్య క్రమం .ఆయన తపస్సు చేసిన ప్రదేశాలన్నీ సహజ వాతా వరణం లో గుహలు గా నిర్మించి
చూపించారు .తర్వాత ఆయన జీవితం పై సినిమా ,,మ్యూజిక్ ఫౌంటెన్ అన్నీ ఆశ్చర్య పరుస్తా యి .ఇక్కడ అంత ఎర్పాటు ఏమీ
లేదు .తరువాత ఉంటాయేమో తెలీదు .అప్పుడే మేము ద్వారకకు, సో మనాధ దేవాలయానికి వెళ్లి వచ్చాము. అది దసరా
కనుక దండీ నృత్యాలను ,ఆరుబయటి సినెమా థియేటర్లో ''లగాన్''సినిమా ను చూశాం .
దేవాలయ సందర్శనం తర్వాతా దానికి సంబంధించిన హో టల్ లో డబ్బులిచ్చి భోజనం చేశాం .పెద్ద గా సహించ లేదు
.మధ్యాహ్నం మూడింటికి బయల్దే రి మధ్య మధ్య ఆగుతూ రాత్రి ఏడున్నరకు శార్లేట్ చేరి మన అన్నం తిని హాయిగా నిద్ర
పో యాం .
ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ముఖ్య విషయాలు -1781 లో స్వామి నారాయణ ఉత్త ర భారత దేశం లో
జన్మించారు .దీన జనుల విముక్తి కోసం సాంఘిక ,ఆధ్యాత్మిక తిరుగు బాటు చేశారు .స్వామి నారాయణ సంప్రదాయం ఏర్పాటు
చేశారు .మూధాచారాలను తిరస్కరించారు అహింసా మార్గ మే ఆయన ఆదర్శం .3000 మంది సాధకులను తయారు చేసి
ప్రచారాన్ని ఉధృతం చేశారు .అందుకని ఆయననే ''భగవాన్ ''అని పిలుస్తా రు .నైతిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన మార్గ
దర్శనం చేశారు .ఆయన మరణించినా ,సాధకులకు ఆయన ఎప్పుడు అందు బాటు లోనే ఉంటారని నమ్మకం .
వీరి మొదటి శిష్యులు ,వీరి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు శ్రీ గుణాతీతా నంద స్వామి .''అక్షర పరబ్రహ్మ ''గా సాధక నామం
.ఈయనే ఘనశ్యాం మహారాజ్ .స్వామి నారాయణ అవతారమే ఈయన .పద కొండు ఏళ్లకే సన్య సించి ఏడేళ్ళు దేశం లోని
సర్వ క్షేత్ర సందర్శాన్ని కాలి నడకన చెప్పులు లేకుండాఒంటరిగా తిరిగి గుజరాత్ లో యాత్రను విరమించారు .అక్కడే ''అక్షర
ధామం ''నెల కోల్పారు .అనేక మందిరాలను దేశమంతా నెల కొల్పిన మహా ను భావులాయన .
రెండవ శిష్యుడు ,ఉత్త రాది కారి భగవతి మహా రాజ . .మూడవ శిష్యులు అధికారి శాస్త్రీజీ మహారాజ్ .మంచి వక్త .''అక్షర
పురుషో త్త మ భావవ్యాప్తి ''చేశారు .1907 లో Bachasanvasi sree akshara purushottama svaami naaraayana
samstha ''(B.A.P.S )ను ఏర్పరచారు
. .నాల్గ వ శిష్యుడు అధికారి యోగీజి మహా రాజ .ఇంగ్లా ండ్ ,అమెరికా ఆఫ్రికా లను సందర్శించి స్వామి నారాయణ బో ధ లను
వ్యాప్తి చేశారు .
అయిదవ వారు ఉత్త రాధికారి ప్రముఖ స్వామి మహారాజ్ .2007 ఆగస్ట్ ఇరవై ఆరున ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను
స్వీకరించారు .వీరి ఆధ్వర్యం లో ప్రపంచ మంతా3,300 కేంద్రా లు ఏర్పడ్డా యి .మతం కులం భాషా జాతి ,వయసు లకు అతీతం
గా సంస్థలను తీర్చి దిద్దా రు .వీరినే హరికృష్ణ మహా రాజ అంటారు .ఇది వారి చిన్నప్పటి నామ దేయం .
దేవాలయం లో రాదా కృష్ణ విగ్రహాల ప్రక్కన స్వామి నారాయణుల పంచ లోహ విగ్రహం ఉంది .
ఏమైనా, మానసిక ప్రశాంతి నిచ్చింది ఈ మూడు రోజుల్లో స్వామి నారాయణ సందర్శనమే .అట్లా ంటాకు గర్వ కారణం ఈ అక్షర
ధామం.
జూలై తొమ్మిది సో మ వారం నుండి పదిహేను ఆదివారం వరకు డైరీ -పిల్లల సమ్మర్
కాంప్-సర్ప్రైజ్ వెల్కం -భజన భోజనం -పుస్త కాల చదువు -నిన్న రాత్రి
సూర్యుడు కర్కాటక రాసి లో ప్రవేశించటం వల్ల ఉత్త రాయణం వెళ్లి దక్షిణాయనం
వచ్చింది .
భజన -భోజనం
ఇక్కడి సాయి సెంటర్ లో ముఖ్యురాలు శ్రీ మతి కపిలా లీడ్ బీటర్
అనే వారింట్లో శనివారం సాయంత్రం భజన కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్ళాం
.యాభై మంది వచ్చారు .సాయంత్రం అయిదున్నర నుండి రెండు గంటలు అంటే రాత్రి
ఏడున్నర వరకు భజన .చాలా కొత్త భజనలు ముఖ్యం గా ఎక్కువ హిందీ ఇంగ్లీష్
భజనలను అత్యంత భక్తీ శ్రద్ధ లతో గానం చేశారు .తబలా హార్మని ,కంజీర
ల,తోడ్పాటు కూడా ఉంది .ముఖ్యం గా కపిల గారు చాలా భావ గర్భితం గా మనోహరం
గా శ్రా వ్యం గా పాడారు .ఆవిడ పాడటం ఇదే మొదటి సారి నేను చూడటం .ఈ మధ్య
వరకు శార్లేట్ సాయి సెంట ర్ కు ఆమె అధ్యక్షురాలు .ఇప్పుడు సత్య అనే అతను
.సత్య మంచి తబలా విద్వాంసుడు .మంచి కార్య కర్త .సాయి బాబా సమక్షం లో
చదువు కున్న వాడు .అతని భార్య సౌమ్య చక్కని గాయని .హార్మని గొప్పగా
వాయిస్తు ంది .వాయిస్తూ నే బాగా శ్రా వ్యం గా పాడుతుంది .తాదాత్మ్యం
కల్గిస్తు ంది .మేము వచ్చిన దగ్గ ర్నుంచి ఆ దంపతులతో మంచి పరిచయం .సౌమ్య ఆ
రోజు అత్యంత భక్తీ భావం తో తార స్తా యి లో పాడి జనాలను పరవశులను చేసింది
.ఆమె వాయిస్ చాలా పీక్ గా ఉందని భజన అయిన తర్వాత ఆమె తో చెప్పాను
.మిగిలిన వాళ్ళు కూడా బానే పాడారు .ఆ తర్వాత అందరికి సాయిబాబా అభిషేక
క్షీరం తాగ టానికి ఇచ్చారు .ఆ తర్వాత నిమ్మ రసం ఇచ్చారు .దాని తర్వాత
విందు .విందు లో -చపాతి పూరీ ,కూరలు ,పెరుగు పచ్చడి ,కారట్ హల్వా ,పండు
మిరప కారం ,మూడు రకాల స్వీట్లు మూడు రకాల పెరుగు ఆవడ వంటి హాట్లు మొత్త ం
సుమారు పది హేను వరైటీలు .ఇష్ట మైన వి యేవో కొద్దిగా తిన్నాం .అక్కడ సుజన్
అనే వరంగల్లు కుర్రా డు పరిచయమై తెలుగు లో మాట్లా డాడు .అతను మేము కూడా
మాట్లా డటం విని ''చాలా రోజు లైంది తెలుగు విని'' అన్నాడు .సత్య అతనికి
మన'' సరస భారతి'' గురించి'' బ్లా గు'' గురించి వివరించి చెప్పాడు అతను
ఆశ్చర్య పో యాడు .సత్య ఎక్కడ వీలైతే అక్కడ సరస భారతి గురించి మంచి ప్రచారం
చేస్తు న్నాడు .మంచి గౌరవం గా ఉంటాడు .సుజన్ తో ''అంకుల్ -ఈ మధ్య ఈల శివ
ప్రసాద్ వచ్చి నప్పుడు రెండు మంచి బిరుదులు ''ఈల లీలా లోల ''-''గళ వంశీ
''అనే వి సజెస్ట్ చేసి వేదిక మీద ప్రకటించారు ''అని జ్ఞా పకం చేసుకొన్నాడు
.
జులై పదిహేను సో మవారం నుండి ఇరవై రెండు ఆది వారం వరకు విశేషాలు - వాన ప( పు )లకరింపు -
దక్షిణాయనం -శ్రా వణ మాసం విశేషాలు
కిందటి వారం అంతా టన్చన్ గా రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు వర్షం పలకరించి
,పులకరించి పో తోంది .ఉష్ణో గ్రత 96f పైనే ఉండటం ఈ జల్లు లు వర్షం తో హర్షా న్ని కలిగించాయి .సమయ పాలన ను వాన
దేవుడు బానే పాటించాడు .సో మవారం ,ఆదివారం మైనేని గోపాల కృష్ణ గారు ఫో న్ చేసి మాట్లా డారు .పదహారో తేది రాత్రి
సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశి లోకి ప్రవేశించాడు .ఉత్త రాయన పుణ్య కాలం వెళ్లి దక్షిణాయనం వచ్చింది .ఈ శుక్ర
వారం నుండి శ్రా వణ మాసం ప్రవేశించింది .
శ్రా వణ శుక్ర వారాల హడా విడి
ఈ శుక్ర వారం నుండి వరుసగా వచ్చే అయిదు శుక్ర వారాలు మా అమ్మాయి విజ్జి వాళ్ళింట్లో రాత్రి పూట
,అమ్మ వారి స్తో త్రా లు భజన కార్య క్రమాన్ని ఏర్పాటు చేసింది .మొదటి శుక్ర వారం రాత్రి ఎనిమిది గంటలకు భజన మొద
లైంది సుమారు ముప్ఫై మంది వచ్చారు గంట సేపు అమ్మ వారి స్తో త్రా లతో భజన బాగా జరిగింది .విజ్జి ,శ్రీ కెత్ ల తో పాటు
మిగిలిన వారందరూ భజన గీతాలు పాడారు .ఆ తర్వాతా అందరికి విందు --అన్నం ,బెండ కాయ కూర ,దో సావ కాయ
,గోంగూర పచ్చడి ,చపాతీ ,చోలీ కూర ,సాంబారు ,సేమ్యా పాయసం ,పులిహో ర ,అప్పడాలు ,పెరుగు తో రుచి ,శుచి కర మైన
భోజనం .అందరు తృప్తి గా తిని అభి నందించారు .మిగిలిన నాలుగు వారాలు ఇలానే రావాలని అందరికి చెప్పటమే కాదు -
అందరికి మెయి ల్ రాసింది ఇది వరకే .అంతా ఆయె సరికి రాత్రి పదిన్నర అయింది .వచ్చే శుక్ర వారం వర లక్ష్మీ వ్రతం
.ఉదయం ఎవరింట్లో వారు పూజ చేసుకొని రాత్రికి ఇక్కడికి వస్తా రు .వాయనాలు ఇక్కడే ఇచ్చు కొంటారు .చాలా మంది
మహిళలు వస్తా రు కనుక అదొక వీలు .
ఈ ఆది వారం సాయి సెంటర్ లో ఉదయం పదింటి నుండి జరిగే కార్య క్రమానికి చాలా
రోజుల తర్వాతా వెళ్లా ను .మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉండి ఇంటికి వచ్చాము .ఇక్కడి సాయి సెంటర్ గురించి కొన్ని
విషయాలు తెలియ జేస్తా ను .వీరి లో ఎక్కువ మంది మద్రా స్ ,హైదరాబాద్ ,వగైరా సత్య సాయి సెంటర్లు అ యిన ''సత్యం
,శివం ,సుందరం ''లలో ప్రత్యక్షం గా సంబంధం ఉన్న వాళ్ళు .వారందరూ మంచి క్రమ శిక్ష ణతో ,సాయి సేవా కార్య క్రమాలను
,భజనలను అత్యంత శ్రద్ధా ,ఆసక్తు లతో నిర్వ హిస్తా రు .డబ్బులు వసూలు చేయరు .అంతా వాలంటరీ సేవే .ఇందులో తెలుగు
తమిళం మలయాళం ,హిందీ గుజరాతి ,రాజస్తా నీ ,మొదలైన వారందరూ ఉన్నారు .భాషలు వేరైనా భావాలు ఒక్కటే .సేవ
ప్రేమ . అంకిత భావం తో పని చేస్తా రు .పిల్లలకు ప్రత్యెక క్లా సులు నిర్వ హించి వారి ని ఆదర్శ మార్గ ం వైపు కు మళ్లిస్తా రు
.పిల్లలందరూ చక్కగా కలిసి మెలసి ఉంటారు .ఎవరో ఒకరింటి వద్ద సాయంకాలా లలో భజన ఏర్పాటు చేసు కొంటారు .మిగిలిన
వారు హాజరై కార్యక్రమాన్ని నిండుగా నిర్వ హిస్తా రు .వీలైతే రాత్రి ఏదో టిఫిన్ ,లేక భోజనం ఏర్పాటు చేస్తా రు గృహస్తు లు
.చెయ్యాలి అనే నియమం లేదు .వారి ఉత్సాహం .డో లక్, హార్మని, తబలా వాయించే కళా కారులు మంచి గాత్రం తో శ్రా వ్యం గా
పాడే వారు వీరి లో ఉన్నారు .వీరందరూ ఆడా మగా దాదాపు ఐ.టి.ఉద్యోగులే .తీరిక సమయాలలోనే ఈ సేవ .మధ్య మధ్య
మెడికల్ కాంప్ లను నిర్వ హిస్తా రు .మందులు ఉచితం గా ఇప్పిస్తా రు .పూర్ ఫీడింగ్ ను చర్చి వారి సహకారం తో నిర్వ
హిస్తా రు .
ముఖ్య మైన విషయం సాయి సెంటర్ లోని వారంతా ఎ ప్రా ంతం వారైనా ''శాకా హారమే ''భుజిస్తా రు
.మద్యం సిగరెట్ల జోలికి వెళ్లరు .ఇవి నా లాంటి వాళ్ళందరికీ ఆనంద దాయకం గా ఉంది .మంచి కుటుంబం లా కలిసి మెలిసి
ఉంటారు .ఇంత కంటే అమెరికా లో మంచి సమాజం ఉండదని పిస్తా రు .మా ఇద్దర్ని ''అంకుల్ అని ఆంటీ ''అని ఆప్యాయం గా
పలక రిస్తా రు .అన్నిటి కంటే ఒకరి నొకరు కలిసి నప్పుడు ,విడి పో యే టప్పుడు ''సాయి రాం ''అని పలకరించు కొంటారు
.భజన ముందు ,తర్వాతా ''సర్వే జనా స్సుఖినో భవంతు .సమస్త లోకాస్సుఖినో భవంతు ''అని ప్రపంచ ,విశ్వ శాంతి మంత్రం
చదువు తారు .ఇన్ని వేల గొంతులు ప్రపంచ వ్యాప్త ం గా ఈ మంత్రా న్ని చదువుతుంటే సామూహిక వాక్కు ఫలితం ఉంటుందని
మనకు తెలుసు .భోజనం చేసే ముందు భగవద్గీత శ్లో కాలు చదువుతూ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం గా భావిస్తూ స్తో త్రం
చేస్తా రు .
సత్య సాయి భజనలు ఎ దేశం లో నైనా ఒకే రకం గా చేస్తా రు .అవి చక్కగా బాణీలు కట్టి కే రకం గా పాడు
కొనే తట్లు ఉంటాయి .అన్ని గ్రంధస్త ం అయి ఉంటాయి . .ఎవ రైనా అలానే పాడ తారు .ముందు మామూలు స్తా యి, తర్వాత
వేగ వంతం, తర్వాత తారా స్తా యి, మళ్ళీ మామూలు కు వస్తా రు .భజనలు అన్ని చాల మంచి భావం తో శ్రీ రామ ,శ్రీ కృష్ణ శివ
,షిర్డీ ఆయీ బాబా జొరాస్ట ర్ ,క్రీస్తు మహమ్మద్ ,అల్లా పార్వతి లక్ష్మీదేవి ,సరస్వతి కాళిక ల పేర భజనలుంటాయి . .ఎ దేవుణ్ణి
,మత ప్రవక్త ను వదలరు .గణపతి ,సుబ్రహ్మణ్యం బుద్ధ ,జైనులనూ స్మరించే భజనలున్డ టం విశేషం . .సర్వ మత సహనం
ఇక్కడ స్పష్ట ం గా కనీ పిస్తు ంది .చివర్లో ప్రతి భజనలో షిర్డీ సాయి ,సత్య సాయి పేర్లు వుంటాయి .అదే ప్రత్యేకం .ప్రపంచం అంతా
ఒకే పధ్ధతి లో భజన చేయటం గొప్ప విషయం .ఆదర్శం .సత్య సాయి మీద నమ్మకం ఉన్నా లేక పో యినా ఈ విధానం నాకు
నచ్చింది .
సరే --అసలు విషయానికి వస్తే -మేము అమెరికా వచ్చి మూడు నెలలు దాటి పది రోజుల పైనే అయింది
.అంటే వంద రోజులు అయిందిఅన్న మాట .అంటే ''శత దినోత్సవ వారం ''అయింది ఈ వారం మాకు ...
ఈ వారం లో ఒకే ఒక పుస్త కం paul brunton రాసిన in search of secret india '' ను చాలా ఆసక్తి గా చదివాను
.దీన్ని నాకు కానుక గా ఇచ్చారు మిత్రు లు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు .దానిని ఆధారం గా ఇప్పటికి మూడు ఆర్టికల్స్ -
పరమాచార్య సందర్శనం తో పులకింత ,మేహేర్బాణి,పరమా చార్య పధం రాశాను .ఇంకా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి
గురించి, ఇంకా మరో రెండు ఆర్టికల్స్ రాయాలి .ఇది గాక లైబర
్ర ి నుండి తెచ్చిన 'Albert Eistein ''క్షున్నం గా చదివి నోట్సు
రాసుకోన్నాను .అవీ ఎప్పుడో వరుసగా రాయాలి .అంతకు మించి ఏమీ చదవలేక పో యాను .
జూలై ఇరవై మూడు సో మ వారం నుండి ,ముప్ఫై ఆది వారం వరకు విశేషాలు --
కోసూరు ఆదినారాయణ ,అంగలూరు రాజేంద్ర ప్రసాద్ గార్లు సో మ వారం ఫో న్ చేసి మాట్లా డారు .వాళ్ళ కోరిక పై
సరస భారతి సమాచారాలు పంపుతున్నాను .వారిద్దరిని'' సాహితీ బంధు గ్రూ ప్'' లో చేర్చాము . .అప్పటి నుండి మన
కార్యక్రమ విశేషాలు ఫో టోలు ,వ్యాసాలూ అన్నీ వారికి చేరుతాయి .మేనల్లు డు శాస్త్రి తో చాట్ చేశాను .గూగుల్ లో సరస భారతి
కి స్పేస్ కోసం స్పాన్సర్ చేస్తా నని ఇది వరకే అన్నాడు .ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది .దాన్ని గుర్తు చేశాను .వెంటనే 99
డాలర్లు గూగుల్ కు ఆన్ లైన్ లో చెల్లి ంచి ,స్పేస్ ను ఇప్పించాడు .వెంటనే అభి నందనలు తెలిపాను .
శ్రా వణ మంగళ వారం
ఈ రోజు మొదటి మంగళ వారం .ఇంట్లో పూజ చేసుకొన్నారు తల్లీ కూతుళ్ళు .ఉయ్యూరు దగ్గ ర కనక వల్లి
లోని వెంపటి సో మయాజులు గారి కూతురు కుమారుడు ఇక్కడే ఉంటున్నారు .అతని భార్య విజ్జికి బాగా పరిచయం .వాళ్ళ
ఇంటి పేరు ప్రక్కి .ఆయనది బందరు .ఆ అమ్మాయి మన వాళ్ళిద్దర్నీ మంగళ వారం వాయనానికి భోజ నానికి పిలిచింది .వెళ్లి
వచ్చారు .అతను కోసూరు ఆదినారాయణ బావ మరది, అల్లు డు టెక్సాస్ లోని ఆస్టిన్ లో ఉంటున్న ప్రసాద్ కు స్నేహితుడు .
పితృ స్మరణ
మా అమ్మాయి వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్న పసుపుల రవి గారి భార్య గాయత్రి ''అంకుల్ అంటి ''అంటూ బాగా
పలకరించి మాట్లా డు తుంది .ఆమె మంగళ వారం మధ్యాహ్నం వచ్చి ఆమె తండ్రి గారు మారెళ్ళ పార్ధ సారధి గారు చని పో యి
పది ఎల్ల యిందని ,ఆయన చనిపో యిన రోజు ఈ రోజే నని చెప్పి ,ఆయన్ను తలుచు కుంటూ నాకు తాంబూలం ఇవ్వాలను
కొంతున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది .సరే నని ఆమెతో వాళ్ళింటికి వెళ్లా ను .పరవాన్నం పెట్టింది .కుర్చీ లో
కూర్చో పెట్టి నాకు ఒక లుంగీ తువ్వాలు పెట్టి ,తాంబూలం ఇచ్చింది .అందులో వంద డాలర్ల నోట్ఉంది .ఇదేమిటి తాంబూలం
అంటే వచ్చాను ఈ డబ్బు వద్దు అన్నాను .ఆమె అప్పుడు ''అంకుల్ ! మా నాన్న గారు మంచి సాహిత్యాభి లాషి .ఎప్పుడూ
ఏదో రాస్తూ పుస్త కాలు ప్రచురిస్తూ ందే వారు .చని పో యి పదేళ్లు అయింది .ఆయన జ్ఞా ప కర్ధ ం గా ఇస్తు న్నాను .ఈ డబ్బు ను
సరస భారతి కోసం ఉప యోగించండి ప్లీజ్ '' అని బ్రతి మాలింది .సరే సరసభారాతికి ఇంతటి ప్రో త్సాహం లభిస్తు ంటే కాదన లేక
తీసుకొన్నాను .వాళ్ళ నాన్న గారు రాసిన ''గీతా సందేశం ''పుస్త కాన్ని కూడా ఇచ్చింది .సరస భారతి తరఫున ఆమె కు
కృతజ్ఞ తలు చెప్పి ఇంటికి వచ్చాను .గీతా సారం చదివాను .ఆయన మహా జ్ఞా ని అని ఎన్నో విషయాలు ఆయనకు బాగా
తెలుసు నని అర్ధ మయింది . మంచి పనికి సహక రించి నందుకు ఆమె ను అభి నందించాను .ఉదయం హిందూ సెంటర్ లో
మా మన వల్ల సమ్మర్ క్లా స్ కు వాళ్ళను తీసుకొని వెళ్లి అక్కడి బాలాజీ దేవాలయం లో శివునికి జరిగే అభిషేకం లో నేనూ
పాల్గొ న్నాను .ఇక్కడ ఇంకో విషయం -కిందటి నెలలో నేను అలబామా వెళ్లి హన్త్స్ విల్ లో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారింటికి
వెళ్లి నప్పుడు వారు ఎంతో ఆదరం చూపించి నాకు అన్నీ చూపించి ,అక్కడి ఆయన స్నేహితులత్కు పరిచయం చేశారని
లోగడే రాశాను .నేను వారివద్ద సెలవు తీసుకొని వస్తూ ండగాబస ఎక్క బో యే ముందు రహస్యం గా ఆయన నా జేబు లో ఒక
కాగితం పెట్టా రు .ఏమిటో నని తీసి చూస్తె అది అయిదు వందల డాలర్ల చెక్కు .ఇదేమి పని?అన్నాను .దానికి ఆయన ''ఇది
మన సరస భారతికి నేనిచ్చే కానుక .దీన్ని మీ ఇష్ట ం వచ్చి నట్లు ఉప యోగించండి ఆంజనేయ స్వామి కి వాడినా సరస
భారతికి వాడినా ,పుస్త క ముద్రణకు వాడినా మీ ఇష్ట ం ''అని నన్ను మాట్లా డ నివ్వ లేదు .అయితే''దీన్ని ఎవరికి చెప్పి ప్రచారం
చెయ్యద్దు '' అన్నారు . అది నాకు వదిలే యండి అన్నాను .అంతటి ఉదారులాయన .అందుకని ఈ సందర్భం లో గుర్తు చేశాను
.
శ్రీ వర లక్ష్మీ వ్రతం --పౌరోహిత్యం
ఈ రోజు రెండవ శ్రా వణ శుక్ర వారం .శ్రీ వర లక్ష్మీ వ్రతం పొ ద్దు న్నే లేచి విజ్జి నాదస్వరం పెట్టింది .ఆ తర్వాత తల్లీ
కూతుళ్ళు ఇద్దరు ,పిల్లలను సమ్మర్ కాంప్ కు పంపిన తర్వాత వంట చేశారు .తర్వాతఅమ్మ వారిని కలశం లో పెట్టి మంచి
అలంకరణ చేసి పూజ కు కూర్చున్నారు .నేనే పూజ చేయించాను విధి విధానం గా .ఆ తర్వాతా ఒకళ్ళ కొకల్లు
వాయనాలిచ్చుకొన్నారు .తల్లికి కూతురు చీర జాకెట్టు పెట్టింది .భోజనాల లోకి పూర్నబ్బూరెలు ,ఉండ్రా ళ్ళు ,పాయసం
,గోంగూర పప్పు ,వంకాయ కూర ,కొత్తి మీర ఖారం చేశారు .అన్నీ కమ్మగా ఉన్నాయి .
సాయంత్రం విజ్జి స్నేహితు రాలు సౌమ్య అనే అమ్మాయి వచ్చింది ఇక్కడ ప్పోజ చేసు కోవా టానికి .ఆమె
ఉద్యోగం చేస్తు న్నందున పొ ద్దు న్న పూజ చేసుకో లేక పో యిందట .మా వాళ్ళు పేరంటానికి వెళ్లా రు .నాగమణి కూతురు కూడా
వచ్చారు వాయ నానికి .సౌమ్య పుస్త కం అడిగింది ఇచ్చాను .ఏదో పూజ చేస్తో ంది .తీరా చూస్తె మంగళ వార పూజ చేస్తో ంది
.అదికాదని ''నేను పూజ చేయిన్చనా అమ్మా ''?అని అడిగాను .చాలా సంతోషించింది .అప్పుడు విఘ్నేశ్వర పూజ ,,తులసి ,
వర లక్ష్మి ,లలితా త్రిపుర సుందరి పూజలు,తోర పూజ ,తోరాన్ని కట్టే మంత్రం చదివి కట్టించాను .ఆమె చాలా ఆనందించింది
.తాంబూలం తీసుకో మని అందులో పది డాలర్లు పెట్టింది .దాన్నీ సరస భారతికే వినియోగిద్దా మని అనుకొన్నాను .
భజన
రాత్రి ఎనిమిది గంటలకు భజన కార్య క్రమం .యాభై మంది వచ్చారు ఆడా మగా ,పిల్లలు అందరు కలిసి
.గంట సేపు . భజన జరిగింది .ఆమ్మ వారి మీద గీతాలతో అందరు పాడి భజన చేశారు .మహిళలందరూ శ్రా వణ లక్ష్మీ
స్వరూపులు గా పట్టు చీరలు కట్టు కొని నగలు అలంకరించు కొని వచ్చారు .మా ఇంటికి ఇంత మంది లక్ష్మీ దేవులు వచ్చారని
సంబర పడ్డా ను . ఆడ పిల్లలు కూడా సాంప్రదాయ దుస్తు లు ధరించి అమెరికా లో భారత దేశాన్ని చూపించారు .తొమ్మిది
గంటలకు విందు .పూర్నపు బూరెలు ,ఉండ్రా ళ్ళు ,పాయసం ,పులిహో ర ,అన్నం ,వంకాయ కూర ,కొత్తి మిర చట్ని ,సాంబారు
,అన్నం పెరుగు ,పుచ్చముక్కలు ,పనస తొనలు తో విందు పసందు గా ఉంది .కొందరు పాయసం చేసుకొని వచ్చారు కొందరు
వడ ,ఆవడ తెచ్చారు ఇంకో ఆమె రవ్వ కేసరి తెచ్చింది .ఇల్ల ంతా లక్ష్మీ కళ తో కళ కళ లాడింది .అన్ని వయసుల వాళ్ళు
వచ్చారు .ఆడవాళ్ళు తమతో తెచ్చుకొన్న వాయనాలను ఒకరికొకరు ఇచ్చు కొన్నారు .మొత్త ం మీద సందడి సందడి గా శుక్ర
వారం గడిచింది .రాంకీ ఉషా మామ గారు అత్త గారు ,పవన్ కుటుంబం ,రవి కుటుంబం నాగమణి ఫామిలి ,కనక వల్లి
అమ్మాయి భర్త ,జగదీశ్ కుటుంబం ,యోగిని, భర్త శని వావారం గృహ ప్రవేశం చేసుకొనే మా ఇంటి దగ్గ రున్న గుజరాతీ
కుటుంబం వగైరాలందరూ వచ్చి నిండు దానం తెచ్చారు .అందరు వెళ్ళే సరికి పావు తక్కువ పడ కొండు .
భజనతో విందు .
సాని వారం రాంకీ ఉషా వాళ్ళ ఇంట్లో రాత్రి భజనకు ఆహ్వానిస్తే వెళ్ళాం .ఇక్కడికి అరగంట డ్రైవ్ .సాయంత్రం
ఆరు నుంచి రాత్రి ఏడున్నర వరకు భజన .సుమారు ముప్ఫై అయిదు మంది వచ్చారు . ఏడున్నరకు విందు .పూర్ణా లు
,పులిహో ర ,ఉప్మా పూరీ చెనా మసాలా ,అన్నం సాంబారు గుత్తి వంకాయకూర,పుచ్చ ముక్కలు బొ ప్పాయి ముక్కలు
,మామిడి జ్యూసు ,పాయసం తో గట్టి విందే ఇచ్చారు రాంకీ దంపతులు . వాళ్ళింటికి విందుకు వెళ్లటం ఇది రెండో సారి నేను మా
అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చి ప్రక్కనే గృహ ప్రవేశం చేసుకొన్నా గుజరాతీ కుటుంబం ఆహ్వానం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాం
.పది రకాల పదార్ధా లు చేశారు కాని ఒక్కే ఒక బజ్జి తిన్నాను .భోజనం దాదాపు రాంకీ వాళ్ళింట్లో నే లాగించేశాం .ఇది ఊరికే
కంపెని సేక్ .వాళ్లకు ఒక సంప్ర దాయం ఉందట .గృహ ప్రవేశం అయిన రాత్రి ఇంట్లో వాళ్ళ గుజరాతీ సంప్రదాయనృత్యం ''గాగ్రా
డాన్సు ''చేయాలట తప్పని సరిగా .నేను వచ్చేశాను మా అమ్మాయి అల్లు డు ఉండి చూసి వచ్చారు .
పొ రిగింట నిద్ర (స్లీప్ ఓవర్ )
ఇక్కడ అమెరికా లో ఒక అలవాటు ఉంది .చిన్న పిల్లలు తమ క్లా స్ మెట్లు లేక తెలిసిన కుటుంబాలలో ఒక రోజు
రాత్రి గడిపి వారితో కలిసి మెలసి ఉంటారు దీన్ని'' స్లీప్ ఓవర్'' అంటారు . మా మనుమళ్ళు శ్రీ కెత్ ,ఆశుతోష్ ,పీయూష్ లు
రాంకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల తో స్లీప్ ఓవర్ చేయటానికి శని వారం రాత్రి వాళ్ళింట్లో ఉంది పో యారు .భజన కు వెళ్ళే
తప్పుదే ఉండ టానికి కావలసిన బట్ట లు తీసుకొని వెళ్లా రు .మేము ఇంటికి వచ్చేశామని ముందే చెప్పానుగా .
అమెరికా లో చలి వేంద్రం (లేమనాడ్ స్టా ండ్ )
ఇండియా లో వేసవి కాలం చలి వెండ్రా లు పెట్టి చల్ల ని మంచి నీళ్ళు మజ్జిగ ఇవ్వటం మన కందరికీ తెలుసు
.ముఖ్యం గా ఆంద్ర ప్రదేశ్ లో వీటిని బాగా నిర్వహిస్తా రు కదా .అట్లా గే మా మన వాళ్ళు రాంకీ కూతురు కొడుకు శని వారం
మధ్యాహ్నం రాంకీ వాళ్ళ ఇంటి ఎదురుగా నిమ్మ కాయ జ్యూస్ ను ఒక గాజు పాత్రలో పో సి ఐసు గడ్డ లు కలిపి చల్ల గా చేసి
దాన్ని స్టా ండ్ళ మీద ఉంచి వచ్చే పో యే వారిక ి గ్లా సుల్లో పో సి ఇచ్చారట .కొందరు దీనికి గాను గ్లా సుకు యాభై సెంట్లు ఇచ్చి
పిల్లలను ఉత్సాహ పరచారత .మంచి పనికి ప్రేరణ నిచ్చిన రాంకీ ని అభి నందించా .అతనే పిల్లలకు కధలు లెక్కలు చెప్పి
ఆటలాదించి బాగా కాలక్షేపం కల్గించాడు .
పదేళ్ళ తర్వాత ఈత మోత
చిన్నప్పుడు మా ఉయ్యూరు లో పుల్లేరు లో స్నానం చేసి ఈదులాడే వాళ్ళం .నేను సునాయాసం గా
మునిగి తేలుతూ ఈది అవతల ఒడ్డు కు వెళ్లి తిరిగి ఈదుకొంటు వచ్చే వాడిని .నా దగ్గ ర ట్యూషన్ చదివే పిల్లలను ఉదయమే
స్నానాలకు తీసుకొని వెళ్లి చేయించే వాడిని .కాలవ అంతా దుర్గ ంధం గా మారి పో వటం వల్ల దాదాపు యాభై ఏళ్ళు అయింది
పుల్లెట్లో స్నానం చేసి .మొదటి సారి అమెరికాకు పదేళ్ళ క్రితం టెక్సాస్ లోని హూస్ట న్ కు వచ్చాం .మా అమ్మాయి వాళ్ళ
ఇంటికి చాలా దగ్గ ర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది .అక్కడ అయిదారు సార్లు స్నానం చేసి ఈత కొట్టా ను .మళ్ళీ ఈ పదేళ్ళ లో
ఎక్కడా చేయలేదు .ఇవాళ ఆది వారం రాంకీ ఇంటి నుంచి పిల్లలను తీసుకొని వద్దా మని నేను మా అమ్మాయి వెళ్ళాం .అక్కడ
స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు స్నానం చేయటానికి హుషారుగా ఉన్నారని నన్ను కూడా చేయమని బట్ట లు సర్దింది .సరే నని
వెళ్ళాం .అందరం అంటే నేను మా అమ్మాయి ముగ్గు రు మన వళ్ళు రాంకీ అతని భార్య ఉషా వాళ్ళ అమ్మాయి అబ్బాయి
స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళాం .చాలా దగ్గ రే వాళ్ళ ఇంటికి .అందరం పూల్ లో దిగి ఒక గంట సేపు స్నానం చేశాం .రాంకీ నేను
గంట తరువాత ఇంటికి తిరిగి వచ్చాం .మా వాళ్ళు ఇంకో గంట ఉండి వచ్చారు .ఇంటికి చేరే సరికి రాత్రి ఏడున్నర .అలా పదేళ్ళ
తర్వాత ఈత మోత మోగించాను .బాగానే ఈదానని రాంకీ నన్ను మెచ్చాడు .అతను సాధారణం గా వెళ్ళడట .నా ఉత్సాహం
చూసి వచ్చాడు . మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎదురు గా స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు దాదాపు అయి పో యింది ఆగస్టు
రెండో వారం లో ప్రా రంభోత్సవం .అతని మామ గారు అత్త గారు కిందటి వారమే హైదరాబాద్ నుండి వచ్చారు .ఆయన ఒరిస్సా
లోని జైపూర్ లో గవర్న మెంట్ హై స్కూల్ హెడ్ మాస్ట ర్ చేసి రిటైర్ అయాడు .అక్క డె పుట్టి అక్కడే చదివి ఆ స్కూల్ లోనే
ఉపాధ్యాయుడై హెడ్ గా అయా స్కూల్ లోనే పని చేసి పదవీ విరమణ చేశాడు .మా రెండో కోడలు ఇందిర ది ఆ ఊరే .వాళ్ళ
నాన్న బల్లా ర్ పూర్ పేపర్ మిల్స్ లో పని చేశి రిటైర్ అయాడు .మా మనవడు హర్ష బారసాలకు జైపూర్ వెళ్ళాం .కాని మా
వాళ్ళెవరూ ఆయనకు తెలియ దన్నాడు .ఒకప్పుడు జైపూర్ ఆంద్ర దేశం లో ఉండేది .జైపూర్ రాజు విక్రమ దేవ వర్మ గొప్ప
సాహిత్య పో షకుడు .
జులై ముప్ఫైసో మవారం నుంచి ఆగస్ట్ అయిదు ఆదివారం వరకు విశేషాలు .వారం లో మొదటి అయిదు రోజులు సాదా
సీదా గానే గడిచి పో యాయి .మా అమ్మాయి పంటి డాక్టర్ వద్ద ఆరు పళ్ళను తీయించు కొంది బుధవారం .చాలా సునాయాసం
గా అరగంట లో తీశేశాడు .ఆరోజు కొంచెం నెప్పితో బాధ పడింది కాని మర్నాడు నుంచి పిల్లల్ని సమ్మర్ కాంప్ లకు తీసుకొని
వెళ్లటం తీసుకొని రావటం తప్ప లేదు .డ్రైవింగ్ చేయక తప్పని పరిస్తితి .గురువారం లైబర
్ర ీకి వెళ్లి తొమ్మిది పుస్త కాలిచ్చి కొత్త వి
ఆరు తెచ్చు కున్నాను .ఈ వారం లో చదివినవి అన్ని మంచి ఉపయోగమైన పుస్త కాలే .శుక్ర వారం సాయంత్రం మా వాళ్ళ
ఇంట్లో రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది వరకు భజన .ముప్ఫై మంది వచ్చారు .ఇది మూడవ శుక్ర వారం భజన .ఆ తర్వాత
విందు .మా అమ్మాయి నిమిగిలిన స్నేహితురాళ్ళు ఏమీ ఇంట్లో తయారు చేయద్దని చెప్పినా పులిహో ర ,అన్నం ,సాంబారు
కాకర కాయ కారం సెనగ పిండి కూరిన కూర, పెరుగు తయారు చేసింది .మిగిలిన వాళ్ళు సేమ్యా పాయసం ,గారెలు ,ఉప్మా
,చానా మసాలా బీన్సు కూర ,దొండ కాయ కూర వండి తెచ్చారు .అందరం సరదాగా కలిసి భోజనం చేశాం .అందరు వెళ్ళే సరికి
శనివారం మా వాళ్ళ ఇంటికి ఎదురు గా మాకు పది గజాల దూరం లో నిర్మించ బడ్డ స్విమ్మింగ్ పూల్ పూర్తీ అయి
ఉదయం పది గంటలకు ప్రా రంభించారు .పిల్లలు ,పెద్దలు అందరు సరదా గా స్విమ్మింగ్ చేశారు .సాయంత్రం విజ్జి స్నేహితురాలు
,భర్త వచ్చారు .వాళ్ళు ఈ కాలనీ లోనే కొత్త ఇల్లు కొన్నారట .గృహ ప్రవేశం ఎప్పుడు చేయాలని అడిగారు .వాళ్ళు సెప్టెంబర్
లో చేరాలని అనుకొంటున్నట్లు చెప్పారు .అది అధిక భాద్ర పదం పనికి రాదనీ చెప్పాను .మంచిది చూడమంటే ఆగస్టు
శార్లేట్ లోని ''తెలుగు అసో సియేషన్ ఆఫ్ గ్రేటర్ శార్లేట్ ఏరియా ''అనే సంస్థ -'' ఆటా''కు అను బంధం గా పని
చేస్తో ంది .వాళ్ళ ఆధ్వర్యం లో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభా వరి అయిదవ తేది ఆదివారం సాయంత్రం జరిగింది
.మా ఇంటికి నలభై అయిదు నిమిషాల ప్రయాణ దూరం లో, పాతిక మైళ్ళ పైనదూరం ఉన్న కాన్కార్డ్ పార్కు వే లో ఉన్న
రిచింగ్ టన్ హై స్కూల్ ఆడిట ోరియం లో జరిగింది .మా అల్లు డు సెప్టెంబర్ నుంచి పిల్లల కోసం ''వీక్లి రీడింగ్ ''క్లా సులు ఇంటి
దగ్గ ర నిర్వ హించాలని అనుకొని ప్రో గ్రా ం కు స్పాన్సర్ షిప్ మూడు వందల డాలర్లు కట్టా డు .అందులో వంద డాలర్లు మా
అందరి టికేట్లకే సరి పో యింది .మిగిలిన రెండొందలు స్టా ల్ పెట్ట టానికి .దీనితో మాకు ముందు వరుస లో కూర్చునే అవకాశం
వచ్చింది .షో రాత్రి ఆరున్నరకు ప్రా రంభమైంది .తెలుగు సంస్థ కు చెందినజ్యోతి మంచి వాక్యాలను సమ కూర్చుకొని స్వాగతం
చెప్పింది .అయితేఎందుకో మాటలు తడ బడ్డా యి .ఆడిట ోరియం బాగా ఉంది .సుమారు నాలుగు వందల మంది జనం
వచ్చారు .టికెట్టు ఖరీదు పాతిక డాలర్లు .ఆడవాళ్ళందరూ సాంప్రదాయ దుస్తు ల్లో చీర కట్టు కొని రావటం ముచ్చట గా ఉంది
.ఇంత మంది తెలుగు వాళ్ళను ఒక్క వేదిక వద్ద చూడటం చాలా ఆనందం గా ఉంది .
ఈ సంగీత విభావరిని వీళ్ళు మ్యూజిక్ ధమాకా అన్నారు .మణి శర్మ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం ఇది .కుర్ర
వాళ్లై న లబ్ధ ప్రతిష్టు లు ఎన్నో సంగీత పో టీలలో విజేతలు సుస్వరం తో అందర్ని అలరించిన హేమ చంద్ర ,కారుణ్య లు అసలైన
నాయకు లని పించుకొన్నారు .ఎన్నో పో టీలలో ,గెలుపు సాధించిన ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రా వణ భార్గ వి ,మాళవిక లు
తమ సత్తా ను చాటారు .మణి శర్మ అంటే బీట్ కు ప్రా ధాన్యం అని అందరికి తెలిసిన విషయమే .మాధుర్యం కంటే హో రెత్తి న
సంగీతం తో జనం కిక్కు కు లో నైనారు .అయితే పాడిన వాటన్నిటి లో నాకు స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి కలకత్తా
నగరం పైన రాసిన ''యమహా నగరి కలకత్తా పురి ''పాట చాలా నచ్చింది .అందులోని సంగీతస్వరానికి కాక పో యినా పాటలో
కలకత్తా గొప్ప తనాన్ని వంగ దేశం లోని మహా మహులను జ్ఞ ప్తికి తెచ్చిన సంగతి నాకు ఎంతో స్పూర్తి దాయకం గా ఉందని
పించింది .ఒక రకం గా చెప్పా లంటే కళ్ళు చెమర్చాయి .గుండె ఆనందం లో నిండి పో యింది .మిగిలినవన్నీ'' ఆర్టు బీట్ ''
కంటే ''హార్ట్ బీట్ ''ను పెంచాయనే చెప్పా వచ్చు .ఆ ఘోష భరించలేక చెవులకు రుమాలు అడ్డ ం పెట్టు కొన్నాను .గంటన్నర
తరువాత విరామం .ఆర్టిస్టు లందరూ స్టేజి వెనుక ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి కలిశాం .మణి గారితో ఫో టోలు దిగాము
.మిగిలిన ఆర్టిస్టు లతో కూడా కలిసి ఫో టోలు తీసుకొన్నాము .వాళ్ళందరూ చాలా సహకరించి ఎంతో ఓపిక తో ఫో టో లకు సిద్ధ
పడ్డా రు .స్టేజి మీద ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ,ఆడి పాడి అభినయించి న వాళ్ళల్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ నే ఉంది
.మణి శర్మ తో ''మీరు స్వర మణి శర్మ '' గా కనిపిస్తు న్నారు ''అన్నాను ''థాంక్ యు సార్''అని షేక్ హాండ్ ఇచ్చాడు . ''
వరుడు''సినిమా లో మేమందరం ఉన్నామని సంగీతం బాగుందని అందులోని ఒక పాట పాదించమని కోరాను .సరే నని
అన్నాడు . విరామ సమయం లో తెలుగు సంస్థ వాళ్ళు స్పాన్సర్ల కు జ్ఞా పికలు అంద జేశారు .అక్కడి స్టా ల్ లో ఉన్న'' రెండు
గారెలు సాంబారు '' పాకెట్ ను మూడు డాలర్లు పెట్టి అందరం తలో పాకెట్ తిన్నాం .
మళ్ళీ విరామం తర్వాత సంగీత కార్య క్రమం ప్రా రంభ మయింది . గంటన్నర జరిగింది .వరుడు సిని మా
పాట తో మొదలైంది .ఈ పాటకు కారుణ్య కు ఫిల్ము ఫేరు అవార్డు వచ్చిందని చెప్పి చక్క గా పాడాడు .చివరి వరుస లోని జనం
బాల కృష్ణ పాటలు పాడమని గోలా, అరుపులు ,కేకలు .కొంత ఇబ్బంది కల్గించాయి .ఆయనకు కొంచెం కోపం కూడా
తెప్పించాయి .తాను సంగీత దర్శకత్వం చేసిన సిని మాల లోని పాటలే పాడించాడు .జాన పద శైలి లో మధు ప్రియ ,హేమ
చంద్ర పాడిన పాట చాలా హై లైట్ గా ఉంది .ఇక్కడొక విషయం చెప్పాలి మా టి.వి .ప్రో గ్రా ం లో ''మధు ప్రియ'' అనే అమ్మాయి
జాన పదగీతాలను బాగా పాడి అందర్ని ఆకట్టు కొన్న విషయం అందరికి తెలిసిందే .ఈ స్టేజి మీద ఆ అమ్మాయి అమ్మ మీద
,నాన్న మీద ,పల్లె టూరి మీద పాడిన పాటలు అసలైన పాటలని పించి గుండెల్ని తట్టి ఆలోచింప జేశాయి .ఈ మొత్త ం కార్య
క్రమం లో వీటికే ఎక్కువ విలువ నిచ్చారు శ్రో తలు చప్పట్లు మారు మో గించి అభి నందనలు తెలిపారు .మిగిలిన పాటలకు
పూర్తీ సపో ర్టు మాత్రం ఖచ్చితం గా రాలేదని చెప్ప వచ్చు .పాపం గాయనీ గాయకులూ అడిగి చప్పట్లు కొట్టించు కోవాల్సి
వచ్చిందంటే ప్రో గ్రా ం ఎందుకో అందర్నీ అలరించ లేదేమో నని పించింది .గుండెల్ని పిండే పాటో , దేశ భక్తీ ,దైవ భక్తీ ఉన్న పాట
లో వుంటే, మనసును కరిగించే స్వరాలుంటే ఇంకా గుండెలు కరిగే వేమో అని పించింది .అయితే బీటు వాడికానందం .
అయితే కారుణ్య ,హేమ చంద్ర లె ఈ విభావరికి నిజ మైన విజేతలు .వారి లో ఉన్న ఎనర్జీ లన్ని టిని
ఒడ్చేశారు .కాదు మణిశర్మ పిండేశాడు .ఆ బాణీలు అలాంటివి ఫాస్ట్ బీట్ ఉన్నవి .వారిద్దరూ పాడుతూ ,నటిస్తూ ఎక్కడా
సభ్యతకు ఏమాత్రం లోటు రానీయ కుండా చేసిన ప్రయత్నానికి ''హాట్స్ ఆఫ్ ''.ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రా వణ భార్గ వి
,మాళవిక లు శక్తి యుక్తు ల్నిధార పో సి పాడారు .అడ పిల్లలు కదా షో చివర వాళ్ళను చూస్తె లేత తమల పాకుల్లా వాడి పో యి
నట్లు కనీ పించారు పాపం .లాలిత్యాన్ని మాళవిక పో షిస్తే ,గీతా మాధురి లాలిత్యం బీటు లను సమం చేసి పాడితే ,భార్గ వి ఉషా
ఊతప్ లాకొంచెం మగ గొంతుక తో పాడి ఆకట్టు కొంది .అందరు తమ లోని ఎనెర్జీ లెవెల్స్ ను ఖాళీ చేసుకొనే దాకా పాడి
రాత్రి పదిన్నరకు షో ను అకస్మాత్తు గా ముగించారని పించింది .వెనక నుండి కేకలు, వాళ్ళు కావాలన్న పాటలు
పాడక పో వటం ఇబ్బంది కలిగించి అలా చేశాడేమో మణి శర్మఅనుకొన్నారు .జనగణమన తో పూర్తి .మళ్ళీ మేమందరం మణి
శర్మ ,హేమ చంద్ర ,కారుణ్య, గీతా ,శ్రా వణ భార్గ వి ,మాళవిక ,మధు ప్రియ లతో ఫో టోలు తీసుకొన్నాము .అలసి పో యినా ఆ
భావం కాన పడ కుండా వారంతా పో జు లిచ్చి నవ్వు మొహాలతో అందరి తో ఫో టోలు దిగారు .మేము స్పాన్సర్ కోటా లో వాళ్ళం
కనుక మమ్మల్నేవరు అడ్డ గించలేదు .నేను మణి శర్మ తో ''మీ కుర్రా ళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా గొప్పవి .అంతా ఖర్చు పెట్టించారు
మీరు .వారందరూ ''మణులు ,మీరు శర్మ ''అన్నాను నవ్వి సంతోషం తెలియ జేశాడు .ఖేమ చంద్ర స్టేజి రిహార్సల్సు దగ్గ ర్నుంచి
అన్నీ చూశాడు .అతని కాంట్రిబ్యూషన్ విలువ కట్ట లేనిది .అతనికి మూడు నాలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం
వహించిన అనుభవమూ ఉంది . ఈ క్రెడిట్ అంతా గాయకులకే ఎక్కువ గా చెందుతుంది .శర్మ దర్శకు డైన,కష్ట ం ,శ్రమా అంతా
హేమ చంద్ర ,కారుణ్యలదే .సందేహం లేదు .అందుకే వారిద్దరికి షేక్ హాండ్ ఇచ్చి నా ఆనందాన్ని వ్యక్త ం చేసి మనసు లో మాట
కార్య క్రమం పూర్తీ అవటానికి ముందు ''చేతక్ ''అనే చిన్న కుర్రా డు చాలా జోష్ గా మణి శర్మ స్వర
పరచిన రెండు గీతాలను పాడి అందరి అభి నందనాలు పొ ందాడు .ఆ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉందని పించింది .విభావరి
లో డ్రమ్ములు వాయించిన పొ ట్టి కుర్రా డు మహా విశ్రు ం ఖలం గా చెవులు చిల్లు లు పడేట్లు , గుండెలదిరే ట్లు గా క్షణం తీరిక
లేకుండా వాయించి శర్మ అనుకొన్న ది సాధించటానికి కారకుడయ్యాడు .మిగిలిన వారు కూడా తగిన సహకారం ఇచ్చి
సరిగమలు --మణి శర్మ ఎంత సేపు ప్రేక్షకులకు వీపు చూపిస్తూ నే దర్శకత్వం వహించాడని సన్నాయి
నొక్కులు నొక్కు కొన్నారు -ఆయన స్వచ్చమైన మల్లె పువ్వు లాంటి తెల్ల బట్ట లే వేసుకొన్నాడు కాని ఆ చొక్కాపై ఆ శిలువ
గుర్తు ల్లా ంటి వేమిటి?అని బుగ్గ లు కొరుక్కున్నారు కొందరు .అది బాపు తీసిన ఏదో సినిమాలో నూతన ప్రసాద్ ''కొత్త దేవుడండీ
''అనే పాటను పాడుతూ వేసుకొన్న డ్రెస్ లా ఉందని, సినిమాలు బాగా చూసి ,కాచి వడ పో సిన ఒక పెద్దా యన నవ్వుతూనే
పదనిసలు --బాల కృష్ణ పాటలే పాడాలని ఇబ్బంది పెట్టటమేమిటి అని కొందరు సణుక్కున్నారు .బాలికలు
ముగ్గు రు పాడిన పాటలు మణి శర్మ సినిమాలలో వారు పాడినవి కావు .అందుకే పాడ టానికి ఇబ్బంది పడ్డా రు .పాడాల్సి
నంత గొప్పగా ఆడ వాళ్ళు పాడలేక పో యారని ఒక సంగీతాభిమాని, మణి శర్మ గారి సంగీతాన్ని అధ్యయనం చేసిన ఆయనా
అన్నాడు .తెలుగు సంస్థ నిర్వ హించిన కార్యక్రమం కదా !పాడిన పాటల్లో ఎక్కడా తెలుగు పదాలు కనీ పించలేదే -సంగీతం
అంతా పాశ్చాత్య పో కడ లో ఉంది .శ్రా వ్యత ఎక్కడ ?మాధుర్యం ఏదీ ?తెలుగుదనం ఏదీ ?అని తెలుగును అభి మానించే ఒక
అమెరికన్ తెలుగు పెద్దా యన గోడు వెల్ల బో సుకొన్నాడు .ఇది కాల వైపరీత్యం అన్నాడు ఇంకోఆయన .అందరికి ఒకే
అభిప్రా యం ఉండాలని లేదు కదా .అయినా ఇంతమంది తెలుగు వాళ్ళను ఒక చోట చేర్చి నందుకు మనం అభి
నందించాలిఅని మరో పెద్ద మనిషి పెద్ద మనసు తో సంతోషించాడు .ఇదీ--'' మణిశర్మాయణం ''--.ధమాకా- ధమ ధమ ధమ
ధమాకా ''.
ఆగస్టు పది హేడు శుక్రవారం తో శ్రా వణ మాసం పూర్తి .పద్దెనిమిది శని వారం నుండి అధిక భాద్ర పద మాసం మొదలై
,సెప్టెంబర్ పదహారు ఆది వారం వరకు ఉంటుంది .సెప్టెంబర్ పది హేడు సో మ వారం నుండి నిజ భాద్ర పద మాసం ప్రా రంభం
సో మ వారం నాగ మణి ,భర్త వచ్చి గృహ ప్రవేశానికి ముహూర్త ం అడిగితే ముహూర్తా లు అయి పో యాయి
కావాలంటే ఆది వారం దశమి బాగుంది చేసుకోండి అని చెప్పాను .బుధ వారం నాడు ఉదయం యేడు యాభై నిమిషాలకు
నేను పెట్టిన ఉహూర్తా నికే విజ్జి స్నేహితురాలు దంపతులు వీళ్ళ ఇంటికి దగ్గ ర కొన్న ఇంటి గృహ ప్రవేశం చేశారు .విజ్జి వెళ్లి
వచ్చింది .ఆ అమ్మాయి తల్లి దండ్రి కూడా ఉన్నారు .ఆదివారం సాయంత్రమే వాళ్ళ ఇండియా ప్రయాణం .అందరు ఇంటికి
వచ్చి ప్రసాదం స్వీట్లు ఇచ్చి వెళ్లా రు .గురు వారం శ్రీ కృష్ణా ష్ట మి .పెద్దగా హడావిడి ఏమీ లేదు .ఇంట్లో పూజ తప్ప .నెట్ లో
''పార్ధ సారధీ యం ''రాశాను .శుక్ర వారం కూడా అష్ట మి మిగులు ఉంది .ఆనాడూ కృష్ణ పూజ చేశాను''భగవాన్ శ్రీ కృష్ణ
ఉవాచ'' నెట్ లో రాశాను . నారాయణ తీర్ధు ల వారి .శ్రీ కృష్ణ లీలా తరంగిణి ని బాల మురళీ కృష్ణ గానం చేసిన సి.డి.వింటూ ,
నాల్గ వ శుక్ర వారం ఇంట్లో భజన .రాత్రి ఎనిమిదింటికి ప్రా రంభమై తొమ్మిదింటికి పూర్తి . రాహుల్ ,తబలా సత్య
,ఆతని భార్య సౌమ్య మాత్రమె బయటి వాళ్ళు .అందరు వూళ్ళకు వెల్ల టం తో ఎవరూ రాలేదు .భజన తర్వాతా భోజనం
independence road దగ్గ ర లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ ) కి రమేష్ మంజుల దంపతులు
అభిషేకం చేయించి ,స్వాముల వారలకు నూతన వస్త్రా లను సమర్పించే కార్య క్రమానికి ఆహ్వానిస్తే ,శని వారం ఉదయం
పదింటికి అందరం వెళ్ళాం .అక్కడి పూజార్లు అభిషేకం నిర్వహించి వీళ్ళు సమర్పించిన నూత్న వస్త్రా లను స్వాములకు కట్టా రు
.ఆ తర్వాతా పూజ నిర్వ హించారు .ప్రక్కనే ఉన్న హాల్ లో విందు ఏర్పాటు చేశారు .దాదాపు 80 మంది హాజరయ్యారు
.అయిదు రకాల స్వీట్లు ,మూడు రకాల పులిహో రలు ,కొబ్బరన్నం ,సాతాళించిన సెనగలు ,పెరుగన్నం తో పసందైన విందు
.అన్నీ బాగా ఉన్నాయి .రమేష్ దంపతులు మేము వచ్చి నందుకు చాలా ఆనందించారు .కావాలని మాతో ఫో టోలు దిగారు
.ఇంటికి వచ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .ఇక్కడికి అరగంట పైనే కారు ప్రయాణం
కాలి ఫో ర్నియా లో ఉన్న ''విరి జల్లు ''రేడియో కిరణ్ ప్రభ అనే ఆయన ,విజయా ఆసూరి అనే ఆమె లతో
మంచి రేడయో
ి కార్య క్రమాలను నిర్వ హిస్తూ ఉంటారు .ఇద్దరు శ్రో తలను అద్భుతం గా తమ విశేషఅను భవాలతో రంజింప
జేస్తా రు .అది లైవ్ గా ప్రతి శుక్ర వారం రాత్రి, శని వారం ఉదయం నిర్వ హిస్తా రు వారిద్దరూ .దానికి మంచి స్పందన శ్రో తల
నుంచి ఉంటుంది .సుమారు నెల క్రిందట సినీ నటుడు ,నిర్మాత ,దర్శకుడు సూపర్ స్టా ర్ కృష్ణ పుట్టిన రోజు పండగ ను ''విరి
జల్లు ''లో నిర్వ హించారు .వాళ్ళు అందులో ఒక ప్రశ్న అడిగారు .కృష్ణ నటించిన సిని మాలలో మీ కు నచ్చిన మూడు
పాటలను ప్రా ధాన్యత ను బట్టి చెప్పమని ఆడిగారు .మా అమ్మాయి సహాయం తో నేను ఫో న్ లో మాట్లా డి నాకు నచ్చిన
మూడు పాటలను -మొదటి పాట గా అల్లూ రి సీతా రామ రాజు సినిమా లో శ్రీ శ్రీ రాసిన ''తెలుగు వీర లేవరా ''పాటను ,రెండో
దానిగా --''తేనె మనసులు ''అనే కృష్ణ మొట్ట మొదటి సినిమా లోని ''దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమీ నీవై
''అన్న పాటను -మూడవ దానిగా 'శ్రీ రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్ల బ్ ''సినిమాలోని కృష్ణ శాస్త్రి గారు రచించిన ''రాకోయి
అనుకోని అతిధి ''పాటను చెప్పాను .నాదే ''ఆఖరి కాల్ '' నా సమాధానం అవగానే విజయా ఆసూరి .కిరణ్ ప్రభ గార్లిద్దరు కలిసి
''awsome ,awsome ''అని నన్ను అభి నందించి కార్య క్రమం లో చివర్లో నాకు గిఫ్ట్ (కానుక )ప్రకటించారు .సాధారణం గా
కానుక అంటే కాలిఫో ర్నియా లో సినెమా హాళ్ళకు వెళ్ళటానికి సినెమా టికెట్లో ,లేక హో టల్ భోజనానికి కూపన్ లో ఇస్తూ న్తా రట
.మేమున్నది నార్త్ కెరొలినా లో షార్లెట్లో .కనుక మాకు అవి ఎందుకు పనికి రావు .ఈ విషయం మా అమ్మాయి వాళ్లకు
మెయిల్ రాస్తూ ఇంకేదైనా ఉప యోగకర మైనది కానుక గాపంపమని తెలియ జేసింది .వాళ్ళిద్దరూ వెంటనే స్పందించి మీ
నాన్న గారికి చాలా ఇష్ట మైన కానుకలనే పంపుతున్నాం అని తెలియ జేశారు .
ఈ శని వారం సాయంత్రం పో స్ట్ లో నా పేర రెండు కానుకలు ''విరిజల్లు ''నుండి కురిశాయి .ఒకటి ''మహా మంత్రి
తిమ్మరుసు ''సినిమా d.v.d.,రెండో దిఆచార్య శ్రీ ముది గొండ శివ ప్రసాద్ రచించిన చారిత్రా త్మక నవల ''పట్టా భి ''.మొదటి దాని
ఖరీదేంతో నాకు తెలీదు కాని, ఈ నవల ఖరీదు 500 రూపాయలు .(50 డాలర్లు )ఈ నవలకొక ప్రత్యేకత ఉంది .కృష్ణా
,గుంటూరు సీమలను పరి పాలించిన కమ్మ ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలన కాలం లోని సాంఘిక
ఇతి వృత్త ం తో కూడిన నవల .ఇంత వరకు కమ్మ ప్రభువుల కాలాన్ని ఇతి వృత్త ం గా తీసుకొని నవల రాయలేదు .శివ ప్రసాద్
ఆ కీర్తిని దక్కించు కొన్నారు .ఆయన ఇప్పటికి 70 నవలలు రాశారు .చారిత్రా త్మక నవలలు రాయటం లో నోరి నరసింహ శాస్త్రి
విశ్వనాధ ల తర్వాతి స్తా నం వీరిదే .ఆయన్ను చాలా సందర్భాలలో చూశాను .మాట్లా డను .ఆయన భారతీయ సాహిత్యాన్ని
,సంస్కృతిని ఆపో శన పట్టిన మహాను భావుడు. వెంకటాద్రి నాయుడు మన కృష్ణ దేవ రాయలంతటి గొప్ప రాజు .అయన
రాజధాని అమరావతి .రాజ భవనం పేరు చైత్ర రధం .దర్బారు పేరు సుధర్మ .ఆయన ఆస్థా న మంత్రి ములుగు
పాపయారాధ్యుల వారుఎన్నో గ్రంధాలను రచించిన పండిత కవులు .అయితే రాజా గారికి దేన్నీ అన్కితమివ్వని అభిమాన
ధనులు . ..వీరికి బాలా త్రిపుర సుందరి అమ్మ వారు పిలిస్తే పలికేది .రాజా వారు .108 శివాలయాలు నిర్మించారు .మంగళ గిరి
నరసింహస్వామి ఆలయానికి 875 అడుగుల ఎత్తైన గాలి గోపురం కట్టించారు .తిరునాళ్ళ రోజుల్లో గోపురం ఎక్కి వెండి
నాణాలను భక్తు లపై చల్లే వారట .అవి ప్రజల తల పాగాలలో పడేవి .రాజా గారి ఏనుగులు ,గుర్రా ల మీద తను కాని ఎవరైనా
వెళ్తు ంటే గురువు పాపయారాధ్యుల వారి ఇల్లే తమ కంటే ఎత్తు లో ఉండాలని వారి ఇంటి అరుగులను చాలా ఎత్తు గా కట్టించిన
భక్తు దు నాయుడు. ఆయన సాహితీ ప్రియుడు .శత్రు వుల పట్ల నిరంకుశుడు .ఎన్నో ప్రా చీన అముద్రితతాళ పత్ర గ్రంధాలను
సేకరించి ,పరిష్కరింప జేసి మళ్ళీ రాయించాడు .అలాంటి మహనీయుని కాలానికి సంబంధించిన ఎన్నో విలువైన
మహా మంత్రి తిమ్మరుసు మనకు తెలిసిన మహనీయుడు .రాయలకు తిమ్మరుసు ఎంతో ,నాయుడికి
ములుగు వారు అంత .తిమ్మ రుసు సినిమా ఒక'' క్లా సిక్ ''.పెండ్యాల వారి సంగీతం పింగళి రచన కమలా కర వారి దర్శకత్వం
చారిత్రా త్మక కానుక లను నేను చెప్పిన ''రెండు నిమిషాల''సమాధా నికి రావటం నాకు మహదానందం గా ఉంది .ఈ కానుకలు
''సరస భారతి ''పొ ందిన గౌరవం గా భావిస్తు న్నాను .ఇంత మంచి కానుకలు పంపి నందుకు ''విరిజల్లు ''కు కృతజ్ఞ తలు
2011 జనవరి లో విజయ వాడ సిద్దా ర్ధ కాలేజి లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ,అమెరికా లోని ''తానా
''సంస్థ సంయుక్త ఆధ్వర్యం లో నిర్వ హించిన ''తెలుగు సంస్కృతి ''అనే రెండు రోజుల కార్య క్రమలో నేనూ పాల్గొ న్నాను
.దానికోసం తెస్తు న్న ప్రత్యెక సంచిక కోసం నన్ను ''మారుతున్న విలువలు ''అనే అంశం పై ఆర్టికల్ రాయమని అడిగితే రాసి ఆ
సమావేశం లో ప్రసంగించాను .అమెరికా నుండి విజయ ఆసూరి కూడా వచ్చి రెండు రోజుల సభలో పాల్గొ న్నారు .ఆవిడ
వస్తు న్నట్లు మా అమ్మాయి నాకు చెప్పి పరి చయంచేసుకో మంటే చేసుకొన్నాను .ఆవిడ మా అమ్మాయి విజయ లక్ష్మి ని
''ఝాన్సీ ''అని సరదా గా పిలుస్తు ందట .ఆ పేరు తోనే నేను పరిచయం చేసుకొన్నాను ''ఝాన్సి నాన్న గారిని ''అని. ఆమె
ఎంతో సంతోషించి ,నాతో ఫో టోలు తీసుకోంది .ఆ వ్యాసం ప్రత్యెక సంచిక లో ముద్రిత మైంది .ఇప్పుడు ఇవి జ్ఞా పకం వచ్చాయి
.
గృహ ప్రవేశ పౌరోహిత్యం
ఇక్కడి మా అమ్మాయి స్నేహితురాలు నాగమణి వాళ్ళ కొత్త ఇంటి గృహ ప్రవేశం నేనే చేయించాలని కోరారు
.ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నేను పెట్టిన ముహూర్తా నికి నేనే పౌరోహిత్యం వహించి చేయించాను .దంపతులు
సంతోషించారు .ఆవిడే ఇక్కడి ''టోరి'' రేడియో ప్రో గ్రా ం లో నన్ను ఇంటర్ వ్యూ చేసి ''ఊసుల్లో ఉయ్యూరు ''చెప్పించింది .ఇవీ
ఆగస్ట్ పదమూడు సో మ వారం నుంచి పందొమ్మిది ఆది వారం వరకు విశేషాలు -
దాదాపు యాభై ఏళ్ళు గా సంగీత కారుడు బీథో వెన్ గురించి వింటూనే ఉన్నాను .కాని ఆయన యే దేశం వాడో
,ఆయన ప్రతిభ ఏమిటో నాకు ఇప్పటి దాకా తెలీదు .మూడు సార్లు అమెరికా వచ్చినా ఆయన మీద నా దృష్టి పడలేదు .ఈ
నాలుగో సారి వచ్చిన దగ్గ ర్నుంచి ఎందుకో తెలుసు కోవాలనే ఆరాటం పెరిగింది .లైబర
్ర ీ లో కొన్ని పుస్త కాలు తెసుకొచ్చి
చదివాను .కాని నాకు కావలసిన్దేమీ కనీ పించలేదు .అయితే ఆయనపూర్తీ పేరు'' లుడ్విగ్ వాన్ బీథో వెన్''అనీ , జర్మనీ
దేశస్తు డు అ ని, చిన్నప్పటి నుండే సంగీతం లో గొప్ప పేరు తెచ్చుకోన్నాడని మాత్రం తెలిసింది .అంతకు మించి ఆయన్ను
పూర్తిగా ఆవిష్కరించే రచన దొరక లేదు .కిందటి వారం అలాంటి అరుదైన పుస్త కం దొరికి నా ఆరాటం తీరింది .దాన్ని పూర్తిగా
చదివి నాకు కావలసిన నోట్స్ రాసుకోన్నాను .నా దాహం తీరింది .ఆయన ప్రతిభ తెలిసింది .క్రమంగా ఎప్పుడో ఆయన గురించి
సమగ్రం గా రాస్తా ను .ఆయన సామాన్యుడు కాదు మహా మాన్యుడు .మన వాళ్ళు అందుకనే ఆయన సంగీతాన్ని ,ఆయన
సింఫనీ ని పదే పదే పొ గుడుతారు .''సిరి వెన్నెల ''సినిమా లో దర్శకుడు విశ్వనాద్ ఆ అవకాశాన్ని చక్క గా
ఉపయోగించాడు .బీథో వెన్'' మూన్ లైట్'' సొ నాటా ''లాగా వెన్నెల్లో బృందావనాన్ని చూపించాడుమురళి గానం తో కళ్ళు లేని
అమ్మాయికి .హరి ప్రసాద్ చౌరాసియా తో పలికించాడు .మనకూ ఆ ఆనందాన్ని కల్గించాడు .మా విజయ వాడ రేడియో స్టేషన్
డైరెక్టర్ ఆదిత్య ప్రసాద్ గారు బీతోవన్ చూపించిన ఈ అద్భుత దర్శనాన్ని ఎప్పుడు తమ ఉపన్యాసం లో వివ రిస్తూ ఉంటారు
. .ఇన్నాళ్ళకు ,ఇన్నేళ్ళకు ఆ నాద బ్రహ్మ బీథో వెన్ సమగ్ర సంగీత దర్శనాన్ని పొ ందిన ధన్యుడిని అని పించుకోన్నాను .ఈ
శ్రా వణ మాసం లో ఇది చివరి మంగళ వారం ''.ప్రక్కి'' వారి అమ్మాయి శ్రీ మతి అరుణ చక్కగా నాలుగు వారాలు
నోము నోచుకోని మొదటి వారం నాడు మా అమ్మాయిని ,వాళ్ళ అమ్మను భోజనానికి పిల్చింది .ఈ వారం వాళ్ళతో పాటు
''పో తు పేరంటానికి ''నన్నూ పిలిచింది .మా ప్రక్కనున్న రాఘవేంద్ర రావు గారు, భార్య కూడా వచ్చారు .చక్కగా పట్టు బట్ట తో
శ్రద్ధ గా పూజ చేసుకొని మా వాళ్లకు వాయనం ఇచ్చి ,తర్వాత భోజనాలు పెట్టింది .పూర్నపు బూరెలు పులిహో ర ,టమేటా
పప్పు ,బెండకాయ కూర వంకాయ చెట్నీ ,సాంబారు అన్నం ,పెరుగు లతో సంతుష్టికర మైన భోజనం పెట్టి మా పో తు పేరంట
గాళ్ళకు కూడా దక్షిణ, తాంబూలాలు ఇచ్చింది . .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయింది .లైబర
్ర ీ కి వెళ్లి పుస్త కాలు
బుధ వారం రాత్రి రెండో ఆటకు జులాయి సినిమా కు వెళ్ళాం .మేము ఎడుగురం .మా తో పాటు ఇంకో
''తెలుగు బకరా'' తో సహా హాలులో ఖచ్చితం గా ఎనిమిది మంది మాత్రమె .సినిమా ఎందుకు తీశారో ,ఎలా నడుస్తు ందో తెలీదు
.ఎప్పుడేవాడు వచ్చి కాలుస్తా డో ,ఎవడు చస్తా డో ఎవడు తప్పించుకొంటాడో తెలీదు .పాపం అల్లు అర్జు న్ కు నిరాశే .ఇలియానా
అందాల కంటే నీరసాలు బాగా ఒలక బాసింది .దేవిశ్రీ ప్రసాద్ ''సంఘీతం'' ఘోషా ,మోతా తాషా మరబా తప్ప చెవి కింపైన దేమీ
విని పించలేదు .త్రివిక్రమ్ దర్శ కత్వం పేరుకు తగ్గ త్రివిక్రమం గా ఉంటుందను కొంటె ,తిక మకాలుగా ఉంది .షార్ట్ డైలాగుల్లో
అల్లు బాగానే చెప్పాడు .లాంగ్ డైలాగుల్లో ఏం చెప్తు న్నాడో తెలీలేదు- దొర్లించాడు .పాపం రాజేంద్ర ప్రసాద్ అనే , పో లీసు
ఆఫీసరు గారికి తుపాకి పేల్చటం రాదట .చెవిలో కాబేజీ లకు మించిన వేవో పెట్టా డు .''వరుడు'' తీసి దానయ్య, చేతికి ఎముక
లేదని పించుకొని డబ్బు పో గొట్టు కున్నాడు .పాపం ఇప్పుడైనా వెనకేసు కొంటా డేమో నను కొన్నాను .ఆ ఆశ ఏమీ క నీ
ఇది చివరి శుక్ర వారం .ఇప్పటికి నాలుగు వారాల నుంచి మా అమ్మాయి వాళ్ళింట్లో భజనలు జరిగాయి .ఇది
చివరి వారం భజన .అంటే దీనితో అయిదు వారాలు చేయాలి అనుకొన్న కోరిక తీరింది .ఇరవై మంది వచ్చారు .రాత్రి ఎనిమిది
నుంచి తొమ్మిది వరకు భజన జరిగింది . ఆ తర్వాత విందు .బ్రెడ్ హల్వా ,వడ ,సొ రకాయ కూర ,చెట్నీ ,సాంబారు ,అన్నం
భారత దేశ 66 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడి ''హిందూ సెంటర్ ''వారు గాంధీ భవన లో ఘనం గా నిర్వ
హించారు .మన దేశం లో లాగా ఇక్కడ యే రోజు పండగ అయితే ఆరోజు చేయరు .శనివారం లేక ఆది వారం నాడు జరుపు
తారు .ఈ ఆదివారం అంటే నిన్న పందొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల పాటు నిర్వ
హించారు .మేమందరం వెళ్ళాం .ముందుగా భారత జాతీయ పతాకను, అమెరికా జాతీయ పతాకను వేదిక పై చెరొక వైపునా
ఆవిష్కరించారు .వేదిక పై ఆరడుగుల గాంధీ మహాత్ముని కాంశ్య విగ్రహాన్ని ఉంచారు స్పూర్తి దాయకం గా . రెండు దేశాల
జాతీయ గీతాలను చిన్నారులు భక్తిగా ఆలపించారు .ఆ తర్వాతా హిందూ సెంటర్ అధ్యక్షులుడాక్టర్ సురేంద్ర పాల్ ముఖ్య
అతిధి గా విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు .ముఖ్యం గా భారత దేశపు అభి వృద్ధికి స్వాతంత్ర పో రాటానికి
సిక్కుల పాత్రను గుర్తు చేశారు .వారి త్యాగాలను చక్కగా గణాంకాల తో వివ రించారు .అమెరికా కాకు వచ్చిన మొదటి తరం
భారత దేశీ యులలో సిక్కులు ఉన్నారని ఇక్కడి వ్యవసాయానికి వారే ఆద్యులని ,ఆ తర్వాత అనేక వ్యాపార వాణిజ్యాలలో
వారి పాత్ర గణనీయం గా ఉందని హర్ష ధ్వానాల మధ్య తెలిపారు .ఆ స్పూర్తి ని అందరు పొ ందాలని, ఇక్కడి హిందూ సెంటర్ కు
ఈ బాలాజీ దేవాలయానికి అందరు కృషి చేసి అభి వృద్ధి లోకి తెస్తు న్నారని ,ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందని అందరి
సహకారం తోనే అభ్యుదయం సాధ్యం అని చాలా ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. భారత దేశానికి మచ్చ లేని మన్మోహన్ సింగ్
ప్రధానిగా రెండు సార్లు గా ఉన్నారని కొని యాడారు .బెంగాలీ అయిన ప్రణబ్ ముఖర్జీ అన్ని తెలిసిన పూర్ణ జ్ఞా ని ,అత్యంత
అనుభవం, అన్ని శాఖల్లో పని చేసిన నేర్పు ఉన్న మనీషి అని అలాంటి వారు భారత దేశాధ్యక్షు లవటం హర్ష దాయకం అనీ
అభి నందించారు .
'' హేమంత్ అమిన్'' సభా సంచాలనం చేశారు .''మేడ్ ఇన్ ఇండియా ''అనే సినిమా పాటకు పిల్లలు చక్కని
డాన్సు చేశారు .తర్వాత మరో దేశ భక్తీ గీతం ''నన్హా మున్నా ,రాహి హూన్ ''అనే పాటకు మంచి నృత్యం చేశారు పిల్లలు
.రాజస్తా నీ గీతానికి నలుగురు పిల్లలు ఆ డ్రెస్ వేసుకొని గొప్ప గా నృత్యం చేశారు .భారత నాట్యం జతి స్వరాన్నిఅందంగా
అద్భుతం గా నృత్యం చేసి చూపారు కొంచెం పెద్ద వయసు లోని అమ్మాయిలూ .ఇదే అన్నిటి కంటే హైలైట్ .ఆ తర్వాత''షహీద్
''సినిమా లోని పాట పాడుతుండగా దేశ భక్తు లంతా వరుస గా కదిలి నడవటం దానికి తగ్గ ట్టు అభి నయించటం అందర్ని
ఆకర్షించింది .ఇందులో మా పెద్ద మనవడు చి. శ్రీ కేత్ అందరి కంటే తన నాట్య ప్రా వీణ్యాన్ని చూపించి మన్ననలు పొ ందాడు .ఆ
తరువాత ''యే మేరె వతన్ ''అనే లతా మంగేష్కర్ దేశ భక్తీ గీతాన్ని ఒకామె పాడింది .ఇలా రెండు గంటల పాటు జనానికి
స్వాతంత్ర స్పూర్తి కలిగించారు .అందరు అభి నంద నీయులే .కార్య క్రమం లో పాల్గొ న్న చిన్నారు లందరికి బహుమతులు
అంద జేశారు నిర్వాహకులు .సుమారు యాభైకి పైగా చిన్నారులు పాల్గొ నటం ,వారికి తలిదండ్రు లు డ్రెస్ సమకూర్చటం,
వీరందరికీ నేర్పి ప్రదర్శింప జేయటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు .కాని తలచుకొంటే ఏదైనా చెయ్యచ్చు అని
నిరూపించారు ''హిందూ సెంటర్ ''వారు .వారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన వారందరికి అభి నందనాలు .సభలో
సుమారు రెండు వంద లకు పైనే ప్రేక్షకులు రావటం దేశ భక్తికి నిదర్శనం .అందరికీ సిక్కు అల్పాహారం ''పావూ భాజీ
''నిప్రక్కనే ఉన్న ''వివేకా నంద హాల్'' లో ఏర్పాటు చేసి కడుపు నింపారు .బంగాళ దుంప కూరను బాగా మెత్త గా పప్పు
లాగా ఉడి కించి దానితో పాటు రెండేసి గుండ్రని మెత్తటి రొట్టెల తో ఇచ్చేదాన్నే ''పావూ భాజీ ''అంటారని మొదటి సారిగా ఇక్కడే
తెలిసింది .చాలా రుచి కరం గా ఉంది .ఇంటికి వచ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది
విశేషాలు -
సో మ ,మంగళ వారాలలో విశేషాలేమీ పెద్ద గా లేవు . పుస్త కాలు చదవటం ,నోట్సు రాసుకోవటమే ఎక్కువ గా జరిగింది
.మైనేని గారు మెయిల్ రాస్తూ బాపు గారి ఆరోగ్యం బానే ఉందని ,రెండు నెలల తర్వాత మళ్ళీ టేస్ట్ చేయించాలని చెప్పారు .
అభిమానులు అల్లు డు అవధానికి హడావిడి గా చేసిన పుట్టిన రోజు వేడుక
ఆగస్ట్ ఇరవై రెండు బుధ వారం మా అల్లు డు అవధాని గారి కి తెలుగు తిధుల ప్రకారం పుట్టిన రోజు .దీన్ని పసి గట్టిన
ఆయన అభి మానుల కుటుంబం నాగ మణి దంపతులు గప్ చిప్ గా రాత్రి యేడు గంటలకు కేకు తెచ్చి ఆయన తో కోయించి
,వాళ్ళ ,వీళ్ళ పిల్లల తో సహా హేపీ బర్త్ డే పాటపాడించి హడా విడి చేశారు .అందరు ఇక్కడే భోజనాలు చేశారు .మా అమ్మాయి
ఈ ఇరవై మూడో తేది గురువారం నాటికి సరస భారతి ''వెయ్యి ఎపిసో డుల'' పండుగ పూర్తీ చేసుకొని అందరి అభి
మానాన్ని పొ ందింది .ఇరవై నాలుగు శుక్ర వారం రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .పాతిక మంది వచ్చారు .తొమ్మిది దాకా
భజన .ఆ తర్వాతా విందు .పాయసం అన్నం ,సాంబారు ,వెజిటబుల్ బిర్యానీ ,పెరుగు ,దో సకాయ చెట్నీ చేసింది మా
అమ్మాయి .వల్ల ం నరసింహా రావు గారు, భార్యా ,అమ్మాయి రేణుక ,మనవడు కూడా రావటం బాగుంది .ఆ జంటే ఇక్కడ
రెండు నెలల క్రితం యాభై వ పెళ్లి రోజు వేడుక చేసుకొన్నారు .ఆయన నాటక, సినీ నటుడు స్వర్గీయ వల్ల ం నరసింహా రావు
గారికి స్వయానా అన్న గారి కుమారుడే .ఇద్దరి పేర్లు ఒకటే అవటం తమాషా గా ఉంది .ఈ నరసింహా రావు గారు గొప్ప పైంటర్
.ఆయన వేసిన ''అష్ట లక్ష్మీ దేవి ''చిత్రా న్ని స్కాన్ చేసి ఫ్రెం కట్టించి ,వాళ్ళ పెళ్లి రోజు వేడుకల నాడు అందరికి కానుక గా మా
అందరికి ఇచ్చారన్న సంగతి ఇప్పుడే తెలిసింది .శని వారం రాత్రి జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఇంట్లో భజన .ముప్ఫై మంది పైగా
వచ్చారు .అందరికి రెండు స్వీట్లు రెండు హాట్లు ,అన్నం ,పులిహో ర ,చపాతి కూర ,పెరుగు ల తో భోజనం .ఇంటికి వచ్చే సరికి
రాత్రి తొమ్మిది అయింది .మా అమ్మాయి వాళ్ళ ఇంటి కి దగ్గ రే ఉన్న నీలిమా దంపతుల గృహ ప్రవేశ పార్టీ కి వెళ్లా రు
.మేమిద్దరం వెళ్ళ లేదు .కాని మా కోసం ఫ్రూ ట్ సాలిడ్ ,ఐస్ ఫ్రూ ట్ పంపారు .ఆ రోజు మధ్యాహ్నం ''గోదా వరి ''సినిమా యు
ట్యూబు లో ఆసాంతం చూశాం .ఒక రకం గా దృశ్య కావ్యం .దర్శకుడు శేఖర్ కమ్ముల కు మెయిల్ రాయాలని అని పించింది
అమెరికా లో పిల్లల వేసవి సెలవులు అయి పో యాయి .ఆగస్టు మధ్య నుంచి విద్యా లయాలు దాదాపు అన్ని చోట్లా
ప్రా రంభ మైనాయి . మా మనవళ్ళ స్కూళ్ళు ఈనెల ఇరవై యేడు సో మ వారం నుండి ప్రా రంభం .సుమారు మన లాగానే
,రెండు నెలలు వీళ్ళకూ సెలవులు . మనకు బడులు ఏప్రిల్ ఇర వై నాలుగు నుండి మూసేస్తా రు .మళ్ళీ మనకు జూన్
పన్నెండు న తెరుస్తా రు .ఇక్కడ జూన్ పది న మూసేస్తా రు .ఆగస్టు రెండో వారం లో తెరుస్తా రు .ఇక్కడ విద్యార్ధు ల కోసం నోటు
పుస్త కాలు ,తెల్ల కాగితాలు ,పెన్నులు ,పెన్సిల్లు ,మొదలైన స్కూల్ కు అవసర మైన వాటి నన్నిటిని చాలా తక్కువ రేట్లకే ఈ
నెలంతా అమ్మటం విశేషం .తలి దండ్రు లు ,పిల్లల తో వాల్ మార్టు ,టార్గెట్ ,శామ్సు,కే.మార్ట్ లాంటి మాల్సు లన్ని కళ కళ
లాడాయి .చూడ ముచ్చటగా ఉంది .140 పేజీల రూళ్ళ స్పైరల్ పుస్త కం కేవలం 17 సెంట్లు మాత్రమె .150 పేజీల రూళ్ళ
కాగితాలు దస్త ం్ర కేవలం ఎనభై ఎనిమిది సెంట్లు .ఇంత కారు చవక గా దొరికే టట్లు చేయటం ఇక్కడి వారు తీసుకొనే ప్రత్యెక శ్రద్ధ
.ఈరేట్లు మన కు నలభై పైసలే ,రెండో ది రెండు రూపాయల లోపే .అదే మనకు బడులు తెరిచే సమయం లో పుస్త కాల రెక్కలు
ఆకాశం అంటు తాయి .దొరకటం కష్ట ం కూడా .బ్లా క్ మార్కెట్ లో అవి నల్ల గా మెరుస్తు ంటాయి .అదీ తేడా .ఇంకో విషయం
.ఇక్కడ ప్రభుత్వ బడులలో విద్యార్దు లందరికి సెకండరి స్థా యి వరకు ఉచిత విద్య .పుస్త కాలు ఫ్రీ .బస్సు ఫ్రీ .ఇదీ ఇక్కడి
వెసులు బాటు .కాలేజి లో చేరి నప్పుడే తలి దండ్రు లకు ఖర్చు .అప్పుడు దాదాపు పిల్లలు స్వంత కాళ్ళ మీద నిల బడి
ఈ వారం లో lydia maria child అనేమహిళా రచయిత, బానిసత్వ నిర్మూలన కోసం ముప్ఫై ఏళ్ళు సుదీర్ఘ
పో రాటం చేసి, సాధించిన ఆమె జీవిత చరిత్ర చదివాను .గొప్ప గా ఉంది .స్పూర్తి దాయకం గానూ ఉంది . Al gore అనే పర్యా
వరణ ప్రేమికుడు ,అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంటు గురించి చదివాను .అలాగే'' న్యూక్లియర్ ఫిషన్,''పై పరిశోధన చేసి తనతో
మతులను పొ ంది,మొదటి జర్మన్ ఫిజిక్స్ ప్రొ ఫెసర్ అయి ,నాజీ ఉద్యమం లో దేశాన్ని విడిచి వెళ్ళి, పీరియాడిక్ టేబుల్ లో
109 వ మూల కాన్నిఆమె గౌరవం గా ''Meitnerium ''అన్న పేరు తో ఆమె సేవలకు ప్రతి ఫలం గా కానుక గా పొ ందిన'' Lise
Meitner'' అనే ఆమె చరిత్ర చదివి ఎంతో ఆనందాన్ని ,బాధను పొ ందాను . Gar field ,Madison ,Beeethoven ల పై
శ్రీ భ్రమ రాంబా మల్లికార్జు న-శ్రీ ఉమా సో మశేఖరస్వామి వారల సందర్శన వారం
ఆగస్టు ఇరవై యేడు సో మ వారం నుంచి ,సెప్టెంబర్ రెండు ఆది వారం వరకు విశేషాలు
ఆగస్టు ఇరవై యేడు సో మవారం నుంచి మా మన వాళ్ళ కు బడులు ప్రా రంభమయాయి .మళ్ళీ సందడి .నిన్న
ఆదివారం నాడు మా అల్లు డి మేనత్త శ్రీ మతి లక్ష్మి గారు ,భర్త , రాలీ నుండి వచ్చారు .ఆవిడను ఇక్కడ ఉంచి ఆయన వెంటనే
వెళ్లి పో యారు . మంగళ వారం మా అమ్మాయి మామ గారు కోమలి సూర్య నారాయణ శాస్త్రి గారి అధిక భాద్ర పద మాస
ఆబ్ది కం .ఒక అరవ బ్రా హ్మణుడు వచ్చి మా అల్లు డితో కార్యక్రమం చేయించాడు .మా అమ్మాయి మడి కట్టు కొని యధావిధిగా
అన్నీ చేసింది .మూడు పచ్చళ్ళు ,మూడు కూరలు ,పప్పు ,గారెలు ,పరవాన్నం చేసింది .పవన్ దంపతులు భోజనానికి
వచ్చారు .వీళ్ళ మేనత్త గారు దీనికోసమే వచ్చి ఉన్నారు .కార్య క్రమం యదా విధి గా జరగటం అందరికి నచ్చింది .భోజనం
వచ్చింది .ఆవిడను ,భర్త ను ఇదివరకు రెండు సార్లు అంటే ఎల్లా వెంకటేశ్వర రావు ,కొమర వోలు శివ ప్రసాద్ గార్ల సభల్లో
చూశాను .ఆమె ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు సెక్రెటరి .రమ తూర్పు గోదావరి జిల్లా అమలా పురం దగ్గ ర్లో ఉన్న
'ముంగండ ''అమ్మాయి .ఆమె మా అల్లు డు మేనత్త కు దగ్గ ర బంధువు కూడా .వీల్ల దీ, అంటే మా అమ్మాయి మామ గారిదీ
ముంగండే .ఆ బంధుత్వం తో వీళ్ళకు రాక పో కలు బానే ఉన్నాయి .మర్నాడు శుక్ర వారం వాళ్ళింటికి భోజనానికి పిలవటానికి
వచ్చింది రమ .
శుక్రవారం అందరం కలిసి రమా వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం .చాలా పెద్ద భవనం .ఇంగ్లీష వాళ్ళ భవనాల్లా
గా ఉంది.వాళ్ళ ఆయన'' శివ ''ఆఫీసుకు వెళ్లా రు-ఇంట్లో లేరు .మంచి మర్యాద చేసింది .పప్పు ,కాబేజీ కూర ,దో స చట్ని
,మజ్జిగ పులుసు ,అన్నం ,చారు ,పెరుగు తో భోజనం పెట్టింది రమ .అన్నీ బానే ఉన్నాయి .రమా దంపతులకు ''ఆంద్ర వేద
శాస్త ్ర విద్యాలన్కారులు '',శ్రీ హనుమ కధా నిధీ ''మా అక్కయ్య '' అనే సరస భారతి ప్రచురించిన మూడు
శుక్ర వారం రాత్రి ఏడున్నరకు మేనత్త తో సహా అందరం కారు లో వాళ్ళ ఊరు రాలీకి బయల్దే రాం .పులిహార
చేసింది మా అమ్మాయి .బయల్దే రే ముందు పెరుగుతో కలిపి కొంత అందరం తిన్నాం .సుమారు రాత్రి తొమ్మిదింటికి ఒక చోట
ఆగాం .పిల్లలకు'' పీజా'' పెట్టించారు .మేము మళ్ళీ'' పులి మీద దండ యాత్ర ''చేసి దాన్ని పూర్తిగా సఫా చేశాం .మళ్ళీ
బయల్దే రి రాత్రి పదకొండున్నర కు రాలీకి చేరి దానికి దగ్గ ర్లో ఉన్న'' దర్హా ం'' లో వాళ్ళ ఇంటికి చేరుకోన్నాం .కాఫీతాగి
పడుకున్నాం .
శనివారం ఉదయం స్నానాలు పూర్తీ చేసి మేనత్త చేసిన ఉప్మా తిని ఆదంపతులతో కలిసి నేను ,మా
అల్లు డువాళ్ళ కారులో సుమారు పది హేను మైళ్ళ దూరం లో ఉన్న దేవాలయాలకు వెళ్ళాము .ముందుగా శ్రీ భ్రమ రాంబా
సమేత మల్లికార్జు న స్వామిని దర్శించాం . .అప్పుడే అభిషేకం ప్రా రంభించారు .నేను పుస్త కాలు తీసుకొని వెళ్లా ను .పూజారితో
స్వరం కలిపి నమక ,చమకాలు పురుష సూక్త ం బిల్వా ష్ట కంవగైరాలు చదివాను .బాగా చేశారు .తర్వాతా అష్టో త్త ర నామాలు
కూడా పూజారితో గొంతు కలిపాను .మంచి అలంకరణ కూడా చేశారు స్వామి వారలకు .గొప్ప అనుభూతి చెందాము .పూజారి
విజయ వాడకు చెందినగణపతి శాస్త్రి .కుర్రా డే .ఉయ్యూరు లో మా ఇంట్లో అద్దె కుంటున్న గణేష్ శర్మ అనే వేద పండితునికి
స్నేహితుడే .ఇలా అమెరికా లో ఒక్కో సారి తమాషా గా కలుస్తూ ఉంటాము .తీర్ధ ప్రసాదాలను తీసుకొన్నాము .
.స్వామి విగ్రహం చాలా భారీ గా ఉంది .మేము వెళ్ళే సరికి అక్కడ కూడా అభిషేకం పూర్తీ అయి ,దర్శనం ఇస్తు న్నారు .దర్శనం
చేసుకొని బయటికి వచ్చాము .స్వామికి అలంకరణ చేసి పదకొండున్నరకు పూజా జరిపారు .గంట పట్టింది .ఈ లోపు ఒక
కుటుంబం చక్కగా భక్తీ గీతాలు పాడుతున్నారు .అందులో ఒక అమ్మాయి చాలా శ్రా వ్యమైన గొంతుతో పాడి రసానుభూతి
కలిగించింది .బాలాజీ స్వామి కి వైభోగం బాగా ఉంది. .కనీసం ఎనిమిదిమంది పూజారులు ,ప్రసాదాలు చేసే వారు ఉన్నారు
.పెద్ద ఎస్టా బ్లి ష్ మెంటే .జూన్ నేల చివర్లో బ్రహ్మోత్స వాలు నిర్వ హించారు .ప్రసాదాలు తయారు చేసి పాకెట్ల లో విక్ర యిస్తా రు
.మా అల్లు డి మేనత్త భర్త చీమల కొండ దుర్గా ప్రసాద రావు గారు రిటైర్ అయాక స్వామి సేవలో వారానికి నాలుగు రోజులు
సో మ వారం నుండి శుక్ర వారం వరకు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తా రు .మేనత్త కూడా
వాలంటీర్ చేస్తా రు .ఆయనకు సుమారుడెబ్భై రెండు , ఆవిడకు అరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి .జీవితాన్ని ధన్య వంతం
చేసుకొంటున్నారు స్వామి సేవలో .స్వంత ఇల్లు ఉంది.పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లా రు .ఇద్దరే ఉంటున్నారు .అమెరికా వచ్చి
సుమారు యాభై ఏళ్ళు ,రాలీ వచ్చి పదహారేళ్ళు .పూజ తర్వాత తీర్ధ ప్రసాద విని యోగం .ఈ లోపు మా అమ్మాయి ,పిల్లలు
ఇంటి నుంచి వచ్చారు .ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం ఒకటి దాటింది .మాకు మేడ మీద గదుల్లో వసతి కల్పించారు
రాత్రి వాళ్ళు ,మేము అందరం కలిసి ''ఉడిపి హో టల్ ''కు వెళ్ళాం .ఆది అనంత పురానికి చెందిన రెడ్డి
గారిది ..ఆయనా వచ్చాడు కాసేపు మాట్లా డాం .మేము పూరీ ,పిల్లలు మషాలా దో సె ,చానా పూరీ ఎవరికి కావాల్సింది వాళ్ళు
తిన్నాం .మాంగో లస్సీ తాగాం .ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .హాయిగా నిద్ర పో యాం .
ఇప్పుడు'' రాలీ ''గురించి కొన్నివిశేషాలు --నార్త్ కేరోలీనా రాష్ట్రా నికి రాలీ రాజధాని .రాష్ట ం్ర లో రెండవ పెద్ద నగరం
.మొదటిది మేముంటున్న శార్లేట్ .రాలీలో'' ఓక్ ''చెట్లు విపరీతం .అందుకని దీన్ని ''సిటీ ఆఫ్ వోక్సు ''అని ముద్దు గా పిలుస్తా రు
.సర్ వాల్ట ర్ రాలీ అనే అయన పేరు మీదుగా ఈ పట్ట ణం ఏర్పడింది .ఇది టెక్నికల్ హబ్ .రాలీ ,దర్హా ం ,చాపెల్ అనే
మూడుపట్ట ణాలు దగ్గ ర దగ్గ ర మూడు త్రిభుజ కొణాల్లా ఉంటాయి .దీనినే ''three primary cities of research
triangle''అంటారు .1959 లో రిసెర్చ్ ట్రైనింగ్ పార్కు ఏర్పడి నప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది .ఇక్కడ నార్త్
కెరొలినా స్టేట్ వర్సిటి ,డ్యూక్ వర్సిటి ,యూని వేర్సితి ఆఫ్ నార్త్ కెరొలినా -చాపెల్ హిల్స్ అనే మూడు ప్రసిద్ధ విశ్వ
విద్యాలయాలున్నాయి .అమెరికా ఏడవ ప్రెసిడెంటు అయిన'' ఆండ్రు జాన్సన్ ''రాలీ లోని ''కాస్సో ''లో జన్మించాడు జీవన
నాణ్యత విషయం లో ను ,వ్యాపార దృష్ట్యా అమెరికా నగరాలలో టాప్ టెన్ నగరాలలో రాలీ ఒకటి .ఇక్కడి రాలీ మెమోరియల్
మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందింది .ఇది ఈశాన్య ప్రదేశం లో ఉన్న నగరం .ఇక్కడికి అట్లా ంటిక్ సముద్రం నూట ఎనభై మైళ్ళ
దూరం లో ఉంది .ఇక్కడి కేరోలీనా హరికేన్సు అనే హాకీ జట్టు బాగా ప్రసిద్ధ మైంది .మన తెలుగు వాళ్ళు ఎక్కువ గా కనీ
పిస్తా రు .దేవాలయాలున్న ప్రా ంతాన్ని ''కారీ ''అంటారు ..శార్లేట్ కు రాలీ రెండు వందల మైళ్ళ దూరం .సుమారు మూడు
గంటలు ప్రయాణం .
ఆది వారం ఉదయం ఐదింటికే అందరం లేచి స్నాదికాలు పూర్తీ చేసుకొని కాఫీ లు తాగాం .మా ఇద్దరికీ రాలీ
దంపతులు బట్ట లు పెట్టా రు .ఉదయం ఆరుమ్బావుకు కార్ లో మేము సో మా మౌంట్ లో ఉన్నశ్రీ ఉమా సో మ శేఖర స్వామి
దర్శనానికి బయల్దే రాం .రెండు గంటలు ప్రయాణం చేసి ఒక చోట ఆగి మాక్ డో నాల్ద్ లో రొట్టె టిని కాఫీ త్రా గాం .మళ్ళీ బయల్దే రి
రెండుగంటలు ప్రయాణం చేసి ''ఆష్ విల్''చేరాం .ఈ పేరు నాకుతమాషా గా ఉంది .''బూడిద పల్లె ''అవుతుంది అనువాదం చేస్తే
.ఇక్కడే ''ఆష్ వర్త్''కూడా ఉండి .దీన్ని తెలుగు లోకి మారి స్తే ''బూడిద భోగం ''అనచ్చు .''శ్వన్న నోవా'' అనే నది ఉంది
.దీన్ని'' సువర్ణ ముఖి ''అని సుమారుగా అనచ్చు .పెద్ద పెద్ద కొండలు బ్లూ మౌంటేన్ రిద్జి లో శ్వన్న నోవా ,ఫ్రెంచ్ బ్రా డ్ రివర్
ల సంగమ స్తా నం లో ఈ పట్ట ణం ఉంది .ఆష్ విల్ పూర్వం ''చెరోకీ నేషన్ ''లో ఉండేది .అమెరికా లో 25 ''art desti nations
''లో ఆష్ విల్ ఒకటి అదీ ఇక్కడి విశేషం .దీన్ని ''happiest city of women ''అంటారు .దీనికే ''new age mecca''అని
కూడా పేరు .అంతేనా ''eye of america ''అంటే అమెరికా ''చక్షువు ''(కన్ను)అన్న మాట .''best out side town ''అనీ పేరు
తెచ్చు కొన్నది ఆష్ విల్ .చుట్టూ ప్రకృతి దృశ్యాలు అందాల విన్దు లే చేస్తా యి ముగ్ధ మనోహర ప్రకృతి మానసికా నందాన్ని
ఇచ్చి మరోలోకపు అనుభూతినిస్తు ంది .అందాల హరి విల్లు ఆష్ విల్ .ఇక్కడి ''బ్లూ రిడ్జి పార్క్ వే'' తరగని సౌందర్యపు గని
కొండలు లోయలు దాటుకొంటూ ,ఎత్తైన వృక్షాల సౌందర్య దర్శనం చేస్తూ ,దాదాపు ఊటీ లాగా ,కోడై కెనాల్
లాగా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఇరుకు దారి లో జాగ్రత్త గా కారు నడుపు కొంటూ మొత్త ం మీద ఎత్తైన మౌంట్ సో మా
అంటే సో మా పర్వతం చేరాం .చుట్టూ లోయలు వృక్షాలతో నిండిన ఎత్తు కొండలు ,మబ్బులు తాకే అగ్రా లు, లోయల్లో జారి ప
డుతున్న మబ్బులు భలే అందమైన ప్రకృతి సౌందర్యం మధ్య ఈ పర్వతం ఉంది .ఎత్తు మీద ఉమా సో మ శేఖర స్వామి
దేవాలయం ఉంది. .సుమారు ఇరవై మెట్లు ఎక్కి వెళ్లి దర్శించాలి .లోపల లింగం సో మనాద్ దేవాలయ లింగం లా భాసించింది
.పూజారి గారు విజయ వాడ కు చెందిన గార్ల పాటి ప్రసాదావధాని గారు .చాలా శాస్త్రో క్త ం గా అభిషేకం నిర్వ హించటం
ప్రా రంభించారు ..నేనూ వారితో స్వరం కలిపి నమక ,చమకాలు ,పురుష సూక్త ం ,శ్రీ సూక్త ం, దశ శాంతులు, పట్టా భి షేకం
అష్టో త్త రం చివరికి మంత్ర పుష్పం పూర్తీ చేశాం .స్వామికి అలంకారం బాగా చేశారు ప్రసాద్ గారు .అపర కైలాసం గా ,ఆర
సో మనాద్ లా మహత్త రం గా ఉంది .నిన్నా ఇవాళ కూడా స్వాముల అభిషేకం సమయం లో రావటం పూర్వ జన్మ సుకృతం
అని పించింది . మనస్సు ఎంతో ప్రశాంతమైంది .ఎందుకో నేల రోజులుగా తెలీనిచిరాకు మనసును కల్లో ల పరుస్తో ంది . ఈ శివ
దర్శనా లతో కొత్త శాంతి లభించింది .కమ్మగా కన్నుల పండువు గా స్వాముల దివ్య దర్శనానుభవం పొ ంది ఎంతో సంతృప్తి
చెందాం .తీర్ధ ం, ప్రసాదం గా మైసూర్ పాక్ అందరికి పెట్టా రు .ఈ ఆలయాన్ని కట్టించిన వారు బ్రహ్మర్షి మహేశా నంద అనే
అమెరికన్ స్వామి .ఆలయం కట్టి ఏడాది మాత్రమె అయింది .పూజారి వచ్చీ ఏడాదే అయింది .ప్రక్కన యాగ శాల
ఉంది.పూజారిదంపతులకు ప్రక్కనే ఉన్న మూడంతస్తు ల భవనం లో కింద భాగం ఇచ్చారు .స్వామీజీ ఇక్కడే ఉంటారట
.ఆయనకు అనేక మంది శిష్యులు .అందరు ఎంతో శ్రద్ధగా ఇక్కడి పనులను చేస్తు ంటారు .ఆలయానికి ఇంకా ధ్వజ స్త ంభం
యేర్పడ లేదు .ఇంకా అభి వృద్ధి లోకి రావాలి. భక్తు లు అత్యంత భక్తీ విశ్వాసాలతో స్వామిని కోలుస్తు న్నట్లు కనీ పిస్తో ంది
.ఆలయం చాల చిన్నదే .ఈ రోజు భక్తు లతో ఆలయం కిట కిట లాడింది .
మెట్లు దిగి కిందకు భోజన శాల కు వచ్చాం .అప్పుడే వర్షం ప్రా రంభ మైంది .అద్భుతం గా అని
పించింది ఆ వర్షం లో. ఆ అందాల సీమ మరింత అందాలను సంత రించుకోంది .లోయల్లో మబ్బులు దో బూచు
లాడుతున్నాయి.ఫో టోలు తీసుకొన్నాం .ఆశ్రమం వారే పది డాలర్ల కు భోజనం ఏర్పాటు చేశారు .ఆది లేక పో తే ఇక్కడ ఏమీ
దొరకదు .భోజనం లో చపాతి, పులిహో ర ,పప్పు ,మజ్జిగ పులుసు,అన్నం ఏర్పాటు చేశారు .అన్నీ బాగానే రుచిగా ఉన్నాయి
అందరం కమ్మగా తిన్నాం .శివుడికి ఎదురుగా కొండ మీద పాలరాతి పెద్ద నందీశ్వరుడు చూపులకు అద్భుతం అని పిస్తా డు
.భోజన శాల దగ్గ ర చిన్న శివ లింగం దానిపై అభిషేక పాత్ర వేలడ దీశారు . వర్షపు నీరు పాత్రలో పడి శివునికి అభిషేక
చేస్తు న్నట్లు ఉంటుంది .ప్రక్కనుంచి కారే నీటిని గోలుసులకు వ్రేలాడే పాత్రలను ఒక దానికింద ఒకటి ఉండేట్లు చేశారు .అందులో
పై నుండి కిందకి పాత్రలలో పడుతూ భలేగా కనీ పిస్తు ంది .శివుడికి ఎదురుగా చిన్న నందీశ్వరుడు వర్షపు నీటి తో హర్షా న్ని
పొ ందు తున్నట్లు ఉంటాడు గొప్ప ఆలోచనా, దాని అమలు చేసిన తీరు బ్రహ్మానందాన్నిస్తు ంది .అందరు తప్పక సందర్శించి
తరించాల్సిన క్షేత్రం మౌంట్ సో మా .అమెరికా లో అద్భుతం .అపర కేదార నాద్అనీ అని పిస్తు ంది .ఇంత గొప్ప దివ్య ధా మాన్ని
భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కారు లో బయల్దే రి మళ్ళీ అందాలన్నీ చూసుకొంటూ ,ఆ
అందాలను ఆరవేసుకొన్న ప్రకృతి సౌందర్యాన్ని తలచుకొంటూ ,అనుభ విస్తు .నాన్ స్టా ప్ గా మూడు గంటలు ప్రయాణం చేసి
సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి చేరాం .యాత్ర సంపూర్ణం .రాలీ నుంచి సో మా మౌంట్ సుమారు నాలుగు వందల
యాభై మైళ్లకు తక్కువ ఉండదు .సో మా నుంచి శార్లేట్ సుమారు మూడు వందల యాభై మైళ్ళు ఉంటుంది .మొత్త ం మీద
రాను పో నువెయ్యి మైళ్ళు అంటే పది హేను వందల కిలో మీటర్లు . దాదాపు పదకొండు గంటల డ్రైవింగ్ .
సెప్టెంబర్ మూడు సో మ వారం నుండి తొమ్మిది ఆది వారం వరకు విశేషాలు
సెప్టెంబర్ మూడు అమెరికా లో ''లేబర్ హాలిడే''.అన్నిటికి సెలవే .అంతకు ముందు శని ఆది వారాలతో కలిసి సో మ
వారం కూడా సెలవు అవటం తో దీన్ని ''లాంగ్ వీకెండ్ ''అంటారు .శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఎక్కడికో అక్కడికి కుటుంబం
తో సెలవులకు వెళ్లి హాయిగా గడిపి వస్తా రు .మంగళ వారం కోసూరు ఆదినారాయణ గారికి ఫో న్ చేశాను .వాళ్ళ కోడలికి ఒంట్లో
బాగా లేదని ఆ కంగారు లో ఉన్నామని చెప్పారు .అప్పుడే మైనేని గారికీ ఫో న్ చేశాను .ఆయన అందు బాటులో లేరు
.గురువారం రాత్రిఆదినారాయణ గారికి మళ్ళీ ఫో న్ చేసి ఆయన కోడలి ఆరోగ్యం సంగతి వాకబు చేశాను .ఇప్పుడు బానే
ఉందని ,టెన్ష న్ తగ్గిందని ,సెప్టెంబర్ ఇరవై మూడు న ఇండియా ప్రయాణం అనీ చెప్పారు .సంతోషించాము .శుక్ర వారం రాత్రి
మా ఇంట్లో భజన .రాత్రి ఎనిమిదింటికి ప్రా రంభమై ఒక గంట జరిగింది .సుమారు పదిహేను మందే వచ్చారు .వచ్చిన వారి లో శ్రీ
వల్ల ం నరసింహా రావు దంపతులున్నారు .ఆవిడను చూస్తె ఉయ్యూరు లో నా దగ్గ ర చదువుకొన్న భాగ్య లక్ష్మి గుర్తు కు
వస్తు ంది .మంచి నవ్వు ముఖం, వర్చస్సు గోచరిస్తు ంది .ఆ దంపతులకు సరస భారతి ప్రచురించిన ''మా అక్కయ్య ''కవితా
అమెరికా కు వచ్చిన కొత్త లోనే మా అమ్మాయి విజ్జి స్నేహితురాలు ప్రియా అనే అమ్మాయి తాము స్వంత ఇల్లు
కొనుక్కున్నామని గృహ ప్రవేశానికి ముహూర్త ం పెట్టమని ఇంటికి వచ్చి అడిగింది .అయితే ఇల్లు స్వాధీనం కావటానికి ఇంకా
కొంత కాలం పడుతుందని చెప్పింది .నేను వైశాఖ మాసం లో ఒక ముహూర్త ం పెట్టి పాలు పొ ంగించమని చెప్పాను .ఆ ప్రకారమే
పొ ంగించి ,ఇల్లు స్వాదీనం అయిన తర్వాత అందులో చేరారు .చేరిన తర్వాత నన్ను సత్య నారాయణ వ్రతం చేయిస్తా రా అని
అడిగింది .ఎవ్వరూ లేక పో తే చెప్పు చేయిస్తా ను అన్నాను .ఒక ఇరవై రోజుల క్రితంవచ్చిసెప్టెంబర్ ఎనిమిది శని వారం వ్రతం
చేయించమని కోరింది . ఏమేమి వస్తు వులు కావాలో లిస్టు రాయించుకు వెళ్ళింది . ఈ శని వారం ఆమె భర్త వెంకట్ వచ్చి
నన్ను ,మా శ్రీమతిని కార్ లో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లా డు అతనిది నెల్లూ రు దగ్గ ర కావలి .ఆమెది గుంటూరు దగ్గ ర రేపల్లె
ముఖ్య ద్వారం వద్ద ,వంటింట్లో ,పైన మేడ మీదదంపతులతో కొబ్బరికాయలు కొట్టించి ,నవధాన్యాలను
చల్లించాను . సరిగ్గా పది గంటలకు శ్రీ సత్య నారాయణ వ్రతం ప్రా రంభించాం .అన్నీ శాస్త్రో క్త ం గా యధా విధి గా
చేయించా.దంపతులిద్దరూ ఎంతో శ్రద్ధా శక్తు లతో భక్తీ తో కూర్చుని చేశారు .సుమారు రెండున్నర గంటలు పట్టింది . వెంకట్ స్నే
హితుడు అతనితో ''ఎప్పుడో పెళ్లి నాడు చేసుకోన్నావు వ్రతం .మళ్ళీ ఇప్పుడే''అన్నాడు .దానికి వెంకట్ ''ఆ వ్రతం కంటే ఈ
వ్రతాన్ని అంకుల్ చాలా బాగా చేయిస్తు న్నారు ''అని ఆనందించాడు .అందరు చిన్నా ,పెద్ద చాలా బాగా చేయించానని ఎంతో
సంతృప్తిని ,ఆనందాన్ని వ్యక్త ం చేశారు .వాళ్ళ కళ్ళ లో ఎంతో సంతోషం వ్యక్త ం అయింది .స్వామి అనుగ్రహం,సరస్వతి మాత
కటాక్షమే ఇది .ఇండియా నుంచి ప్రత్యెక మైన చాలా ఖరీదైన పట్టు పంచె ,పట్టు చొక్కా గుడ్డ తెప్పించి తాంబూలం లో నాకు
నూట పదహారు డాలర్లు పెట్టి తమ సంతోషాన్ని వ్యక్త ం చేశారు ప్రియా దంపతులు .ఇంకెవరికి బట్ట లు పెట్టలేదు .వారి మనసు
లో యే మంచి గొప్ప భావం ఉందొ తెలీదు .మా శ్రీ మతికి తాంబూలం లో వంద డాలర్లు పెట్టి ''ఆంటీ పట్టు చీరే కొనుక్కోండి
''అని ఎంతో ఆప్యాయం గా ప్రియ చెప్పింది .తమ తల్లిదండ్రు ల్ని మాలో చూసుకోన్నారేమో అని పించింది .లేక పో తే ఇంత
అభిమానం చూపించాల్సిన అవసరం లేదు .వాళ్ళేదో ఇస్తా రనే ఆశ తో వ్రతం చేయించలేదు .మా అమ్మాయి మాట చెల్లి ంచాను
అంతే .మా అమ్మాయికి ,వాళ్ళ అమ్మకు చిన్న ఖరీదైన వెండి'' శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాలు ''బహూక రించింది
.ప్రియా వాళ్ళ అన్నా వదినే కుటుంబం లూ విల్ నుండి వచ్చారు .అన్న ఇండియా వెళ్లి నప్పుడు విగ్రహాలు ,పట్టు బట్ట లు
తెప్పించిందట .మొత్త ం మీద అందరికి వ్రత విధానం నచ్చి సంతోషం తృప్తి కనపరచారు .ఉదయం టిఫిన్ కాఫీ అందరికి
ఇచ్చారు .ఆ తర్వాత.పూర్ణా లు, లడ్డు ,జిలేబి ,చక్ర పొ ంగలి , స్వీట్లు ,నాలుగు హాట్లు ,పప్పు, కూర లు ,చపాతీ ,పులిహో ర
,అన్నం ,పెరుగు తో విందు .మేమిద్దరం రెండు స్వీట్లు ,పెరుగు అన్నం మాత్రమె తిన్నాం .పొ ద్దు న్న టిఫిన్ కూడా ఇంటి దగ్గ రే
చేసి వచ్చాం .మా ఇద్దరికీ ఎంతో భక్తిగా నమస్కారం చేసి ప్రియా దంపతులు నిండు ఆశీర్వాదాలు పొ ందారు .వాళ్లకు ఇద్దరు
ఆడ పిల్లలు .వ్రతానికి సుమారు అరవై మంది వచ్చి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లా రు .
ప్రియా వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దర్ని మా అమ్మాయి పిక్ అప్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చింది .ఆ
తర్వాతానేను మా అమ్మాయి యార్క్ రోడ్ లో ఉన్న మక్.డో వేల్ వారి'' nature preserve ''దగ్గ ర సాయి సెంటర్ వాళ్ళు
పిల్లలకు ఏర్పాటు చేసిన పిక్నిక్ స్త లానికి వెళ్ళాం .మా మన వల్ల ను పొ ద్దు న్నె అక్కడ దింపి .ఆ తర్వాతా ప్రియా వాళ్ళింటికి
వచ్చింది మా అమ్మాయి .మేం వెళ్ళే సరికే పిక్నిక్ దాదాపు అయి పో యింది .పెద్ద వాళ్ళ మీటింగ్ జరుగు తోంది . ఒక గంట
అక్కడ గడిపాం .ప్రక్కనే ''వైలీ లేక్ ''ఉంది .పిక్నిక్ కు చాలా మంది వచ్చే ప్రదేశం .దట్ట మైన చెట్లు అందమైన సరోవరం
అందులో బో టు షికారు కు వీలు ఉండటం తో జనం బాగా వస్తా రు .ఈ లేక్ ఒడ్డు నే ఎక్కడో చాలా దూరం లో అణుకర్మాగారం
ఉందట .ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయింది .మా అల్లు డు వారానికి రెండు రోజులు నిర్వహించే ''వీక్లీ రీడింగ్
ఈ వారం లో చాలా మంచి పుస్త కాలే చదివాను .political corruption ,global warming ,emily bronte ,the jungle ,pat
conroy ,climate confusion ,humorists ,dublin వగైరా పుస్త కాలు చాలా బాగున్నాయి .
మేము అమెరికా వచ్చి ఈ పద వ తేదీ కి సరిగ్గా అయిదు నెలలయింది .అన్గ లూరు రాజేంద్ర ప్రసాద్ గారు ఫో న్ చేశారు
.ఆయన కాలి ఫో ర్నియా వెళ్లి వచ్చి నట్లు చెప్పారు .ఆది నారాయణ గారి కోడలు అనారోగ్యం గురించి చెప్పి, ఇప్పుడు పూర్తిగా
తగ్గి కులాసా గా ఉన్నట్లు తె లియ జేశాను .ఆది నారాయణ తో మాట్లా డ మన్నాను. సాయంత్రం పక్కింటి గాయత్రీ ,రవి
దంపతులకు శ్రీ హనుమ కదా నిది ,మా అక్కయ్య పుస్త కాలను ఇచ్చాము .మంగళ వారం మైనేని గోపాల కృష్ణ గారికి ఫో న్
చేసి మాట్లా డాను .మా ఇండియా ప్రయాణం అక్టో బర్ మూడు బుధ వారం అని చెప్పా.బాపు గారి ఆరోగ్యం బాగా మెరుగ్గా
ఉన్నట్లు తెలియ జేశారాయన .బుధ వారం హూస్ట న్ నుంచి వావిలాల లక్ష్మి గారు ఫో న్ చేశారు .ఇండియా వస్తే ఎవరింటికి
వెళ్ళాలో తెలీయటం లేదన్నారు .”ఉయ్యూరు లో మేమున్నా మని గుర్తు ంచుకోండి .మీరు ఎప్పుడు వచ్చినా వెల్కం”
”అన్నాము .గురు వారం రాత్రి ఆది నారాయణ ఫో న్ చేసి ”విమానం ”గురించిన ఆర్టికల్ చాలా బాగుందని దాన్ని కాపీలు తీసి
మిత్రు లకు ఇస్తు న్నట్లు సంతోషం గా చెప్పారు .రచనకు అంత కంటే పరమార్ధ ం ఏముంటుంది ?ఆదినారాయణ వాళ్ళ ఇండియా
ఆస్టిన్ లో ఆదినారాయణ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి ప్రక్క నే ఉంటున్న శ్రీ డొక్కా రామయ్య గారు మహాన్న దాత,
భద్రా చలం దగ్గ ర ఉండేస్వర్గీయ డొక్కా సీతమ్మ గారి మనుమడు అని చెప్పారు .చాలా ఆనందం వేసింది .దాదాపు వంద
సంవత్స రాల క్రితం డొక్కా సీతమ్మ గారి అన్నదానం గురించి ఆంద్ర దేశం లో తెలియని వారు లేరు .ఎవరు ఎప్పుడు యే
వేళఇంటికి వచ్చినా అన్నం వండి, వడ్డించి, సంతృప్తి గా భోజనం పెట్టె మహా ఇల్లా లు గా సీతమ్మ గారిని గురించి చెప్పుకొంటారు
.ఆమె వదాన్యతకు, దాతృత్వానికి ,అన్న సమరాధనకు చేతు లెత్తి నమస్కరించని ఆంధ్రు డు లేడు .యాత్రికుడు తిన్నాడో లేదో
అని స్వయం గా విచారించి ఒక వేళ మోహ మాటం పడితే ”ఒర్ నాయనా ! అన్నం పర బ్రహ్మ స్వరూపం .దాన్ని తిని జీవుణ్ణి
తృప్తి చెందిస్తేనే భగ వంతుడు కూడా తృప్తి చెందుతాడు ”అని పిలిచి మరీ అన్నం పెట్టె దొడ్డ ఇల్లా లు .భర్త గారు కూడా అంత
సహకారాన్నివ్వ బట్టే ఆమె అన్న సమారాధన నిరంత రయం గా సాగింది .ఖాళీ కడుపు పుతో ఎవరూ వేళ్ళ రాదు అని ఆమె
నియమం .సీతా రాముల సన్ని దా నం లో ఉండబట్టేనేమో, ఆయమ్మ కు ఆ సీతా సాధ్వి సుగుణాలన్నీ వచ్చి ఉంటాయి
”.ఆంద్ర దేశపు మరో కాశీ అన్న పూర్ణ ” మన డొక్కా సీతమ్మ తల్లి .అ మహా త్యాగ మూర్తికి ఎన్ని నమస్కారాలు, కృతజ్ఞ తలు
తెలియ జేసినా ఆమె ఋణం తీర్చు కో లేము .కలిగి, సిరిఉండి అన్న దానం చేయటం వేరు పెద్దగా ఏమీ లేకుండా నే ఆ గొప్ప
బుద్ధి కలగటం దాన్ని ఆచరణ సాధ్యం చేయటం ఆమె కే సరి పో యింది సీతమ్మ గారు 1841 లో జన్మించి 1909 లో
మరణించింది .భర్త మరణం తర్వాత ఆమె సాంప్రదాయానికి విరుద్ధం గా అందర్నీ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టటం ఊళ్ళో
బ్రా హ్మలకు అసూయ ,కోపం తెప్పించాయి .ఆమె ను చాలా అవమానించారు .కానీ కర్త వ్య పరాయణు రాలై న ఆమె వాటిని
పట్టించు కో కుండా తన పని తాను చేసుకొని పో యింది .ఎవరి బెది రిమ్పులకు ఝడవ లేదు .అన్న సమారాధన కోసం ఆమె
ఎకరా లన్నీ అమ్మింది. చివరకు ఆమె కు మిగిలింది ఉన్న ఇల్లు ,అతి కొద్ది పొ లం మాత్రమే .అయినా చలించ లేదామే
.నిరతాన్న దానాన్ని కొన సాగించింది ..చివరికి ఆమె లో ఓపిక నశించి కాశీ వెళ్లి అక్కడే మరణించాలని అనుకొంది .ఏరోజు కా
రోజూ ఇదే ఆఖరి రోజూ రేపే కాశీ ప్రయాణం అను కొంటు నలభై ఏళ్ళు గడిపింది .అతిధి సేవ ,అన్నం పెట్టటం అంటే ఆమెకు
అంత ఇష్ట ం దీనికోసం కాశీ విశ్వేశ్వర దర్శనాన్నే వాయిదా వేసుకొన్న అన్న పూర్ణమ్మ ఆమె .
చివరికి తెగించి ఒకఎడ్ల బండీ మాట్లా డు కోని,కాశీ ప్రయాణానికి బయల్దే రింది .గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేసి అలిసి
పో యి ఒక సత్రం లో పడుకొంది .అర్ధ రాత్రి ఆ సత్రం లో నుండి , తండ్రీ తల్లి కొడుకుల మాటలేవో విని పించాయి .పిల్లలు
ఆకలికి అలమటిస్తు న్నారు .తల్లీ తండ్రీ ”ఒరే నాయన లారా కొన్ని గంటలు ఓపిక పట్ట ండి .మనం డొక్కా సీతమ్మ గారింటికి చేరా
బో తున్నాం .అక్కడ ఆ మహా ఇల్లా లు వంట చేసి సిద్ధం గా ఉంచు తుంది .మనల్ని పిలిచి అన్నం పెడు తుంది ”ఒక పిల్లా డు
”సీతమ్మ గారిన్టి కే ఎందుకు వెళ్ళాలి ”? అని ప్రశ్నించాడు .దానికా తలి దండ్రు లు ”సీతమ్మ గారు మర్యాద గా పిలిచి గౌరవం గా
కడుపు నిండా భోజనం పెడుతుంది .అలాంటి ఇల్లా లు ఈ పరగణా లోనే లేదు ”అన్న మాటలు విన్నది .అంతే ఆమె కు నిద్ర
పట్ట లేదు .వెంటనే బండీ వాణ్ని నిద్ర లేపి బండీ కట్టించి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లి పో యింది .అర్ధ రాత్రి సమయం . సత్రం లోని
వాళ్ళు నెమ్మది గా సీతమ్మ గారింటికి వచ్చారు .తలుపులు తీసి ఉండక పో వటం వల్ల ఆమె లేదను కొన్నారు .రెండు
నిమిషాలలో కమ్మని పప్పు కూరా పులుసు ల వాసన లు నాసికలకు సో కాయి .ఆమె వీరిని ఆప్యాయం గా లోపలి
ఆహ్వానించి అడిగి అడిగి మరీ వడ్డించి భోజనాలు పెట్టి త్రు ప్తిచెందింది .ఇక ఆమె కు కాశీ వెళ్ళే ఆలోచన విరమించుకొంది . .
.. .ఆదినారాయణ వల్ల ఆ సాధ్వి సీతమ్మ గారిని ఈ రూపం గా స్మరించే అదృష్ట ం నాకు దక్కింది .రామయ్య గారు ఆస్టిన్ లో
తెలుగు ను బో ధిస్తూ ,చిన్న పిల్లలకు తెలుగు లో పద్యాలు మొదలైన వి నేర్పిస్తూ శ్లో కాలను అభ్యాసం చేయిస్తూ పో టీ పరీక్షలు
నిర్వహించి బహుమతు లంద జేస్తూ ”అమెరికా ఉన్న ఆంద్ర తేజం ”అని పిస్తు న్నారు .వారిని గురించి సమగ్ర సమాచారాన్ని
నాకు అంద జేయ మని ఆదినారాయణ కు మెయిల్ చేశాను .వస్తే వారి గురించి అందరికి తెలిసే ఒక మంచి వ్యాసం రాయాలని
ఉంది .అలాగే ఆస్టిన్ లోనే ఉన్న మరో దేశీయభి మాని శ్రీ ఆచార్యుల వారు కూడా చాలా కాలం గా సంస్కృతాన్ని నేర్పుతూ
గీర్వాణ భాషా గౌరవాన్ని విద్యార్ధు లకు తెలియ జేస్తూ ,అభి రుచి కల్గిస్తూ భాషా సేవ చేస్తు న్నట్లు ఆది నారాయణ నాకు ఇది
శుక్ర వారం రాత్రి మా అమ్మాయి వాళ్ళింట్లో భజన .ఎనిమిది నుండి తొమ్మిది దాకా జరిగింది .వల్ల ం దంపతులు సుబ్బు
మా అల్లు డు ఎప్పటి నుంచో ప్లా న్ చేసిన ”వీక్లీ రీడింగ్ క్లా సులు ”ఈ శని వారంసాయంత్రం నుండి ప్రా రంభించాడు .నాగమణి భర్త
సహాయం చేశాడు .పది మంది వచ్చారు .ఆరోక్లా సు లోపు వారికే .ఇందులో ముగ్గు రు మా మన వళ్ళు .పవన్ కూతురు,
ప్రియా ఇద్దరు కూతుళ్ళు ,నాగమణి కొడుకు వగైరాలు .ఇంకొందరు తరువాతి వారం నుండి వచ్చే అవకాశం ఉంది .మా మన
వళ్ళకు ఇది వరకే ఈ క్లా సులు, ఆ రీడింగ్ మెటీరియల్ చేయటం అలవాటే .ఈ క్లా సుల కోసం కుర్చీలు టేబుల్లు ,బో ర్డు సిద్ధం .
శని వారం ఉదయం సత్యా సౌమ్య ల అమ్మాయి హాపీ బర్త్ డేని స్కేటింగ్ హాల్ లో జరిపితే మా అమ్మాయి మన వళ్ళు వెళ్లా రు.
ఆది వారం మా అల్లు డి ఇండియా ప్రయాణం .పన్నెండు రోజుల trip .మళ్ళీ ఇరవై యేడు బయల్దే రి ఇరవై ఎనిమిది కి ఇక్కడికి
వస్తా డు .ఉదయం ఏడున్నర ఫ్లైట్ కు నేను మా అమ్మాయి ఆయన తో వెళ్లి ఎయిర్ పో ర్ట్ లో దింపి ఇంటికి వచ్చాం .
లైబర
్ర ీ పుస్త కాలన్నీ చదవటం పూర్తీ అయింది .కొత్త పుస్త కాలు తెచ్చే ఆలోచన లేదు .ఈ సారి పుస్త కాలన్నీ విలు వై న వే
.వీటిలోని విషయాలను చాలా భాగం ఆర్తికల్సు గా రాసేసి మీ కు అందించాను .మిగిలినవాటి విశేషాలను నోట్సు
అందరికి ” శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ”.రేపటి నుండి కొత్త ఆధ్యాత్మిక ధారా వాహిక ప్రా రంభం అని గుర్తు ఉండే
ఉంటుంది కదా .
సెప్టెంబర్ పది హేడు సో మవారం నుంచి ఇరవై మూడు ఆదివారం వరకు విశేషాలు
పుట్టిన రోజు .మా అమ్మాయి బొ బ్బట్లు చేసింది .హో మ్ డిపో లో మంచిచేమంతి పూల కుండీలు రెండు కొన్నాం .సాయంత్రం
ప్రక్కనున్న రవి కుటుంబం ,నాగ మణి కుటుంబం లను పిలిచి మా అమ్మాయి వాళ్ళ అమ్మ పుట్టిన రోజు వేడుక జరి పింది
.బొ బ్బట్ల నే కేక్ గా భావించి కట్ చేయించింది .అందరికి బొ బ్బట్లు పెట్టింది .బిస్కట్ల తో సహా . .గాయత్రి కొడుకు క్లా రినెట్ తో
''హేపీ బర్త్ డే'' పాట వాయించటం విశేషం .ఆది హేపీ బర్త్ డే,పాట అని మా ఆవిడ చెప్పే దాకా నాకు తెలీదు. రవి తలిదండ్రు లు
రాఘవేంద్ర రావు గారు సుగుణ కామాక్షి గారు రావటం నిండు దనాన్నిచ్చింది .మా అల్లు డు హైదరాబాద్ కులాసా గా చేరాడు
.ప్రేమ చంద్ గారుఫో టోలు చూసి ప్రభావతి జన్మ దిన శుభా కాంక్షలు పంపారు .
పందొమ్మిది బుధ వారం శ్రీ వినాయక చతుర్ధి .మనకు తొలి పండుగ .ఇండియా లో ఉన్నట్లు గా ఇక్కడ హడా విడి
ఉండదు .మా మన వళ్ళు పొ ద్దు న్నే స్కూల్ కు వెళ్ళే లోపలే నేను లేచి స్నానం చేసి మామూలు పూజ చేసి ,వాళ్ళతో
దేవుడికి పత్రీ వేయించి ప్రా ర్ధన చేయించి పంపాను .ఆ తర్వాతప్రభావతి మా దొడ్లో కాసిన సో ర కాయ ,దో స కాయ ,బీర కాయ
,చమ్మ కాయ ,టమేటా లతో అద్భుతం గా శ్రీ గణేష్ విగ్రహాన్ని చేసింది .దానికి పాల వెల్లి కట్టి ,దొడ్లో పూసిన పూలు ,పత్రీ తో
ఉదయం పదింటికి పూజ మొదలు పెట్టి శాస్త్రో క్త ం గా చేశాని .మా అమ్మాయి ఉండ్రా ళ్ళు ,పాల కాయలు, పాయసం వడపప్పు
,పానకం తయారు చేసింది .నైవేద్యం పెట్టి కధాక్షిన్త లు అందరికి వేసి పూజ పూర్తీ చేశాను .మామిడి కాయ పప్పు ,వంకాయ
కూర, సాంబారు, బొ బ్బట్ల తో భోజనం .ఈ రోజు నుంచే'' సౌందర్య లహరి'' పై ఆర్తికల్సు ప్రా రంభించాను .కొత్త పంచ ,లాల్చీ
కట్టు కోన్నాను .సాయంత్రం పవన్ వాళ్ళింట్లో భజన .సుమారు ఇరవై మంది వచ్చారు . అక్కడ విందు .పవన్ ఇండియా
వెళ్లా డు .ఇరవై ఆరున వస్తా డు .వంకాయ కూర ,ఆలూ కూర ,చట్ని ,ఆవకాయ ,పులిహో ర ,పాయసం ,మినప సున్ని
,ఉండ్రా ళ్ళు సాంబారు అన్నం, పెరుగు లతో పవన్ భార్య రాధ మంచి విందే ఇచ్చింది .
శుక్ర వారం ఆది నారయణకు ఫో న్ చేశా .వాళ్ళ ప్రయాణం శనివారం హేపీ జర్నీ చెప్పా . సాయంత్రం .మైనేనికి
ప్రేమ చంద్ గారికి మా తిరుగు ప్రయాణం గురించి రాశా .మైనేని బెస్ట్ విషెస్ రాశారు .డాక్టర్ యాజికి కూడా తెలయ జేశా
.అతనూ వెంటనే స్పందించాడు .రాత్రి మా ఇంట్లో భజన .ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళందరూ రాలీ లో మెడికల్ కాంప్ కు
వాలంటరీ చేయ టానికి వెళ్లటం తో భజనకు ఎవరు రాలేదు .మా అమ్మాయి , మా మనవడు శ్రీ కేత్ ఒక పావు గంట భజన
ప్రతి ఏడాది శార్లేట్ లో బాంక్ ఆఫ్ అమెరికా సౌజన్యం తో ఫెస్టివల్ ఆఫ్ ఇండియను సెప్టెంబర్ లో నిర్వ హిస్తా రు.
లేబర్ డే లాంగ్ వీకెండ్ రో జుల్లో .ఈ సారి అధ్యక్షుడు ఒబామా ఇక్కడ డెమొక్రా టిక్ పార్టీ కన్వెంషన్ లో ఆ సమయం లో
పాల్గొ నటం వల్ల వాయిదా పడి, ఈనెల 22 ,23 శని ,ఆది వారాలలో నిర్వ హించారు .ఇది 18 వ ఫెస్టివల్ .దీనితో బాటు ''బాలీ
వుడ్ ''ఏర్పడి 180 సంవత్సరాలు అయిన సందర్భం గా కూడా దీన్ని ఘనం గా నిర్వ హించారు .పాటలు ఆటలు డాన్సులు
ప్రదర్శన లతో మోత మోగించారు .భారతీయత ఈ రెండు రోజుల్లో కళ్ళకు కట్టించారు .సౌత్ tryon వీధిలో దీన్ని నిర్వ హించారు
బాంక్ ఆఫ్ అమెరికా ,వేల్స్ ఫార్గో బాంకుల సమీపం లో ఈ కార్య క్రమం జరిగింది .ఔత్సాహికులైన చిత్ర కారుల చిత్ర
కళా ప్రదర్శన ను ఏర్పాటు చేశారు .''knight theater ''పైన ఉన్న హాలులో ప్రదర్శన జరిగింది .హైదరా బాద్ నుండి మా బావ
మరది బ్రహ్మానంద శాస్త్రి ఉరఫ్ ఆనంద్ చిత్రించిన'' తెలంగాణా ''చిత్రా లను ఆరింటిని శని వారం ఉదయం నేను, మా అమ్మాయి,
నాగ మణి భర్త తీసుకొని వెళ్లి స్టా ండు లపై ఏర్పాటు చేసి వచ్చాం .మొత్త ం నలభై మంది ఆర్టిస్టు లు పాల్గొ న్నట్లు , తొంబై యేడు
చిత్రా లు ప్రదర్శించి నట్లు తెలిసింది .మర్నాడు ఆది వారం మేమందరం వెళ్లి అక్కడ విశేషాలు చూసి సాయంత్రం అయిదింటికి
ముగిసే సమయానికి మా చిత్రా లు మేము ఇంటికి తెచ్చుకోన్నాం .మొత్త ం ఆరు చిత్రా లకు కలిపి మూడు వేల డాలర్లు
అమ్మకానికి పెట్టా ం. ఏదీ అమ్ముడు పో లేదు .''బాగా కష్ట పడి వేశారు చాలా బాగున్నాయని మెచ్చుకోన్నారట'' కాని ఎవరూ
కొనే సాహసం చేయ లేదు .పాపం మా అల్లు డు వీటిని ఇండియా నుండి షిప్పింగ్ లో తెప్పించి ,అమ్మి పెడదామని
ప్రయత్నించాడు .మూడేళ్ళ నుండి ఇక్కడే మూలుగుతున్నాయి . ఈ సారి పెట్రో లులు ఖర్చు, పార్కింగ్ చార్జీలు కలిసి ముప్ఫై
డాలర్లు పైనే అయాయి. నిరాశ మిగి లింది .మొత్త ం మీద అయిదు చిత్రా లే అమ్ముడు పో యి నట్లు నిర్వాహకురాలిని అడిగితే
చెప్పింది .అవీ యాభై ,అరవై డాలర్ల మధ్య ఉన్నవే .ఏమైనా ఆర్టిస్టు లకు మంచి అవకాశం .తమ ప్రతిభను ప్రదర్శించ టానికి
మంచి వేదిక లభిస్తో ంది .మంచి వైవిధ్యం ఉన్న చిత్రా లు వచ్చాయి ఊహాత్మికం గా నూ ఉన్నాయి .సంప్రదాయ బద్ధం గా ఉండి
చూపరులను ఆకర్షించాయి .ఆడా, మగా చిత్రకారులు పాల్గొ న్నారు ..నిర్వాహకులు శ్రద్ధగా నిర్వహించారు .ఫెస్టివల్ అంతా డౌన్
టౌన్ లో నిర్వహించారు .ఈ రూ పెణా,డౌన్ టౌన్ చూసే వీలు కల్గింది .డ్యూక్ ఎనెర్జీ వారి పెద్ద బిల్డింగ్ ,వేల్సు ఫార్గో వారి బిల్దిగు
,బాంక్ ఆఫా అమెరికా వారి బిల్ల్దింగు అన్ని అక్కడే ప్రక్క ప్రక్కన .ఈ ఉత్సవం కోసం రోడ్లు మూసేశారు .శని ,ఆది సెలవలె
వస్త ్ర ప్రదర్శన నగల ,పుస్త కాల బొ మ్మల ప్రదర్శన కూడా ఉన్నాయి .వస్త ్ర వ్యాపారం బాగానే జరిగి నట్లు కనీ పించింది . .
నైట్ థియేటర్ లో శని ,ఆది వారాలు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు
నిర్విరామం గా పాట్లు నృత్యాలు ప్రదర్శించారు .తలి దండ్రు లు తమ పిల్లలకు సాంప్రదాయ వస్త ్ర ధారణా తో తీసుకొని వచ్చి
కూచి పూడి,రవీంద్ర ,కేరళ, బావ్రా ,మొదలైన నృత్యాలను ప్రదర్శించారు .తెలుగు తమిళ బెంగాలీ పంజాబీ మహారాష్ట ్ర గుజరాతీ
దాన్సులను చేయించారు .శార్లేట్ లోని సుమారు డజన్ నృత్య విద్యాలయాల విద్యార్ధు లు తమ అభినయ కౌశలాన్ని చక్కగా
ప్రదర్శించారు .కర తాళ ధ్వనులు మారు మ్రో గాయి .అమెరికా లో ఉన్నా ,సాంప్రదాయ నృత్యాన్ని వదల కుండా నేర్చుకొని
ప్రదర్శించటం చాలా ముచ్చటగా ఉంది. నేర్పిన గురు వరే న్యులు మరీ అభి నందనీయులు .ఎప్పుడూ ధియేటర్ జనం తో కిట
కిట లాడింది .మంచి ప్రో త్సాహం చూపి ప్రేక్షకులు, గొప్ప సహకారం అందించారు .మా ఇంటి దగ్గ రున్న ముసునూరు అమ్మాయి
ధియేటర్ లోనే కాకుండా ,ఆరు బయట వేదిక నిర్మించి అక్కడ కూడా పాటలు పాడించి ,చేయించారు
.ఇక్కడ పంజాబీ మరాఠీ గుజరాతీ నృత్యాలు చేసి జనం మెప్పు పొ ందారు .మా ఇంటి దగ్గ రున్న గుజరాతీ ఆవిడ ,మిగిలిన
వాళ్ళ తో కలిసి గుజరాతీ నృత్యాన్ని అద్భుతం గా చేసింది .వయసు లో ఉన్న వాళ్ళే కాదు, వయసు పై బడిన వారు కూడా
ఎక్కడా ఉత్సాహం కోల్పోకుండానృత్యం చేసి , విజయ వంతం చేశారు .చిన్న పిల్లల ప్రదర్శన చూడ ముచ్చటేసింది .థియేటర్
లోకి వెళ్లి చూడ టానికి అయిదు డాలర్ల టికెట్ పెట్టా రు .అక్కడే బాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు తిరిగే చక్రా న్ని పెట్టి ఆడించారు
.పాయింటర్ ఆగిన చోటును బట్టి బహు మతులిచ్చారు .మా మన వళ్ళు ఆశుతోష్ష్ ,పీయూష్ లు యెర్రని మంచి శాలువాలు
గెలుచుకొన్నారు .చాలా మందికి వచ్చాయి .ఇవి అ బాంక్ ఆఫ్ అమెరికా బహు మతులు .
భారతీయ తిను బండారాల స్తా ల్సుల్సు జనం తో నిండిపో యాయి .పూరీ ,చపాతీ, దో సె, ఇడ్లీ ,కాఫీ టీ, మాంగో
లస్సీ చోలీ కూర, సాంబారు, పాన్ పూరీ అందర్నీ ఊరించి తినిపించాయి .రెట్లు చాలా తక్కువే .మషాలా దో సె,పాన్ పూరీ
పూరీ,ఇడ్లీలు నాలుగు, కాఫీ ,లస్సీ వగైరా రెండు డాలర్లే .ఆది వారం జనం విశేషం గా వచ్చారు .
ఉయ్యూరు లో మా ఇంటి వద్ద ఉండి కే.సి.పి.లో పని చేసిన,'' లండన్ రాఘవ రావు''అణి పిలువా బడిన అగస్త ్య
రాజు రాఘవ రావు గారు మంటాడ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు .వారి అబ్బాయి రామ మోహన రావు
గారు కూడా అందులోనే పని చేసి తండ్రి మరణాంతరం దేవాలయాన్ని నిర్వ హించారు .ఆయన భార్య భారతీ ,ఆయనా మాకు
బాగా తెలుసు .క్వార్టర్ల లో ఉంటారు .అనుకో కుండా ఈ ఆది వారం నాడు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో వారు కలిశారు
.వారమ్మాయి శార్లేట్ లోనే ఉందట .అమ్మాయి మనుమ రాళ్ళు కూడా కనీ పించారు .మా శ్రీ మతే ముందు గా వాళ్ళను గుర్తు
పట్టింది .కాసేపు మాట్లా డుకోన్నాం .ఇలా యాదృచ్చికం గా ఉయ్యూరు వాళ్ళు కలవటం తమాషా గా ఉంది .వారు అక్టో బర్
చిన్నపిల్లలకు కాలక్షేపం గా రబ్బరు ,గాలితో నింపిన రెండు ప్లే హౌస్ లున్నాయి .పిల్లలు అందులో బౌన్సింగ్
ఆడి హడా విడి చేసి కాల క్షేపం చేశారు .తలిదండ్రు లు చక్కగా వారిని ఆడించారు .
శని వారం ఇంటికి వస్తు డౌన్ టౌన్ కు దగ్గ ర లో ఉన్న'' ఫార్మేర్ మార్కెట్'' కు వెళ్ళాం. ఆంధ్రా లో మార్కెట్
షెడ్డు ఉండి చవక గా తాజాగా లభిస్తా యని అందరు ఆరాట పడి వస్తా రు .శని ఆది వారాలే ఉంటుంది ఉదయం పది నుండి
డౌన్ టౌన్ లోనే కొద్ది దూరం లో ''త్రిమూర్తి దేవాలయం ''కడు తున్నారు .యెన్ .సి .జగన్నాధం గారు అనే textile
వ్యాపారం చేసిన తమిళాయన పది హేను ఏక రాల స్థలం కోని దేవాలయం నిర్మించే ప్రయత్నం చేస్తు న్నారు .మొత్త ం ఖర్చు
అంతా ఆయనదేనట .గణేశ, బాలాజీ, లక్ష్మి, పద్మావతి దేవుల ఉత్స విగ్రహాలను చేయించి వాటికిఆగమ యుక్త ం గా
హో మాదులతో ప్రా ణ ప్రతిష్ట చేస్తు న్నారు .భట్ట ర్ గారు అనే వారి ఆధ్వర్యం లో మూడు రోజుల కార్య క్రమాన్ని నిర్వ హించారు
ఆరు మంది కి పైగా రుత్విక్కులున్నారు ..మేము శని వారం సాయంత్రం వెళ్ళాం .అప్పటికి హో మాలు, అధి వాసాలు, అయి
పూర్ణా హుతి జరిగింది .స్వామి వారలకుపవళింపు సేవలో నీలాంబరి రాగం లో ''కస్తూ రి రంగ రంగా ''అనే కీర్తనను ఒకావిడ
మహా శ్రా వ్యం గా ఆల పించి అందరి అభిమానాని సంపాదించింది .కొందరు పిల్లలు భక్తీ గీతాలు పాడారు .ప్రసాదం గా
ఆది వారం సాయంత్రం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అ యిన తర్వాతా మళ్ళీ దేవాలయం దగ్గ రకు వచ్చాం .కార్య
క్రమాలు పూర్తీ అయి యాజ్నీకులకు సంభావనలు అంద జేస్తు న్నారు .మూర్తు లను వేదిక పైన ఉంచి ప్రసాదం నైవేద్యం పెట్టి
మంగళ హారతి పాడారు .తిరుమల నుండి వచ్చిన ఆలయ పూజారి భగవద్ రామానుజుల వారు రచించిన ''చూర్నిక ''ను
శ్రా వ్యం గా పాడారు .తిరుమల లో వీరే పాడతారట .ప్రత్యేకం గా పిలి పించారు .ఆ తర్వాతా మూర్తు లను అక్కడే ప్రక్కన
నిర్మించిన భవనం లోకి మేళ తాళాలతో తీసుకొని వెళ్లి లోపల ఉన్న వేదిక పై ఉంచారు .ఈ మూర్తు లకే ఇక రోజూ పూజా
పునస్కారాలు చేస్తా రు .రెండేళ్ళ లో ఆలయాన్ని నిర్మించి అసలు విగ్రహాలను చేయించి అప్పుడు ప్రతిష్ట చేస్తా రు .అందరికి
ప్రసాదం గా చక్ర పొ ంగలి ఉప్మా ,రవ్వ కేసరి ,సాంబారు అన్నం ,పెరుగన్నం పెట్టా రు .అవి స్వీకరించి తిని ఇంటికి వచ్చేసరికిరాత్రి
పది అయింది .ఈ విధం గా అమెరికా లో ఒక ప్రతిష్టా పనా కార్య క్రమాన్ని కూడా చూసి ధన్యులమయాం .ఇదే హైలైట్ మా
అక్టో బర్ వస్తే అమెరికా లో చెట్లు ఆకులన్నీ ఎరుపు రంగు లోకి మారుతాయి .ఆ తర్వాత ఆకులు రాలి పో తాయి
.అప్పుడే దాని ప్రభావం కనీ పిస్తో ంది .కొన్ని చెట్ల ఆకులు యెర్ర బడి పో తున్నాయి .శిశిరానికి ''రావద్దు ''అని యెర్ర జెండాలు
ఊపు తున్నట్ల ని పించాయి .ఆ శిశిర వేదన భరించలేక తమ సర్వస్వం అయిన ,జీవపూత మైన ఆకులను రాల్చేస్తు న్నాయా
అని పిస్తు న్నాయి .దీన్నే వీళ్ళు ''ఫాల్ ''అంటారు .''what a fall my dear leaves of the trees !''
1-10-12 వీడ్కోలు వారం
సెప్టెంబర్ ఇరవై నాలుగు సో మ వారం నుండి ,ముప్ఫై ఆది వారం వరకు విశేషాలు
ఇరవై నాలుగు సో మ వారం మేసీస్ లో ఆపిల్ స్టో ర్సు లో ఐ పాడ్ చూశాం .వాల్ల వీ ఫ్రీ బుక్స్ డౌన్ లోడ్ చేసుకొనే వీలు
దిగుతుంటే కుడి మోకాలు కొద్దిగా పట్టు తప్పింది .తూలి పడ బో యాను .వెంటనే సర్దు కుంది .మంగళ వారం సాయంత్రం
పిల్లల్ని జిమ్నాస్టిక్సు క్లా స్ లో దింపి ,మేం ముగ్గు రం'' ఓల్డ్ టైం పాటరి '' (పాత కాలపు పెంకులు )కి వెళ్లి ఒక సారి అన్నీ తిరిగి
చూశాం .ఫో టోలు తీసుకొన్నాము .ఇంటికి వచ్చిన తర్వాత ఉషా ఫో న్ చేసింది .శని వారం శ్రీ సత్య నారాయణ వ్రతం
చేయిన్చుకొందామను కొంటున్నామని ,లిస్టు చెప్పమని అడిగితే చెప్పా. .బుధ వారం హైదరా బాద్ కు ఫో న్ చేసి మా
అక్కయ్యా ,బావ గార్ల తో మాట్లా డాము .మేము మాట్లా డటం ఆయనకెంతో బలం గా ఉందని పించిన్దన్నారు బావ .గురు వారం
ఈ నాడు నెట్ లో చదువు తుంటే ,పిన్నమ నేని కోటేశ్వర రావు గారు 84 ఏళ్ల వయసులో కేన్సర్ తో బాధ పడుతూ
మరణించారని తెలిసింది .ఆయన కృష్ణా జిల్లా పరిషద్ చైర్మన్ గా మూడు సార్లు ,ముదినే పల్లి శాసన సభ్యులుగా రెండు సార్లు
పని చేసి విద్యా రంగానికి ఎంతోసేవ చేశారు .ఎన్ని పదవుల్లో ఉన్న ఆయన్ను అందరు ''చైర్మన్ పిన్నమ నేని ''అనే ఆప్యాయం
గా పిలుస్తా రు .అదీ ఆయన సాధించిన విజయం .దీని పై ''చైర్మన్ కోటేశ్వర రావు గారు ''అనే ఆర్టికల్ రాశాను .
గురు వారం మధ్యాహ్నం నాగ మణి ఇంట్లో భోజనం .రాత్రికి రవి గాయత్రి దంపతుల ఇంట్లో విందు .మేము
,శీతల్ ,ప్రశాంత్ దంపతులు ,ముక్కామల దుర్గ గారు అతిధులం .చపాతీ బంగాల దుంప కూర ,మామిడి కాయ పప్పు ,బీన్సు
కూర ,ఉల్లి చట్ని ,అన్నం సాంబారు ,పెరుగు ల తో మంచి భోజనం .అదనంగా ''జున్ను ''అన్నీ బాగున్నాయి .ఇది వరకో సారి
రాలీ దంపతులు వ చ్చి నప్పుడు ఉదయం టిఫిన్ కు పిలిచి అన్నిటి తో బాటు'' జున్ను'' కూడా పెట్టా రు .సరదా గా కబుర్లు
చెప్పుకొంటూ భోజనం చేశాం .వాళ్ళు ఏర్పాటు చేసుకొన్నా హో మ్ధి యేటర్ చూపించాడు రవి .వాళ్ల తలిదండ్రు లు రాఘ వేంద్ర
రావు ,కామాక్షి గార్లు సరదా, మర్యాదా ఉన్న మనుసులు .నాకు ఆయన తో ,మా ఆవిడకు వాళ్ళావిడ తో రోజూ కబుర్లు బానే
ఉంటాయి .
శుక్ర వారంమధ్యాహ్నం ఎల్లా వెంకటేశ్వర రావు గారి అమ్మాయి ,గాయిత్రి ఆన్ లైన్ లో కూచి పూడి నాట్యా
చార్యులు పసు మార్తి గురు వు గారి వద్ద మా ఇంట్లో ప్రా క్టీసు చేశారు .ఎల్లా అక్టో బర్ చివర్లో ఇక్కడికి వస్తా రు .అప్పుడు ఒక
నృత్య రూపకానికి ఇది రిహార్సిల్ .గురువు గారికి లైన్ లోనే నమస్కారాలు చెప్పాము ''.మేము వచ్చే దాకా మీరు శార్లేట్ లో
ఉండరా ?''అని మేం ఇండియా వెళ్తు న్నామని తెలిసి అన్నారు పసు మర్తి వారు .సాయంత్రం పిల్లలను ఆర్టు క్లా స్ లో దించి
రాం కీ ఇంటికి వెళ్లి బంతి పూలు ఇచ్చి వచ్చాం .క్లా స్ ఆవ గానే అటునుంచే ఎయిర్ పో ర్టు కు వెళ్ళాం .అల్లు డు ఆవ దాని
ఇండియా నుండి దుబాయ్ న్యూయార్కుల మీదుగా వచ్చారు .ఇంటికి వచ్చే సరికి ఎనిమిదిమ్బావు అయింది .ఈ రోజు మా
ఇంట్లో భజన .మా మనవడు శ్రీ కేత్ ఏర్పాట్లు చూశాడు .వర కుటుంబం ,జగదీశ్- లక్ష్మి కుటుంబం ,పవన్ దంపతులు
వచ్చారు .గంట సేపు భజన జరిగింది .చివర్లో నేను ''శార్లేట్ లోని సాయి సెంటర్ వారి తో ఈ ఆరు నెలలు చక్క గా గడిచి
పో యాయి .మా ఇద్దర్నీ మీ కుటుంబ సభ్యులు గా భావించి ఎంతో పెద్దరికం ఇచ్చారు .వచ్చే బుధ వారం సాయంత్రం మా
ఇండియా ప్రయాణం .అందరికి వీడ్కోలు ''అని కృతజ్ఞ తలు తెలిపాను .అందరు చాలా బాధ పడ్డా రు మేం వెళ్లి పో తున్నందుకు
.ఆది వారి సౌజన్యానికి గుర్తు .అంతే .
ఇరవై రోజుల కిందట నేను ప్రియా దంపతుల ఇంట్లో శ్రీ సత్య నారాయణ వ్రతం చేయించానని తెలిసి నప్పటి నుంచి
రాంకీ ఉషా దంపతులు వాళ్ళు కూడా వ్రతం చేసుకోవాలనే సంకల్పానికి వచ్చారు .ఈ శని వారమే దాన్ని చేయిన్చుకోవాలను
కొన్నారు .మేమిద్దరం ఉదయం అయిదు గంటలకే లేచి నిత్య కృత్యాలు ,సంధ్యా ,పూజ అయి, రెడీ గా ఉన్నాం .రాంకీ
తొమ్మిదింటికి వచ్చి కారు లో మా ఇద్దర్నీ తమ ఇంటికి తీసుకొని వెళ్లా డు .అక్కడ ఏర్పాట్లు దాదాపు నేను చెప్పినట్లే చేశారు
.ఉషా వాళ్ల అమ్మా నాన్న ,రాంకీ ఉషా దంపతులు కూర్చుని చేసుకొన్నారు .మొదలు పెట్టె సరికి పదిన్నర అయింది .వ్రతం ,శ్రీ
వెంకటేశ్వర దీపారాదనను శాస్త్రో క్త ం గా చేయించాను .అంతా అయేసరికి ఒంటి గంట అయింది .దాదాపు యాభై మందికి పైగా
అతిధులు వచ్చారు .అందరు సాయి సెంటర్ లో పరిచయం ఉన్న వాళ్ళే .పూజా విధానం చూసి అందరు ఎంతో ఆనందాన్ని,
సంతృప్తిని పొ ందారు .ఇంత వరకు ఎవరు ఇంత నిర్దు ష్ట ం గా చేయించ లేదని అందరు అన్నారు .ఆది స్వామి కృపా ,సరస్వతీ
దేవి కటాక్షం .అంతే .ఆ తర్వాతా విందు. రెండు ఆకు కూరలు ,ఆలూ కూర,బెండ కాయ కూర ,చట్నీ ,పాయసం ,పులిహో ర
అప్పడం సాంబారు ,పెరుగు ,మాంగో లస్సీ ల తో,మంచి విందు ఏర్పాటయింది.అందరు హాయిగా కమ్మగా భోజనం చేశారు
.నేను ,ఎందుకో తిన లేక పో యా .నాకు షర్టు ,మా శ్రీమతికి శాలువ ,ఫో టో ఫ్రెం ,దక్షిణ గా నలభై డాలర్లు తాంబూలం ఇచ్చారు
.జగదీశ్ ఎప్పుడు కుటుంబం తో మాకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవటం అలవాటు .వారంతా మా ఇద్దరికీ
నమస్కరించి ,తాంబూలం లో యాభై ఒక్క డాలర్లు పెట్టి అంద జేశారు .ఆ తర్వాత ఆడ వాళ్ళు శ్రీ విష్ణు సహస్ర నామ
పారాయణ చేశారు '.రాంకీ ఉషా ల ఆనందానికి అంతు లేదు .''మీరు చేయిస్తా రని తెలిస్తే చాలా మంది మీతో వ్రతం
చేయించుకొనే వారు .ఈ సారి ట్రిప్ లో దీనికి సిద్ధం చేస్తా ం ''అన్నారు సంతోషం గా ఉషా రామ్కీలు .నవ్వి' మేము దీని నిమిత్త ం
రాలేదు. మా ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకోన్నట్లే మీకూ చేయించాం .అంతే ''అన్నాను . .'ఇంటికి వచ్చే సరికి సాయంత్రం
అయిదున్నర దాటింది .
శని వారం రాత్రి మా ఇంటికి దగ్గ ర్లో ఇల్లు కొనుక్కున్న శీతల్ -ప్రశాంత్ దంపతులు సరదాగా భోజనాలు ఏర్పాటు
చేసి మిత్రు ల్ని మమ్మల్నీ ఆహ్వానించారు .వీళ్ళ గృహ ప్రవేశ ముహూర్త ం నేనే పెట్టా ను . .చాలా పదా ర్దా లు చేయించి హో టల్
నుండి తెప్పించారు .మేమిద్దరం రెండేసి సమోసాలు మాత్రమె తిన్నాం .కడుపు నిండింది .మిగతా వాటి జోలిలి వీల్ల లేదు
అక్కడ నుండి వల్ల ం నర సింహా రావు దంపతుల కుమార్తె రేణు దంపతుల నూ తన గృహ ప్రవేశ సందర్భం గా
విందు ఏర్పరచారు .వల్ల ం దంపతుల వివాహ యాభై వసంతాల పండుగ కూడా రేణు ఇది వరకు నిర్వ హిస్తే వెళ్ళాం
.అప్పటినుంచి వారి తో పరిచయం .వీళ్ళు బాగా హడా విడి చేశారు .వందమందికి పైగా అతిదులోచ్చారు .ఎన్నో పదార్ధా లు
చేయించారు .కాని మేమేమీ తిన లేదు .మంచినీళ్ళు త్హ్హాగి కొద్దిగా కెరట్ హల్వా తిన్నాం .అంతా ఆయె సరికి రాత్రి పదిఅయింది
ఈ విధం గా ఈ శని వారం ఉదయం రాంకీ ఇంట్లో ,రాత్రికి శీతల్, రేణు ఇళ్ళల్లో మూడు విందు భోజనాలు చేసి
నట్లు .ఇంతకు ముందు గురువారం నాగలక్ష్మి ,గాయత్రి ఇళ్లలో విందులు .ఇవన్నీ మా మీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం గా
వాళ్ళందరూ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులు .మంచి మిత్ర బృందం ఇక్కడ ఉండటం ఆనంద దాయకం .
ఆది వారం రాత్రికి పవన్ రాధా దంపతుల ఇంట్లో భోజనం .పప్పు ,వంకాయ కూర ,ఆవ కాయ ,పచ్చడి
,సాంబారు అన్నం పెరుగు ల తో విందు .మేము వేళ్ళ గానే అందరికి వేడి వేడి పకోడీలు వేసి పెట్టింది రాధ .అవి పూటుగా
లాగించాం .ఇంకా అన్నం ఏమి లోపలి కి వెళ్తు ంది ? ఏదో కతికామని పించాం .నాకు షర్టు ,తల్లీ కూతుళ్ళకు చీర, జాకెట్ లు
పెట్టి పవ న్ దంపతులు తమ సంతోషాన్ని వ్యక్త పరచారు .ఈ వారం అంతా ఇలా సందడి సందడి గా గడిచి పో యింది .మూడవ
తేదీ బుధ వారం రాత్రి ఫ్లైట్ కు అ ఇండియా కు తిరుగు ప్రయాణం .సరిగ్గా వారం తక్కువ ఆరు నెలలు అమెరికా లో ఉన్నట్లు
మా ఈ నాల్గ వ అమెరికా పర్య టన సాంస్కృతిక పర్య టన అని పించి, మిగిలిన వాటికి భిన్నం గా జరిగింది
.వచ్చిన దగ్గ ర నుండి ఎల్లా వారితో ,ఈల శివ ప్రసాద్ గారితో పరిచయాలు .ఆ తర్వాతా అలబామా లో మైనేని వారింట్లో కొలువు
.అక్కడి ద్రో ణవల్లి వారు, కాకాని సో దరులతో పరిచయం ,హెలెన్ కెల్లర్ ఇంటి సందర్శన ,ఆ పిమ్మట అట్లా ంటా పర్యటన ,అక్కడ
దేవాలయ సందర్శనం ,రాలీ పర్యటన .అక్కడ బాలాజీ దేవాలయం, శివాలయ సందర్శనం .మౌంట్ సో మా సందర్శనాను
భూతి ఎంతో త్రు ప్తినిచ్చాయి .ఇక్కడి హిందూ సెంటర్ కార్య క్రమాలు, సాయి సెంటర్ భజనలు ,త్రిమూర్తి దేవాలయం లో ఉత్సవ
విగ్రహ ప్రతిష్ట ,ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ,అన్నీ అన్నే .ముహూర్తా లు పెట్టడం రెండు అ సత్య నారాయణ వ్రతాలు గృహ ప్రవేశం
ఎంతో మానసిక ఆనందాన్నిచ్చాయి . .కల కాలం గుర్తు ంచుకో దగిన పర్యటన గా ఉంది .దీనిలో మాకు హార్దికం గా సౌజన్యాన్ని
అక్టో బర్ రెండు మంగళ వారం గాంధీ జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు .
డైలీ అమెరికా అంటే అమెరికా లో మేమున్న ఆరు నెలలు మా నిత్య కృత్యం ఎలా జారి గిందని తెలియ జేయటమే
.ఉయ్యూరు లో రోజు ఉదయం అయిదున్నర ఆరు మధ్యలో లేచే వాళ్ళం .ఇక్కడ రోజు యేడు ,ఏడున్నర మధ్యలో లేచాము
.లేవాగానే పళ్ళు తోముకొని వాళ్ళం .నేను ఒక చెంచాడు మెంతి పిండి ఒక చిన్న గ్లా సు నీళ్ళలో కలుపు కోని తాగే వాడిని
.ఆవిడ ఆపాటికి కార్య క్రమాలైన తర్వాత మార్నింగ్ మీల్సు అంటే మందులు వేసుకోనేది .ఇద్దరం కాఫీలు తాగే వాళ్ళం .ఆ
తర్వాతనేను స్నానం చేసే వాడిని .తర్వాతా పట్టు బట్ట కట్టు కొని సంధ్యా వందనం ,పూజా చేసుకొనే వాడిని సుమారు
ముప్పావు గంట .అప్పుడు శ్రీ రామ కోటి రాసి, భగవద్గీత కొద్దిగా పారాయణం చేసే వాడిని .అప్పుడు టిఫిన్ రెడీ చేసి ఉంచేది
మా అమ్మాయి విజ్జి .ఇడ్లీ ,దో సె ఉప్మా, గారే లేక పో తే స్సేరియల్సు తినే వాల్ల ం.మళ్ళీ రెండో రౌండు కాఫీ కొద్దిగా తాగే వాడిని
.ప్రతి మంగళ ,శని వారాలలో శ్రీ ఆంజనేయ స్వామి సహస్రనామా లతో పూజ చేసే వాడిని .గురు వారం రాఘవేంద్ర సాయి
బాబా అస్తో త్త రాలు స్పెషల్ .ఆవిడ కూడా స్నానం చేసి టిఫిన్ చేసేది .నేను అప్పుడు మందులు వేసుకొనే వాడిని. ఇదంతా
అయేసరికి ఉదయం తొమ్మిదిన్నర ,పది అయ్యేది .
అప్పుడు ”కంప్యూటర్ ఎక్కే వాడిని ” .నాకోసం ఒక డెస్కు టాపు సిద్ధం గా ఉంచారు .పిల్లలకు స్కూళ్ళు కనుక పో టీ లేదు
.అయినా వాళ్లకు ఐ పాడ్ ఉంది .అందుకని పెద్దగా నా జోలికి వచ్చే వారు కాదు .నేను ఉదయం పదింటి నుంచి పన్నెండున్నర
వరకు కనీసం రెండు ఆర్తికల్సు రాసే వాడిని .ఆ తర్వాతా భోజనం .లైబర
్ర ీ నుండి తెచ్చిన పుస్త కాలు చదువు కొనే వాడిని
.మధ్యాహ్నం నిద్రకు ప్రయత్నించినా వచ్చేది కాదు మూడింటి దాకా మంచం మీద దో ర్లు డే .అప్పుడు చదివిన పుస్త కాలలో
నోట్సు రాసుకో వలసినవి ఉంటె రాసుకొనే వాడిని .లైబర
్ర ి పుస్త కాలకు గడువు ఇరవై ఒక్క రోజులు .నేను వెళ్లి నపుడల్లా
ఇరవైకిపై గా పుస్త కాలుతెచ్చుకొనే వాడిని .వాటిని పది రోజుల్లో పూర్తి చేసే వాడిని .సాయంత్రం మా మన వాళ్ళు శ్రీ కేత్ ,ఆశు
తోష్ ,పీయూష్ లు నాలుగుమ్బావుకు స్కూలు నుండి బస్ లో వచ్చే వారు .ఇంటి దగ్గ రే స్టా పు .వీలైతే వెళ్లి తీసుకొచ్చే వాడిని
.వాళ్ళు తిఫినో, తిండో తిని కంప్యూటర్ కోసం ఎగ బడే వారు .నేను అప్పుడు ఏదైనా రాసుకొనె వాడిని . మా పెద్ద మనవడు శ్రీ
కేత్ ”తాత్ గారు ఎప్పురూ కంప్యూటర్ ఎప్పురూ ఎప్పురూ ”అని వచ్చీ రాని తెలుగులో అనే వాడు .మా ఇద్దరికే కంప్యూటర్
విషయం లో తగాదా .వాళ్లకు ఇచ్చి మళ్ళీ నేను పుస్త కం చదువు కొనే వాడిని .పిల్లలు బడి నుంచి వచ్చే లోపు మా అమ్మాయి
మమ్మల్ని ఎక్కడి కైనా షాపింగులకు తీసుకు వెళ్ళేది .పిల్లలోచ్చే సమయానికి ఇంటి దగ్గ ర ఉండే వాళ్ళం .సాయంత్రం
అయిదింటికి టీ తాగే వాళ్ళం .నేను కాసేపు బయట నడక సాగించి వచ్చే వాడిని .సాయంత్రా లు వాళ్ళు జిమ్నాస్తిక్సుకో ఆర్టు
క్లా స్ కో లైబర
్ర ీ క్లా సులకో వెళ్తే నేనూ వాళ్ళతో వెళ్ళే వాడిని
మా ఆవిడ సాయంత్రం ఆరు గంటల నుండి మా టి.వీ .చూసేది .అందులో వసంత కోకిల ,చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్ట పడి
చూసేది ,నేను చిన్నారి పెళ్లి కూతురు చూసే వాడిని .మిగతా చానేల్లెప్పుడు చూడా లని పించేది కాదు .రాత్రి తొమ్మిదింటికి ఈ
టి.వి .లో వార్త లు చూడటం అల వాటు . రాత్రి ఎనిమిదింటికి భోజనం చేసే వాళ్ళం .మళ్ళీ చదువు .నా చదువు అంతా మంచం
మీద పడుకొనే .రాత్రి పదిన్నర దాటి తె మా ఆవిడ ఇక చాలనేది .అయినా పదకొండున్నర వరకు చదువు కొనే వాడిని
.పుస్త కాలే నాకిక్కడ నేస్తా లు .మా అమ్మాయి పనులన్నీ పూర్తీ చేసుకొని పదిన్నరకో పదకొండింన్తి కో మా దగ్గ ర కూర్చుని
కబుర్లు చెప్పేది .అప్పుడే ఇండియా కు ఫో న్లు చేయటానికి వీలుండేది .మా అల్లు డు రోజంతా ఇంట్లో నె ఉండి పని చేయటం
,ఎప్పుడూ ఫో న్ల లో కాన్ఫరెంసులలో బిజీ గా ఉండటం వల్ల వీలయ్యేది కాదు .
ఉయ్యూరు నుండి మా మనవడు చరణ్ స్కైప్ప్ లోమధ్యాహ్నం పన్నెండు కు చక్కగా పది హేను రోజుల కోసారి మాట్లా డే
వాడు .అక్కడ రాత్రి తొమ్మిదిన్నర అయ్యేది .పాపం కళ్ళు వాలి పో తున్నా కూర్చుని మాట్లా డే వాడు .మిగతా వాళ్ళంతా మేము
చేస్తేనే .వచ్చిన మొదటి నెలలో సాయి సెంటరు వాళ్ళ భజనలకు బాగానే వెళ్ళాము .అవి రాత్రి పూట ఉండేవి .ఆ తర్వాత
తగ్గించాం .ప్రక్క ఇంటి గాయత్రి వచ్చి పలకరించి పో తుంటుంది .ఆమె అత్త గారు ,మామ గారు వచ్చిఅన తర్వాతా వారితో
పరిచయం బానే ఉంది .నాగమణి తన పని ఉంటె వచ్చి వెడుతుంది .ఇక్కడి కుటుంబాలలో పవన్ ,రాంకీ జగదీశ్
కుటుంబాలతో చాలా సన్నిహితం గా ఉండే వాళ్ళం .వాళ్ళకూ మా మీద గౌరవం బానే ఉంది .మా పెద్ద మనవడు శ్రీ కేత్
భజనలు ఐ పాడ్ నుండి నేర్చుకొని పాడే వాడు .మా చిన్నమనవాళ్లు తెలుగులో మాట్లా డటం తక్కువే .అమ్మా అని అంటారు
తండ్రిని డాడీ అంటారు ” కాలికి దెబ్బ తగిలితే ”కాల్నోప్”అంటారు .”ఐ డిడ్ స్నానం ”అంటారు కలగా పులగం గా .పప్పు
,కూరా చట్నీ అంటారు ”.బుజ్జి ముండలు” అల్ల రి చేయ కుండా ముగ్గు రు హాయిగా ఆడుకొంటారు .అందులో పీయూష్ నా
పో లికే .నేను పిలిస్తే దగ్గ రకు వెంటనే వస్తా డు .వాళ్ల అమ్మమ్మ పిలిస్తే రాడు .నేను ముద్దు పెట్టు కొంటే ,వాడూ పెట్టు కొంటాడు
.లేక పో తే ”యు డూ ”అంటాడు .ఆశుతోష్ మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గ రకు బానే వస్తా డు ,ముద్దు లిస్తా డు .రాత్రి
తొమ్మిదిన్నరకు ఆశుతోష్ మా దగ్గ రకు వచ్చి పడుకొంటాడు .ఒకో సారి ఇక్కడే .పీయూష్ మాత్రం రాడు.కాని వాడు మా దగ్గ ర
పడుకొంటే వీడు సహించలేడు .ఎలా గైనా వాడిని అప్ ష్ట యిర్ కు తీసుకు పో తాడు పో ట్లా డయినా .ఆటలు లేక పో తే కంప్యూ
టర్, లేక పో తే, టివి.తప్ప ఇంకే ధ్యాసా లేదు .వాళ్ల తో గడపటం మహా దానందం గా ఉంది .అప్పుడే ఆరు నెలలు అయిందా
అని పిస్తో ంది .
ఇక్కడికి వచ్చిన దగ్గ రనుండి సరస భారతి 30,000 మందిని ఈ ఆరు నెలల్లో పలకరించింది .అంటే నేలకు అయిదు వేల
మందిని స్పర్శించింది .అంటే రోజుకు సరస భారతిని నూట ఏభై మంది చూశారు .నేను ఈ ఆరు నెలల్లో 370 ఆర్తికల్సు
రాశాను .అంటే నేలకు అరవై.అంటే రోజుకు సరాసరి రెండు .ఒక సాహిత్య సంస్థకు ఇంత కంటే గొప్ప ప్రచారం ఏమి ఉంటుంది
.అందరు చదివి ,ఆనందిస్తు న్నారు ఆదరిస్తు న్నారు .సాహితీ సేవ విదేశీ గడ్డ మీద ఇలా జరగటం సరస భారతికి ముందడుగే
.అందరికి అభి నందనాలు .అమెరికా లో ఎన్నో కార్య క్రమాలలో పాల్గొ న్నాం .ఎల్లా వారు, ఈల శివ ప్రసాద్ ,మణి శర్మ .మైనేని
వారి హన్త్స్ విల్ ,అట్లా ంటా ,దేవాలయాల సందర్శనం, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వగైరా .అన్నీ ఆనందాన్ని తృప్తినీ ఇచ్చాయి
అమెరికా లోని భారతీయ మిత్రు లకు వీడ్కోలు పలుకుతున్నాము .మాది ఈ సారి నిజం గా సాంస్కృతిక యాత్రే . ఎవరైనా
నన్ను ఇక్కడి వాళ్ళు మీరు ఎలా కాలం గడుపుతున్నారు ? అని అడిగితే నేను నవ్వుతూ ”కంచం ఖాలి -మంచం భర్తీ ”అనే
వాడిని .కాని అలా చేయలేదని మీరు గ్రహించే ఉంటారు .గుడ్ బై అమెరికా —
అమెరికా ఊసులు
అమెరికాపన్నెండవ ప్రెసిడెంట్ గా ఫ్రా ంక్లిన్ పిఎర్స్ ఉన్న కాలం లో అమెరికా లో ప్రఖ్యాత రచయితలు ,తత్వ వేత్తలు కవులు
ఉండే వారు ..వారి లో నతానియాల్ హతారన్ ,,లాంగ్ ఫెలో ,మెల్విల్లే ,ఎమేర్సన్ ,హెన్రీ డేవిడ్ తోరో లతో పాటు అమెరికా కు
చెందినా అసలైన కవిత్వాన్ని సృష్టించిన వాడు ,అమెరికా ఆత్మను తట్టి లేపిన వాడు ,అగ్గి పిల్లా కుక్క పిల్లా కాదేది కవిత
కనర్హం అని శ్రీ శ్రీ కి ప్రేరణ నిచ్చి సమస్త వృత్తు ల వారికి కవిత్వం లో స్థా నం కల్పించి ,అమెరికా జాతీయ కవి అని పించు కొన్న
వాడు ‘’గడ్డి పరకలు ‘’అనే దీర్ఘ కవిత రాసిన వాడు వాల్ట్ విట్మన్ కూడా ఉన్నాడు .ఇందులో తోరో గారు గాంధీని ప్రభావితం
చేసిన వాడు .ఆయన ఎక్కడో అడవి లో జనాలకు దూరం గా వాల్డె న్ పాండ్ దగ్గ ర ఉండే వాడు .రుషి జీవితం గడి పాడు
.అమెరిక న్ రుషి అని పించుకొన్నాడు .అడవి లోని ప్రక్రు తి తనకు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకం బా బో ధించిందని
చెప్పాడు .సాధారణ జీవితం గడి పాడు అన్నీ ఉన్నా ,అంత రంగ సంగీతాన్ని విన మని ప్రబో ధించాడు .
వాల్ట్ విట్మన్ గొప్ప కవిత్వం ర్రా సినా ,ఆయన రాసిన’’ లీవెస్ ఆఫ్ గ్రా స్స్ ‘’ కవిత ను ఎవ్వరు ముద్రించటానికి ముందుకు
రాలేదు .ఆయన కవిత్వం అతి సాధారణం గా ఉందన్నారు .విప్ల వాత్మకం గా ఉందన్నారు .అప్పటి దాకా ఇంగ్లా ండ్ ప్రభావం తో
అమెరికా కవులు రాస్తు న్నారు .దీన్ని వదిలి కొత్త మార్గ ం తొక్కాడు విట్మన్ ‘’.అందరి మాన్ ‘’ అయాడు .విసుగెత్తి తన
పుస్త కాన్ని స్వంత చమురు వదిలించుకొని అచ్చేసి వదిలాడు .అది సూపర్ డూపర్ హిట్ అయింది .అప్పుడు తెలిసింది అసలు
కవిత్వం అంటే ఏమిటో /తమ ఆత్మను తట్టి లేపాడు విట్మన అని భావించారు .అదే పని ని వచనం లో మార్క్ ట్వేన్ చేసి
చూపించాడు .అసలు అమెరికన్ వచనానికి పదును పెట్టా డు .సజీవమైన పాత్రల్ని సృష్టించాడు .వాడుక భాష ను రాశాడు
.పాత్రలలో పరకాయ ప్రవేశం చేశాడు .విస్త ృతం గా పర్యటించాడు .ఇదీ అమెరికన్ భాష అని రాసి చూపించి మెప్పు పొ ందాడు
నిద్రిస్తు న్న అమెరికా జాతిని జాగృతం చేశాడు .భాష లో భావం లో ఎన్నో మార్పులు తెచ్చాడు .అతను రాసినవీ హిట్టు పై
హిట్టు లే ..విట్మన్ ,మార్క్ ట్వేన్ లకు అమెరికన్ జాతి సర్వదా రుణ పడి ఉంటుంది .విట్మన్ కవితా పుస్త కాన్ని జాన్ విత్త ర్ అనే
కవి ‘’ఇదేమి కవిత్వం ?’’అని తగల బెట్టా డు .కాని దీన్నే ఎమర్సన్ తాత్వికుడు విల్త ్మన్ కవిత్వాన్ని మెచ్చుకొని వెన్ను తట్టా డు
.అది ‘’free and great thought ‘’అన్నాడు ఆ మహా రచయిత .అయితే విట్మన్ గొప్పతనం ఆయన చని పో యిన తర్వాతే
ప్రపంచం బాగా అర్ధం చేసుకొన్నది .
i celebrate my self ,and sing my self –and what i assume you shall aassume –for every atom belonging
to –as good belongs to you ‘’అన్నాడు విట్మన్ leaves of grass లో .
అమెరికా లో నల్ల జాతి అస్తిత్వాన్ని నిలబెట్ట టానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి మార్క్ ట్వేన్ నవలల్లో వాళ్లకు
స్తా నం కల్పించి వారి భాష మాట్లా డించాడు .harriet Beacher Stowe అనే రచయిత్రి uncle tom’s cabin ‘’ అనే నవలలో
బానిసత్వం పై తిరుగు బాటు బో ధించింది .దక్షిణ రాష్ట్రా లలో ఈ నవల సంచలనం రేకెత్తి ంచింది .1852 లో ఇది ప్ర చురిత మై
బానిసల కడగండ్ల ను కళ్ళకు కట్టించింది .బానిసల తిరుగు బాటు కు మార్గ దర్శకత్వం వహించింది .ఆ పుస్త కం అంత ర్జతీయం
గా బెస్ట్ సెల్లా ర్ అని పించు కొంది .ఒక మిలియన్ కాపీలు అన్ని భాషల్లో అమ్ముడు అయాయి .దీని ప్రభావాన్ని చూసి
ఎమర్సన్ మహాశయుడు ‘’ఇది విశ్వ హృదయాన్ని తెలియ జేసింది .అందరు అదే ఉత్కంత తో చదివారు .వంటింట్లో కారిడార్లో
క్లా సుల్లో ఎక్కడ చూసినా దాన్ని చదివే వారిని చూశాను ‘’అన్నాడు .ఎమర్సన్ గారి ముద్ర పడింది అంటే ఆ కాలం లో ‘’తాతా
చార్యుల ముద్ర ‘’పడిందన్న మాట .అంత గౌరవం .ఎమర్సన్ అంటే .మన ప్రా చీన మహర్షు ల స్థా నమే .ఆయన్ను ఎక్కువ గా
ఉదాహరిస్తు ంటారు మన వాళ్ళు .ఆయనకూ ఇండియా అంటే పరమ గౌరవం ,ఆదరం .మన క్లా సిక్స్ అన్నీ ఆయనకు కరతలా
మలకాలే .ఇలా ఎమర్సన్ ,విట్మన్ మార్క్ ట్వేన్ ,స్టీవ్ లు సాధారణ జన ఘోష ను ,వారి అనుభవాలను గురించి రాసి ,వారి
హృదయాలను ,పాథకుల హృదయాలను స్పందింప జేశారు .
మాములుగా అందరు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తన కొడుకు చదివే స్కూల్ ఉపాధ్యాయుడికి రాసిన
ఉత్త రాన్ని ఉదాహరిస్తు ంటారు .కాని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రా ంక్లిన్ పేయర్స్ లింకన్ గారి అబ్బాయి చని పో తే రాసిన ఉత్త రాన్ని
ఎవరు గుర్తు ంచు కోరు .అదే ఇది –
‘’the impulse to write you ,,the moment i heard of your great domestic affliction was very strong ,but it
brought back the crushing sorrow which be fell me just before i went to washington ,in 1853 ,with such
power that i feel your grief to be too sacred for instruction .even in this hour ,so full of danger to our country
,and of trial and anxietyto all good men ,your thoughts will be ,of your cherished boy ,who will nestle in your
heart ,until you meet in that new life ,where tears and toils and conflicts will be unknown ‘’
ఈ ఉత్త రాన్ని one of the most moving letters గా సాహిత్య కారులు భావిస్తా రు .ఒక ప్రెసిడెంట్ కు ఇంకో పదవీ
విరమణ చేసిన ప్రెసిడెంట్ రాసిన జాబు ఇది .ఇక్కడ ఇంకో విషాదం ఏమి టంటే పియర్స్ సంతానం అంతా చిన్నతనాలలోనే
చని పో యారు .అంతే కాదు ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికై పదవీ బాధ్యతలు చేబట్ట టానికి కొన్ని రోజుల ముందు రైల లో
ప్రయాణం చేస్తు ండగా ఒకరైలు దుర్ఘటన లో ఉన్న ఒక్క గానోక్క కొడుకు మరణించాడు .కనుక పుత్రశోకం అంటే ఏమిటో
పూర్తిగా ఫ్రా ంక్లిన్ కు తెలుసు .అందుకే అంత గొప్పగా స్పందిన్చాదాయన . పియర్స్ కోక్కగానోక్క కొడుకు పో యినప్పుడు
ఆయన ‘’ i have lost the center of my hopes ‘’ అని దుఃఖ పడ్డా డు .ఆ బాధ తోనే వైట్ హౌస్ లో కాలు పెట్టా డు పాపం
విధి వంచితుడు .
ఫ్రా ంక్లిన్ న్యుహాంప్ షైర్ వాడు .అమెరికా లో ముందు నుంచి ఉన్న పదమూడు కాలనీ లలో అది ఒకటి .కెప్టెన్ మార్టిన్ ప్రింగ్
1603 లో అక్కడ కాలు పెట్టిన మొదటి ఆంగ్లేయ పరిశోధకుడు .తర్వాతా రెండేళ్లకు సామ్యుయాల్ డే చాంపియన్ అనే ఫ్రెంచ్
వాడు అక్కడికి వెళ్లా డు .అంతే కాదు ఆ రాష్ట ం్ర బ్రిటీష వారి నుండి మొదటిగా స్వాతంత్రా న్న 5-1-1 776 లో ప్రకటించుకొన్న
రాష్ట ం్ర కూడా .అయితే పూర్తీ స్వాతంత్రం రెండేళ్ళ తర్వాతా పొ ందింది .ఆ రాష్ట ం్ర విధానం అప్పుడు ‘’live free or die ‘’.న్యు
ఇంగ్లా ండ్ రాష్ట్రా ల్లో అదొకటి .అక్కడ చాలా సరస్సులు జల ప్రవాహాలు చేపలు పట్ట టానికి అనుకూలం గా ఉంటాయి .అక్కడి
ఆదివాసులను ‘అబెనాకి ఇండియన్స్ ‘’అంటారు .అక్కడి గొప్ప వైన white mountains ఉన్నాయి .వాటిలో ఎత్తైన శిఖరం
6,288 అడుగుల ఎత్తు న్న మోంట్ వాషింగ్త న్’’ ఈ రాష్ట ం్ర అనేక వస్తు వుల ఉత్పత్తి కేంద్రం .ప్రత్తి మిల్లు లు ,పేపర్ మిల్లు లు
యంత్ర సామగ్రికి పేరు .అట్లా ంటిక్ సముద్ర తీరం లో ,మేర్రిమాక్ ,కనెక్టికట్ నదీ తీరాల్లో లెక్కలేనన్నిఫాక్టరీలున్నాయి .
అమెరికా ఊసులు –2
మిలీషియా అనే మాటకు అర్ధ ం పౌర సైన్యం అని అంతే కాని మిలిటెంట్లు అని కాదు .మాటల కంటే చేతలకే విలువ ఎక్కువ
అన్న దానికి actions speak louder than words అంటారు .ఒక సారి ఫ్రా ంక్లి పియర్స్ స్కూల్ నుండి ఎగా కొట్టి ఇంటికి
రావాలని ఆలోచించి వచ్చే శాడు .ఇంటికి వస్తే ఇంట్లో ఎవరు లేరు .ఇంతలో తండ్రి వచ్చి గుర్రబ్బండి ఎక్కించు కొని సరదాగా
తీసుకొని వెళ్లి స్కూల్ కు అరమైలు దూరం లో ఆపి నడిచి వెళ్ళమన్నాడు .విపరీతం గా వర్షం పడుతోంది .అయినా తండ్రి
మాట కు విలువ ఇచ్చి నడుచు కుంటూ బడికి వెళ్లా డు .అంత క్రమశిక్షణ తో ఉండ బట్టే అమెరికా ప్రెసిడెంట్ అయాడు ఫ్రా ంక్లిన్
పియర్స్ .if your past is limited ,your future is boundless అనేది అతని సూక్తి .తన అల్ల ర చిల్ల ర వేషాలు ఎలా చదువు
కు హాని కలిగిస్తు న్నాయో గ్రహించి ,దారి మార్చుకొని గ్రేడులు పెంచుకొన్నాడు .
ఆకాలం లో యే రాష్ట ం్ర అధికారం దానిదే .మిస్సోరి బానిస రాష్ట ం్ర గా ఉనియన్ లో చేరితే ,మైనే అనేది ఫ్రీ స్టేట్ గా చేరింది
.1825 లో ఈరీ కెనాల్ ద్వారా నౌకా యానం ప్రా రంభమైంది .అది 360 మైళ్ళ పొ డవు ,40 అడుగుల వెడల్పు ఉండి .దీనితో
నౌకల ద్వారా వ్యాపారం విపరీతంగా పెరిగింది .1909 లో దాని పొ డవు 340 మైళ్ళు వెడల్పు 150 అడుగులకు పెంచి
పన్నెండు అడుగుల లోతు చేసి న్యు యార్క్ స్టేట్ బార్జి కెనాల్ సిస్టం గా రూపొ ందించారు .
ఫ్రా న్క్లిన్ పియర్స్ సైన్యం లో పదమూడు ఏళ్ళ కే చేరాదు .అతన్ని తోటి సైనికులు old hickery అనే వాళ్ళు .అంటే హికారీ
చెట్టు లాగ ద్రు ధం గా ఉన్నాడని అర్ధం .అప్పటి ప్రెసిడెంట్ జాక్సన్ అంటే అందరికి అభిమానం .ఆయన్ను ‘’పీపుల్స్ ప్రెసిడెంట్
‘’అని ఆప్యాయం గా పిల్చే వారు .ఆ కాలం లో అమెరికా లో ఒకే ఒక్క బాంక్ ఉండేది .అది ‘’బాంక్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్
‘’అది ధనికుల బాంక్ అని పేదలకు ఉపయోగం లేదని జాక్సన్ అభి ప్రా య పడ్డా డు .దాన్ని రద్దు చేసి చిన్న బంకులను
ఏర్పాటు చేయాలని భావించాడు .అప్పటి దాకా డెమొక్రా టిక్ రిపబ్లి కన్ పార్టి అని పిలువా బడే దాన్ని జాక్సన్ డెమొక్రా టిక్ పార్టి
అని మార్చాడు .
నతానియాల్ హతారన్ అనే రచయిత పియర్స్ క్లా స్ మేట్ .ఆయన గురించి చక్కని చిన్న పరిచయాన్ని రాసి ప్రెసిడెంట్ గా
పియర్స్ పో టీ చేసినప్పుడు ఇచ్చాడు .అది అందరికీ నచ్చి అతను ప్రెసిడెంట్ అవటానికి బాగా తోడ్పడింది .పియర్స్ 1831 లో
శాసన సభకు ఎన్నికైన అతి చిన్న వాడు .
అప్పుడు ఆడ వాళ్లకు వోటింగ్ హక్కు లేదు .చదువుకునే వీలు వోటు వేసే హక్కు ,మగవారితో సమాన వేతనాలు
ఉండేవి కావు .Elizabeth cady Stantan అనే మహిళా అనేక మంది స్త్రీల తో కలిసి భారీ రాలీ నిర్వ హించి diclaretion of
sentiments ను 1848 జూలై ఇరవై న న్యూయార్క్ లో విడుదల చేసింది .అదే అమెరికా లో స్త్రీ ల సమాన హో దాకు ప్రా తి పదిక
ఉద్యమం అయింది .అయితే వెంటనే వారికి అవి లభించాయి అనుకొంటే పో రా బాటే .ఆ తర్వాతా 72 ఏళ్లకు కాని వారి కళలు
ఫలించ లేదు .పందొమ్మిదవ రాజ్యాంగ సవరణ వల్ల వారికి సమాన హక్కులు లభించాయి .
బానిస తనం అంటే కొద్ది మంది ధనికులు కొందరు మనుషుల్ని కొనుక్కొని వెట్టి చాకిరి చేయించు కోవటం .కొన బడ్డ
వాళ్ళు ప్రైవేట్ ఆస్తి కింద జమ .దీన్నే స్లేవారి అన్నారు .ఇది ప్రపంచం అంతా పూర్వ కాలం లో ఉండేది .గ్రీసు ,రొమే లలో బాగా
ఎక్కువ .జయించిన దేశాలలోని జనాన్ని బానిసలుగా వాడు కొనే వారు .అమెరికా కు మొట్ట మొదటగా బానిసలు మొదటి
బ్రిటీష కాలని జేమేస్ టౌన్ లో ఏర్పడి నప్పుడు1620 లో వచ్చారు .ఆఫ్రికా లోని నల్ల జాతి వారిని ఇంగ్లీష ,స్పానిష్
,పో ర్చుగీసు వారు దిగుమతి చేసుకొన్నారు .అదే బానిస వ్యాపారం .మద్య దళారీలుందే వారు .వారికి డబ్బు బాగా గిట్టేది
.ఎంత ఎక్కువ మంది బానిసలుంటే అంత గొప్ప వాడు అని భావించే వారు .బానిసలను దక్షిణ రాష్ట్రా లలో పంటలు పండించా
తనికి ఎక్కువగా వాడు కొనే వారు .ఇంత తిండి పడేసి ఉండటానికి కాస్త చోటిస్తే చాలు రెక్కలు ముక్కలు చేసుకొని పగలు రాత్రి
సేవ చేసే వారు .జీతం ఇవ్వక్కర్లేదు .మంచి లాభ సాటి పని .వారి పంతో బానిస అధికారులు పిచ్చ డబ్బు సంపాదించారు
పంటలు బాగా పండటమే కారణం ..బానిసలకు ఒరిగిందేమీ లేదు .యజమానులు డబ్బు చేసింది వీరికి చాకిరి మిగి లింది
.బానిస కుటుంబం అంతా ఊడిగం చేయాల్సిందే .
ఈ బానిస విధానం ఉత్త ర రాష్ట్రా లలో లేదు .బానిస విమోచన ఉద్యమం క్రమంగా పెరిగింది .దీన్ని లాయడ్ గారిసన్
,ఫ్రెడరిక్ దగ్లా స్ బాగా ప్రచారం చేసి వారిలో ఐక్యత తెచ్చి పో రాటాలు చేసి ,హక్కుల కోసం ఉద్యమాలు నది పించారు .దేశం
డెందు గా చీలింది .ఉత్త ర ,దక్షిణ రాష్ట్రా ల మద్య యుద్ధం సాగింది .దక్షిణాది వారికి బానిసత్వం కావాలి లేకపో తే వారికి పంటలు
పండించే జనం ఉండరు ..దీన్నే అమెరికన్ సివిల్ వార్ అంటారు .1863 లో ప్రెసిడెంట్ లింకన్ యుద్ధం చేసి బానిసలకు విముక్తి
ప్రసాదించాడు .జేమేస్ పొ లాక్ అనే స్పీకర్ బానిసత్వం అసాన్ఘికం అని భావించాడు .1836 లో టెక్సాస్ రాష్ట ం్ర మెక్సికో తో
యుద్ధం చేసి స్వాతంత్రా న్ని సంపాదించు కొంది .యునియన్ లో చేరింది .
అమెరికా లోను సభల్లో బాగా తాగి వచ్చి సభ్యులు గోల చేసే వారు .ఒక సారి పియర్స్ ఎనేట్ సభ్యుడై పిత్మన్ అనే ఆయన
ఇంట్లో ఉన్నాడు .ఆయన ఎవర్నీ తాగానిచ్చే వాడు కాదు . పియర్స్ తాగాను అని ప్రతిజ్ఞా చేసి అక్కడ ఉన్నాడు .మళ్ళీ
చ్తా గలేదు మాట నిలుపు కొన్నాడు .ఎన్నేతర్ గా ,కల్నల్ గా పని చేశాడు .తర్వాతా లా ప్రా క్టీస్ చేసి హాయిగా రాజ కీయాలకు
దూరం గా ఉన్నాడు .ఇంట్లో నే ఉన్నాడు .అప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చాయి .అతనేమీ ఆలోచించ లేదు .అప్పుడు
డెమొక్రా టిక్ పార్టి వాళ్ళు అతన్ని నామినేషన్ వేయమని ఒత్తి డి చేశారు .వద్దన్నాడు చేసింది .అయినా చివరికి ఒప్పుకొన్నాడు
.ముప్ఫై తొమ్మిది సార్లు అభిప్రా య సేకరణ చేసి చివరికి పియర్స్ నే ఏకగ్రీవం గా డెమొక్రా టిక్ అభ్యర్ధి గా నిలబెట్టా రు .అయిష్ట ం
గా నే నిలబడ్డ గెలిచి ప్రెసిడెంట్ అయాడు .అదృష్ట ం అతని ఇంటి తలుపు తట్టి ప్రెసిడెంట్ ను చేసింది .
అమెరికా ఊసులు –3
అమెరికా లో ఫ్రీ సాయిల్ పార్టి అనేది ఉండేది .అది స్లేవారి ని ఇంకా వ్యాపించకుండా చేయాలని కోరే సంస్థ .అలాగే
లిబర్టి పార్టీ అనేది ఉండేది .ఇది స్లేవారి ని నిర్మూలించాలి అనే పార్టి .ఫ్రా ంక్లి పియర్స్ అధ్యక్షుడి గా పో టీ చేసినప్పుడు ఈ రెండు
పార్టీలకు ఓట్లు బానే వచ్చాయి .అంటే అప్పుడు అమెరికా లో ఇంకా ప్రజలు బానిసత్వం పై పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేక
పో యారు .
పియర్స్ నలబహై ఎనిమిదేల్లకే ప్రెసిడెంట్ అయాడు .అప్పటికి ఆయన యంగెస్ట్ ప్రెసిడెంట్ .నతానియాల్ హతార్న్ ఆయన
గురించి చక్కని బ్రీఫింగ్ ఇచ్చాడు .అది బాగా అతని పర్సనాలిటి ని పెంచింది .ప్రెసిడెంట్ గా ఆయన చేసిన ఉపన్యాసం 3,319
మాటలతో ఉండి .దాన్ని ఆయన కాగితం మీద రాసుకోవటం కాని ,లేక బ్రీఫింగ్ అంటే పాయింట్లు గా రాసుకోవటం కాని చేయ
లేదు .అనర్గ ళం గా మాట్లా డాడు .ఆయన నడిచే బజార్ల న్నీ తిరిగే వాడు .వీలయితే గుర్రం ఎక్కి వెళ్ళే వాడు .సెక్యురిటి ఉండేది
కాదు . అధ్యక్షా భవనం గురించి మాట్లా డుతూ ‘’అది మీ అందరిది .నేను అద్దెకున్న వాడిని మాత్రమే ‘’అన్నాడు . అతని
భార్య కొడుకు చావును జీర్ణించు కొ లేక కొడుక్కి రోజు ఉత్త రాలు రాసేది .
అధ్యక్షుడు గా మెక్సి కొ కు అమెరికాకు సరిహద్దు ను నిర్ణయించే బాధ్యత ను జేమేస్ గాడ్స్దేన్ కు అప్ప గించాడు .ఆయన
వాళ్ళతో మాట్లా డి అమెరికా పది మిలియన్ల డాలర్లు వారికిచ్చేట్లు ,వారు గిలా నదికి దక్షిణాన ఉన్న ౩౦,౦౦౦ చదరపు మైళ్ళ
భూభాగానిన్ని అమెరికా కు వదిలారు .అదే రార్వాత సదరన్ అరిజోనా ,సదరన్ న్యు మెక్సికో లు గా మారాయి .దీన్ని ‘’గాడ్సన్
కొనుగోలు ఒప్పందం ‘’అంటారు .దీనితో అమెరికా విస్త రణ పూర్తీ అయింది .ఇదే ఆధునిక అమెరికా మాప్ వేయటానికి
తోడ్పడింది .
క్యూబా తో కూడా ఒప్పందం చేసుకొని దాన్ని అమెరికా లో కలిపే ప్రయత్నం పియర్స్ చేశాడు కాని అది కుదర లేదు .క్యూబ
కు వచ్చిన మొదటి సెట్లర్స్ అందరు ఆఫ్రికా నుంచే వచ్చారు .హవాయి ద్వీపాలను అమెరికా లోకలిపే ప్రయత్నించాడు .బ్రిటన్
,ఫ్రా న్సులు అడ్డు పడ్డా యి .చివరికి 1959 లో హవాయి అమెరికా యాభైవ రాష్ట ం్ర గా చేరింది .ఆనాటి పియర్స్ ఆలోచన ఇప్పటికి
నిజమైంది .
జపాన్ తో ఎవరు వర్త క వాణిజ్యాలు జరపలేదు .అది ఏకాకి గా ఉండేది .పియర్స్ దాన్ని ఒప్పించి వాణిజ్యం చేశాడు .తన వైస్
ప్రెసిడెంట్ పదవి చె బట్టిన కొత్త లోనే చని పో యినా మళ్ళీ ఎవర్నీ నియమించా లేదు .అతని కాలం లో అంటి స్లేవారి సొ సైటీ
అనే తోరోంతో లో ని సంస్థ 30,000 మంది బ్పట్టు బడిన బానిసలను విడుదల చేస్చేశాడు .వారంతా కెనడా లో భూములు
కొన్నారు .
పియర్స్ లింకన్ ఉద్ద సన్నాహాలను అంగీకరించా లేదు .కాని ఏమీ నిర్ణయం తీసుకో లేక పో యాడు .రెండో సారి ప్రెసిడెంట్ గా
నిలబడ లేదు .భార్య ,సంతానం అందరు చని పో యారు ,బాధను మర్చి పో వటానికి చివర్లో మళ్ళీ మందు మొదలు పెట్టా డు
.1869 లో ఫ్రా న్క్లిన్ పియర్స్ మరణించాడు .ఒద్దు అనుకున్న వాడికి అధ్యక్షా పదవి దక్కింది .బానిసత్వం పై నిర్ణయం తీసుకో
లేక పో యాడు .చివరికి లింకన్ యుద్ధమే పరిష్కారం అయింది .ఉనియన్ నిలిచింది .
అమెరికా ఊసులు –5
దినో సార్స్ కు ముందు కాలమ్ లో అంటే 300 మిలియన్ల సంవత్స రాలకు పూర్వం చాలా పెద్ద జీవ
రాసులున్దేవి ఈ విషయాలను ఫ్రెంచ్ పాలన్తా లజిస్ట్ చార్లెస్ బ్రా న్న్గ్నియార్ట్ 1877 లో
పరిశోధించి కని పెట్టా డు .మధ్య ఫ్రా న్స్ లోని కామెంట్రి కి దూరంగా ఫాజిల్స్ కని పెట్టా డు .అతనికి ఈ
నాటి ఆకు చెత్తత లావు ,ఎత్తు ఉన్న ఫెరన్ ఫాజిల్స్ కని పించాయి . .మన పక్షులున్నా సైజ్ లో
ఈగల అవశేషాలు చూశాడు .అందులో మాన్స్టర్ డ్రా గన్ అనే పెద్ద ఈగ కు 63 సెంటి మీటర్ల రెక్కలున్నాయి . దానికి ''మెగా
న్యూరా ''అని పేరు పెట్టా డు .దీన్ని మనం ఇప్పుడు పారిస్ లోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ లో చూడ వచ్చు .తరు
వాతి పరిశోధన లలో 75 సెంటి మీటర్ల పొ డవున్న రెక్కలు గల ఈగల ఫాజిల్స్ కని పించాయట .నోరెళ్ళ బెట్ట కండీ అవి నోట్లో
దూరితే ఊపిరాడదు జాగ్రత్త ..
అంతేనా ,అడుగు పొ డవున్న సాలీడులు కని పించి ఆశ్చర్య పరిచాయి .వాటర్ స్కార్పియాన్లు అనే ''నీటి తేళ్ళు ''ఎంత
ఉంటాయో తెలుసా?.ఒక పెద్ద కుర్రా డంత .క్ల బ్ మాస్ అనే నాచు 130 అడుగుల ఎత్తు ఉందట . ఇది ఇప్పుడున్న నాచు కు
వంద రెట్లు ఎక్కువ .సరే గుర్రా ల సంగతి వింటే బుర్రే తిరిగి పో తుంది ..గుర్రం కాదండి బాబు దాని తోక సంగతి వింటే మతి
పో తుంది .గుర్రం తోక అయిదు అంతస్తు ల భవనం అంత పొ డవున్దేదట .ఇప్పుడు గుర్రా ల తోక మహా ఉంటె నాలుగు అడుగుల
బారు .సరే కోని ఫర్ వృక్షాల ఆకులు మూడు అడుగుల పొ డవు ఉండే వట .మీ 250 మిఇయన్ సంవత్స రాకు మీ
మార్పు ఒచ్చాయి .ఇదంతా వాతా వరణం లోని
ఆక్సిజన్ శాతం బట్టి మారిందట .సైనో బాక్టీరియా కూడా ప్రధాన పాత్ర వహించిందని అంటున్నారు .ఈ
కాలాన్ని కార్బోని ఫెరస్ కాలమ్ అనీ అన్నారు .
ఇంగ్లా ండ్ కు చెందిన జే.బి.ప్రీస్ట్లీ ఆక్సిజన్ కని పెట్టా డని మనం
చదువు కున్నాం .కాని ఆయన దాన్ని ఫ్లా జిస్తా న్ అని పిలిచాడు .గాలిలో ఉన్న పదార్ధా ల గురించి కూడా ఆయన
పరిశోధించాడు .అందుకే ఆయన్ను ''ఇన్వెంటర్ ఆఫ్ ఎయిర్ ''అంటారు .గాలిలో ఫ్లా జిస్తా న్
ఉందంటాడు .అదే మంటలు మంద టానికి కారణం అని రుజువు చేశాడు .బాబూ అది ఆక్సిజన్ అని
మొట్టు కోన్నా తన పట్టు వదలలేదు .శీలే కూడా ఆక్సిజన్ నుముందే కని పెట్టినా ప్రీస్ట్లీ ముందు
రాత పూర్వకం గా తెలియ జేశాడు .
'' ప్రయోగాల పిత'' గా ప్రీస్ట్లీ పేరు పొ ందాడు ..౬౨ ఏళ్ళ వయస్సు లో ఆయన అమెరికా లో '' copley medal '' ను
జీవ్విత సాఫల్య పురస్కారం గా పొ ందాడు .అది ఈ నాటి నోబెల్ బహుమానానికి సమానం .
.ఆయన 500 పైగా రచనలు చేశాడంటే ముక్కు మీద వేలు వేసు కొంటాం .ఆయన గొప్ప మత బో ధకుడు ''yuniterian
మతాన్ని నమ్మి ,తీర్చి దిద్ది ప్రచారం చేశాడు .మత మౌధ్యాన్ని వదిలించాడు .చర్చిని సంస్కరించే అనేక విషయాలు రాశాడు
.ఒక రకం గా ఆయన్ను ''రాడికల్ క్రిస్టియన్ ''అన్నారు .అంతే కాదు ఆయన మాటలు తూటాల్లా పెలేవి .ఎప్పుడు గన్స్ ,గన్
పౌడర్ అని తీవ్ర పదాలను ఉప యోగించాడు .అందుకే ప్రీస్ట్లీ ని ''గన్ పౌడర్ poe ''
అనే వారు .
అమెరికా నిర్మాణం లో బహుముఖ పాత్ర వహించి ఫిసిక్స్ లోని ఎలేక్త్రిసిటి లో అద్భుత పరిశోధనలు చేసిన బెంజమిన్ ఫ్రా న్క్లిన్
ఈయనకు ముఖ్య సహచరుడు .'పాపం'' సాల్మన్ రష్దీ'' లాగా చివరికి దేశం వదిలి అమెరికా కు వెళ్ళాల్సి వచ్చింది ప్రీస్త్లీకి .ఆ
కధ ఇంకో సారి తెలుసు కొందాం .ఇంత భ్తీ వ్ర భావ ప్రకటనలు చేసిన ప్రీస్ట్లీ మహాశయుడికి నత్తి
ఉంది .దాన్ని పో గొట్టు కోవ టానికి చికిత్స కూడా చేయించు కొన్నాడు .ఆయన ఆరు భాషల్లో మహా
పండితుడు .అన్నిట్లో ధారాళం గా మాట్లా డే సామర్ధ్యం ఉన్న వాడు .
బెంజమిన్ ఫ్రా న్క్లిన్ విద్యుత్తూ గురించి ముఖ్య విషయాలను ముందు గా లోకానికి తెలియ జేశాడు
.అవే ఫండా మెంతల్స్ .విద్యుత్తూ అంటే ఒక ప్రవాహం అని ,అందులో
విభజించలేని రెండు చార్జెస్ ఉన్నాయని ,వాటినే పాజిటివ్ ,నెగటివ్ చార్జి అంటారని విద్యుత్తూ ఎప్పుడు ధన విద్యుత్ చార్జి
నుండి రుణ విద్యుత్ చార్జి కి ప్రవహిస్తు ందని తెలియ జెప్పిన మొదటి శాస్త ్ర వేత్త ఫ్రా న్క్లిన్ .విద్యుత్తూ పుట్ట దు ,నశించాడని -ఒక
రూపక్మ్ లో నుంచి ఇంకొక రూపం లోకి మారుతుందని చెప్పాడు .ఇవన్నీ ఈ నాటికీ సత్యాలే .ఆయన పెట్టిన పేర్లే-బాటరీచార్జి
,కండక్టర్ ,అనే మాటలు .ఇప్పటికి వాటినే వాడుతున్నాము .
మెరుపు మెరిసి నప్పుడు భవనాలు కాళి పో కుండా లైతినింగ్ కండక్టర్లు గా పొ డవైన సూది మొన ఉండే రాడ్ లను
అమర్చాలని సూచించింది కూడా ఫ్రా న్క్లినే .ఆయన్ను ''మోస్ట్ సేలిబ్రేతేడ్ ఎలేక్త్రిశియాన్ ''అంటారు .లండన్ లో ''లండన్ కాఫీ
క్ల బ్ లో ఫ్రా న్క్లిన్ ,ప్రీస్త్లి మొదలైన మేదావు లంతా రోజూ సమావేశ మాయే వారు .తమ పరిశోధనలను చర్చించు కొనే వారు .,
అమెరికా ఊసులు –6
జోసెఫ్ ప్రీస్త్లీ ఇంగ్ల ండు నుంచి పారి పో వాల్సి వచ్చిందని చెప్పాను .ఆ వివరాలిప్పుడు తెలుసు కొందాం .1782 లో the
history of the corruption of christianity అనే పుస్త కం రాశాడు .దానికి అనుబంధం గా తర్వాతా institution of natural
and revealed religion రాశాడు .ఆనాటి చర్చి లో జరిగే భాగవతం అంతా ఎండ కట్టా డు .జీసస్ కు అధిక ప్రా ధాన్యత నిచ్చాడు
.మంత్రా లు ,మహిమలను కాదన్నాడు .క్రీస్తు మనిషే నని మతం లోని లొసుగులను గురించి చాలా తక్కువ స్థా యి భాషలో
రాసి క్రిస్టియన్ల కు బాధ కల్గించాడు .భగవంతుడు జీసస్ ను తన ప్రతిన్డి ది గా మాత్రమే భూమికి పంపాడ న్నాడు .క్రిస్టియన్ గాడ్
లేదన్నాడు .తన భావాలను ఆనాటి అమెరికా ప్రముఖుడైన జెఫర్సన్ కూడా పంపాడు .ఆయన బాగా అభిమానించాడు
.తనను విమర్శించే వారికి సమాధానం గా ఒక కరపత్రం ప్రింట్ చేసి వదిలాడు .దీనితో యూని టేరియన్ క్రిస్టియన్ భావాలకు
వ్యాప్తి కల్గించాడు .ఫ్రెంచ్ విప్ల వాన్ని సమర్ధించాడు .ఇతని తో బాటు హానెస్ట్ విగ్స్ బృందం సమర్ధించింది .అతనికి చాలా
బెదిరింపు ఉత్త రాలోచ్చాయి .ఇంగ్లా ండ్ చర్చి రాజు ఇతని అంతు తేలాల్సిందే నని పట్టు బట్టా రు .
అప్పటికే తన ప్రయోగాల లాబ్ ను తగల బెట్టా రు .ఫెయిర్ హిల్స్ అనే చోట ఇల్లు , లాబ్ లను ఏర్పరచుకొన్నాడు
.వంద మంది అల్ల రి మూక లాబ్ ను తగల బెట్టా రు .లైబర
్ర ి ధ్వంసం చేశారు .ఎంతో విలువైన పరికరాలు పాడై పో యాయి
.ఇన్నాళ్ళ శ్రమ బూడిద లో పో సిన పన్నీరు అయింది .స్నేహితులంతా తామే డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ అన్నీ సమకూర్చి
పెడతామని హామీ ఇచ్చారు .కాని భార్య మేరీ తో సహా ఫ్రా న్క్లిన్ సహాయం తో అమెరికా చేరాడు ‘
అమెరికా లో అతను ఆ దేశ నిర్మాణ బాధ్యులలో ఒకడు అని పించుకొన్నాడు .పెన్సిల్వేనియా లోని ఫిలడెల్ఫియా కు
చేరుకొన్నాడు .అమెరికా వైస్ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ తో మంచి దో స్తీ కుదిరింది ..1792 లో ఇంగ్లా ండ్ వెళ్లా డు .ఫ్రెంచ్ ప్రభుత్వం
గౌరవ పౌరస త్వం ఇస్తా నంది .మరుసటి ఏడాది మళ్ళీ అమెరికా చేరాడు .కవి కాల్రిద్జ్ ప్రీస్త్లీ కి జరిగిన అన్యాయాన్ని గొప్ప కవిత
గా రాశాడు .ఫిలడెల్ఫియా లోని అమెరికన్ ఫిలసాఫికల్ సొ సైటీ లో చాలా కాలం గా సభ్యుడి గా ఉన్నాడు .గత్యంతరం లేని
పరిస్థితుల్లో అమెరికా కు శరణార్ది గా వచ్చాడు .ఇక్కడి వాతా వరణం భార్యకు సరి పో లేదు .అందుకని నార్త్ అంబర్ లాండ్
అనే చోట స్తిర పడ్డా రు .అప్పటికి రవాణా సో కర్యాలు లేవు .రోజు పో స్ట్ రాదు .న్యూస్ పేపర్లు లేవు .అందుకని ఆడమ్స్ ను రోజు
ఒక కోచ్ లో టపా వచ్చే ఏర్పాటు చేయమని ఉత్త రం రాశాడు .
రాడికల్ బో ధనలు చేసే వాడు .ఇవి ఇక్కడ ఇబ్బంది కలిగిస్తా ఎమో నని ఆడమ్స్ బాధ పడ్డా డు .అమెరికా లోని రాజ
కీయాల పై ఘాటు విమర్శలే చేశాడు .భార్య మరణించింది .ఆమె ను గురించి చెబుతూ ‘’నేను ఎప్పుడు ఇంట్లో ఆమెకు ఒక
అతిధి గానే ఉన్నానని ,అన్నీ ఆమె చూసుకొనేది ‘’అని బాధ పడ్డా డు .
జెఫర్సన్ 1794 లోరాజకీయాలను వదిలి తిరిగి వచ్చి అమెరికన్ ఫిలసాఫికల్ సొ సైటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొన్నాడు
.అయితే రెండు రోజుల్లో నే అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఆడమ్స్ కు పని చేశాడు .ప్రీస్త్లీ ఆడమ్స్ ,జెఫర్సన్ ళ మద్య
ఇరవై ఏళ్లు ఉత్త ర ప్రత్యుత్త రాలు జరిగాయి అందులో ఎక్కువ సార్లు ప్రీస్త్లీ ప్రస్తా వన ఆడమ్స్ ,జఫర్సన్ మద్య జరిగిన
ఉత్త రరాలలో వచ్చింది .ఇదులో అపార్ధా లు చోటు చేసుకొన్నాయి ఆడమ్స్ ప్రీస్త్లీ ని ‘’ఆధునిక సో క్రటీస్ ‘’అన్నాడు .తరువాత
జెఫర్సన్ ప్రెసిడెంట్ అయాడు .అతనికి ఆడమ్స్ కు పడ లేదు .పదవి లో ఉండగానే ప్రెసిడెంట్ ఆడమ్స్ విధానాలను ఎండ గట్టె
వాడు .
ప్రెసిడెంట్ జఫర్సన్ కు ప్రీస్త్లీ జాబు రాస్తూ ‘’ఐ థింక్ మై సెల్ఫ్ హాపీ టు హావ్ లివేడ్ సో లాంగ్ ఉండర యువర్
ఎక్సేలేంట్ అడ్మినిని స్త్రేషన్ అండ్ ప్రపో స్ టు డై ఇన్ ఇట్ ‘’ అన్నాడు .తమాషా ఏమిటంటే జఫర్సన్ ఆడమ్స్ లు ఇద్దరు ఒకే
రోజు july 4-1846 లో చని పో యారు .అది అమెరికా కు స్వాతంత్రం వచ్చిన 50 వ స్వాతంత్ర్య వార్షికోత్సవం అంటే డిక్లరేషన్
ఆఫ్ ఇండి పెందేన్స్ కు యాభై ఏళ్ళు అన్న మాట .ప్రీస్త్లీ బో ధించిన నేచురల్ ఫిలాసఫీ అమెరికా కు దశా ,దిశా నిర్దేశం చేసింది
అని విశ్లేషకుల భావన .
ప్రీస్త్లీ తనను చాలా కాలానికి కని పించే తోక చుక్క గా పో ల్చుకొన్నాడు .ఒక కామెట్ లాగా చాలా వేగం గా
కడులుతానని ,అదే వేగం తో వేడి ,వెలుతురూ ప్రసరించి మాడి మసి అయి పో తానని అన్నాడు .దీనికి స్పందించిన ఆడమ్స్
‘’గ్రహ స్తితి లో కామెట్ ఒకటి అని వాల్ట ర్ లాగా అమెరికా కు ప్రీస్త్లీ భావజాలాన్ని అందించాడని మెచ్చాడు .అమెరికా నిర్మాణం
లో ప్రీస్త్లీ భావజాలం స్వాతంత్రా నికి ,స్వేచ్చా ప్రకటనకు ప్రజాస్వామ్య విలువలకు భూమికలైనాయి . తాను క్రిస్స్టియానిటి ని
వదలకుండా ప్రీస్త్లీ సహాయ పడ్డా డని జెఫర్సన్ ప్రశంషించాడు .17 75 లో దేబ్భై అయిదేళ్ళ వయసు లో ప్రా ణ వాయువైన
ఆక్సిజన్ ను, గాలి నిర్మాణాన్ని లోకానికి అందించిన ప్రీస్త్లీ ప్రా ణ వాయువు అనంతా కాశాలకు చేరింది .
జెఫర్సన్ ఆడమ్స్ లు పన్నెండు ఏళ్ళు ముఖాలు చూసు కోలేదు .మళ్ళీ పన్నేన్దేల్ల తర్వాతా ప్రీస్త్లీ ని జ్ఞా పకం
చేసుకొని ఉత్త ర ప్రత్యుత్త రాలు జరుపు కొన్నారు ..ఈ విదం గా ప్రీస్త్లీ చని పో యి కూడా వారిద్దరిని కలిపాడు .
అమెరికా ఊసులు --7--జేఫర్సనీయం
అమెరికా ఊసులు -8
అమెరికా ఊసులు –9
--భాష -ఘోష
భావ వ్యక్తీకరణకు భాష అవసరం అని మనకు తెలిసిన విషయమే
.కొన్ని భాషలకు లిపి ఉండదు .మాట్లా డటానికే అవి ఉపయోగ పడతాయి .ఇరవై అయిదు
రకాల రచనా విధానాలున్నాయి .అక్షర మాలను ఉప యోగించి సాధారణం గా భాషను
రాస్తా రు కాని చానా జపానీస్ భాషలను ఇడియోగ్రా ం ల లో రాస్తా రు .అవి
గుర్తు లు గా ఉంటాయి .సుమేరియన్ భాష అత్యంత ప్రా చీన భాష గా అంటే 5,000 ఏళ్ళ
నాటి భాష గా భావిస్తా రు .సంస్కృతానికి సుమారు నాలుగు వేల ఏళ్ళు అని వీరి
నమ్మకం .ప్రపంచం మొత్త ం మీద 6,912 భాషలున్నాయి వీటికి మాండలికాలు ఉన్నాయి
.ప్రపంచ జనాభా లో సగం మంది ఇరవై భాషలే మాట్లా డుతున్నారు .బ్రిటన్ సూపర్
పవర్ కాక పో యినా వారి భాష ఇంగ్లీష ఆది పత్యం వహిస్తో ంది .అందుకే ''రూల్
ఆఫ్ బ్రిటన్ పో యింది కాని రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ''అనిచేణుకుతుంటారు .ఇండియా
లో .350 మిలియన్ల జనం ఇంగ్లీష లోనే మాట్లా డు తున్నారు .వీరు బ్రిటన్
,ఆస్ట్రేలిన్యూజిలాండ్అమెరికాలలో ఇంగ్లీష మాట్లా డే వారికి సరి సమానం . ,
మాట్లా డే వారు లేక భాషలు అంత రించి పో తున్నాయి .ఈ విషయాన్ని
u.n.o.హెచ్చ రించి చాలా కాలమైంది .గౌతమ బుద్ధు డు బౌద్ధమత ప్రచారాన్ని
''పాళీ భాష ''లో చేశాడు .దానికి లిపి లేదు .ఇప్పుడీ భాష మాట్లా డే వారి
సంఖ్య అతి పరిమితం .ఇది శ్రీలంక ,తాయి లాండ్ ,మయన్మార్ దేశాలలో పూజా
విధానాలకు మాత్రమె పరి మితమైంది .అతి నాగరక భాష అని మనం గౌరవించే సంస్కృత
భాష మాట్లా డే వారు లేక గ్రందాలకే ఎక్కువ గా పరిమిత మైంది .ఐరిష్ భాష ను
గాలిక్ అంటారు ఐర్లా ండ్ దేశీయుల అధికార భాష .ఆ దేశం స్వాతంత్రా న్ని1922
లో పొ ందినప్పుడు ఆ భాషను రెండు లక్షల యాభై వేల మంది మాట్లా డే వారట
.ఇప్పుడు కేవలం 30,000 మంది మాత్రమె మాట్లా డుతున్నారట .
ఇవాల్టి ప్రపంచం లో199 భాషలను కేవలం డజను మంది మాత్రమె ఆయా భాషలలో
మాట్లా డుతున్నారని తెలిసి భాషా వేత్తలు ఆందో ళన పడుతున్నారు . ఇందులోకి
దిగితే చాలా ఆశ్చర్య కర విషయాలను తెలుసు కొని గుండె బాదు కొంటాం .ఇయాక్
అనే భాష మాట్లా డే ఏకైక వ్యక్తిఅలస్కా లో2008 లో మరణించటం తో ఆభాష అదృశ్య
మైంది . ఐరిష్ భాష లాంటి ''మాక్స్ ''భాష మాట్లా డే చివరి ఆయన 1974 లో
మరణించటం తో అదీ తీసి వేత కు గురైంది .అండమాన్ దీవుల్లో '' బో '' భాష
మాట్లా డే 85 ఏళ్ళ మహిళ 2010 ఫిబవ
్ర రి లో చని పో వటం తో 65,000 సంవత్స రాల
నుండి అవిచ్చిన్నం గా ఉన్న లంకే తెగి పో యింది .లాటియా యా లో''లివోనియన్
'' భాష మాట్లా డే ఒకే ఒకరు ఇంకా ఉన్నారు .ఇప్పటి వరకు ఎనభై భాషలు ,ఆ
భాషలు మాట్లా డే జనం లేక కాల గర్భం లో కలిసి పో యాయి .ఇది చాలా ఆందో ళన కర
విషయం .
కొన్ని భాషలు భాషా సాన్కర్యం వల్ల అంతరిస్తా యి. పాత ఇంగ్లీష
అనే ఆంగ్లో సాక్సన్ భాష మోడరన్ ఇంగ్లీష వ్యాప్తి వల్ల కనుమరుగైంది .భాషా
శాస్త జ్ఞు
్ర ల లెక్క ప్రకారం 516 భాషలు కోన ఊపిరి తో మినుకు మినుకుమంటూ
చావా లేక బ్రతకా లేక ఉన్నాయంటున్నారు .ఆఫ్రికా లో 46 ,అమెరికా లో170
,ఆసియా లో12, పసిఫక్
ి లో 210 భాషలు కనుమరుగు ఆయె స్తితి లో ఉన్నాయి .ఈ
శతాబ్దం అంతానికి మాట్లా డే భాషల్లో సగం అంత రిస్తా యని హెచ్చరిక .
మనదేశవిషయానికి వస్తే -428 భాషలున్న మనకు అధికార భాషలు 22 ఉన్నాయి
.196 భాషలు ప్రమాదం అంచున ఉన్నాయి .అందులో 84 భాషలకు తీవ్ర గడ్డు స్తితి
.మరీ ముఖ్యం గా 62 తులసి తీర్దా నికి రెడీ గా ఉన్నాయి .ఒక సారి వాటి వివ
రాలను చూద్దా ం -అస్సాం లో అహో ం ,తురంగ్ భాషలు ,అండమాన్ ,పాళీ లలో
ఒకో-జువాయ్ ,టిబెటన్ బర్మా లో అకాబీ ,అకాబో ,అకా కారి ,అకా కేడీ ,అకా
కోరా ,అకా బాలే లు అంత రించి పో యి నాగరకత కు సంస్కృతికీ వికాసానికి దో హదం
చేసినవి నిష్క్రమించి ఆందో ళన కు గురి చేస్తు న్నాయి .అతి కొద్ది మంది జనం
మాట్లా డే భాషల గురించి వింటే గుండె తరుక్కు పో తుంది .అండమాన్ లో ని జేరు
భాషనూ కేవలం ఏడుగురు మాట్లా డుతున్నారు .అక్కడిదే అయిన మరోభాష జార్వా ను
మాట్లా డే వారు 250 మంది మాత్రమె .అక్కడివే అయిన ఒంగే ను వందమంది ,ఆ
పూకిక్వార్ భాషను24 మంది అస్సాం లోని ఖామ్యంగ్ భాష ను కేవలం యాభై మంది
,ఒరిస్సా లోని పరాంగ్ భాషను 76 మంది ,ఉత్త రాఖండ్ లోని జాద్భాష మాట్లా డే
వారు మూడొందలు మాత్రమె ఉన్నారు అంటే భాషలు ఎంత తీవ్ర వేగం తో కాల గర్భాన
కలిసి పో తున్నాయో తెలుస్తో ంది .
ఇలా ఆందో ళన పది నిశ్చేష్టు లై చైతన్య రహితం గా ఉండటమేనా
?లేక భాషా పునరుద్ధరణ కార్య క్రమాలు ఏమైనా జరుగు తున్నాయా అని మనకు అను
మానం రావటం సహజం .ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి .భాషలను బతికించు కొనే
ప్రయత్నాలను తీవ్రం గానే చేస్తు న్నారు .దీనికి కొన్ని ఉదాహరణలు -బ్రిటన్
లోని యూని వర్సేల్ భాష అని పిలువ బడ్డ ''కార్న్ వాల్లో ని ''కార్నిష్
''భాష మాట్లా డే వారు 1990 లో దాదాపు అంత రించి పో తే పటిష్టమైన చర్యలను
తీసుకోవటం వల్ల ఇప్పుడు 300 మంది ఆ భాషను నేర్చుకొని సజీవం గా ఉంచారు
.హాట్స్ ఆఫ్ .అలాగే ఐస్ లాండ్ లో ఇంగ్లీష భాష టో సంకరం కా కుండా వాళ్ళ
భాష లో పదాలను సృష్టించుకొని చక్కగా వాడుకొంటూ భాషను
బతికిన్చుకొంటున్నారు .
ఆంద్ర ప్రదేశ్ లో భాష లను పునరుజ్జీవింప జేయటానికి భాషో ద్యమ
ఉద్యమాలను చేబట్టా రు /''తెలుగు లో మాట్లా డటం జన్మ హక్కు ''అనే నినాదం
పెరిగింది .ఆంగ్ల మాధ్యమాన్ని తగ్గించామనే ఆందో ళన చే బట్టు తున్నారు
.తెలుగు భాషా సంఘాలు తెలుగు భాషా సంస్కృతికి అనేక పధకాలను ప్రభుత్వానికి
సూచించి అమలు చేయటానికి ఒత్తి డి తెస్తు న్నాయి .ఇప్పుడు తెలుగు అధికార భాష
గా ఉన్నా ఆ సంఘానికి అధ్యక్షుడు లేడు .తెలుగు అకాడెమీ లేదు .తెలుగు భాష
కు మంత్రి లేడు'ఎంతో ఒత్తి డి మీద నాలుగేళ్ల క్రితం తెలుగు కు ప్రా చీన
హో దా లభించినా ఇంకా అధ్యయన కేంద్రం కేంద్ర గ్రా ంటు రాలేదు .అసలు మంత్రు లు
శాసన ,లోక సభ సభ్యులు ఈ దిశా గా చేయాల్సిన ప్రయత్నం చేసింది తక్కువే
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఈ విషయాలలో అనేక చైతన్య
యాత్రలను జరిపి ప్రజలకు విషయాలను తెలియ జేసింది .తెలుగు ను కోర్టు లలో
అమలు జేసే విషయం లో సెమినార్ నిర్వ హించింది .రె ''తెలుగు రచయితల ప్రపంచ
మహా సభలు''రెండింటిని విజయ వాడ లో అతి ఉత్సాహం గా నిర్వహించి అందరి
దృష్టిని ఆకర్షించింది .రెండ వ సభల అనంతరం ఆధునిక సాంకేతి కతను జోడించి
తెలుగు ను విశ్వ వ్యాపితం చేసే ఆలోచన చేసి కొత్త ఫాంటులను ఆవిష్కరింప
జేసి అంతర్జా లం లో తెలుగు వ్యాప్తికి కృషి చేసింది .ఈ సంఘానికి
అధ్యక్షకార్య దర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు డా.జి వి.పూర్ణ చాద్
ల సేవలు నిరుప మానం .వీరికి మార్గ దర్శనం చేస్తు న్న వారు శ్రీ మండలి
బుద్ధ ప్రసాద్ .,యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు .అలానే తెలుగు
భాషో ద్యమాన్ని తమ భుజ స్కంధాల పై మోస్తు , వయస్సు ను కూడా లెక్క జేయ
కుండా అవిశ్రా ంతం గా కృషి చేస్తు న్న మాన్యులు శ్రీ సి.ధర్మా రావు ,శ్రీ
సామల రమేష్ బాబు గార్ల సేవ లు మాటలతో చెప్ప లేనంతటి ఉత్క్రుష్ట మైనవి .
భాషను రక్షిస్తే అది మనల్ని రక్షిస్తు ంది అని అందరు
గుర్తించాలి .మాత్రు భాష ఔన్నత్యాన్ని తెలుసు కోవాలి ఇంటి భాష గా తెలుగు
లో మాట్లా డాలి .మన పిల్లలతో తెలుగు లో మాట్ల డించాలి . ఈ ''భాషా ఘోష ''
అంతటా నిన దించాలి .--''భాష ఆలోచన కు ఆహార్యం ''--''నా మెదడు లోని
ఆలోచనలను నీ మెదడు లోనికి శస్త ్ర చికిత్స లేకుండా ప్రవేశ పెట్టేదే భాష
''అన్నారు మహాను భావులు .
ఈ వ్యాసానికి ఎక్కువ ఆధారం శ్రీ ఏం.యెన్.శాస్త్రి
-(ముంబాయ్) గారు రాసిన''world demographic trends అనే పుస్త కం లోని
languages అనే వ్యాసం .ఈ పుస్త కాన్ని నాకు పంపి నన్ను చది వించిన నా
మిత్రు లుశ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సాహిత్య ఋణం తీర్చు కోలేనిది .
అమెరికా ఊసులు --11—
అమెరికా 20 వ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన జేమ్స్ అబ్రా ం గార్ ఫీల్డ్ 1881 మార్చి 4 న పదవీ స్వీకార ప్రమాణం
చేశాడు .కాని పదవిలోకి వచ్చిన నాలుగు నెలల లోపే న్యు జెర్సి లోని అల్బెరాన్ లో ''చార్లెస్ గుటయు ''అనే దుండగుడి
కాల్పులకు గురైనాడు .సెప్టెంబర్ 19 న పాపం మరణించాడు .లింకన్ తర్వాత దుండగుడి కాల్పుల్లో వెంటనే చని పో యిన
ప్రెసిడెంట్ ఈయనే .పదవిలో గట్టిగా ఆరు నెలల పదిహేను రోజులు మాత్రమె ఉన్నాడు .
గార్ఫీల్డ్ పదవీ స్వీకారం చేసే టప్పుడు ఎనభై ఏళ్ళ అతని తల్లి ఎలిజా కూడా వైట్ హౌస్ కు వచ్చి హాజరై స్వయం
గా చూసింది .అలా యే ప్రెసిడెంట్ తల్లి అప్పటి వరకు తన కొడుకు ప్రమాణ స్వీకారాన్ని చూసి ఉండలేదట . అదో రికార్డు .
గార్ ఫీల్డ్ అధ్యక్ష భవనాల గేట్ల వద్ద సో ల్జే ర్లను కాపలా ఉంచటానికి వ్యతి రేకిన్చాడ ట . అధ్యక్ష భవనం లోఅతిధుల
కోసం జరిగే విందులు ,వినోదాలు ఆయె ఖర్చు అంతా తనకు వచ్చే జీతం లోంచే ఖర్చు చేసే వాడట .
అమెరికా లో మొదటి సారిగారెడ్ క్రా స్ అంతర్జా తీయ సహాయక సంస్థ గా జెనీవా ఒప్పందాన్ని అమలు పరచ టా నికి
అమెరికా లో దీనికోసం క్లా రా బార్టన్ అనే ఆ సంస్థ ప్రతినిధి కోరితే వెంటనే రెడ్ క్రా స్ సంస్థను ఏర్పాటు చేసిన ఘనత గార్ఫీల్డు
దే.గార్ ఫీల్డు నే దానికి నాయకత్వం వహించమని కోరితే ఆమె నే దానికి నాయకురాలిని చేశాడు .దీనికి అమెరికన్ కాంగ్రెస్
అంగీకారం కావాలి .దాన్ని కూడా చేశాడు .గార్ ఫీల్డ్ తన మంత్రి వర్గ ం లో అబ్రహాం లింకన్ కుమారుడు తాడ్ లింకన్ ను
secretary of war ''ను చేశాడు .
గార్ఫీల్డు కు తాను చదివిన ప్రతి పుస్త కం వివ రాలు రాసుకోవటం అలవాటు .తన స్నేహితులకు సంవత్సరం
చివరలో ఆ సంవత్సరం లో తన విజయాలు ,అపజయాలు ఉత్త రాల ద్వారా రాయటం కూడా అలవాటుగా ఉండేది .అధ్యక్షుడైన
తర్వాతస్నేహితునికి జాబు రాస్తూ వైన్ లేకుండా డిన్నర్ చేసుకోన్నామని గర్వం గా రాసుకొన్నాడు (sine vino ).
కాల్పులు జరిగి వైట్ హౌస్ లో ఉన్న ప్పుడు వైస్ ప్రెసిడెంట్ చెస్టర్ యే.ఆర్ధర్ పరా మర్శించ టానికి వస్తే
అనుమతించలేదు .అతను అక్కడున్న వారితో తన మనసు లోని కోర్కెను నర్మ గర్భం గా బయట పెట్టా డు '' god knows i
donot want the place .i was never elected to ''అన్నాడు .
గార్ఫీల్డు కు బుల్లెట్ శరీరం లో ఉండి పో యి ఇన్ఫెక్షన్ వచ్చి ,కుడి వైపు పక్ష వాతం వచ్చి ,బరువు సగానికి సగం
తగ్గి జ్వరం రక్త ం చీము కారి చని పో యాడు .అతన్ని కాల్చిన' గుటయు ''కు మతి స్తిమితం లేదని 160 మంది డాక్టర్లు ఒక
పిటీషన్ ఇచ్చినా, దాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆర్ధ ర్ తిరస్కరించాడు .అయినా వాడిని ఉరి తీసి చంపారు .ప్రెసిడెంట్ గార్ ఫీల్డు
కాలేయం దగ్గ ర చేరిన తుపాకి గుండు ను పరీక్షించే టప్పుడు డాక్టర్లు స్టెరిలైజేషన్ పద్ధతులను, అంటి సెప్టిక్ పద్ధతులను
పాటించ లేదనే అభి యోగం ఉంది .
గార్ ఫీల్డ్ జీవించిన 49 ఏళ్ళ కాలం లో సగం కాలం దేశానికి సేవ లందించాడు .ఈయన పదవి లోకి వచ్చిన పదిరోజుల్లో
రష్యా లోని జార్ చక్ర వర్తి రెండవ అలెగ్జా ండర్ హత్యకు గురైనాడు .ఇంకా కొంత మంది ఐరోపా నాయకులు హత్య గా వింప
బడ్డా రు .ఈ విషయాలన్నీ తెలిసినా ఆయన ''assasination can no more be guarded against than death ,by
lightning -it is best not to worry about either '' అని తేలిగ్గా తీసుకొన్న వాడు .ఈయన అమెరికా సైన్యానికి జెనరల్ గా
కూడా పని చేసిన ధైర్య శాలి .
రిపబ్లి కన్ పార్టి ప్రెసిడెంట్ కాండి డేట్ నుసమా వేశం నిర్వ హిస్తు ండగా హేమా హేమీలు పో టీ పడ్డా రు .ఈయన
సీన్ లో లేడు ''ఈయనను ''బ్లా క్ హార్స్''అన్నారు .కాని అందరు చివరికి ఈయన్నే సమర్ధించారు .కొద్ది మెజారిటి తో అధ్యక్షుని
గా గెలిచాడు .1878 లో అమెరికా హౌస్ ఆఫ్ రిపజ
్ర ెంట టివ్ లకు మైనారిటీ నాయకుడ యాడు
గార్ఫీల్డ్ 1831 లో ohio రాష్ట ం్ర లో orange toun ship లో జన్మించాడు .పది హేడు ఏళ్లకు ఈవెనింగ్ స్టా ర్ అనే
నౌకకు కెనాల్ బాయ్ గా పని చేశాడు .geauga అకాడెమీ లో చదివాడు .disciples of christ church లో మత బో ధకుడు గా
పని చేశాడు .హిరం కాలేజి లోని western reserve electic institute లోను ,ఆ తర్వాతా విలియమ్స్ కాలేజి లోను చదివాడు
.విలియమ్స్ నుంచే గ్రా డ్యు ఎట్ అయాడు . ఎల్క్టిక్ కాలేజి ఫాకల్ టిసభ్యుడయాడు .ఆ సంస్థకు ప్రెసిడెంట్ అయాడు
గార్ ఫీల్డ్ '' లుక్రేషియా ''అనే ఆమె ను వివాహం చేసుకొన్నాడు 1959.లో అంటే ఇరవై ఎనిమిదేళ్ళకు ఒహాయో సెనేట
సభ్యుడిగా ఎన్నికయాడు .స్వంతం గా, ''లా'' పుస్త కాలు చదివి, పాసై లాయర్ అయాడు .యూనియన్ ఆర్మీ లో చేరి ,కెంటకి
,తెనిసీ లకు సేనను నడిపాడు .ముప్ఫై ఒకటవ ఏడాదిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రేసెంట టివ్ గా ఎన్నికయాడు .1863 లో
మేజర్ జెనరల్ గా పదో న్నతి పొ ందాడు .బాంకింగ్ అండ్ కామర్సు కు హౌస్ కమిటీ చైర్మన్ అయాడు .రెండేళ్ళ తర్వాతా
అప్రా ప్రిఎషన్ కమిటీ చైర్మన్ అయాడు .1877 ప్రెసిడెంట్ ఎన్నికలలో వివాదం వస్తే దాన్ని పరిష్కరించే electoral committee
కి ప్రభుత్వం చె నియమింప బడి అన్నిటిని కూలం కషం గా అధ్యయనం చేసి రిపబ్లి కన్ పార్టి అభ్యర్ధి hayes కే మెజార్టి ఉందని
నివేదిక ఇచ్చాడు .ఈ వివాదం ఆమధ్య జార్జి w బుష్ కు ఆల్ గోరె(2000)కు మెజార్టి మీద వచ్చిన చిక్కు ముడి లాంటిదే .
గార్ ఫీల్డ్ మహా వక్త గా ప్రఖ్యాతి పొ ందాడు .అరగంట కు ఒక ఉపన్యాసం చొప్పున ఒకే రోజు ఇరవై
ఉపన్యాసాలు ఇచ్చిన ఘనుడు .ఆయన కు లాటిన్, గ్రీక్ లభాష ల పై మహా భి నివేశం ఉంది .ఆ రెండు భాషల్లో రాయ గలడు
మాట్లా డ గలడు.అసలు ఆయన ది ''పుర్ర చేతి వాటం ''.ఆతర్వాత కుడి చేత్తో కూడా రాయటం అల వాటు చేసుకొన్నాడు .ఒక
చేతితో గ్రీకు భాషను ,ఇంకో చేత్తో లాటిన్ భాషను ఒకే సారి రాసే ''సవ్య సాచి'' అయాడు .సాధనమున పనులు సమకూరు
అనే దానికి నిదర్శనం గార్ఫీల్డ్ .ఆయన మాట్లా డే శైలికి ముగ్దు లయే వారు .జీవితాంతం ఒక ''చేతి రాత ప్రతి'' గా జర్నల్
నడిపాడు .తన సామర్ధ ్యం మీద నమ్మకం ఉంది .తాను క్లా స్ లో మొదటి స్థా నాన్ని సంపాదించాలి అనుకొని ,కష్ట పడి
సాధించాడు '' to stand at first or die .i believe i can do it .,if granted a fair trial ''అని రాసుకొన్నాడు .
ఫీల్డు - కెనాల్ బాయ్ గా ఉన్నప్పుడు 14 సార్లు నదిలో పడి మునిగి పో యాడు చలి లో తానే ఏదో విధం గా బయట
పడే వాడు .ఖాళీ దొరికితే ఏదో పని చేసి డబ్బు సంపాదించే వాడు .ఫారం హౌస్ లో పని చేసే వాడు .తల్లికి బాగా సాయం చేసే
వాడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు .అన్నిటికీ అమ్మే .బైబుల్ ను తానే స్వయం గా చదవటం నేర్చుకొన్నాడు
ఎనిమిదేల్లకే ''బెస్ట్ రీడర్ ''అని పించుకొన్నాడు .రాబిన్సన్ క్రూ సో నవలన్నా ,నెపో లియన్ సాహస గాధలన్నా మహా ఇష్ట పడే
వాడు .డిబేటింగ్ లో ఎప్పుడూ ఇతనికే బహుమతి లభించేది .ఇళ్లకు కంచే వేసే వాడు .వంద అడుగులకు డెబ్భై అయిదు
సెంట్లు సంపాదించే వాడు . ఆ కాలం లో బడులుఎలా ఉండేవో తెలుసా -వేసవి ,శీతా కాలాల లోనే పిల్లలు స్కూళ్లకు
కు వెళ్ళే వారు .మిగిలిన సమయాల్లో పొ లం పనులు .అందరికి ఒక టే గది .ఆడ పిల్లలు ఒక పక్కా మగ వాళ్ళు ఒక పక్క
.అన్నీ బట్టీ పట్టించటమే .బడి లో ఒక స్ట వ్ ,నీళ్ళ బకెట్ ,మాత్రమె ఉండేవి .కింద కూర్చునే చదువు .ఎనిమిదో క్లా స్ వరకే
చదువు .క్లా సులో మగ పిల్లలు ''మహా ముదుళ్ళు'' గా ఉండే వారు .మాష్టా రిని చదువు చెప్ప నిచ్చే వారు కాదు .అన్నిటికీ
అడ్డు కొనే వారు . .మాస్టా రు రాక ముందే స్కూల్ గేటు మూసే సే వారు . ఆయన లోపలి రాగలిగితే ఆ రోజు బడి ఉన్నట్టు లేక
పో తే బెల్ కొట్టి ఇంటికి చెక్కే యటమే .ఇదీ1840-50 ప్రా ంతం లో గ్రా మీణ విద్యాలయాల స్థితి .మనం మాత్రం దీనికేమీ తీసి
పో లేదేమో .వీటినే మన వాళ్ళు ''వానా కాలం చదువులు ''అన్నారు .
బానిసత్వాన్ని నిర్మూలించాలి అనే ధ్యేయం ఉన్న వాడు గార్ ఫీల్డ్ .1862 లో ఇరవై వ బ్రిగేడ్ నాయకుడి గా
ఉన్నప్పుడు ఒక బానిస -యజమాని నుంచి తప్పించుకొని పారి పో యి ఇతని ఆశ్రయం చేరాడు .ఇది తెలుసు కొన్న పై
అధికారి అతన్ని యజమానికి అప్ప గించమని హుకుం జారీ చేశాడు .''నేను ఆ పని చేయలేను చేయను ''అని ఖచ్చితం గా
చెప్పాడు ఫీల్డ్ .ఇది ఒక రకం గా ఆజ్ఞ ను ఉల్ల ంఘిన్చటమే .తీవ్ర నేరమే .కాని ఇతని సచ్చీలత ను చూసి ఎవరూ దాన్ని తీవ్రం
గా తీసుకో లేదు . ఆ తర్వాతా ఒక సాధారణ సూచన జారీ అయింది .దా ని ప్రకారం సైన్యం చేతికి చిక్కిన బానిస లను యజ
మానులకు ఇవ్వ రాదు .ఆ రోజుల్లో ku klux klan అనే సంస్థ పూర్వపు బానిసలకు వారి హక్కు లను కోరే వీలు లేదు అని
వాదించేది .
ఫీల్డు -హౌస్ లో అప్రా ప్రిఎషన్ కమిటీ లో పని చేసి నపుడు రోజుకు 15 గంటలు పని చేసే వాడు .ఇలా మూడు
నెలలు చేశాడు . చక్కని సంస్కరణలు సూచించాడు .నేటివ్ అమెరికన్ లకు కూడా పూర్తి పౌరసత్వం ఇవ్వాలని వాదించాడు
.వాషింగటన్ లో సెనేటర్ గా ఉన్న ప్పుడు ఇంటికి ఉత్త రాలు రాసే వాడు .అందులో పిల్లలకు జాగ్రఫీ హిస్టరీ పాథాలు
,పజిల్సుపంపించే వాడు .
ఆ రోజుల్లో green backers అనే రాజ కీయ పార్టి ఉండేది .వీళ్ళు రైతు అనుకూలురు .ఇది కాక ''ప్రొ హి బిషన్ పార్టి
''అనే ఇంకో పార్టి ఉండేది .వీళ్ళు దేశం లో ఆల్కహాల్ అమ్మ కుండా చేయాలి అని కోరే వారు .ఇదీ గార్ ఫీల్డు గారి నాటి
ఒహాయో తదితర రాష్ట్రా లలో ఉన్న పరిస్తితి
తెలుపు -నలుపు
ఫిలిప్స్ వీట్లీ అనే ఆమె మొదటి ఆఫ్రికన్ రచయిత .ఆమే ఆఫ్రికా లో1753 లో సేనేగాల్ లో జన్మించింది .ఆమె బందీ గా పట్టు
బడి ,ఏడేళ్ళ వయసు లలోనే బానిస గా అమ్ముడు అయి పో యింది . ఆమె1773 నుంచి అంటే పద్దెనిమిదేళ్ళ వయసు నుండి
కవిత్వం రాసింది .ఆమె కవిత లంటే అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్ టన్ మురిసి పో యే వాడు .ఆయన కోసం
ఆమె ఒక కవిత ను కూడా రాసింది .అమెరికా దేశతెల్ల జాతి '' లి బెరల్ రచయిత'' హార్రిఎట్ బీచేర్ స్టొ వ్1852 లో బానిసల
నికృష్ట జీవితాన్ని''అంకుల్ సాంస్ కేబిన్ '' ఫిక్షన్ గా రాశాడు .దానిని ఎందేరెందరో చదివి మెచ్చారు .
1930-70 మధ్య డిప్రెషన్ కాలం లో నాలుగు మిలియన్ల మంది ఆఫ్రికన్ అమెరికన్లు దక్షిణ రాష్ట్రా ల నుండి ,ఉత్త ర
రాష్ట్రా లకు వలస వెళ్లా రు .ఆ కాలం లో'' షేర్ క్రా ప్పింగ్ ''ఉండేది .పొ లం లో పంట పండిస్తూ ,పండిన దాన్లో సగం యజమానికి
ఇవ్చ్చే వారు .పెట్టు బడులన్ని నల్ల వారివి ,కష్ట ం కూడా వారిదే .కాని ఫలితం లో సగం తెల్ల యజ మానిది .ఈ వ్యవసాయం
గిట్టక వలస లేక్కువ అయాయి .నల్ల జాతి వారికి చదువులు లేవు .పెద్ద వాళ్ళు పిల్లలకు కధలు చెప్పి కొద్దో గొప్పో జ్ఞా నం
కల్గించేవారు
అమెరికా లో 1930 నాటికి నీలి కళ్ళు ఉన్న అమ్మాయిలూ అంటే క్రేజు ఎక్కువ గా ఉండేది .shirley temple అనే
బాలసినీ నటి బంగారు వంకీల జుట్టు ,నీలి కళ్ళ తో అందర్ని ఆకర్షించేది.ఈ అమ్మాయికి అందరి కంటే పారి తోషికం ఎక్కువ
ఇచ్చే వారు .ఆ అమ్మాయి బాగా పాడేది ,డాన్సు చేసేది .అప్పటికి ఆ పిల్ల వయస్సు ఆరేళ్ళు మాత్రమె .ఆ వయసు లోనే ఆ
చిన్నారి అకాడెమి అవార్డు పొ ంది ,అందర్ని ఆశ్చర్య పడేట్లు చేసింది .ఆమె ముఖ చిత్రం తో రికార్డు లు ,మగ్గు లు ,షరతులు
,హాట్లు ,గిఫ్ట్ కార్డు లు వచ్చాయి .
రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో అమెరికా లోని పెరల్ హార్బర్ దాడి లో అమెరికా సైన్యం లో వీరోచితం గా
పో రాడిన ఆఫ్రికన్ అమెరికన్ నావికుడు డో రీ మిల్ల ర్ కు నేవీ క్రా స్ ను మొదటి సారిగా అందజేశారు .ఒక నల్ల జాతీయుడు ఈ
అవార్డు అందుకోవటం ఇదే మొదలు
1943 లో అలబామా లో మొబైల్ అనే చోట నల్ల జాతి వారికి పన్నెండు మందికి షిప్ యార్డ్ లో ప్రొ మోషన్ ఇచ్చి
నందుకు తెల్ల జాతీయులు రెచ్చి పో యి ,విధ్వంసానికి దిగారు . .
1930-40 కాలం లో తరచూ గా తెల్ల వారు నల్ల వారి పై దాడులు చేసి హింస సృష్టించే వారు .తెల్ల వారు నల్ల వారిని
చెట్టు కు తాళ్ళ తో వేలాడ దీసే వారు .దాన్ని చూసి తెల్ల మూక ఆనందం తో గంతు లెసే వారు .1940 లో ఆఫ్రికన్ అమెరికన్
ల కడ గండ్ల ను కళ్ళకు కట్టించే రచన ''native son ''వచ్చింది .దీన్ని రాసిన నల్ల జాతి రచయిత richard wright కు సాహిత్యం
లో ప్రముఖ స్తా నం లభించింది .1952 లోRalph Ellison రాసిన'' the invisible man ''లో నల్ల జాతి వారి ఐడెంటిటి ని
స్తిరపరిచింది .కనీ పించని మనిషి అంటే ,గుర్తింపు లేని నల్ల జాతి అని సింబాలిక్ గా చెప్పిన రచన ఆది . వందేళ్ళ పో రాటం
వల్ల వారికి సమాన హక్కులు లభించాయి .
.1957 లో కూడా ఆ హక్కు వచ్చినా ,లిటిల్ రాక్ అనే ఆర్కాన్సాస్ లోని ఊళ్ళో సెంట్రల్ హై స్కూల్ లో చేర
టానికి ,తొమ్మిది మంది నల్ల విద్యార్ధు లు ప్రయత్నించారు .రాష్ట ్ర గవర్నర్ ఆర్వెల్ ఫాబాస్ నేషనల్ గార్డు లతో వారిని అడ్డ
గిన్చేట్లు చేశాడు .సివి రైట్స్ ను సమర్ధించి అమలు చేస్తు న్న ప్రెసిడెంట్ ''ఐసెన్ హో వేర్'' వె య్యి మంది సైనీకు లను పంపి ,ఆ
పిల్లలు స్కూల్ లోకి వేల్లెట్లు చేయించాడు .దీనితో ఆగలేదు .1960 నవంబర్ పధ్నాలుగున ఆరేళ్ళ నల్ల పిల్ల రూబీ బ్రిడ్జెస్
స్కూల్ లోకి ప్రవేశిస్తు ంటే ,గేటు వద్ద తెల్ల వారు హేళన చేశారు .ఫెడరల్ మార్శల్సు సహాయం చేసి ,ఆ అమ్మాయిని లోపలి
పంపారు .దీనికి ప్రతి స్పందన గా తమ పిల్లల్ని ఆ స్కూల్ నుంచి తెల్ల వాళ్ళు మాన్పించారు .ఆ పిల్ల ఒక్కతే అక్కడ ఆ ఏడాది
అంతా చదువు కొంది .ఈ విషయాన్ని'' నార్మన్ రాక వెల్ ''అనే చిత్ర కారుడు గొప్ప పెయింటింగ్ వేసి ''the problem we all
live with ''అని పేరు పెట్టా డు .1960 నాటికి తెల్ల వారి జీతం లో సుమారు నలభై నుండి అరవై శాతమే నల్ల వారి జీతం .దీని పై
స్పందించిన నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్టీన్ బెక్ ''the big maarshals stood her on the curb and a jangle of
jeering shrieks went up from behind the barri cades .the little girl didi not look at the howling croud but from
the side the whites of her eyes showed like those of a frightened faun ''అని అక్షర శిల్పం గా చెక్కాడు .
అమెరికా లో వంద ''హిష్టా రికల్లి బ్లా క్ కాలేజీలు యూని వేర్సిటీలు ''1964 ముందే ఏర్పడ్డా యి .ఆఫ్రికన్ అమెరికన్లు
అందరు వీటి లోనే చదివి పైకి వచ్చారు .వీటిలో చదివిన నల్ల ప్రముఖుల్లో ఆండ్రూ యంగ్ ,du bois ,oprah winfrey వంటి
వారున్నారు .అలబామా లో1955 december 1 న రోసా పార్కర్ అనే నల్ల జాతీయురాలు బస లో తాను కూర్చున్న సీటు ను
తెల్ల జాతీ యుడికి ఇవ్వ నందుకు ఆమెను అరెస్టు చేశారు .దానికి వ్యతి రేకం గా యాభై వేల మంది ఒక ఏడాది పాటు బస్సు
లను బాయ్ కాట్ చేశారు .దీనికి ప్రపంచం అంతా సానుభూతి ప్రకటించి ,నల్ల జాతీయులకు పూర్తీ మద్దతు ప్రకటించింది
.1956 లో సుప్రీం కోర్టు వివక్ష తగదని తీర్పునిచ్చింది .అప్పుడే పౌరహక్కులకు ప్రా తి పదిక ఏర్పడింది .ఆ తర్వాతా మార్టిన్
లూధర్ కింగ్ నల్ల జాతి పౌరహక్కుల కోసం తీవ్ర ఉద్యమం నడి పాడు .1968 august 28 న వాషింగ్ టన్ డి.సి.లో రెండు
లక్షల మంది తో భారీ ప్రదర్శన నిర్వ హించి నల్ల జాతి అస్తిత్వం ప్రదర్శించాడు .ప్రెసిడెంట్ కేన్నెడి''no city or state or
legisletive body can prudently choose to ignore rights for equality ''అని ప్రకటి మ్ చాడు .1964 july 2 న ప్రెసిడెంట్
జాన్సన్ పౌరహక్కుల చట్ట ం చేశాడు .ఆ సందర్భం గా ఆయన చారిత్రా త్మక మైన ఉపన్యాసం ఇచ్చాడు ''we believe that all
men are equal .yet many are denied equal treat ment .we believe that all men have certain rights .yet many
americans do not enjoy those rights .we believe that all men are entitled to the blessings of liberty .yet
millions are being deprived of those blessings .not because of their own failure ,but because of the color of
their skin .but it can not continue.''
క్రమంగా నల్ల వారు అన్నిటా ముందుకు వచ్చారు ''నలుపు చాలా ముఖ్యం ''అనే నినాదం పెరిగింది .బ్లా క్ ఈస్
గోల్డ్ అన్నారు .అలంకరణ సామగ్రి మీద ,''ఆఫ్రో ''అనే బ్రా ండ్ ఉంటేనే వారు కొనే వారు .సిని మాల లో తెల్ల వారిదే సామ్రా జ్యం
.తర్వాతా నల్ల వారు దున్నేశారు .hattie mc Daniel అనే ఆఫ్రికన్ అమెరికన్ నటి ఆస్కార్ అవార్డు అందు కొన్న మొదటి నల్ల
జాతీయు రాలు .అదీ సహాయ నాయిక పాత్రకే .ఆ సినిమా'' gone with the wind''.1940-50 ల మధ్య లీనా హార్నే ,dorothi
dandridge లు అత్యధిక పారితోషికం తీసుకొన్న నల్ల నటులు .దో రోతీ ముఖ చిత్రం తో లైఫ్ మేగజైన్ వచ్చింది .ఇది అపూర్వం
.బెస్ట్ ఆక్త్రేస్ గా అకాడెమీ అవార్డు కు నామినేట్ అయిన మొదటి నల్ల మహిళ .ఆ తర్వాత ఆమె అవకాశాలు తగ్గా యి ఆమె
బాధ పడుతూ ''if i were white ,i could capture the world '' అన్నది ఆమెను లైఫ్ మేగజైన్ అందాల రాశి గా అభి
వర్ణించింది .తెల్ల మహిళల కు దీటు గా నల్ల వారు నటన లో మెప్పించారు .josephine beker అనే నల్ల జాతి స్త్రీ ''the black
venus ''గా విపరీతం గా ప్రా ముఖ్యం పొ ందింది .నల్ల జాతి సంగీత జ్నులు దున్నేశారు .ఆటల్లో కూడా వారే ముందున్నారు
.ఎన్నో మత సంస్థల్లో వారు ప్రముఖ పాత్ర వహిస్తు న్నారు .
టోనీ మారిసాన్ అనే ఆఫ్రో అమెరికన్ రచయిత రాసిన ;;the bluest eyes '' నవలకు పులిట్జర్ బహు మతి
లభించింది అలాగే gwendolyn brooks అంతకు ముందే we real cool అన్నదానికి పులిట్జర్ సాధించిన మొదటి నల్ల
రచయిత అని పించుకోన్నది .1981march ''time maagazine '' మారిసన్ ముఖ చిత్రం తో వెలువడి నల్ల వారి కీర్తిని
పెంపొ ందింప జేసింది .1993 టోనీ మారిసాన్ కు సాహిత్యం లో అత్యున్నత ''నోబెల్ పురస్కారం ''లభించింది దీన్ని పొ ందిన
మొదటి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత ఈమె .ఈమెతో కలిసి నోబెల్ సాహిత్య బహు మతి పొ ందిన మహిళలు ఎనిమిది మంది
మాత్రమె .అవార్దింగ్ కమిటీ ''maarison 's novels gave life to an essential aspect of american reality ''అని
ప్రశంసించింది .మాయా ఆన్జేలో ,ఆలిస్ వాకర్ లు గొప్ప ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రు లు .ఈ ప్రగతి అంతా ఎన్నో ఏళ్ళకృషి
,పట్టు దల ,అంకిత భావం ఉద్యమాలు ,అస్తిత్వ నిరూపణ ,హక్కుల సాధన వల్ల జరిగింది .1980 లో టోనీ ivy league
university కి ప్రొ ఫెసర్ అయిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ .ఆమెకు national humanities medal ను2000 లో ఇచ్చి
అత్యున్నత గౌరవాన్ని కల్పించారు .ఆమె సందేశం అందరికీ ప్రేరణ ''i was always interested in efforts people make to
thrive ,survive ,and to relate to one another ..the search for love and identity runs through most every thing i
write ''అందుకే ఆమెను 'she was honoured for her work that celebrated our diversity ,tested our beliefs and
connected us to each other and our common humanity ''అని ప్రశంసించారు 'ఇదీ
జనాభా విస్ఫోటనం
అణు బాంబు పేలితే ఎంత అనర్ధ ం జరుగుతుందో ,జనాభా పెరిగినా అంతే అనర్ధ ం జరుగునది కనుక జనాభా
పెరుగుదలను ''జనాభా విస్ఫోటనం అన్నారు .ఇప్పటికే విపరీత జనాభా తో ప్రపంచం కలత చెందు తోని .ఆహారధాన్యాలు
చాలటం లేడు .శక్తి వనరులు కుంచించుకు పో తున్నాయి .తాగునీటికీ ,సాగునీటికీ కరువోచ్చేసింది .జనాభా కు నిలవటానికి
నీడ కూడా దొరకని స్థితి .ఇంకో ముప్ఫై ఏళ్లలో జనాబా బాంబు బద్దలైతే తట్టు కొనే పరిస్తితి లేదని గనాక శాస్త ్ర వేత్తలు గగ్గో లు
పెడుతున్నారు .ఒక్క సారి ఈ బాంబు దాడి ఎలా ఉంటుందో చూద్దా ం .
శీతోష్ణ స్తితి లో మార్పులు, ఖనిజ నూనెలు వాయువుల విపరీత మైన వాడకం వల్ల కలుగుతున్నాయి .భూమి మీద
నీరు కలుషిత మై పో తోంది .అడవుల నరుకు లాట పర్యావరణానికి హాని కల్గిస్తో ంది .దీనితో జనం భవిష్యత్తు ఎలా ఉంటుందో
నని భయం పట్టు కోంది .ఎక్కువ ఆహారం పండించాలంటే చాలా ఖర్చవుతోంది .ఒక్క శాతం ఆహారం పెంచటానికి నాలుగున్నర
రెట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది .ఉన్న వనరులు అందరికి సమానం గా పంచటం సాధ్యం కావటం లేదు. ప్రజల జీవన ప్రమాణం
అంతటా సమానం గా లేదు .జింబాబ్వే లో చదరపు కిలో మీటర్ కు ముప్ఫై మూడు మంది మాత్రమె ఉన్నారు .అందుకని
ఎంతో ఆహారాన్ని ఇతర దేశాలకు పంప గలిగేది .అందుకే దాన్ని'' బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా'' అన్నారు ..అయితే
2007 లెక్కల ప్రకారం ఆరు మిలియన్ల మంది అక్కడ కరువు ,ఆహార కొరత తో బాధ పడుతున్నట్లు తెలుస్తో ంది .ఆస్ట్రేలియా
లో చదరపు కిలో మీటర్ కు 2.7 మంది మాత్రమె జనం ఉన్నారు .అక్కడ అన్ని రకాల సౌకర్యాలు బాగా ఎక్కువే .అందుకని
ఆస్ట్రేలియా బాగు పడాలంటే అక్కడి జనాభా జీవన ప్రమాణాన్ని తగ్గించాలి అంటున్నారు ''డేమోగ్రా ఫార్లు '' .ఇదో వింత .
2050 కి ఇథియోపియా జనాభా170 మిలియన్లు ఉంటుందని అంచనా వేస్తు న్నారు .ఇప్పటికే ఆకలి చావులు
ఎక్కువ .అక్కడ జన సాంద్రత తక్కువే .పండే పొ లమూ ఎక్కువే .అయినా తట్టు కోలేక పో తోంది .ఒక వ్యక్తికీ అవసర మైన
దాన్ని అందించటానికి కావలసిన భూమి ని'' ecological foot print'' అంటారు .ఇది ఇరవై అయిదు ఎకరాలు కావాలి .కాని
మనకున్న వనరు ఏడున్నర ఎకరాలు మాత్రమె .భూమి మీద దొరికే నీటిలో రెండున్నర శాతం మాత్రమె మంచి ఆరోగ్యకర
మైన నీరు .ఇది హిమానీ జలాల లోనే లభ్యమవుతోంది .మిగిలిన నీరంతా దాదాపు ఉప్పు నీరే .చైనా లోని ningxia ప్రా ంతం
అసలు నీటి వనరులు లేని ప్రా ంతం .అక్కడ పంట మొక్కలదగ్గ ర బొ క్కలు చేసి ప్లా స్టిక్ కవర్ల లో నీరు నిలవ చేసి బతికించాలి
నీరు లేక పో తే పంట లేనే లేదు . సముద్రా ల లోని జలాన్ని'' డీ సాలినేషన్'' పద్ధతి లో శుద్ధి చేసి మంచి నీరుగా
మార్చుకొంటున్నారు .దీని వల్ల రైతులు పంటనీరు పొ ందే అవకాశామేర్పడింది .అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకొన్న పద్ధతి
.
ప్రపంచ భూమిలో26 శాతం భూమినే మనం పంటలు పందిన్చుకోవటానికి ఉప యోగించ గలుగు తున్నాం .జనాభా
పెరిగితే అధిక పంట కావాలంటే భూ విస్తీర్ణా న్ని పెంచుకోక తప్పదు .అలాగే శక్తి వనరుల వాడకం పెరిగి పో తుంది . కనుక
ఆల్ట ర్నేట్ ఎనెర్జీ ని తయారు చేసుకోవాలి .అందుకే సూర్య కాంతిని ,విండ్ మిల్స్ను సముద్ర విద్యుత్ ను ,బయో డీసెల్ ను
తయారు చేసుకొంటున్నాము .ఇప్పుడు శాస్త ్ర వేత్తల దృష్టి కృత్రిమ జీవ పదార్ధంను'' సింత టిక్ d.N.A.'' నుంచి తయారు చేసే
ఆలోచన చేస్తు న్నారు . d.n.a ను బాక్టీరియా కు కలిపి ,వాటి ద్వారా ప్రో గ్రా మింగ్ చేసి ,బయో ఇంధనాన్ని అంటే మిథేన్ లేక
హైడ్రో జెన్ గాస్ ను తయారు చేస్తు న్నారు .ఇవి ఫాజిల్ ఇంధనాలకు బదులుకృత్రిమ ఇంధనాలుగా ఉప యోగ పడుతున్నాయి
.ఈ బాక్టీరియా ను ఆహార పదార్ధా ల నుండి సేల్ల్యులోజు ,వ్యర్ధ పదార్ధా ల నుండి ,పనికి రాని కారు టైర్ల నుండి తయారు చేసి
సెభాష్ అని పించారు. శత కోటి దరిద్రా లకు అనంత కోటి ఉపాయాలు అన్నారు కదా ..ఇవి భవిష్యత్తు లో తరగని ఇంధనం గా
మనకు పని చేస్తు ంది .అదీ శాస్త జ్ఞు
్ర ల నిరంతర పరిశోధనా ఫలితం .
u.n.సంస్థ అధ్యయన లెక్కల ప్రకారం 2050 నాటికి వలసప్రజల జనాభా 98 మిలియన్ల కు చేరుతుంది .మరణాలు
పెరిగినా వలస వల్ల జనాభా పెరుగుతుందని తేల్చారు . 1950 లెక్కల ప్రకారం ఒక మిలియన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న
సిటీలు 83 మాత్రమే ఉంటె , 2007 కు వీటి సంఖ్య 468 కి పెరిగి ముక్కు మీద వేలు వేసుకోనేట్లు చేశాయి .u.n.లెక్కల
ప్రకారం ప్రపంచం లో మొత్త ం మీద 850 మిలియన్ల జనం సరైన పో షకాహారం లేక ,ఆకలితో ,అలమటిస్తు న్నారు .ఒక
మిలియన్ జనాభాకు తాగు నీటి సౌకర్యమే లేదు . .అయితే కొంత మంది మాత్రం జనాభా చాలా తక్కువ గా ఉన్న కాలం
లోనూ ఆకలి చావులు ,బీదరికం ఉన్నాయి అంటున్నారు .పారిశ్రా మిక అభి వృద్ధి చెందిన సమాజాలలో ''పిల్లల అవసరం
తక్కువ ''అనే భావం బలీయం గా వ్యాపించి ఉంది .
అమెరికా లోని అరిజోనా రాష్ట ం్ర లోని ''ఫో నిక్స్ ''లో ముసలి వారి శాతం బాగా పెరిగి పో యి ,పని చేసే యువకుల
శాతం బాగా పడి పో యి దారుణం గా ఉందని గగ్గో లు పడుతున్నారు .దీని వల్ల నైపుణ్యం ఉన్న పని వారు తగ్గి పో యి ,ముసలి
ముఠా ను పో షించాల్సిన బాధ్యతా ,ఖర్చులు పెరిగి పో తున్నాయని ఆందో ళన చెందు తున్నారు .2006 లో సేకరించిన లెక్కల
ప్రకారం ఇంగ్లా ండు లో ఒక పిల్ల లేక పిల్లా డిని 18 ఏళ్ళు వచ్చే వరకు పెంచటానికి సగటున 86,000 డాలర్లు ఖర్చు
అవుతుందట .దీనిలో కాలేజి చదువు ,ఇల్లు ,ఆహారం ఖర్చు కలిసి ఉన్నాయి .అందిన మరో సమాచారం ప్రకారం ప్రపంచం లో
350 మిలియన్ల ఆడ వారికి తమ కుటుంబాన్ని తీర్చి దిద్దు కొన టానికి ,వసతి కల్పించుకోవటానికి తగిన సాధారణ సమాచారం
కూడా అందు బాటులో లేనే లేదట .ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప రీతం గా పెరిగి పో యిందని జబ్బలు చరచుకొనే మనం ఇంకా
సిగ్గు పడాల్సిన విషయం కాదా ఇదీ .
''తక్కువతో ఎక్కువ '' సాధించాల్సిన సమయం ఆసన్నం అయింది .రేపు రావాల్సిన విప్ల వం ఆహార ఉత్పత్తి లోనే
.దీనికి '' genetically modified''(g.m.) ఆహారం పండించటం ఒక్కటే శరణ్యం .వీటిని కూడా బాగా సార వంత మైన భూముల్లో
కాకుండా ,ఊసర క్షేత్రా లలో ,ఉప్పు ఉరిసిన భూముల్లో పండించే ఆలోచన చేయాలి .అప్పుడే తిండికి కరువు ఉండదు
.ఇప్పటికే అడవు లన్ని నరికి భూసారాన్ని నిలవ నీ కుండా చేశాం .భూమి సారమూ తగ్గి పో యింది .ఎడారులుగా భూముల్ని
మనమే మార్చి, పాపం ఒడి గట్టు కొంటున్నాం .ఆధునికవ్యవ సాయ పద్ధతులను అమలు జేసి జన పో షణ కు అందరు నడుం
కట్టా లి .అప్పుడే జనాభా విస్ఫో ట నాన్ని తట్టు కో గలం .
అమెరికా అంటే భూలోక స్వర్గ ం అని భావించటం సర్వ సాధారణం .ఇక్కడ వసతులు అంత బాగా ఉంటాయి
.ఉద్యోగస్తు లకు ఉద్యోగం ఉన్నంత వరకు హేపీ .ఇద్దరు ఉద్యోగులే అయితే మరీ హాయి .కావలసి నంత రాబడి .అన్నీ
అమర్చుకో వచ్చు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోనూ వచ్చు .స్వంత ఇల్లు ఇక్కడ ఏర్పడటం తేలికే .అన్నీ బిల్డ ర్ చేసి
పెడతాడు .ఖర్చులో ఐదో వంతు కాష్ గా కట్టే సమర్ధత ఉండాలి .'loan 'కూడా వాళ్ళే ఏర్పాటు చేయిస్తా రు .వాయిదాలు దీర్ఘ
కాలానికి తీసుకొంటారు కనుక తీర్చటం తేలికే అవుతుంది .అయితే స్వంత ఇంటి చాకిరీ కూడా ఎక్కువే .లాన్ను జాగ్రత్తగా మైన్
టైన్ చేస్తా రు .కూరగాయలు పండించు కో వచ్చు .కరెంటు పెట్రో లు చౌక .ఎక్కడికి వెళ్ళినా కారు లో వేళ్ళ వచ్చు కారు
పొ ందటమూ తేలికే .సులభ వాయిదాల మీద తీర్చుకో వచ్చు .ఇల్లు బొ మ్మరిల్లు లాగా మూడు నెలల్లో నిర్మించేస్తా రు
.కావాల్సిన మోడల్ ఎన్ను కోవటమే .వలసిన వన్నీ అమర్చు కో వచ్చు .సేల్సు ఉన్న రోజున కొంటె వస్తు వు లన్ని చౌకగా
వస్తా యి ఫర్నిచర్ తో సహా .ఆఫర్లు చాలా ఉంటాయి .నెట్ లో వెతుక్కొని ఆర్డ ర్ చేస్తే తక్కువ లోనే ఎలేక్రా నిక్స్ పొ ందచ్చు
.''దెయ్యాల పండగ ''(హాలొ వెన్ )రోజుల్లో కొత్త సంవత్సరం క్రిస్మస్ ,ఇండెపెండెన్స్ డే వగైరాలలో క్లియరెన్స్ సేల్సు లో అతి
తక్కువ డబ్బులతో అన్నీ కోని అమర్చుకో వచ్చు .పిల్ల చదువులు హాయి .హైస్కూల్ వరకు చదువు, పుస్త కాలు, బస్సు, ఫ్రీ
.ఇది ఎంతో ఉపశమనం గా ఉంటుంది .పిల్లలకు ఎప్పటి కప్పుడు పరీక్షలు పెట్టి వారి సామర్ధ్యాన్ని అంచనా వేసి ప్రత్యెక శిక్షణ
నిస్తా రు .బండ చాకిరి పిల్లలకుండదు .తెలివికీ, క్రియేటివిటీ కే ప్రా ధాన్యం .అందులో బాగా చొచ్చుకు పో వచ్చు .లైబర
్ర ీలు గొప్ప
సేవ చేస్తా యి వేసవి లో రీడింగు కు ఎక్కువ ప్రా ధాన్యత నిస్తా రు .స్కూళ్ళు తేరి ఛే సమయం లో ముందు పై తరగతి
పుస్త కాలను తెచ్చుకొని చదువు కో వచ్చు .ముఖ్యం గా ఆర్టు కు ప్రా ధాన్యత బాగా ఉంటుంది .శక్తి సామర్ధ్యాలను చూపే
అవకాశాలుంటాయి .లైబర
్ర ీ లలో కూడా ప్రత్యెక శిక్షణ నిస్తా రు .అయితే డబ్బులు కట్టు కోవాలి .కరాటే, జిమ్నాస్టిక్స్ లలో
డబ్బిచ్చి చేరి నేర్చుకో వచ్చు .వారికి మంచి ఎంకరేజ్ మెంట్ ఉంటుంది .భాషా సేవా కేంద్రా లు పో టీలు నిర్వ హించి బహు
మతులను అంద జేస్తా రు .సమ్మర్ లో y.m.c.a.వాళ్ళు ,హిందూ సెంటర్ వాళ్ళు ప్రత్యెక కోర్సులను నిర్వహించి ఆటా ,పాటా
డాన్సు నాటకం వగైరాలను స్విమ్మింగ్ ను నేర్పుతారు .దీనికి పిల్లలు బాగా ఉత్సాహం చూపిస్తా రు .అపార్టు మెంట్ల వద్దా
,కమ్మ్యూనిటీ లలో స్విమ్మింగ్పూల్సులలో పిల్లలు వేసవిలో మంచి కాల క్షేపం .సంగీతం నేర్పే వారు డాన్సు నేర్పే వారు
లెక్కలు నేర్పే వారు ఉంటారు .మన పిల్లల అభి రుచి ని బట్టి ఏర్పాటు చేసుకో వచ్చు .ఇంటికి వచ్చి కూడా చెప్పే వారున్నారు
.
ఇక్కడి మనుష్యులు చాలా స్నేహ శీలం గా అని పిస్తా రు .ఎవ్వరి జోలికీ ఎవ్వరూ సాధారణం గా రారు
.మనుష్యులలో ఆందో ళన కనీ పించదు .స్తిర చిత్త ం తో ,ప్రశాంతం గా ఉండటం గమనార్హం .ముసలి వారు కూడా లైబర
్ర ీలకు
కారు నడుపు కొంటూ వచ్చి పుస్త కాలు తీసుకొని వెళ్లి చదువుతారు .షాపింగుకు వస్తా రు .వాళ్ళను చూస్తు ంటే'' అసహాయ
శూరులు ''అని పిస్తా రు .నవ్వు ముఖం తో పలకరించి ''హాయ్''చెబుతారు .న లాంటి ముసలి వారు కానీ పిస్తే కారు లో
వెడుతున్నా నవ్వుతో చేతులతో హాయ్ చెప్పటం వీరి ప్రత్యేకత .మనతో రాసుకు ,పూసుకు తిరక్క పో యినా, మర్యాదనుచక్క
గా పాటించటం ఆనందమేస్తు ంది .ఆది వారి సంస్కారం .ఇదే అమెరికనిజం అని పిస్తు ంది .ఎక్కడైనా ఇలాగే ఉంటారు .హడా
విడి హళ్ళూ ,పెళ్ళూ లుండవు .
ఇక్కడి రోడ్ల ను చూస్తె బలే ముచ్చటగా ఉంటాయి .అసలు రోడ్లు ముందు పుట్టి అమెరికా తర్వాతా పుట్టిందా
అన్నంత ఆశ్చర్యం వేస్తు ంది .రోడ్ల మీద ప్రతి మైలుకి గుర్తు లు ఊర్లో కి వెళ్ళటానికి ,ఊరి బయటకు రావా టానికి ,ఏ రోడ్డు ఎంత
దూరం లో ఉందొ తెలియ జేసే వివరాలు అన్నీ పకడ్బందీ గా ఉంటాయి దీనికి తోడు ఇప్పుడు జియో పొ జిషన్ సిష్టం అంటే జి
.పి.ఎస్.కూడా వచ్చింది కనుక ఎక్కడికి వెళ్ళా లన్నా రోడ్డు మాప్ తో పనీ లేదు .హాయి గా డైరేక్షన్లు ఫాలో అవుతూ ఎంత
దూరమైనా వేళ్ళ వచ్చు .ఇక్కడ గొప్పతనం ఒకటి ఉంది .ఎన్ని గంటలైనా స్వంతకారు లో హాయిగా ప్రయాణించి వెళ్తా రు
కుటుంబం అంతా ఆనందాన్ని అనుభవించే వీలు .శని ఆది వారాలోస్తే ఎక్కడికో అక్కడికి పిక్నిక్ కో, సైట్ సీయింగ్ కో వెళ్లి
ఎంజాయ్ చేస్తా రు .ఇండియన్ హో టళ్ళు దాదాపు అన్ని చోట్లా ఉన్నాయి .మన తిండి మనం తినచ్చు .ఉడిపి హో టళ్ళు
మద్రా స్ హో టళ్ళు పంజాబీ దాబాలు అన్నీ ఉన్నాయి వెతుక్కొని వెళ్ళాలి అంతే .ఎన్నో ఫ్లై ఓవర్లు ఎటు వెళ్తు న్నామో ,ఎటు
వస్తు న్నామో తెలీకుండా ఆశ్చర్యాన్ని కల్గిస్తా యి . అమెరికా లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒకటే స్సేనారి కానీ పిస్తు ంది
.అవే ఇల్లు .అవే స్టో ర్లు .అన్నీ ఒకే మోడళ్ళు .సామ్ స్ , వాల్ మార్టు ,క్రో జర్, కే మార్టు ,జె.సి పెన్నీ లలో బట్ట లు వస్తు వులు
చీప్ .ఎలేక్త్రానిక్సు చవక .
ఎంత దూరం ప్రయాణం చేసినా అలుపూ సొ లుపు ఉండదు .రోడ్లు ప్రయాణానికి తగి నట్లు ంటాయి .రోడ్డు కు
ఇరు వైపులా పైన్ ,కోన్ మొదలైన చెట్లు పచ్చ దనం తో పర వశింప జేస్తా యి. కొన్ని చోట్ల మన ఊటీ ,కొడైకెనాల్ లాగా భ
లేగా ఉంటాయి .ఇండియా వాళ్లకు ఇక్కడ హాయి .సీతా కాలం భరించటం ఓ కొంత ఇబ్బందే .దానికి సరి పడ దేర్మో వస్త్రా లు
కోట్లు బూట్లు తప్పవు .కారు లోంచి బయటికి వెళ్లి నప్పుడే చలి .కారులో హీటు, షాపుల్లో హీటు ఉండనే ఉంటుంది .మిచిగాన్
లాంటి చోట స్నో బాగా పడి ట్రా ఫిక్ కు ఇబ్బంది కలుగ జేస్తు ంది .అయినా వెంటనే ఉప్పు చల్లి క్లియర్ చేస్తా రు .కార్లు
తుడుచుకోవాలి .ఫాల్ చలి ప్రా ంతాలలో అద్భుతం గా ఉంటుంది .ఆకులు ఎర్రబడి రాలి పో తు సుందరం గా ఉంటుంది .చెట్ల
మొదల్ల లో చలికి రక్షణ కోసం చెక్క పొ ట్టు వేస్తా రు .అమెరికా లో ప్రత్యేకం ఒకటేమి టంటే చెట్లు నిటారుగా నే పెరుగు తాయి
కాదు కాదు నిటారుగా నే ఉండేట్లు పెంచుతారు .మొక్క నాటిన రోజు నుండి దీనిపై శ్రద్ధ తీసుకోవటం ఆశ్చర్యం గా ఉంటుంది
.ఎక్కడా దాదాపు వంకర వృక్షాలు కనీ పించావు .అంతే కాదు చెట్లను నరకటం ఎక్కడా కనీ పించాడు .రోడ్డు వేడల్పు
చేయటానికో ఇళ్ళ నిర్మాణం అప్పుడో చెట్లను నరుకు తారు .దారి వెంబడి చెట్లను ముట్టు కోరు .కొమ్మ విరిగితే అక్కడి వరకే
కోసి మిగతా చెట్టు ను రక్షిస్తా రు .''వృక్షో రక్షతి రక్షితః ''అన్నదాన్ని అమెరికన్లు బాగా పాటిస్తా రు .
రోడ్డు ప్రక్కల పూల మొక్కలు, అపార్ట్ మెంట్ల వద్ద పూల మొక్కలు ముచ్చట గా ఉంటాయి .ఏ సీజన్ కు
ఆ సీజన్ పూలు పూసే మొక్కలు ,చెట్లను ఎన్నుకొని పెంచుతారు .మొన్నటి దాకా రోడ్ల ప్రక్క చెట్లకు యెరని
్ర గులాబీ రంగు
తలుపు ,పింక్, కలరు పూసి నాయనానంద కరం చేస్తా యి .ఇప్పుడు పొ దల్లా గా ఉన్న చెట్లు ముళ్ళ పంది ఆకారం లో
సూదుల్లా ంటి ఆకులతో భలేగా కనీ పిస్తు న్నాయి .రోడ్ల వెంట వెళ్ళే వారికి మానసిక, నాయనానందాన్నిస్తా యి ఇక్కడి చెట్లు
.''ఆనందో బ్రహ్మ ''అని పిస్తు ంది .పండ్ల చెట్లు రోడ్ల మీద తక్కువే .
పూలోయమ్మ పూలు
ఇక్కడ మాల్సు లో ముఖ్యం గా హో మ్ డిపో , వాల్ మార్ట్ ,గార్డెన్ రిడ్జి ,మొదలైన చోట్ల ఎన్నో రకాల పూల చెట్లను
కుండీలలో సంరక్షించి పెంచి అమ్ముతూ ఉంటారు .చేమంతుల్లో ఎన్నో రంగులు ,సైజులు ముచ్చటగా ఉంటాయి .అలాగే బంతి
పూలు లు తెలుగు దేశానికే ప్రసిద్ధి అనుకొంటాం .ఇక్కడ కూడా విపరీతం గా బంతి పూలున్నాయి ఇళ్ళల్లో దొడ్ల లో కూడా
పెంచుకొంటారు .హూస్ట న్ నగరాన్ని ''మాగ్నోలియా ''సిటీ అంటారు .అక్కడ చంపక పుష్పాలు ఎక్కువ .భలే అందం గా ,తెల్లగా
పెద్దగా ఉండే పూలు .మనకు హిమాలయాల లోనే లభిస్తా యి .ఇక్కడ శార్లేట్ లోను మాగ్నోలియా అంటే చంపకాలు బాగా
ఉన్నాయి .మరువం ,మల్లె కూడా బాగా ఉన్నాయి కరివేప చెట్టు సో ర ,బీర ,వంగ మిర్చి టమేటా ,ఆకుకూరలను మన వాళ్ళు
పెరట్లో బాగా పండిస్తు న్నారు .అలబామా లోని హన్త్స్ విల్ లో మైనేని గారి భార్య సత్య వతి గారు ఎన్నో రకాల కూరలు
పండిస్తూ అందరికి ఉచితం గా అందిస్తు న్నారు .ఇక్కడ మా అమ్మాయి ,సుబ్బుఇళ్ళల్లో కూరలు బానే పండిస్తు న్నారు .కనుక
ఇండియా వాళ్ళు ఇక్కడే అన్నీ పండిస్తు న్నారు .ఎక్కడో చలి రాష్ట్రా లలో పంటలున్దవేమో కాని మిగిలిన చోట్ల స్తో ర్సులలో అన్నీ
దొరుకుతాయి .అదే ఊరట .దొరకని కూర ఉండదు .చేసుకొనే ఓపిక లేక పో తే రెడీ మేడ ఫుడ్ రెడీ .కనుక తిండి సమస్య
లేదు .
పెట్రో ల్ అంటే వీళ్ళ భాష లో ''గాస్ ''.చౌకే .బంకుల దగ్గ ర నిలబడి గాస్ కొట్టిన్చుకోనక్కర లేదు .ఎవరికి వారు
హాయిగా'' స్వంతం గా గాస్ కొట్టు కొంటారు'' . అదీ దక్షిణ రాష్ట్రా లలో ,ఆది వాసులుండే ప్రా ంతాలలో గాలను పెట్రో లు మిగిలిన
చోట్ల కంటే నలభై పైసలు తక్కువ .కారణం దీనిపై ఇక్కడి ప్రభుత్వం టాక్సు వెయ్యక పో వటమే .సౌత్ కరోలీనా లో నార్తు
కరోలీనా కంటే గాస్ నలభై సెంట్లు తక్కువ .ఇక్కడ ఈ రెండు రాష్ట్రా లు పక్కనే సందు దాటితే వేరుగా ఉంటాయి .అంత కలిసి
పో యాయి . బియ్యం పటేల్ బ్రదర్సు లో కొంటారు. భారతీయ వస్తు వులన్నీ ఇక్కడ లభిస్తా యి అప్పడాలు వడియాలు
ఊరు మిర్చి తో సహా .దీపావళికి వీళ్ళు అన్నీ చాలా తక్కువ రేట్లకు అమ్ముతారు .దీపావళి సామాను అమ్మే దుకాణాలూ
ఉన్నాయి స్వంత ఇంటి వాళ్ళు హాయిగా కోని కాల్చు కో వచ్చు .
ఆంధ్రా వాళ్ళు, తమిళ వాళ్ళు అందరు కలిసి మేలసే ఉంటారు .బర్త్ డే పార్టీలు పండుగలు షష్టి పూర్తి మారేజ్
డే లు చక్కగా నిర్వ హించుకొంటారు .మన దేశ సాంప్రదాయాన్ని అప్పుడు బాగా పాటిస్తా రు శ్రా వణ మాసం నోములు ఆడ
వాళ్ళు నోచి వాయనాలిస్తా రు కనుక ఆంధ్రా లో ఉన్న భావన కనీ పిస్తు ంది .ఇలా అన్ని చోట్లా ఉంటుందని చెప్పలేం
.దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కనుక శని ఆది వారాలలో అక్కడికివెల్లి దైవ దర్శనం చేసుకొంటారు .అక్కడ
టిఫిన్ సెంటర్లు ఉంటాయి . తీర్ధ ప్రసాదాల తో కాల క్షేపం చేయ వచ్చు .అన్ని రకాల దేవుళ్ళను ఒకే కాంప్లెక్సు లో ఉంచుతారు
.కనుక టెంపుల్ కాంప్లెక్సు అని పిస్తు ంది .పూజారులు కూడా సంప్రదాయ బద్ధం గా పూజలు నిర్వహిస్తా రు. కళ్యాణాలు, అభి
షెకాలు ధనుర్మాసం ,ఏకాదశి ,దీపావళి ,దసరా ,మొదలైన రోజుల్లో ప్రత్యెక పూజలుంటాయి .కనుక ఇబ్బందేమీ లేదు
.గుడిలోనే బర్త్ డే లు ఫంక్షన్లు చేసుకొనే వీలుఉంటుంది .
తలిదండ్రు లను వేసవి లో ఇక్కడికి తెచ్చుకొని వారికి ప్రదేశాలు చూపిస్తూ వారితో గడపటానికి ఉత్సాహ
పడుతుంటారు .సాఫ్టు వేర్ ఉద్యోగాల వాళ్ళ వేలాది తలి దండ్రు లకు అమెరికా వచ్చి చూసే గొప్ప అవకాశాలొచ్చాయి .ఎవరూ
ఎప్పుడూ ఊహించని మార్పు .యువకులకు స్వర్గ సీమ అమెరికా ముసలి వారికి కాల క్షేపం ఉండదు .ఏదో వ్యాపకం లేక పో తే
ఇబ్బందే .ఇన్ని అవకాశాలు ఉండ బట్టే అమెరికా అంటే మోజు పెరిగింది .అమెరికనిజం అంటే ఇదే .
మ్-బుధవారం కార్యక్రమం బాగా జరిగిందని ,సంతృప్తి చెందానని నేనిచ్చిన పుస్త కాలు చదివానని చాలా బాగా
ఉన్నాయని .తనను రేడియోకు చాలా గొప్పగా పరిచయం చేసినందుకు క్రు తజ్ఞా తలని చెప్పారు .నిన్న మధ్యాహ్నం
టి.వి. .ద్వారా అన్ని దేశాలకు ప్రసార మవుతుందట .మొదటి సారిగా అంతర్జా తీయ వేదక
ి
మధ్యాహ్నం మంచి నిద్ర పో యాం .రాత్రి ఏడున్నరకు మా అమ్మాయి విజ్జి, దగ్గ రలో వున్న మంజులత
,రమేష్ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది .అక్కడ శ్రీ సత్య సాయి బాబా భజన కార్యక్రమం గంటకు పైగా జరిగింది
.అంతా యువకులే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లె .దాదాపు ఇరవై మంది యువతీ యువకులు ,ఇద్ద రు పెద్ద వాళ్ళు
పాల్గొ న్నారు .అందరు సామూహిక భజన చేశారు .అంతా బాగా భక్తితో పాడారు .అందరు గొంతు కలిపి పాడటం
విశేషం .డో లక్ తప్పెట లతో ఇద్ద రు పాటలకు అనుగుణం గా వాయించి ఆనందా ను భూతి ని కలిగించారు .
కంప్యూటరే దైవం గా భావించి జీవించే యువత ,దానికి మించి ఒక అపూర్వ శక్తి ఈ విశ్వాన్ని నడి
పిస్తో ందని నమ్మి ,ఆ శక్తిని సాయి బాబా లో దర్శించి ప్రేరణ పొ ందటం ఆశ్చర్య మేసింది .వారి మనో భావనకు
అభినందించాను .
నాలుగైదు ప్రసాదాలను నైవేద్యం పెట్టి అందరికి అంద జేశారు .ఇద్ద రు చిన్న పిల్లలు కమ్మగా భజన గీతాలను పాడి
ఆకట్టు కోవటం విశేషం .ఇది చూస్తె నా మనసు దాదాపు అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .మా చిన్నప్పుడు
ఉయ్యూరు లో మా గురువు గారుమహన్కాలి సుబ్బరామయ్య గారు ,నరసింహా రావు గారు ముళ్ళ పూడి ఆయన
,ఇత్త డి కొట్టు చంద్రయ్య గారు మా గుడి దగ్గ ర ఉండే వెంకటేశ్వర రావు జగన్నాధ దాసు గారు నా మిత్రు డు
ఆదినారాయణ ప్రతి గురు వారం చేసే భజనలు జ్ఞా పకం వచ్చాయి .ప్రసాదాలు తిన్నంత పెట్టె వారు .మధ్య మధ్యలో
కాఫీ టీ లు ఇచ్చ్చేవారు .అప్పుడు ఆది నారాయణ మమ్మల్ని తీసుకొని వెళ్ళే వాడు .మాకు భజన మీద కన్నా
ప్రసాదాల మీదే భక్తీ ఎక్కువ గా ఉండేది .భజన ఎప్పుడవుతుందా ?ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురు
చూసే వాళ్ళం .ఇన్నేళ్ళకు మళ్ళీ భజన కార్యక్రమం లో అదీ ఒకరింట్లో పాల్గొ నటం ఇదే .మా ఆంజనేయ స్వామి
దేవాలయం లో భజన్ లలో పాల్గొ నటం మామూలే .ఒక్క సారి ఇవన్నీ జ్ఞా పకం వచ్చాయి .ఇక్కడ భజనకు
ఈ నెల ఇరవై ఆరవ తేది శ్రీ సత్య సాయి 86 వ జయంతి అట .అందుకని ఈ లోపు 86 చోట్ల భజనలు
నిర్వహించాలనే తలంపుతో ఉత్సాహం గా వీరంతా రోజూ కొకరింట్లో చేస్తు ండటం విశేషం .రాత్రి ఇంటికి వచ్చే సరికి
హూస్ట న్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మధ్యాహ్నం నాలుగింటికి బయల్దే రి
పో స్ట్ ఓక్ లోని వావిలాల వారమ్మాయి ‘’ఏమెండా ‘’ఇంటికిమా అమ్మాయి విజ్జి మమ్మల్ని
తీసుకొని వెళ్లి దింపింది . .అక్కడి నుంచి వావిలాల లక్ష్మి గారు వాళ్ళ కారు లో నన్ను ,మా
ఆవిడ ను రైస్ యూని వేర్సిటి కి దాదాపు ఇరవై నిమిషాలు డ్రైవ్ చేసి తీసుకొని వెళ్ళింది
.అక్కడ పచ్చని చెట్లూ వాతా వరణం చాలా బాగుంది .మన ఆంధ్రా యూని వేర్సిటి లా కనీ
పించింది అయితే ఇక్కడ ‘’సముద్రం బాక్ డ్రా ప్’’ గా లేదు అంతే తేడ .ఈ ప్రా ంతం లో
స్త లాలన్ని చాలా ఖరీదైనవి .మంచి బిజీ సెంటర్ .
doctor Rice
అక్కడ Hamman hall ఆది టోరియం లో సాయంత్రం ఆరు గంటలకు పుచ్చా రమ్య
శ్రీ అనే అమ్మాయి చేత ‘’రంగ ప్రవేశ కార్య క్రమం ‘’ఉంది .అప్పటికే రమ్య భారత నాట్యం లో
గొప్ప ప్రా వీణ్యాన్ని సంపాదించింది .ఇప్పుడు కూచి పూడి నాట్యం చేసి రంగప్రవేశం ఈ రోజు న
చేస్తో ంది .వచ్చ్చిన వారందరికీ అనేక రకాలైన స్నాక్స్ ,సమోసాలు ,వడ ,స్వీట్లు ,దాదాపు
పది రకాలు పెట్టా రు .అందరికి కోక్ ఇచ్చారు .అందరూ తెలుగు వాళ్ళే .అంతా మన తెలుగు
వాతా వరణమే కనీ పించింది .అందరు మంచి తెలుగునే మాట్లా డుతున్నారు .ముచ్చటేసింది
.ఆడవాళ్ళంతా చీర ,బొ ట్టు లతో అమ్మతల్లు ల్లా ,ఆడపడుచుల్లా వచ్చారు .ఇంతమంది తెలుగు
దేశపు ఆచార వ్యవహారాలతో వచ్చినందుకు ముచ్చట తో బాటు ఆశ్చర్యం వేసింది .హాలు పై
అంతస్తు లో ఉన్నది చిన్న హాలె .అందరికీ రుమాళ్ళను సెంటు లో తడిపి ఇచ్చారు
.ఆడవాళ్ళకు ‘’చిన్న పూర్ణ కుంభం ‘’,రుమాలు ,జీడిపప్పు కిస్మిస్ పాకెట్ ,సుపారి పాక్ చేసి
అందించారు .
పుస్త కాలను పెట్టి అందులో అందరి చేత శుభా కాంక్షలు రాయించారు .అక్కడే రమ్య
నాట్య భంగిమతో ఉన్న ఒక పెద్ద ఫో టో ను పాలెట్ పై ఉంచారు .దాని పై ప్రత్యెక పెన్ను తో
అందరి చేతా శుభా కాంక్షలు రాయించారు .నల్ల ని ఆ బార్డ ర్ పై ఆ ప్రత్యెక పెన్ను తో రాస్తే
అక్షరాలూ తెల్లగా కనీ పించి ఆశ్చర్యమేస్తు ంది .నేను ‘’రమ్య –రస రమ్యం గా నాట్యం చేసి
,ప్రేక్షక హృదయాలను రసప్లా వితం చేయాలి –గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి -713-784-
434 అని అభి నందించాను .నన్ను చూసి ఇంకొకాయన ‘’శుభా కాంక్షలు ‘’అని తెలుగు లో
రాశాడు .మిగిలిన వాళ్ళంతా ఇంగ్లీష్ లోనే రాశారు .ఆరు గంటలకు టంచన్ గా కార్యక్రమం
ప్రా రంభ మైంది .
రమ్య గురువు’’ రత్న పాప’’ అని అందరికి పరిచయమైన ‘’రత్న కుమార్ ‘’.ఈమె
ప్రసిద్ధ జాన పద గాయిని వింజమూరి అనసూయా దేవి (ఇప్పుడు అవసరాల ) దేవి
కూతురు .సీతా అనసూయలు కృష్ణ శాస్త్రి గారి మేన కోడళ్ళు .ఆయన పాటలను, జానపద
గేయాలను ఆంద్ర దేశమంతా తిరిగి గొప్ప ప్రచారం కల్పించిన గాయినీ మణులు ఆ
సో దరిలిద్ద రు .27 ఏళ్ళ క్రితం రత్న పాప మద్రా స్ నుండి అమెరికా లోని టెక్సాస్ రాష్ట ం్ర లోని
హూస్ట న్ నగరానికి వచ్చి స్తిర పడింది .మొదట్లో ‘’ డల్ ‘’గా ఉన్నా క్రమేపీ పుంజు కొంది
.’’అంజలి ‘’అనే డాన్స్ స్కూల్ పెట్టి అందరికి నాట్యం నేర్పిస్తో ంది వెంపటి చిన సత్యం గారి వద్ద
మద్రా స్ లో శిక్షణ పొ ంది ఆయన ముఖ్య శిష్యురాలిగా రత్న పాప గుర్తింపు పొ ందింది .మా
పెద్దక్కయ్యా వాళ్ళు ఈమెను గురించి చెబుతూండే వారు .ఐప్పటికిఇక్కడ అయిదు వందల
మందికి పైగా రత్న పాప వద్ద నాట్యం అభ్యశించి పేరు తెచ్చుకొన్నారు .
కార్యక్రమం అయిన తర్వాత అనసూయ గారి దగ్గ రకు వెళ్లి పరిచయం చేసుకోన్నాం
.’’నేను గాడేపల్లి కృపానిధి గారి బావ మరిదిని .మా అక్క లోపా ముద్ర .ఆవిడ మామ గారు
పండిట్ రావు ‘’అని చెప్పాను .ఆవిడ వెంటనే ‘’మీరందరూ మా బంధువు లండీ
.మిమ్మల్నిఇక్కడ చూసి నందుకు చాల సంతోషం గా ఉంది .’’అని అనసూయ గారు
ఆప్యాయత ఒలక బో శారు .వావిలాల లక్ష్మి గారు కూడా తమకు బంధువే నని అనసూయ
గారు చెప్పారు .మాటలలో కృష్ణ శాస్త్రి గారి భార్య ‘’రాజ హంస ‘’గారు మరణించి నట్లు
చెప్పారామే .’’మీకు తెలుసా “’అని అడిగారు తెలుసు నని చెప్పాం. ఆమెను ఈవిడ
‘’రాజత్త య్య ‘’అని ఆత్మీ యం గా పిలిచింది తరువాత వాళ్ళమ్మాయి రత్న పాప ఫో న్
నంబర్ ఇచ్చి తరచూ మాట్లా డుకొందాము అని చెప్పారు .ఆవిడా
కొడుకు ,కోడలు హూస్ట న్ లోనే ఉన్నారని చెప్పింది .రత్న పాప చక్కని ఇంగ్లీష్ లో
కార్యక్రమాన్ని ప్రెసెంట్ చేసింది అందరి మన్ననలు పొ ందింది .అనసూయ గారి అబ్బాయి
ఫో టోగ్రా ఫర్ .రత్న పాప కూడా మేము బంధువులం అని తెలిసి ఎంతో గౌరవాన్ని చూపి
మాట్లా డింది .
రమ్య తల్లి ,తండ్రి ‘’నాసా ‘’ లో పెద్ద సైంటిస్ట్ లు . లు .రత్న పాప తో మొదటి నుంచి
పరిచయం ఉన్న వాళ్ళు .ఇదే స్టేజి మీద రమ్య పదేళ్ళక్రితం భారత నాట్యం లో అరంగేటం్ర
చేసిందట .ఇప్పుడు ఊచి పూడి .చికాగో యూని వర్సిటి లో ‘’మ్యూజిక్ అండ్ డాన్స్ ‘’లో డిగ్రీ
చేస్తో ంది .రమ్య టీచర్ ఆఫ్రో అమెరికన్ మహిళఈమె కూడా శిష్యురాలి అరంగేటం్ర చూడ టానకి
వచ్చింది .మ్యూజిక్ అండ్ డాన్స్ లోప్రో ఫేసర్ ఒకాయన వాషింగ్టన్ నుంచి ప్రత్యేకం గా
వచ్చాడు చూడ టానికి .రమ్య సినిమా స్టా ర్ దివ్య వాణి ,టి.వి.ఆంకర్ ఉదయభాను
లకలగలుపు గా ఉందని పించింది .
నాసా లో పని చేసే తెలుగు వారంతా తరలి వచ్చారట .వచ్చిన వాళ్ళలో ఎక్కువ
మంది బ్రా హ్మణులే .బందరు లోని డాక్టర్ మోచర్ల పద్మనాభ రావు గారి అమ్మాయట
ఒకావిడ,భర్తా పరిచయమైనారు .బెజవాడ లక్ష్మీ జనరల్ వస్త ్ర వ్యాపారి శిష్ట్లా లక్ష్మీపతి శాస్రి
గారి అమ్మాయి కూడా పరిచయమైంది .పుచ్చా ,కొండముది ,రాచకొండా ,ఐనంపూడి ఇలా
చాలా కుటుంబాల వారు వచ్చారు .రమ్య అమ్మమ్మ మన పూర్వకాల స్త్రీలా గా కనీ పించింది
.తెలుగుదనం అమెరికాలో అందునా హూస్ట న్ లో ప్రతి ఫలించి నందుకు ఆనందం గా ఉంది .
రమ్య నాట్యానికి నేపధ్య గానం జే.రమేష్ –చాలా బాగా పాడాడు .భావం స్పుటంగా
ఉంది .గాత్రమూ బాగుంది .ఏన్ .కే.కేశవన్ .మృదంగం’’ వాయించి ‘’వదిలాడు .చక్కని ధృతి
,శబ్ద మాధుర్యం ,.మృదంగాన్ని మైనం లాగా మలచి ఏ షేప్ కావాలంటే ఆషేప్ తెప్పించిన
ఘనుడు కేశవన్ .ముత్తు కుమార్ ఫ్లూ ట్ శ్రా వ్యం గా ఉంది .సావిత్రి సత్యమూర్తి అనే సంగీతం
మేస్టా రు వయోలిన్ వాయించింది .ఆమె కుమార్తె అనూరాధా సుబ్రహ్మణ్యం గాత్రం తో
సహకారం అందించింది .నట్టు వాంగం రత్న పాప చేసింది వీళ్ళంతా మేచూరేడ్ ఇంటర్నేషనల్
ఆర్టిస్ట్ లే . ఎన్నో ప్రదర్శనలిచ్చి పేరు పొ ందిన వారె .మంచి కాంబినేషన్ తో రమ్య నాట్యానికి
ఎంతో బాగా తోడ్పడ్డా రు .
పుచ్చా రమ్య గణేశ ప్రా ర్ధన తో కార్యక్రమాన్ని ప్రా రంభించింది .తరువాత
మాండూక శబ్ద ం ,తరంగం ,జావళీ ,మోహినీ ,శివ పంచాక్షరి ,తిల్లా నాలు చేసి మంగళం తో
కూచిపూడి ని పూర్తీ చేసింది .మంచి ఫీచర్లు భావ ప్రకటనా సౌలభ్యం తో ,తేలికగా
ప్రదర్శించింది .అయితే ‘’శివ పంచాక్షరి ‘’లో కదలికలు చాలా’’ డల్’’గా ఉన్నట్లు అని
పించాయి .ఇంకా వేగం, వెరైటీ ఉంటె ఇంకా బాగా రక్తి కట్టి న్డేది .అల్లా గే తిల్లా నా లో వోకల్
మాడ్యులేషన్ కొంచెం మారిస్తే రమేష్ గాత్రం మరింత వన్నె తెచ్చేది .ఏమైనా మూడు గంటల
పాటు ఏదో రస లోక విహారం చేసిన అనుభూతి పొ ందాం .కార్యక్రమం ఖచ్చితం గా రాత్రి
తొమ్మిదింటికి పూర్తీ అయింది .మనది కాని దేశం లో మనదైన సంప్రదాయం తో ‘’రసరమ్య
‘లోక విహారం చేయించారు అందరూ .కూచి పూడికి ఇక్కడ చక్కని గుడి కట్టా రని పించారు
.మోహిని నాట్యం లో కృష్ణ శాస్త్రి గారి పాట మధుర మధుర మంజుల గానమే అయింది .దానికి
రమ్య సలిపిన మనోహర నాట్యం హృదయం మీద చెరగని ముద్ర వేసింది .వర్షం తో వచ్చిన ఈ
సాయంత్రం సంగీత సరిగమ చినుకులు ,నాట్యపు పులకరరింపుల తో ఇంపు గా సో ంపు గా
ఉన్న్నాయి .దీనిని ఏర్పాటు చేసి గోప్ప అతిధ్యాన్నిచ్చిన రమ్య తలిదండ్రు లు ,నాట్యం చేసిన
రమ్యా ,మాకు ఈ కార్యక్రమాన్ని దగ్గ రుండి చూపించిన మా ‘’అప్పన కొండ మామయ్యా
‘’కూతురు వావిలాల లక్ష్మి గారికి అభినందనలు .
15-9-2002 ఆదివారం నాటి అమెరికా లోని టెక్సాస్ రాష్ట ం్ర లో ఉన్న హూస్ట న్ లో
నేను రాసుకొన్న డైరీ నుండి
మా ‘’నాసా’’ సందర్శనం
17-9-2002 మంగళ వారం మధ్యాహ్నం హూస్ట న్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి
నుంచి మమ్మల్నిద్ద రిని ,మా మనవడు ఆరు నెలల శ్రీకేత్ ను కారు లో నాసా కేంద్రా నికి మా
అమ్మాయి విజ్జి తీసుకొని వెళ్ళింది .మా అల్లు డు అవధాని రెండు వారాల క్రితం తమ్ముడి
పెళ్ళికోసం ఇండియా వెళ్ళాడు .విజ్జి కి జ్వరం దగ్గు ఉన్నా బయల్దే ర దీసింది .కితం రాత్రి
సుజాత అనే ఒక తెలిసిన ఆవిడ ఇంటి నుండి ‘’నాసా ‘’కు వెళ్ళటానికి కన్సెషన్ కూపన్లు
తీసుకొన్నాం .ఈ సుజాత కూతురికే నేను అన్నప్రా సన చేయించాను .బెజవాడ
అమ్మాయి,వైశ్యులు .భర్త మంచి వాడు .అతనే ఆఫీస్ నుండి కూపన్లు తెచ్చి ఫో న్ చేసి
చెప్పాడు .
మధ్యాహ్నం 12-30 అయింది బయల్దే రే సరికి .వీళ్ళ ఇంటి నుండి 40 మైళ్ళు .హైవే
మీద ఒక గంట ప్రయాణం .ఇంతకూ మునుపు ఎప్పుడూ విజ్జి హైవే మీద కారు నడప లేదు
.ఇదే మొదలు .అయినా హాయిగా ధైర్యం గా డ్రైవ్ చేసింది .కంగారు అసలు పడలేదు .టికెట్
ఖరీదు మామూలుగా అయితే 20 డాలర్లు ఒక్కొక్కరికి .అంటే మా ఇద్ద రం సీనియర్లు కనుక
18 డాలర్లు ఒక్కోరికి .మాకు ఇచ్చినవి ‘’హాఫ్ చార్జి కూపన్స్ ‘’అంటే మా ముగ్గు రికి కలిపి 20
డాలర్లే అయింది .ఇదే మామూలుగా కొంటె 60 డాలర్లు అయ్యేది .
నాసాకు మధ్యాహ్నం ఒంటి గంటన్నర కు చేరాం .సెక్యూరిటి చెకప్ బానే స్ట్రిక్ట్ గా
చేశారు అందర్నీ .లోపల బిల్డింగ్ లో వ్యోమ గాముల దుస్తు లు ,మోడల్స్ ప్రదర్శన గా
ఉంచారు .అక్కడున్న యంత్రా ల దగ్గ ర కూర్చుని ఆపరేట్ చేసి ఎదురుగా ఉన్న టి.వి స్క్రీన్
మీద చూస్తె మనం నిజం గానే స్పేస్ లోకి వెళ్ళిన అనుభూతి కనీ పిస్తు ంది .భలేగా ఉంటుంది
.అక్కడి నుండి మొత్త ం సైట్ చూడటానికి నాలుగు కంపార్ట్ మెంట్స్ ఉన్న’’ ట్రెయిన్ కార్’’
ఉంది .టైర్ చక్రా లమీద రోడ్డు పై నడుస్తు ంది .అందులో ఎక్కే ముందు అందరికి కూపన్లు
ఇస్తా రు .వాటిని తిరిగి వచ్చిన తర్వాతా రిటర్న్ చేయాలి .ట్రైన్ ఎక్కేటప్పుడు మెటల్ డిటెక్టర్ర్
తో తనిఖీ చేశారు .ఎక్కేముందు మనకు కావాలంటే ఫో టో తీస్తా రు .తిరిగి వచ్చిన తర్వాతా
దాన్ని మనం కలెక్ట్ చేసుకో వచ్చు .మూడు ఫో టోలలో రెండు పెద్దవి ,ఒకటి లామినేషన్ తో
రెండు వైపులా కనీ పించేట్లు ఫో టో పెట్టి ,ఒక కీ చైన్న్ తో సహా అంద జేస్తా రు .దీనికి కొంత
డబ్బు తీసుకొంటారు . .వీటికి వెనకాల ఆస్ట్రో నాట్ బొ మ్మ , స్పేస్ షిప్ ఉంటాయి .
ట్రైన్ లో విషయాలు వివ రించి చెప్పే కామేన్టేటర్ ఉంటాడు .ట్రైన్ రెండు గంటలకు
బయల్దే రింది .మొత్త ం 1600 ఎకరాల సువిశాల మైన స్త లం .ఈ సెంటర్ లో 14000 మంది
ఉద్యోగులు పని చేస్తూ ంటారు .ఇదే national aeronautical space administration అంటే
N.A.S.A.ఇక్కడ దీని పేరు లిండన్ బి.జాన్సన్ స్పేస్ సెంటర్ .ఇలాంటిదే ఫ్లా రిడా రాష్ట ం్ర లో
ఇంకోటి ఉంది దాన్ని జాన్ ఎఫ్ కేన్నేడిస్పేస్ సెంటర్ అంటారు .ఇక్కడ వ్యోమగాములకు శిక్షణ
నిస్తా రు .అక్కడ నుండి అంత రిక్షం లోకి స్పేస్ షిప్ ను పంపుతారు .అదీ తేడా .కేనేడీ
ప్రెసిడెంట్ అయినప్పుడు జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ .కేన్నేడి మరణం తర్వాత జాన్సన్ ప్రెసిడెంట్
అయాడు .టెక్సాస్ వాడు కూడా .గురు శిష్య సంబంధం వీరిద్దరిది .
లిక్విడ్ నైట్రో జెన్ ను -320 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద నిలువ ఉంచే టాంకులను ,వీటిని
కంట్రో ల్ చేసే బిల్దిన్గు లను చూపించారు .కామేన్ టేటార్ అనుభవం ఉన్న వాడేకాని
ముసలాయన .దమ్ము చాలలేదు అని పించింది .పదిహేడో నంబర్ బిల్డింగ్ అంతా పూర్వం
కంట్రో ల్ బిల్డింగే నట .అక్కడ సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంది .ముందు మెషీన్లు దాని తరువాత
గ్లా స్ వెనక సీట్లు .ముందు వరుసలో రిసేర్వేడ్ సీట్లు న్తా యి .అందులోనే ప్రెసిడెంట్ జాన్సన్
,జిమ్మీ కార్టర్ ,క్లింటన్లు కూర్చుని కంట్రో లింగ్ ను చూసే వారట .ఇప్పుడు మేము వాళ్ళు
కూర్చున్న సీట్లలో కూర్చుని చూశాము .అదొ క గొప్ప అనుభూతి గా ఫీల్ అయ్యాం .
ఇక్కడి నుండి స్పేస్ షిప్ ను నిర్మించే బిల్డింగ్లో వ్యోమ గాములకు శిక్షణ నివ్వటం
అంతా జరుగుతుంది .కొంతమంది ఆస్ట్రో నాట్స్ ట్రైనింగ్ పొ ందుతూ కనీ పించారు .ఫో టోలు
తీశాము .మమ్మల్ని చూసి వాళ్ళూ చేతులూపారు ఆనందం గా .వాళ్ళు కింద చేంబర్ లో
ఉంటారు .మనం పైన బాల్కని లో ఉండి వాళ్ళను గ్లా స్ లో నుంచి చూస్తా ం. మధ్యలో అంతా
ఫైబర్ గ్లా స్ తేర.ఎవరికి ఇబ్బంది ఉండదు .ఎవరి పని వాళ్ళు చేసుకో వచ్చు .ఇక్కడి నుండి
తిరిగి వచ్చేసరికి 3-45 అయింది .దారిలో పూర్వం అంత రిక్షం లోకి పంపిన స్పేస్ షిప్ ల
మోడల్స్ చూశాం .వీటినీ ఫో టోలు తీశాం .
నిన్న అంటే బుధవారం 11 వ తేది ఇక్కడి షార్లెట్ ఆంధ్రు లకు పర్వదినం. మృదంగ వాద్యం లో అనితర సాధ్య o.
ప్రతిభ కనపరచిన ,పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వ్వర రావు గారు ఇక్కడికి విచ్చేసిన సందర్భం గా తెలుగు వారు ,సంగీత
వారి అమ్మాయిని చూడటానికే ఇక్కడికి వచ్చినా ,ఇక్కడి వారంతా వారిని దర్శించి ,వారితో పరిచయం పొ ందటానికి
మంచి కృషి చేసి ,సఫలీక్రు తూ లయారు .మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడి రేడియో ప్రతి బుధవారం నిర్వహించే
తెలుగు కార్య క్రమం లో వారిని ఇంటర్వ్యు చేశారు . శ్రీ మతి నాగమణి ఆ కార్య క్రమాన్ని నిర్వహించారు స్టూ డియో లో
.కాని ఇంటర్వ్యు మాత్రం అంతా మా అమ్మాయి వాళ్ళ ఇంటినుంచే జరిగింది ఫో న్ పైన .సరీగ్గా పావు తక్కువ పన్నెండు
కు వారు మా ఇంటికి విచ్చేశారు .పట్ట్టు పంచను లుంగి గా కట్టి ,పట్టు లాల్చీ తో నుదుట యెర్రని నిలువు బొ ట్టు తో ,మెడ
లో రుద్రా క్ష మాల,స్పటిక మాలతో ముఖం పై చెరగని చిరు నవ్వుతో ,మూర్తీ భవించిన మృదంగ దేవతలా .వెలిగి
పో తున్న ముఖ వర్చస్సు తో శ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు గారు మా ఇంట్లో కి ఆడు గు పెట్టా రు .నేను ,ఆ అమ్మాయి
విజయ లక్ష్మి సాదరం గా స్వాగతం చెప్పి మేడ మీదకు వారిని తీసుకొని వెళ్లి కూర్చో బెట్టా ం .సరిగ్గా పన్నెండు గంటలకు
ఇంటర్వ్యు ను నాగమణి ప్రా రంభించారు .నన్ను పరిచయం చేసి ,నా ద్వారా ఎల్లా వారిని శ్రో తలకు పరిచయం చేయమని
కోరారు .సంతోషం తో అంగీక రించిన నేను ఇలా ఎల్లా వారిని పరిచయం చేశాను .వారి ప్రక్కనే కూర్చొని ఫో న్ ద్వారా
''గానానికి సహకార వాద్యం గా మాత్రమే ఉన్న మృదంగాన్ని ,ఎన్నో ప్రయోగాలు చేసి ,ఎంతో పెంపొ ందించి
,సంగీత వాద్యాలలో ఒక స్తితిని ,స్థా యిని మృదంగానికి కల్పించిన ఘనత పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు
గారిదే.మృదంగం పై ఆయన వేళ్ళు అలా అలవోకగా నాట్య మాడుతూ ,ఎల్లా పలికిస్తా రో తెలీకుండా ,అలా ఎలా
వాయిన్చారబ్బా అని ఆశ్చర్యం లో మునిగే టట్లు ,చేసే ప్రతిభ ఎల్లా వారిది .మృదంగం భారత దేశానికి మాత్రమే
పరిమితమైంది అన్న అప ప్రదను తొలగించి ,,భారత దేశపు ఎల్ల లు దాటించి న మార్దంగిక సార్వ భౌములు ఎల్లా వారు
.ఎన్ని ప్రయోగాలు /ఎన్నెన్ని ప్రదర్శనలో తలచు కుంటే ఆశ్చర్యమేస్తు ంది .ఇది సాధ్యమా అని పిస్తు ంది .ఒక్కొక్క మెట్టు
ఎక్కుతూ ,తనతో బాటు ,తన మృదంగ విద్యనూ ,శిఖరారోహనం చేయించి న మహా మార్దంగికులు శ్రీ వెంకటేశ్వర రావు
గారు .
''మృదంగం తో మార్దవ స్వరాలను పలికించి ,అతి లలిత ధ్వనులను విని పించి ,మాధ్యమం లో కదను తొక్కి
,తారాస్తా యి లోను ,హృదయాలపై నాద స్వరాలను నాట్య మాడిస్తా రు. .నాదా మ్రు తాన్ని ఒలికిస్తా రు .రస గంగ లో
స్నానం చేయిస్తా రు .నవ మృదంగ ప్రయోగం లో అనితర సాధ్యం గా నిలిచి ,నాద బ్రహ్మయై ,నవ నాద బ్రహ్మ గా
సాక్షాత్కరిస్తా రు .ఎల్లా వారి ప్రతిభను ,ఎల్లా వర్నిన్చాగలం /ఎందరో ప్రసిద్ధ కర్ణా టక గాయకులకు మృదంగ సహకారం
. ''ముఖ్యం గా ,ప్రముఖ వాగ్గేయ కారు లైన పద్మ విభూషణ్ శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి గాత్రం
సంగమమే అని పిస్తు ంది .రస గంగా ప్రవాహమే అని పించేది .మనసులను పరవశిమ్పజేయటమే కాదు పవిత్రతను
సంతరించిన మహద్భాయ్గం ఈ సంగీత విద్వాంసత్రయం కొన్ని దశాబ్దా ల పాటు ఆంద్ర సంగీత లోకాన్ని ఏలారు .సుస్వర
సంగీత ఝరులను ప్రవహింప జేసి తన్మయులను చేశారు ..ప్రస్తు తం ఎల్లా వారు ఆంద్ర దేశపు సరిహద్దు దాటి .అమెరికా
కు వచ్చి న శుభ సందర్భం గా ఇక్కడి సంగీత ప్రియులంతా ,ఎల్ల లు లేని ఆనంద ఉత్సాహాలతో వారికి స్వాగతం చెప్పి
వారి ముఖతా వారి జీవిత విశేషాలను ,వారు పొ ందిన సత్కారాలను ,చేసిన ప్రయోగాలను ,సాధించిన విజయాలను
,ఇంకా సాధించాలను కొన్న విషయాలను ,భవిష్యత్ లో వారు చే బట్టే కార్య క్రమాలను వివరం గా తెలుసు కోవాలని
ఉవ్విళ్ళూరు తున్నారు ..ఇదంతా ఎల్లా వారి .ఇక్కడి సంగీత ప్రియుల విశాల హృదయానికి దర్పణం .ఎల్లా వారి
మృదంగ విన్యాసాలకు ఎల్ల లు లేనట్లే వారు పొ ందిన బిరుదులకు ,అందుకొన్న సత్కారాలకు ఎల్ల లు లేవు .ఎల్లా
వెంకటేశ్వర రావు గారు భారత దేశానికి ముఖ్యం గా ఆంద్ర దేశ సాంస్కృతిక రాయ బారి గా నేను భావిస్తు న్నాను
.ఇప్పుడు వారు తమను తాము ఆవిష్కరించుకొని విశేషాలను అంద జేయ వలసినదిగా కోరుతున్నాను ''అని చెప్పాను
.ఆయన చాలా సంబర పడ్డా రు .నాగమణి గారు ఆన్ లైన్ లో వారు చెప్పిన వాటిని శ్రో తలకు అందించారు .చివరికి నేను
మళ్ళీ లైన్ లోకి వచ్చి వారు సధించిన విషయాలపై సంతృప్తి పొ ందారా /భవిష్యత్ ప్రణాళిక లేమిటి ?మీ కుటుంబం
నుంచి మీ వారసులేవరైనా ఈ విద్యలో రానిస్తు న్నారా /అని ప్రశ్నించాను .అన్నిటికి చక్కని సమాధానాలను తెలిపి
గంటకు పైగా నడిచిన కార్య క్రమాన్ని రక్తి కట్టించారు .అలవోకగా వారు మాట్లా డిన తీరు శ్రో తలను బాగా
ఆకట్టు కొంది. .నాగమణి గారి బృందం అభినంద నీయులు .ఇప్పుడు ఎల్లా వారు చెప్పిన విషయాలను మీకు వివరిస్తా ను
.వారు ముందుగా దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేసిన తీరు చాలా బాగుందని ,తానేమి చెప్పాలో దిశా నిర్దేశం చేసి ప్రేరణ
కల్గిన్చారని ,చెప్పిన తీరు ఆకట్టు కోనేట్లు ందని అని చెప్పారు . ఎల్లా వారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గ ర పాల
కోడేరు పెదతండ్రి ఎల్లా సో మయ్య గారే వీరి గురువు .ఆ కుటుంబం అప్పటి కే నాలుగు తరాలుగా సంగీతం లో
ప్రా ముఖ్యం సంత రిచుకోన్నది .వీరు అయిదవ తరం వారు .నాయనమ్మ గారి ద్వారా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు
,పాటలు వింటూ సంగీతం పై మక్కువ పెంచుకొన్నారు .తల్లి గారు మహాలక్ష్మ గారు వీరిని కడుపు తో ఉన్నప్పుడే ఆమె
పాడుకొనే భక్తీ గీతాలన్నీ విని, ప్రహ్లా దుడు తల్లి గర్భం లో వుండగా నారద మహర్షి చెప్పిన హరి భక్తీ విషయాలన్నీ విని
మహా భక్తు దైనట్లు .ఎల్లా వారు కూడా సంగీతాన్ని తల్లి గర్భం లో ఉండగానే ఒంట బట్టిన్చుకొన్నారు .ఒక వినాయక
చవితి నాడు పందిళ్ళ లో జరిగే కచేరీకి మృదంగం వాయించే ఆయన రాక పొ తే ఎల్లా వారిని వాయించ
మన్నారటఅప్పటికి ఆయన వయస్సు ఏడు మాత్రమెధైర్యం గా వాయించి అందరి ప్రశంసలు పొ ందారు .అప్పటి నుంచి
నాన్ స్టా ప్ గా మృదంగం వాయిస్తూ నే వున్నారు దాదాపు అర్ధ శతాబ్ది మృదంగ లోకం లో విహరిస్తు న్నారు .వాయించి
నందుకు మెచ్చి బహుమతులు అంద జేశే వారట .అది గొప్ప ప్రో త్సాహం గా ఉండేది .ఎందరో ప్రసిద్ధు లైన గాయకులకు
మృదంగ సహకారం అందించారు .క్రో వి సత్య నారాయణ గారు ,ద్వారం వెంకట స్వామి నాయుడు గారు ,బాల మురళి
కృష్ణ వంటి దిగ్దంతుల సభల్లో వీరి మృదంగ విన్యాసం పలు పో కడలు పో యింది .ఏడవ ఏట ప్రా రంభ మైన కచేరీ యాభై
తొమ్మిదవ ఏటి దాకా అవిచ్చిన్నం గా కొన సాగుతోంది .అంతకు ముందు ఎవరూ మృదంగం తో సో లో కచేరి చేసిన వారు
లేరు .ఎల్లా తో నే అది ప్రా రంభమైనది అదీ వారి ఘనత .రోజుకు 16 గంటలు కఠోర సాధన చేసే వారు .ఆ విద్య అంతు
చూడాలనీ ఆరాటం వారిని అంత పని చేయించింది .ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే వారు అసలు స్కూల్ కు
మొదటి సారిగా భారత రాష్ట ్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణ న్ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా బంగారు వీణ
ను పొ ందారత. .అది ఆరుగురు రాష్ట ్ర పతుల నుంచి పురస్కారాలను పొ ందిన ఘనత వారిది .అందరుప్రదాన మంత్రు ల
నుండి బహుతులను స్వీకరించారు .1984 లో అమెరికా లోని నార్త్ కరోలిన లో ఉన్న షార్లెట్ కు వచ్చి కచేరి చేశారట
.మళ్ళీ ఇదే రావటం .శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తు లు ఎల్లా వార.తన బలం అంతా ఆ అమ్మదనంటారు
.ప్రభుత్వం తో సంప్రదించి ఏం .ఏ.మృదంగ కోర్సు ను ఏర్పాటు చేయించారట .అప్పటికి సిలబస్ అనేది లేదు వీరే సిలబస్
ను తయారు చేసి అందించారు .ఆ ఘనత ఎల్లా వారిదే .ఎన్నో విశ్వ విద్యా లయాలలో మృదంగ విద్యను ప్రవేశ
పెట్టించారు .కోర్సులను ఏర్పాటు చేసి పర్య వేక్షిస్తు న్నారు .నిరంతరం అదొ క తపస్సు గా కొన సాగిస్తు న్నారు .వీరి
పరిశోధనకు మొదటి స్థా యి జాతీయ బహుమతి పొ ందారు ఘన సత్కారం జరిగంి ది .తానొక బాల మేధావిని అని ఆయన
. ఇప్పుడు వారు చేసిన ప్రయోగాల గురించి తెలుసు కొందాం -మొదటి సారిగా 30 వాద్యాలతో ''శివ తాండవం
''చేశారు .దీనికి అంతర్జా తీయ బహుమతి పొ ందారు .ఆది శంకరా చార్యుల వారి స్తో త్రా లకు సంగీతాన్ని సమకూర్చి మంచి
ప్రచారం చేశారు వారికి కీర్తి లభించింది .150 మంది తో ''త్రివేణి సంగమం ''అనే సంగీత నాట్య ,వాద్య సంగీతం తో అద్భుత
కళా రూపాన్ని రూపొ ందించి పలు ప్రశంసలందు కొన్నారు .ఇది ప్రత్యక్ష ప్రసారమై అన్ద రిని ఆకట్టు కొన్నది హైదరా బాద్
లోని కలిత కళా తోరణం లో మూడు గంటల పాటు సాగిన ఎల్లా వారి కళా సృష్టి .ఇది . తనకు దేశ విదేశాలలో
రెండు వేల మంది శిష్యులున్నారని గర్వం గా చెప్పు కొన్నారు .అందులో పది మంది ఏ వన్ మృదంగ వాద్య
కారులున్నారనిఇంతమంది ఇంకే కళా కారునికి లేరని చెప్పారు .1972
సార్లు వచ్చానన్నారు .
సంగీతం వినటం ఒక కళ అని ,ప్రదర్శన ఇంకో కళ అనీ ఆ రెండిటి మీద ఇప్పుడు ద్రు ష్టి పెట్టి యువకులకు నేర్పు
తున్నానని చెప్పారు .వీణా ,వేణువు మృదంగం మాత్రమే భారతీయ వాద్యాల్ని సామ వేదం లో నుంచి సంగీతం
జన్మించిందని యజుర్వేదం నుంచి మృదంగా విర్భావం జరిగిందని వివ రించారు .యెన్.టి.రామా రావు ముఖ్య మంత్రి గా
ఉన్న కాలమ్ లో విద్యాలయాలలో సంగీతం నాట్యం నేర్పే ఏర్పాటు చేయించానని అన్నారు .ఈ కళల వల్ల ఏకాగ్రత
,ఆరోగ్యం ,ప్రవర్త న ,సంస్కారం అబ్బుతాయని అందుకే వాటిని ప్రవేష పెట్టిన్చామని అన్నారు .పీ.వి.నరసింహా రావు
మానవ వనరుల శాఖ మంత్రి గా రాజీవ్ గాంధి ప్రధాని గా ఉన్నప్పుడు నవోదయ కళా శాలల్లో సంగీతం నాట్యం లను ఆయా ప్రా ంతాలకు
తగిన వాటిని ప్రవేశ పెట్టిన్చామని చెప్పారు .అలాగే దేవాలయాలలో హరికధలు ,నాదస్వరం ,మృదంగ విద్వాంశులని
ఏర్పాటు చేయించ గలిగామని దాని వల్ల నాలుగు వేల మంది కళా కారులకు మేలు కలిగిందని చెప్పారు .
నేను ఇంతగా వృద్ధి లోకి రావటానికి సమాజం నాకు కొండంత అండ గా నిల బడింది .కనుక సమాజానికి
నేనేమి చేశాను /అని ప్రశ్నించుకొని తను పని చేస్తు న్నాను అని వినమ్రంగా చెప్పారు .మానసిక,శారీరక రుగ్మతలతో
బాధ పడే వారి కి ఆరోగ్యం పెంపొ ందించటానికి మృదంగ తెరపి ని ప్రవేశ పెట్టి కృషి చేస్తు న్నట్లు తెలిపారు .వేదానికి విశ్వ
విద్యాలయం ఉంది కాని సంగేతానికి విశ్వ విద్యాలయం లేదు కనుక దాన్ని ఏర్పాటు చేయటానికి సర్వ శక్తు లు ఒడ్డి
ప్రయత్నిస్తు న్నానని అది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తు ందని రాష్ట ్ర ప్రభుత్వం అంగీకరించి కావలసిన విధి
విధానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిందని త్వరలో అది నేర వేరు తుందని ఆనందం గా చెప్పారు .ఇది తన డ్రీం ప్రా జెక్ట్
అన్నారు .
తాను ఏదేశం వెళ్ళినా భారతీయ సంగీతం, కుటుంబ వ్యవస్థ సంస్కృతీ ,సంప్రదాయం ,ధార్మిక జీవనం
,వివాహ వ్యవస్థ లపై నే ద్రు ష్టి పెట్టి మాట్లా డుతానని ఈ వ్యవస్తా లను బలో పేతం చేయక పొ తే భవిష్యత్తు లేదని ఆవేదన
చెందారు .ఇక్కడి వారంతా మన సంస్కృతిని సంస్కారాన్ని భాషను సాహిత్య సంగీతాలను ప్రో త్స హిస్తు న్నందుకు
సంగీతం లో మంచి వార సత్వం కోన సాగు తున్నందుకు ఆనందం గా ఉందని తెలిపారు .ఎల్లా ను చుస్తే భారతీయత
,తెలుగు దనం మూర్తీభవించిన వ్యక్తీ లా మనకు కనిపిస్తా రు .ఏదేశ మేగినా యందు కాలిడినా ఆయన దీన్ని
పకాయలు ,గుమ్మడి కాయ
సాయంత్రం ఇక్కడ కమ్యునిటీ హాల్ లో ఎల్లా వారితో ఒక get to gether ఏర్పాటు చేశారు .రాత్రి ఎనిమిది
గంటలకు ప్రా రంభమైన ఆ ఆత్మీయ సమా వేశం -రెండు గంటల సేపు సాగింది .వారిని దాదాపు పాతిక కుటుంబాల వారు
కలిసి పరిచయం చేసుకొన్నారు .సుమారు యాభై మంది అభిమానులు చేరి వారి తో ప్రత్యక్షం గా మాట్లా డి పరిచయం
పొ ందారు .దీనిని అతి త్వరలో ఏర్పాటు చేసిన మా అమ్మాయి విజయ లక్ష్మి నాగమణి గాయత్రి రమా రాచ కొండా.వారి
భర్త లు మొదలైన వారందరూ అభి నంద నీయులు .అందరికి ఉపాహారం గా ఇడ్లి చట్ని సాంబారు ఉప్మా ,పులిహో ర
,బొ ండా వెజిటబుల్ బిర్యాని కర్బుజ ముక్కలు పెరుగు, అన్నం,ఆవకాయ , ,మామిడి జూసు అందించారు .ఎల్లా వారిని
మృదంగం పై కొంత సేపైనా వాయించమని అభిమాను లందరూ కోరారు .తాన మృదంగాన్ని కాలి ఫో ర్నియా నుంచి తాన
బృందం తో ఇండియా కు పంపించానని దాని మీద వాయిస్తేనే తృప్తి గా ఉంటుందని ,అది లక్ష రూపాయల మృదంగం
అని అందుకని వాయించనందుకు అన్యదా భావించ వద్ద ని కోరారు .కొంచెం నిరుత్సాహ పడ్డ అభిమానులు వారు మళ్ళీ
జూన్ నెలలో ఇక్కడికి వచ్చి తాన బృందం తో వాయించి సంతోషం కలిగిస్తా నని చెప్పి ఊరడించారు . .నాద విందు భోజనం
లేక పో యినా పదార్ధా ల విందు ఆర గించి అందరు రాత్రి పదిన్నరకు ఇళ్ళకు చేరు కొన్నాం
విశ్వ నాద్ దే నని మనవి చేశారు
దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళు సీతా ,అనసూయ ల గురించి తెలియని ఆంధ్రు లుండరు .జాన
పద సంగీతాన్ని బంగారు పల్ల కి లో దేశ విదేశాల్లో ఊరేగించిన సో దరీ మణులు .దేవుల పల్లి వారి
గీతాలను దేశ మంతా పాడి తెలుగు జన హృదయాలను రస ప్లా వితం చేసిన వారు .అలాంటి ఇద్ద రి లో
అనసూయ గారు వివాహం చేసుకొని అవసరాల అనసూయ అయారు .ఆమె పుత్రికా రత్నమే రత్న పాప
.రత్న పాప ప్రసిద్ధ కూచి పూడి నృత్య దర్శకులు ,పద్మశ్రీ డాక్టర్ వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు
.గురువు గారి వద్ద గొప్ప శిక్షణ పొ ంది ,ఆయనతో ను ,ఆమె ఇతర కళాకార సహాధ్యాయిను లతో ను ఆంద్ర
దేశ మంతా పర్య టించి ,వందలాది ప్రదర్శన లిచ్చి పేరు తెచ్చు కొన్నారు .కుమార్ అనే వారిని వివాహం
చేసుకొని ఇప్పుడు ''రత్న కుమార్ ''గా వ్యవహింప బడుతున్నారు .సుమారు25 ఏళ్ళు గా అమెరికా లో
టెక్సాస్ రాష్ట ం్ర లోని హూస్ట న్ నగరం లో ''అంజలి ''అనే నాట్య సంస్థ ను స్తా పించి నృత్య సేవ చేస్తు న్నారు
.అందులో కూచి పూడి తో బాటు భరత నాట్యం మొదలైన భారతీయ నృత్య రీతులను అన్నిటిని నేర్పు
తున్నారు .వందలాది విద్యార్ధు లకు ఆమె శిక్షణ నిచ్చి రంగ ప్రవేశం చేయించి ,వారి నాట్యాభి రుచికి
దో హదం చేస్తు న్న మహా కళా కారిణి రత్న పాప .ఆమె సంస్థ anjali -center for indian performance
arts .
2002 లో మేము అమెరికా కు మొదటి సారిగా మా అమ్మాయి వాళ్ళు ఉన్న హో స్ట కు వచ్చాం .అక్కడ
మా బంధువు వావిలాల లక్ష్మి గారు ఒక రోజు న మమ్మల్ని రైస్ యూని వేర్సిటి లో ఒక అమ్మాయి కూచి
పూడి నేర్చి ,రంగ ప్రవేశం చేసే కార్య క్రమానికి తీసుకు వెళ్లా రు .అప్పుడు రత్న పాప గారి దగ్గ రకు నేను
,నా శ్రీ మతి వెళ్లి పలకరించాం .చాలా చక్కగా మాట్లా డారు .అక్కడే ఉన్న వారి తల్లి గారు అనసూయ
గారిని పరిచయం చేశారు .ఆమె మా చిన్నప్పటి నుండి తెలిసిన ఆవిడే .కృష్ణ శాస్త్రి గారి తో మా పరిచయం
గుర్తు కు తెచ్చు కున్నాం .ఆమె మేమెవరో తెలిసి ఆశ్చర్య పో యారు .దేవుల పల్లి వారిని ఆమె
''మామయ్యా ''అనే సంబో ధిస్తా రు మద్రా స్ లో ఉన్న మా పెద్దక్కయ్య లోపాముద్ర ,బావ క్రు పా నిది గార్లు
అనసూయ గారికి బంధువులే . బాగా తెలుసు ,అవన్నీ గుర్తు చేసుకొన్నారు .శాస్త్రి గారి భార్య అంటే ఆమె
అత్త య్య చని పో యిందనీ చెప్పారు .వాళ్ళింటికి రమ్మన్నారు కాని ఎందుకో కుదర లేదు .ఆ తర్వాత
మూడేళ్ళ క్రితం వెంపటి చిన సత్యం గారు కూచి పూడి లో జరిపిన సిద్ధేంద్ర ఆరాధనో త్స వాలకు రత్న
పాప ఆయన ఆహ్వానం పై అమెరికా నుండి గురువు గారి మీది భక్తీ తో కూచి పూడి వచ్చి రెండు రోజుల
కార్య క్రమం లో పాల్గొ ని వెళ్లా రు .నేను ఒక రోజు కార్య క్రమం లో ఆమె ను చూసి హూస్ట న్ పరిచయాన్ని
జ్ఞా పకం చేశాను .ఆమె ఆనందించింది .ఆ వేదిక మీద lecture cum demonstration చేసింది రత్న పాప
.నేను స్పందిస్తూ శ్రీ నాద మహా కవి భీమ ఖండం లో రాసిన పద్యం -వ్యాసునికి కాశి లో విశ్వనాధుడు
విశాలాక్షీ కన్పించిన తీరు ను ఒకే పద్యం లో వర్ణించిన దాన్ని''చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి -నీల
కుంతల ఫాల ,నీల గలుడు --ధవలాయ తెక్షణ ,ధవలాఖి లాంగుండు మదన సంజీవని మదన హరుడు -
నాగేంద్ర నిభ యాన ,నాగ కుండల దారి ,భువన మోహన గాత్ర భువన కర్త '' చది వాను .ఆమె చిన్న పాప
లా గా నా దగ్గ రకు పరిగత
ె ్తు కొని వచ్చి ''మేష్టా రు మాస్టా రు ఆ పద్యం చాలా అద్భుతం గా ఉంది .ఇదే
నేను మొదటి సారి వినటం .అది నాకు కాగితం మీద రాసివ్వరా నేను నా శిష్యులకు దాన్ని నృత్య రూపం
లో పెట్టి నేర్పిస్తా ను ''అని కోరింది .ఆనందం గా అంగీక రించి రాసిచ్చాను .ఈమధ్య హూస్ట న్ లో జరిగిన
''నాటా ''తెలుగు సభల వారు ప్రచురించిన సావనీర్ లో ఆమె తన గురువు గారిని గుర్తు కు తెచ్చు కుంటూ
,తన నృత్య ప్రస్థా నాన్ని గొప్పగా ఆవిష్కరించారు .అందులోని కొన్ని ముఖ్య విషయాలు ,ఆ విదుషీ మణి
సాధనను మీకు అండ జేస్తు న్నాను .
రత్న పాప తన తల్లి అనసూయ గారి వల్ల కూచి పూడి నాట్య ప్రా భవాన్ని తెలుసు కొన్నారు .అందులో
ప్రవేశించే సంకల్పం కలిగి దాన్ని అభయ సించి ప్రపంచానికి కూచి పూడిని పరిచయం చేసే గొప్ప
అదృష్టా న్ని పొ ందింది .అప్పుడే ఆమె కు నట రాజ రామ కృష్ణ ,కోరాడ నరసింహా రావు ,బందా కనక
లింగేశ్వర రావు లాంటి మహా ను భావాలతో పరిచయం కలిగింది .ఇదంతా ఆమె మద్రా స్ లో తల్లి గారింట
ఉన్నప్పటి సంగతులు .అలానే నరసింహా చారి గారి బంధువు రామాచారి గారి తోను పరిచయం .కూచి
పూడి నాట్య గురువులు వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారిని ''తాతయ్య గారూ ''అని పిలిచేది .ఆయనే
తనను మూడేళ్ళ వయసు లో ఒడి లో కూర్చో బెట్టు కొని హస్త ముద్ర లను నేర్పించారట .ఆయన గానం
చేసే ''వసంత స్వర వల్ల రి ''ణి ఇప్పటికి మరిచి పో లేనంటారు .అనుభూతి తో పాడి కాళ్ళ వెంట ఆనాడ
భాష్పాలు కార్చే వారట .అందరికి అదే అనుభూతి కలిగేది .అప్పటి నుంచే తనకు కూచి పూడి మీద అభి
రుచి కలిగిందని చెప్పింది రత్న పాప .
తల్లి అనసూయా దేవి వెంపటి చిన సత్యం గారిని రత్న పాప రంగ ప్రవేశానిని నాట్యాన్ని సమ కూర్చమని
కోరారట .అలానే ఆయన ఆనందం గా అంగీకా రించి కోరియాగ్రఫీ చేశారు .ఈ నాటి వరకు ఆ పాటను
పూర్తిగా సాహిత్యం తో తాను తప్ప ఇంకెవరూ రంగం మీద నటించ లేదని ఆనందం గా గర్వం గా తెలియ
జేశారు .దీనికి తన నాట్య గురువు సత్యం గారికి జీవితాంతం కృతజ్ఞు రాలీని అంటారు వినమ్రం గా .
1961 లో హై స్కూల్ చదువు పూర్తీ అయింది .కాలేజి లో చేరటానికి కొన్న్ని నెలల వ్యవధి ఉంది
.అందుకని ఈ లోగా నాట్యం నేర్చు కోవాలని కోరిక కలిగింది .తల్లి గారు వెంపటి సిన సత్యం గారి వద్ద
చేర్చారు .అప్పటికే సత్యం గారు నాట్య వ్ద్యాలయం స్తా పించి కూచి పూడి నాట్యాన్ని మద్రా స్ నుండి వ్యాప్తి
చేస్తు న్నారు .ఆంద్ర మహిళా సభ స్తా పించిన దుర్గా బాయ్ దేశముఖ్ ,వగైరాలు సత్యం గారి కౌశలానికి
ముగ్దు లయారు .లజ్ చర్చ రోడ్ లో నాగేశ్వర రావు పార్క్ దగ్గ ర వెంపటి వారి విద్యాలయం ఉండేది .ఆంద్ర
మహిళా సభ రజతోత్స వాలకు సత్యం గారిని తెలుగు లో ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించ మని
అనసూయ గారికి చెప్పారు .అనసూయ గారు వెంటనే భుజంగ రాయ శర్మ గారు రాసిన ''శ్రీ కృష్ణ
పారిజాతం ''నృత్య రూపకం ను ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పారు .రత్న పాప సత్యభామ గా ,రమా
రమణ రుక్మిణిగా ,కుచల కుమారి కృష్ణు డిగా సుకుమారి నారడుగా పాత్రలతో సత్యం గారి ఆధ్వర్యం లో
ప్రదర్శన జరిగి బ్రహ్మాండ మైన విజయం సాధించింది .దానితో రత్న పాప కు కూచి పూడి మీద ఆసక్తి
విపరీతం గా పెరిగింది .
సత్యం గారు ఇంటికి వచ్చి నాట్య శిక్షణ నిచ్చే వారు .దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి గొప్ప రచన ''కొలువైతివా
రంగ సామి ''కి సత్యం గారు నృత్య రీతులు నేర్పారు ..అ తరువాత 'విప్రనారాయణ ''నాటకం మొత్త ం
నేర్పారు అందులో రత్న పాప దేవ దేవి గా ,ఈ నాటి సినీ నటుడు చంద్ర మోహన్ ఆల్వార్ గా ,పద్మ
విభూషణ్ డాక్టర్ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మొత్త ం అందు లోని పాటలన్నీస్టేజి మీద పాడిన
గాయకుడి గా దాన్ని నిర్వహించారు .ఇది రత్న పాప జీవితం లో మరపు రాణి ఘట్ట ం గా అభి వర్ణించారు
.
రత్న పాప సో దరి సీతా రత్న కుమార్ ,మద్రా స్ దూర దర్శన కేంద్రా నికి అసిస్టెంట్ డైరెక్టర్ .ఆమె
ఈమెకన్న ముందే కూచి పూడి నృత్య అకాడెమి లో చేరంి ది .తనకంటే ముందే చాలా నృత్యాలు
అభ్యసించింది .1967 లో ఆమె తో కలిసి కూచి పూడి రంగ ప్రవేశం చేశారు .1968 లో రత్న పాప కు కూచి
పూడి నృత్యానికి సంగీత నాటక అకాడెమి నుండి మొదటి స్కాలర్షిప్పొందింది .దీన్ని పొ ందిన తోలి
విద్యార్ధిరత్న పాపే .ఇదంతా మాస్ట రు గారి కృపా కటాక్ష వీక్షణమే అని సంబర పడుతుంది .
మద్రా స్ లో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట ర్ వేణు గారింటికి దగ్గ ర లో చిన్న గది లో ఉన్న ఆకాడేమి
తర్వాతా పానగల్ పార్క్ దగ్గ ర పెద్ద ప్రా ంగణం లోకి మారింది .క్రమంగా నేర్చే వారి సంఖ్య కూడా పెరిగింది
.మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి .మాస్ట ర్ సత్యం గారి వద్ద వైజయంతి మాల ,రేఖా ,హి మా మాలిని
,చంద్ర కళా ,చంద్ర మోహన్ ,లక్ష్మీ విశ్వనాధన్ ,రాదా ,జ్యోతి రాఘవన్ ,క్షేమావతి ,రేఖ కజిన్స్ ప్రతిభ
సుధా ( వేదాంతం రాఘవయ్య గారి కూతుళ్ళు )మొదలైన హేమా హేమీ లంతా నృత్యం నేర్చారు
.సాయంత్రం పూట శిక్షణా తరగతు లు జరిగేవి .అందరికి శ్రద్ధతో విద్య నేర్పే వారు సత్యం గారు .అలసట
అంటే ఏమిటో వారికి తెలీదట .కూచి పూడి గ్రా మాన్ని గురించి అక్కడ నేర్పే విధానాన్ని గురించి తమతో
ముచ్చటించే వారట.కూచి పూడిడి ''విశ్వ వేదిక ''కు పరిచయం చెయ్యాలి అ నేదే సత్యం గారి కల అని
రత్న పాప అంటారు .దేశమంతా తన సో దరి తో కలిసి ప్రదర్శన లిచ్చింది రత్న పాప .వెంపటి చిన సత్యం
గారి ట్రూ ప్ లో తానూ మిగిలిన కళా కారినులు కలిసి ట్రైన్ లో వివిధ పట్ట ణాలకు ,నగరాలకు వెళ్లి
ప్రదర్శించిన అనుభవాలు మరచి పో లేనివి అంటుందామె .మజ్జిగ రసం తాగుతూ ,పులిహో ర తింటూ
గడిపిన రోజులు మధురాలని అన్నది .శోభానాయుడు కృష్ణు డిగా ,పద్మిని రుక్మిణిగా ,తాన సత్య భామ గా
శ్రీ కృష్ణ పారిజాతాన్ని సింహాచలం లో ప్రదర్శిస్తు ఉంటె వేదిక ఒరిగి పో యినా దాన్ని అలానే కోన సాగించి
అదీ దానిలో భాగమే ననే అనుభూతిని ప్రేక్షకులకు కల్గించిన సంఘటన చిర స్మరణీయం అన్నారు .అంతా
అయిన తర్వాత మాస్ట ర్ గారు నవ్వుతు దాన్ని జ్ఞా పకం చేసుకోవటం భలేగా ఉందట .
చా లా కాలం తర్వాత్ గురువు గారి కల సాకారమైంది .గ్రీన్వే రోడ్డు లో కొత్త అకాడెమి సర్వాంగ సుందరం
గా రూపు దాల్చింది .అన్ని సౌకర్యాలలతో అలరారింది .అందరి దృష్టి లో పడి దేశ విదేశీయులు వచ్చి
శిక్షణ పొ ందటం మొదలెట్టా రు అందులో మాస్టా రు రాజసం గా మహా రాజు లాగా ఠీవి గా కూర్చుని తమ
కందరికీ కన్నుల పండువ చేశారని సంబర పడి పో యారు రత్న పాప .అన్ని క్లా సులను సత్యం గారే
నిర్వహించే వారట .విద్యార్దు లతో సంస్కృతం ,నాట్యం గురించి అధ్యయనం చేయించే వారట .సంపూర్ణ
కళా స్వరూపం గా నృత్యాన్ని ప్రదర్శించాలని మాస్టా రు గారి ఆకాంక్ష .ఆయనకు అభినయ దర్పణం
,నాట్య శాస్త ం్ర కరతలా మలకం .ఆయన లేచి నిలబడి ఒక భంగిమ ను అభినయించి చూపు తుంటే
సాక్షాత్తు ఆ శివుడే దిగి వచ్చి ప్రదర్శిస్తు న్నాడు అనే భావం తామందరికీ కలిగేదని ఆమె మురిసి పో యారు
.అంత నిర్దు ష్ట ం గా ఆయన శిక్షణ ఉండేది .
రత్న పాప ఒక సారి దేవుల పల్లి వారి ''క్షీర సాగర మధనం ''నృత్య రూపకం లో మోహిని గా మాస్ట ర్ గారు
శివుని గా వేశామని అది తాను జీవితాంతం గుర్తు ంచు కో దాగిన మహాద్ఘ టన అని అన్నారు .ఆహార్యం తో
నే సత్యం గారు నట్టు వాంగం చేస్తూ అభినయిస్తూ ద్విపాత్రా భినయం చేయటం చిరస్మరణీయం అంటారు
.గురువు గారితో కలిసి నటించే మహా భాగ్యం తనకు కల్గి నందుకు ఆమె పొ ంగి పో తున్నారు .అది ఎవరికీ
లభించని మహదవకాశం .
వింజమూరి రత్న పాప అనే రత్నకుమార్ తన నాట్య విద్యా నుభావానికి ,కూచి పూడి నృత్య వ్యాప్తికి
భారత ప్రభుత్వం నుండి సంగీత నాటక అకాడెమి అవార్డ్ ను పొ ందిన ఏకైక N.R.I.-ఇంకేవరికిఅలాంటి
పురస్కారం ఇంత వరకు దక్కలేదు .ఆంధ్రు లు గా ఇది మనందరికి గర్వ కారణం .
పార్ధ సారధీయం
అందరికి శ్రీ కృష్ణా ష్ట మి శుభా కాంక్షలు .పార్ధు డు అంటే అర్జు నుడు .అతనికి సారధి శ్రీ కృష్ణు డు కనుక కృష్ణు డు
పార్ధ సారధి అని పిలువ బడుతున్నాడు .కృష్ణు డు చెప్పింది'' పార్ధ సారధీయం .'' అదే భగవద్గీత .దాని సందేశాన్ని
మా అమ్మాయి ఇంటి ప్రక్కన ఉంటున్న మారెళ్ళ గాయత్రి గారి తండ్రి గారు స్వర్గీయ మారెళ్ళ పార్ధ సారధి రావు
గారు ''గీతా సందేశం ''పేర పుస్త కం రాసి ప్రచురించారు .ఆవిడ ఆపుస్త కాన్ని ఈ మధ్యనే ఇచ్చింది .అందులోని
విషయాలను సంక్షిప్త ం గా 'పార్ధ సారధీయం '' అని ఆయన పేరు కూడా వచ్చేటట్లు ''కృష్ణా ష్ట మి'' సందర్భం గా
అందిస్తు న్నాను .
న్యూటన్ శాస్త జ్ఞు
్ర డు పదార్ధము ను సృస్తిన్చలేమని ,నశింప జేయ లేమని అన్నాడు .అది ఒక రూపం
నుండి వేరొక రూపం లోకి మారుతుంది . అలాగే ఈ జన్మ పో యి ఇంకో జన్మ కూడా వస్తు ంది అయిస్తీన్ సిద్ధా ంతం
ప్రకారం కూడా ,విశ్వ పదార్ధ మూల మైన పరమాణువులు విచ్చేదంచెంది ,నిరాకారమైన శక్తి తరంగాలుగా
మారుతాయి .వీటిని ఊహించటం ,వర్ణించటం చేయ లేమని అన్నాడు దీనినే ఆయన undefinable unified
theory అన్నాడు .బౌద్ధ గురువు లాబ్ సాంగ్ రామ్పా --గ్రు డ్డు రూపం లోనుంచి గొంగళి పురుగు గా మారి సీతా కొక
చిలుక ఏర్పడుతుంది .దానికి తాను గొంగళి పురుగు నుండి వచ్చి నట్లు తెలియదు .అది ఒక దశ నుండి మరణం
లాంటి స్తితినే పొ ంది ,మరొక దశను పొ ందింది .మనం అది పొ ందే రూప విక్రియలన్ని చూడ గాలుగుతున్నాం .దీన్ని
బట్టి ఆలోచిస్తే మన పునర్జన్మ సిద్ధా తం కూడా అలాంటిదే నని పిస్తు ంది అన్నారు ..అందుకే భగవద్గీతలో
భగవానుడు ''శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయ గలవు .ఆత్మను మాత్రం ఏమీ చేయలేవు .శస్త్రా లు నిప్పు
,గాలి శరీరాన్ని నాశనం చేయ గలవు .కాని ఆత్మను నాశనం చేయలేవు .ఆత్మ నిత్యం .అంతటా వ్యాపించి
ఉంటుంది .అది స్తిరం ,అచలం ,సనాతనం .బాహ్య భూత వికారాలేవీ దాన్నేమీ చేయలేవు .
ధర్మ పో రాటం లో జయాప జయాలు లాభ నష్టా లు బేరీజు వెయ రాదు .ధర్మమే లక్ష్యం గా కర్త వ్యాన్ని కోన
సాగించాలి .క్షత్రియుడికి యుద్ధ ం చేయటం స్వధర్మం .కనుక మనకు నిర్దేశింప బడిన కార్యాలను తప్పక చేయాలి
.కర్త వ్య దీక్షతో ,అంకిత భావం తో చేయాలి .శక్తి యుక్తు లన్నీ ధార పో సి చేయాలి అని కృష్ణు ని బో ధ .కర్మలు చేసే
టప్పుడు ఫలితం ఆశించ కుండా చేయాలి .భగవంతుని అర్పించే భావం తో చేయాలి అప్పుడు ఆ కర్మలు మనల్ని
బంధించవు .అలాగని చెడ్డ పనులు చేసి వాటినీ భగవంతునికి అర్పణం అంటే బెడిసి కొడతాయి .దీనినే'' కానందుడు
''అంటే వివేకా నంద స్వామి ''Results will follow in course of time .one can not get results just as one
pleases .one can not cancel them .,escape from them ,or mitigate them .Anxious expectations of
results will only lead to restlessness and worry ''అని స్పష్ట పరచాడు .
పరమాత్మ అంటే సచ్చిదా నంద స్వరూపుడు .సత్ అంటే -భూత ,భవిష్యత్ ,వార్త మానాలలో ఎప్పుడు
నిలకడ గా నిలిచి ఉండేది .చిత్ అనగా -విజ్ఞా న సర్వస్వం( knoweldge ).ఆనందం అంటే -అపరి మిత మైన
సంతోషం(bliss ) .వీటి సమ్మేళనమే భగవంతుడు .ఆయన సర్వ వ్యాపి ,సర్వజ్ఞు డు ,సర్వ శక్తి మంతుడు ,ఆనంద
మయుడు అని వీటి భావం .ఆయన ఒక శక్తి స్వరూపం .జీవుడు ఆ పరమాత్మ తత్వానికిపతి
్ర బింబం .ఆత్మ అనేది
పరమాత్మ యొక్క వెలుగు .ఆత్మ తత్త ్వం ,మళ్ళీ ఆ పరమాత్మ తత్వాన్ని పొ ందటమే .ప్రతి జీవి తన
అంతరాంతరాల్లో తాను కోరుకొనేది -ఎల్ల ప్పుడు ఉండాలని (సత్ ),తాను అన్నీ తెలుసు కోవాలని (చిత్ ),తాను
ఎప్పుడూ సంతోషం గా ఉండాలని (ఆనందం )కోరుకొంటు నే ఉంటాడు .ఈ సచ్చిదానంద స్వరూపం కావాలని ,తిరిగి
పరమాత్మ లో ఐక్యం అవాలని చేసే ప్రయత్నమే జీవిత గమ్యం .ఈ జీవిత యానం లో చేసే మంచి ,చెడు కార్యాలు
వాసనలు (tendencies )ఏర్పడి ,ఆ పాప పుణ్యాల ను అనుభ వించ టానికి మరో శరీరాన్ని ధరిస్తు న్నాడు .ఈ
బంధాలన్నీ విడి పో తే ,జన్మ రాహిత్యాన్ని పొ ంది ,మోక్షాన్ని పొ ందుతాడు .ఇక్కడే భారతీయ తత్వ వేత్తలు మూడు
సిద్ధా ంతాలను ప్రతి పాదించారు .ఆది శంకరులది -అద్వైత సిద్ధా ంతం -పరమా త్మ యొక్క మాయయే ఈ జగత్తు
.మానవులు అజ్ఞా నం వల్ల పరమాత్మ తత్వాన్ని కోల్పోయి మానవుడు అని భ్రమ లో ఉంటాడు .ఆ అజ్ఞా నం
తొలగితే ,మానవుడే మాధవుడవు తాడని దీని భావం .రామానుజా చార్యుల వారిది విశిష్టా ద్వైతం --పరమాత్మ తేజో
మయుడు అయితే ,ఆయన వెలుగు మానవులు .ఆయన అగ్ని జ్వాల అయితే ,మానవులు అగ్ని కణాలు
.వైరాగ్యం ద్వారా మానవుడు మళ్ళీ పరమాత్మను చేరుతున్నాడు .ఇదీ వీరి పద్ధ తి .మూడో ది మధ్వాచార్యుల వారి
ద్వైత సిద్ధా ంతం --భగవంతుడు వేరు ,ఆయనకు అత్యంత ప్రియ భక్తు డైన మానవుడు వేరు .మానవుడు భక్తీ ద్వారా
,భగ వంతుని సన్నిధానానికి చేరి ,పరమ శాంతిని పొ ందుతాడని ఈ సిద్ధా ంతం ఈ మూడు వేరుగా కనీ పిస్తు న్నా
అది నిజం కాదు .ప్రా ధమిక దశలో ద్వైతాన్ని అనుసరించి భక్తు డు అవుతాడు .తర్వాత విశిష్టా ద్వైతం ద్వారా ధ్యాన
పద్ధ తి లోదగ్గ రై, అద్వైత విధానం లో జ్ఞా నాన్ని పొ ంది ముక్తు డవుతాడు .ఇలా భావిస్తే ఏమీ విరోధం లేదు
.మహానుభావులు మనకోసం సో పాన పంక్తు ల్ని నిర్మించారు .ఆ మెట్లు ఎక్కి మనం చేరాల్సిన చోటికి చేరాలి .
పరమాత్మ గంభీర సముద్రం వలె ప్రశాంతికి ప్రతీక .సముద్రం లో పుట్టే ,కెర టాల లాగా ఆత్మలు
జీవితాన్ని ధరించి ,తిరిగి సముద్రం లో కలిసి పో తు ఉంటాయి.కెరటం పైకి లేస్తే జీవితం గా కనీ పిస్తు ంది .అది
సముద్రం లో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోయి లయం అవుతున్నప్పుడు మరణం గా భావించాలి .కెరటం అసలు
స్వరూపం ప్రశాంత గంభీర సముద్రమే .అందుకే మహర్షు లందరు తమ మేధస్సులో వేద వాక్యాలను విని రుక్కులు
గా సాక్షాత్క రింప జేశారు .వారు చెప్పిందేమిటి ?''మీరు అమృత పుత్రు లు .ఆనంద స్వరూపులు .అంధకారానికి
అవతల ఉన్న భ్రా ంతికి అతీతుడైన ,సనాతనుడైన ,భగవంతుని మేమందరం దర్శించాం . .ఆ భగ వంతుని తెలుసు
కొంటేనే బాధలు, భ్రమలు అన్నీ తొలగి పో తాయి '' అని విస్పష్ట ం గా మార్గ దర్శనం చేశారు .
యోగ నిష్ఠ తో కర్త వ్యాన్ని నిర్వర్తించాలి .కర్మలలో సంగాత్వాన్ని లేకుండా ఉండాలి (.నాన్ అటాచ్ మెంట్
).ఫలితం లభించినా ,లభించక యినా సమ బుద్ధి కలిగి ఉండాలి (equanimity )కలిగి ఉండాలి .దీనినే మహేష్
యోగి ఇంకో రకం గా వివరించారు .సమస్యను పరిష్కరించ టానికి ఆ సమస్యకు దూరం గా ,అతీతం గా ఉండి
,ఆలోచించి తె పరిష్కారం తేలిగ్గా లభిస్తు ంది .ఒక విల్లు తో బాణాన్ని సంధించి నప్పుడు ,వింటిని వెనక్కి లాగి బాణం
వదులు తాము .అప్పుడది వేగం గా లక్శ్యం వైపుకు దూసుకు వెడుతుంది .ఈ వెనక్కు లాగటం అనేది సమస్యల
వలయం నుండి దూరం గా వెళ్లటం లాంటిది (withdrawn from the field of activity .).యోగం అంటే కర్మలను
ఆచరించే టప్పుడు చూపించే కౌశలం ,సంపూర్ణ జ్ఞా నమే .అప్పుడే దక్షత (efficiency )వస్తు ంది .జడస్తితి లో ఉన్న
మనిషి కి ,యే ఆశయమూ లేని వ్యక్తికీ కోరికలు ఉండక పో వచ్చు .ఆత్మా నందం పొ ందిన వాడి లో కోరికలు
,దుఖాలు దగ్గ రకు చేరవు .ఆ స్తితి లో తన విద్యుక్త ధర్మాన్ని అనాసక్తి తో నేర ర్చటమే స్తిత ప్రజ్నుని లక్షణం
.అతడు ప్రపంచం లోని పాప కార్యాలను ప్రో త్స హించడు. వాటి వల్ల చలించడు .ఇదీ ''పార్ధ సారధీయం ''అనే గీతా
సందేశం
అమెరికా వచ్చి బాగా సంపాదిస్తూ హాయిగా విలాస జీవితం గడ పచ్చు నని అందరు అనుకోవటం సహజం .ఈ మధ్య కొందరు
మాతృదేశాన్ని గుర్తించి ,అనేక సేవా ,అభి వృద్ధి కార్య క్రమాలలో భాగ స్వాము లవుతు ,జన్మ భూమి ఋణం తీర్చు
కొంటున్నారు .ఎక్కడ ఉన్నా మన చుట్టూ సమాజం ఉంటుంది .సమాజ పురోగతే మానవ ప్రగతి .ఈ రెండు అవినా భావ
సంబంధం కలిగి ఉంటాయి .మనం ఉంటున్న దేశం మనదే .అక్కడి సమాజమూ మనదే .అందు లో మనమూ ఒకల్ల మే ఈ
భావన వస్తే ,విశ్వ జనీన భావన కలుగు తుంది .అప్పుడు మనం చేసే సేవా కార్య క్రమాలకు ,అర్ధ ం ,పరమార్ధ ం లభిస్తా యి
.ఇలా సమాజ సేవా కార్య క్రమాలలో నిర్వి రామం గా పాల్గొ ంటూ ,తన చుట్టూ ఉన్న సమాజ ప్రగతికి దో హద పడుతున్న
తెలుగు వారెందరో ఉన్నారు .వారినే నేను ”అమెరికా లో ఆంద్ర తేజం ”అన్నాను .అలాంటి వారి లో అమెరికా ఆగ్నేయ రాష్ట ్ర
మైన అలబామా లోని హన్ట ్స విల్ నివాసి ,కృష్ణా జిల్లా వాసి అయినశ్రీమతి కాకాని భవాని గారు ముఖ్యులు గా కనీ పించారు
.క్రిందటి వారం నా అలబామా ప్రయాణం లో ,ఆమెను వారింట్లో భర్త డాక్టర్ ప్రసాద్ గారితో పరిచయం కల్గించారు నా మిత్రు లు
మైనేని గోపాల కృష్ణ గారు .ఆమె చేస్తు న్న సమాజ సేవా కార్య క్రమాలను వివ రించి చెప్పారు . ”సమాజ సేవా భవానీ దీక్ష”గా
ఆమె సాగిస్తు న్న కార్య క్రమాలను మన వారందరికి అంద జేయట మే నా ఉద్దేశ్యం .మిగిలిన వారు కూడా ప్రేరణ పొ ందుతారనే
విశ్వాసం .
ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లా లో కూచి పూడి కి దగ్గ ర గ్రా మం అయిన” పెడసన గల్లు ” లో భవాని జన్మించారు .మెన మామ
పెంపకం లో పెరిగారు .ఆయన ఈమె జీవితాన్ని తీర్చి దిడ్డ టానికి మంచి పునాది వేశారు .ఉయ్యూరు దగ్గ ర గ్రా మ మైన
ఆకునూరు నివాసి కాకాని బ్రహ్మేశ్వర రావు గారి పెద్ద కుమారుడుడాక్టర్ కాకాని ప్రసాద రావు గారి తో వివాహం జరిగింది
.ఇద్దరు అమెరికా చేరారు .ప్రసాద్ వైద్య వ్రు త్తి లో విశేష అనుభవాన్ని సంపాదించి అలబామా లో హన్త్స్ విల్ లో స్థిర పడ్డా రు
.సంతానం కూడా అభి వృద్ధి లోకి వచ్చింది .సమాజం లో ఆదర్శమైన వైద్యులు గా ఆయన పేరొందారు .జెనరల్ మరియు
వాస్క్యులర్ సర్జ న్ గా ప్రసాద్ లబ్ధ ప్రతిష్టు లు .కావలసి నంత సంపాదించి ,ఇక సంపాదన పై వైముఖ్యం పెంచుకొని వాలంటరీ
సమాజం లో వివక్షత కు గురైనపిల్లలను , సమాజవిస్మృత పిల్లలకు ఆమె అండా ,దండా గా నిలుస్తు న్నారు .వివిధ కారణాల
సల్ల విద్యకు దూరమైనబడి ఈడు బాల బాలికలను స్చూల్ల లో చేర్పించి ,వారి విద్యాభి వృద్ధికి పూర్తీ సహాయం అందిస్తు న్నారు
.దీనికి తార్కాణమే ఆమె the national children;s advocacy center in varjinia కు బో ర్డ్ చైర్ పెర్సన్ గా గౌరవ స్థా నాన్ని
అది రోహించటం .ఆమె సేవకు తగ్గ ప్రతిఫలం, ,పురస్కారం ఇది .
విద్య నేర్వటం తో పాటు సరైన వృత్తి ని ఎన్ను కోవటానికి తగిన సలహా సంప్రదింపులు ఇవ్వాలన్న ఆమె ఆలోచన మంచి కార్య
రూపం దాల్చింది .ఎందరికో మార్గ దర్శనం చేసింది .దీనికోసంwomen council foundation కు ఆరేళ్ళు నిర్విరామం గా పని
చేసి అనేక మంది కి ఉపాధి మార్గా లను కల్పించింది . U.A.H.foundation board commission ను ద్వారా అనేక
ముందడుగు పధకాలను చేబట్టి ఆదర్శ మహిళా గా నిల బడింది .randolph school ,women;s economic development
council foundtion board వంటి మరెన్నో సేవా సంస్థలతో ,వాటి సేవలో ప్రత్యక్ష భాగస్వామ్యం భావాన్ని గారికి ఉంది .
సమాజాభి వృద్ధి పధకాలలో ముందుండి నడి పించిన ముందు చూపున్న మహిళా భవాని .వీటి కోసం Hants villiie
maadisaan county కి అధ్యక్షు రాలిగా , హన్ ట్స్ విల్ తెలుగు సంస్థ కు ప్రా రంభ అధ్యక్షు రాలిగా పని చేసి తెలుగు భాషా
సంస్కృతుల ను సంరక్షించే అనేక కార్య క్రమాలను నిర్వ హించింది .కళా పురస్కారాన్ని అందుకొన్నది .కళా సంస్థ art council
కు నేతృత్వం వహించింది .హంట్ స్విల్ లోని అంతర్జా తీయ సంఘానికి మార్గ దర్శనం చేసింది .ఆ సంస్థ శత ,ద్వి శత
వార్షికోత్సవ నిర్వ హాణ లో ప్రముఖ పాత్ర వహించింది .
ఆమె ఆర్ధిక శాస్త ం్ర లో డిగ్రీ సాధించింది .బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో హన్త్స్ విల్ లోని అలబామా యుని వేర్సిటి
నుండి మాస్ట ర్ డిగ్రీ సాధించింది .ఆమె పత్రికా రంగం లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తు న్నారు .”ప్రవాసి హెరాల్ద్’అనే పత్రిక ను
స్థా పించి ,దాని సంపాదకు రాలుగా ఉంటూ ,దానినీ తన అభిరుచి మేరకు తీర్చి దిద్దు తున్నారు .’సమాజ సేవే ఉచ్చ్వాస
నిస్శ్వాసాలుగా అనుక్షణం జీవితాన్ని పండించు కొంటున్న ధన్య జీవి శ్రీ మతి కాకాని భవాని . అందరికి ఆమె జీవితం ఆదర్శం
కావాలి .ఉత్తేజం,ప్రేరణ పొ ందాలి .
అమెరికా జీవనం
2005 నుండి కాలి ఫో ర్నియా లోని హిందూ స్వయం స్వక సంఘం వార్షిక ''గురు వందనం ''కార్య క్రమాన్ని
క్రమం తప్పకుండా నిర్వహిస్తో ంది .ఈ యేడు కూడా జూన్ పదిహేను న ఉపాధ్యాయలను ఆహ్వానించి
సమ్మానించింది .వారి పాదాలను తాకి నుదుట తిలకం పెట్టి ఆనంద బాష్పాలు రాలుస్తూ యువకులు ,చిన్నారులు
తమ కోసం ఆహరహం శ్రమించి తమను తీర్చి దిద్దు తున్న గురు వరేణ్యులను అత్యంత శ్రద్ధా ద్ద భక్తు లతో
వారందరూ పూజించి,సత్కరించి తమ కృతజ్ఞ తలను తెలియ జేసుకొన్నారు .ఇది అందరిని ఆనంద సాగరం లో
2011. డిసెంబర్ లో బంగ్లా దేశ్ లో బీద విద్యార్ధు ల కోసం విశ్వ నికేతన్ అనే స్కూల్ ను ప్రా రంభించారు
.దీన్ని అమెరికా లోని లాభాపేక్షలేని గీతా సొ సైటీ వారు ఏర్పాటు చేశారు .దీని సంస్థా పకులు అమెరికా నేవీ మాజీ
ఆఫీసరు మరియు శాన్ జో స్టేట్ వర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ రామ చంద్ర ప్రసాద్ .ఈ సంస్థ ఒక లక్ష భగవద్గీత
పుస్త కాలను ఉచితం గా పంపిణీ చేసింది. అమెరికా లోని హిందూ సంఘటనకు ఈ సంస్థ దివ్యమైన కృషి చేస్తో ంది .
ఆస్ట్రే లియా లోని ''సిడ్నీ సంస్కృత విద్యా లయం ''లోని విద్యార్ధు లు సంస్కృతాన్ని నేర్చు కోవటమే కాదు
చక్కగా సంస్కృతం లో సంభాషిస్తు అందరికి ఆదర్శం గా నిలుస్తు న్నారు .స్థా పించి అయిదేల్లయింది .దిన దిన
ప్రవర్ధ మానం అవుతోంది .ప్రతి ఏడాది ''సంస్కృత ఉత్స వాన్ని ''ఘనం గా నిర్వ హిస్తు న్నారు .కిందటి నవంబర్ లో
దున్దా స్ కమ్యూనిటి సెంటర్ లో నిర్వ హించారు .అక్కడికి వచ్చిన అతిధులందరూ సంస్కృతం లో మాత్రమె
మాట్లా డటం గొప్ప ముందడుగు .శ్రీ ఛా.ము కృష్ణ శాస్త్రి గారు అక్కడ'' సంస్కృత భారతి'' అనే సంస్థ ను స్తా పించి
,సంస్కృతానికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావటానికి సర్వ శక్తు లు ధార పో సి పని చేస్తూ అనుకొన్నది
సాధిస్తు న్నారు .''సంస్కృతాన్ని పునరుద్ద రించి అందరికి అనుసంధాన భాష గా తీర్చి దిద్దటమే మా ధ్యేయం .ఆది
సామాన్యుని భాషను చేయాలనేదే మా సంకల్పం .దాని అపార జ్ఞా న సంపదను అందరికి అందించటమే మా
ధ్యేయం .సంస్కృతం తోనే సాంఘిక సామరస్యం ,జాతీయ సమైక్యత సాధ్యం అని నిరూపించటమే మా లక్శ్యం
.మాకు జాతి కుల మత భాషా భేదాలు లేవు ''అని వారు తెలియ జేస్తు న్నారు .
కమ్యూనిస్టు చైనా లో ఎన్నో ఊహా తీత మైన మార్పులొస్తు న్నాయి ,ముఖ్యం గా హిందువు లందరూ
గర్వించ దగిన సంఘటనలు అక్కడ చోటు చేసుకొంటున్నాయి. చైనా లోని ''wilken arts and crafts ltd .'' అనే
సంస్థ '' xiamen''లో ఏర్పడి అతి తక్కువ ఖర్చుతో పో లీ రేజిన్ పదార్ధం తో హిందూ దేవతా మూర్తు లను తయారు
చేస్తో ంది .రెండేళ్ళ క్రితేమే ఏర్పడిన ఈ సంస్థ గణేష్ ,బుద్దా విగ్రహాలను ఆటో డాష్ బో ర్డు వారికి తయారు చేసి
ఇచ్చింది . .అవి బాగా అమ్ముడు పో వటం తో ఇంకా ఎక్కువ రకాలను తయారు చేయటం లో నిమగ్న మైంది .పెద్ద
పెద్ద విగ్రహాలను నిర్మిస్తో ంది .సాయిబాబా ,లోక నాద్ ,షిర్డీ బాబా ,రామ కృష్ణ పరమ హంస మొదలైన విగ్రహాలను
ఆర్డర్ల మీద తయారు చేసి అందిస్తు న్నారు .కనీస ఆర్దర్ అయిదు వందల బొ మ్మలున్డా లి .చాలా తక్కువ ఖరీదు కే
చేరోకీలు అని పిలువబడే వీరంతా ఎత్తైన పర్వత ప్రా ంత వాసులు .తామే ముఖ్యమైన పౌరులం అని
,నిజమైన జనం అని అంటారు వాళ్ళు .వారి భాషలో దాన్నే ani-yun-wiya’’అంటారు .వీరంతా ఎత్తైన
పర్వత ప్రా ంత జనులే .వారి భూభాగమే ప్రపంచానికి నాభి లేక మధ్యభాగం అని వీరి నమ్మకం ..వారి
దృష్టిలో భూమి నాలుగు త్రా ళ్ళతో ఆకాశం నుండి వేలాడుతోంది .ఈ భూమి ఏర్పడటానికి ముందు
అందరు ఆకాశం లో పెద్ద శిల మీద ఉండే వాళ్ళు .జనాభాతో కిక్కిరిసి పో తే నీరు భూమి కిందకు చేరింది
.ఆ తర్వాత మట్టి అడుసు తో భూమి ఏర్పడి క్రమంగా గట్టి పడింది ..తర్వాత నీరు మళ్ళీ ఆకాశం చేరింది
.భూమి మీద క్రమంగా జీవ రాశి ఆవిర్భావం చెందింది .
వారి జాతి లో మొదటి మానవుని పేరు కనాతి ,మొదటి స్త్రీ సేలు ..వారికి ఒకే ఒక మొగ సంతానం
..అతన్ని ‘’వైల్డ్ బాయ్’’అంటారు .వీరి సంతానం క్రమంగా పెరిగిందని అభిప్రా యం .చేరోకీలు నార్త్ కరోలినా
,కాన్సాస్ పర్వత ప్రా ంతాలలో ,అపలేశియన్ పర్వత ప్రా ంతాలలో దట్ట ం గా ఉన్నారు .వీరు చిన్న
గ్రా మాల్లో ఉంటారు ..అక్కడ ఒక సమావేశ మందిరం ఉంటుంది .అక్కడ ప్రా ర్ధ న ,ఆరాధనా చేసుకొంటారు
.దానికి చుట్టూ వారి ఇల్లు ంటాయి ..ఒక్కో ఇంట్లో అనేక తరాల వారు ఉంటారు .అందరు కలిసి జీవించటం
వీరి ప్రత్యేకత ..చలి కాలం లో ‘’అసి ‘’అనే వెచ్చని ఇళ్ళల్లో నివశిస్తా రు .వేసవి ఇల్లు విశాల మైన చ దీర్ఘ
చతురశ్రకార .క్లా ప్ బో ర్డ్ తో చేసిన ఇళ్ళల్లో ఉంటారు .సీతాకాలపు ఇల్లు చిన్నవి ,ఒకే దర్వాజా ఉంది
,మధ్యలో నిత్యం మండే పొ య్యి ఉంది వెచ్చదనాన్నిస్తు ంది ..నిలవ చేసుకొనే గదులుంటాయి .
వ్యవసాయం ,వేట ,చేపలు పట్ట టం వ్రు త్తి .ఎక్కువ గా జలాధారం ఉన్న నదీ తీర ప్రా ంతాలే వారి
ఆవాస భూములు .సారవంత మైన నేలలను చూసుకొని మొక్క జొన్న పండిస్తా రు .దానితో పాటు బీన్స్
కూడా పండిస్తా రు .బీన్స్ మొక్కల వేళ్ళల్లో నత్రజని స్తా పక శూక్ష్మ జీవులున్డ టం వల్ల మొక్క జోన్నకు
బలం చేకూరుతుంది .ఆడవారు కాయ గూరలు పండిస్తా రు .ముసలి స్త్రీలు పొ లాల్లో ఓడిసల
ే ా రాళ్ళతో
పక్షులను పారద్రో లుతూ పంట చేలను కాపాడుతూ ఉంటారు .చిరోకీలు పిల్లలను అతి చనువు గా
చూస్తా రు .దండిన్చాల్సి వస్తే చిన్న ముళ్ళు తో గిచ్చటం తప్ప పెద్ద గా శ్క్షించారు .ఆడవారు అడవుల్లో కి
వెళ్లి వంట చెరుకు తెస్తా రు ..నీరు మోసుకొని వస్తా రు ..అందరికి వంట చేయటం వారి విధి .వెన్న వాడకం
తెలీదు ..ఇళ్ల ను అందం గా అలంకరించటం ఆడవాళ్ళ పని .వెదురు తో ,లేక నదీ తీరం లో దొ రికే ఒక
రకమైన చెట్టు భాగాలతో బుట్ట లు అల్లు తారు .దాన్ని’’ రివర్ కేన్ ‘’అంటారు .మన పేము లాంటిది
.స్థా నికం గా దొ రికే మట్టితో కుండలు చేస్తా రు .వాటిని ఆరబెట్టటం ,కాల్చటం నగిషల
ీ ు చెక్కటం చేస్తా రు
.జింక చర్మంతో మగ వాళ్ల బట్ట లు కుడతారు .ఎముకల తో చేసిన సూదులను కుట్ట టానికి
ఉపయోగిస్తా రు .సాధారణం గా వారికి చాలా తక్కువ బట్ట లే ఉంటాయి .చలికాలం లో వింటర్ హౌస్ లోనే
అందరు గడుపుతారు .పిల్లలు బట్ట లు వేసుకోరు .ఆడ వాళ్ళు మగ వారి లానే డ్రెస్ వేసుకొంటారు .
మగ వారు వేటాడి ఆహారం తెస్తా రు .ఆడవారు దానితో వండి వడ్డిస్తా రు .జింక ,ఎలుగు బంటి
లను ఎక్కువగా వేటాడి తెస్తా రు .వేటకోసం మిస్సి సిపి నది ని కూడా దాటి చాలా దూరం పో తారు
.వారికిజింక చాలా ఇష్ట మైన జంతవు .కల్ప వృక్షం లా అది వారి పాలిటి కల్ప ధేనువు .దాని శరీరం లో
అన్ని భాగాలను ఉపయోగించు కొంటారు .వాటి ఎముకలతో పని ముట్లు అలంకరణ సామాను ,చర్మాన్ని
ధరించ టానికి ,వాటి నరాలను దారాలుగా,వాటి మెదడు ను ఔషధాలు తయారు చేయటానికి
ఉపయోగిస్తా రు .వాటి మాసం తో స్నాయువులతో జిగురు తయారు చేసు కొంటారు .దాని శరీరం లో
ప్రతిది వారికి ఉపకరించేదే ..అలాగే ఎలుగు బంటీ అంతే .వాటి చర్మం ఫర్ కోట్ల కు ,వాటి కొవ్వు ను గ్రీజు
తయారు చేయటానికి వాడుతారు .టర్కీ కోడి వారికి బాగా ఇష్ట ం .ఎలుగు గోళ్ళతో ,దంతాలతో ఆభరణాలు
చేస్తా రు .పక్షుల ఈకలతో అలంకరించు కొంటారు ..మాటు పెట్టి వేటాడి బొ రియలు పెట్టి జంతువులను
చం పుతారు .చేపలు పట్ట టానికి గాలం ,వల, వెదురు ముక్కల ‘’మావు ‘’లు ఉపయోగిస్తా రు .నీటి
ప్రవాహం ఉన్న చోట చిన్న డాం కడతారు అడ్డ ం గా .అక్కడ చెస్ట్నట్ నుంచి తీసిన విషాన్ని
ప్రవాహపునీటి లో కలుపు తా రు ..అది చేపల నరాలపై దెబ్బతీస్తు ంది ..ఆ చేపలను తింటే
మనుష్యులకు ప్రమాదం ఉండదు .కాని చేపలను అచేతనం గా మారుస్తు ంది ..చేపల్ని పట్టిన తర్వాతా
ఆడ్డు తీసేస్తా రు ..విషం ప్రభావం తగ్గి మళ్ళీ మామూలవుతుంది .
వారి ఆటలు సరదా గా ఉంటాయి .ఆరోగ్యానికి ఆటలు ముఖ్యం అని భావిస్తా రు .బాణాల ఆట
,రాయిని బంతిగా చేసి ఆట ఆడటం వారికి ఇష్ట ం .దీన్ని రోలింగ్ రాక్ అంటారు .
చిరోకీ లలో హత్య ను తీవ్ర నేరం గా భావిస్తా రు .శత్రు వు కాని ,లేక వేరొక తెగ వారు కాని ఒక చెరోకీ
ని చంపితే వారి పై పగ తీర్చుకొని వాడిని చంపే స్తా రు .వీటినే ‘’వార్ పార్టీలు ‘’అంటారు .ఇందులో
వందమంది వరకు సభ్యులుంటారు .హత్య చేసిన వాడిని చంపక పో తే హత్య గావింప బడ్డ వాడు ఉన్నత
లోకాలకు వెళ్ళలేడు అని వీరి సిద్ధా ంతం .లెక్కలు బాలన్సు తప్పుతాయట .కనుక బద్లా తప్పదు
.అప్పుడే సామరస్యం ,సమతూకం ఉంటుందని నమ్మకం .
వీరు ప్రకృతిని ఆరాధిస్తా రు .ఒక జింకను చంపాలను కొంటె ఒక ప్రత్యెక విధి చేసి , తనకు తన
కుటుంబానికి ఆహారం అవసర మవటం వల్ల చంప వలసి వస్తో ందని దాని జీవుడిని వేడు కొని వేటాడి
చంపుతారు .విలాసం కోసం వేట ఆడరు .పవిత్రమైన భావనలను అతిక్రమిస్తే ఉపద్రవాలు కలుగుతాయని
నమ్మకం వారిది .జంతు వధ వల్ల మారణ వ్యాధులు కల్గు తాయని నమ్ముతారు .దీనితో జీవావరణం
సమతుల్యత దెబ్బ తింటుందిఅనే గొప్ప సిద్ధా ంతం ఉంది .
చిరోకీల మతం కూడా సామరస్య జీవనాన్నే బో ధిస్తు ంది .’’గ్రీన్ ఆర్డ ర్ సేరిమని ‘’అనే కొత్త సంవత్సరం
పండుగ జరుపుతా రు .ఆరోజున పాత తప్పిదాల నన్నిటిని మన్నించి కొత్త జీవితం లోకి అడుగు పెట్ట
టానికి అవకాశం కల్గిస్తా రు ..వివాహాలు విచ్చిన్నం అయితే వాటినీ క్షమించి మళ్ళీ దగ్గ రవటానికి దారి
ఏర్పరుస్తా రు .హంతకుడిని మాత్రం క్షమిచరు .అతిధులను గౌరవించి మంచి ఆతిధ్యం ఇచ్చే సాంప్రదాయం
వారిది వీరిలో ఏడు తెగలున్నాయి .తమ జాతి మూల పురుషుడు స్త్రీ అయిన ‘’కనాతి ‘’,;;సేలు ‘’’’ల
పవిత్ర వారసులం అని గర్వం గా చెప్పు కొంటారు .వారి జీవితాలను పరికిస్తే ఎంత నిబద్ధ త గా వారు
జీవనం సాగిస్తు న్నారో మనకు తెలుస్తో ంది .ఆధునికులం, నాగరకులం అని మిడిసి పడుతున్న మనం
అనాగరికులు అని వారిని భావించటం మన అనాగారకత ను తెలియ జేస్తో ంది .సామరస్యం ,సహజీవనం
,ప్రక్రు తి ఆరాధనం ,హింసను విడనాడటం వారి నుంచి మనం నేర్చు కోవాలి .
సో దరి హీల్డా సో దరులు రిజినాల్ద్ ,ఫైల బర్న్ లు ఇతను జైలు లో ఉండగానే national
islaam అనే మత సంస్థ లో చురుగ్గా పాల్గొ న్నారు .ఇది ఆద్రికన్ అమెరికన్ల కోసం ఏర్పడింది .వారందర్నీ
మళ్ళీ ఆఫ్రికా కు పంపటమే ధ్యేయం గా ఏర్పడింది ‘’ఇదే బాక్ టో ఆఫ్రికా ‘’ఆ సంస్థ అధ్యక్షుడు elijaah
mahmad రచనలు చదివి ప్రభావిత మయ్యాడు .అది నల్ల వారి వెన్నెముక గా నిల్చే సంస్థ అని
భావించాడు .నల్ల వాడిని అని గర్వించటం ,తెల్ల వారి కంటే నల్ల వారు జాతి ,సాంఘిక విషయాల్లో గొప్ప
వారని అనుకోవటం ,నల్ల జాతి స్వయం సమృద్ధి సాధించటం అనే లక్ష్యాలు ఆ సంస్థ లో ఉన్నందుకు
ఆనందించాడు ..తెల్ల వారే ప్రపంచం లో అన్ని అనర్ధా లకు కారణం అని అనుకొన్నాడు .వారి పై ద్వేషం
పెంచు కొన్నాడు .
మురికి కూపాల్లో ఉంటున్న నల్ల జాతి వారి దగ్గ రకు వెళ్లి వారి శక్తి సామర్ధ్యాలను తెలియ జేస్తు న్న
మహమ్మద్ అంటే ఆరాధన ఏర్పడింది .అతడు జైలు పక్షుల దగ్గ రకూ వచ్చి ప్రబో దిస్తు న్నాడు .మాల్కం
అతని తో ఉత్త ర ప్రత్యుత్త రాలు నది పాడు .వర్ణ వివక్షతను అంతం చేయాలని ప్రభుత్వానికి ,అది
కారులకు జైలు నుండి అనేక ఉత్త రాలు రాశాడు .అతనికి పదేళ్ళ శిక్ష పడితే అతని సత్ ప్రవర్త నకు
మూడేళ్ళు శిక్ష తగ్గించి విడుదల చేశారు .డెట్రా యిట చేరాడు .ఫర్నిచర్ షాప్ లో ఉద్యోగం చేశాడు .నేషనల్
ఇస్లా ం వాళ్ళు వేసుకొనే దర్జా అయిన వేశం ధరించాడు .1952 లో ఎల్జ ః మహ్మద్ ను కలిశాడు .తోలి
చూపు లోనే ఫ్లా ట్ అయ్యాడు .అతన్ని సంస్థ లో చేర్చుకొని సభ్యులను పెంచే కార్యక్రమం అప్ప గించాడు
.మాల్కం లిటిల్ గా ఉన్న పేరు ను మాల్కం ఎక్స్ గా మార్చుకొన్నాడు .ఎక్స్ అనేది ఊరూ పేరు తెలీని
అనేక వేల నల్ల జాతి వారి కి ప్రతీక .దీనితో కొత్త జీవితం ప్రా రంభమైంది .డెట్రా యిట లో టెంపుల్ నంబర్
వాన్ లో చేరిన కొన్ని నెలలకే సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచాడు .మంచి వాగ్ధా టి ,స్పురద్రూ పం సూటిగా
చెప్పే నేర్పు అతనికి బాగా ఉపయోగ పడ్డా యి .దేశం లో ‘’బెస్ట్ రిక్రూ టర్ ‘’అని పేరొచ్చింది .అసిస్టంట్
మినిస్ట ర్ హో దా ఇచ్చారు . 1954 లో బో స్ట న్ వెళ్లి కొత్త టెంపుల్ ఏర్పరచాడు .మహ్మద్ అతన్ని
ఫిలడెల్ఫియా పంపాడు .అక్కడ టెంపుల్ పన్నెండు ఏర్పాటు చేశాడు .న్యూయార్క్ దగ్గ రలోని హార్లెం
టెంపుల్ సెవెన్ కు మినిస్ట ర్ అయ్యాడు .ఇలా క్రమంగా మత పెద్ద అయాడు .
అతనిది సంభాషణా శైలి .అప్పటికే మార్టిన్ లూధర్ కింగ్ సివిల్ రైట్స్ ఉద్యమం తీవ్రం గా
సాగిస్తు న్నాడు .కింగ్ భావాలను వ్యతి రేకించాడు .అతని అహింస నచ్చ లేదు .పౌరహక్కుల ను ఎవ
గిన్చుకొన్నాడు .ఉత్త రాది మురికి వాడల్లో కి వెళ్లి నల్ల జాతి ఆత్మా గౌరవాన్ని తెలియ జేశాడు .కింగ్ ను
పో లీసులు అరెస్ట్ చేసి జైలు లో పెడత
ి ే వేలాది మంది నల్ల జాటీయులు స్టేషన్ వద్ద భాతా ఇంచారు
.మాల్కం అక్కడికి వెళ్లా డు .అందరు అతను హింసా వాడి .యే ఉపద్రవం జరుగు తుందో నని భయపడి
పో యారు .చాలా ప్రశాంతం గా మాట్లా డి అందరని శాంతింప జేశాడు .ఆ నాటి మాల్కమేనా ఇతను /అని
పో లీసులే ఆశ్చర్య పో యారు ..మాల్కం కు జనం పై ఉన్న ప్రభావం చూసి ఆశ్చర్యపో యి భయపడి
పో యారు .నల్ల జాతి సమీకరణానికి మాల్కం ఏంటో కృషి చేశాడు .
మ్స్లిం నేషన్ అధ్యక్షుడు మహమ్మద్ తన సెక్రెటరి లతో వ్యభియా చరిన్చాడని ఎందరికి
తండ్రి అయ్యాడని ,ముస్లిం మతాన్ని అవమానం చేస్తు న్నాడని ప్రా రోపణలు బాగా వచ్చాయి .మొదట
బుకాయించినా చివరికి మహ్మద్ ఒప్పు కొన్నాడు .ఇది మాల్కం జీర్ణించు కొ లేక పో యాడు .దేవుడని
,తన తండ్రి లాంటి వాడని నమ్మిన వాడు ఇంత దిగ జారి పో వటం దిగ మింగు కొ లేక పో యాడు .అతని
కోసం ప్రా ణాల నైనా అర్పించా టానికి సిద్దమ నుకొన్న మాల్కం పునరాలోచన లో పడ్డా డు .అప్పుడే
ప్రెసిడెంట్ కేంనేది హత్యకు గురైనాడు .దాని పై స్పందిస్తూ మాల్కం ‘’a case of chickens coming
home roosted ‘’అని నోరు జారాడు .ఇది ముస్లిం లలో కలవరం సృష్టించింది .కేంనేది చావటం వారికి
ఇష్ట ం అనే అభిప్రా యం గా ఆ మాటలున్నాయి వెంటనే మాల్కంను సస్పెండ్ చేసి తరువాత తొలగించే
శాడు మహ్మద్ .తన ఉనికి కి కూడా ప్రస్మాదం అని భావించాడు ..తన రహస్యాలను బయట పేద తాడని
అనుకొన్నాడు
సంస్థ లోంచి బయటికి వచ్చి తానే muslim maque అనే సంస్త నేర్పరచి తానే మతాధి కారి అయాడు
.తాను ఒక సామాన్య మత గురువునే కాని మహ్మద్ లా మత ప్రవక్త ను కాదు అని ప్రజలకు తెలియ
జేశాడు .ఆత్మా గౌరవం పెరిగింది .1964 లో మక్కా యాత్ర చేశాడు .అక్కడి సాంప్రదాయ దుష్టు లైన తెల్ల
వస్త ్ర ధారణా చేశాడు .అక్కడి ముస్లిం సో దరత్వం అతనికి ఎంతో నచ్చింది .అక్కడ గరీబు వజీరు అందరు
ఒక్కటే .అందరు సమానమే .అందరికిసమాన అవకాశాలున్నాయి అక్కడ .అలాంటి ఆతిధ్యం ,ప్రవర్త న
ఇంకెక్కడా లేవు అని భావించాడు .
న్యూయార్క్ కు తిరిగి వచ్చి తన పేరు el hajj maalik el shabaajj గా మార్చుకొన్నాడు .షాబాజ్
అంటే50,000 సంవత్స రాల క్రితం తూర్పు ఆసియా నుండి ఆఫ్రికా కు చేరిననల్ల జాతి వారు .అది వారికి
ప్రతీక .ఎల హాజ్జ్ అంటే మక్కాకు వెళ్లి వచ్చినందుకు గుర్తు .మాలిక్ అనేది మాల్కం కు అరేబియా లో
పేరు .తన స్వీయ చరిత్ర రాసుకొన్నాడు .organaizzetion of afro amerikan unity ‘’అనే సంస్థ ను
స్తా పించాడు .ఆఫ్రికన్ యునితి లో ని విషయాలనే ఇందులో పొ ందు పరచాడు .ఇరవై రెండు మిలియన్ల
నల్ల జాతి వారు నాలుగు వందల ఏళ్లు గా అమెరికా కు సేవ చేస్తూ ,అనేక యుద్ధా లు ,తిరుగు బాటలలో
ప్రా ణాలను కోల్పోతూ అమెరికా అస్తిత్వాన్ని కాపాడుతున్నా తమకు ఒరిగిందేమీ లేదని మొదటి
సమావేశం లో ప్రసంగించాడు .నల్ల జాతి వారు వెన్నెముక ను గట్టి పరచు కోవాలని చెడు ప్రవర్త నకు
దూరం గా ఉండాలని ,తమను తాము హీన పరచు కోరాడని ,నల్ల వారుగా పుట్టినందుకు గర్వ పదాలని
బో ధించాడు .కింగ్ పై ఉన్న ఇదివరకటి భావాల్ని మార్చుకొని పౌరహక్కులు కావాల్సిందే నని
ఉద్యమించాలని ,సహకరించాడు .హ్యుమన్ డిగ్నిటి వస్తే హ్యుమన్ రైట్స్ వస్తా యని చెప్పాడు .right to
self defence కు ఉద్యుక్తు లవ్వాలని నల్ల జాతి వారిని ఉత్తేజితులను చేశాడు .
మాల్కం కు కస్టా లు ప్రా రంభ మయ్యాయి .అతన్ని చంపుతామని బెదిరింపు లేఖలు ఫో న్లు
వస్తు న్నాయి .ముస్లిం నేషన్ నుంచి మరీ ఎక్కువ గా వస్తు న్నట్లు భావించాడు .మహ్మద్ రహస్యాలను
మరిన్ని బయట పీడా తాదేమో నని భయం .ఇంటికి నిప్పు అంటించారు .చాలా భాగం తగలడింది .1965
fibruary 21 ణ ఉదయం న్యూయార్క్ లోని audubaan baalroom ‘’హాలులో students non violent co
ordinating committee సభలో నాలుగు వందల మంది సభ్యులనుద్దేశించి ప్రసంగించాతానికి గర్భ వతి
అయిన భార్య బెట్టీ శబ్బాజా తో వచ్చాడు .వేదిక ఎక్కి ప్రసంగం ప్రా రంభించే లోగా కింద ఎవరో స్మోక్ బాంబ్
పేల్చారు .జనం కంగారు పది పారి పో తున్నారు .మాల్కం కు రక్షణ గా ఉండాల్సిన సెక్యురిటి బాంబ్
వైపుకు వెళ్లా రు .ఇంతలో నలుగురు వ్యక్తు లు మాల్కం మీద పదహారు బుల్లెట్ల ను వర్షం గా పాయింట్
బ్లా ంక్ గా కురి పించారు .నేల కూలాడు మాల్కం .హాస్పిటల్ లో చేచారు మధ్యాహం మూడింటికి తుది
శ్వాస విడిచాడు ..ఆ కేసు ఇన్వెస్ట్ గేషణ్ జరిగినా ఏమీ చివరికి తెల లేదు .ముస్లిం నేషన్ తామే ఆపని
చేసి నట్లు చెప్పు కొంది .తగిన శాస్తి జరిగిందని ప్రకటించింది కూడా ..
temple chrch god in haarlom అని పేరు పొ ందిన మాల్కం దుండగుల చేతి లో హత
మైనాడు’ ’నీగ్రో ‘’ అనే పదాన్ని ఏవగించుకొని తమ జాతిని నల్ల జాతి వారని లేక పో తే ఆఫ్రో అమెరికన్స్
అని సంబో ధించాలని లోకానికి చెప్పిన తోలి తరం నల్ల నాయకులలో మాల్కం కూడా ఒకడు .నల్ల జాతి
వారి ఆత్మా గౌరవాన్ని పెంచాడు .గౌరవ హీనం అన్న జాతికి గర్వ కారణం అయాడు .యువ సాహస
యోధుడు గాgallant youth chaampion గా చరిత్ర లో నిలిచాడు మాల్కం .తన జాతి వారిని అమితం గా
ప్రేమించి వారి ఆదరాభిమానాలకు పాత్రు డైనాడు .అతని మరణం తర్వాతా వేలాది యువకులు అతని
బొ మ్మ ఉన్న టీషర్ట్స్ ధరించి గౌరవం చాటారు .ఇప్పుడు అంటే 2012 may మాల్కం ఎనభై ఎదవా
జయంతి .నల్ల వారి అస్తిత్వ నిరూపకుడు ,నల్ల ముస్లిం మతాధి కారి మాల్కం ఎక్స్ అమర జీవి .
స్పానిక్ భాషా ,సంస్కృతి ఆమెరికా దేశ ఆవిర్భావానికి ముందే కన్పిస్తా యి ..ఇవి ఐబీరియన్ ద్వీప
కల్పం ,మెక్సికోగుండా ,కరేబియన్ బేసిన్ ,,మద్య దక్షిణ అమెరికా ల నుండి వచ్చి అమెరికా చేరాయి
.స్పానిష్ సంస్కృతీ ప్రభాయం ఈ దేశీయులపై చాలా ఎక్కువే ..ప్రస్తు తం అవన్నీ ఇక్కడి వాటి తో కలిసి
పో వటం వల్ల అవి ప్రత్యెక మైనవి గా కని పించావు .ఈ హిస్పానిక్ ప్రభావం గనామ్కాలలో చూస్తా రు కాని
,వ్యక్తీ గతం గా వారి ప్రభావం ఏమిటో తెలుసు కొ లేక పో తున్నారు ..ఇప్పుడే స్పానిష్ పుట్టు క ,స్వభావం
,తమతో సమైక్య మైన విధానం గురించి ఆలో చించి అమెరికన్లు తెలుసు కొంటున్నారు .
అమెరికన్ సంస్కృతీ ని పెంపొ ందించిన వారి లో స్పానిష్ వాళ్ళే ఎక్కువ ..స్పెయిన్రా జు afanso x గొప్ప
విద్యా వంతుదని మనకిప్పుడు తెలీదు ..అమెరికన్ చట్టా ల పై ఆ రాజు స్పెయిన్ దేశం లో చేసిన చాటాల
ప్రభావం చాలా ఎక్కువ .ముఖ్యం గా అమెరికా వాయువ్య భాగం లో బాగా ఎక్కువ .washigton d.c.లో
ఆ రాజు విగ్రహం ఉండటమే ప్రత్యక్ష సాక్షం .అలాగే diego rivera అనేది మెక్సికన్ చిత్రకారుదిది .అతని
ప్రభావం ఈ దేశం లో బాగా ఉండి .1930 లో అతని చిత్రా లు అమెరికన్ ప్రభుత్వ భవనాలలో అలంకరింప
బడ్డా యి .ప్యూర్తో రికాన్ ,మెక్సికన్లు ,మెక్సికన్ అమెరికన్లు ,(చినోనాస్ ),క్యూబన్ల ప్రభావం గణనీయం ..ఈ
ప్రభావం బో స్ట న్ ,చికాగో ,లాస్ ఏంజిల్స్ ,మయామి ,,మిన్నిపో లిస్ ,న్యూయార్క్ ,సాన్ ఆంటోనియా లలో
విపరీతం .
స్పానిష్ భాషా ప్రభావం కూడా చెప్పు కోడగిందే .ఇక్కడ కాని ,ప్రపంచం లో కాని ఇంగ్లీష మాట్లా డే
వారి తర్వాతా స్పానిష్ భాష ను మాట్లా డే వారు ఎక్కువ అని లెక్కలు తెల్చారట ..ఈ ప్రా చుర్యానికిక్కడ
చరితన
్ర ు అధ్యనం చేస్తే కాని తెలియదు ‘’.న్యు వరల్డ్ ‘’ అని పిలువా బడిన అమెరికా ఏర్పడిన తర్వాతా
స్పానిష్ భాషా సంస్కృతులు విపరీతం గా చొచ్చుకు పో యాయి .ఇంగ్లిష్ ఇమ్మిగ్రంట్లు ఇక్కడి వచ్చే
తప్పుడు తమతో ‘’గోల్డె న్ ఏజ్ ‘’కు చెందినా అనేక ప్రసిద్ధ రచనలను తమతో 1863 లో తెచ్చుకొన్నారు
.ఫిలడెల్ఫియా ,బో స్ట న్ ,లలో అనేక మంది ప్రముఖుల ప్రైవేట్ లైబర
్ర ీలలో lazarillaa de tomes .los
squenos వంటి రచనల అనువాదాలున్నాయి .ఎన్నో నవలలు కొలువు దీరాయి .సేర్వాన్తి స్ అనే స్పానిష్
రచయిత రాసిన don quixote నవల ఆ కాలం లో చదవని వారు ప్రపంచం లోనే లేరంటే ఆశ్చర్యం లేదు
.ఆ నవలా ఇక్కడికి చేరి,ప్రభావాన్ని చూపింది .cotton mather అనే ప్యురిటాన్దా న్ని అమెరికా లో స్పానిష్
భాష లోనే చదివాడని రికార్డు లు తెలియ జేస్తు న్నాయి ..ఈ నవల తో తన భాషా సాహిత్యాలను కాటన్
పరి పుష్ట ం చేసుకొన్నాడని విశ్లేషకుల భావం ..ఎన్నో స్పానిష్ పదాలు అందులో చేరి అమెరికన్ పదాలై
పో యాయట .
స్పానిష్ రచయితలు అమెరికన్ రచయితలను ప్రభావితం చేశారు .వాషింగ్టన్ ఇర్విన్ నుండి
,కాళి ఫో ర్నియా నవలా కారుడు జాన్ స్టీన్ బెక ,ఎర్నెస్ట్ హెమింగ్వే,లాంగ్ ఫెలో ,వరకు ఆ ప్రభావం లో
ఆకర్షణ లో పాడనీ రచయిత లేదు .కూపర్ ఎడ్గా ర్ అలాన్ పొ ,నిజమైన ఆత్మను మేల్కొల్పిన వాడు
అమెరికన్ జాతీయ కవి అయిన వాల్ట్ విట్మన్ ,అమెరికన్ భాషను నవలలలో బంధించి ఇదీ నీ భాషా ,నీ
సాహిత్యం ఇది అని తట్టి లేపి ఇంగ్లా ండ్ సాహిత్యంనుంచి అమెరికన్ సాహిత్యాన్ని వేరు చేసి ,అమెరికన్
ఆత్మను తట్టి లేపిన మార్క్ ట్వేన్ ,హీర్మాన్ మెక్ విల్లి అందరు స్పానిష్ సాహిత్య సంప్రదాయానికి రుణ
పడే ఉన్నారు maaksvel ,aandersan ,మొదలైన వారంతా స్పానిష్ భావాలను వస్తు జాలాన్ని తమ
రచనల్లో ప్రతి ఫలింప జేసన
ి ావారే .
స్పానిష్ సంస్కృతీ ప్రభావం పాడనీ ప్రదేశం ,వ్యక్తు లు ,సాహిత్య ప్రక్రియలు ,సంస్థ లు
,వ్యవస్థ లు అమెరికా లో లేవు అంటే అతి శాయోక్తికాడు .పచ్చి నిజం .ఎక్కువ గా ప్రభావితం చేసిన వాడు
abiel smith అనే హార్వర్డ్ గ్రా డ్యుయేట్ .1764 లో ఆయన –ఇక్కడ స్పానిష్ ,ఫ్రెంచ్ బో ధించే ప్రొ ఫెసర్ల కు
జీత భత్యాల కోసం 20,000 డాలర్ల ను మూల ధనం గా సమ కూర్చి ,వారికి అండగా నిలిచాడు .1819
యునివేర్సిటి కి స్వావలంబన లభించి ,ఆర్ధిక బాధల్లో ంచి బయట పది ,వారికి పూర్తీ జీతాలు ఇవ్వ గలిగే
స్తితి ని పొ ందింది .ఇది స్మిత్ చేసిన మేలే .abiel smith పేరా ఒక పీఠం –(చైర్ )నేల కోల్పారు .జార్జి
తోక్నార్ దాన్ని అందుకొన్న మొదటి వ్యక్తీ .ఆ తర్వాతా లాంగ్ ఫెలో ,జేమ్స్ రాసిల్ కు ఆ గౌరవం
దక్కింది .
విద్యా వేత్త ,ఉత్త మ అధ్యాపకుడు అయిన తిక్నార్ ఎన్నో స్పానిష్ పుస్త కాలను విశ్వ విద్యాలయం కోసం
సేకరించి భద్ర పరచాడు ..దీనితో అమెరికన్ల కు స్పానిష్ సాహిత్య అధ్యయనానికి గొప్ప అవకాశం
లభించింది .ఆయన స్వంతం గా ఎన్నో స్పానిష్ పుస్త కాలను ,వ్రా త ప్రతులను స్వంత లైబర
్ర ికోసం
సేకరించు కొన్నాడు .ఆ తర్వాతా వాటిని బో స్ట న్ పబ్లి క్ లైబర
్ర ి కి దారా దత్త ం చేశాడు .abiel smith చైర్
ఏర్పడిన తర్వాతా హార్వర్డ్ లో స్పానిష్ భాశాధ్యనం కర్రిక్యులం లో చేరింది .రోమాన్స్ లాగ్వేజేస్ లలో
గ్రా డ్యుయేషన్ కోర్సులు ప్రవేశ పెట్టిన మొదటి విద్యాలయం హార్వర్డ్ .దీని తర్వాతా నే అమెరికా లో
మిగిలిన విశ్వవిద్యాలయాలు ప్రవేశ పెట్టా యి .
కలల మీద స్పానిష్ ప్రభావం కూడా ఎక్కువే .జాన్ సింగర్ సార్జెంట్ ,జేమ్స్ విజిలర్
,థామస్ ఈకిన్స్ ,.మేరికేస్సాట్ ,మొదలైన కళా కారులు స్పానిష్ సాంకేతికత లను అధ్యయనం చేసి తమ
కళ ను ఉత్కృష్ట స్తితి కి తెచ్చుకొన్నారు .అన్ని రంగాలలో ఉన్న ఈ నాటి కళా కారులంతా స్పానిష్ స్రస్తల
కళాభి రుచిని నిశితం గా పరిశీలించారు .అంతే కాదు ఇరవై వ శతాబ్ద పు స్పానిష్ paintars సాల్వడార్
దాలి ,జోఆన్ మీరో పాబ్లో పికాస్సాల ప్రభావం అమెరికన్ కళా కారుల పై విపరీతం .
సంగీతం దగ్గ ర కు వస్తే lionardo bernstiens ల ప్రభావం ఎక్కువ .షేక్స్ పియర్ రాసిన రోమియో
జూలియట్ కు స్పానిష్ అనువాదానికి న్యూయార్క్ లో పిచ్చ క్రేజ్ .అలాన్ రిధంస్ అంటే ఇక్కడి
అమెరికన్ల ఉ ఊగి పో తారు .టాంగో నుంచి మామ్బో దాకా ,గువార్చా నుండి సల్సా దాకా అన్నిటి పై
స్పానిష్ ప్రభావం చెప్పలేనంత ఎక్కువ .
నార్త్ కెరొలిన
క్రీ.శ..200 లో ఇక్కడ ఇటుకలు మట్టి బొ మ్మలు తయారు చేసేవారు .వాటి ని ఉత్సవాలకు వాడే
వారు .క్రీ.శ. 1000 లో పు రాతన మిసిసిపి సంస్కృతీ ఇక్కడికి వచ్చింది .పెద్ద నగరాల నిర్మాణం జరిగింది
.వ్యాపారవాణిజ్యాలు బాగా ఉండేవి .ఇక్కడి ఆదిమ జాతులు carolino .angloquian , భాషలు మాట్లా డే
చౌనోక్ ,రోనోక్ మొదలైన జాతుల వాళ్ళు .వీరిని మొదటిసారిగా బ్రిటిషర్లు ఎదిరించారు .ఇక్కడికి వచ్చిన
మొదటి యురోపియన్ల లో ఇంగ్లీష వారే ప్రధములు .1580 లో సర వాల్ట ర్ రాలీ ఇక్కడ రెండు సెటల
ి ్మెంట్లు
ఏర్పాటు చేశాడు .తరువాత వాళ్ల కాలనీలు ఏమయ్యాయో మిస్ట రీ .1640 లో వర్జీనియా నుంచి
ఆంగ్లేయులు ఇక్కడికి వలస వచ్చారు .1663 బ్రిటన్ రాజు ఇక్కడ కారోలీనా కాలనీ ఏర్పాటుకు అంగీక
రించాడు .
పద్దెనిమిదవ శతాబ్దా నికి ప్రా తినిధ్య ప్రభుత్వాలు ఏర్పడ్డా యి .1765 లో బ్రిటిషవాళ్ల అధిక
పన్నులకు ,పార్ల మెంట్ లో ప్రా తినిధ్యం లేక పో వటానికి నిరసన ప్రా రంభ మైంది .అమెరికా విప్ల వం లో ఇది
దేశ భక్తీ ప్రా ంతం అయింది .దీని ఫలితం గా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొ ందే అవకాశం ఇక్కడి డెలిగేట్ల కు
లభించింది .కాని బ్రిటీష వారి భక్తు లు కొందరు దాన్ని అమలు కాకుండా అడ్డు పుల్ల వేశారు .
19 వ శతాబ్డ ం ప్రా రంభం లో ఇది రూరల్ స్టేట్ గా ఉంది .సిటీలు లేవు .కొన్ని పల్లెలు మాత్రమే
ఉన్నాయి .బానిసల సాయం తో పత్తి బాగా పండించే వారు .పత్తి కి అనువైన భూమి ఎక్కువ ఉంది
.ప్రజాస్వామ్య భావాలు మొదటి నుంచి ఎక్కువ గా ఉన్న రాష్ట ం్ర .బానిసలపై కూడా దయా దాక్షిణ్యం
చూపించే వారు .దక్షణాది వారు యునియన్ నుంచి విడి పో దామని ప్రయత్నిస్తే వీళ్ళు అంతగా
సహకరించలేదు .ఇక్కడి ఎన్నికల్లో తూర్పు ప్రా ంతం డెమోక్రా ట్ల కు ,పడమటి ప్రా ంతం విగ్గు లకు తీవ్ర పో టీ
ఉండేది .1861 ఏప్రిల్ లో ఫో ర్ట్ సెంటర్ లో కాల్పులు జరిగాయి .యూనియన్ నుంచి నార్త్ కెరొలిన విడి
పో యింది .కాన్ఫెడరేషన్ లో చేరింది .అమెరికన్ సివిల్ వార లో వేర్పాటు వాదులకు మద్ద తు నిచ్చిందీ
రాష్ట ం్ర .రి కన్స్ట్ర క్షన్ కాలం లో బానిస విమోచన జరిగింది .1950-60 మధ్య జరిగిన సివిల్ రైట్స్ ఉద్యమం
లో ఈ రాష్ట్రా నికి పెద్ద పాత్ర ఉంది .’’సిట్ ఇన్ ప్రొ టెస్ట్ ‘’ను గ్రీన్ బరో సిటి లో నిర్వహించాడు మార్టిన్ లూధర్
కింగ్ .ఇది ఉద్యమ కేంద్రమే అయింది .’’student non violent co-ordination committee ‘’ ఇక్కడే
అంటే రాలీ లో sha university’ లో ఏర్పడింది .1973 లో రాలీ మేయర్ గా క్లా రంస్ లైటనేర్ అనే ఆఫ్రికన్
అమెరికన్ ఎన్నికైనాడు .నార్త్ కరోలీన రాజ దాని రాలీ ..పెద్ద నగరం మాత్రం శార్లేట్
ఇక్కడ అపలేచియన్ పర్వతాలున్నాయి .తీరప్రా ంతాలు ,పంట భూములు ఉన్నాయి .పొ గాకు
పంటలో అమెరికా లో మొదటి స్తా నం .అలాగే చిలగడ దుంప కూడా అత్యధికం గా పండుతు నంబర్ వన్
స్తా నం పొ ందింది క్రిస్మస్ ట్రీలు అంటే పైన చెట్లకు రెండో స్తా నం .కుకుంబర్ అంటే దో స పంట కు మూడో
స్థా నం .స్త్రా బెర్రి ,ప్రత్తి పంటకు నాలుగో స్తా నం .సో యా బీన్స్ ,మొక్క జొన్న ,గోధుమ ,వేరుసెనగ ,బ్లూ
బెర్రిస్ , బంగాళా దుంప ,టమేట ో మొదలైన పంటలు పండే రాష్ట ం్ర .
కోళ్ళు ,ట ర్కీలు ,పందుల పెంపకం ఎక్కువ .బ్రా యిలర్ కోళ్ళకు మొదటి స్థా నం .అలాగే ఆపిల్స్ కు
కూడాపీచు లు ,పశు పెంపకం హాగ్ పెంపకము ఎక్కువే .
బ్లు క్రా బ్స్ ,ష్రిమ్ప్ చేపలకు ప్రసిద్ధి ,ఆక్వా కల్చర్ ఉంది .కాట్ ఫిష్ ఇక్కడి ప్రత్యేకత .
నార్త్ కెరొలినా కు ‘’ .the tar hill state ‘’,’’turpentine state ‘’ అని మారు పేర్లు న్నాయి .
అమెరికా లో ఛ ను షా గా పలకటం ఫాషన్ .చికాగో ను షికాగో అంటారు .చార్లేట్ ను షార్లేట్ అంటారు
.ఇది ఈ రాష్ట ం్ర లో పెద్ద సిటి ..మెక్లీన్ బర్ఘ్ కౌంటి దీని దగ్గ రే ఉంది .పదిహేడవ పెద్ద నగరం .న్యూయార్క్
తర్వాత ఇక్కడే బాంకింగ్ ఎక్కువ గా జరుఫు తుంది .మూడు ప్రధాన బంకులకు కేంద్రం శార్లేట్ .charles
macklien burgh అనే బ్రిటీష రాజు మూడవ జార్జి భార్య పేరు మీద ఈ సిటి ఎర్పడింది .అమెరికన్
రివల్యుషనరి వార్ కు కేంద్రం గా నిలిచింది .జనరల్ కారన్ వాలీస్ ను తరిమి కొట్టిన ప్రా ంతం .hornest
nest అని దీనికి నిక్ నేం.తూర్పున catawba,ఆగ్నేయం లో లేక నార్మన్ సరస్సు ఉన్నాయి .ఇది మాన
వ నిర్మిత అతి పెద్ద మంచినీటి సరస్సు .
షార్లేట్ డెమొక్రా టిక్ పార్టీకి మెజారిటీ అభిమానం ఉన్న సిటి .ఇంతవరకు యే ప్రెసిడెంట్ ఎన్నికలకు
అభ్యర్ధిని నిర్ణ యించే సమావేశం ఇక్కడ జరగలేదు .ఈ సంవత్సరం సెప్టెంబర్ లో డెమొక్రా టిక్ అభ్యర్ధిని
ప్రకటించే పెద్ద సదస్సు షార్లేట్ లో జరుగ బో తోంది .చరితన
్ర ు సృష్టిస్తు ంది .
1771 ప్రా ంతం లో అమెరికా లో 13 బ్రిటీష కాలనీలున్దేవి .అందులో నార్త్ కరోలిన ఒకటి .బ్రిటీష రాజు
ఇక్కడ ఫ్రెంచ్ వారితోను ,అక్కడ మిగిలిన వారి తో పో రాటానికి కావలసిన డబ్బు ను అమెరికా లోని
కాలనీ ల నుండి పిండుకొందామను కొన్నాడు .పార్ల మెంట్ లో కొన్ని పన్నులు విధించే చట్టా న్ని చేశాడు
.నార్త్ కరోలిన అసెంబ్లి దాన్ని తిరస్కరించింది .పార్ల మెంట్ లో ప్రా తినిధ్యం లేని తమపై పన్నులు వేయటం
సరికాదని చెప్పింది ..మిగిలిన కాలనీలు అలానే పో రాడితే వెనక్కు తీసుకొన్నారు .అప్పుడు దొ డ్డి దారిన
స్టా ంప్ చట్ట ం చేసింది .అమ్మకం ,కొను బడు ల కు స్టా ంప్ లు కొని అంటించాలని దీని భావం .దీన్నీ వ్యతి
రేకించారు .స్టా ంపులను బయటికి రాకుండా కాపలా కాశారు .ఆ నావ లన్నిటి ని వెనక్కి పంపించే టట్లు
తీవ్రం గా అన్ని కాలనీలు పో రాటం చేశాయి .దిగి వచ్చింది బ్రిటీష ప్రభుత్వం .ఆ తర్వాత ఎత్తు డ గా కొత్త
పన్నులు వేసే పద్ధ తి తెచ్చింది .మళ్ళీ తిరుబాటు బావుటా ఎగరేశారు .no taxation without
representation ‘’అని నినదించారు .ఇక్కడి కాలనీ వాసులేవరికీ బ్రిటీష పార్ల మెంట్ లో సభ్యత్వం లేదు
.బ్రిటీష వస్తు వులను కొనడం ,అమ్మడం కూడా కాలనీలు బహిష్కరించాయి .మళ్ళీ దిగి వచ్చి తేయాకు
తప్ప అన్నిటి మీదా పన్ను తీసేసింది ప్రభుత్వం .
సమష్టి పో రాటం చేయాలని కాలనీలన్ని ఒక నిర్ణ యానికి వచ్చాయి .తమలో తాము
సంప్రదన
ి ్చుకోవటం ప్రా రంభించాయి .committees of correspondence ఏర్పడ్డా యి .అప్పటికి అమెరికా
లో కేంద్రీయ ప్రభుత్వం అనేది లేదు .అక్కడ బ్రిటన్ లో తేయాకు విప రిథం గా పండి ,మార్కెట్ లేక
అమెరికా తెచ్చి అమ్మాలను కొంది .షిప్పు నిండా తేయాకు వచ్చింది మాసాచుసేత్స్ లో ని బో స్ట న్ రేవుకు
.1773 లో బో స్ట న్ పౌరులు ,mohawk ఇండియన్లు కలిసి నావను రాత్రి పూట రహస్యం గా ఎక్కి
342 పెట్టెల తేయాకు ను సముద్రం లో విసిరేశారు .దీన్నే ‘’బో స్ట న్ టీ పార్టి ‘’అన్నారు .ఇలాగే మిగిలిన
కాలనీ లలో ను చేసి బ్రిటీష వారికి శ్రు ంగ భంగం కల్గించారు .దీనితో ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేబట్టి
బో స్ట న్ రేవు నుంచి వ్యాపారం చేయటాన్ని నిషేధించింది .
కాలనీ వాసులలో ఏకాభి ప్రా యం సాధించి సంయుక్త ం గా బ్రిటీష వారి పై పో రాడాలని
సంకల్పించారు .దీని కోసం conti nental congres ను ఏర్పరచు కొన్నారు .అప్పుడు నార్త్ కరోలిన లో
బ్రిటీష గవర్నర్ మార్టిన్ అనే వాడున్నాడు .నార్త్ కరోలిన ఆసెంబ్లీ ని సమావేశ పరచమని వాడిని
కోరితేతిరస్కరించాడు .నార్త్ కరోలిన అసెంబ్లి కి మాత్రమే పన్ను విధించే హక్కు ఉంది కాని ,పార్ల మెంట్ కు
లేదు అని నిర్ద ్వందం గా తెలిపారు వాడికి .ప్రతి కాలనీ కి ప్రతినిధులను ఎన్ను కొన్నారు .విలియం
హూపర్ ,కస్వేల్ ,జోసెఫ్ హ్యూస్ లు నార్త కరోలినా ప్రతినిధులు .ఇక్కడి విషయాలను ఎప్పటి కప్పుడు
రాజుకు గవర్నర్ తెలియ జేస్తు న్నాడు .ప్రో విన్సియాల్ కాంగ్రెస్ వాళ్ళు అప్పటికే రెండు సార్లు
సమావేశమైనారు .సమావేశం జరుపు కొనే హక్కు తమకు ఉందని తెలియ జేశారు .రాజుకు
విదేయులమే కాని ,అధికారము తమకివాలని స్వాతంత్రమే తమ లక్ష్యమని చెప్పారు .నార్త్ కరోలిన
అసెంబ్లీ ని సమావేశ పరచుకొని తమ కోరిక ను బలం గా చాటారు .వీళ్ళను దారిలోకి తెద్దా ం అన్న అతని
ప్రయత్నాలు ఫలించ లేదు .మసాచుసెట్స్ లో ప్రజలు రహస్యం గా ఆయుధాలు ,మందుగుండు సామాను
సేకరించి భద్ర పరచారు .దీన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం సిద్ధ పడింది .కాపాడుకోవటానికి
ప్రజలు సమాయత్త మైనారు .1775 april 18 న ఇరు వైపులా మోహరింపు జరిగంి ది .జనాన్ని చూసి
పో లీసులు వారి పై కాల్పులు జరిపారు .ఇదిగో ఇప్పుడే బ్రిటీష వారితో యుద్ధ ం ప్రా రంభమయింది
.ముందు కాలు దువ్వింది బ్రిటీష సైన్యమే ..దీన్నే ఎమర్సన్ మహా కవి ‘’ the shot heard –round the
world ‘’అని కవిత్వీక రించాడు .ఈ వార్త నార్త్ కరోలినా కు ఆలస్యం గా చేరంి ది .
1775 మే లో శార్లేట్ ,మేకేంస్ బర్గ్ వాసులు వీధుల్లో కి వచ్చి బ్రిటీష రాజుకు ఇంకా ఏమాత్రము
అధికారం లేదని ,తమ దేశానికి బ్రిటన్ శత్రు వు అని నినాదాలు చేశారు .అప్పుడు కాలనీ లలో మూడు
వర్గా లున్దేవి .రాజుకు వ్యతి రేకుల్ని whigs అనీ ,అనుకూలుర్ని torees అనీ ఎటు తేల్చుకో లేని వారిని
neautrals అన్నారు .ఇక్కడి గవర్నర్ మార్టిన్ కు థారు పుట్టి పెళ్ళాం ,పిల్లల్ని న్యూయార్క్ కొ తోలేశాడు
.న్యు బెరిన్ లో కొన్ని ఫిరంగులు కాల్చటానికి ఉంచాడు .జనం వచ్చి పడుతున్నారని తెలిసి వాటిని
నిర్వీర్యం చేశాడు .ప్రజలను రక్షించు కోవాలని నాయకులు భావించి ‘’committee of safety లను
ఏర్పాటు చేసుకొన్నారు .పో రాడటానికి సైన్యాన్ని సమకూర్చుకొన్నారు .హిల్స్ బరో లో సమా వేష మై
శామ్యుల్ జాన్స్టన్ ను ప్రిసైడింగ్ ఆఫీసర్ ను చేసి అందరు శాపదాలు చేశారు .విభేదాలున్నా ఇంకా
రాజుకు విదేయులమే నని ప్రకటించారు యుద్ధ సామాగ్రి కొనటానికి డబ్బు ను సమకూర్చుకొనే
ప్రయత్నాలు చేశారు .
ఫిలడెల్ఫియా లో రెండో కాంటినంె టల్ కాంగ్రెస్ సభ జరిగింది .జార్జి వాషింగ్టన్ ను కమాదర్ చీఫ్ గా
ఎన్ను కొన్నారు .కాంటినంె టల్ ఆర్మీ ఏర్పడింది .నార్త్ కరోలిన లో రెండు రిజి మెంట్లు జేమ్స్ మూర్ ,రోబర్ట్
హో వే నాయకత్వం లో ఏర్పడ్డా యి .సౌత్ కరోలిన లో ఉన్న చార్లేస్తా న్ గొప్ప ఓడ రేవు .దాన్ని స్వాధీనం
చేసుకోవటానికి సైన్యాన్ని పంపమని గవర్నర్ మార్టిన్ రాజుకు రాశాడు .కారణ వాలీస్ తో ఒక దళాన్ని
,హెన్రీ క్లింటన్ తో ఒక దళాన్ని రాజు పంపాడు .వారిద్దరూ వచ్చి నార్త్ కరోలినా నే చాల సమస్య అని
నిర్ణ యించారు .ఇక్కడ హో లిఫాక్స్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పరచు కొన్నారు .తమకు తాము
స్వాతంత్రం పొ ంది నట్లు గా ప్రకటించుకొన్నారు .ఇలా నార్త్ కరోలిన మిగిలిన కాలనీలకు మార్గ దర్శక మై
ముందు నిలి చింది .హాలి ఫాక్స్ లో కాంగ్రెస్ మళ్ళీ 1776 ఏప్రిల్ పన్నెండు న సమావేశమై స్వాతంత్రా న్ని
ప్రకటించింది .తర్వాత వర్జీనియా ,ఆ తర్వాత మిగతా కాలనీలు ఆ పని చేసి తామంతా విముక్తు లం అని
ప్రకటించే శాయి .ఇక రాజు కు తమ పై పెత్తనం లేదని చెప్పే శాయి .అందరికి కలిసి ఒక రాజ్యాంగాన్ని
తయారు చేసుకొన్నారు .declaration of inde pendence ను 1776 july 4 న ప్రకటించారు .ఆ తేదీ యే
ఇప్పటి ఫార్మేషణ్ డే .
న్యూయార్క్ లో జార్జి వాషింగ్టన్ బ్రిటీష రాజు విగ్రహం తలను కిందికి లాగి పడేశాడు .బుల్లెట్ల తో మసి
చేశాడు .ఈ డిక్ల రేషన్ నార్త్ కరోలినా చేరటానికి రెండు వారాలు పట్టింది .హాలిఫాక్స్ లో సమావేశమై1776
august 1 న ఆ డిక్లరేషన్ ను ప్రజలందరికి చదివి విని పించారు .అలానే మిగిలిన చోట్లా చదివారు .అన్ని
కాలనీలు ఆ పని చేసి స్వాతంత్రా న్ని ప్రకటించు కొన్నాయి .దీనికి ముందు దారి చూపింది మాత్రం నార్త్
కరోలినా అని నిస్సందేహం గా చెప్ప వచ్చు. ఆ తర్వాత బ్రిటీష ప్రభుత్వం యుద్ధ ం చేసి లొంగ దీసుకొనే
ప్రయత్నాలు చేయటం కారన్ వాలీస్ అన్ని యుద్ధా ల్లో పరాజితుదవటం చివరికి జార్జి వాషింగ్టన్ అనే
కమాన్ద రిన్ చీఫ్ కు లొంగి పో వటం వరుసగా జరిగి పో యాయి ఈ యుద్ధా లలో అనేక యువకులు
సమర్ధు లైన నాయకులు బలి పో యారు . ‘’. north carolina and most of the colanies won inde
pendence by fighting a war against britan with practically with an empty treasury . ‘’
అంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా నార్త్ కరోలినా తో బాటు అనేక కాలనీలు బ్రిటీష వారి తో యుద్ధ ం చేసి
తమ స్వాతంత్రా న్ని సంపాదించుకొన్నాయి. నార్త్ కరోలినా ప్రజలకు ,వారి త్యాగాలకు ,పో రాట పటిమకు
స్వాతంత్ర కాంక్షకు బలిదానానికి జోహార్.
సాహసమే పూపిరిగా ,ధైర్యమే భూషణం గా ఉన్న వారు చరిత్ర ను సృష్టిస్తా రు .తర తరాలకు
ఆదర్శ ప్రా యు లవుతారు .స్వంత విమానం లో అమెరికా లోని న్యుయ్యార్ నగరం నుండి ,ఫ్రా న్స్ దేశం
లోని పారిస్ నగరానికి నాన్ స్టా ప్ గా అట్లా ంటిక్ సముద్రం మీద ప్రయాణం చేసి’’ వాయువీరుడు’’ అని
పించుకొన్నాడు చార్లెస్ లిండ్ బెర్గ్ –అతని చరిత్ర సాహసులకు ప్రేరరణ .1927 may 20 న ఇరవైయిదేల్ల
లిండ్ బెర్గ్ ఈ సాహసం చేశాడు .
reserve officer training corps లో చేరాడు .విస్కాన్సిస్ వర్సిటి లో రైఫిల్ పిష్తల్ స్క్వాడ్ లో
చేరాడు .ఇంగ్లీష లో తప్పాడు .నిరాశ చెంది ఇంగ్లీష తనకు అచ్చి రాదనీ గ్రహించాడు .విమాన పైలట్
అవాలని ప్రగాఢ మైన కోరిక ఉండేది .లింకన్ లోని నెబ్రా స్కా వర్సిటి లో చేరాడు .అక్కడ అతనొక్కడే
అప్పుడు స్టూ డెంట్ .దాని నిర్వాహకుడు’’ రే పేజి’’ తో కలిసి అన్ని పనులు చేశాడు .క్లా సులు
ప్రా రంభమైనాయి .ట్రైనింగ్ పూర్తీ అవగానే స్వంత విమానం కొనాలని ప్లా న్ లో ఉన్నాడు .తల్లి మిచిగాన్
చేరింది .1923 లో రెండవ ప్రపంచ యుద్ధ ం లో వాడిన విమానాలను వేలం వేస్తు ంటే ‘’జెన్ని ‘’అనే
విమానాన్ని వెయ్యి డాలర్లు పెట్టి కొన్నాడు .కల నిజం చేసు కొన్నాడు .దాన్ని విజయ వంతం గా నడి
పాడు .సెయింట్ లూయీస్ అనే బాగా రద్దీ గా ఉండే విమానాశ్రయానికి సురక్షితం గా చేరాడు .
international air race లలో పాల్గొ న్నాడు .కొత్త రకమైన విమానాలను అధ్యయనం చేశాడు .u.s.army
air service reserve cadet గా చేరాడు .ట్రైనింగ్ చాలా కష్ట ం గా ఉండేది .25 అతి కష్ట మైన సబ్జెక్టు లు
చదవాల్సి వచ్చింది .అవకాశం మళ్ళీ రాదు అని తెలుసు కొని క్షణం తీరిక లేకుండా చదివి ఉత్తీ ర్ణు డై
అందరి ప్రశంసలను పొ ందాడు బెర్గ్ .క్లా స్ లో ఫస్ట్ .1926 ఏప్రిల్ పదిహేనున మొదటి సారిగా సెయింట్
లూయిస్ నుండి ఇలినాయిస్ కు air mail delivery ని మొదటి సారిగా చేసి శేహబాష అని
పించుకొన్నాడు .
ఫ్రా న్సు దేశానికి చెందినా అమెరికా హో టల్ ఓనర్ ‘’రిమాండ్ ఆర్తీగ్ ‘’తన పేరు తో ఒక పో టీ ని
నిర్వహించ దలచాడు .అట్లా ంటిక్ సముద్రం మీదుగా న్యూయార్క్ నుండి ,పారిస్ కు ఒకే ఒక ప్లేన్ లో నాన్
స్టా ప్ గా ప్రయాణించాలి అదీ పో టీ .లిండ్ ఈ వార్త విన్నాడు .అప్పటికే ఫ్రెంచ్ కెప్టెన్ ‘’రిని ‘’ప్రయత్నించి
విఫలుడైనాడు .ఒంటరి ప్రయాణం .నిద్ర ఉండదు .దాదాపు 24 గంటలు నాన్ స్టా ప్ గా ప్రయాణం చేయటం
సాహసమే ..ఏమైనా సాహసుడు కనుక పాల్గొ ని గెలవాలి అని నిర్ణ యానికి వచ్చాడు ..ప్రయాణానికి
తనకు తగిన విమానం తయారు చేసు కోవాలి .దానికి ఖర్చు పది వేల డా లర్ల వుతుంది .తన చేతి లో
రెండు వేలే ఉన్నాయి .స్నేహితులు ,ఇలాంటి సాహసాన్ని ఉత్సాహ పరిచే వారు తగిన ధనాన్ని సమ
కూర్చి పెట్టా రు .
ryon air craft అనే తనకు కావాల్సిన విమానాన్ని కావలసిన హంగులతో తయారు
చేసస
ి ్తా మని ఆ కంపెని హామీ ఇచ్చింది .కాలిఫో ర్నియా లో ఉంది 36 గంటలు నిద్ర లేకుండా దాని పని
చూశాడు .ప్రయాణానికి అవసర మైన వివ రాలన్ని సేకరిన్చుకొన్నాడు .1927 కు విమానం సర్వ
హంగులతో తయారైంది .దాని బరువు 2,150 పౌండ్లు .ఇంధనం నింపితే 5,180 పౌండ్లు .450 గాలన్ల
పెట్రో ల గాస్ నింపాలి ఆ విమానానికి ఏమి పేరు పెట్టా లని అలోచించి చివరికి ‘’spirit of saint louis ‘’అని
తనకు సాయం చేసిన వారందరికి కృతజ్ఞ త గా ఆ పేరు పెట్టా డు .డజన్ల కోద్దె సార్లు దాన్ని తెస్త చేసి
నడిపాడు .
పో టీ కి ఏర్పాట్లు
1927 మే 12 న సాన్ డీగో లోని నార్త్ ఐలాండ్ నావల్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3-55 కు
సెయింట్ లూయిస్ లోని లామ్బాస్ట్ ఫీల్డ్ కు బయల్దే రాడు .రెండు ఆర్మీ విమానాలు రక్షణ గా
అనుసరించాయి .విమానం తయారు చేసిన రైయాన్ వాళ్ల ప్లేన్ కూడా అనుసరించింది .నాలుగు
విమానాలు ryon air craft ఫాక్టరి చుట్టూ ప్రదక్షిణం చేసి ,12000 అడుగుల ఎత్తు న ఎగురుతూ
మర్నాడు ,ఉదయం 8-20 కు సెయింట్ లూయిస్ చేరారు .14 గంటల్లో 1550 మైళ్ళ ప్రయాణం చేశాడు .
వెంటనే బయల్దే రి మర్నాడు ఉదయం ఏడు గంటలు ప్రయాణం చేసి న్యూయార్క్ చేరాడు .ఇది కూడా
రికార్డే .మే 12 న 1927 న్యూయార్క్ చేరే సరికి ఈ సాహస వీరునికి వేలాది మంది చేరి శుభా కాంక్షలు
అంద జేశారు ..ఒక వారం న్యూయార్క్ లో గడి పాడు .
1927 may 20 న ‘’లిన్దెర్బెర్ఘ్ ‘’విమానం ఉదయం 7-54 కు న్యూయార్క్ నుండి పారిస్
బయల్దే రింది .ముందుగా అట్లా ంటిక్ సముద్రం పై 150 అడుగుల ఎత్తు న నడిపాడు .ఎప్పటికప్పుడు
కంట్రో ల్ రూం తో సంప్రదిస్తూ నే ఉన్నాడు .కళ్ళు మూసుకు పో తున్నాయి .చార్టు లు తిరగేస్తు న్నాడు
.అలసట పెరిగి పో యింది .ఎనిమిది గంటల తర్వాతా భూమి కని పించింది .అది అమెరికా ఉత్త రాన ఉన్న
‘’నోవా స్కాటియా’’మొదటి రోజు రాత్రి 10,500 అడుగుల ఎత్తు న తుఫాను కన్పించింది .వెనక్కి తిరిగి
వెళ్ళాల్సి వస్తు ందేమో నని భయ పడ్డా డు ..విమానం పై మంచు దుప్పటి లాగా పరుచుకోండి .రెక్కల పై
మంచు చేరితే ప్రమాదం .వెంటనే విమానం తిప్పి దూరం గా వెళ్లి ఊపిరి పీల్చుకొన్నాడు .
మగత కమ్ముతోంది .అలసట పెరిగింది .దగ్గ ర్లో దీవులు కని పిస్తు న్నాయి .అవి ఎండ
మావులని తెలిసింది . 27 గంటల ప్రయాణం తర్వాతా కిందికి చూస్తె వస్తు వులు కని పించాయి .కిందికి
దింపి ఎగిరాడు .ఐర్లా ండ్ కు దారెటు అని వాల్ల నడి గితే జవాబు రాలేదు .గంట తర్వాతా ఐర్లా ండ్ దక్షిణ
తీరం కన్పించింది .అలసట పో యింది .ఇంకో గంట తర్వాతా ఇంగ్లా ండ్ మీదుగా ఎగిరాడు .ఇంతకీ అతని
ఆహారం ఏమిటో తెలుసా /’’అయిదు సాండ్ విచులు’’ మాత్రమే .అందులో ఒకదాన్ని తిన్నాడు . 9-52
కు పారిస్ లోని ‘’ఈఫిల్ టవర్ ‘’కన్పించింది .10-24 p.m. కు అంటే 21-5—27 న పారిస్ లోని le-
borget విమానాశ్రయాన్ని చేరాడు .అశేష జనం స్వాగతం పలికారు .ఫ్రా న్స్ ప్రభుత్వం గౌరవ పురస్కారం
అందించింది .అమెరికా ప్రభుత్వం శుభా కాన్క్షలను తెలియ జేశింది ..ప్రపంచం జేజేలు పలికింది
.అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు .
1929 లో అన్నే మర్రో తో వివాహమైంది .కొడుకు చార్లెస్ జూనియర్ ను కిడ్నాపర్లు ఎత్తు కు
పో యారు .ఎన్ని ప్రయత్నాలు చేసన
ి ా దొ రక లేదు పాపం .అప్పటికే న్యు జెర్సి లో 450 ఎకరాల స్థ లాన్ని
కొని వ్యవసాయ క్షేత్రం గా మార్చాడు .అది నిర్జ న ప్రదేశం .అందుకే కొడుకు కిడ్నాప్ కు గురి అయాడు
.కొంత కాలానికి పిల్లా డి శవం పొ దల దగ్గ ర కని పించింది .ఇక ఇక్కడ ఉంటె క్షేమం కాదని అంతా అమ్మేసి
ఇంగ్ల ండ వెళ్లా డు భార్యతో జర్మనీ నుంచి t.a.t.కు కన్సల్ట ంట్ గా పని చేశాడు .నాజీలను సపో ర్ట్ చేశాడు
.అమెరికా యే యుద్ధా నికి కారణం అన్నాడు .హిట్లర్ అనుచరుడు ఇచ్చిన విందు లో పాల్గొ ని మరీ
అమెరికా కు దూరమైనాడు .జర్మని వారిచ్చిన మెడల ను భార్యకు చూపిస్తే ‘’it is like albartos –the
bird that symbolized doom ‘’అని భవిష్యత్తు ను బాగా ఊహించి చెప్పింది .నాజీలు యూదులను
హిమ్సిస్తు ంటే విమర్శించాడు .అమెరికా తమ ‘’వాయు వీరుడు ‘’ను దేశ ద్రో హి అంది .జర్మనీ ఇచ్చిన
మెడల ను వాపస్ చేయమని చాలా మంది ఒత్తి డి తెచ్చినా ఇవ్వ లేదు .
1939 లో అమెరికా చేరాడు .అయినా అతను అమెరికా ను విమర్శించటం మాన లేదు
.ఇతన్ని సపో ర్ట్ చేసే వారూ వేలాదిగా ఉండే వారు .చివరికి యుద్ధ ం మనమే తెచ్చు కొన్నాం కనుక
పో రాడా వలసిందే అన్నాడు .సైన్యం లో చేరి సేవ చేస్తా నంటే ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఒప్పు కోలేదు
.అవమానించి ,అవహేళన కూడా చేశాడు .కాని హెన్రీ ఫో ర్డ్ తన కన్సల్ట ంట్ గా తీసుకొన్నాడు
..రాత్రింబగళ్ళు కష్ట పడి పని చేశాడు .ఎంత జీతం కావాలన్నా ఇస్తా నన్నాడు ఫో ర్డ్ .తను రిటైర్
అయినప్పుడు ఎంత జీతం తీసుకోన్నాడో అంతే తీసుకొన్నాడు .666-66 డాలర్లు మాత్రమే నెలకు
.u.s.air craft corporation కన్సల్ట ంట్ గా తీసుకోండి .సివిలియన్ అబ్జ ర్వర్ అయాడు .తెస్త పైలట్ గా
కూడా పని చేశాడు .వార్ పైలట్ గా చేయాలన్న కోరిక ఇలా నేర వేరింది .1945 లో జర్మని వెళ్లి హై స్పీడ్
ఎయిర్ క్రా ఫ్ట్ కు డిజైన్ చేయటం లో సాయం చేశాడు .అమెరికా హీరో అన్న పేరు క్రమంగా ఇప్పటికే కను
మరుగైంది .
1960 లో ‘’కన్జ ర్వేశానిస్ట్ ‘’అయాడు .world wide life fund ,international union
for conservation of nature and natural resources కు యేన లేని సేవ చేశాడు .చాలా సార్లు ప్రపంచ
పర్యటన చేసి నిధులు సమ కూర్చాడు .species కు కేతలాగింగ్ లో iternational union కు బాగా
సాయం చేశాడు . కేన్సర్ వ్యాధి వచ్చింది అయినా 1974 లో ఇంగ్ల ండ చేరి world wild life fund నిది
సేకరణకు సాయ పడ్డా డు .కనెక్టికట్ నుండి న్యూయార్క్ కు కుటుంబం ,మిత్రు లతో ప్రయాణం చేశాడు .
చావు కు దగ్గ రయ్యానని తెలుసు కొని చివరి పది రోజులు తన అంత్య క్రియలకు కావలసిన
అన్ని ఏర్పాట్లు స్వయం గా చూసుకొన్నాడు .1974 ఆగస్ట్ ఇరవై ఆరున అందరి సమక్షం లో’’ చార్లెస్
లిండ్ బెర్గ్ హంస అనంత ఆకాశాల లోకి యెగిరి పో యింది’’ .అతని మనవడు ఎరిక్ తాత సాధించిన
విజయానికి 75 వ ప్లా టినం జుబిలీ ని నిర్వహించాడు .అతను 2002 ఏప్రిల్26 న new spirit of saint
louis అనే సొ ంత విమానాన్ని అమెరికా అన్ని రాష్ట్రా లలో పర్యటించి న్యూయార్క్ చేరాడు .అతని వయసు
అప్పుడు ముప్ఫై ఏడు .అతను ఎమచ్యుర్ పైలట్ .తహాతకు తగ్గ మనవడు అని పించుకొన్నాడు ఎరిక్ .
అమెరికా లో జర్మన్
అమెరక
ి ా లో జర్మన్ హవా -1
వందేళ్ళకు పూర్వమే అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ అమెరికాను ‘’here is not
1986 జనాభా లెక్కల ప్రకారం 300 ఏళ్ళ అమెరికా చరిత్ర లో అమెరికా లోని జర్మన్లు
,బ్రిటీష్ వారికంటే ,ఎక్కువ .దాదాపు 44 మిలియన్ల మంది జర్మంలున్నారు .వీరు పద్దెనిమిది
శాతం .ఇవాల్టి నలభై నాలుగు మిలియన్ల జర్మన్ అమెరికన్ల లో నాలుగు శాతం మాత్రమె
జర్మనీ లో పుట్టిన వారున్నారు .1871 కి పూర్వం జర్మని ఒక దేశమే కాదు .డజన్ల కొద్దీ చిన్న
రాష్ట్రా లు మాత్రమె .డచేస్ ,రాజ్యాలు ,ప్రిన్సిపాలిటీలు ఉండేవి .ఒక్కో దానికి ఒక్కో రాజు
,సంప్రదాయం ,ప్రా ంతీయ యాస భాష ఉండేవి .ఏడు వందల ఏళ్ళు యుద్ధా లు ,తిరుగు బాట్లు
,వలసలు ,మత సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి .ఉత్త రమధ్య యూరప్ ,ఉత్త ర సముద్రం
నుండి ,kaunas ,lidhunia దగ్గ ర నీమాన్ నది వరకు ఉండేది .జర్మనీ భాష మాట్లా డే వారంతా
డెన్మార్క్ ,నెదర్లా ండ్ ,బెల్జియం ,లక్సం బెర్గ్ ,ఫ్రా న్స్ ,స్విట్ జేర్లా ండ్ ,ఆస్ట్రియా ,హంగేరి చెక్
,పో లాండ్ ,రష్యాల నుండి వచ్చిన వారే .వీరందర్నీ జర్మన్లు అనే అన్నారు .వీరే మొదటి
సారిగా అమెరికా వచ్చిన జర్మన్లు .నిజం గా వీరికి అప్పుడు జర్మనీ స్వదేశమే కాదు .అక్కడ
పుట్టిందీ లేదు .కనుక వీరందరినీ ఒకే గాట కట్టేసి జర్మన్లు అన్నారు .
1683 లో ఇంగ్లీష్భాష మాట్లా డని జర్మన్లె అమెరికా రావటం ప్రా రంభించారు .,1776
తిరుగు బాటు యుద్ధ ం నాటికి వీరి సంఖ్య 2,25,000 అయింది అమెరికాలో .ఇరవై వ శతాబ్ద ం
లో వీరంతా ,ఇంటర్ మారేజీలు చేసుకొని అమెరికా అంతా వ్యాపించారు .అమెరికాలో
,యూరప్ లో ని అంతర్యుద్ధా ల వల్ల వలసలు తగ్గినా ,జర్మన్లు మాత్రం అమెరికా కు వస్తూ నే
ఉన్నారు .1830 నాటికి రికార్డు స్తా యిలో జర్మన్లు అమెరికా చేరారు .ఐరిష్ వారి తర్వాతస్తా నం
జర్మన్ల దే అందుకే వారిని’’largest non English speaking group ‘’ అన్నారు .ఒక్క 1882
లోనే 2,50,000 మంది జర్మన్లు చేరారు .
1816-90 మధ్య వచ్చిన వారికి ,అంతకు ముందు వచ్చిన వారికి తేడా ఉంది .18 వ
శతాబ్ద ం లో వచ్చిన జర్మన్లు విట్టేన్ బెర్గ్ ,రైన్ నది ఒడ్డు న పశ్చిమ,ఉత్త ర ప్రా ంతాల వారు
.అయితే ,ఇప్పుడొ చ్చిన వారు ‘’సెకండ్ వేవ్ ‘’జనం .వీరు తూర్పు ,ఉత్త ర ప్రష్యా ,బవేరియా
,సాక్సనీ ప్రా ంతాల వారు .1870 లో జర్మని ఏకీకృతం అయింది .ఈ కాలానికి ముందు వచ్చిన
జర్మన్లు తమ రాజ్యానికి విధేయులు .,జర్మనీకి కాదు ..xaxes ,baveria ,,Berlinar లం అని
గర్వం గా చెప్పుకొంటారు ఇప్పటికీ .అన్ని రకాల వారు ,అనేక కారణాల వల్ల వలస వచ్చారు
.మత దురహం కారం వల్ల ఇబ్బంది పడిన మతాల వారు కూడా చేరారు .19 వ శతాబ్ద ం లో
రాజకీయ అణచి వేత లను భరించలేక పో యిన వారూ అమెరికా చేరారు .వీరంతా బాగా
చదువు కొన్న వారు .,రాజకీయ అవగాహన ఉన్న వారూ.
అయితే ,ఆర్ధిక పరిస్తితి మెరుగు పరచు కోవటానికి వచ్చిన వారే ఎక్కువ
.వ్యవసాయం అక్కడ గిట్టక ,పొ లాలు చాలక ,ఇక్కడికీ ,కెనడాకు చేరుకొన్నారు
.అంతర్యుద్ధా లకు ముందే వీరంతా వలస వచ్చారు .సివిల్ వార్ తర్వాత,పారిశ్రా మిక ప్రగతి
అమెరికా లో బాగా ఎక్కువ అవటం ,రాక పో కలకు స్టీమర్లు రావటం, అక్కడ కూలి జనాలు
దొ రక్క పో వటం వల్ల వీరందరూ ఇక్కడికి చేరుకొన్నారు .ఇర వైవ శతాబ్ద ం లో మరో రకమైన
వలసలేర్పడ్డా యి .మొదటి ,రెండు ప్రపంచ యుద్ధా ల శరణార్ధు లు అమెరికా కు రావటం తో
సైన్స్ ,బిజినెస్, కళలు లో గణనీయ ప్రభావం కలిగింది .వీరిలో చాలా మంది యూదులు
.కాధలిక్కులు ,ప్రో టేస్తంట్లు ,హిట్లర్ దాష్టీకానికి భయ పడిన వారూ కూడా వచ్చేశారు జర్మనీ
నుంచి .అమెరికా లో కూడా జనాభా మత ,కుల ,సరి హద్దు లతో విడి పో యారు .జర్మన్
సెటిలర్లు అమెరికా అంతా వ్యాపించారు .చాలా మంది సిటీలు చేరుకొన్నారు .త్వరలోనే
,స్తా నికులతో కలిసి పో యారు .వారి బలం అంతా సెయింట్ లూయీస్ ,సిన్సి నాటి ,మిల్వాకీ
,ఫిలడెల్ఫియా మధ్య అట్లా ంటిక్ ,పైన ఉన్న మిడ్వెస్ట్ రాష్ట్రా లలో చేరింది వీరు తమ సంస్కృతిని
భాషను ,చరితన
్ర ు కాపాడుకొంటున్నారు .పెన్సిల్వేనియా లోని డచ్చులు –అసలు డచ్ సంతతి
వారు కాదు –జర్మన్లె .వీరు deuseche’’వారు .ఆ పేరు ను యాన్కీలు డచ్ గా అపార్ధం
చేసుకొన్నారని భావిస్తు న్నారు .మొదటి ప్రపంచ యుద్ధ ం తర్వాతా అమెరికా లో జర్మన్ వ్యతి
రేకతాభావాలు వ్యాపించాయి .
అమెరక
ి ా లో జర్మన్ హవా –2
పాస్ట ర్ డేనియల్ పాస్టో రియాస్ అనే ఆయన 1683 లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కు
బయట ప్రతి ఇంటికి మూడు ఎకరాల భూమి నిచ్చి ,తాను ఆరు ఎకరాలు ఉంచుకొని ,ఒక
కాలనీ ఏర్పాటు చేశాడు .అదే ‘’జర్మన్ టౌన్’’ అయింది .అది wissa hicon నుంచి
wingohocking creeks దాకా వ్యాపించింది .దాని లేఅవుట్ మధ్య యుగ నైరుతి లోని
గ్రా మాల స్వరూపం గా ఉండేది గ్రా మ మధ్యలో అరవై అడుగుల వెడల్పు రోడ్డు ఉండేది
.దానికిరుప్రక్కలా ఇళ్ళు ఉండేవి ..ఇంటి వెనక తోట ,పో లాలున్దేవి ..విలియం పేన్ అనే క్వేకర్
గవర్నర్ ఆహ్వానం పై వీరంతా ఇక్కడ స్తిర పడ్డా రు .క్వేకర్లు అంటే ‘’సొ సైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ‘’అని
అర్ధం .ఈ ఉద్యమం .1640 లో ఇంగ్లా ండ్ లో ప్రా రంభమై అన్ని దేశాలకు వ్యాపించింది .శాంత
స్వభావం తెల్లని బట్ట లు వీరి ప్రత్యేకత .పెన్సిల్వేనియా రాష్ట ం్ర చేరిన తోలి సెటిలర్లు వీల్లే .1681
లో రెండవ చార్లెస్ రాజు పేన్ గారికి ఈ ప్రా ంతం అంతా అందజేశాడు .ఆయన అందరికి
ఉత్త రాలు రాస్తూ ‘’హో లీ ఎక్స్పేరి మెంట్ ‘’గా దీన్ని వర్ణించి జర్మనీ భాష లోకి తర్జు మా
చేయించి ఆ ఉత్త రాన్ని జర్మనీ దేశానికి పంపాడు .చవకగా భూములు రావటం ,మత
సామరస్యం ఉండటం ,థో ‘’క్రేఫెల్ద్ ‘’(డచ్బార్డ ర్ లోని జర్మని టౌన్ )నుంచి ,పద మూడు
కుటుంబాలు ,ఫ్రా ంక్ ఫర్ట్ అమ్మిన్ నుంచీ వచ్చారు .మొదట్లో చెప్పి నట్లు గా పాస్టో రియాస్
తాను అనుకొన్నట్లు సహాయం చేశాడు .ఈయన పేన్ ఆదేశం పై ఫ్రా ంక్ ఫర్ట్ లో november
1682 లో వెళ్లి కొద్ది కాలం ఉండి వచ్చాడు .అతని మాటలు నమ్మి వీరంతా ఇక్కడికి చేరారు
.కొద్ది మాత్రం ‘’ఇక్కదేముంది బావుకోవటానికి ?’’అని పెదవి విరిచారు కూడా .
పేన్ నుంచి పదిహేను వేల ఎకరాలు ఎకరం పది సెంట్ల కు కొని కాలననీ ఏర్పాటు
చేశారు .1517 లో జర్మనికి చెందినా మార్టిన్ లూధర్ కింగ్ చర్చిని సంస్కరించాలని కోరాడు
.అతని ప్రభావం పెరిగింది .అదే ‘’ప్రో టేస్తంట్ ‘’ప్రభావం అయింది .’’కాల్వ నిస్టు లు అంటే
రిఫార్మర్లు ‘’అన బాప్తిస్టు లు ‘’అయారు .ముప్ఫై ఏళ్ళ మత యుద్ధా లలో ప్రో టేస్తంట్ ,కేధలిక్
రాజులు తీవ్రం గా కలహించుకొన్నారు .henne berger లో మూడొంతుల జనాన్ని చంపేశారు
.రెండు వంతుల ఇళ్ళు తగల బెట్టు కొన్నారు .ఇతర దేశస్తు లు ,దొ ంగలు స్వైర విహారం చేశారు
.నరమాంస భక్షణ కూడా (కన్న బాలిజం )కూడా జరిగింది .ఈ గొడవల్లో ంచి బయట
పడటానికి జర్మనీ నుంచి ఇతర చోట్లకు వలసలు ప్రా రంభ మయాయి .జర్మనీ లోనే వివిధ
ప్రదేశాలు తిరిగి స్విస్ ,హాలాండ్ కొందరు చేరగా ,మిగిలిన వారు అమెరికాకు వలస వచ్చారు .
1756-63 మధ్య ఏడేళ్ళు జర్మన్ యుద్ధ ం జరిగిన కాలం లో అక్కడి నుంచి వలసలు లేవు .ఈ
కాలం లోనే బ్రిటన్ సముద్రా ది పత్యాన్ని సాధించిన తర్వాత 240 ఓడల లో ఫిలడెల్ఫియా
చేరారు .అందులో జర్మన్లె ఎక్కువ .1747 లో గవర్నర్ థామస్ రాష్ట ం్ర లోని రెండు లక్షల
జనాభా లో 3/5 వంతు మంది జర్మన్లె అని రాశాడు .స్తా నికులకు అసూయ పెరిగి ,ఆందో ళన
కు దిగారు .1753 లో అమెరికా స్వాతంత్రో ద్యమ నాయకుడు ,శాస్త ్ర వేత్త బెంజమిన్ ఫ్రా ంక్లిన్
జర్మన్ల ను సమర్ధించాడు .1750 లో పద మూడు కాలనీలలో ,జర్మన్ల సంఖ్య పెరిగింది
.అప్పటికే రెండు లక్షల యాభై వేల మంది జర్మన్లు చేరారు .న్యూయార్క్ ,న్యూ జెర్సి
రాష్ట్రా లలో కూడా జర్మన్ల హవా సాగింది .ఇరవై శాతం మంది మేరి లాండ్ ,వర్జీనియా
,కరోలినాస్ ,జార్జియా లకు చేరుకొన్నారు .
న్యు ఇంగ్లా ండ్ అని పిలువ బడే మాసా చూసేత్స్ లో కూడా జర్మన్లు చేరారు .అక్కడ
ప్యూరిటన్లు ఎక్కువ .వారు మత వ్యతి రేకుల్ని సహించరు .ఇతర దేశీయులు మొదట చేరిన
ప్రదేశం కావటం వల్ల , భూమి తగి నంత భూమి లభ్యం కాలేదనే భావం కూడా కారణం కా
వచ్చు .సున్నపు గనులున్న ప్రా ంతాలే తమకు అనుకూలం అని జర్మన్లు భావించారు .దక్షిణ
ప్రా ంతం లో ప్లా ంటేషన్ ఎక్కువ .అమెరికా జర్మన్ల కు బానిసలు లేరు .బానిసత్వానికి
వ్యతిరేకులు కూడా .ఫ్రా న్సిస్ పాస్తో రియాస్ ,డచ్, జర్మన్ క్వేకర్లు 1688 లోనే బానిసత్వానికి
వ్యతి రేకం గా ప్రచారం చేశారు .ఫిలడెల్ఫియా లో గొప్ప బహిరంగ సభ నిర్వ హించారు .
ఒక మేన్నో నైట్ రైతు తన స్నేహితుడు బానిసలను క్రూ రం గా హింసించ టాన్ని
చూసి ,వారింట్లో నిద్ర కూడా పో కుండా బయటే పొ లం లో పడుకోన్నాడట .జర్మన్లు కాలనీలు
మారారు .1709 లో పలా ట నైట్ లపై ఫ్రెంచి సైన్యం దాడి చేసింది .దానితో పద మూడు వేల
మంది శరనార్ధు లుమెయిన్ ,నేక్కార్ ,రాయి రెయిన్ రివర్ ల గుండా ,లండన్ చేరారు
.జ్వరాలు పీడించాయి .అప్పుడు ప్రో టేస్తంట్ అయిన ‘’క్వీన్ అన్నే ‘’వారి లోని రోమన్
కాధలిక్కు లను అయిర్ లాండ్ కు పంపించింది .ఆరు వేల ఆరు వంద ల మంది సెటి లర్సు
ను నార్త్ కరోలినా పంపించింది .వీరు న్యు బార్న్ లో చేరారు .అక్కడి టెక్సా రోమా ఇండియన్లు
చేసే దాడులను తప్పించు కోవా టానికి రాణి ఆజ్ఞా తో రెండు వేల ఎనిమిది వందల
పద్నాలుగు మంది ను హడ్సన్ వాలీ ప్రా ంతానికి పంపారు .అక్కడ తారు ,టర్పన్ టైన్
,తయారీ లో సాయం చేశారు .వీరికి సరి హద్దు లను కాపాడే బాధ్యత ను అప్ప గించారు .
లండన్ నుంచి న్యు యార్క్ కు ఓడ లో రావటానికి ఆరు నెలలు పట్టేది .పంపించిన
ప్లా నటినర్స్
ే లో నాలుగో వంతు మంది దారిలోనే చని పో యారు .న్యూ యార్క్ చేరిన వారికి
తగిన ఏర్పాట్లు కూడా చేయ లేదు .గుడారాల లోనే కాపురాలుండా వలసి వచ్చింది .జబ్బుల
పాలైనారు .
మళ్ళీ క్వీన్ అన్నే కల్పించుకొని భూమిని కేటా ఇంచింది .కాని రాబర్ట్ లివింగ్ స్టేన్ అనే
ఆయన ఆ భూమి అంతా తనదే నని ,వాళ్ళ తో హెమ్ప్ పంట కు వారిని వాడు కొన్నాడు
.ఇంటి అద్దె ,రవాణా ఖర్చులు వసూలు చేశాడు .1713 లో దీన్ని సహించ లేక ‘’జాన్ కాన్రా డ్
వీసర్ ‘’అనే ఇమ్మిగ్రంట్ ఎదురు తిరిగాడు .కాని ఫలించ లేదు .స్ప్రింగ్ సీజన్ లో నూట యాభై
కుటుంబాలు నలభై మిల్ల దూరం లోని schohairie కు చేరారు .పరిస్థితులు అను
కూలించాయి .పంటలు బాగా పండాయి .ధాన్యం మిల్లు వచ్చింది .
లివింగ్ స్టేన్ తో సహా ఏడుగురు మళ్ళీ అడ్డు కొన్నారు .అద్దె కట్ట మంటే కట్ట ం
పొ మ్మని ఎదిరించారు .వీజర్ ,రాణి దగ్గ ర కు వెళ్లి ఫిర్యాదు చేద్దా మంటే ,ఆమె చని పో యిందని
,తెలిసింది అక్కడివారు వీళ్ళను ఆదరించ లేదు జర్మని చేరి,బానిస జీవితమే గడిపారు .అరవై
కుటుంబాలు వీజర్ తో బాటు పెన్సిల్వేనియా లోని బెర్క్స్ కౌంటీ చేరారు కొందరు అక్కడి
నుండి న్యు జెర్సి వచ్చారు .ఇవాన్జి కల్ ప్రో టేస్తంట్లు అయిన మొరేవింలు పారిటాన్ నది ఒడ్డు న
‘’హో ప్ ‘’అనే సెటిల్ మెంట్ ఏర్పాటు చేసుకొన్నారు అయితే 1808 కి అది పూర్తిగా నీరు కారి
పో యింది .
లూసియానా లో ‘’జాన్ లా‘’అనే వాడు గొప్ప వ్యవసాయం చేయ దలచి జర్మన్ల ను
కూలీలుగా కుదుర్చు కొందామను కొన్నాడు .వాళ్ళు వచ్చిన తర్వాతా పట్టించుకోలేదు
.వాళ్ల ంత జర్మన్ కోస్ట్ఆఫ్ లూసియానా చేరారు .దక్షిణాన ఎబెనేజేర్ ,జార్జియా లకు కొందరు
చేరారు .సౌత్ కరోలినా కు యూరప్ నుండి చార్ల్స్తాన్ పో ర్ట్ గుండా సరాసరి వచ్చారు జర్మన్లు
.నార్త్ కరోలినా ‘’ఆరంజి బెర్గ్ ‘’లో ,మొదటి కాలని ఏర్పడింది .ఇక్కడి నుంచి ,ఇప్పటి లెక్సింగ్
తన కౌంటి వరకు విస్తా రించారు .రిచ్ లాండ్ ,ఫెయిర్ లాండ్ లు ఆ ఊరి పేర్లే .
1732 లో మేరీ లాండ్ లోని బాక్ లాండ్స్ ను మూడేళ్ళ పాటు ,డబ్బేమీ కట్ట కుండా రెండు
వందల ఎకరాలు లభించింది .తర్వాతా ఎకరానికి ఒక్క సెంటు మాత్రమె డబ్బు కట్టా లి
.అందరికి భద్రత ఉంటుందని లార్డ్ బాల్టి మొర్ ప్రకటించాడు .ఇక్కడ పొ గాకు బాగా
పండుతుంది .18 వ శతాబ్ద పు యాత్రికుడు ‘’పో గాకే మాకు మాంసం ,పానీయం ,బట్ట ,డబ్బూ
‘’అన్నాడు .అయితే జర్మన్ల కు ఆహార ధాన్యాల మీద ధ్యాసఎక్కువ. .అందుకని అక్కడ చేర
లేదు .1740 లో monocacy నది మీద ‘’అన్నా పో లీస్ ‘’ను కలుపు కొని ,బ్రిడ్జి పడింది
.మార్కెట్ కూ అను కూల మైంది .ఫ్రెడరిక్ కౌంటి మంచివ్యవసాయ క్షేత్రమైంది .అక్కడ
bachelors delight ఏర్పడింది .చివరికి ఇక్కడికి చేరిన వాడే హేగార్స్ డిలైట్ .న్యు ఇంగ్లా ండ్
లో ‘’వాల్డో బార్న్ ‘’లో జర్మన్ కమ్మ్యునిటి ఏర్పడింది .1740 లో మూడు వందల మంది పాల
టైన్ లోని లూధరన్లు ,’’మైం’’కు చేరారు .వారికి బూమి ,ఇళ్ళు ,చర్చి వాగ్దా నం చేశారు
.సామ్యుయాల్ వాల్డో దగ్గ ర పెద్ద మైదానం లోకి చేరారు .వలస దారుల్ని బో స్ట న్ లో కలిసి కొత్త
నివాసాలకు చేర్చారు .లాగ్ కాబిన్ లో శీతాకాలం rye తో చేసిన వంటకం తో కాల క్షేపం
చేశారు .వీరిపై కెనడియన్ ఇండియన్లు విరుచుకు పడే వారు .భయ పడి కొందరు ‘’నోవా
స్కేడియా ‘’కు పారి పో యారు .మిగిలిన వారిని ఇండియన్లు చంపేశారు .అంతా ఖాళీ
అయింది .1752 లో ‘’కేన్నెబీ’’నది ఒడ్డు న కొందరు జర్మన్లు చేరి ,’’ఫ్రా ంక్ ఫర్ట్ టౌన్
‘’ఏర్పాటు చేసుకొన్నారు .తర్వాత ఇది ‘’dresden‘’తో కలిసి పో యింది .
జర్మన్లు శాంతి కాముకు లవటం ,వ్యవసాయ దారులు కావటం వల్ల రాజకీయాల
జోలికి పో లేదు .వాళ్ళు పౌరులు అని పించు కోవటానికి అవరోధాలు చాలా ఉండేవి కూడా
.అయితే అమెరికా రివల్యూషన్ ను జర్మన్లు సమర్ధించారు .టెక్సాస్ స్టా ంప్ ఆక్ట్ వాళ్ళను
రాజకీయాల్లో దిగెట్లు చేసింది .లూధరన్లు ,రిఫార్మర్ మినిస్టేర్లు రివల్యూషన్ ను సమర్ధించారు
.కొద్ది మంది మాత్రం బ్రిటిషర్ల ను సమర్దిన్చాల్సి వచ్చింది .దీనికి కారణం యూరప్ లోని
జర్మన్ రాజ్యాలను బ్రిటన్ కొనటమే .ముప్ఫై వేల మంది ‘’nercenaries ‘’ను
‘’హేస్సియన్ల ’’ను అమెరికా తో యుద్ధ ం చేయటానికి బ్రిటీష్ ప్రభుత్వం పంపింది .యుద్ధ ం లో
ఓడిపో యినా వారిని జర్మన్ సెటిలర్స్ ఆహ్వానించారు .యుద్ధ ఖైదీ లను ఫ్రెడరిక్ మేరీ లాండ్
లకు పంపి వ్యవసాయ కూలీలుగా పని చేయించారు .మొత్త ం మీద చావగా మిగిలిన ఆరు వేల
మంది హేస్సియన్లు అమెరికా లో ఉండి పో యారు .1783 మార్చి లో యుద్ధ ం ముగిసిందని
తెలియ గానే వీరంతా ఆనందం గా’’ బాండ్ ‘’వాయించారు .
అమెరికా రివల్యూషన్ ,నెపో లియన్ యుద్ధా లు ,1812 లో యుద్ధ ం వల్ల అమెరికా
కు వలసలు తగ్గా యి .అమెరికా రిపబ్లి క్ అయిన మొదటి నలభై ఏళ్ళు స్తిరత్వం కోసం కష్ట
పడాల్సి వచ్చింది .కాని ,1804 లో జార్జి రాప్ప్ నాయకత్వం లోని ‘’రాప్పులు ‘’మత గ్రంధాల
ఆధారం గా జీవితం గడిపే వారు .సంపాదన ను పౌర సేవ కు విని యోగిస్తూ ,1814 లో
ఇండియానా చేరి ,’’న్యు హార్మని’’ లో ముప్ఫై వేల ఎకరాలలో స్తిర పడ్డా రు .అక్కడి
మలేరియా కు తట్టు కో లేక పదేళ్ళ తర్వాతపెన్సిల్వేనియా కు చేరుకొన్నారు .చివరి స్తా వరం
ఒహాయు నది ఒడ్డు న ఎకానమీ .ఇది పిట్స్ బర్గ్ కు ఇరవై కిలో మీటర్ల దూరం .అక్కడ
ఆయిల్ ,బొ గ్గు గనులు ఏర్పాటు చేసుకొని ఆరేళ్ళ తర్వాతబాగా పున్జు కొన్నారు .
‘’ కామన్ ఓనర్ షిప్ ‘’పేరఏర్పడిన జర్మన్ మత సంస్థ లు కొన్ని ,’’జోర్‘’ఒహాయు
‘’లకు1819 లో చేరాయి .1844 లో బెతేల్ మిస్సోరీ లకు ,1856 లో ‘’ఆరా .ఓరిగాన్ ,అమోనా
,ఐయోవా లకు వచ్చారు .మత కారణాల వల్ల ఈ రకం జర్మన్లు అమెరికాకు రావటం కొత్త
విషయం .19 వ శతాబ్ద ం లో వ్యక్తీ గతం గా కుటుంబాలతో ,సామూహికం గా అమెరికాకు
జర్మన్లు చేరారు .రెండొంతుల మంది ఆస్త్రియా ,హంగేరి ,రష్యా లకు వెళ్లా రు .1820 లో
ఎనిమిది వేల మంది జర్మన్లు అమెరికా వచ్చారు .నెపో లియన్ యుద్ధ ం వల్ల బ్రిటీష వారు
పంపించే ‘’చీప్‘’వస్తు వులను చూసి జర్మన్లు ఏవ గిన్చుకొన్నారు .
అమెరక
ి ా లో జర్మన్ హవా –5
1821 లో మిసో రీ డెబ్భై వేల జనాభా తో స్టేట్ అయింది ‘’ద్యుడేన్ ‘’అనే ఆయన ఇవాల్టి
వారం కౌంటీ వద్ద 270 ఎకరాల స్త లం కొని కమ్యునిటి ఏర్పాటు చేశాడు .పన్నెండేళ్ళ తర్వాత
Gielsen Emigration Society ఏర్పడింది .వీరు కర పత్రా లు ముద్రించి జెర్మని కి పంపి
ఇక్కడి భూలోక స్వర్గా నికి రమ్మని ఆహ్వానించారు .’’A free german state in North
America ‘’అని ఆశ పెట్టా రు .అయిదు వందల మంది వచ్చారు .వీరందరూ ‘’లాటిన్
ఫార్మర్స్ ‘’అయారు .ద్యూడేన్ చెప్పిన స్వర్గ ం కనీ పించ లేదు ‘’the American axe is more
difficult to wield than the pen ‘’అని విసుక్కొని మోసపో యామని బాధ పడ్డా రు .కాని ఆ
తర్వాతా ద్యూడేన్ మాట కు స్పందించి యాభై వేల మంది జర్మన్లు వచ్చి చేరారు .వీరు
లైబర
్ర ీలు ,స్కూళ్ళు ,వార్తా పత్రికలూ స్తా పించారు .1837 లో జర్మన్ ఫిలడెల్ఫియా సెటిల్
మెంట్ సొ సైటీ అనేది గాస్కోనేడ్ కౌంటీ లో పన్నెండు వేల ఎకరాలను కొన్నది..క్ర్సమంగా
హీర్మాన్ ,మిస్సోరీ లకు వలసలు ఎక్కువైనాయి .హీర్మాన్ పరిసర ప్రా ంతాలు పళ్ళ తోటల ల
తో కళ కళ లాడింది .సారా పరిశమ
్ర పెంపొ ందింది
1840 లో జర్మన్లు మూడు రెట్లు చేరారు .అమెరికా లోని జర్మన్ ఇమ్మిగ్రెంటు లకు
సాయం చెయాలనే కోరిక కలిగింది .కాని అప్పటికి అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు 1838 లో
‘’జేర్మేనియా సొ సైటీ ఆఫ్ న్యు యార్క్ ‘’ఏర్పడి ,జర్మన్లు టెక్సాస్ లో ఉండటం క్షేమం అని
భావించింది .జర్మని లోని ఉత్త ర రాష్ట్రా ల నుంచి జనం టెక్సాస్ వచ్చారు .ఇక్కడ ప్రజాస్వామ్య
ప్రభుత్వం ,సార వంత మైన నేల వారిని ఆకర్షించాయి .మిసో రీ కి చేరిన వారి కంటే ఇక్కడికి
చేరిన వారి సంఖ్య తక్కువే .
1843 లో జర్మనీ రిపబ్లి క్ టెక్సాస్ వెళ్ళే వారిని ప్రో త్స హించింది .new father land
beyond sea ‘’అని పేరు పెట్టా రు .ఒక్కొక్కరికి 120 డాలర్లు ,ఉచిత ప్రయాణం ,మధ్య పశ్చిమ
టెక్సాస్ లో నలభై ఎకరాల భూమి ఇస్తా మని జేర్మేనియా సొ సైటీ వాగ్దా నం చేసింది .1844
నాటికి మూడు ఓడలలో జనం టెక్సాస్ చేరారు .1847 లో సొ సైటీ దివాలా తీసింది .అంతకు
ముందు 1845 లో టెక్సాస్ కు మెక్సికో కు యుద్ధ ం జరిగింది .ఈ సమయానికి సొ సైటీ మళ్ళీ
పుంజు కొంది .వచ్చిన వారిలో వెయ్యి మంది కామ్పుల్లో ఉండి చని పో యారు .’’prince
Frederick of prushya ‘’పేరు మీద మొదటి మొదటి వైట్ సెటిల్ మెంట్ టెక్సాస్ లో
ఏర్పడింది .మరో అయిదేళ్ళలో రెండు వేల మంది అయారు .ఇక్కడికి చేరిన వారు జర్మనీ
లోని బంధువు లకు ఉత్త రాలు రాస్తూ ‘’జర్మనీ లో పని చేసే దానిలో సగం పని అమెరికా లో
చేస్తే చాలు హాయిగా జీవితం వెళ్లి పో తుంది .అంతకు మించి స్వాతంత్ర్యం ఉన్ది క్కడ .ఇక్కడి
ఇండియన్ల వల్ల ప్రమాదం లేదు .వాళ్ళు మాకు గుర్రా లను ,మాంసాన్ని అంద జేస్తు న్నారు
‘’అని సంతృప్తి కరం గా వారికి తెలియ జేశారు .సివిల్ వార కు ముందు టెక్సాస్ లో జర్మన్లు
ముప్ఫై వేలు .1857 లో గాల్వస్టేన్ అంతా జర్మన్ల తో నిండి పో యింది .అయితే అక్కడ ‘’న్యు
జర్మని ‘’అనే మాట మాత్రం రాలేదు .
జర్మని నుంచి చాలా మంది యూదులు వచ్చారు .1840 జ్యూయిష్ కమ్మ్యునిటి పది
హేను వేలు మాత్రమె .1880 నాటికి జ్యూలసంఖ్య 2,50,000 అయింది వీరందరికీ వ్యాపారం
ఇష్ట ం .డిపార్ట్ మెంట్ స్టో ర్ల ను ఏర్పాటు చేశారు .న్యూయార్క్ లో బాంకులు పెట్టా రు
.lehman ,loeb కుటుంబాలు వీటిలో ప్రసిద్ధు లు ‘’డ్రై గూడ్స్ స్టో ర్స్ ‘’ప్రా రంభించారు .అదే ఆ
తర్వాతా ‘’zean empire ‘’అయింది .అంటే అమెరికా లో జీన్ల ప్రవేశం వీరి వల్లే జరిగింది .ఇలా
అమెరికా అంతా క్రమం గా వ్యాపించి అక్కడి వ్యాపార ,ఉద్యోగ సాహిత్య కళావిద్యా సంస్కృతిక
రంగా లలో స్తిర పడిపో యారు .అప్పుడు అమెరికన్ల కు వీరి పై క్రమంగా అసూయ ప్రా రంభ
మైంది.
అమెరక
ి ా లో జర్మన్ హవా –6
1852-54 కాలం లో అయిదు లక్షల మంది జర్మన్లు అమెరికా చేరారు .వాలందఱు అమెరికా
పద్ధ తుల్ని ఒంట బట్టించుకొని ‘’tranformed them selves complete yankee ‘’అని
పించుకొన్నారు మాత్ర్రు భాషను మాత్రం కాపాడుకొన్నారు .జాతీయతను నిల బెట్టు కొన్నారు
.1836 లో సెయింట్ లూయీస్ లో జర్మన్ భాషా విద్యా లయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు
.ఇవి 1860 కి 38 అయాయి .మరో నాలుగేళ్ల లో జర్మన్ భాషను కర్రిక్యులం లో చేర్చి
బో ధించాలని ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది 1850 లో అమెరికన్లు జర్మనీ భాష ను
నేర్చారు .అప్పుడు మిల్వాకీ లో ఏడు జర్మన్ ‘’బ్రూ వేరీలు ‘’ఉన్నాయి .పదేళ్ళ తర్వాతా ఇవి
19 కు పెరిగాయి .బీర్ గార్డెన్ల ను పెంచారు .జర్మన్ బీర్ కు ప్రత్యేకత పెరిగింది .జర్మన్
సంగీతానికి ప్రా ధాన్యత వచ్చింది .ఒపెరాలు పెరిగాయి .జిమ్నాస్టిక్ క్ల బ్బులు ,వెలిశాయి
.శిక్షణా విద్యా లయాలు వెలిశాయి .ఇప్పటికి టర్నర్లు జిమ్నాస్టిక్ ప్రా క్టీస్ చేస్తు న్నారు
.వ్యాయామ విద్య నేర్పారు .యార్క్ విల్ అనే న్యూయార్క్ లోని అతి పెద్ద భాగం లో జర్మన్లు
ఎక్కువ గా ఉన్నారు .
అమెరికా లో కిండర్ గార్టెన్ స్కూళ్ళు జర్మన్ల వల్ల నే ఏర్పడ్డా యి .’’రోసరీ ‘’అనే స్త్రీ ‘’ది
సిస్టర్స్ ఆఫ్ చారిటీ ‘’సంక్షేమ సంస్థ ను బాల్టి మోర్ లో ఏర్పరచి ఆర్ధిక సాయం అందించింది
.ఆమెయే మొదటి హాస్పిటల్ ను 1846 లో ఏర్పరచింది .జర్మన్ యూదులకు ,ప్రో టేస్తంట్ లకు
వేర్వేరు సంస్థ లున్నాయి .
1848 లో నాలుగు నుంచి పది వేల దాకా జర్మన్లు జెర్మనీ రివల్యూషన్ లో ఇమడ లేక
అమెరికా వచ్చేశారు .వీ రినే ‘’ఫార్టీ యైటర్స్ ‘’ అంటారు .వీరంతా జర్మన్ అమెరికన్
సంస్కృతిని చాలా గొప్ప గా పెంచటానికి కృషి చేశారు .1835 లో ‘’know nothing party
‘’అనే anti foreign feeling ‘’ఏర్పడింది .ఇంకో పదిహేనేళ్ళ లో నేటివిజం పెరిగి వీరికి బలం
పెరిగింది .ఇమ్మిగ్రంట్స్మీద ఆంక్షలు విధించాలని కోరారు .అమెరికా చేరిన వారి హక్కులు కత్తి
రించాలని ఒత్తి డి చేశారు .జర్మన్లు ‘’సాబాత్ ‘’అనే పండుగ ను చేసుకొంటారు .ఆ పండుగ
రోజున సారా త్రా గటం వారి సంప్రదాయం .దీన్ని అమెరికన్లు వ్యతిరేకించారు .డాన్సులు
,తాగుడు ,బౌలింగ్ ఆది వారం నాడు ఇక్కడ నిషేధం .జర్మన్లు దీన్ని వ్యతిరేకించారు .1861 లో
జర్మన్ సినిమా హాల్ యజమాని ఆదివారం నాడు సినిమా హాలు మూసెయ్య టానికి ఒప్పుకో
లేదు .నలభై మంది ఆఫీసర్లు హాల్లో కి జనం రాకుండా అడ్డు పడ్డా రు .1855 లో కక్షలు బాగా
పెరిగాయి .కాద లిక్కులు బాగా దెబ్బ తిన్నారు .సివిల్ వార్లో బానిసత్వ వ్యతిరేకులకూ ఇదే
గతి ‘’.48 గాళ్ళు ‘’బానిసత్వానికి వ్యతి రేకులు .వీరిలో carl shulz రిపబ్లి కన్ పార్టీ లో చేరాడు
.ఈ పార్టి 1854 లో ఏర్పడింది .ఈ పార్టి ‘’నో నతింగ్ ‘’గాళ్ళ కు వ్యతి రేకం .దీనితో జర్మన్ల
రొట్టె విరిగి నేతి లో పడింది .
1860 లో ‘’minute men ‘’అనే దక్షిణ సో ల్జ ర్ల అనుకూల సంస్థ ఏర్పడింది .వీరిని
అడ్డు కొన్న వాళ్ళు జర్మన్ వాలన్తీ ర్లె . దీనితో మిసో రి యునియన్ లో ఉండి పో యి, జర్మని
అమెరికన్ల కు రాజ కీయ విజయం లభించింది .పెన్సివేనియా నుండి కొలరాడో దాకా ఉన్న
జర్మ యువకులందరూ సివిల్ వార్ లో పాల్గొ న్నారు .henry A.kircher అనే మొదటి తరం
అమెరికన్ సివిల్ వార్ గురించి విస్త ృతం గా రాసి జర్మని కి పంపాడు .ఈయన ఇలినాయిస్
లోని బెల్ విల్ కు చెందిన వాడు .ఈయన కూడా యుద్ధ ం లో పాల్గొ న్నాడు .వేలాది జర్మన్లు
ఈ యుద్ధ ం లో చని పో యారు .1865 లో సివిల్ వార్ముగిసింది .జర్మన్ల దేశ భక్తీ అనన్యం అని
రుజు వింది .
1880 లో 1,445,181 మంది జర్మన్లు అమెరికా చేరారు .ఇంకో రెండేళ్ళ తరువాత
రెండు లక్షల యాభై వేల మంది వచ్చారు .వీరంతా గ్రేట్ ప్లైన్స్ అంటే కెనడా లోని
‘’సస్కాచేరాన్ ‘’నుంచి నార్త్ ,సౌత్ డకోటా, నెబ్రా స్కా ,కేంసాస్ వరకు చేరుకొన్నారు .ఇక్కడ
వర్ష పతం తక్కువే .అయితే 1872 -1920 కాలం లో రష్యన్ జర్మన్లు లక్షా ఇరవై వేల మంది
వచ్చారు .ఈ ప్రయరీలు వాళ్ల కు ‘’స్తేప్పీలు ‘’అని పించాయి .ఇక్కడ చేరి వ్యవసాయం చేసి
1920 నాటికి సస్య శ్యామలం చేసి ‘’granary of the world ‘’గా మార్చేశారు .ఇప్పటికి
నాలుగు లక్షల ఇరవై వేల మంది జర్మన్లు అయారు .ఎన్నో రకాల ధాన్యాలను పండించారు
.వీరే ఇక్కడ మొదటి సారిగా ‘’యెర్ర గోధుమ ‘’పంట పండించిన వారు .ఈ విత్త నాన్ని టర్కీ
నుంచి తెచ్చారట .దీన్నే వీళ్ళ భాష లో ‘’red hard winter wheat ‘’అన్నారు .పైన చెప్పిన
ప్రదేశా లన్నిటిలో గోధుమ విరగ పండింది .క్రమం గ సాగు భూమి తగ్గింది .
Verbote అనే జర్మన్ వార్తా పత్రిక 188 ౦ లో ఓట్ల భాగవాతాన్ని ప్రచురించింది .మరో
నాలుగేళ్ల లో కూలీలలు గడ్డు కాలం దాపురించింది .ఇంకో రెండేళ్లలో చికాగో లోని కార్మికుల
సంఖ్య లో మూడో వంతుజర్మన్లె అయారు .నేటివ్ అమెరికన్లు బాగా తగ్గి పో యారు .
అమెరక
ి ా లో జర్మన్ హవా –7
--
బిస్మార్క్ 1871 లో జర్మనీ ఐక్యత ను సాధించాడు .అతన్ని ‘’ఐరన్ చాన్సెలర్ ‘’అంటారు
.మన సర్దా ర్ పటేల్ సంస్థా నాలను రద్దు రద్దు చేసిన పుడు ఆయన్ను ‘’బిస్మార్క్ ఆఫ్
ఇండియా ‘’అని ,ఉక్కు మనిషి అని అన్నారు .బిస్మార్క్ ప్రష్యా దేశాస్తు డు .సైన్యం లో
జేర్మన్ల ను తీసుకొన్నాడు .అమెరికా లోని జర్మన్ల ఆరాధ నీయుడైనాడు .అందుకని వారు
జర్మనీ ఐక్య త సాదింప గలిగి నప్పుడు ,జర్మని అమెరికన్ల ఐక్యత ను ఎందుకు సాధించ
లేము అని ఆలోచించారు .కొందరు మాత్రం బాక్ టు పెవిలియన్ లా,జర్మని వైపు దృష్టి
సారించారు .ఇక్కడి భాష ,పద్ధ తులకు నెమ్మదిగా అలవాటు పడ్డా రు .ఒకరికొకరు సాయం
చేసుకోవాలని భావించారు .ఇంతలో immigration restriction ,American protective
association అనే సంస్త లేర్పడ్డా యి .జర్మని అమెరికన్లు ఇంగ్లీష్ మాట్లా డాలనే ఆందో ళన
పెరిగింది .దీన్ని జర్మన్లు వ్యతి రేకించారు .
జర్మన్ సంగీత కళాశాల పై దాడి చేశారు .జర్మనీ సంగీత ఉజ్జ ్వల కెరటం సింఫనీ
మహా విద్వాంసుడు బీథో వెన్ ను పిట్స్ బెర్గ్ లో అడుగు పెట్ట నివ్వ లేదు .తత్వ వేత్త ,మహా
జర్మన్ నాటక కర్త ,విఖ్యాత జర్మన్ రచయితా అయిన’’ గోధే’’విగ్రహాన్ని కూల గొట్టా రు
..స్కూల్ కర్రిక్యులం లో జర్మన్ భాషను ఎత్తేశారు .జర్మన్ స్కూళ్ళు మూత పడ్డా యి .జర్మన్
పేపర్ల ను నిషేధించారు .ఒక రకం గా చెప్పా లంటే జర్మని ని తుడిచి పెట్టె సర్వ ప్రయత్నాలు
చేశారు .’’de germanaize ‘’జరిగింది .మిన్నే సో టా లోని సెయింట్ పాల్ లో జర్మన్ లైఫ్
ఇన్సురెన్స్ బిల్డింగ్ మీద ఉన్న ‘’జేర్మీనియా ‘’దేవత విగ్రహాన్ని కూడా పడ గొట్టా రు .ఆ
బిల్డింగ్ పేరు ను గార్డియన్ బిల్డింగ్ గా మార్చారు ..వీధులు ,స్కూళ్ళు టౌన్ ల పేర్లన్నీ మార్చి
పారేశారు . ‘’హం బర్జేర్ ‘’ను ‘’లిబర్టి స్టేక్ ‘’అని పిల్చారు .sawerkrant ను లిబర్టి కాలేజి
అన్నారు .నెబ్రా స్కా లోని జర్మన్ టౌన్ –గార్లా ండ్ అయింది .అయోవా లోని బెర్లిన్ ను లింకన్
అని పిలిచారు .జర్మన్ మీసిల్స్ ను లిబర్టి మీజిల్స్ అన్నారు .డాక్టర్లు .
1918 జర్మన్ అమెరికన్ నేషనల్ అలయన్సు కను మరు గైంది. జర్మన్ భాష
మాట్లా డటం మానేశారు .ఇంట్లో కూడా జర్మన్ భాష మాట్లా డటం లేదు పేర్లను
మార్చుకొన్నారు .జార్జి వాషింగ్ ట న్ వొచ్ ఆఫ్ ఫిల డేల్ఫియా తన పేరు చివర ‘’వోక్స్ ‘’అని
తగి లించుకొన్నాడు మతాన్ని బాగా అభిమానించే జర్మన్లు ఇంకా ఎక్కువ గా ఆచరించటం
మొదలెట్టా రు .అదే ఏడాది నవంబర్ లో ఈ చర్చి గ్రూ పులు జర్మని లో పునరావాస కార్య
క్రమాలు చేబట్టి ఇక్కడి అమెరికన్ లకు కారం రాశారు .మళ్ళీ జాతీయ భావాలు పెరిగాయి
.జర్మన్ అమెరికన్లు జర్మనీ కి అన్ని విధాలా సాయం చేసి పునర్వైభవానికి సహకరించారు
1919 లో న్యు యార్క్ లో ‘’స్టీన్ బెన్ సొ సైటీ ‘’ఏర్పడింది అది రాజకీయ ఐక్యత కోసం
మంచి కృషి చేసింది .అప్పటికే జర్మన్లు ఇంగ్లీష నేర్చుకోవటం ,అనేక వృత్తు ల్లో చేరటం జరిగింది
.ఇరవై శతాబ్ద ం వచ్చే సరికి జర్మన్ భాష మాట్లా డటం దాదాపు మర్చి పో యారు
.యుద్ధా నంతరం జర్మన్లు ‘’cultural amnesia ‘’లో పడి పో యారు .మొదటి తరం వారు తమ
మూలాలను వదిలేస్తే ,తరువాతి వారికి అసలు ఆ సంప్రదాయమే కరు వై పో యింది .
అమెరక
ి ా లో జర్మన్ హవా -8
1732-1800 కాలం లో జర్మన్ వార్తా పత్రికలు 38 మాత్రమె ఉండేవి .1848-60 మధ్య
జర్మన్ అమెరికన్ పేపర్లు వచ్చాయి .జర్మ పేపర్లు 266 అయాయి .ఇన్ని పెరగటానికి కారణం
‘’ఫార్టీ యైటర్లె ‘1860 లో సెయింట్ లూయీస్ లో ఏడు మాత్రమె జర్మన్ డైలీ పేపర్లు న్దేవి
.నలభై ఎనిమిది వాళ్ళు Die Waage ,Anzazer ,dest westens పత్రిక లలో స్టా ఫ్ గా చేరి పని
చేశారు .చివరికి యాంటి స్లేవరి పేపర్లు గా మారాయి .చార్లెస్ నాస్ట్ అనే ఫార్టీ యైటర్-‘’ఫాదర్
ఆఫ్ పొ లిటకల్ కార్టూ నిస్ట్ ‘’అయాడు .ఆయనే డెమొక్రా టిక్ పార్టీ వారికి ‘’గాడిద ను ‘’రిపబ్లి క్
పార్టీ వారికి ‘’ఏనుగు ‘’ను ‘’మస్కట్స్‘’గా వేశాడు .ottoman mergan thaler లినో టైప్ కనీ
పెట్టి ,ఆటో మేటిక్ టైప్ సెట్టింగ్ కు ఆద్యుడైనాడు .ఇదంతా 1886 july 3 న. ఈ మార్పుthe
newyork tribune లోప్రా రంభ మైంది .1894 లో 800 ఉన్న జర్మన్ పబ్లి కేషన్లు క్రమం గా
తగ్గా యి .1910-20 కాలం లో 234 కు పడి పో యాయి .
1920 లో సెన్సస్ ప్రకారం జర్మన్ మైగ్రేషన్ 25.3% కు తగ్గింది .1923 లో సుప్రీం
కోర్టు జర్మన్ భాష నిషేధాన్ని రద్దు చేసింది .1919 లో ఆల్కహాల్ తయారు చేయటాన్ని 18 వ
సవరణ ను రద్దు చేసింది .దీనికి జర్మన్లు ఆర్ధికం గా బాగు పడటమే కారణం .దేశం లోని
బ్రూ వేరీలు అన్నీ జర్మన్ల వే .1920 ఎన్నికలు కొంత మార్పు తెచ్చాయి .జర్మన్లు ఉడ్రో విల్సన్
నిల బెట్టిన వాడిని కాకుండా ప్రత్యర్ధి ,జర్మన్ అమెరికన్ లీగ్ బలపరచిన ‘’హార్దిన్గ్స్ కు వోట్లు
వేశారు .ఆ తర్వాతా ఏడాది చికాగో లో రాడికల్ బర్జేర్ బాండ్ పార్టి హార్దిన్గ్స్ జర్మన్ల కు
కృతజ్ఞ తలు చెప్పాలని కోరింది .అయితే దీని సంఖ్యా బలం తగ్గి పో యింది .
ప్రపంచ యుద్ధ ం లో జర్మని లో 18 లక్షల జర్మన్లు చని పో యారు .ఆర్ధికం గా జెర్మని
దెబ్బతింది .జర్మన్ మారక ద్రవ్యం మార్క్ పతన మైంది ఎందరో జ్యూలు జర్మని వదిలి ఇతర
దేశాలకు పారి పో యారు .అక్కడ ఉన్న వాళ్ళను చంపేశారు హిట్లర్ అనుయాయులు .హిట్లర్
పార్టి national socialist german worker’s party (naji )పార్టి ఏర్పడి జ్యూలను ,జిప్సీలను
,స్లా వ్స్ ను మొదలైన ఆర్యేతరులను జర్మని నుండి తరిమేసి ప్రక్షాలన చేస్తా మన్నారు .నాజీ
సభ్యులు అమెరికా వచ్చి ప్రచారం చేశారు .డెట్రా యిట్ లో 1934 లో tuetonia association ను
ఏర్పరచారు .అమెరికా సిటీ లలో అయిదు వందల మంది సభ్యులు చేరారు .హిట్లర్ గెలిస్తే
జర్మని వెళ్లి పో వాలని వీరు ప్రచారం చేశారు .అయితే వీరి సంస్థ ఎవరినీ ఆకర్షించలేక చతికిల
బడింది .1936 లో జర్మన్ అమెరికన్ బండ్ ఏర్పడి తనను తాను ‘’బొ ంద ‘’పెట్టు కోంది.1930
లెక్కల ప్రకారం జర్మన్ అమెరికన్ లలో డెబ్భై శాతం వారికి ఇంటర్నేషనల్ నాజీయిజం మీద
నమ్మకం లేదని రుజువైంది .ఇరవై శాతం మంది నాజీలకు పూర్తిగా వ్యతి రేకం అని చెప్పారు
.బండ్ సభ్యుల సంఖ్య పాతిక వేల కు మించ లేదు .వీరికి రేడియో టెలివిజన్లు కొంత
తోడ్పడ్డా యి .బండ్ లీడర్ fritz kuhn అనే వాడు ఫండ్స్ తినేశాడని ఆరోపణ వచ్చి ,విచారణ
జరిపించి జైల్లో పెట్టా రు .
1933 లో యూదులు జర్మన్ స్టో ర్సు లను ,జర్మన్ వస్తు వులను బహిష్క రించారు .నాజీల
అక్రమాలను ముక్త కంథం తో అందరు నిరశించారు .అయిదు వందల మంది synagogues
యూదుల స్టో ర్సు లను తగుల బెట్టా రు .వేలాది యూదులను కొట్టి బాధించారు .ప్రెసిడెంట్ –
జర్మన్ రాయ బారి ని వెనక్కి పంపించే శాడు .సరి హద్దు ల్ని మూయిన్చేశాడు stewben
society .మొదటి సారిగా నాజీల దుర్మార్గా లను ఖండించింది .జర్మన్ పత్రిక లన్ని ‘’చీకటి
బలగాన్ని ‘’ఈస డించింది .1941 లో జర్మన్,అమెరికన్లు loyal Americans german descent
‘’ ను ఏర్పరచి అమెరికా కు ,ప్రజాస్వామ్యానికి సంపూర్ణ మద్ద తు ప్రకటించి ఊగిస లాట
ధో రణికి స్వస్తి పలికారు . 1942 జనవరిstewbern news paper ‘’అంతా అమెరికా యుద్ధా న్ని
బల పరుస్తూ రాసింది .ఇక్కడి జర్మన్ల ంతా అమెరికన్ జాతీయ స్రవంతి లో చేరి పో యారు .
అమెరక
ి ా లో జర్మన్ హవా –9
అమెరికా లో 18 వ శతాబ్ద ం లో ‘’లాగ్ కేబిన్లు ‘’నిర్మించిన మొదటి వారు జర్మన్లె .ఇవి
విస్కాన్సిన్ లోని మంచు లోను ,టెక్సాస్ లోని దుమ్మును తట్టు కొన గలిగేవి .19 వ శతాబ్ద ం
లో జర్మన్లు క్రిస్మస్ సందర్భం గా క్రిస్మస్ ట్రీ లను ,శాంతా క్లా స్ లను ఏర్పరచారు .పిక్నిక్
ఫూడ్స్ ను తయారు చేసిన వాళ్ళూ జర్మన్లె .frankfurters ,hum burgers saurkrant ,potato
salad లు జర్మన్ల వే .ఇలా జర్మనీ సంప్రదాయం అమెరికాది గా మారి పో యింది
1730 లో తన పదమూడవ ఏట న్యు యార్క్ చేరిన జాన్ పీటర్ జిన్జేర్ ‘’పాలన్తి న్
‘’సాంప్రదాయం వాడు .ఫ్రీ స్పీచ్ కు ఆద్యుడు .అనాధ గా అమెరికా చేరి ,విలియం బ్రా డ్ ఫో ర్డ్
లో అప్రెంటిస్ గా పని చేసి ,న్యూయార్క్ లోని మొదటి వార్తా పత్రిక న్యు యార్క్ గెజిట్ ను
ప్రచురించాడు .జిన్జేర్ క్రమం గా ఎదిగి కాలని మొదటి స్వతంత్ర జర్నల్ ‘’న్యు యార్క్ వీక్లి
జర్నల్ ‘’ను తెచ్చాడు .అంతకు ముందు వరకు ఆ పేపర్ బ్రిటీష రాజు మొదటి జార్జి దయా
దాక్షిణ్యా ల పై బతికింది .ఇప్పుడు స్వతంత్ర పత్రిక .స్వేచ్చగా ,తీవ్రం గా అందులో
రాజకీయాలను రాశాడు జిన్జేర్ .’’cosby నితీవ్రం గా విమర్శించే వాడు .ఆఫీసర్ల ను గాడిదలు
,కుక్కలు అన్నాడు .కోపం వచ్చిన గవర్నర్ కాస్బిపై కోర్టు లో కేసు వేశాడు .ఇతని తరఫున
లాయర్గా ఆండ్రు హామిల్ట న్ పని చేశాడు .’’ప్రభుత్వాన్ని విమర్శించటం ,లొసుగులు చెప్పటం
అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘’అని వాదించాడు .జడ్జి ఇతని వాదన నమ్మి కేసు
కొట్టేశాడు .ఈ విధం గా అమెరికా లో పత్రికా స్వాతంత్ర్యం బల పడింది .అందరు జిన్జేర్ ను
మెచ్చారు .జర్మన్ అమెరికన్ రచయిత ‘’హెన్రీ లూయిస్ మెకెన్ ‘’అది నిజం గా పత్రికా శక్తి
అన్నాడు .18 36 లో బాల్టిమోర్ వెళ్లి తండ్రి తనకు బహుమానం గా ఇచ్చిన ప్రింటింగ్ ప్రెస్ ను
,టైప్ అక్షరాల బూజును దులిపాడు .ఆ తర్వాట్హ మెకెన్ మార్నింగ్ హెరాల్డ్ లో చేరి నిజాయితీ
తెలివి తేటల తో రచనలు చేస్తూ అమెరికన్ జర్న లిస్టు లకు ఆదర్శం అయాడు .1924 లో
‘’అమెరికన్ మెర్కురీ ‘’అనే పేపర్ ను నడిపాడు .ప్రజాస్వామ్యం ,వేదాంతం ,మతం ,కవిత్వం
జ్ఞా పకాల మీద పుస్త కాలు రాశాడు .
1918 లో ‘’ది అమెరికన్ లాంగ్వేజ్ ‘’పత్రిక వచ్చింది ఉచ్చారణ లో వచ్చిన మార్పుల
దశలను చర్చించాడు .వేలాది మాటలు అమెరికా శబ్ద ప్రపంచం లో ఎలా చేరాయో వివ
రించాడు .ఇది ఇప్పుడు పాతదే అని పించినా అమెరికా భాషో ద్యమానికి కర దీపిక గా
నిలిచింది .
విజ్ఞా న శాస్త ం్ర లో ను జర్మన్ల పాత్ర గణ నీయం గా ఉంది ఫార్టీ యైటర్ల లో ఒక
డైన ‘’అబ్రహాం జాకోబి ‘’జర్మన్ల మొదటి వైద్యుడు .అడవుల రక్షణ ,అప్పటి దాకా అమెరికన్ల
కు తెలీదు .బేరన్ హార్డ్ ఎడ్వార్డ్ 1876 లో వచ్చాకనే వీటి పై శ్రద్ధ వహించారు .ఆంత్రో పాలజి ణి
సరదా గా ప్రా రంభించి దానికి ఒక స్తా యి కల్పించింది జర్మన్లె .’’ఫ్రా ంజ్ బాస్ ‘’అనే
జర్మన్1888 లో వచ్చి దీన్ని పూర్తీ స్తా యి శాస్త ం్ర గా మలిచాడు .అతని శిష్యులే కొలంబియా
వర్సిటి లోని ‘’రూత్ బెనెడక్ట్
ి ,మార్గ రేట్ మీడ్ ‘’ లు
1850 లో వచ్చిన ‘’కార్ల్ షుర్జ్ ‘’బానిస వ్యతి రేక తను బో ధించాడు .ఫిలడెల్ఫియా
లో ‘’ఫిమేల్ అంటి స్లేవరి సొ సైటి ణి ఏర్పరచాడు 1856 .లో బానిస వ్యతిరేక ఉద్యమాన్ని
తీవ్రం చేశాడు .మూడేళ్ళ తర్వాత ‘’ట్రూ అమెరికనిజం ‘’భావం తో జాతీయ ప్రా ధాన్యత
పొ ందాడు .బో స్ట న్ లోని ఫాన్విల్ హాల్ లో ఇచ్చిన ఉద్వేగ పూరిత ఉపన్యాసం లో ‘’ఈ దేశ
చరిత్ర లో నీతి తో కూడిన ప్రభావ వంత మైన నిర్ణయాత్మక విధానం ఇదే ‘’అని ప్రకటించాడు
.న్యాయం ,స్వాతంత్రం కోసం పాటు పడ్డా డు .యాభై ఏళ్ళ తర్వాతజర్మని లో ఐక్య ప్రజాస్వామ్య
ప్రభుత్వం ఏర్పడి నందుకు సంతోషించాడు .1848 లో షుర్జ్ స్విస్ దేశానికి పారి పో వాల్సి
వచ్చింది .
1852 లో మళ్ళీ న్యు యార్క్ వచ్చిన షుజ్ ‘’father land is so close to me
‘’అన్నాడు .భార్య మార్గ రేట్ మేయర్ తో కలిసి వాటర్ టౌన్ ,విస్కాన్సిన్ లలో పర్య తించాడు
.ఆమె ఈ రెండు చోట్లా కిన్దర్ గార్టెన్ స్కూళ్ళ ను ప్రా రంభించింది .ఇవే మొదటి కిండర్ స్కూళ్ళు
.ఆయన ఇంగ్లీష్ బో ధిస్తూ ,ళా ప్రా క్టీస్ చేశాడు .అప్పుడే ఇల్లినాయిస్ రిప్రేజెంటటివ్ అయిన
అబ్రహాం లింకన్ కూడా సభ్యుడై ,కొత్త గా పెట్టిన రిపబ్లి కన్ పార్టి లో చేరాడు .లింకన్ ప్రెసిడెంట్
గా ఎన్నిక కావటానికి షుజ్జ్ తీవ్రం గా ప్రచారం చేశాడు ‘’ I made Lincon President ‘’అని
మిత్రు డికి గర్వం గా జాబు రాశాడు .అంటే తాను లింకన్ కు ప్రజా బలం చేకూర్చ టానికి
,బానిసత్వ వేళ్ళను పెకలించటానికి తోత్పడిణా నని తన జాబు లో సారాంశం గా చెప్పాడు
.ప్రెసిడెంట్ లింకన్ షు జ్జ్ ను స్పెయిన్ కు రాయ బారిని చేసి కృతజ్ఞ త చూపాడు .1862 ఆ
పదవిని వదిలి పెట్టి ,సివిల్ వార్ లో విదేశీ జోక్యం లేకుండా చేయటానికి ఏమి చెయ్యాలి అన్న
దాని పై ప్రెసిడెంట్ కు సలహా దారు గా ఉన్నాడు .దాన్ని తిరస్కరిస్తే brigadier general of
volunteer union troops అయాడు .
1865 లో ప్రెసిడెంట్ లింకన్ హత్య షుజ్ కెరీర్ ను మార్చేసింది .లింకన్ తర్వాతి
ప్రెసిడెంట్ ఆండ్రు జాన్సన్ పద్ధ తి నచ్చక వాషింగ్ టన్ వదిలి సెయింట్ లూయిస్ చేరి
westliche post ‘’కు ఎడిటర్ గా పని చేసి జర్నలిజం లో స్తిర పడి పో యాడు .1869 లో మళ్ళీ
రాజకీయ ప్రవేశం చేశాడు .సెనేట కు ఎన్నికైన మొదటి జర్మన్ అని పించుకొన్నాడు .born
citizen అయి మిస్సోరి నుంచి 1875 లో సెనేటర్ గా ఎన్నికయాడు .అమెరికా స్వాతంత్రా నికి
వెన్నెముక అయాడు .కరేబియన్ సముద్రం లో అమెరికా విస్త రణ కు తోడ్పడ్డా డు .అమెరికన్
ఇండియన్స్ పై వివక్ష ను నిర శించాడు షుజ్జ్ .
ప్రెసిడెంట్ రూథర్ ఫో ర్డ్ బి.హేయిస్ –కాలినక్ట్ లో సెక్రెటరి ఆఫ్ ది ఇంటీరియర్ గా పని చేసి
సెనేటర్ గా సమర్ధత చూపాడు .బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్ ,,యంగ్ ఇండియన్స్ కు
,విద్య కు ,అరణ్య ,భూ సంపద పరి రక్షణ కు గొప్ప కృషి చేశాడు .ప్రఖ్యాత అ రచయిత మార్క్
ట్వేన్ ఈయన స్నేహితుడే .అతని మరణాన్నివిని మార్క్ ట్వేన్ ‘గొప్పగా ఆయన్ను
విశ్లేషించాడు .మార్క్ ట్వేన్ అనే పేరు తనకు ఎలా వచ్చిందో అందులో తెలిపాడు .షుజ్జ్ ను
‘’పో లిటికల్ చాన్నేల్ ఫౌండర్ ‘’అని కీర్తించాడు .అతని నిజాయితీ దేశభక్తి దీక్ష ,గౌరవం
,దూసుకు పో యే తత్త ్వం అంటే తనకు మహా ఇష్ట ం అని అభి వర్ణించాడు .తాను రాజకీయం
గా షుజ్ తో కలిసి ప్రయాణం చేయ లేక పో యానని బాధ పడ్డా డు .అయితే తాను యే మాత్రం
సంకోచించ కుండా షుజ్ అను అనుసరించాను అని గర్వం గా చెప్పుకొన్నాడు మార్క్ ట్వేన్ .
తాన్ లోని అడ్వాన్సెడ్ స్ట డి ,న్యు స్కూల్ ఫర్ సో షల్ రిసెర్చ్ లు న్యు యార్క్ లో
ఏర్పడ్డా యి .ఇవన్ని శరణార్ధు ల పాలిటి శరణాలయాలయాయి
.పొ లిటికల్ సో షల్ సైన్సు ల లో కూడా స్కూళ్ళు వచ్చాయి ఆల్విన్
జాన్సన్ న్యు స్కూల్ అని ఏర్పరచాడు .బ్లా క్ మౌంటేన్ కాలేజి లో
లిబరల్ ఆర్ట్స్ వచ్చాయి .ఇది నార్త్ కరోలినా లో ఉండి .ఇదే తర్వాతా
రూరల్ రేఫ్యుజి ఫర్ మేని ఏమిగ్రీ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ గా మారింది .
మేధో వలస
1833-45 మధ్య హిట్లర్ కు భయ పడి ఒక లక్షా ముప్పహి వేల మంది
జర్మన్లు అమెరికా చేరారు .ఇక్కడ స్వంత సంస్థ లను
ఏర్పరచుకొన్నారు .అమెరికన్ పౌరసత్వమూ పొ ందారు .దేశ మంతటా
విస్త రించారు .వీరి వల్ల నే సాంస్కృతిక మేదో వలస పెరిగింది .బ్రెయిన్
డ్రైన్అయి ఇక్కడ గైన్అయారు .ఏమిగ్రీ శిక్షకుడు జోసఫ్ ఆల్బెర్స్
ఆబ్స్త్రా క్ట్ పైంటర్ .కలర్ తెరపి మీద కృషి చేశాడు .అతని సబ్జెక్ట్ -''-ది
ఇంతేన్సిటి ఆఫ్ పిగ్మేన్త్స్ అండ్ హౌ దే ఫంక్షన్ విత్ వాన్ అనదర్
''.అతని homage to the square ,ascending yellow square within
a white square within a blue square ఉండి ఆశ్చర్యం కలిగిస్తా యి
.పేరుకు తగ్గ టీ ''effect of ascending of movement towards the
edges of the canvas ''కానీ పించి దిగ్భ్రాంతిని కల్గిస్తు ందని విశ్లేషకులు
మెచ్చారు అందులో లైన్ ,ఆంగిల్ ,షేప్ ,స్పేస్ లను వీక్షించే
వీలుంటుంది .ఇక్కడ వాస్త వం తో పాటు జామెట్రీ ఆర్ట్ ,అనేక వైవిధ్యం
తో కన్పించటం విశేషం అంటారు తెలిసిన వాళ్ళు .
1919 లో ''బాహాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ''ఏర్పడింది .ఇవి ఇంటి
నిర్మాణం కోసం వచ్చినవి .ఆధునిక డిజైన్ ను నేర్పిస్తా రు .ఇవాళ
డిజైన్ అనేది ఒక కల గా విస్త ృతమైంది .అదే సంపూర్ణ ఆర్కి టేక్చర్
అయి కూర్చుంది .ఈ జర్మన్ ఆర్టిస్టు ల వల్ల అమెరికా ఆర్కి టేక్చర్
బాగా పెరిగి పో యింది హార్వర్డ్ లోని గ్రో పియాస్ ,చికాగో లోని మీస్ లు
సృజనాత్మక ప్రో పో ర్శన్లు ,స్పేస్ ప్లా న్ యే రూం ,బిల్డింగ్ యే సొ సైటీ
అన్నీ వచ్చాయి .మీస్ ను ''the poet of steel and glass ''అన్నారు
.చికాగో అంతా ఇతని దిజైనే అంటే అతిశయోక్తి కాదు .గ్రో పియాస్
కేంబ్రిడ్జి లోని గ్రా డ్యు ఎట్ సెంటర్ ,బో స్ట న్ లోని నేషనల్ షామాట్ బాంక్
,టెంపుల్ ఇస్రా యిల్ డిజైన్ల సృష్టి కర్త .ట్యూ బ్యులర్ స్టీల్ చైర్ నిర్మాత
మార్సెల్ బర్ర్ .మెసా చుసేత్స్ లో లింకన్ లో ఉన్న ఇళ్ళు ,అనేక
హో మేస్ అతను డిజైన్ చేసినవే .
విజ్ఞా న శాస్త ్ర పురోగతి
జర్మని నుండి హిట్లర్ దుర్మార్గా న్ని సహించలేక ఎందరో విజ్ఞా న
శాస్త ్ర వేత్తలు అమెరికా చేరి ఇక్కడి శాస్త ్ర పురోగతికి తోడ్పడ్డా రు .వారి
సేవలు అమూల్యం .అలంటి ఎందరిలో చుక్కల్లో చంద్రు డు ఆల్బర్ట్
అయిన్ స్టీన్ .అలాగే రాకెట్ పితామహుడు ''వాన్ బ్రా న్ ''జర్మని
దేశాస్తు డే .హిట్లర్ కు తెలీకుండా జర్మని నుంచి తప్పించి అమెరికా
తీసుకొచ్చి రాకెట్ లను డిజైన్ చేయించారు అమెరికా వాళ్ళు
అలబామా లో హన్త్స్ విల్ లో వాన్ బ్రా న్ స్పేస్ సెంటర్ ను ఆయన
గౌరవార్ధం ఏర్పరచారు .ఇక్కడే అధునాతన రాకెట్ లను రూప కల్పనా
చేసి ప్రయోగించి అమెరికాకు ఆధిక్యాన్ని చేకూర్చిన వాడు బ్రా న్
.అపన్ హీమేర్ అనే జర్మన్ అమెరికన్ ,వేర్నేర్ వాన్ బ్రా న్ లిద్ద రూ
మాన్ హటాన్ లో న్యూక్లియర్ ఫిషన్ పై కృషి చేశారు .బ్రా న్ ప్రపంచం
లోనే మొదటి ఆపెరేషనల్ గైడెడ్ మిస్సైల్ ను ,v2 స్పేస్ షటిల్ ను
తయారు చేశాడు .స్పేస్ ప్రో గ్రా ం లో అమెరికా ముందడుగు వెయ
టానికి మార్గ దర్శకుడయాడు .1958 లో మొదటి సాటి లైట్
ఎన్కౌంటర్ ఒకటి ని ఆర్బిట్ లో ప్రవేశ పెట్టిన గ్రూ ప్ లో బ్రా న్ ఉన్నాడు
.అయన రాకెట్ ఇంజినీర్ .అదే తర్వాతా నాసా గా మారింది .సాటర్న్
ఫైవ్ ,రాకెట్ లాంచ్ వెహికల్ ,లో అపో ల్లో రెండు ను చంద్రు ని మీద కు
పంపారు .నాసా కు అసిస్టంట్ డైరెక్టర్ అయాడు .1972 లో అతని
ఆధ్వర్యం లో తొమ్మిది ఫ్లైట్స్ ను ,ఆరు లూనార్ లాందిన్గ్స్ ఆఫ్ అపో ల్లో
స్పేస్ క్రా ఫ్ట్ ప్రో గ్రా ములు జరిగాయి .ఆపన్ హీమార్ అణు బాంబు
తయారీ లో ప్రముఖ పాత్ర వహించాడు .ఇలా ఎందేరెందరో శాస్త ్ర వేత్తలు
అమెరికా పటాన్నే మార్చి వెయ టానికి తోడ్పడ్డా రు .
సంగీత నృత్యాలలో ప్రభావం
జర్మని ఆహారం పానీయం ,నృత్యాలు ,సంగీతం బాగా
ప్రేరణ నిచ్చాయి .జర్మన్ సంగీత కారుడు జోహానా సెబాస్టియన్ బాచ్
సంగీతానికి అమెరికా లో గొప్ప క్రేజు .బీథో వెన్ ,ఫ్రా ంక్ సకు బెర్ట్ ,రిచార్డ్
వాగ్నేర్ లు జర్మన్ సంగీతం లో సిద్ధ హస్తు లు .వీరి సంగీతాన్ని
అమెరికన్లు విపరీతం గా ఆద రించారు .ఇంకా ఇప్పటికి జర్మన్లు
సంగీత కచేరీలు స్టేజి దశ లోనే ఉన్నాయి .కాని అమెరికన్లు పాప్యులర్
ఎలెక్ట్రా నిక్ మ్యూజిక్ అంటే ఇష్ట డ తారు .
అమెరికా లోని ఇప్పటి జర్మన్లు మూడవ
తరానికి చెందిన వారు .ఇటీవలి కాలం లో జర్మన్ల కు ,అమెరికన్ల కు
తగాదాలు లేవు.stewbendaay parades అందరు హాజరవుతున్నారు
.జర్మన్ పండుగలను అందరు గౌరవించి హాజరై అంతా ఒకటే ననే
భావం కల్గిస్తు న్నారు .
1959 లో జర్మన్ అమెరికన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది .జర్మన్ సంస్కృతీ లోని మంచిని
అన్ని చోట్లా వ్యాపింప జేయాలని వారి ఆశయం .ఇప్పటికి నలభై నాలుగు మిలియన్ల జర్మన్
అమెరికన్లు జర్మన్ వార సత్వాన్ని గురించి చెప్పుకొంటారు .''we must all work together so
that our most priceless possessions ,our heritage ,and knowledge of our cultural
contributions -will not be lost ''అని జర్మన్ అమెరికన్లు చెప్పుకొంటారు .ఇదీ జాతుల
సమ్మేళనం ,అమెరికా జాతీయతే అందరిది .అదే అందర్ని కట్టి పడేస్తో ంది .''లాంగ్ లివ్ జర్మన్
అమెరికన్ అస్సిమిలేషన్
రక్షిత వార్తా సమాచారాన్ని క్రిప్టో గ్రఫీ అంటారు .అంటే పంపిన వాడికి ,పంపబడే వాడికి తప్ప
ఆ కోడ్ఇంకెవరికి తెలీదు .దాన్ని అవతలి వాడు డీ కోడ్ చేసుకొని తెలుసు కొంటాడు .ఇది యుద్ధా లలో
చాలా ప్రయోజన కరం .దానికి ఎంతో బుర్ర ఉండాలి .అలాంటి అరుదైన మేధావి టూరింగ్ .1912 జూన్ 23
న ఇంగ్లా ండ్ లో ని లండన్ లో జన్మించాడు .తల్లి వైపు ,తండ్రి వైపు వారందరూ మహా తెలివి గల వారే
.ఇతను చిన్నప్పటి నుండి స్వతంత్రమైన ఆలోచనలున్నవాడు .పదేళ్ళ వయసు లో హాజేల్ హర్స్ట్ స్కూల్
లో చేరాడు .అతను మేధావి అని టీచర్స్ గ్రహించారు .బేసిక్స్ గురించి ఎక్కువ గా ఆలోచించే వాడు
.తర్వాతా శేర్బార్న్ స్కూల్ లో చేరాడు .అక్కడ క్లా సిక్స్ అని పిలువ బడే గ్రీక్ ,లాటిన్
చదివాడు.పద్నాలుగు ఏళ్ళ కే చేమిస్త్రి లో మహా ప్రతిభా వంతుదని పించుకొన్నాడు .అతని లోని గణిత
మేధావి కవిత్వం రూపం లో బయట పడ్డా డు ‘’the maths brain liesawake in his bed –doing logs
to ten places and trig in his head .అని కవిత రాశాడు .అతని ముఖ్య స్నేహితుడు
,సహాధ్యాయిమార్కాం అకస్మాత్తు గా చని పో తే తల్ల డిల్లి పో యాడు .
కేంబ్రిడ్జి లోని కింగ్స్ కాలేజి లో స్కాలర్షిప్ తో చేరాడు .హిట్లర్ జర్మనీ నియంత గా అధికారం లో
నిలబడ్డా డు .మాస్ట ర్ డిగ్రీని గణితం లో సాధించాడు 1934 లో .తరువాతి ఏడు కింగ్స్ కాలేజికి ఫెలోషిప్
పొ ందాడు on computable numbers అనే పేపర్ ప్రకటించాడు .కొన్ని గణిత భావాలను రుజువు
చేయలేము అని తెలియ జేశాడు .దీంతో యూని వేర్సాల్ కంప్యుటర్ ‘’భావనకు బీజం పడింది .తర్వాతా
ప్రీస్టన్ యూని వర్సిటి లో అడ్వాన్సెడ్ స్టు డి కి చేరాడు ..గణితం లో పి.హెచ్.డి.సాధించాడు .మళ్ళీ కింగ్స్
కాలేజి లో ‘’ కోడ్ అండ్ సైఫెర్ స్కూల్ లో ‘’చేరాడు . mathematical logic అంటే మహా ఇష్ట ం .దాన్ని
mathematics of mathematics అంటారు .ప్రా బబిలిటి అనేది గణితం ప్రకారం కంప్యూట బిలిటి కి
సమానం .
క్రీ.పూ.4000 లకే ఆరకాల జిస్టు లు లెక్కలు తేలిగ్గా చేసే’’ అబాకస్’’ అనేది ఉందని గుర్తించారు
.అదొ క డిజిటల్ కంప్యూటర్ వంటిది .టూరింగ్ దృష్టి అలాంటిది తయారు చేయాలని యునివేర్సాల్ మషీన్
కోసం ప్రయత్నాలు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధ ం లో జర్మన్లు ’’high security top secret
communications వ్యవస్థ రూపొ ందించారు .అదే’’cipher machine ‘’ దాన్ని వాళ్ళు’’ ఎనిగ్మా’’ అని
పేరు పెట్టా రు .cipher అంటే వార్త ను కోడ్ మెసేజెస్ గా ప్రతి అక్షరానికి వివిధ అక్షరాలను సమ
కూర్చిపంపటం .దీన్ని తెలుసు కోవటం బ్రహ్మ ప్రళయమే అవుతుంది .1938 లో డీ కోడ్ చేయటానికి అతి
కష్ట మైనా కోడ్ ను జర్మన్లు కని పెట్టా రు . 1939 లో జర్మని పో లాండ్ మీద దాడి చేసింది .బ్రిటన్ ,ఫ్రా న్స్
లు నాజీ వ్యతిరేక పో రాటం చేయాలని నిర్ణ యించారు .బ్లేత్చారి పార్క్ లో ని పరిశోధనా సంస్థ లో టూరింగ్
యుద్ద్ధ కాలం అంతా పని చేశాడు .అతని పరిశోధన సఫలమైంది .నాజీ ల ఎనిగ్మా కోడ్ ను డీ కోడ్ చేసి
వాళ్ల యుద్ధ తంత్రా న్ని పసిగట్టి బ్రిటీష ప్రభుత్వానికి తెలియ జేశాడు .దీంతో కొత్త కోడ్ బ్రేకింగ్ టెక్నిక్
ప్రా రంభమైంది .దీన్ని సాధించిన మేదావే టూరింగ్ .అదే జర్మని పతనానికి దారి చూపింది .యుద్ధ ం లో
తుడిచి పెట్టు కు పో యింది .ప్రపంచాన్ని నాజీ భూతం నుండి కాపాడిన మేధావి గా టూ రింగ్ గుర్తింపు
పొ ందాదు ,1942 లో అమెరికా వెళ్లి అక్కడి నావికా దళం తో పని చేసి కోడ్ బ్రేకింగ్ లో
సలహాలనిచ్చాడు .అక్కడి ఒహాయో లో ఉన్న గ్రా హం బెల్ లాబ్ లో ఎంక్రిప్తింగ్ స్పీచ్ పరికరాలను
తయారు చేయటం లో సాయం చేశాడు .colossas’’అనే కొత్త మెషీన్ తయారు చేశాడు .1945 లో’’ ఆర్డ ర్
ఆఫ్ ది బ్రిటీష ఎంపైర్’’ పురస్కారం అందుకొన్నాడు కంప్యుటర్ కు ఆద్యుడై ,మానవ మెదడు ను కృత్రిమం
గా తయారు చేసే ఆలోచన లో పడ్డా డు .యంత్రా నికి ఉన్న అన్ని సామర్ధ్యాలను వాడి ఆలోచన ,తెలివి
తేటలు తో పనిచేసే సాధనాన్ని తయారు చేసే ఆలోచన కు వచ్చాడు దీన్నే ‘’ బిల్డింగ్ ది బ్రెయిన్
‘’అంటారు .’’కంప్యూటర్ల కు విషయ జ్ఞా నం ,అనుభవం ఉండదన్న భావన తప్పు అని చెప్పాడు .అది
కూడా మానవుడి లాగే అన్ని రకాల ప్రజ్ఞా ,జ్ఞా నం అనుభవాలను చూపుతుంది అని తెలియ జేశాడు
.ఇదేartificial intelligence ‘’ కు దారి చూపింది .
‘’ సెల్ఫ్ ఆర్గ నైజింగ్ సిస్టం’’ తయారు చేశాడు దాన్నే’’ సెల్యులర్ ఆటోమా ‘’ అని గణితజ్ఞు లు
పిలిచారు .తర్వాతనేషనల్ ఫిజికల్ లాబ్ కు వెళ్లి ’’ pilot aautomaatic computing engine
‘’‘’(a.c.e.)కోసం పని చేశాడు ఆ నాటి కంప్యూటర్స్ కు అవసర మైన సెట్స్ ,ప్రో గ్రా మింగ్ టెక్నిక్స్ ,రోటీ న్స్
ను తయారు చేశాడు ..అయితే అక్కడ పని చాలా నెమ్మదిగా జరుగుతుంటే మాంచెస్టర్ యుని వేర్సిటి కి
వెళ్లి అక్కడ వారు తయారు చేస్తు న్న కంప్యుటర్ కు సాయం చేశాడు ‘’.కంప్యుటర్ చేస్’’ కు ప్రో గ్రా ములు
రాశాడు .’ 1950 లో ‘’computing machinery and intelligence’’ అనే దాని మీద అతి విలువైన
పత్రా న్ని రూపొ ందించాడు .ఇదే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు మార్గ ం చూపింది .అవతల మాట్లా డేది
మనిషా కంప్యుటారా అనే దాన్ని గుర్తించే test తయారు చేశాడు .దాన్ని అతని పేర పిలుస్తు న్నారు
.1951 లో’’బ్రిటన్ రాయల సొ సైటీ ఫెలో ‘’ గా అత్యున్నత గౌరవం ప్రభుత్వం ఇచ్చింది .1952 లో the
chemical basis for morphogenesis ‘’అనేపేపర్ ప్రెసెంట్ చేశాడు .మానవ శరీర భాగాల్లో అభివృద్ధి
కారక మైన తేడాల వివరణ దీనితో సాధ్యం అయింది
పాపం ఆ కాలం లో ఉన్న హో మో సెక్స్ కు బానిసై ఒకడిని చేర దీసి చాలా నష్ట పో యాడు ఇంట్లో
డబ్బు ఎత్తు కు పో యాడు వాడు .అనవసరం గా వాడి మీద కేసు పెట్టి దెబ్బ తిన్న దురదృష్ట వంతుడు
టూరింగ్ .నిజం ఒప్పు కొ నందుకు టూరింగ్ కు శిక్ష పడింది .దానిని తప్పించు కోవటానికి ఫిమేల్
హార్మోన్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు .దానిని తప్పించుకోలేక ,మనసు లో బాధ చెప్పుకోలేక ఒంటరి తనం
అనుభవించాడు .ఫ్రా న్స్ కు వెళ్తా నని బ్రిటీష ప్రభుత్వాన్ని కోరితే తిరస్కరించింది .చివరికి 1954 జూన్
ఎనిమిది న తన గడి లో ఆత్మా హత్య చేసుకొని చని పో యి నట్లు గా గుర్తించారు . ఆపిల్ పండు లో సైనైడ్
చేర్చితిన్నాడని భావించారు అయితే దీన్ని చాల మంది నమ్మ లేదు .రష్యా గూఢ చారి వ్యవస్థ హత్యకు
కారణం అని కొందరు భావించారు .ఈ నాటి వరకు అతని హత్య మిస్ట రీ విడి పో లేదు .ప్రభుత్వం అతని
పట్ల చాలా ఉదా సీనం గా వ్యవహరించిందని ప్రజలు ,మేధావులు తప్పు పట్టా రు .నిరసన ప్రదర్శనలు
చేశారు
కంప్యుటర్ మా నవుని లా ఎదిగే అతి ఉత్కృష్ట సమయం లో అతని చావు ను ప్రపంచ దేశాలు
జీర్ణించుకో లేక పో యాయి .అతని మరణం తర్వాత యాభై ఏళ్ళ కు జనం చైతన్యులయారు 2009 లో
ప్రజలు అతని విలువను అర్ధం చేసుకొని .ప్రభుత్వ అసమర్ధ తను దుయ్య బడుతూ భారీ ప్రదర్శనలు
చేశారు .ప్రధాని గార్డ న్ బ్రౌ న్ వారిని సముదాయిస్తూ ‘’టూరింగ్ పట్ల అతి దారుణం గా ప్రభుత్వం
ప్రవర్తిన్చిందన్న మాట నిజమేనని ,అది తప్పే నని ,ఆయన్ను అనవసరం గా ఫిమేల్ ఇంజేక్షన్ల ను
చేయించుకొనే పరిస్తితి కల్పించటం విషాద కరం అనీ ,అతను ఫాసిజాన్ని అంతం చేయ టానికి చేసన
ి
కృషి మాన వాళి మరచి పో లేదని ,అందుకే తాను ప్రధాన మంత్రిగా ,జాతికి క్షమాపణ చెబుతున్నానని
మహా మేధావి టూరింగ్ సేవలు చిరస్మరణీయం గొప్పగా శ్లా ఘించాడు .
ఇవాళ టూరింగ్ పై అనేక నాటికలు ,కవితలు వ్యాసాలూ వస్తు న్నాయి .అతన్ని
జాతీయ నాయకుడని కీర్తిస్తు న్నారు .2002 లో అతని పై ఒక జాతీయ సదస్సు నిర్వ హించారు ఆరోజు
ను ‘’టూరింగ్ డే ‘’ అన్నారు ‘’.యుని వరసల్ మషిన్’’ లో ఇవాళ మనం అందరం భాగా స్వామ్యులం
అవటానికి ఆనాడు అలాన్ టూరింగ్ చేసిన ,అందించిన సేవలే కారణం .ఇప్పుడు2012 సంవత్సరం
అలాన్ టూరింగ్ శత జయంతి సంవత్సరం .మనం మరచి పో యిన మేధావిని మళ్ళీ గుర్తు చేసుకొని
భావి తరాలకు ప్రేరణను అందిద్దా ం .
హక్స్లీ సో దరులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారు .ఇద్ద్దరూ సాహితీ మేరువులే .ఆల్డ స్
హక్స్లీ జీవితాంతం ఆలోచించిన సమస్య ‘’అధిక జనాభా .’’దాన్ని నియంత్రించటం పై ఎంతో
రాసి జనాన్ని ప్రభావితం చేశాడు .దీనిపై ఎన్నో ప్రసంగాలు చేశాడు సినిమాలకు స్క్రిప్ట్ లు
రాశాడు .ఆ సమస్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పాడు .ఆయన దృష్టిలో అధిక
జనాభా సమస్య జనాభా పెరుగుదల మాత్రమె కాదని అల్ప జ్ఞా నుల సంఖ్యా పెరిగి పో తోందని
బాధ .ఆయనకు ‘’యూజేనిక్స్ ‘’చాలా ఇష్ట మైన విషయం .ఆరోగ్యకరమైన ఉత్త మ జాతిని
మనకు కావాల్సిన రీతి లో తయారు చేసుకోవటం చాలా అవసరం అని చెప్పాడు .ఇది మేధావి
తనం పెంచుకోవటానికీ తోడ్పడుతుందని వివరించాడు .అందుకే ఆయనకు బ్రిటిష్ యూజేనిక్
సొ సైటీ లో సభ్యత్వం లభించింది .
ఈయన తండ్రి హెన్రి హక్స్లీ .తల్లి జూలియా .తండ్రి డార్విన్ సిద్ధా ంతాన్ని బాగా నమ్మిన
కుటుంబం వాడు .తల్లి తాత డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ అనే ఆంగ్ల విద్యా వేత్త ,చరిత్ర వేత్త
.ఈయనే ఇంగ్లా ండ్ లోని రగ్బీ స్కూల్ హెడ్ మాస్ట ర్ .చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన ‘’తల
వంచని వీరుడు ‘’ అని పించుకొన్నాడు రగ్బీ స్కూల్అనే బ్రిటిష్ పబ్లి క్ స్కూల్ ఈ సంస్థ
ఇంగ్లా ండ్ లోని విద్య పై ఎంతో గొప్ప ప్రభావం కలిగించి చారిత్రా త్మకం గా నిలిచింది .మనదేశం
లో ఎవరైనా గొప్ప హెడ్ మాస్ట ర్ ఉంటె ‘’ఈయన రగ్బీ ఆర్నోల్డ్ ’’అనే వారు . దాన్ని ఆదర్శ
పాఠ శాల గా తీర్చి దిద్దిన ఘన చరిత్ర ఆర్నోల్డ్ ది .ఆర్నోల్డ్ గారి అబ్బాయి మాధ్యూ ఆర్నోల్డ్
గొప్ప కవి విమర్శకుడు .
ఆల్డ స్ హక్స్లీ 1894 జూలై 26 న జన్మించాడు .16 ఏళ్ళ వయసులో ‘’keratitis
punctara ‘’అనే కంటి జబ్బు వచ్చి కళ్ళు కనిపించకుండా పో యాయి .’’బ్రెయిలీ లిపి ‘’ని
అలవాటు చేసుకొని ఎక్సేలేన్సి సాధించాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఇంగ్లా ండ్ లోని
ఆక్స్ ఫర్డ్ లో ఉండేవాడు .డి.హెచ్.లారెన్స్ ,టి.ఎస్.ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ వంటి
రచయితలతో పరిచయమేర్పడింది .వేగం పైన వ్యాసం రాస్తూ ‘’ది ఓన్లీ న్యూ సెన్సేషన్ దిస్
రేచెద్ సెంచరి హస్ ప్రో ద్యూసేడ్ ‘’అంటాడు .1931 లో ‘’the world of light ‘’నాటిక రాశాడు
.1938 లో గ్రేటా గార్బ్ ,జిడ్డు కృష్ణ మూర్తి మొదలైన తత్వ వేత్తలు పరిచయమయ్యారు .1942
లో ‘’art of seeing ‘’రాశాడు
అనితా లూస్ అనే సినీ ప్రొ డ్యూసర్ తన సినిమాలకు స్క్రిప్ట్ రాయమని కోరితే
తిరస్కరించాడు .కారణం ఏమిటి అని ఆమె అడిగితే ‘’because it pays 25,000 dolars a
week –I simply can not accept all that money to work in a pleasant studio ,while
my family and friends are starving and being bombed in England ‘’అని ఖచ్చితం గా
చెప్పిన వాడు హక్స్లీ .చివరికి భార్య ఒప్పిస్తే అప్పుడు సినిమాకు స్క్రిప్ట్ రాశాడు .భార్యకు
కేన్సర్ వచ్చింది ఆ విషయం భర్త కు చెప్ప వద్ద ని ఆయనకు తెలిస్తే రాస్తు న్న స్క్రిప్ట్ పని
మధ్యలో ఆపెస్తా డని డాక్టర్లను వేడుకొంది .ఆయన రాసిన సినిమాలు -Alice in wonderland
,pride and prejudice ,brave new world ,jane Eyre ,prelude to fame .
1958 లో ‘’brave new world ‘’నవల రాశాడు .1959 లో ‘’the human situation
‘’అనే అంశం మీద చాలా చోట్ల ఉపన్యాసాలిచ్చాడు .విధి వక్రించింది 1961 లో ఇల్లు అంతా
తగల బడి పుస్త కాలు ,స్క్రిప్టు అన్నీ ధ్వంసమై పో యాయి .దీని పై స్పందిస్తూ తాత్వికం గా ‘’I
am evidently intended to learn ,a little advance of the final denundation that you
cannot take it with you ‘’అన్నాడునవ్వుతూ .1963 నవంబర్ 23 న కేన్సర్ వ్యాధి తో
ప్రెసిడెంట్ కేన్నేడి అమెరికా లో హత్య జరిగిన సాయంత్రమే ఆల్డ స్ హక్స్లీ మరణించాడు
ఆయన దృష్టిలో బాహ్య ఇంద్రియాలకు అన్నీ తెలియవని అవి తెలుసుకో లేవని
,ఆధ్యాత్మిక జీవితం అవసరమని ,ఈ విశ్వం అనంతమని దాని రహస్య శోధనకు అంతరంగమే
సాక్షీ భూతమని నమ్మాడు .గుడ్డి తనం తో జీవితాంతం బాధ పడుతూ ఎంతో సాహితీ సేవ
చేశాడు .తన మరణం ఆసన్న మవుతోందనే విషయం ఆయనకు ముందే తెలుసు .దీనికి
కంగారు పడలేదు .తన పని తాను చేసుకొని పో తూనే ఉన్నాడు .ఆయన్ను ‘’distinguished
artist ,the bold thinker and un obtrusive hero (అనుకోని నాయకుడు )‘’అంటారు .
హక్స్లీ సూక్తు లు కొన్న సార్వ కాలీనాలు –విజ్ఞా నం మంచిది .అమాయకత్వం చెద్డది
.శాస్త్రీయ అభివృద్ధి మానవ జీవితాలను సుఖమయం చేస్తు ంది .దేవుడిని సైన్సు దృష్టితో
యంతాలతో ,మేధస్సు తో చూడ లేవు హృదయం ద్వారా నే తెలియ బడతాడు .భగవంతుడు
నీకు సుఖాన్ని కలిగిస్తా డని అనుకోకు .నీ చాయిస్ నువ్వు తీసుకో .సైన్సు పెరిగి నంత మాత్రం
వల్ల వ్యక్తీ లోనిమంచి గుణాలు పెరుగుతాయనేమీ లేదు .మన నాగరకత యాన్త్రికతను
,మందులను సుఖాల్ని ఎంచు కొంది అందుకే నా పుస్త కాల నన్నిటిని గదిలో పెట్టి తాళం
వేశాను సైన్సుఆధిక్యత వల్ల వ్యక్తీ గా మానవుని పై చెడు ప్రభావమే చూపుతోంది .డ్రగ్స్ కు
విపరీతమైన మందుల వాడకానికి చెక్ పెట్టా లని ఆనాడే నెత్తీ నోరు మొత్తు కొన్నాడు .
ఆల్డ స్ హక్స్లీ గొప్ప ఆలోచనా పరుడు ,తత్వ వేత్త ,శాస్త జ్ఞు
్ర డు భగవదన్వేషకుడు
‘’కంజబూరో ఓయీ ‘’అనే జపాన్ రచయిత రాసిన ననవల ‘’quiet life ‘.1994
లో నోబెల్ ప్రైజ్ పొ ందిన రచయిత .టోక్యో నగర నివాసి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని కూడా అధ్యయనం
చేశాడు .నవలలు కధలు ,విమర్శలు రాశాడు ఈయన రాసిన ‘’I ‘’అనే కధకు మొదటి
సారిగా బహుమతి వచ్చింది .personal matter ,the secret story, nip and bads ‘’మొదలైన
రచనలు చేశాడు .భార్యా ముగ్గు రు పిల్లలతో టోక్యో లో కాపురం .అమెరికా కు విజిటింగ్
ప్రొ ఫెసర్ గా వెళ్లి వస్తూ ంటాడు
ఓయీ ను చాలా ఉన్నత భావాలున్న ఉత్త మ రచయిత గా పేర్కొంటారు .తన జీవితం
లోని అతి ముఖ్య సంఘటనలను కల్పనా సామర్ధ్యం తో అద్భుతం గా ఆవిష్కరిస్తా డు .అతని
రచనలు మిగిలిన వారిపై గోప్పప్రభావాన్ని కల్గించాయి .ఈ నవల అంతా ఆయన కుటుంబ
గాధయే .కాని అత్యద్భుత నారేషన్ గా దీన్ని అందరు గుర్తించారు .ఆయన కూతురు
‘’మాచాన్ ‘’ఇరవై ఏళ్ళ అమ్మాయి .తండ్రి గొప్ప నవలా కారుడు కాని అన్న’’ మెంటల్లి
హాండి కేపేడ్ ‘’.అయినా అతనికి సంగీతం లో మంచి ప్రవేశం ఉంది .తల్లి మాత్రం భర్త ,కొడుకు
ల జీవితాల చుట్టూ అల్లు కు పో యి ఉంటుంది .తమ్ముడు ,ఈమె ఆ బంధాన్ని అర్ధం చేసుకో
గలరు .తండ్రి కాలి ఫో ర్నియా కు విజిటింగ్ ప్రొ ఫెసర్ గా వెళ్లి ఆరు నెలలు ఉండాల్సి వస్తు ంది
.తండ్రి మనస్త త్వం తెలిసిన తల్లి అతని తో వెళ్తు ంది .ఇక ఈమె ఇంటిని చక్క్క దిద్దా లి .జపాన్
భాషలో తండ్రిని కేచాన్ అని తల్లిని ఓ చాన్ అని అంటారు .
ఈ నవల చదివితే మన గోపీచంద్ ,బుచ్చి బాబు నవలలు గుర్తు కొస్తా యి .మానవ
మనస్త త్వానికి అద్ద ం పట్టి అర్ధం చెప్పిన మనో జిజ్ఞా న శాస్త ప
్ర ు విశ్లేషణాత్మక నవల క్వయట్
లైఫ్ అని పిస్తు ంది .రచయిత ‘’ కంజ బూరోఓయీ ని ‘’ఎంత గొప్ప నవలా కారుడ వోయీ
‘’అన బుద్ధి వేస్తు ంది .
1888 లో James o neil ,Ella లకు నీల్ జన్మించాడు .అతనికి అన్నా ,తమ్ముడు
మాత్రమె ఉన్నారు .తండ్రి ‘’కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్తో ‘’నాటకం లో కౌంట్ వేషం వేసే వాడు
.6,000 ప్రదర్శనలిచ్చిన నటుడు తండ్రి .ఎప్పుడూ ప్రయాణం హో టల్ బసా ,తల్లి అనారోగ్యం
మార్ఫిన్ కు డ్రగ్స్ కు ఆమె అలవాటు పడటం తో కుటుంబ జీవితం అస్త వ్యస్త ం అయింది .నీల్
చదువు సాగ లేదు ..బంగారం సంపాదించాలని బ్యూనస్ అయిర్స్ లోని హిందూరాస్ కు
వెళ్ళాడు .అయితే అక్కడ తాగుడుకు ,ఆడపిల్లలకు అలవాటు పది ఆరోగ్యం చేద
గోట్టు కొన్నాడు .అన్న కూడా మత్తు మందుకు బానిసాఆఐ చని పో యాడు తమ్ముడు అంతకు
ముందే గతించాడు తల్లికి మతి స్తిమితం తప్పింది .తనదీ మరణించాడు .భార్య సహకారమూ
అతనికి లభించలేదు .పుట్టిన కొడుకూ దూరం గా ఉంటున్నాడు విశ్రా ంతి సమయం లో ఎన్నో
పుస్త కాలు చదివాడు నాటకాలు రాశాడు .ఆగ్నెస్ అనే ఆవిడను పెళ్ళాడి కూతురు ఊనా ను
కన్నాడు .కూతురు ‘’ఊనా ‘’ను18 ఏళ్ళ వయసులో ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్
54 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొన్నాడు వీరికి పిల్లలూ కలిగారు .నీల్ రాసిన anna
cristie ,marco millions ,strange interlude మొదలైన నాటకాలకు నాలుగు పులిట్జ ర్
బహుమతులు వచ్చాయి .చివరికి carletto montery తో కలిసి జీవించాడు .ఆమెను అందరు
‘’స్వాన్ ‘’అనే వాళ్ళు .భర్త ను శ్రద్ధగానే చూసుకోందిచివరికి బాధలూ పెట్టింది . .డబ్బూ బానే
చేసుకోంది .1936 లో ఓ నీల్ కు నోబెల్ పురస్కారం లభించింది నాటకానికి రావటం నీల్ తోనే
ప్రా రంభం .40 ,000 డాలర్ల పారితోషికం లభించింది .
Long days journey into night ‘’అనే నాటకం ఎమోషనల్ స్ట గ
్ర ుల్ కు
సంబంధించింది .దీన్ని కన్నీళ్ళతో రక్త ం తో రాశానని చెప్పాడు నీల్ .దీనిని తాను చని పాయిన
25 ఏళ్ళ తరువాతే రిలీజ్ చేయమని కోరుకొన్నాడు .కాని భార్య దాన్ని మూడేళ్లకే ముద్రించింది
.దీనికి న్కే నాల్గ వ పులిట్జ ర్ వచ్చింది .నీల్ 1953 లోన్యుమోనియా వచ్చి చని పో యాడు
మొదట్లో తండ్రితో కలిసి నాటకాలాడాడు తర్వాత ఆడటం పై మోజు పో యింది .oh 1 god if
only some good .fairly would give me some money so I would never have gone
near a theater ‘’అని అనుకొన్నాడు
ఓ నీల్ ను అమెరికా దేశపు స్వరం అన్నారు .యువ అమెరికా దేశ అంటే ఇరవయ్యవ
శతాబ్ద అమెరికా గొంతు కింద భావించారు .ఆయన్ను ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడిగా
,మానవతా వాడిగా ,సృజన శీలిగా ఒంటరి వాడిగా తలిచారు ..నీల్ 60 నాటకాలు రాశాడు .ప్లే
రైటర్ కు నోబెల్ రావటం మహా వింత .విశ్వ ఆవనకు ప్రతినిధి గా నిలిచాడు .విధికి తల
వంచాల్సిందే నన్నది ఆయన సిద్ధా ంతం .ఆయన నాటకాలలో మరో ప్రత్యేకత ‘’బిలాంగింగ్’’
.అంటే చేరువవటం చెందటం .అలాగే జాతి సంబంధ వి లువలు . తన నాటకాలలో ‘’మాస్క్
‘’లను ప్రవేశ పెట్టా డు .దాని వాళ్ళ పాత్ర అంతరిక మనో ధర్మాలను ఆవిష్కరించా టానికి గొప్ప
అవకాశాలు కలిగాయి .ముసుగు లో మనిషి మనో ధర్మం ప్రత్యక్ష మవటం ప్రత్యేకత తనను
తాను ఆవిష్కరించుకొనే గొప్ప సదుపాయం అది
ఆయన నాటకాలు the fountain ,marco millions లలో నాటక విధానం లో
ఇమాజినేషన్ టెక్నిక్ తో ,రంగాలను ,రంగావిభాజనాను విషయా దారం గా విభజించాడు
.డబల్ ఆక్షన్ వాళ్ళ పైకి కానీ పించే భావాలకు లోని భావాలకు ఉన్న వ్యత్యాసం అంతా
ప్రస్ఫుట మవుతుంది .జీవించటానికి తిండి సంపాదనే అతని నాటకాలలో ముఖ్య విషయం
.చివరికి దాశ్యం లో ప్రేమ ప్రేమలో దాశ్యం లోకి నడిచింది .నీల్ భావనలో ఆడది అంటే కన్య
,తల్లి ,వేశ్య .వీరిలో ఎవరైనా సరే మగాడికింద పని చేయాలి .మన ‘’శయనేషు రంభా ‘’ లోని
అన్ని దశలూ అన్న మాట ..విపరీతమైన సీరియస్ నేస తో బాటు మాస్ ఎఫెక్ట్ లుండటం
వ్యంగ్యం పరిహాసం నిండి ఉండటం నీల్ నాటకాల ప్రత్యేకత .మనిషికి ఉన్న తీవ్రమైన కోరికలు
అవి తీరటానికి అడ్డ ంకు లయ్యే పరిస్తితులు చివరికి విధి చేతిలో ఓడిపో వటం కానీ పిస్తు ంది
దీనితో అసలైన జీవితాన్ని జీవించటానికి ప్రతి బంధకాలేక్కువ కానీ పిస్తా యి అని ప్రముఖ
అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ తెలిపాడు
నీల్ రాసిన నాటకం the hairy ape ‘’లో సంబంధాలకు ప్రా ధాన్యత ఉంది .(బిలాంగింగ్
)నీల్ దృష్టిలో మనిషి దెబ్బతిన్న వాడుగా పుట్టా డని .దేవుని దయను జిగురుగా చేసుకొని
దెబ్బతిన్న వాటిని అతికించుకొని జీవించాలి అని .అమెరికా లోని నల్ల జాతి వారి అణచి
వెతను అర్ధం చేసుకొన్నా వాడు నీల్ .అతని నాటకాలలో ఆడవాళ్ళు అనచ బడటం
కన్పిస్తు ంది కాని వారు ఎదిరించలేరు .ఆడది మగాడికి కట్టు బానిసె అన్న దృక్పధం కానీ
పిస్తు ంది .సెక్స్ ఒక అవసరం కంటే లోని భావ తీవ్రత గా భావించాడు .నారా అనే స్త్రీ పాత్రలో
తల్లి వేశ్య ఒకే పాత్రలో ఇమిడి పో తారు . చివరి నాటకాలలో స్వీయ మోసానికే పాత్రలన్నీ గురి
అవుతాయి
Behind the horizon అనే నాటకాన్ని 1920 రాసి తండ్రికి చూపిస్తే ‘’e you trying to
send your audience home to commit suicide ?’’అని వ్యాఖ్యానిచాదట .ఆయన
రచనలలో పెసిమిజం (అంతా దుర్మార్గ మే ),విషాద భావాలు ఎక్కువ .అయితే యేవో
రాజులవో ,సైనికాదికారులవో నాటకాలు కాక జన జీవితం లోని మనుష్యుఅల గురించి
నాటకాలు రాశాడు అందుకే he made America to compete with Europe ‘’అని కీర్తించారు
.అతనిలా ఆధునిక టెక్నిక్కులు సృజన లను ఉపయోగించిన వారు అప్పటికి లేనే లేరు
.నాటక శాల హాన్గు లకు రంగులకు కొత్త సో గాసులడ్డా డు .దృశ్య శ్రవనాలను అద్భుతం గా
వినియోగించాడు .ఆయన ఇటు అమెరికా అటు యూరప్ సంప్రదాయాలు రెంటికి చెందినా
వాడి నని రుజువు చేసుకొన్నాడు .అతని దృష్టిలో dramais the noblest endevour అంటే
కావ్యేషు నాటకం రమ్యం ఉ సమర్దిన్చాదన్న మాట .షేక్స్పియర్ నుండి గ్రేకుల నుండి త్రా జేది
ని తీసుకొన్నాడు .’’our emotions are a better guide than our thoughts ‘’అని నీల్
నిశ్చితాభిప్రా యం .ప్రేమ ,చావు ,నిరాశ భ్రా ంతి ,విధి లను అద్భుతం గా డ్రా మా లను చేశాడు
మనిషికి దేవునితో మంచి సంబందాలున్దా లని కోరుకొన్నాడు .
కర్క్ డగ్లా స్ ప్రెసిడెంట్ రీగన్ కు సమకాలికుడైన హాలీ వుడ్ హీరో ..83 సినిమాలలో
నటించాడు ఆస్కార్ పురస్కార గ్రహీత .కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేశాడు
.’’ .presidential award of freedom ‘’పొ ందాడు .ఆ అవార్డే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే
అత్యన్నత పురస్కారం .ఆస్కార్ నుండి జీవన సాఫల్య (life achievement )పురస్కారసమూ
పొ ందిన వాడు .ఎన్నో సంస్థ లు డగ్లా స్ కు పురస్కారాల నిచ్చి గౌరవించాయి . .అతను
నటించిన వాటిలో champion ,bad and the beautiful ,lust of life,20,000 leagues under
the sea సినిమాలు గొప్ప పేరు తెచ్చాయి .’’bryon ‘’అనే ఫిలిం సంస్త నేర్పాటు చేసి
‘’spartacus ‘’లాంటి క్లా సిక్ సినిమాలు తీశాడు ..డైరెక్ట్ చేశాడు .మూడు నవలలు ,పిల్లల
కోసం పుస్త కాలు కూడా రాసిన రచయిత .కింది ఫో టోలలో చివరిది ఆయన కొడుకు మైకేల్
డగ్లా స్ ది .
ఒకసారి షూటింగ్ లో ఉండగా హెలికాప్ట ర్ ప్రమాదం లో వెన్నెముక విరిగింది .శస్త ్ర
చికిత్స జరిగింది .ఛాతీలో ‘pace maker ‘’ఏర్పాటు చేశారు .80 ఏళ్ళ వయసులో
ఆకస్మికంగా ‘’బ్రెయిన్ షాక్ ‘’వచ్చింది .మాట పడిపో యింది నడక సాగలేదు .వీల్ చైర్ లో
కూర్చుని కంప్యూటర్ సాయంతో డిక్టేషన్ చెప్పి తన కద రాసుకొన్నాడు .అందుకే ఆ కధకు
‘’my stroke of luck ‘’అని అర్ధవంత మైన పేరు పెట్టా డు .అతని కొడుకుల్లో చివరి వాడు
మైకేల్ కూడా హాలీఉడ్ నటుడై రెండు సార్లు ఆస్కార్ అవార్డు లను గెలిచి తండ్రికి తగ్గ
వారసుడని పించాడు
డగ్లా స్ భార్య అన్నే .ఇద్ద రు అమితమైన అన్యోన్యం గా ఉండేవారు ఆమెకు బ్రెస్ట్
కేన్సర్ వచ్చి దాన్ని తీయాల్సి వచ్చింది నతనికి ఆరుగురు అక్క చెల్లెళ్ళు .చాలా మంచి
కుటుంబ సంబంధాలుండేవి .ఒకసారి అతనికలలో దేవత కన్పించి స్వర్గా నికి తీసుకు వెళ్ళింది
.’’ఇదేనా స్వర్గ ం /?అని ఇతను అడిగితే దేవత ‘’కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అదే
స్వర్గ ం ‘’అన్న దట .దానికి కారణం అక్కడ భూమి మీద సూర్యోదయ సూర్యాస్త మయాలు
,నక్షత్ర కాంతులు మనోహరం ..చెట్లూ పూలు ఫలాలు కంటే స్వర్గ ం ఏముంది ?’’అక్కడ గోల్ఫ్
లాంటి ఆటలాడ వచ్చు ఇక్కడ అవేమీ ఉండవు ‘’అని చెప్పిందట .అంతటి స్వర్గ మైన భూమి
ని వదిలి స్వర్గ ం కోసం మీ మనుషులకు దేవులాట ఎందుకు ?’’అని.మదలిన్చిందట .’’dist
thou art and to dust thou shall return ‘’అంటాడు డగ్ల స్ .
డగ్ల స్ తన లాగీ ఏదో ఒక అంగ వైకల్యం పొ ందిన గొప్ప వాళ్ళనీ ,తన సహచరులను
జ్ఞా పకం చేసుకొంటాడు .రూజ్ వెళ్త వీల్ చైర్ లో కూర్చుని మూడు సార్లు అమెరికా ప్రెసిడెంట్
అయ్యాడని గుర్తు చేస్తా డు .రీగన్ కు తన వాళ్ళను కూడా గుర్తు పట్ట లేని జబ్బు .స్టీఫెన్
హాకింగ్ గొప్ప ఫిజిసిస్ట్ . .అంగ వైకల్యం తోనే అయన్ స్టీన్ అంతటి గొప్ప మేధావి అయ్యాడు
.వీళ్ళంతా ఇతరుల కోసం చేసిన సేవలు నేమరేసుకొన్నాడు .స్పీచ్ తెరపి వల్ల నెమ్మదిగా
మాట్లా డటం వచ్చింది డగ్లా స్ కు ..నడక వచ్చింది .మళ్ళీ సినిమా తీశాడు సినిమాలలో
నటించాడు .అందరి అభిమానం సంపాదించాడు . jean Dominique Bauby అనే ఫ్రెంచ్
అతనికి ఆక్సిడెంట్ జరిగి ,స్ట్రో క్ వచ్చి పూర్తిగా పక్షవాతం వచ్చింది .మాట అనేదే లేదు .ఒక్క
ఎడమ కన్ను మాత్రమెకొద్దిగా రెప్ప వేయ గలుగు తోంది జీవించాలనే తపన పెరిగింది .శ్రమ
పడ్డా డు .ఇంగ్లీష్ లో తరచు గా వచ్చే ‘’e ‘’తో మొదలు పెట్టి w తో అంతమయ్యే పదాలను
తీసుకొని ఒక ‘’కోడ్ ‘’తయారు చేసుకొన్నాడు .చివరికి దానితోనే the diving bell and the
butter fly ‘’అనే పుస్త కం రాసి తన మనో భావాలను అందులో పొ ందు పరచాడు .చాలా
మందికి ఉపయోగ పాడాలన్న ఆదుర్దా .,దీక్షా ,సాధన అతనికి తోడ్పడ్డా యి .. తన శరీరం
డైవింగ్ బెల్ లో ఇరుక్కు పో యినా తన ఆలోచనలు సీతా కోక చిలుకల్లా నిరంతరం
భ్రమిస్తా యి దీనినే ‘’locked in syndrome ‘’అన్నాడు .
Doody Moore గొప్ప పియానో వాయిద్య కారుడు .చివర్లో వణుకు వ్యాధి
వచ్చింది .మాట తగ్గింది .progressive super nuclear pally అనే వ్యాధి వచ్చింది అయినా
విధిని జయించాడు అనేక ఇంటర్వ్యు లు ఇచ్చాడు .Barbana santra అనే ఫిలిం పెర్సానాలిటి
అతన్ని ఇంటర్వ్యు చేసి ‘’ఏమి కోల్పోయారు ?’’అని అడిగితే ‘’playing the piano
‘’అన్నాడట .అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అల్గో రే భార్య టిప్పర్ గోరె డిప్రెషన్ కు లోనైనదట
.ఆ విషయం చర్చల్లో బహిర్గతం చేసి మిగిలిన వారికి ఎంతో ఊరట నిచ్చిన్ద ట .’’sex is like air
.it is not important unless you are not getting any ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు
డగ్లా స్ .అతని ముఖ్య నీతి సూత్రా లలో అతి ముఖ్యమైనది ‘’never try to change your
spouse ‘’
హెలెన్ కెల్లర్ కు చెవుడు మూగా .ఆమె we do the best we can ,.we never
know what miracle is wrought in our life or the life of another ‘’అన్న మాటలు
అందరికి ఆదర్శం కావాలన్నాడు .
196 పేజీలున్న ఈపుస్త కాన్ని ఒక్క పూట లో చదివేశాను .చాలా బాగా రాశాడు
స్ప్పూర్తి వంతం గా ఉంది అధైర్య పడే వారికి కొండంత ధైర్యాన్నిస్తు ంది.ఎంతో మంది డగ్లా స్ కు
ఉత్త రాలు రాసి తమ సాను భూతిని పంచుకొన్నారు ఆస్కార్ ఫంక్షన్ లో డగ్లా స్
మాట్లా డినప్పుడు చూసిన జోర్డా న్ రాజు తన దేశానికి ఆహ్వానించాడు .కొద్ది కాలానికే రాజు
మరణించాడు .కొడుకు తండ్రి మాటను నిల బెట్టి డగ్లా స్ ను ఆహ్వానించి సత్కరించి గౌరవవించి
పంపాడు .డగ్లా స్ అమెరికా దేశానికి ‘’సుహృద్భావ రాయబారి ‘’(goodwill ambassador )గా
పని చేశాడు .ఇందులో ‘’we see the real person behind the fabulous talent and at life
lived to its very fullest ‘’అని పించటం ఖాయం
కర్క్ డగ్లా స్ న్యు యార్క్ లోని ఆమ్ స్టా ర్ డాం లో 1906 డిసెంబర్ 9 న
జన్మించాడు .రష్యాకు చెందినా జ్యూయిష్ ఇమ్మిగ్రెంట్ కుటంబం ఆయనది అసలు రష్యా పేరు
Issur Danielovitch .
. మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు హూస్ట న్ లైబర
్ర ి నుండి తెచ్చి చదివిన ఈ
పుస్త కం లోని విశేషాలను 31 -7-2002 న నా డైరీలో రాసుకొన్న వాటిని మీకోసం అందించాను
.
లాటిట్యూడ్ జీరో
అని పేరున్న ఈ పుస్త కాన్ని gianni Guada lupi and Antony shugaar అనే ఇద్ద రు
రాశారు .ఇందులో వారు చూసిన ,సేకరించిన అనేక వింతలు మనకు అమితాశ్చర్యాన్ని
కలిగిస్తా యి .అందులో కొన్ని రుచికి చూపిస్తు న్నాను .
1-- ఈజిప్ట్ కు దగ్గ రలో ఒక దీవిలో ఉన్న మనుషులకు నాలుక రెండుగా చీలి
ఉంటుందట .ఆ రెండిటి తో ఒకే సారి ఇద్ద రి తో వారు మాట్లా డగలరట .
3 pi-pa-.lo అనే చోట కొంగలు ఒంటె అంత ఉంటాయట .రెండు గజాల పొ డవున్తా యట .చాలా
తక్కువ ఎత్తు లో మాత్రమె ఇవి ఎగర గలవు .
4—champa అనే చోట ఆడ ,మగా అసలు బట్ట లే వేసుకోరు .దీనికి ఒక కారణం ఉందట
.బుద్ధు డు ఈ ప్రా ంతానికి వచ్చినప్పుడు వీళ్ళ పూర్వీకులు ఆయన బట్ట లు లాగేశారట
.అందుకని బుద్ధు డు శపపించాడట.అప్పటి నుంచి బట్ట లు వేసుకోవట్లేదట .
7 –అమెజాన్ ప్రా ంతం లో ఒక దీవి లో ఆడ వాళ్ళదే రాజ్యం .మగ పొ ందు కావాలంటే పక్క
దేశాల మీద డాడి చేసి మగాళ్ళను తెచ్చుకొంటారు .గర్భం ధరించగానే వాళ్ళని చంపేస్తా రు
.మగ పిల్ల్లాడు పుడితే సఫా చేస్తా రు ఆడపిల్ల పుడితే పెంచుకొంటారట .
8-పేరు దేశం లో బంగారు దీవి ఉందని అంతా బంగారు మయమే నని అనుకొనే వారట .
9-గ్రీకు భాషలో అమెజాన్ అంటే వక్షోజాలు లేని స్త్రీ అని అర్ధం ట .rio de las amajaans అంటే
అమెజాన్ నది అని అర్ధం .
10-రాలీ అనే ఇంగ్లా ండ్ యాత్రికుడు నార్త్ అమెరికా లోని వర్జీనియా ను మొదటి సారి
చూశాడు .అప్పుడు ఇంగ్లా ండ్ ను ఎలిజ బెత్ రాణి పరిపాలిస్తో ంది ఆమె అప్పటికి కన్య అంటే
వర్జిన్. అందుకని దీనికి వర్జీనియా అనే పేరొచ్చిందట .
12 –గాలా పెగాస్ అనే దీవిలో చార్లెస్ డార్విన్ కు ఎక్కడా లేనన్ని వింత జంతువులు కని
పించాయట .
13 ధర్మ సంరక్షణార్ధం నేను పుడుతూ ఉంటాను అని కృష్ణు డు గీతలో చెప్పిన దానికి ఇంగ్లీష్
లో ఒక సూక్తి సరి సమానం గా ఉంది ‘’times of calamity tend to create prophets ‘’.
14 –నైల్ నదికి గొప్ప అర్ధం ఉంది. నైల్ అంటే ఈజిప్ట్ భాష లో ‘’చంద్రు ని లాగా వెలుగులీను
తుంది ‘’అని అర్ధం .
15-లేక్ విక్టో రియా దగ్గ ర karague అనే ప్రా ంతం లో rumanooka అనే రాజు ఉండేవాడు
(రమణకుడు ?)అక్కడ రాజు భార్య ఎంత లావుగా ఉంటె అంత గొప్ప ట .ఆమె ఎప్పుడూ
పాలు తాగుతూ ఒళ్ళు పెంచు కోనేదిట .ఆవిడ కుర్చీలోంచి లేవాలి అంటే అటు ముగ్గు రు
,ఇటు ముగ్గు రు ఆడ సేవికలు పట్టు కొని లేపాలట
16 –అంజో లా ప్రా ంతం లో ఆడ వాళ్ళను పైకి లేపాలి అంటే కనీసం 8 మంది మగాళ్ళు
కావాలట .అంత భారీ కాయులన్నమాట .
17-ఫసిఫక్
ి సముద్రా నికి ఆ పేరు పెట్టిన వాడు మాజిలాన్ అనే యాత్రికుడు అని
మనమందరం మరిచి పో యి ఉంటాము .
18-bruner అనే చోట రాజు గారి దర్బారు లో రాజుగారితో యూరోపియన్లు ఎవరు డైరెక్ట్ గా
మాట్లా డకూడదట.ఐరోపా వాడు అక్కడ ఆస్థా నం లో ఉన్న సేవకుడికి చెబితే ,వాడు పై వాడికి
చెబితే ,వాడు ఆ సిటి గవర్నర్ తమ్ముడికి చెబితే ,వాడు మంత్రి చెవిలో ఊదితే ,వాడు
నెమ్మదిగా రాజు గారికి విషయం తెలియ జేస్తా డట .రాజు చెప్పేదికూడా ఇలాగే రివర్స్ డైరెక్షన్
లో యూరోపియన్ కు చేరుతుందిట .
19 –వేసూవియాస్ లో అగ్ని పర్వతం ప్రేలి నప్పుడు ఎన్నో దీవులు మునిగి పో యాయి .ఎన్నో
వేల మంది చని పో యారు .పాంపీ అనే మహా నగరం ఆ బూడిద కింద కొన్ని మీటర్ల లోతున
సమాధి అయింది .
ఈ పుస్త కాన్ని ఫిలిప్ సిమ్మన్స్ అనే న్యు హాంప్ షైర్ర్ రచయిత రాశాడు
.ఆయన ఇలినాయిస్ లో ఇంగ్లీష్ ప్రొ ఫెసర్ గా పని చేశాడు .తొమ్మిదేళ్ళు పని చేసిన తర్వాత
ఒక వింత వ్యాధి ‘’AL.S’’(lougehrig ‘s disease ) వచ్చింది .కదలలేడు మాటలు సరిగ్గా
పలక లేడు స్వంత ఊరు వచ్చేశాడు .ఆ రాష్ట ం్ర న్యు హాప్ షైర్ర్ ను గ్రా నైట్ స్టేట్ అంటారు
.కాలిఫో ర్నియాను బె స్టేట్ అని టెక్సాస్ ను లోన్ స్టా ర్ర్ స్టేట్ అనీ అంటారు అంటే కొండలు లేని
రాష్ట ం్ర .నెమ్మదిగా తన వైకల్యాన్ని జయించాడు .కాలేజీ స్కూలు చర్చి లలో ఉపన్యాసాలిచ్చి
ఆకర్షించాడు .’’united universal association ‘’స్తా పించి ఎడిటర్ అయాడు .ఆయన
సృజనాత్మకరచనలకు మిచిగాన్ యూని వర్సిటి పి.హెచ్ డి.నిచ్చి గౌరవించింది .’’post
modern American fiction ‘’ మీద ‘’deep surface ‘’అనే పుస్త కం రాస్తే దాన్ని జార్జియా
యూని వెర్సిటి ప్రచురించి ప్రా చుర్యం కల్పించింది .అతని భార్య కేథరీన్ కళా కారిణి .కొడుకు
ఆరన్ కూతురు అమీలా .
చాలా దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది ఆ వ్యాధి మూలం గా .దానితో ‘’the
art of dying ‘’ను నేర్వటం ప్రా రంభించాడు .ఆ తర్వాత నెమ్మదిగా కూడా దీసుకొని పాజిటివ్
దృక్పధం పెరిగి ‘’the art of living ‘’నేర్చాడు .అతను రాసిన ఈ పుస్త కం లో శాంతి కోసం
అన్వేషణ కని పిస్తు ంది జీవిత సమస్యలను ఎదుర్కోవటానికి పొ ందిన ధైర్యం కని పిస్తు ంది .ప్రతి
చిన్న విషయం తనకు గొప్ప అనుభవాన్నిచ్చింది అంటాడు .తన రాష్ట ం్ర గ్రా మం ప్రజలు అంటే
విపరీతమైన మోజు ఆయనకు .సంవత్సరం లో ఉన్న 12 నెలలకు ప్రతీక గా ఈ పుస్త కం లో
12 చాప్ట ర్లు రాశాడు .’’the work of learning to live richly in the face of loss ‘’ను
మనం నేర్చుకొంటాం .దేనికీ చింతించక పో వటం ,ప్రతి దాని నుంచి మంచిన గ్రహించటం ఫిలిప్
కు తెలిసిన విద్య .హిందూ బౌద్ధ ,జైన ఇస్లా ం మతాలన నన్నిటిని చదివి ఆకళింపు
చేసుకొన్నాడు .జంగ్ క్రీస్తు ,దలైలామా లను ఒంట బట్టిన్చుకొన్నాడు .కస్టా ల కడలి లో కూడా
చాలా ప్రశాంత జీవితాన్ని గడిపాడు అదే అతని ప్రత్యేకత .ఇతని జీవితం చదువుతుంటే
ప్రఖ్యాత ఖగోళ శాస్త ్ర వేత్త స్టీఫెన్ హాక్ గుర్తొ స్తా డు .తన జీవితాన్ని అతా ఒక తెరచిన పుస్త కం
లా మన ముందు పరిచాడు .ఎన్నో ఉదాహరణలు ఎన్నో కొటేషన్లు ,ఎంతో అనుభవం అన్నీ
కలగలిపి రాసిన మార్గ దర్శిఈ పుస్త కం అని పిస్తు ంది
బౌద్ధ గురువు దలైలామా ప్రత్యేకత ఆయన చిరు నవ్వే నంటాడు ఫిలిప్ .’’he is
plainly in love with the world at peace with himself even though with the forced
occupation of his country with the Chinese ,his own life in exile ‘’అని దలైలామా ను
మెచ్చుకొంటాడు .
ఇంకో సత్యం చెప్పాడు ‘’comedy ends in happiness ,while tragedy yields wisdom .we
want to be I suppose to be happay ,wise ,and wisely happy ‘’అని గొప్ప గా చెప్పాడు
రచయిత .గ్రీకు రాజు అరిలియాస్ ప్రతిదీ ఒక పనే అని మరణం కూడా దీనికి భిన్నం కాదని
చెప్పాడని గుర్తు చేస్తా డు .అన్నిటిని ఆహ్వానించి నట్లే మనం మరణాన్నీ ఆహ్వానిన్చాల్సిందే
నన్న ఎరుక కల్గిస్తా డు .’’to accept death is to live with profound sense of
freedom .this freedom first from attachements to the things of this life ,that donot
really matter fame ,material possessions and even finally our own
bodies .Acceptance brings the freedom to live fully in the present .the freedom
finally to act according to our heighest nature ‘’అని మన వాళ్ళు చెప్పిన జీవన
వేదంతాన్నంతా ఒలికిస్తా డు ఫిలిప్ సిమ్మన్స్ .తను రాసిన పుస్త కం లోని సత్యం ‘’the
imperfect is our paradise ‘’అంటాడు
ఇందులో కొన్ని విశేషాలు కూడా తెలిపాడు స్నేక్ రేంజ్,మౌన్టేన్స్ పైన ఉన్న పైన్న్
చెట్ల వయస్సు 5000 సంవత్సరాలుట .’’ a town is is saved not more by the
righteousmen in it ,than by the woods and swamps that surround it ‘’అన్న ఎమెర్సన్
సూక్తిని సందర్భోచితం గా చెప్పాడు లాటిన్ భాష లో animal అంటే soul అని అర్ధం .
( anima ).to acknowledge one’s own soul then there is to knowledge the animal
withn us ‘’అంటే మనలో జంతు లక్షణాన్ని వదిలిన్చుకొంటే అదే జ్ఞా నం .ఎందుకు ఈ శిధిల
హృదయం కుక్క తోక లాగా ఊగుతూ వెంట వస్తు ంది అని విసుక్కున్నడట మహా కవి
ఈట్స్..నిర్ణయాన్ని చెప్పకుండా ఆత్మ పరిశీలన చేయటమే అత్యున్నత ఆధ్యాత్మికత అని
హిందూ వేదాంతులు చెప్పిన దాన్ని ఉటంకిస్తా డు దేవుని అదృశ్యమే ఆయన రాకకు సూచన
అన్నాడట meister eckheart .
మనం పెట్టె ‘’నమస్తే’’ కి మంచి భావాన్ని తెలియ జేశాడు ‘’నీ లోను నాలోనూ
ఉన్న జీవ ఆత్మకు వందనం అని తెలిపాడు. ఎమెర్సన్ ‘’a fact is the end or last issue of
spirit ‘’ అన్న మాటను గుర్తు చేస్తా డు ఇక్కడే స్పిరిట్ అంటే అర్ధం శ్వాస (spiritus )అనే భలే
అర్ధం బో ధిస్తా డు .తాను దేవుడిని దేవుడి నుండి విముక్తి కోసం ప్రా ర్ధిస్తా ను అన్నాడట ఎఖార్ట్
(I pray god to rid me of god )ఏదీ చేయక పో తే దేన్నీ చేయాకుండావదిలి పెట్ట నట్లే
.ప్రపంచపాలన దానికది చేసుకొంటూ పో తుంది అని సుజుకి సామెత .చివరగా రాబర్ట్ ఫ్రా స్ట్
అనే కవి వాక్యం తో ముగిస్తా డు ‘’ they can not scare me ,with their empty spaces –
between stars on stars where no human race is –I have it to me so much nearer
home –to scare my self with my own desert places ‘’.
ఇలా చాలా పరి పక్వ భావ జాలం తో నిండిన జ్ఞా నోదయం కలిగించే పుస్త కం జీవిత
సారం రచయిత తాను అన్నీ తెలుసుకొని మణేచ్చను జయించి జీవితేచ్చను సాధించి
జీవితాన్ని పరిపక్వం చేసుకొన్నాడు ఏ బందానికి లోను కాకుండా ఈశ్వరార్పణ బుద్ధి తో
జీవితం కోన సాగిస్తు న్నాడు .ధన్య జీవి అని పించుకొన్నాడు సంతృప్తిని సాధించుకొన్నాడు ఒక
మహర్షిలా తత్వ వేత్తలా అపో జిల్ లా మనకు కర్త వ్య బో ధ చేశాడు .జీవితం లో ఉంటూ
ధన్యమైన జీవితాన్ని గడుపుతూ మనకూ ఆదర్శ ప్రా యమైనాడు
ఈ పుస్త కం ప్రచురింప అడ్డ ఆరు నెలలకే దీన్ని నేను చదివిన అదృష్ట వంతుడిని
.ఉన్నత ,ఉత్త మ మానవులు ఎక్కడ ఉన్నా ,వారి ఆలోచనలన్నీ పరమోత్త మం గా నే
ఉంటాయి అని రుజువు చేసిన పుస్త కం .ప్రతి పతనం ఉత్తా నానికి నాన్ది కావాలి అప్పడే మన
జీవితపు వెలుగు ఇతర జీవితాలనూ ప్రకాశ వంతం చేస్తు ంది తాను చెప్పిన విషయాలన్నిటిని
ఆచరణాత్మకం గా జీవితం సాగిస్తు న్న ఫిలిప్ సిమ్మాన్స్ ముమ్మాటికి మార్గ దర్శియే .1957
లో జన్మించి 55 ఏళ్ళు మాత్రమె జీవించి2012 లో మరణించాడు .
మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు టెక్సాస్ రాష్ట ం్ర లోని హూస్ట న్ నగర
లైబర
్ర ి నుండి తెచ్చుకొని చదివి , ‘’26 -7-2002 న నా డైరీ లోరాసుకొన్న విశేషాలను మీ
కోసం అందించాను
రిడం
ె ప్ష న్ సాంగ్(విముక్తి గీతం )
Bertice Berry అనే ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి రాసిన నవలే రిడెంప్ష న్ సాంగ్ .నల్ల
జాతి వారు ,వారి పిల్లలు పడే బాధలు ,తెల్ల వాళ్ళు వీళ్ళ కన్నేత్వాన్ని ఎలా పాడు చేసేదీ
,మొదలైన వాటి నన్నిటిని ఇందులో మనసు ద్రవిన్చేట్లు రాసింది .అయితే ఎవరి పైనా ద్వేషం
వద్ద ని ,ప్రేమ తోనే అంతా జయించాలని యేసు క్రీస్తు మాటలనే ఆమె చెప్పింది .
ఇందులో Fina అనే అమ్మాయి ,Ross అనే అబ్బాయి ఒక పుస్త కాల షాప్ ‘’బ్లా క్
ఇమేజెస్ ‘’కు వెళ్తా రు .ఆ షాపు యజమాని miss Cojy అనే నల్ల జాతి స్త్రీ .నల్ల జాతి వాళ్ళ
అరుదైన పుస్త కాలన్నీ ఈమె వద్ద ఉన్నాయి .అందులో తన తల్లి వాళ్ళు ఇచ్చిన children of
grace ‘’అనే ‘’మెమరి బుక్ ‘’ఆమె వద్ద ఉంది .ఆ పుస్త కం ఆమెను ఎంతో మార్చింది .జరుగ
బో యేదాన్ని వివరిస్తు ంది ఆ గ్రంధం .సమస్య లతో వచ్చిన వాళ్ల కు ఏ పుస్త కం కావాలో
సూచిస్తు ంది ఆమె. అది చదివి వాళ్ళు తమ మార్గా న్ని తెలుసుకొంటారు సమస్యకు
పరిష్కారం పొ ందుతారు .రాస్ ఒక anthro pologist ‘’(మానవ శాస్త ్ర వేత్త ) .ఆమె ఒక
విద్యార్ధిని .ఇద్ద రు చిల్ద్రెన్ ఆఫ్ గ్రేస్ చదవాలని అక్కడికి వస్తా రు .ఇద్ద రినీ సమాధాన పరచి
తానే ఆ పుస్త కం చదివి వినిపిస్తు ంది కోజీ .కోజీ తో బాటు ,వీళ్ళిద్ద రూ కూడా జీవితం లో
పెళ్ళిళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళే .అందరి పూర్వ జీవితాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఈ
ఇద్ద రినీ కలుపుతుంది .వాళ్ళ జీవితాలకొక సార్ధకత కల్పిస్తు ంది కోజి ఆఫ్రికన్ అమెరికన్లు ఎలా
సంభాషించుకొంటారో అచ్చం గా అలానే సంభాషణలు రాసింది రచయిత .
ఈ నవలలో రాస్ ఫీనా ల విడి విడి ప్రేమలు వాటి వైఫల్యాలు ,కోజీ ప్రేమ కద,
అయోనా జోల ప్రేమ కద నాలుగు పేటలతో అల్లిన నవల .ఎక్కడా విసుగు అని పించదు .ప్రతి
పాత్ర తన జీవితాన్ని తెరచిన పుస్త కం లా ఆవిష్కరించటం ఇందులో విశేషం .రచయిత్రి చిన్న
అమ్మాయే . .కాని చాలా అనుభవం ఉన్న ప్రౌ ఢ లా రాసింది .తన జాతి ఋణం తీర్చుకోంది’’
a sparkling heart felt debut and a compelling read ‘’అన్న కొన్నీ బ్రిస్కో మాట నిజం
.’’the story is about love ,the importance of understanding one’s history and the
power of books ,and how they can influence your life ‘’అని పుస్త కం కవర్ పేజి మీద
ఉన్న మాట సత్యమే .
ఈ నవలలో కోజీ పాత్ర చాలా విశిష్ట మైంది .అబ్బూరి రామ కృష్ణా రావు గారు ఆంద్ర
విశ్వ విద్యాలయం లో లైబ్రేరియన్ గా ఉన్నప్పుడు శ్రీ శ్రీ,బూదరాజు ,ఆరుద్రా వగైరా
రచయితలకు ఏ పుస్త కాలు చదవాలో ఏవి కొత్త గా విడుదల యాయో తెలియ జేసి చదివించే
వారని వారి మాటల వల్ల తెలుస్తు ంది అలాగే కోజీ కూడా చేయటం మెచ్చ దగిన విషయం
.ఇందులో సంభాణలే చాలా తమాషా గా ఉంటాయి .మనకు అంతా ‘’గ్రమాటికల్ మిస్టేక్స్ ‘’లా
అని పిస్తా యి కాని అదే వాళ్ళ వాడుక భాష అని తెలిస్తే ఆశ్చర్య పడం .ఉదాహరణకు ‘’he
say I his freedom .cause when he think of me he free in his head ‘’
అయోనా ను హాన్ బాయ్ అనే యజమాని కొడుకు మళ్ళీ మళ్ళీ ‘’రేప్’’ చేస్తా డు
.ఈమెను జో ప్రేమిస్తా డు .డబ్బు కట్టి ఈమెను బానిసత్వం నుండి విముక్తి చేస్తా డు .హన్
,వాడి మనుషులు గేలి చేస్తూ నవ్వుతో నుంటారు .అప్పుడు జో బిగ్గ రగా ‘’iona I own her
‘’అంటూ పదే పదే సంతృప్తిగా సంతోషం గా అంటాడు .అంతటి ప్రేమ అతనిది .ఆ అమర ప్రేమ
నే కద గా తీసుకొని ఆద్యంతం ప్రేరణ నిచ్చే నవల గా మార్చింది రచయిత బెర్సి’’రిడెంప్ష న్
సాంగ్’’ నిజం గా నే కమ్మని పాటలా సాగింది .కర్త వ్య బో ధ చేసింది జాతి విముక్తికి మార్గ ం
చూపింది .నల్ల జాతి వారికి ‘’విముక్తి గీతం ‘’అయి తర తరాలను ప్రభావితం చేసింది .
లాఫింగ్ బాయ్
Oliver La Farge రాసిన laughing boy నవల పులిట్జ ర్ ప్రైజ్ తెచ్చుకోంది .ఇదంతా’’
పో యేటిక్ ప్రో జ్’’గా ఉంటుంది .ప్రతి వాక్యం భావ గర్భితమే .నిండుగా అందం గా ఉంటుంది
.సంభాషణలు చాలా క్లు ప్త గా లోతుగా ఆలోచనాత్మకం గా ఉంటాయి .వర్ణన అద్భుతం అని
పిస్తు ంది .మరో లోకం లో విహరించిన అనుభూతి పొ ందుతాం .అడవి బాపి రాజు గారి నవలల్లా
గా మెత్తగా కత్తి లా ఉంది .
కథ అంతా Nava Jo అనే ఇండియన్ అమెరికన్ల జీవితమే .వారు ఆటవిక తెగ
వారు అమెరికా అసలు వాళ్ళదే .ఆ తర్వాత్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మొదలైన వారొచ్చి
ఆక్రమించుకొన్నారు .ఒక ప్రేమ జంట కథ ను ఇతి వృత్త ం గా తీసుకొని వాళ్ళ ఫ్లా ష్ బాక్ లు
,ఒడిదుడుకులు ,అనుకొన్నది సాధించటాలు ,పాశ్చాశ్చ వ్యామోహం నుండి కాపాడుకోవటం
,తమఅస్తిత్వాన్ని తెల్సుకొని మార్చుకోవటం బ్రహ్మాండం గా వర్ణించాడు రచయిత .An
American classic ,the greatest novel yet written about the original Americans ‘’అని
కితాబు పొ ందిన నవల .ఇదొ క సాహస ప్రయత్నం అని విజయవంతమైన ప్రయోగమని
అందరు భావించారు .మంచి ఊహా ఆచరణ ఉన్న రచయిత అని అతన్ని కొనియాడారు .’’I
do not recall a single other long story of primitive life in which the story is so
completely kept within its native colour and tone ‘’అని ‘’సాటర్ డే రివ్యు ‘’మెచ్చింది
.ఇందులో వచనం కవిత్వ స్థా యిని చేరింది అంది న్యు యార్క్ టెలిగ్రా ం పత్రిక .’’it is a prose
poem of rare beauty ,depth of feeling and emotional power .it is the finest
American novel this reviewer has read in 10 years ‘’అన్నాడు ఫిలడెల్ఫియా కు చెందిన
విమర్శక ప్రముఖుడు .
ఒక రోజు ఎవరి మీదో వేస్తు న్న బాణం ఆ అమ్మాయికి తగులు తుంది .అలా రక్త ం
కారుకుంటూ ఇల్లు చేరుతుంది .అప్పుడు అతనిలో ప్రేమ వెల్లు వ గా బయట పడుతుంది
.బాణం తీసి సపర్యలు చేస్తా డు .కొంత నయం అవగానే నిజ మైన భార్యా భార్త ల్లా జీవిస్తా రు
.అప్పుడామే తన పాత జీవిత కథఅంతా ఆవిష్కరిస్తు ంది .వీడు పశ్చాత్తా ప పడతాడు .ఇద్ద రు
కలిసి నవ జో వెళ్లా లని నిర్నయిన్చుకొని బయల్దే రారు .దారిలో ఆమె చని పో తు .’’చెడిన
ఆడ వాళ్ళను ‘’squa ‘’అంటారు .’’squa is a word Americans use to mean Indian
women .’’అని తన కద చెబుతూ ‘’నేను ణనీ వల్ల నా ఆత్మను కాపాడుకోన్నాను .నీతో
ఉండటం పరమ సంతోషం .నీతో సత్యం చెప్పాలనే నా కోరిక ‘’అని తన గుండె లోతుల్లో ని
ప్రేమను వెల్లడి చేస్తు ంది .కొత్త జీవితం ప్రా రంభించాలన్న తపన ఆమెది ..చని పో తుంది అతని
చేతుల్లో .ఒక గొయ్యి తీసి ,ఆమె నగలన్నీ ఆమెకే అలంకరించి ,తనకు ఆమె ఇచ్చినవీ
అందులోనే ఉంచేసి ఖననం చేస్తా డు .ఒంటరి వాడుగా మిగిలి పో తాడు .అమర ప్రేమికుడని
పించుకొంటాడు లాఫింగ్ బాయ్ .
చివరగా రచయిత ‘’Now he was not a nav Jo terrified of the dead ,not an
Indian ,not an individual of any race ,but a man who had buried his own heart
‘’అంటాడు అద్భుత మైన కవితా ధారతో కృష్ణ శాస్త్రి గారి కవితా పంక్తు లు జ్ఞా పకం వస్తా యి
.తను కావాలనుకొన్నది కావాలని తీర్మానించుకొన్నాడు .దీనినే కవితాత్మకం గా రచయిత
ఇలా చెబుతాడు ‘’the reminder of his life would be a monument to her .all this could
not be changed or taken from him ,he would never lose its mark .that was a
comfort ‘’దేవ దాసులా తాగుడుకు బానిస కాకుండా ఆమె కోసం కొత్త జీవితం ఆరంభిస్తా డు
.అది ఆమెకు అంకితం చేయాలని భావిస్తా డు .నిజమైన ప్రేమకు ఆ ఆటవిక జాతుల వాళ్ళు
ఆదర్శం గా నిలిచారు జంటగా .కళ్ళు చేమరిస్తా యి .చివరి అధ్యాయాలు కుదిపేస్తా యి .శ్వాస
అడ కుండా చేస్తా యి .వాళ్ళ హృదయపు లోతుల్లో కి మనల్ని తీసుకొని వెళ్లి ఆనందాన్ని
పొ ందింప జేస్తా డు రచయిత .అంతటా పాత్రలే దర్శన మిస్తా యి .అన్నీ జీవం ఉన్న పాత్రలే
.వ్యక్తిత్వం తోణికిస లాడేవే .సహజం గా స్వభావ సిద్ధం గా ప్రవర్తిస్తా యి .ఒక గొప్ప నవలా
రాజాన్ని చదివిన అను భూతి పొ ందాను .బరువైన హృదయం తో ఆ అమర ప్రేమైక జంట
లాఫింగ్ బాయ్ ,స్లిమ్ గర్ల్ కు అక్షరామ్జలే ఈ జ్ఞా పకాలు .చివరికి అతడు ఇలా అనుకొంటాడు
‘’we shall never be fear from each other always alone ,but never lonely –in beauty
it is finished ‘’అని వాళ్ళ భాష లో ఒక పాట పాడుకొంటాడు .ఆ పాట ‘’ for ever
alone ,for ever in sorrow I wander –for ever empty for ever hungry I wander –with
the sorrow of great beauty I wander –with the emptiness of great beauty I wander –
never alone ,never weeping ,never empty –now on the old age trail ,now on the
path of beauty I wander –Ahlam beautiful ‘’
నిరాశ కంటే ఆశ కు పెద్దపీట వేస్తా డు రచయిత .ఏడుస్తూ కూర్చోవటం కంటే మళ్ళీ
ఆ జ్ఞా ప కాలతో కొత్త జీవితం సాగించాలి అని హితవు చెబుతాడు .లాఫింగ్ బాయ్ కి గొప్ప
ప్రశాంతి కలిగింది ఎదురు దెబ్బల నుండి పెద్ద గుణ పాఠం నేర్చుకొన్నాడు .తమ ఇద్ద రి ప్రేమ
అజరామరం అని తెలుసుకొన్నాడు అందుకే అంత శాంతి ఏర్పడింది .’’త్వమేవాహం ‘’లోకి
సుదీర్ఘ ప్రయాణం సాగిస్తా డు . 1920 వరకు 25,000 మంది నవ జో లు మాత్రమె ఉన్నారట
.’’their generala condition and mode of life ,with all its hardships ,simplicity and
riches could continue indefinitely if only they were not interrupted ‘’అని రచయిత
తేలుస్తా డు .అనవసరం గా వాళ్ళ ఆచార వ్యవహారాల జోలికి,కట్టు బాట్ల వైపుకి వెల్ల వద్ద ని
వారి మానాన వారిని ప్రశాంతం గా జీవిన్చేట్లు చేయమని ప్రభుత్వానికి ,నాగరకులకు
హెచ్చరిక చేస్తా డు .అందువల్ల నే మరో ముప్ఫై ఏళ్ళకు అంటే 1950 నాటికి నవ జో లసంఖ్య
85,000 అయింది .ఆధునిక ప్రభుత్వాలతో ,ఆధునిక సదుపాయాలతో పాత వి అన్నీ
కోల్పోయారు .ఇప్పుడు వారంతా ఆనందం హసించని జీవులు గా బతుకులు ఈడుస్తు న్నారు
.వారిని ఆదరించే వారితో స్నేహం చేసే వారే కరువైపో యారు .తాగుడుకు బానిసలై పో యారు
.అయినా కొంత మంది ఇంకా వారి మతాన్ని ,వారి పరిసరాల అందాలను ,హాస్యాన్ని
కాపాడుకొంటూ మందు కు బానిసలు కాకుండా నే వారి వినోదాలు ఉత్సవాలను ఘనం గా
నిర్వహించుకొంటున్నారు .ఈ రచయిత కూడా అదే తెగ కు చెందినా వాడే .అందుకే అంత
గొప్ప గా వారి జీవితాన్ని చిత్రీకరించాడు .ఆఫ్రికన్ అమెరికన్లు అంటే నీగ్రో ల పుట్టు
పూర్వోత్త రాలను తెలియ జేసే ‘’the roots ‘’నవల జ్ఞా పకం వస్తు ంది
మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు చదివిన ఈ నవల ను గురించి 19-7-2002 శుక్రవారం
నా డైరీలో రాసుకొన్న విషయాలు మీ కోసం అందించాను .
Alice Adams అనే ఆవిడ రాసిన’’ to see you again’’ అనే కదల పుస్త కం చాలా
బాగుంది ఆమె అమెరికా లోని సాన్ ఫ్రా న్సిస్కో నగరానికి చెందిన రచయిత్రి .మనుషుల అంత
రంగాల్ని క్షున్నం గా పరిశీలించే నేర్పున్న ఆవిడ .దానిని అంత సూటిగా స్వచ్చం గా సినిమా
రీల్ లాగా చూపించే ఒడుపూ నేర్పూ ఉన్నావిడ .చాలా గొప్ప స్టైల్ లో రాసింది .
ట్రూ కలర్స్ అనే కధలో పెళ్లి చేసుకొంటానన్న లాయర్ లాస్
వేగాస్ జూదం లో ఒడి పో యి నందువల్ల రిలక్త ంట్ గా ఉండటం
ఈమెకూ అతని పై మోజు పో వటం గొప్పగా చిత్రీకరించింది .ఓ సినిమా
చూస్తు న్నంత అనుభవం పొ ందుతాం ఆ శైలి శైలూషియే..అలాగే’’
Teressa ‘’ కదా బాగా పండింది .కోకోనట్ తోటల్లో పని చేసే వాళ్ళ
జేవితాల ప్రతి బింబం ఇది .జీతాలు పెరగవు .అడిగితే యజ మాని
దౌర్జన్యాలు, చావులు .తండ్రిని చంపిన యజమానిని చంపి జైలుకు
వెళ్తా డు ఒకమ్మాయి కొడుకు .జైలు జీవితం లో పో రాడలేక అక్కడే
చని పో తాడు అది తెలిసిన తల్లి ‘’I have no fears now every thing
befallen me ,for the rest of the days I am safe .i can go to
sleep without fear .i could even wlak among north Americans
fearing nothing .Now it will be possible for me to work in the
great hotel .we live together by the sea and grow old and safe
forever ‘’.అనుకొంటుంది ఆ తల్లి.తెరెసా .తన ముగ్గు రు పిల్లల్ని
తీసుకొని పల్లెకు వెళ్లి పో తుంది .చాలా హృదయాలను కదిలించేదిగా
ఉంటుంది ప్రతి సన్నీవేశమూ .గొప్ప నిర్వహణ అని పిస్తు ంది .
True colours కదా లో రచయిత్రి falling in love with people you hardly know
of course is in some ways a problem ,it then occurred to me ,you know the shape
and taste of each tiny vein in their flesh and all the secrets smell but may be not
how they feel about money ,for example or how really they like to spend their time
when they are not making love ‘’అని గొప్ప సత్యాలను చెబుతుంది .జీవితాలను కాచి
వడబో సిన అనుభం మనకు ఆమె లో కనీ పిస్తు ంది .
Legends కదా లో ప్రేమికులు సరదాగా ఇలా తిట్టు కొంటారు ‘’if you are going
to be such a silly bitch about it ‘’అని వాడు అంటే ‘’yes ,I am dumb bastard
‘’అంటుంది ఆవిడ .మొత్త ం 19 కధలు అన్నీ బానే రాసింది .ఇవన్నీ శాన్ఫ్రాన్సిస్కో
నగరం,దాని చుట్టూ జరిగిన కధలే .ఆ నగర వాతావరణం బార్లు ,రెస్టా రెంట్లు మటల్స్ ,వగైరా
లన్నీ చూపిస్తు ంది .picturesque గా ఉంటుంది చదువుతుంటే .ఈ కదా సంపుటి చదవక పో తే
ఒక మంచిపుస్త కం చదవ లేదన్న వెలితి ఉండేది అది తీరిందిప్పుడు .స్త్రీ మనస్త త్వాన్ని అద్ద ం
లో చూపించింది .ఎక్కడా భేషజం కని పించదు .ఏదీ దాచుకోలేదు .కధల్లో ప్రేమ విషయాలు
,వాటి వైఫల్యాలు ,ఒంటరి జీవితాలు ,boy meet girl కధలు ,నలుగురైదుగురు పిల్లల్ని కని
ఆ పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళను చేసుకొనే ఆడా ,మగా, తాడూ బొ ంగరం లేని జీవితాలు
ఇందులో చూపించింది ఇదంతా ఆధునిక అమెరికా ప్రజా జీవితం ..ఎవరూ తృప్తిగా బతుకు
తున్నట్లు అని పించదు .ఎక్కడో ఏదో వెలితి ,అసంతృప్తి ,ఆత్మను వదిలి భ్రమింటమే కని
పిస్తు ంది
Tuth and consecenes కదలో ఉన్నత శ్రేణి కి చెందిన అమ్మాయి నిమ్న జాతి
యువకుడూ ఎలిమెంటరి స్కూల్ క్లా స్ మెట్లు .ఆటపాటల్లో ఆడపిల్లలు ‘’ట్రూ త్ ఆర్
కానస్సెంసేస్ ‘’అనే ఆట ఆడతారు .ఈ అమ్మాయి వంతు వస్తు ంది .’సహారా ఎడారిలో
ఎండలో ఇసకలో పడుకుంటే ఒంటికి తేనే రాసి ఉంటె ,చెదలు నిన్ను తినటం ఇష్ట మా ?కార్
జోన్స్ అనే వాడిని ముద్దు పెట్టు కోవటం ఇష్ట మా / అని అడుగుతారు .ఆ అమ్మాయి
అమాయకం గా అతన్ని ముద్దు పెట్టు కోవటమే ఇష్ట ం అంటుంది .పిల్లలు ఏడిపిస్తా రామేను
.అతను ఇవన్నీ పట్టించుకో వద్ద న్నాడు .నల్ల గా ఉండే అతను ఒక సారి ఈ అమ్మాయిని
స్కూల్లో ఒక మూల ముద్దా డి వెళ్లి పో తాడు .ఇక తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తిస్తా డు .కాని
ఆ అమ్మాయి జీవిత మంతా ఈ ఆలోచన లతోనే గడుపుతుంది .అతను త్వరగా ప్రమోషన్లు
పొ ంది వేరే స్కూల్ లో చేరతాడు .బాగా చదివి మంచి పొ జిషన్ పొ ంది సినీ స్టా ర్ ను పెళ్ళాడి తే,
పై తరగతికి చెందిన ఈ పిల్ల అలాగే సాదా జీవితం సాగిస్తు ంది
మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు నేను చదివిన ఈ కదా సంపుటి పై నేను 19
-7-2002
హక్స్లీ సో దరులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారు .ఇద్ద్దరూ సాహితీ మేరువులే .ఆల్డ స్
హక్స్లీ జీవితాంతం ఆలోచించిన సమస్య ‘’అధిక జనాభా .’’దాన్ని నియంత్రించటం పై ఎంతో
రాసి జనాన్ని ప్రభావితం చేశాడు .దీనిపై ఎన్నో ప్రసంగాలు చేశాడు సినిమాలకు స్క్రిప్ట్ లు
రాశాడు .ఆ సమస్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పాడు .ఆయన దృష్టిలో అధిక
జనాభా సమస్య జనాభా పెరుగుదల మాత్రమె కాదని అల్ప జ్ఞా నుల సంఖ్యా పెరిగి పో తోందని
బాధ .ఆయనకు ‘’యూజేనిక్స్ ‘’చాలా ఇష్ట మైన విషయం .ఆరోగ్యకరమైన ఉత్త మ జాతిని
మనకు కావాల్సిన రీతి లో తయారు చేసుకోవటం చాలా అవసరం అని చెప్పాడు .ఇది మేధావి
తనం పెంచుకోవటానికీ తోడ్పడుతుందని వివరించాడు .అందుకే ఆయనకు బ్రిటిష్ యూజేనిక్
సొ సైటీ లో సభ్యత్వం లభించింది .
ఈయన తండ్రి హెన్రి హక్స్లీ .తల్లి జూలియా .తండ్రి డార్విన్ సిద్ధా ంతాన్ని బాగా నమ్మిన
కుటుంబం వాడు .తల్లి తాత డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ అనే ఆంగ్ల విద్యా వేత్త ,చరిత్ర వేత్త
.ఈయనే ఇంగ్లా ండ్ లోని రగ్బీ స్కూల్ హెడ్ మాస్ట ర్ .చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన ‘’తల
వంచని వీరుడు ‘’ అని పించుకొన్నాడు రగ్బీ స్కూల్అనే బ్రిటిష్ పబ్లి క్ స్కూల్ ఈ సంస్థ
ఇంగ్లా ండ్ లోని విద్య పై ఎంతో గొప్ప ప్రభావం కలిగించి చారిత్రా త్మకం గా నిలిచింది .మనదేశం
లో ఎవరైనా గొప్ప హెడ్ మాస్ట ర్ ఉంటె ‘’ఈయన రగ్బీ ఆర్నోల్డ్ ’’అనే వారు . దాన్ని ఆదర్శ
పాఠ శాల గా తీర్చి దిద్దిన ఘన చరిత్ర ఆర్నోల్డ్ ది .ఆర్నోల్డ్ గారి అబ్బాయి మాధ్యూ ఆర్నోల్డ్
గొప్ప కవి విమర్శకుడు .
ఆల్డ స్ హక్స్లీ 1894 జూలై 26 న జన్మించాడు .16 ఏళ్ళ వయసులో ‘’keratitis
punctara ‘’అనే కంటి జబ్బు వచ్చి కళ్ళు కనిపించకుండా పో యాయి .’’బ్రెయిలీ లిపి ‘’ని
అలవాటు చేసుకొని ఎక్సేలేన్సి సాధించాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఇంగ్లా ండ్ లోని
ఆక్స్ ఫర్డ్ లో ఉండేవాడు .డి.హెచ్.లారెన్స్ ,టి.ఎస్.ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ వంటి
రచయితలతో పరిచయమేర్పడింది .వేగం పైన వ్యాసం రాస్తూ ‘’ది ఓన్లీ న్యూ సెన్సేషన్ దిస్
రేచెద్ సెంచరి హస్ ప్రో ద్యూసేడ్ ‘’అంటాడు .1931 లో ‘’the world of light ‘’నాటిక రాశాడు
.1938 లో గ్రేటా గార్బ్ ,జిడ్డు కృష్ణ మూర్తి మొదలైన తత్వ వేత్తలు పరిచయమయ్యారు .1942
లో ‘’art of seeing ‘’రాశాడు
అనితా లూస్ అనే సినీ ప్రొ డ్యూసర్ తన సినిమాలకు స్క్రిప్ట్ రాయమని కోరితే
తిరస్కరించాడు .కారణం ఏమిటి అని ఆమె అడిగితే ‘’because it pays 25,000 dolars a
week –I simply can not accept all that money to work in a pleasant studio ,while
my family and friends are starving and being bombed in England ‘’అని ఖచ్చితం గా
చెప్పిన వాడు హక్స్లీ .చివరికి భార్య ఒప్పిస్తే అప్పుడు సినిమాకు స్క్రిప్ట్ రాశాడు .భార్యకు
కేన్సర్ వచ్చింది ఆ విషయం భర్త కు చెప్ప వద్ద ని ఆయనకు తెలిస్తే రాస్తు న్న స్క్రిప్ట్ పని
మధ్యలో ఆపెస్తా డని డాక్టర్లను వేడుకొంది .ఆయన రాసిన సినిమాలు -Alice in wonderland
,pride and prejudice ,brave new world ,jane Eyre ,prelude to fame .
1958 లో ‘’brave new world ‘’నవల రాశాడు .1959 లో ‘’the human situation
‘’అనే అంశం మీద చాలా చోట్ల ఉపన్యాసాలిచ్చాడు .విధి వక్రించింది 1961 లో ఇల్లు అంతా
తగల బడి పుస్త కాలు ,స్క్రిప్టు అన్నీ ధ్వంసమై పో యాయి .దీని పై స్పందిస్తూ తాత్వికం గా ‘’I
am evidently intended to learn ,a little advance of the final denundation that you
cannot take it with you ‘’అన్నాడునవ్వుతూ .1963 నవంబర్ 23 న కేన్సర్ వ్యాధి తో
ప్రెసిడెంట్ కేన్నేడి అమెరికా లో హత్య జరిగిన సాయంత్రమే ఆల్డ స్ హక్స్లీ మరణించాడు
ఆయన దృష్టిలో బాహ్య ఇంద్రియాలకు అన్నీ తెలియవని అవి తెలుసుకో లేవని
,ఆధ్యాత్మిక జీవితం అవసరమని ,ఈ విశ్వం అనంతమని దాని రహస్య శోధనకు అంతరంగమే
సాక్షీ భూతమని నమ్మాడు .గుడ్డి తనం తో జీవితాంతం బాధ పడుతూ ఎంతో సాహితీ సేవ
చేశాడు .తన మరణం ఆసన్న మవుతోందనే విషయం ఆయనకు ముందే తెలుసు .దీనికి
కంగారు పడలేదు .తన పని తాను చేసుకొని పో తూనే ఉన్నాడు .ఆయన్ను ‘’distinguished
artist ,the bold thinker and un obtrusive hero (అనుకోని నాయకుడు )‘’అంటారు .
హక్స్లీ సూక్తు లు కొన్న సార్వ కాలీనాలు –విజ్ఞా నం మంచిది .అమాయకత్వం చెద్డది
.శాస్త్రీయ అభివృద్ధి మానవ జీవితాలను సుఖమయం చేస్తు ంది .దేవుడిని సైన్సు దృష్టితో
యంతాలతో ,మేధస్సు తో చూడ లేవు హృదయం ద్వారా నే తెలియ బడతాడు .భగవంతుడు
నీకు సుఖాన్ని కలిగిస్తా డని అనుకోకు .నీ చాయిస్ నువ్వు తీసుకో .సైన్సు పెరిగి నంత మాత్రం
వల్ల వ్యక్తీ లోనిమంచి గుణాలు పెరుగుతాయనేమీ లేదు .మన నాగరకత యాన్త్రికతను
,మందులను సుఖాల్ని ఎంచు కొంది అందుకే నా పుస్త కాల నన్నిటిని గదిలో పెట్టి తాళం
వేశాను సైన్సుఆధిక్యత వల్ల వ్యక్తీ గా మానవుని పై చెడు ప్రభావమే చూపుతోంది .డ్రగ్స్ కు
విపరీతమైన మందుల వాడకానికి చెక్ పెట్టా లని ఆనాడే నెత్తీ నోరు మొత్తు కొన్నాడు .
ఆల్డ స్ హక్స్లీ గొప్ప ఆలోచనా పరుడు ,తత్వ వేత్త ,శాస్త జ్ఞు
్ర డు భగవదన్వేషకుడు
‘’Lenore Carole అనే ఆమె రాసిన నవలే పైన పుస్త కం .అమెరికా లోని కాలి
ఫో ర్నియా లో నిజం గా జరిగిన కధకు కల్పన జోడించి రాసిన నవల .Thomasina Mc intyre
అనే ఆవిడ కాలిఫో ర్నియా లోని ‘’స్కాట్స్ చైనా చైన్’’ అనే చోట ఉంటోంది .ఆ రోజుల్లో చైనా
నుంచి ఆడపిల్లల్ని తెచ్చి చైనా టౌన్ లో అమ్మేస్తూ ండే వారు . వీరితో వ్యభిచారం చేయిస్తూ
,బానిసలుగా చూస్తూ ,పిల్లల్ని కంటే బైటికి విసిరేసి ,ఇళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తూ ,వీలైతే
అమ్మేస్తూ ఉండే వారు .ఈ ముఠాకు వ్యతి రేకం గా ,బానిసలకు ,బాధితులకు ఆసరాగా
‘’ప్రెస్బిటేరియన్ మిషన్ ‘’పని చేసేది .’’తోమాసినా’’ ఈ మిషన్ లో 1895 నుండి పని చేసి
చిరస్మరణీయమైంది .ఈవిడకు ముందు మిస్ మార్గ రెట్ కుల్బెస్తా న్ పని చేసింది .ఈమెకు
సాయం గా చున్ మీ ఉండేది .ఈవిడకు వయసు మీద పడటం తో తోమా సీనా కు శిక్షణ
నిచ్చి సహాయ టీచర్ గా వేసుకోంది .వీరంతా కలిసి క్రూ ర రాజకీయాలను ,పనికి రాని న్యాయ
,చట్టా లను ఎదిరించారు .చైనా నుంచి తరలించ బడ్డ ఆడపిల్లల్ని రక్షించటానికి ,ఈ మిషన్
చాలా జాగ్రత్త గా వ్యవహరించి ,ఆ ఆడపిల్లల్ని అభాగ్యులైన గర్భ వతుల్ని ,పో లీసుల
సహాయం తో ,చట్ట ం రక్షణలో ఈ మిషన్ లో చేర్పించి ,బ్రతక టానికి తగిన విధం గా తీర్చి
దిద్దు తున్నారు .వీరు పెద్ద వారైన తర్వాత తమ ఇష్ట ం మేరకు తలి దండ్రు ల దగ్గ రకు చైనా
వెళ్ళ టానికి సహాయం చేస్తు న్నారు .లేక పో తే ఇక్కడే క్రా ఫ్ట్, ఎంబ్రా యిడరీమొదలైన వి
నేర్చుకొని ఉండి పో వచ్చు .వీళ్ళ పని న్యాయ బద్ధ ం గా దళారీ దారుల నుండి యువతులను
విముక్తి చేయటమే .
ఈ విధమైన సేవ చేస్తు ంటే కుల్బెస్ట న్ తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది కాలానికి
మరణించింది .అప్పుడు ఈ మిషన్ నిర్వహణ బాధ్యత తోమాసీనా పై పడింది .ఆమె అత్యంత
సేవా భావం తో ,అంకిత మనస్సు తో ,ఆ పిల్లలకు తల్లిలా ధైర్యం గా నిలబడి ,అవసర మైతే
పో రాడి చివరి దాకా నిలబడింది .దీనికి తోడు ఆమె కధ మధ్యలో ముగ్గు రితో ప్రేమ లో
పడుతుంది .కాని కర్త వ్యమ్ బలీయం కనుక ఎప్పుడూ హద్దు లు దాటలేదు .చివరికి ‘’రాస్
‘’అనే ముసలాయన పెళ్లి చేసుకొంటానన్నాడామెను ..సరే అన్నది .ఇంతలో అతను
అకస్మాత్తు గా చని పో తాడు .మళ్ళీ ఒంటరిగా నే ఉండి పో తుంది .మిషన్ వ్యవహారాల్లో సర్వం
మర్చి పో యింది .తన జీవితాన్ని ఈ అభాగ్యుఅలకోసం త్యాగం చేసి చరితార్దు రాలైంది .అలాంటి
త్యాగ మూర్తి జీవితం గురించి చదివిన గొప్ప సంతృప్తి మనకు మిగిలి పో తుంది .సేవా భావం
అంటే తెలికైన్దేమీ కాదని కత్తి మీద నడకే నని ఈ నవల చదివితే అవగాహన మవుతుంది .
1906 లో కాలి ఫో ర్నియా లో తీవ్ర భూకంపం వచ్చింది .సర్వం నేల మట్ట మైంది
.ఈ మిషనరీ కూడా కూలి పో యే స్తితిలో ఉంది .అప్పుడు సుమారు యాభై మంది పిల్లలతో
వేరొక చోటికి మార్చి తల దాచుకొన్నారు వీరంతా .ఆ తర్వాతా దాతల సహకారం తో సకల
సదుపాయాలున్న వంద గదుల భవనాన్ని అదే స్త లం లో నిర్మింప జేసి తన ఉదాత్త
ఆశయానికి ప్రా ణం పో సింది .సంకల్పం ,దీక్షా ఉంటె సాధించలేని దేమీ ఉండదు అని రుజువు
చేసిన సేవా మూర్తి తోమాసీనా .మాతృమూర్తి గా భాసించింది .అందుకే మనవారు ‘’ముదితల్
నేర్వగా రాణి విద్య గలదే ముద్దా ర నేర్పించినన్ ‘’అన్నారు .
ఈ నవలలో కొన్ని పదాలకు రచయిత్రి గొప్ప అర్దా లనిచ్చింది .prostitute –అంటే
వందమంది మగాళ్ళకు భార్య .అలాగే సేవా భావానికి ఆ స్త్రీ మూర్తికి లోని ఒక సూక్తి స్పూర్తి
నిస్తు ంది ‘’ask and it shall be given –seek and ye shall find –love and help are
always here-if you remember to ask ‘’.
ఆమె తరచుగా తనను గురించి ‘’it is better to be one hundred girls’s mother than
to be one hundred men’s wife ‘’అను కొనేది .27 ఏళ్ళ వయసులోనే ఈమెకు ఇంతటి
మిషన్ కార్యం మీద వేసుకొని సమర్ధ వంతం గా నిర్వహించి అందరికి తల్లి అని పించుకోంది
.ఆమె దృష్టిలో పని లేని విశ్వాసం శూన్యం (faith without work is empty ).డబ్బుకు కొరత
ఏర్పడ్డ ప్పుడు బో ర్డ్ మీటింగ్ పెట్టి మాట్లా డుతూ ‘’we have to change water into
wine ,when the budget is low ‘’అని ప్రో త్సహించేది .తనకు ముందు పని చేసిన
క్యూబెర్స్తాన్ చెప్పిన ‘’take heart and call on the Lord ‘’’అన్నది తోమాసీ కి వేద వాక్కే
.దాన్నే అనుసరించి సఫలీక్రు తురాలైంది .ఈ మాటనే నమ్మి ఎక్కడో ఉన్న చైనా దేశపు
ఆడపిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకొని ధన్య మాత అని పించుకోంది .తోమాసీనా
పెద్దదై ‘’tomsen ‘’అయింది అంటే ‘’పెద్దమ్మ గారు ‘’అయింది .అమ్మల గన్న యమ్మ అని
పించుకోంది .రచయిత్రి కరోల్ ఇంతటి త్యాగ మూర్తి కధను నవల గా రాసి మహో ప కారమే
చేసినందుకు అభిమాన పాత్రు రాలైంది .
జేమ్స్ జాయిస్
ఈ పేరు వినగానే యులిసిస్ తో బాటు ,చైతన్య స్రవంతి ప్రక్రియ జ్ఞా పకం వస్తు ంది
.ఇదే stream of consciousness .దీన్ని ప్రవేశ పెట్టి ఆధునిక సాహిత్యానికి కొత్త
రూపునిచ్చాడు .ఐరిష్ దేశ మేధావి రచయిత జాయిస్ .పేరు లోనే ‘’joy ‘’ కాని జీవితాంతం
‘’sorrow ‘’లోనే బతికాడు పాపం .
జాయిస్ రచన లన్నిటిని స్నేహితులు మెచ్చి డబ్బు సాయం చేసి ప్రచురించినవే
.దీనితో అప్పులు కూడా కుప్పలు తెప్పలు గా పెరిగి పో యాయి .నారా అనే అమ్మాయితో 27
ఏళ్ళు గడిపి అన్నీ అనుభవించి పిల్లల్ని కన్నాడు కాని సంతానాన్ని పట్టించుకో లేదు .ఆమె
మీద ఎవరో సాడీలు చెబితే ఈసడిస్తూ ఉత్త రం రాశాడు ఆమెకు .ఆమె ను అపార్ధం
చేసుకోన్నాడని ఇంకోడు చెబితే దీన్నీ నమ్మి ఆమెకు సారీ చెప్పాడు .తాగటం ,క్ల బ్ లవెంట
తిరగటమే పని .డబ్బు లేక పో వటం ఎవరిని బడితే వాళ్ళను అడుక్కొని జీవించటం అనే స్తితి
లోకి జారిపో యాడు .జార్జి అనే కొడుకు లూసియా అనే కూతురు ఉన్నారు జాయిస్
కు..త్త్రిస్టీఅనే చోట ఇంగ్లీష్ పాఠాలు చెప్పి కొంత డబ్బు సంపాదించుకొన్నాడు .అయినా పొ ట్ట
గడవటం కష్ట ం గా ఉండేది .చాలా ఊళ్లు తిరిగాడు .నరాల బలహీనత వచ్చింది .ఇంట్లో భార్య
అతని రచనలు చదవక పో గా ఈసడించుకోనేది దీనితో మహా బాధ పడే వాడు .ఆమెకు కోపం
వస్తే అతని రచనల్ని చింపి పో గులు పెట్టేది .కొడుకూ పో రంబో కు గా తయారయ్యాడు .
schijopherma జబ్బుతో కూతురు బాధ పడింది .1914 ఫిబవ
్ర రి 2 న 32 వ పుట్టిన రోజున
ఎజ్రా పౌండ్ సహాయం తో ‘’portrait of the young artist as ayoung man ‘’ప్రచురించాడు
.ఇందులో స్ట్రీం ఆఫ్ కాన్ష స్ నేస్ ప్రవేశ పెట్టా డు .దీన్ని అందరూ స్వాగతించారు .’’joyce
introduced a new style ,new subject matter into Irish literature .This is the evidence
of a man of genius ‘’అని కీర్తించాదు పౌండ్ .కుటుంబాన్ని జూరిచ్ ,స్విస్స్ దేశాలకు
మార్చాడు .మళ్ళీ మామూలే .‘’ఈట్స్,పౌండ్ లు కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి నెల
నేలా కొంత డబ్బు వచ్చేట్లు చేశారు కుటుంబం విషయం లో తాను చాలా పొ రబాట్లు చేసి నట్లు
తెలుసుకొని పశ్చాత్తా ప పడ్డా డు .జాయిస్ కు పది సార్లు కంటి జబ్బు వచ్చింది .ఎన్నో
ఆపరేషన్లూ జరిగాయి .గ్లు కోమా వచ్చింది .క్రమంగా రచనలు వెలుగులోకి రావటం తో
ప్రశసలూ దక్కాయి 27 ఏళ్ళు కలిసి ఉన్న నోరాను ఇప్పుడు వివాహం చేసుకొన్నాడు చట్ట
బద్ధ ం గా ..’’you are a martyr to a man’s genius ‘’అన్నది ఆమెను ఒక జాపాన్ చిత్రకారిణి
.
జేమ్స్ జాయిస్ ‘’యులిసిస్ ‘’రాయటానికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున
ఏడేళ్ళు పట్టింది .దీని ప్రచురణ తో ప్రా చుర్యం పెరిగి పో యింది .’’joyce had ended 19 th
century style and started something new ‘’అన్నది ప్రముఖ ఇంగ్లా ండ్ రచయిత్రి
వర్జీనియా ఉల్ఫ్ .’’ఇదేం కంగాళీ రచన రా బాబో య్ ‘’అని ముక్కూ మూతి విరుచుకొన్న
వారూ ఉన్నారు .ఈట్స్ దీన్నిమొదట ‘’మాడ్ బుక్ ‘’అన్నాడు .తర్వాతా ‘’it is a work of
genius ‘’అని కీర్తించాడు .జాయిస్ మాత్రం యులిసెస్ ను డే బుక్ అనీ ఫిన్నేగార్స్ ను నైట్
బుక్ అనీ అన్నాడు .జాయిస్ కోడలు ఆస్పత్రి పాలైంది .ఆయనకు ‘’deuo denal ulcer
‘’వచ్చింది .చివరికి 1941 లో జనవరి 13 న 59 వ ఏట మరణించాడు .
చైతన్య స్రవంతి ప్రక్రియ ను ‘’is the flow of ideas ,perceptions ,sensations
and recollections that characteristic human thought .it has subsequently been
adopted by literary critics and authors to describe the representation f this flow in
writing ‘’అని ‘’principles of psychology ‘’లో ఉందన్న విషయం ,ఈ విధానానికి
బాసట గా ఉందని అనుకూలురు భావిస్తా రు .’’however unlike interior
monologue ,stream of consciousness writing is governed by basic rules of grammar
and syntax ‘’అయితే దీన్ని చదివి అర్ధం చేసుకోవాలంటే ఓపికా సహనం కావాలి దీని నిండా
ఇమేజరీ, సింబల్స్, ఉంటాయి కనెక్షన్ పట్టు కోవటం కష్ట ం .అన్నీ తెలుసుకొని చదివితే అదో
అద్భుత లోకమే నని పిస్తు ంది .మన తెలుగు లో ఈ ప్రక్రియను అద్భుతం గా ’ఉపయోగించి
‘’ఆంప శయ్య ‘’నవల రాశాడు వాసిరెడ్డి నవీన్ .దీనితో ఆయన ‘’అంపశయ్య నవీన్
‘’అయ్యాడు .
అగాతా క్రిస్టీ
ఈ పేరు వినగానే డిటెక్టివ్ నవలా రాణి జ్ఞా పకం వస్తు ంది అగాతా క్రిస్టీ రాసిన
అపరాధ పరిశోధక నవలలు బైబుల్ ,షేక్స్ పియర్ రచనల తర్వాత అంతగా బిల్లియన్ల
సంఖ్యలో అమ్ముడయ్యాయి .ఆమె మొదట నర్సు గా పని చేసింది .పద్యాలూ రాసింది
.మామూలు నవలలూ రాసింది .ఆమె తన లాబరేటరి లోఉన్న మందుల గురించి ఈ కింది
పంక్తు లను రాసుకొన్నది ‘’’’beware of the power that never die through men may go
their way –the power of the drug for good or evil shall it ever pass away ‘’1926 లో
‘’amnesisia ‘’జబ్బు వచ్చి నిద్రలోనే లేచి వెళ్లి పో యేద.ి మొదట క్రిస్టీ అనే అతన్ని పెళ్ళాడి
14 ఏళ్ళ తర్వాత విడాకులు పొ ంది ,మేల్లా న్ అనే వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపురం
చేసింది .నిత్య జీవితం లోని ప్రతి విషయాన్నీ పరిశీలనా దృష్టితో చూడటం ఆమెకు వెన్న తో
బెట్టిన విద్యే అయింది .తన జీవిత చరితన
్ర ూ రాసుకోంది .అయితే తనను గురించి మాత్రం
ప్రచారం చేసుకోలేదు .చాలా మర్యాదగా బిడియం గా ఉండేది .’’the older you get ,the
more interesting you become to an Archeologist ‘’అంటుంది క్రిస్టీ .ఏ నవల అయినా
ఆమె టైప్ చేసి ఆరు వారాల్లో ఇచ్చేసేది ప్రచురణ కోసం .అంత స్పీడ్ ఉన్న రచయిత్రి .తన
జీవితం పై తానే జోక్ వేసుకొంటూ ‘ a sausage machine ,a perfect sausage machine
‘’అనుకోవటం ఆమెకే చెల్లి ంది .(మాంసం కూర తయారు చేసే యంత్రం ).కనీసం ఏడాదికి
రెండు పుస్త కాలు రాసి ప్రచురించేది .ఆమెను ‘’ఆఫీసర్స్ క్లా స్ ‘’రచయిత్రి గా గుర్తించారు .తన
చిన్న తనాన్ని గూర్చి ఆమె ఒక పద్యం రాసుకోంది ‘’agatha pagatha may black hen –she
lays eggs for gentlemen –she laid six and she laid seven –and one day she laid
eleven ‘’అని రాసి తండ్రికీ అక్క చెల్లెళ్ళకు చదివి విని పించి అందర్నీ నవ్వించేది .నిజంగానే
‘’అగాతా కోడి అనేక నవలా గుడ్లు పెట్టింది’’ .’’85 ఏళ్ళ నిండు జీవితం గడిపి 1976 జనవరి
12 న మరణించింది .
అసలు పేరు ‘’డెం ఆగతా మేరీ క్లా రిస్సా క్రిస్టీ’’ .15-9-1890 l లో జన్మించింది .డిటెక్టివ్
నవలలతో బాటు అనేక కధలూ ,నాటకాలు రాసింది .’’మేరీ వేస్త్మా కాట్’’ అనే మారు పేరుతో
ఆరు రొమాంటిక్ నవలలూ రాసిన నవలా మణి ఆమె ..66 డిటెక్టివ్ నవలలు 15 చిన్నకదా
సంపుటులు ఆమె రా వెలువరించింది .ఆమె రాసిన ''మర్డ ర్ ఆన్ ది ఓరియంటల్ ఎక్స్ప్రెస్స్
,''డెత్ ఆన్ ది నైల్ ''మంచి పేరు తెచ్చుకోన్నాయి . ప్రపంచం లోనే దీర్ఘ కాలం ఆడుతున్న
నాటకం .’’మౌస్ ట్రా ప్ ‘’రాసిన ఘనత క్రిస్తీది .ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబం లో
జన్మించింది మొదటి ప్రపంచ యుద్ధ ం లో నర్సుగా పని చేసింది .అన్ని కాలాల లోను ఆమె
నవలలు హాట్ కేక్స్ గా అమ్ముడయ్యాయని గిన్నీస్ బుక్ రికార్డు లో ఉంది .ఆమె రచనలు
103 భాషల్లో కి అనువదింప బడ్డా యి అంటే ఆమె ప్రభావం ఎంత విస్త ృతమో తెలుస్తో ంది .ఆమె
నవల ‘’And there were none ‘’ఇప్పటికి 100 మిలియన్ల కాపీలు అమ్మడయి రికార్డ్
సృష్టించింది .1971 లో ఎలిజబెత్ మహా రాణి ఆమెను ‘’dane ‘’గా ప్రకటించి రాజ భవనం
బకింగ్ హాం పాలస్ లో సన్మా నించింది .క్రిస్టీ రాసిన ‘’మౌస్ ట్రా ప్ ‘’నాటకం లండన్ లోని
‘అంబాసిడర్ థియేటర్ ‘’లో 1952 నవంబర్ 25 న ప్రదర్శన ప్రా రంభమై ఈ నాటి వరకు
అంటే 60 ఏళ్ళ పాటు నిరంతరం నాన్ స్టా ప్ గా ప్రదర్శింప బడుతోంది .25,000 ప్రదర్శనలు
దాటింది .1955 లో ‘’మిస్ట రి రైటర్స్ ఆఫ్ అమెరికా ‘’అవార్డు ను పొ ందిన మొదటి రచయిత
అని పించుకోన్నది . ఇది చాలా అత్యున్నత గౌరవం ..గ్రా ండ్ స్టా ర్అవార్డు ను ‘’,witness for
prosecution ‘’ , అవార్డు లను అందుకొన్నది .ఆమె రాసిన ఎన్నో నవలలు ,కధలు
సినిమాలుగా టి.వి.షో లుగా వచ్చాయి రేడియో లలో వీడియో గేమ్స్ లోను ప్రదర్శిమప
బడ్డా యి .యెనలేని కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం ధనంసంపాదించిన బంగారు బాతు,అపరాధ నవలా
రాణి ఆగతా క్రిస్టీ .
డేనియల్ డీఫో
డేనియల్ డీఫో 1660 లో లండన్ దగ్గ ర పుట్టా డు .కాలేజి చదువు లేదు యూని వర్సిటి
గ్రా డ్యు ఎట్ల ను ‘’’greek and latin mongers ‘’అని చిన్న చూపు చూసే వాడు 1684 లో ధన
వంతురాలి తో వివాహం అయింది .వ్యాపారం చేసి దివాలా తీశాడు .1695 లో ప్రభుత్వ ఉద్యోగం
వచ్చింది సీక్రెట్ ఏజెంట్ గా చాలా చోట్ల తిరిగాడు .ప్రభుత్వానికి సమాచారం అందించినపడల్లా
కస్టా లు జైలు పాలు .ఏమీ చేతకాని వాళ్ళను చూస్తె అసహ్యం .పద్యం లో ‘’a horrid medly
thieves and drones –who ransacked kingdoms and disposed towns –the pict and
painted Britain thackerers scott ‘’అని హేళన చేశాడు
నెమ్మదిగా రెండవ లూయీ రాజు దగ్గ ర ప్రా పకం సంపాదించాడు .దాదాపు ఆస్థా నకవి
గా చెలామణి అయ్యాడు .1703 లో లూయీ అధికారం కోల్పోతే అరెస్ట్ అయ్యాడు డీఫో
.జైలుకు ఇతన్ని తీసుకొని వెళ్తు ంటే అభిమానులు ‘’పూల వర్షం ‘’కురిపించారు .ఎవరికి
తెలీకుండా తప్పించుకొన్నాడు .అపుడు ‘’men that are men in thee feel no pain –and all
thy insignificants disdain –thou buglar of the law stand up and speak –thy long mis
constued silence break ‘’అని తన విరోదుల్ని చాలేన్జీ చేశాడు ‘’tell them that he was too
bold –and told those truths should not have been told ‘’అనీ హెచ్చరించాడు
విలియం పీటర్సన్ అనే వాడు లండన్ లో మొదటి బాంక్ స్తా పకులలో ఒకడు .అతని
సాయం డీఫో కి లభించింది .హార్లీ అనే వాడికి సెక్రెట్ అజేంట్ గా పని చేశాడు .దేశ ఆర్ధిక
పరిస్తితి ని క్షుణ్ణ ం గా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేవాడు .జర్నలిస్ట్ గా పని చేసి ఎన్నో
విషయాలమీద రాశాడు 1713 లో తాను రాసిన రాతలకు మళ్ళీ అరెస్ట్ అయాడు .రాణీ అన్నే
ద్వారా బెయిల్ పొ ందాడు .రాణి చని పో వటం తో మళ్ళీ కస్టా ల పాలయ్యాడు .55 వ ఏట
అసలైన సాహిత్య జీవితం ప్రా రంభించాడు .’’secret history of white staff ‘’రాశాడు
‘’.mole ‘’గా పని చేశాడు .ఇంగ్లీస్ద్ జెంటిల్ మాన్ లాంటివి చాలా రాశాడు .మొత్త ం 566 వివిధ
విషయాలాపై ఆర్టికల్స్ రాసిన ఘనుడు డీఫో .27 జర్నల్స్ కు పీరియాడికల్స్ రాశాడు .1704
లో వ్యాపారం లో దివాలా తీశాడు .తనను గురించి ‘’no man has tasted differing fortunes
more –and thirteen times I have been rich and poor ‘’అని రాసుకొన్నాడు .1731 లో 71
ఏళ్ళ వయసులో డీఫో మరణించాడు .
డీఫో రాసిన వాటిలో కల కాలం గుర్తు ండి పో యేది ‘’రాబిన్సన్ క్రూ సో ‘’నవల .దీనికి
ప్రేరణ ‘’Alexander Selkirk అనే స్కాట్లా ండ్ నావికుని జీవితం .’’defoe is the first writer
of fiction to embody the circumstantial view of life ‘’అని ప్రశంశలు పొ ందాడు .అతని
దృష్టిలో వ్యక్తీ గత పరిశీలన ,అనుభవం జ్ఞా నానికి ముఖ్య ఆధారాలు .ఆధ్యాత్మిక ,నీతి ధర్మాల
కు విలువనిచ్చాడు .దైవాన్ని మనస్పూర్తిగా నమ్మి ప్రా ర్ధిస్తే ఆపద సమయాలలో తప్పక
ఆదుకొంటాడన్న గొప్ప ఫిలాసఫీ ని క్రూ సో నవలలో అంతర్గ తం గా చెప్పాడు దాన్ని రుజువు
చేసి చూపాడుకూడా .’’what ever we may heap up indeed to give others ,we enjoy
just as much as we can use and no more ‘’అన్నది డీఫో సిద్ధా ంతం .ఒంటరి ద్వీపం లో
ఎన్నో కస్టా లు పడి పని చేసి సాధించాడు రాబిన్సన్ .ఏకాంతం అతనికి ప్రపంచాన్ని విస్త ృతం
గా అర్ధం చేసుకొనే వీలు కల్పించింది .అక్కడ తారసపడ్డ ‘’cannibals ‘’అనే నరా మాంస
భక్షకుల లో మార్పు తెచ్చి ,వాళ్ళకే నాయకుడైన చాతుర్యం క్రూ సో ది .బతికే టేక్నిక్కులన్నీ
తెలిసిన వాడు .దొ రికిన ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకొన్న చతురుడు .’’call on
me –I can deliver you ‘’అన్న యేసు క్రీస్తు బో ధను ఆచరణ లో పెట్టి జయించాడు క్రూ సో ..
అబ్రహాం లింకన్ ను అందరు ఏబ్ లింకన్ అని ఆప్యాయం గా పిలుచు కొంటారు
.ఆయన భావాలు తరతరాలకు ఆదర్శ ప్రా యాలు .ప్రభుత్వం నడిపే వారికి, ప్రజలకు లింకన్
ఎన్నో మంచి మాటలు చెప్పాడు .ఏ ప్రభుత్వానికైనా మొదటి విధి తనను తాను
రక్షించుకోవటం తర్వాత దాని ఉనికి ని కాపాడుకోవటం అవసరం అన్నాడు లింకన్ ప్రెసిడెంట్
గా బాధ్యతలు చేబట్టే నాటికి ప్రభుత్వ నిధులన్నీ నైవేద్యం అయి పో యాయి .అంతకు
ముందున్న ఏ ప్రెసిడెంట్ కు ఇంతటి ఆర్ధిక విపత్కర పరిస్తితి ఎదురు కాలేదు .ధైర్యాన్ని
,సాహసాన్ని ప్రదర్శించి మనసు దిటవు చేసుకొని అవగాహనా చాతుర్యం తో ,ప్రజల్లో విశ్వాసం
కల్పించాడు ,ఉత్తేజం, ప్రేరణ కలిగించాడు .ప్రజా హృదయాలను గెలవటమే కాదు తనను తాను
గెలిపించుకొన్నాడు అదీ లింకన్ అసమాన ప్రతిభ .
ప్రెసిడెంట్ వాషింగ్ టన్ తర్వాత ప్రజల్లో ఇంత విశ్వాసం, నమ్మకం కలిగించిన వారెవరూ
లేరు .లింకన్ మళ్ళీ అలాంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిపించాడు స్తిర చిత్త ం తో నిల బడ్డా డు
.మూడేళ్ళ అస్త వ్యస్త స్తితి నుంచి గట్టెక్కించాడు .ఒక విశ్లేషకుడు చెప్పినట్లు ‘’కాలమే లింకన్
ప్రధాని మరియు సైన్యాధికారి ‘’.లింకన్ అటార్నీ గా ఉండి ప్రెసిడెంట్ పదవికి ఎదిగిన
లాయర్. .ఆయన ఆకారాన్ని ‘’సామ్కోపాంజా‘’తో పో ల్చి వినోదించిన వారూ ఉన్నారు .
ఇంగ్లా ండ్ రాజు హెన్రి ఫో ర్త్ ను లింకన్ ను పో లుస్తూ Henry fourth ‘’went over the
nation ‘-Lincoln steadily down the nation over to him .Henry left a united France
–LINCOLN RE UNITED America ‘’అని గొప్ప గా చెప్పారు .ఇంకొకరు విక్టో రియా రాణి
తో పో లుస్తూ లింకన్ కూడా విక్టో రియా లా అందగాడు కాదన్నారు .అయితే అమెరికనిజం
ఉన్న గొప్ప నాయకుడు అని కీర్తించారు .ఆయన్ను ‘’స్వయం సిద్ధ నాయకుడు’’ –ready
made leader అన్నారు .
లింకన్ గొప్ప మేధావితనం, విషయావగాహనలోనే కాక ప్రజలను అర్ధం చేసుకోవటం లో
కూడా కనీ పిస్తు ంది .ఆయన ఆదర్శ నీయ మైన ,యదార్ధ రాజకీయ దురంధరుడు –స్టేట్స్
మాన్ ..ఉన్నదానిలో అత్యున్నత మైనదిఆశించటం ,కాకపో తే అంతకు దగ్గ రలో ఉన్న దానిని
పొ ందటం ఆయన లక్ష్యం ,లక్షణం . అయన లో విచక్షణ తో కూడిన అనుభవం పుష్కలం గా
ఉంది .
లింకన్ తాను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటు అమెరికాను తీసుకొని వెళ్ళాడు .ఆయన
పొ ందినదాన్నే అనుభ వించాడు .ఆయన్ను ప్రజల సాధారణ జ్ఞా నానికి ప్రతి నిధి గా, అవతార
స్వరూపుడిగా భావిస్తా రు .ఆయన వాగ్దో రణి లో ‘’సెంటి మెంట్ ‘’అనేది ఉండక పో వటం
ప్రత్యేకత ఇది రాజ కీయ నాయకులందరూ గమనించాల్సిన విషయం ..సందర్భం సంఘటనల
నేపధ్యం లో వాటిని తనకు, దేశానికి అనుకూలం గా మార్చుకొని రాజకీయాలు నడిపాడు
సంఘటనలే ఆయనకు దారి చూపాయి కాలనీ ప్రజల దీర్ఘ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టు కొని
పని చేసిన మహో న్నత నాయకుడు లింకంన్ .లింకన్ కు ఆదర్శం ఫ్రెంచ్ తత్వ వేత్త
,దార్శనికుడు ‘’వోల్టై ర్ ‘’చెప్పిన సూక్తి ‘’A consideration of petty circumstances is the
tomb of great things ‘’అనేదే .
ఏ విషయం వచ్చినా ‘’రండి కలిసి ఆలోచించి చర్చిద్దా ం ‘’అనే వాడు ప్రజల ప్రేమను
,వారి తీర్పును అంత గొప్ప గా పొ ందిన ప్రెసిడెంట్ లేనే లేడు.మనిషి లోనుంచే ఉన్నత
భావాలు రావాలి కనుక మనుష్యుల తో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం లింకన్ కు ఇష్ట ం
.నిర్ణయం తాను తీసుకొని ప్రజల మీద రుద్ద టం భావ్యం కాదని భావించేవాడు ..ఆయన
మాటల్లో కాని ,ప్రసారాల్లో కాని చాలా నిజాయితీగా ‘’this is the conclusion to which in my
judjement ,the time has come and to which accordingly ,the sooner we come the
better for us ‘’అనే వాడు .ఎక్కడైనా ‘’I’’అని ఉపయోగించినా అందులో ఈగోయిజం
ఉండేది కాదు
అయన మాట్లా డుతూ ఉంటె ప్రజలు తమ మనో భావాలను తాము బయట
పెట్టు కొంటున్నట్లు గా ఉండటం లింకన్ తో ప్రజల మమైక్యానికి నిదర్శనం .ప్రజలకున్న తెలివి
తేటల ను ప్రశంసించే వాడు .దానినే ప్రస్తా విన్చేవాడు .వారి అజ్ఞా నాన్ని ,అమాయకత్వాన్ని
గురించి ఎప్పుడూ మాట్లా డే కాదు అదీ ప్రెసిడెంట్ లింకన్ వ్యక్తిత్వం . .ఎన్నికలలో మెజారిటీ
సంపాదించటమే కాదు తన దేశ ప్రజలను తన దగ్గ రకు తెచ్చుకొనే వాడు అంత నిజాయితీ
నిర్భీకత ,శక్తి ఉన్న నాయకుడు ఏబ్ లింకన్ .
ప్రెసిడెంట్ లింకన్ హత్య గావింప బడి చని పో తే ప్రజలు ‘’సామాన్య మాన వీయత
‘’ను కోల్పోయి నట్లు దుఖించారు .తమ ఆరాధ్య దైవం మరణించి నట్లు విలపించారు తమ
మార్గ దర్శి ,సంక్షేమ కామి చని పో యినట్లు బాధ పడ్డా రు .ఇంత గా ఏ ప్రెసిడెంట్ చని
పో యినప్పుడూ ప్రజలు స్పందించలేదు .అదే ఆయన ప్రజల్లో కలిగించిన చైతన్యం . .ప్రజల్లో
ఉన్న వీర ఆరాధన .ప్రజలకు, ఆయనకు భేదమే లేని అద్వైతం ఆయన సాధించాడు
.మహో న్నతా మానవతా మూర్తి అబ్రహాం లింకన్ అమర్ రహే .
9-8-2002 నా అమెరికా డైరీ నుండి మీ కోసం జేమ్స్ రస్సెల్ రాసిన వ్యాసం
చదివిస్పూర్తి పొ ంది రాసుకొన్న విషయాలివి
తాత్వికుడు థో రో
అమెరికా మహర్షి అనగానే హెన్రి డేవిడ్ తోరో గుర్తు కు వస్తా డు .మహాత్మా గాంధి
,వినోబా బభాయ్ లే కాక మార్టిన్ లూధర్ కింగ్ లాంటి నల్ల జాతి హక్కుల పో రాట నాయకుడికి
కూడా తోరో ఆదర్శం .స్వతంత్ర జీవి .బుద్ధి జీవి గా ప్రసిద్ధు డు
స్వతంత్ర వృత్తి గా lead పెంసిల్లను తయారు చేసి అమ్మే వాడు .ఆయనకు వడ్రంగి
పని బాగా వచ్చు .భూముల సర్వ్ చేయటం తెలుసు .వీటి వల్ల వచ్చే ఆదాయం తో
జీవించాడు బ్రతకటానికి మాత్రమె సరి ప డ సంపాదించటం ఆయన లక్షణం .దగ్గ రలోని
‘’వాల్దే న్ పాండ్ ‘’లో కుటీరం నిర్మించుకొని రెండేళ్ళు న్నాడు ప్రపంచం టో సంబంధం
లేకుండా .ఆయనకు ప్రకృతిని తీక్షణం గా పరిశీలించే తత్త ్వం ఉంది .ప్రక్రు తి అందాలన్నా శైలి
అన్నా మహా ఇష్ట పడే వాడు ఈయన ను ఆదర్శం గా చేసుకొనే గాంధీ సబర్మతీ ఆశ్రమం
స్తా పించాడు .ఇండియా లోఇలాంటి వారు సాధారణమే .కాని అమెరికా లో తోరో లాంటి
వారుండటం అత్యాస్చార్యమేస్తు ంది .ఇది ఒక రకం గా తొమ్మిదో వింత అని పిస్తు ంది .ఆయన
ఎన్నో పుస్త కాలు రచించాడు తన ఆత్మకధ గాwher i lived '' రాసుకొన్నాడు .
సంతోషం అనేది జీవిత నియమాలలలో ఒకటి అని ఆయన భావించాడు ‘’I SEE
THE CIVIL SUN DRYING EARTH’S FEARS –HERE TEARS OF JOY WHICH
ONLY FASTERFLOW ‘’అని కవితాత్మకం గా చెప్పాడు .అడవులు అంటే సహజ
పట్ట ణాలన్నాడు . ఆయన దృష్టిలో’’man is the fiercest and cruelest animal ‘’. ఏ
ప్రభుత్వం తక్కువ గా పాలిస్తు ందో అదే అసలైన ప్రభుత్వం అంటాడు – ‘’that government is
best which governs least ‘’అంతే కాదు that government is best which governs not at
all ‘’అనీ అన్నాడు .ప్రభుత్వ దాస్టేకాన్ని ఎదిరించాడు సహాయ నిరాకరణ చేశాడు .అందుకే
ప్రభుత్వం పై ‘’under a government which imprisons any unjustly ,the true place for a
just man is also a prison ‘’అని తన అరెస్ట్ ను గురించి చెప్పాడు ఆయన జైల్లో ఉన్న
సంగతి తెలిసిన వేలాది ప్రజలు జైలు దగ్గ రకొచ్చి విడుదల చేయ వలసిందిగా అధికారులను
ఒత్తి డి చేశారు సాదు ,సత్ప్రవర్త కుడు జైలు లో ఉండటం ఆ ప్రజలు జీర్ణించుకోలేక పో యారు
.అది వారి సత్యాగ్రహం అదే తర్వాతా అందరికి మార్గ దర్శస్క మైంది
ఆయన ఎప్పుడూ ప్రజా పక్షమే .ప్రజా వ్యతిరేక మైన ఉత్త ర్వులను అమలు చెయ్య
దలిస్తే అధి కారులు ముందు రాజీ నామ చేయాలని చెప్పాడు .is there not a sort of blood
shed which the consciousness wounded ?’’అని ప్రశ్నించాడు ‘’through this wound ,a
man’s real wound ,a man’s real manhood and immortality flow out and he bleeds
to an ever lasting death .i see this blood flow now’అన్నాడు .
ఒంటె మన ఆదర్శం అని చెబుతూ ‘’you must walk like a camel which is said
to be the only beast which ruminates when walking ‘’అని వివరణ నిచ్చాడు .ఒంటె
నడుస్తూ నెమరు వేస్తు ంది అలా మనమూ ఏపని చేసిన పాతది గుర్తు చేసుకోవాలని అర్ధం
.ప్రక్రు తి కవి వర్డ్స్ వర్త్ ను గురించి ఆయన సేవకుడిని అడిగితే అతడు ‘’here is his
library .but his study is out of doors ‘’అని చెప్పిన విషయం తోరో కు కూడా వర్తిస్తు ంది
ప్రకృతి ప్రేమికుడు ఆయన .ఎన్నో అరుదైన విషయాలను సేకరించాడు అటవీ సంపద అంటే
ఆయనకు యేన లేని మోజు దాని గురించి ‘’ wildness is the preservation of the
world .From the forests and wildness came the tonics and barks which brace man
kind.the most alive is the wildest .’’అని సిదాన్తీ కరించాడు .
అమెరికా ప్రజలు ‘’should work the virgin soil ‘’అని హిత బో ధ చేశాడు సాహిత్యం లో
wild అనే మాటే తనకు అత్యంత ప్రీతికరం అన్నాడు .తోరో may be ‘’అనటానికి బదులు
‘’perchance ‘’అని ఉపయోగిస్తా డు ఈ మాట ఆయన రచనల్లో చాలా సార్లు కనీ పిస్తు ంది
మహా భారత కధనం లో ఆది వరాహం పై దిగ్గజాలు ఉన్నాయని ఉంది దాన్ని తోరో
సమర్ధించాడు fossil tortoise has lately been discovered in India large enough to
support an elephant ‘’ ఆయన దృష్టిలో మంచి పను లన్నీ ‘’wild and free ‘’ భారత
ఇతిహసా లను తన రచనలలో ఉదాహరించాడు అందులో జడ భరతుని కద కూడా ఉంది
.ఆయనకు పేరు లేదనీ ఆయన కీర్తియే ఆయన పేరు అన్నాడు .
నీప్సి అనే ఫ్రెంచ్ ఆయన ఒక విషయం కనీ పెట్టా డని తోరో చెప్పాడు .దీనిని ‘’actinism
‘’అంటారట .అదేమిటంటే సూర్య రశ్మి ప్రభావం వల్ల గ్రా నైట్ రాళ్ళు ,రాతి నిర్మాణాలు లోహ .
విగ్రహాలు సూర్య కాంతి పడి నంత సేపు దెబ్బతింటాయి అయితే రాత్రి వళలలో మళ్ళీ
పున్జు కొంటాయట అంటే తెల్ల వారే సరికి మళ్ళీ యదా స్తితికి వస్తా యట .అంటే రాత్రి ఎంత
అవసరమో నిద్ర ఎంత ముఖ్యమో దీని వల్ల తెలుసుకోవాలని ఆంతర్యం.
చివరిగా అన్ని ప్రభుత్వాలు తెలుసుకో దగ్గ సత్యాన్ని చెప్పాడు ‘’the effect of good
government is to make life more valuable .’’
ఫాక్నర్ చిన్నప్పటి నుంచే బొ మ్మలు వేసే వాడు .అప్పటికే లా ,మెడికల్ పుస్త కాలు
చదివేశాడు .కాని గ్రా డ్యుయేట్ కాలేక పో యాడు .అందరికంటే తెలివి తేటలలో ఆధిక్యం గా
ఉండేవాడు .ఎస్తేల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డా డు .ఆ ప్రేమ విఫలమైంది .ఫైల్ స్ట న్ అనే
అతను ఫాక్నర్ కు మంచి పుస్త కాలు ఇచ్చి చదమని ప్రేరేపించాడు .అప్పుడే మొదటి ప్రపంచ
యుద్ధ ం ప్రా రంభమైంది ..కెనడా వెళ్లి ఎయిర్ ఫో ర్స్ లో చేరాడు . ఆం హీర్స్ట్లోని యాంగ్ అనే
అమ్మాయిని పెళ్లి చేసుకొని యూరప్ వెళ్లి అక్కడి మేధావులతో కాలక్షేపం చేశాడు .బాల భట
సంఘానికి నాయకుడు గా పని చేశాడు .తాగుడు విపరీతం అయి నందు వల్ల పీకేశారు
నెమ్మదిగా ఫ్రెంచ్ భాష నేర్వటం మొదలు పెట్టా డు .కార్టూ న్లు గీసే వాడు ఇన్ని తెలివి
తేటలున్నా అందరు అతన్ని ‘’ఫూల్ ‘’అనే వారు ..1919 లో కవిత్వం రాయటం మొదలు
పెట్టా డు .1920 లో Falkner గా ఉన్న తన పేరును తానే Faulkner గా మార్చుకొన్నాడు
‘’The lilacs ‘’ .అనే కవితా సంపుటిని రాసి విడుదల చేశాడు .తరువాత ‘’విజన్స్ ఇన్
స్ప్రింగ్ ‘’రాశాడు .అతని కవిత్వం లోని సింబాలిక్ ఇమేజేరి అందరికి నచ్చింది .దీని తర్వాతా
‘’మార్బుల్ పాం ‘’అనేది కవితా సంపుటి రచించాడు .తర్వాత ఫాక్నర్ ధ్యాస అంతా నవలల
మీదే పడింది .mosquitoes ,soldier’s pay నవలలు రాశాడు .1927 లో ‘’ఫ్లా గ్స్ ఇన్ ది డస్ట్
‘’ రాశాడు .ఫాల్క్నర్ రచనలను విశ్లేషకులు జేమ్స్ జాయిస్ ,డాస్తో విస్కీ రచనల తో
పో ల్చారు .మంచి ప్రో త్సాహం లభించింది .అతను రాసిన సౌండ్ అండ్ ఫ్యూరీ
నవలను”’Greek tragedy in North Msisipi ‘’ అన్నారు
ఫాక్నర్ చిన్న కధలు కూడా రాశాడు .పవర్ ప్లా ంట్ లో రాత్రి డ్యూటీలు చేశాడు ఆ
సమయం లో ఎన్నో చదివాడు ఎంతో రాశాడు .1929-32 మధ్య ‘’As I lay dying ‘’నవల
రాశాడు .దీనికేమీ విశేష ప్రా చుర్యం రాలేదు పెద్దగా అమ్ముడు కూడా పో లేదు .దీని తర్వాత
‘’sanctuary ‘’రచించాడు .దాన్ని ‘’one of the terrifying books ‘’అని జనం మెచ్చారు
.ఎంతో అరుదైన గొప్ప పుస్త కం గా దానికి పేరొచ్చింది .ఫాక్నర్ మేధో విలసితం అని కీర్తించారు
.ఆ పుస్త కాన్ని మన’’ గుడి పాటి వెంకట చలం ‘’పుస్త కాలను ఆకాలం లో ఎలా రహస్యం గా
కొని ఎవరికీ కనపడ కుండా దాచుకొని రహస్యం గా చదివే వారో అలా చదివారు ‘’these 13
‘’అనే కధలు.’’డార్క్ హౌస్ ‘’అనే నవలా రాశాడు .భార్య కోరిక పై దాని పేరు ను ‘’light in
August ‘’గా మార్చాడు .ప్రా చుర్యం పెరిగి పో యింది ఫాక్నర్ ఏది రాసినా ప్రచురించే స్తితి లోకి
పబ్లి షర్లు తయారయ్యారు .అంతకు ముందు తన పుస్త కాలను ప్రచురించమంటే తిరస్కరించిన
పబ్లి షర్లు ఇప్పుడు ఫాక్నర్ ఇంటి మూడు ‘’క్యూ కట్టా రు ‘’ఆయన దయా దాక్షిన్యాలకోసం
ఎదురు చూశారు .పిచ్చ డబ్బు రావటం ప్రా రంభమైంది దీని తో తాగుడూ పెంచేశాడు అతనికి
ప్రైవేట్ జీవితమే ఎక్కువ .ఇంకేముంది సినిమా వాళ్ళు వెంట బడ్డా రు .సినిమాలకూ పని
చేశాడు
Sanctuary నవలను పారామౌంట్ దియేటర్ వాళ్ళు’’ క్లా ర్క్ గేబుల్ ‘’ను హీరో గా
పెట్టి సినిమా తీశారు .తరచూ యూరప్ పర్యటన చేసే వాడు ‘’ In Europe people asked
what he thought ,but in California people asked where he had bought his hat ‘’అని
తానే చెప్పుకొన్నాడు ఆ దేశాలకు ,అమెరికా కు ఉన్న తేడాను దీనితో ఆవిష్కరించాడు .1932
లో తండ్రి చనిపో యాడు ఫాక్నర్ కుటుంబ బాధ్యతలను మీద వేసుకొన్నాడు మారుటి తల్లి
చనిపో తే దగ్గ రుండి అంత్య క్రియలు చేశాడు .’’mammy her white children bless her
‘’అని సమాధి మీద కృతజ్ఞ తా పూర్వకం గా రాయించాడు .1933 లో ‘’Absalom ,Absalom
‘’నవల రాశాడు .తాను రాసిన ‘’the un vanquished ‘’నవలను m.g.m.స్టూ డియో వారికి
అమ్మేశాడు .1935 ఫాక్నర్ కు జాతీయ గౌరవం లభించింది .ఆయన్ను ‘’లిరిక్ పో యేట్ ‘’అని
కొని యాడారు .అంతే కాక most impressive novelist ‘’అని ప్రశంసించారు ‘
భార్య ఎస్తేల్లా తాగుడుకు బానిస అయింది .చికిత్స చేయించాడు .విడాకులు మాత్రం
ఇవ్వలేదు .నౌకాయానం వేట గుర్రపు స్వారీ అన్నీ నేర్చాడు 1940 లో మూడు నవలలు ‘’the
wild palms ,the hamlet godown moses ‘’నవలలు రాసి ప్రచురించాడు .అతని సాహితీ
వ్యాసంగానికి అబ్బుర పడి న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యు లో ‘’declared that no living
American author could match Faulkner ‘’అని మహో న్నతం గా కీర్తించింది .ఆయన తో
జరిపిన ఇంటర్వ్యు ను m.g.m. సంస్థ సినిమా తీసిందంటే ఫాక్నర్ ప్రా భవం ఎంత ఉత్కృష్ట
స్తా యి లో ఉందొ తెలుస్తో ంది .
విలియం ఫాక్నర్ గొప్ప ఫిలాసఫర్ .ఆయన భావాలు ఉన్నతం గా ఉంటాయి .’’The
poet’s voice need not merely be the record of man ,it can be one of the props ,the
pillars to help him endure and prevail ‘’అని అంటాడు .ఆయన భావన లో ‘’man will
not merely endure he will prevail ..He is immortal not because he alone among
creatures has an in exhaustible voice .but because he has a soul ,a spirit capable of
compassion and sacrifice and endurance.’’
Cosmosis of my own .i can move these people around like God not only in space
but in time too ‘’అని చెప్పుకొన్నాడు .అతని దృష్టిలో గతం అనేది లేదు .ఉన్నది అంతా
వర్త మానమే ..దీని విషయమై ఆయన ‘’if was existed there would be no grief or
sorrow .’’అన్నాడు ..ఫాక్నర్ ఇరవై ఏళ్ళలో ముప్ఫై పుస్త కాలు రాశాడు .ఆయన రచనల్లో
హాస్యం తో బాటు అతి వాస్త వికత అంచు గా కనీ పిస్తు ంది .ఆయన కళ హాస్యమే .అమెరికా
రచయితల గురించి ‘’one trouble with us American artists is that we take out art and
ourselves too seriously .’’ .
ఆయన రాసిన ఏ రోజ్ ఫర్ ఎమిలి లో హాస్యం అది వాస్త వికత ఉంది క్లా సిక్ అని
పించింది .సార్తా రిస్ పెద్దకద .హాస్యం ,ప్రా ంతీయ మాండలికాలు అసందర్భాలు నీచ హాస్యం
అన్నీ నింపాడు నీగ్రో హాస్యం అన్నారు దీన్ని విమర్శకులు .అందుకే అయన హ్యూమర్
క్క్రూరం గా విషాదాత్మకం గా ఉంటుంది అన్నారు అవి కధలో అంతర్భాగం గా చొప్పించటం
ఆయన నేర్పు .ఫాక్నర్ రచనలలో నాలుగు టెక్నిక్స్ ఉన్నాయి .వయోలెన్స్ ,టైం మేనేజ్
మెంట్ ,కౌంటర్ పాయింట్ ,ఇమేజేరి .
రచయిత ఉద్దేశ్యాన్ని గురించి చెబుతూ ‘’the aim of every artist is to arrest
motion which is life ,by artificial means and hold it fixed so that 100 years
later ,when a stranger looks at it ,it moves again since it is life ‘’అని చెప్పాడు .moral
out come is despair అనేది అతని అభిప్రా యం .మనిషి ఓర్పు పట్ట టమే కాదు బతకాలి
,నిలబడాలి అని చెప్పాడు .అయన రచనల్లో జీవితం లోని విస్త ృతి ,దాని ప్రభావం కని పిస్తా యి
..ఆయన ‘’he has added life to life and a world of richly imagined motion to the
moving world in which we live ‘’ఉంది. ఒక పాత్ర భూతకాలం లో ఉంటె రెండో ది
వర్త మానం లో ప్రవర్తిస్తు ంది
అమెరికా ప్రఖ్యాత రచయిత ఎర్నస్ట్ హెమింగ్వే ఎందరికో స్పూర్తి ,ప్రేరణ .నోబెల్
బహు మతి గ్రహీత అయిన ఆయన గురించి తెలుసు కొందాం .
‘’ The sun also rises ,’’men without women ‘’రచనలు చేశాడు కొడుకు రాసే
వేవీ తలి దండ్రు లు మెచ్చుకోలేదు .ఫ్లా రిడా రాష్ట ం్ర వెళ్లి ‘’.A farewell to arms ‘’నవల
రాశాడు .ఎలిజ బెత్ కు గూడబై చెప్పి పాలిన్ ను పెళ్లి చేసుకొన్నాడు .హెమింగ్వే తల్లి తండ్రీ
ఆత్మా హత్యలు చేసుకొన్నారు .death in the after noon ‘’రాశాడు .పాలిన్ తో జపాన్ కు
హనీ మూన్ కు వెళ్ళాడు .అక్కడ ఇతని రాత గొడవ చూసి ఆమె సహించలేక పో యింది
‘’what I want ed was a wife in bed at night not somewhere ever having higher
adventures at so many thousand backs the adventure ‘’ అంటూ ఆవిడ జర్నలిజానికి
ఇష్ట పడ లేదు అందుకని సహాయ నిరాకరణ చేసింది .ఇప్పటికి ముగ్గు రయ్యారు .నాల్గ వ భార్య
గా మేరీ రంగ ప్రవేశం చేసింది .అప్పుడే across the river and into the trees ‘’రాశాడు
.ఆఫ్రికా వెళ్లి సఫారీ చేశాడు సముద్రా ల పై సుదూర ప్రా ంతాలు పర్య టించాడు గుర్రా లను
పెంచాడు .
1952 లో the old man and the sea ‘’అనే చిన్న నవల రాశాడు ఇది పెద్ద హిట్
అయింది దీనికే1954 లో నోబెల్ బహుమతి పొ ందాడు .5,300,000 పుస్త కాలు అమ్ముడు
పో యాయి ఇది రికార్డు సృష్టించింది అంతకు ముందు1953 లో పులిట్జ ర్ బహు మతి
వచ్చింది ఈ నవల మాస్ట ర్ పీస్ గా పేరొందింది .ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు .తాగుడు
విపరీతమయింది .ఇరిటేషన్ పెరిగి పో యింది .క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో హేమింగ్వే
రాసిన అన్ని పుస్త కాలను స్వాధీన పరచు కొంది .అప్పుడు హెమింగ్వే కు బ్రేక్ డౌన్ వచ్చింది
.’’paranoid delusion ‘’ తో విపరీతం గా బాధ పడ్డా డు బి.పి.బాగా పెరిగి పో యింది కంట్రో ల్
కావటం లేదు .’’talking psychiatri therapy ‘’ఏమీ ఫలించలేదు .దీన్ని ఒద్దు అని
తిరస్కరించాడు .తర్వాతా ‘’షాక్ థెరపీ ‘’చేశారు .దీనికే ‘’electro convulsive therapy
(e.c.t.)అని పేరు .దీని వల్ల జ్ఞా పక శక్తి పూర్తీ గా దెబ్బతిన్నది .ఆస్పత్రి లోనే తుపాకి తో
కాల్చుకొని1962 లో ఆత్మా హత్య చేసుకొన్నాడు .
హెమింగ్వే చని పో యిన తర్వాతా ముద్రింప బడిన ఆయన ‘’the big bite ‘’అనే పుస్త కానికి
ముందు మాట రాస్తూ నార్మన్ మైలర్ అనే ప్రముఖ రచయిత ‘’Hemingway ‘s inner
landscape was a night mare and he spent his nights wrestles with gods –what he
failed accomplished was heroic ‘’ అని కీర్తించాడు .
హెమింగ్వే గురించి చదువు తుంటే ఒకటి జ్ఞా పకం వస్తో ంది .2002 మార్చి
11,12 తేదీలలో విజయ వాడలో భారతీయ సాహిత్య పరిషద్ శ్రీ బాపట్ల రాజ గోపాల రావు
గారి ఆధ్వర్యం లో నిర్వహింప బడింది .నేనూ మా బావమరది ఆనంద్ వెళ్లా ం .అక్కడే శ్రీ ప్రో లా
ప్రగడ సత్య నారాయణ రావు గారితో పరిచయం అయింది. ఆ సభకు ఎందరో సాహితీ
ప్రముఖులు విచ్చేశారు .రెండు రోజులూ కాఫీ టిఫిన్లు భోజనాలతో చాలా హుషారుగా సభా
నిర్వహణ జరిగింది ..మంచి కద పై మాట్లా డ మని అందర్నీ కోరారు నేను శ్రీరమణ రాసిన
‘’మిధునం కధ ‘’పై రెండే రెండు నిముషాలు మాట్లా డాను .చాలా గొప్ప కద అని
మెచ్చుకోన్నాను .సభ అయిన తర్వాతా ప్రో లా ప్రగడ వారు నా దగ్గ రకు వచ్చి ‘’మంచి కధను
మీరు గుర్తు చేశారు ‘’అని ఆప్యాయం గా కౌగలించుకొని అభి నందించారు .
ఆ సాయంత్రం జరిగిన సభలో ప్రో లా ప్రగడ వారు గొప్ప ఉపన్యాసం ఇచ్చారు
.అందులో విశ్వనాధ సత్య నారాయణ గారు తనను ‘’ఒరే !1954 లో నోబెల్ ప్రైజ్ హెమింగ్వే
కు ఎందుకోచ్చిందో తెలుసా ??’’అని అడిగితే తెలీదని తాను చెప్పానని అప్పుడాయన ‘’ఒర్
సత్యం ! నేను హెమింగ్వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సి’’అమెరికా నుంచి తెప్పించుకొని
చదివాను. దానికి ఇచ్చార్రా నోబెల్ .అందులో ఏమీ లేదు .మన భగవద్ గీత లో చెప్పిన
దాన్నే వాడు చాలా చక్క గా మనసుకు హత్తు కోనేట్లు చెప్పాడ్రా .మన పని మనం చెయ్యాలి
ఫలితం భగవంతునికే వదలాలి అన్న సూక్ష్మాన్ని హెమింగ్వే గొప్పగా డెవలప్ చేసి నవల రాసి
నోబెల్ ప్రైజ్ పొ ందాడ్రా ‘’అని ప్రో లా ప్రగడ వారు గుర్తు చేసుకొన్నారు .
ఇంకో విశేషం ఏమిటంటే ఈ రోజుకు నాలుగు రోజుల క్రితమే అంటే ఆగస్ట్ చివర్లో
ప్రో లా ప్రగడ సత్య నారాయణ గారు మరణించి నట్లు ’’ ఆన్ లైన్ టి.వి.న్యూస్ ‘’చూశాను .ఈ
విధం గా హెమింగ్వేను , ,ప్రో లా ప్రగడ వారిని స్మరించుకొనే అవకాశం కలిగింది .
ఎర్నెస్ట్ హెమింగ్వే -2
హెమింగ్వే కల్లో ల ప్రపంచాన్ని గురించి రాశాడు అతని హీరోలు నిజాయితీ తో ఆత్మ
గౌరవసం తో ఉంటారు .ఆయన్ను ‘’Hemingway veteran out of wars before he was
twenty ,famous at twenty five ,thirty a master ,whitted a style carved in
hardwood ,to tell hard stories .bloodied prize fighters ,hired killers ,disimbowled
bull fighters ,crippled soldiers ,hunters of wild animals ,deep sea fishermen –
hemingway’s favourite characters are men wh deal in death and accept its risk
‘’అని ఎస్టిమేట్ చేశాడు మాక్ లీష్ అనే విమర్శకుడు .ఆయన్ను రిలీజియస్ రైటర్ అన్నారు
.హెమింగ్వే శైలి యేఆయన హీరో .ఆ స్టైల్ అనితర సాధ్యమని పించిన మహా రచయిత
హెమింగ్వే .జీవితపు ఓటమిలో బాగా తన పాత్రను నిర్వహించాడు .
అందరు మర్చి పో యిన ,వదిలేసిన పాత్రలకు జీవం పో సి కధలు రాశాడు .అతని
పాత్రలన్నీ భయం ,ఒత్తి డి తో నిత్య పో రాటం తో కనిపించటం ప్రత్యేకత .అతనిదో వింత ప్రపంచం
.అక్కడ పరిస్తితులు పెరగవు ఫలితాలనివ్వావు .అవి చితికి శల్యమై శిధిల మవుతాయి
.అందుకే అతన్ని గురించి ‘’he attempts t deal with the fear of fear ‘’అనిచెబుతారు
.బుల్ ఫైటర్లు వీరోచితం గా పో రాడి నట్లు కనీ పించినా వాళ్ల కు శత్రు వు భయమే అన్నట్లు
అతని పాత్రలు ప్రవర్తిస్తా యి .
యుద్ధ ం లో గాయ పడ్డ ప్పుడు ఆ గాయం ఆయన శరీరానికే కాదు మనసుకు కూడా
తీవ్ర గాయమైందని భావించాడు .అతను రాసిన’’ for whom the bell tolls ‘’ రచన లో’’
సైకిక్ ట్రీట్ మెంట్ ‘’కు ప్రా ధాన్యత నిచ్చాడు .అతని విజన్ కు నేపధ్యం ఏమిటి అంటే
‘’శూన్య వాదమే’’ అంటే సత్యానికి ఆధారమైన విషయాలను తిరస్కరించటమే .యూరప్
రచయితల కంటే తీవ్రం గా స్వతంత్రం గా రాసి మెప్పించాడు .అతనికి మానవత్వం మీద
ప్రగాఢ విశ్వాసం సాను భూతి ఉన్నాయి ...అవే రచనలలో అంతర్వాహిని గా ఉండేట్లు రాశాడు
.’’his style is his greatest achievement ‘’అని ప్రశంశలు పొ ందాడు .అమెరికా సంస్కృతీ
లో మాన వత్వం లోపించటం పై తీవ్రం గా కలత చెందిన మానవీయుడాయన .
తన రచన ‘’to have and have not ‘’లో మానవుడి స్వార్ధం ,శారీరక సుఖాల పై ఆశ
,బాధ్యతా రాహిత్యాన్ని తీవ్రం గా విమర్శించాడు.అయన చిత్రించిన వ్యభిచార పాత్రలు అమెరికా
వారివే .అతని స్టైల్ గురించి గొప్ప కితాబు ఇస్తా రు ‘’he sought a new kind of prose that
would be capable f expressing ‘’the realthing’’even beyond the third dimension
confusion which was half the terror f living ‘’శైలి విషయం లో ఇంతటి పేరు పొ ందిన
వారు అమెరికా రచయితలో లేరు అని పించుకొన్నాడు మొదలు పెడిత ే ప్రవాహ వేగం లో
కొట్టు కు పో యి నట్లు గా ఉంటుంది అంతా అయిన తర్వాత ఎంతో రిలీఫ్ కానీ పిస్తు ంది
.’’living up to it to write it down ‘’అన్నది హెమింగ్వే ఆలోచన .దాన్నినే అనుసరించాడు
విజయంసాధించాడు .
ఆఫ్రికా దేశం వెళ్లి సఫారి చేశాడు . ఎన్నో జంతువుల్ని ‘’సఫా ‘’చేశాడు ’గల్ఫ్
సముద్రా లలో ఈడాడు .మనుష్యుల్ని సన్నివేశాలను పిండేశాడు .ఇవన్నీ చిన్న కధలకు
,నవలలకు నేపధ్యమైనాయి .అన్ని రకాల పదార్ధా లు తిన్నాడు .అన్ని రకాల మత్తు
పానీయాలు రుచి చూసి నిగ్గు తేల్చాడు ..అతనికి ఆహారం లో ‘’రొమాన్సు ‘’కనీ
పించిందని చెప్పాడు .మిగిలిన చోట్ల రొమాన్సు అదృశ్యమైతే అది ఆహార పదార్ధా లలో
దొ రికిందని అన్నాడు .
కాన్కార్డ్ తో స్నేహం హెమింగ్వే ను ప్రభావితం చేసింది .ఆయన ఇచ్చిన పుస్త కాలు
చదివి ప్రేరణ పొ ందాడు .ఆయన రచనలు కూడా ఇతన్ని ప్రభావితం చేశాయి ..చని
పో యినతర్వాత రెండు దశాబ్డా లకాలం హెమింగ్వే రచనలను విమర్శకులు పట్టించుకోలేదు
.తరువాత అతని ప్రభావం తెలుసుకొని ఆరాధించారు .అందులో కొత్త కోణాలను దర్శించారు
.అంత మాత్రం చేత పాఠకులేవ్వరూ ఆయన రచనలను చదవకుండా వదల లేదు క్రేజ్ గా
చదువుతూనే ఉన్నారు అతని ఆకర్షణ ప్రభావానికి లోను కాని వారు లేరు. యువ
రచయితలకు ఆరాధ్యదైవం హెమింగ్వే .ఆయన జీవితకాలం లో ఎన్నో సందికాలాలను
చూశాడు .(transishans ).’’అతని రచనా వ్యాసంగం బాధ్యతా రాహిత్య ప్రపంచాన్ని ఎదిరించే
ఆయుధం .
‘’మోబీ డిక్’’ అనే నవల ప్రపంచ ప్రా ముఖ్య రచనలలో ఒకటి.దానిని యదార్ధ సహస
గాధ అని కానీ అందులో వేదాంత ధో రణి అంతర్గ తం గా ఉందని అన్నారు .దాని రచయిత
అమెరికా కు చెందిన హెర్మన్ మెల్ విల్లీ .1819 లో అమెరికాలో న్యూయార్క లో పుట్టా డు
.ఎనిమిది మంది గల సంతానం లో రెండవ వాడు .1830 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం లో
కుటుంబం చిన్నా భిన్నమైనది అనేక ఊళ్ల లో టీచర్ గా పని చేసి కుటుంబాన్ని పో షించాడు
మెల్ విల్లీ ..ఇరవై ఏళ్ళకే ‘’fragments from a writing desk ‘’రాశాడు .లివర్ పూల్ కు షిప్
జర్నీచేశాడు .షిప్ లో బాయ్ గా పని చేశాడు .ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి ఉన్నదంతా
అమ్మేసి చేతులు దులుపుకు కూర్చుంది .మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు .అక్కడెంత
ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు .’సముద్రం లో ’వేల్స్ ‘’ను పట్టే కార్యక్రమం ‘’వేలింగ్
‘’చెయ్యాలని పించింది
సౌత్ అట్లా ంటిక్ లో ఆకునేట్ అనే పడవ లో ‘’వేల్ హంటింగ్ ‘’కు బయల్దే రాడు .కేప్
హార్న్ చేరగానే తోబీ గ్రీన్ అనే వాడి తో కలిసి సముద్రం లోకి దూకి పారి పో యాడు’’ .typee
island చేరారు .అక్కడ నరమాంస భక్షకులున్నారు .వారితో కలిసి ఉన్నాడు .వాళ్ళు అతన్ని
చంపక పో వటం అదృష్ట ం .వాళ్ళ తో కలిసి జీవించాడు వాళ్ళలో ఒకడైపో యాడు తర్వాత
అక్కడి నుండి ఆస్ట్రేలియా షిప్ లో చేరి బయట పడ్డా డు ,అయితే షిప్ కెప్టెన్ తో గొడవ పడ్డా డు
.క్రిస్టియన్ మతస్తు లు అమెరికా లోని నేటివ్ అమెరికన్ల ను తమ మతం లోకి మార్చతాన్ని
తీవ్రం గా వ్యతిరేకించాడు మెల్ విల్లీ .
హవాయి ద్వీపం చేరుకొన్నాడు .రచన మీద మళ్ళీ గాలి తిరిగి’’typee’’ రాసి ప్రచురిస్తే
మంచి ప్రచారం లభించింది అందులో రాసిన వన్నీ తన స్వంత అనుభవాలే .1847 లో
‘’omoo ‘’రాసి పబ్లి ష్ చేశాడు ఎలిజబెత్ షా ను వివాహం చేసుకొన్నాడు .వారికి కూతురు
పుట్టింది .1939 లో ‘’రెడ్ బర్న్’’ రాశాడు దీనితో వాస్త వ చిత్ర రచయిత గా గొప్ప పేరొచ్చింది
.1949 లో ‘’మోబీ డిక్ ‘’నవల రాశాడు ‘’.నతానియల్ హతారన్’’ అనే అమెరికా ప్రసిద్ధ
రచయిత తో గాఢ పరిచయమేర్పడింది ..ఈ స్నేహం జీవితాంతం కోన సాగించాడు 160
ఎకరాల ఫారం హౌస్ను పిట్స్ ఫీల్డ్ లో కొన్నాడు .
‘’The house of seven gables ‘’నవల రాశాడు .1852 లో’’ మూడీ ‘’మారాడు
.సంపాదన తగ్గింది రాసిన వేవీ సక్సెస్ కాలేదు ..1855 లో నాలుగవ సంతానం ఆడపిల్ల
. .ఆర్ధికం గాను మానసికం గానూడిప్రేషన్ పాలైనాడు .భార్య ఇతని ధో రణికి తట్టు కో లేక
పో తోంది ఆమె తండ్రి మొగుడు పెళ్ళాలను స్కాట్లా ండ్ పంపాడు .1858 -60 లెక్చర్లు ఇస్తూ
కాలం గడిపాడు .అతని రచనలలో మెటాఫిజికల్ ,ఫిలాసఫీ ఉండటం జనం మెచ్చలేదు 1860
లో ప్రపంచాన్ని చుట్టి రావాలని ఓడలో ప్రయాణించాడు .మూడేళ్ళకు న్యూయార్క్ కు తిరిగి
వచ్చాడు .భార్య మెల్ విల్లీ ని వదిలేసింది కొడుకు ఆత్మ హత్య చేసుకొన్నాడు రెండో కొడుకు
సముద్ర యానం లో మరణించాడు .ఇవన్నీ తీవ్రం గా మెల్ విల్లీ ని బాధించాయి .
కొంత స్వస్త చేకూరిన తర్వాత ‘’బెల్లీ బడ్ ‘’నవల రాస్తే జనం బ్రహ్మ రధం పట్టా రు
1890 లో 71 వ ఏట మరణించాడు .అతని మరణ వార్త ను పేపర్లేవీ పెద్ద గా పట్టించుకో లేదు
ఒక చిన్న కాలం తో సరిపెట్టా యి .అతని రచనలలో విశ్వాశం, విశ్వాసానికివ్యతిరేకం గా
అసూయ ,మనుషుల గుడ్డినమ్మకం ఈ విశ్వాన్త రాల రహస్యం పై ప్రజలకు నమ్మకం లేక
పో వటం ప్రతి బిమ్బిస్తా యి .అయితే అతని చావు తర్వాత నిజం గానే మెల్ విల్లీ
పునర్జీవితుడయ్యాడు .అతని రచనలకు విశేష ప్రా భవం లభించింది .పాఠక హృదయాలలో
తిష్ట వేసుకొని కూర్చున్నాడు మోబీడిక్ రచయిత మెల్ విల్లీ .
మెల్ విల్లీ రాసిన మోబీ డిక్ నవలను మిల్ట న్ రాసిన డివైన్ కామెడి , షేక్స్ పియర్
రాసిన హామ్లెట్ నాటకం టాల్స్టాయ్ నవల వార్ అండ్ పీస్ లతో పో ల్చారు .ఆయన దేవుడితో
పో ట్లా డి నట్లు కనీ పిస్తు ంది .న్యాయ బద్ధ ం కాని ప్రపంచాన్ని సృష్టించాడని భగవంతుని పై
మెల్ విల్లీ కి కోపం అందరికి సమాన న్యాయం చేయలేదని దేవుడితో వైరం ..ఆయన్ను మంచి
హాస్య రచయిత అని , ,సాంఘిక జీవిత వ్యాఖ్యాత అని అంటారు ..ఆయన రచనల పై
వ్యాఖ్యానిస్తూ ‘’t has been left unread is unspeakably vaster than what has been said
‘’అని తేల్చారు .ఆయన రచనల్లో సమాప్తి ఉండదని కాని సమాప్తికి కావలసిన పరిష్కారాలు
ఉంటాయని చెబుతారు
.
ప్రఖ్యాత రచయిత డి.హెచ్.లారెన్స్ మెల్ విల్లీ పై అద్భుత మైన రెండు వ్యాసాలూ రాసి
ఆయన ప్రతిభా సర్వస్వాన్ని ఆవిష్కరించాడు .మెల్ విల్లీ కఠోర సత్యాలను రుజువు చేశాడని
,ఆయన ఒక గొప్ప దార్శనికడని ,స్విన్ బరన్ కవి విజన్ కంటే విస్త ృత మైన విజన్ మేల్లీ దని
,సముద్రా న్ని దాని పై జీవితాన్ని మెల్ విల్లీ ఆవిష్కరించి నట్లు ఎవరూ చేయ లేదని చెప్పాడు
. .సముద్రా న్ని సెంటి మెంటలైజ్ చేసిన ఘనుడు మెల్ విల్లీ అన్నాడు సముద్ర జీవుల వింత
ప్రవృత్తి ని ,వాటి ప్రతీకారేచ్చ ను కళ్ళకు కట్టిస్తా డు .అతను పిచ్చివాడూ కాదు ,క్రేజీ ఫెలో కూడా
కాదు .సరిహద్దు కు పైనే ఎప్పుడూ ఉంటాడు .అతను ఉత్త రదేశీయుడేకాక , .సముద్ర జీవి
.ఫసిఫక్
ి సముద్రా న్ని,అట్లా ంటిక్ సముద్రా న్ని ,మధ్యధరా సముద్రా లను ఆసాంతం
అధ్యయనం చేశాడు ..అతని దృష్టిలో నిద్ర అంటే కలలు కనటమే .
రాతి యుగం వారైన దక్షిణ సముద్ర వాసులను అతను చూసి వాళ్ళతో గడిపాడు .పసిఫక్
ి
సముద్ర హృదయం ఇంకా వింత గానే భావిస్తా డు .అది ఓక శూన్యం –వాక్యూం అన్నాడు
దాన్ని ..మానవత్వానికి దూరం గా ఆ సముద్ర ప్రజల ఆవాసాల్లో కి చేరి వారి తో
మమైక్యమైనాడు .ఈ ప్రపంచాన్ని మెల్ విల్లీ ద్వేషించాడు .మానవ అసహనాన్ని జీర్ణించుకో
లేక పో యాడు .మానవత్వం పై ద్వేషాన్ని ఎదిరించాడు .అతనికి అనాగరక మానవులే ఇష్ట ం
.తన తెల్ల జాతి నక్కల కంటే వీరు ఏంటో ఉదారులని భావించాడు .’’భూ ప్రపంచం లో అతి
మొరటోడు అమెరికన్’’ అన్నాడు .స్వర్గ ం ఉంది అని నమ్మిన వాడు మేల్విల్లీ .’’.he wants
Americans to fight with the weapons of the spirit not the flesh .The mills of god
were grinding inside him ‘’అని అతని హృదయాన్ని y ఎరిగించారు ...అతను పరిపూర్ణ స్త్రీ
ప్రేమికుడు స్తా యి నుంచి పరిపూర్ణ స్నేహితుని స్తా యికి ఎదిగాడు .
మేల్విల్లీ సూపర్ డూపర్ హిట్ నవల మోబీ డిక్ .దానికి మరో పేరు ‘’the white
whale’’ . ఇదే చివరి సింబాలిక్ వేట .అందులో సేమిమేటాలిక్ భావం తో నీటి గురించి
ప్ర్రా రంభించి నవల మొదలు పెడతాడు .ఇదే స్పృహ లేని తనం ..’’ఇస్రా యిల్ పాటర్
‘’నవలలో మగ వాడి శక్తి సామర్ధ్యాలను చిత్రించాడు .మోబీ డిక్ చదవాలి అంటే భారతీయ
ఇతిసాలను అధ్యయనం చేయాల్సిందే .మన విష్ణు మూర్తి ని వైట్ వెల్ లో అంటే తిమింగిలం
లో దర్శించాడు .విష్ణు వు దశావతారాలలో ఇది ఒకటి గా భావించాడు .భారతీయ భావన లో
నశించటం అంటే మళ్ళీ పుట్ట టమే దాన్ని మెల్ విల్లీ అద్భుత నైపుణ్యం తో ఈ నవలలో
చిత్రించాడు .అంటే మాట్చ్యావతారమే డిక్ అది వినాశనం చేస్తు ంది మళ్ళీ సృస్తిన్స్తుంది కూడా
.అది అరుదైన జంతువు.ఎన్నో రకాలుగా ఉప యోగపడుతుంది .దానిలో నుంచి spermacite
‘’అనే అరుదైన పదార్ధం తయారవుతుంది .అలా ఏ జంతువుకు ఇలాంటి పదార్ధా న్ని సృష్టించే
శక్తి భూ ప్రపంచం లో లేదు .దాని వీర్యం తో కొత్త జీవుల్ని సృస్టించ వచ్చు .దీపాలు వెలిగించ
వచ్చు .ఈ దీపాలు సముద్ర దీపాలుగా ఇంటి దీపాలుగా పనికొస్తా యి విష్ణు వు నామాలలో
ఒకటి ‘’విశ్వ రేతః ‘’అంటే విశ్వానికి వీర్య రూపం లో ఉన్న వాడు అని అర్ధం .అందుకే డిక్
అనే తిమింగలం సృస్తించ టానికే కాదు సర్వ వినాశనానికి కా రణ మయ్యే ప్రచండ శక్తి .
.సముద్రం లో దాని వేగం ,డాడి చేసే తీరు, పెద్ద నౌకల్ని తోక తో తలక్రిందులు చేసి నాశనం
చేసే విధానం చూస్తె మనకు తెలుస్తు ంది .
మార్క్ ట్వేయిన్ రాసిన ‘’హకల్ బెరిఫిన్’’ ఎలాగో, సాలినర్ రాసిన ‘’రై ‘’కూడా
అలాంటిదే .హక్ ను ఇందులోని హాల్డే న్ కాల్ఫీల్ద్ పాత్రతో పో లుస్తా రు విమర్శకులు .ఇద్ద రు
స్వంత అన్నా తమ్ముళ్ళు లాగా తమలోని అంతర్గ త భావాలను ,అంతర్ద్రు స్తిని తెలియజేస్తూ
అమెరికా జీవితాన్ని విమర్శిస్తా రు .మార్క్ ట్వేయిన్ ,సాలినర్ ఇద్ద రు చాలా స్పష్ట ం గా పాత్ర
లను చిత్రించారు .ఎక్కడా అసందిగ్ధం కనీ పించదు .హక్ లాగానే ,హాల్డే న్ కూడా ఒక
శరణార్దియే .సత్య పరీక్ష ఏ ఇద్ద రికీ కోలబద్ద .అందుకే ఈ రెండు నవలలు ‘’deal obliquely
and poetically with a major theme in American life past and present ,the right of
the non conformamist to assert his own conformity ,even to the point of being
handled with chain ‘’అని అభిప్రా య పడ్డా రు తులనాత్మక విమర్శకులు .
సాలినర్ రచనలో వ్యక్తీ నైజం ప్రతి బిమ్బిస్తు ంది .హాల్డే న్ భాష ‘’టీనజ్
ే ‘’వాళ్ళ భాష
గా ఉంటుంది .సంభాషణల్లో వ్యాకరణాత్మక తమాషాలు చేసి మాట్లా డిస్తా డు . ‘’it is a secret
between he and I ‘’అని పిస్తా డు .ఇందులో టీనేజర్ల గ్రా మర్ నిబంధనల ను అతిక్రమించటం
స్పష్ట ం గా ఉంటుంది .మన వాళ్ళు అన్నట్లు ’’ఛందస్సుల పరిష్వంగాలను విదిల్చి నట్లు
‘’ఉంటుంది .’’she would give Allie or I a push ‘’I would woke him up ‘’లాంటి
యువచిత్రా లను భాషలో చేయించాడు సాలినర్ .దీనిని అందరు అంగీకరించారు
.దీనికి’’authentic rendering of a type of informal ,colloquial teenage American
spoken speech ‘’అని కితాబు కూడా ఇచ్చి ప్రో త్సహించారు భాషా ప్రేమికులు .ఈ’’ టీనజి
ే
భాష’’కే .వ్యామోహం హెచ్చింది .అంతటి భాష పూర్వక మార్పు తెచ్చిన వాళ్ళు సాలినర్
అంతకు ముందు మార్క్ ట్వేయిన్ .
రాసిన నాలుగే నాలుగు పుస్త కాలతోఅందులో ఒకే ఒక నవల తో మహా రచయిత అని
పించుకొన్న వాడు అమెరికా రచయిత జెరోం డేవిడ్ శాలినర్ .1919 లో అమెరికా లోని
పెన్సిల్వేనియా లో జన్మించాడు .ఏదైనా రచయిత రాశాడు అంటే అది చదువరుల
హృదయానికి తాకి ఆ వెంటనే రచయిత తో ఫో న్ లో మాట్లా డాలి అని పించాలి అన్నాడు
సాలినర్ .అదే మంచి రచన అవుతుందని చెప్పాడు .
సాలినర్ రాసిన నాలుగు పుస్త కాలలో ‘’catcher in the rye’’కిఊహించ రానంత
పేరొచ్చింది .ఇరవై రెండు చిన్న కధలు రాశాడు .ఆయన తెలివి తేటలు అమోఘం .సాలినర్
కు చిన్నప్పుడు I.Q.115.ఉండేదట .1930 లో గ్రా డ్యుయేషన్ పూర్తీ చేశాడు .తండ్రి కి
ఆస్ట్రేలియా లో వ్యాపారం ఉంది .ఇతను 1941 లో ఆర్మీ లో ఉద్యోగం చేశాడు .అందులో ఇతని
పని counter intelligence ‘’లో .1944 జర్మన్ ఖైదీల ను ఇంటరాగేషన్ చేశాడు .రచయిత
హెమింగ్ వే తో పరిచయమేర్పడింది .ఫ్రెంచ్ వనిత సిల్వియా తో వివాహం .వెంటనే విడాకులు
.1946-50 కాలం లో పది చిన్న కధలు రాశాడు .అవి మినీ కధలే అయినా చాలామంది జనం
మాట్లా డుకొనే భాషలో ,వ్యంగ్యాత్మకం గా ఉంటాయి .అతని కధలను ప్రసిద్ధ కదా రచయిత
O..Henry తధలతో పో ల్చారు విమర్శకులు ..తాను పుట్టు క నుంచే రచయితను అని తనను
గురించి విశ్వాసం గా చెప్పుకొన్నాడు .అంతే కాదు తాను’’ born professional ‘’అనీ
చెప్పాడు .తను ఏది రాసినా యువత కోసమే రాశానని చెప్పుకొన్నాడు .కధల్లో ’’ ఐరనీ ,సెటైర్
‘’లను పుష్కలం గా నింపాడు .పేరు ప్రఖ్యాతులు పెరిగాయి హాలీవుడ్ సినిమాలకూ పని
చేశాడు ఆయన రచన’’ rye’’ ని సినిమా గా తీశారు అలాగే అతను రాసిన ‘’అంకుల్ విగ్లీ
‘’కధనూ సినిమా వాళ్ల కు అమ్మాడు .1950 లో ‘’మై ఫూలిష్ హార్ట్ ‘’ రాసి ప్రచురించాడు
.దీన్ని ఆ నాటి ప్రముఖ నటులు Dana Andrews ,,Susan Hayward లతో సినిమా గా
తీశారు .పెద్ద బాక్సాఫీస్ హిట్ సాధించింది .హేవార్డ్ కు ఉత్త మ నటి అవార్డు లభించింది
.తరువాత ‘’పారి ‘’ అనే కలం పేరుతో franny and zooley రాశాడు .
సాలినర్ రాసిన’’ కాచర్ ఇన్ ది రై’’ అతని రచనలలో ఉత్త మోత్త మ మైనది .ఇది
1961 లో 1.5 మిలియన్ల కాపీలుఅమెరికా లోనే అమ్ముడయ్యాయి ..కాలేజీ హైస్కూల్
విద్యార్ధు లు విపరీతమైన క్రేజ్ తో కొని చదివారు .1975 లో 9 మిలియన్ల కాపీలు ఖర్చు
అయ్యాయి .ఆ తర్వాతా ప్రతి నేలా 30,000 కాపీలు అమ్ముడవుతున్నాయి .దీనితో సాహితీ
రంగం లో సాలినర్ పై విపరీత మైన మోజు పెరిగింది .తర్వాతకాపురాన్ని న్యు హాంప్ షైర్ కు
మార్చాడు.1955 లో క్లైర్ డగ్లా స్ ను పెళ్ళాడాడు .1963 లో raise high the roof
beam ,carpenters and seymoor రాశాడు మళ్ళీ పెళ్లి పెటాకులై విడాకులు .సాలినర్
పుస్త కాలను నిషేధించాలని చాలా అమంది నుండి ఒత్తి డి వచ్చింది .కోర్టు మేట్లేక్కాడు .అయితే
ఇవన్నీ సాలినర్ కే లాభం చే కూర్చాయి .salinger is famous for not wanting to be
famous ‘’అను కొన్నారందరూ .’’slazenger ‘’అని నిక్ నెం తో పిలిచారు గిట్టని వాళ్ళు
.1997 లో హాప్ వర్త్ తో మళ్ళీ రచయిత గా పూర్వ వైభవం పొ ందాడు మొత్త ం మీద ఆఆతని
నవల ఒక్కటే మిగిలిన వన్నీ చిన్న కధలే .అతని రచనలలో ‘’జెన్ మతపు విస్తీర్ణత ఎక్కువ
గా ఉంది .స్ట్రెస్ అతినిరచనల్లో ప్రా ణం .యుద్ధ వ్యతిరేక నవల రాసి మహా కీర్తి
మంతుదయ్యాడు సాలినర్2010 జనవరి ఇరవై ఏడు న న్యు హాంప్ షిర్ 91 ఏళ్ళ వయసు
లో చనిపో యాడు
ట్రా లోప్ 1815 లో ఇంగ్లా ండ్ లో పుట్టా డు .తలిదండ్రు లకు దూరమై ఒంటరి జీవితం తో
ఇబ్బంది పడ్డా డు .దానినే ‘’I had no friend to whom I could pour out my sorrows .i
was big awkward and ugly and I have no doubt skulled about a most unattractive
manner ‘’అని రాసుకొన్నాడు .1830 లో తండ్రి అమెరికా నుంచి నష్ట పో యి వచ్చాడు .లండన్
లోని జెనరల్ పో స్టా ఫీస్ లో ఉద్యోగం .ఏడాదికి 90 పౌండ్ల జీతం .తర్వాతా పో స్ట ల్ సర్వేయర్
అయాడు ట్రా లోప్ .1843 లో మొదటి నవల ‘’the macdermot’s of ballyclorn ‘’రాశాడు
.గ్రా మీణ ఇంగ్లా ండ్ లోని పై మధ్యతరగతి గురించి రాశాడు .1867 లో 14 పుస్త కాలు రాశాడు
.రాజకీయ నవలలూ రాశాడు .స్వీయ జీవిత చరితన
్ర ూ రాసుకొన్నాడు .అందులో తను ఒంటరి
జీవితం లో కోల్పోయిన వన్నీ గుర్తు కు చేసుకొన్నాడు .తన పేదరికాన్ని స్నేహితులు
ఆదరించిన తీరును నవలాకారునిగా పొ ందిన కేర్తిని ఆర్ధిక పరం గా ఉన్నతుడైన తీరును
అందులో రాసుకొన్నాడు .అతనికి ప్రేమ కావాలి .ట్రా లోప్ ను మొదట అసహ్యించుకొన్న వారే
అతనికి తర్వాత బ్రహ్మ రధం పట్టా రు .ఆయన గురించి అందరు ‘’no man in London
society was more generally liked than Anthony Trallope ‘’అంటారు .1882 లో 67
ఏళ్ళ వయసులో చని పో యాడు .
ఆయన రచనలలో సామ్ప్రదాయిక సమాజం సాంఘిక ఆర్ధిక మార్పుల వల్ల ఎలా
భయపడి ఒణికి పో యిందో చర్చించాడు .అయన రచనల్లో వాస్త వం ఉంది .’’in this world
no good is un alloyed ,and that there is but little evil that has not in it some seed of
what is goodly ‘’అని అంటాడు .ఆయన ‘’లంప్ప్ ఆఫ్ ఎర్త్ ‘’గురించి రాశాడు .అతని
రచనలు నిజజీవితానికి ఫో టో కాపీ లా ఉంటాయని దేప్పే వారు .అందుకే జనం
పట్టించుకోలేదు .రచనల్లో సంప్రదాయ శృంగారం ఉంటుంది .అందమూ ,ఆకర్షణా లేని
ముసలి పని కత్తే ను హీరోయిన్ చేసి ‘’మిస్ మెకెంజీ ‘’నవల రాశాడు .దిక్లా వేరింగ్స్ లో స్త్రీ
అమాయకత్వాన్ని చర్చించాడు .ఇందులో ఎన్నో ఐరనీలు వాడాడు .సేక్సువాలిటిని చాలా
సీరియస్ గా తీసుకొని రాశాడు .సైకాలజీ కి మంచి ప్రా ముఖ్యతనిచ్చి రాశాడు .నిజమైన
మానవత్వం కోసం తపించి రాసిన రచయిత త్రా లోప్ .ప్రత్యెక పరిస్తితులలో పాత్రల నిజాయితీ
ని పరీక్షించాడు .వారి అనుమానాలు వారేదుర్కొన్న సామాజికాంశాల పై ఆధార పడి
ఉంటాయనిరుజువు చేశాడు .
‘’he is farless of a novelist than a good diner out ‘’అని’’ లైట్ ‘’గా
తీసుకొన్నారు ట్రా లోప్ ను .’’ఏదో లోపం ఉంది ఆయన నవలలో ‘’అన్నారు మరి కొందరు
.అయితే ఆయన రచనల్లో ఆంగ్లీయుల గృహ జీవితాలు ప్రతి బిమ్బించాయి .ఆయన్ను
పాతకాలపు భావాలున్న రచయిత అన్నారు ఆ రోజుల్లో ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్
ప్రభావం సమాజం మీద ఎక్కువ గా ఉండేది .వైల్డ్ కు కొత్త తరహా నవలా రచనా చాతుర్యం
ఉండటం తో ఆయన పై క్రేజ్ పెరిగింది .అసలైన సంప్రదాయాన్ని తిరస్కరించటం త్రా లోప్ కు
ఎదురు దెబ్బ తీసింది .అయితే ఇటీ వలి కాలం లో ఆయన పై మోజు బాగా పెరిగింది . .
మొత్త ం మీద ట్రా లోప్ 47 నవలలు రాశాడు .యాత్రా కధనాలు రాశాడు వ్యాసాలూ
,కధలు అనేక రచించాడు .ఇన్ని చేసినా చార్లెస్ డికెన్స్ కు వచ్చిన పేరు మాత్రం రాలేదు
.డికెన్స్ పదిహేను .టి.ఎస్.ఇలియట్ ఏడు మాత్రమె రాసినా వీళ్ళ నే జనం మెచ్చారు ఒక
రకం గా మన కొవ్వలి నరసింహా రావు రచనలలాంటివే ట్రా లోప్ చేశాడు కాలక్షేపం బఠానీలు
గా అవి పేరొందాయి .కాని కాల పరీక్షలో నిలవ లేక పో యాయి .ట్రా లోప్ పరిస్తితీ అంతే
అయింది ..
అసలు పేరు జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ .27-2-1902 లో అమెరికా లోని కాలిఫో ర్నియా
రాష్ట ం్ర లో సాలినాస్అనే చోట జన్మించాడు .అదొ క గొప్ప షిప్పింగ్ కేంద్రం .తండ్రి సంతానం లో
మూడవ వాడు బెక్ .చిన్నప్పటి నుండి చాలా తెలివి తేటలున్న కుర్రా డిగా కనిపించే వాడు
.అతని ద్రు ష్టి వ్యాపారస్తు ని లక్షణాల లాగా ఉంటాయని అనే వారు .మాటల శబ్దా లన్నా ,లయ
అన్నా బెక్ కు చాలా ఇష్ట ం . 1906 లో కాలిఫో ర్నియా లో భూకంపం వచ్చింది .అందరూ
భయ పడ్డా రు .1919 లో యూనివెర్సిటి ఆర్ట్స్ లో చేరాడు .డిగ్రీ పూర్తీ కాలేదు .లేబరర్ గా పని
చేశాడు .గంటకు ముప్ఫై రెండున్నర సెంట్ల జీతం .ఫామిలి కాటేజ్ అని పిలువ బడే ‘’పసిఫక్
ి
గ్రో వ్ ‘’లో నివాసం ఉన్నాడు .అప్పుడే ‘’ఏ పాట్ ఆఫ్ గోల్డ్ ‘’రాశాడు .న్యూయార్క్ వెళ్లి భవన
నిర్మాణ కార్మికుడిగా పని చేశాడు .తర్వాత ‘’అమెరికన్ ‘’అనే పేపర్ కి వారానికి ఇరవై
అయిదు డాలర్ల కు పని చేశాడు .1927 లో అంటే పాతికేళ్ళకు ‘’స్మోకర్స్ కంపానియన్
‘’ప్రచురించాడు .1929 లో సాన్ ఫ్రా న్సిస్కో నగరానికి వెళ్లి ఎర్నెస్ట్ హెమింగ్ వే ,హెన్రి డేవిడ్
తోరో ,వాల్ట్ విట్మన్ వంటి లబ్ధ ప్రతిసస్టు లైన అమెరికన్ రచయితల, కవులపుస్త కాలన్నీ చదివి
ప్రభావితుడయ్యాడు . ‘’అయిడియలిజం ‘’అంటే ఊహా లోక ద్రు ష్టి మీద మనసు పడ్డా డు .
కరోల్ అనే ఆమెతో ప్రేమ లో పడి పెళ్ళాడాడు .బెక్ ఏది రాసి పేపర్ల కు పంపినా తిరుగు
టపాలో తిరిగి వచ్చేవి .ఏ పేపరూ ప్రచురించేది కాదు. చాలా బాధ పడే వాడు ..రికెట్స్ అనే
అతని తో మంచి స్నేహం ఏర్పడింది .అతను ‘’మెరైన్ బయాలజిస్ట్ ‘’ సముద్ర జీవుల పై
ఎంతో పరిశోధన చేశాడు కొత్త జీవులను కనుగొన్నాడు .1932 లో ఆర్ధిక మాంద్యం ఏర్పడి
జీవితాలు దెబ్బతిన్నాయి .అప్పుడే ‘’pastures of Heaven ‘’అనే కధ రాశాడు .తర్వాత ‘’to
a god unknown ‘’నవల రాశాడు ..1932 లో గుండె పో టు వచ్చి ఆస్పత్రిలో చేరాడు .’’the
red pony ‘’,’’toitella flat ‘’కధలు రాసి ప్రచురించాడు .అతను రాసిన’’ దిమర్డ రర్ ‘’ కధకు
ప్రఖ్యాత కధకుడైన ‘’వో.హెన్రి ‘’బహుమతి లభించింది .1934 లో తల్లి మరణించింది .
నేచురలిజం మీద మోజు హెచ్చింది .మరుసటేడు తండ్రీ పో యాడు .1936 లో రాసిన
‘’మైస్ అండ్ మెన్ ‘’పుస్త కం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడయింది .దాన్ని నాటకం గా
మార్చి ప్రదర్శించారు .1937 లో ఈ నాటకానికి ‘’drama city award ‘’లభించింది .భార్య తో
తగాదా పడ్డా డు .’’ the grapes of wrath’’ అనే సీరియస్ నవల రాశాడు బెక్ రాసిన మిస్
,రెడ్ పో నీ లను సినిమాలుగా తీశారు .1940 లో మెక్సికో వెళ్ళాడు .అక్కడ ఎన్నో కధలను
విని తెలుసుకొని ‘’పెరల్ ‘’నవల రాశాడు .ది.గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘’కు పులిట్జ ర్ బహుమతి
వచ్చింది .తర్వాత ‘’సి ఆఫ్ కార్టే జ్ ‘’నవల పూర్తీ చేశాడు .1940 సి నిమాలకు
రాశాడు.అందులో ‘’the forgotten village .’’ఒకటి .భయానక సినిమాల సృష్టికర్త ‘’ఆల్ఫ్రెడ్
హిచ్ కాక్’’ తో ‘’లైఫ్ బో ట్’’ సినిమా చేశాడు .భార్య కరోల్ ఈయన్ని వదిలేస్తే గాప్ లేకుండా
‘’గ్వెన్ ‘’ను జీవితం లోకి ఆహ్వానించి పెళ్లి చేసుకొన్నాడు .ఇదే సమయం లో అతని ముఖ్య
స్నేహితుడు బయో శాస్త ్ర వేత్త ‘’రికెట్స్ ‘’మరణించాడు .అప్పటికే బెక్ రికెట్స్ పై ఎక్కువ గా
ఆధార పది ఉండటం రెండో పెళ్ళాం గ్వెన్ కు నచ్చేదికాదు .పెళ్లి పెటాకులే అయింది’’ .the
moon is down ‘’కద రచించాడు అందులో నాజీ దండయాత్రను గురించి వివరించాడు
.1943 లో లండన్ వెళ్ళాడు .తర్వాతా ఉత్త ర ఆఫ్రికా వెళ్లి సఫారి చేశాడు . 1945 లో ‘’the
cannery row ‘’నవల రాసి ప్రచురించాడు .మరో నాలుగేళ్ళకు’’ the wayward bus ‘’కద
రాశాడు .ఎలాన్ స్కాట్ తో మూడో వివాహం . .1951 నుండి బెక్ ప్రభావం తగ్గింది .జీవిత
కాలం లో మొత్త ం పాతిక పుస్త కాలు రాశాడు .అందులో పదహారు నవలలు , తొమ్మిది నాన్
ఫిక్షన్ రచనలు ,ఎన్నో కధలు రాశాడు . అతను ఎన్నో సముద్ర జీవులను కను గోన్నాడు
.కొన్ని అతని పేర పిలువ బడ్డా యి .
స్టెయిన్ బెక్ భవంతి సమాధి
1962 లో స్టెయిన్ బెక్ కు నోబెల్ సాహితీ పురస్కారం లభించింది .అప్పటికి ఆరుగురు
అమెరికన్ రచయితలకు ఈ అవార్డ్ వచ్చింది బెక్ ఏడవ వాడు .రాజకీయాలపై ఆసక్తి పెరిగి
అందులో చేరాడు .జాన్ ఎఫ్ కేన్నేడి ,లిండన్ జాన్సన్ లతో గాఢ పరిచయమేర్పడింది .66
ఏళ్ళ వయసులో1968 డిసెంబర్ ఇరవై న మహా రచయిత స్టెయిన్ బెక్ మరణించాడు .
స్టెయిన్ బెక్ పాత్రలన్నీ వ్యక్తీ గతమైనవి .అంతరంగాలలో అవి పూర్తీ స్వేచ్చను పొ ంది ,విభిన్న
స్వభావాలతో కనీ పిస్తా యి హాస్యం తో అందరితో మంచి సంబంధాలను కలిగి ఉంటాయి
.అమెరికా లోని నేచరిస్టు లు రెండు రకాలు .మొదటి రకం హృదయ వాదం అనేవారు
,రెండో రకం బుద్ధివాదులు .ఇందులో హృదయ వాదులలో బెక్ స్తా నం ఉంది .అతని ‘’కానరీ రో
‘’లో విషయాలకున్న డిమాండ్ కు ,హృయానికున్న డిమాండ్ కు ఉన్న స్పర్ధ వ్యతిరేకత
చిత్రీకరించాడు .పెరల్ నవల సీరియస్ ‘’పారబుల్ ‘’అన్నారు ఇందులో కినో అనే చేపల
వాడికి నాగరక జీవుల విషయం తెలీదు వారు తన లాంటి వారి ఉనికికే ప్రమాదం అనీ
గుర్తించలేని వాడు అతని అభిప్రా యం లో జ్ఞా నమే శక్తి వంతమైనది ,అంతేకాక ఈ భౌతిక
ప్రపంచం పై నియంత్రణ శక్తి కలిగి ఉండటం చాలా మంచిది .
బెక్ రాసిన ఏడు రచనలలో అరవై మంది మెక్సికన్ల పాత్రలను సృష్టించాడు .అతని రెద్
పో నీ నవల బెక్ యొక్క ‘’సెమి ఆటోబయాగ్రఫీ .’’ఇందులో’’సాలినాస్ రాంచ్’వాలీ ’’’ప్రజల
జీవన విధానాలను వివరించాడు .ఈ నవలలో కాల ,స్థ ల ,విషయ ఐక్యతను సాధించాడు
.ఇందులో జీవన మరణ చక్ర భ్రమణం చిత్రీక రించాడు ..మానవుడు మరణించినా కొత్త
జీవితానికి అది నాంది అవుతుందని తెలిపాడు అన్ని జీవరాసులలో ఒకే విశ్వ చైతన్యం
ఉందని తెలియ జేశాడు .మనకు తెలియనిది ఎంతో ఉంది అని కూడా బెక్ అభిప్రా య పడ్డా డు
.
పెరల్ నవలలో కినో శక్తి వంతమైన సంఘం చేత తిరస్కరింప బడి అణగ దొ క్కబడ్డ వాడు
అతన్ని నిమ్న జాతి జంతువుతో సింబాలిక్ గా వర్ణించాడు .కిమో లో ప్రిమిటివ్
లక్షణాలున్నాయని సాంఘిక శాస్త ్ర వేత్తలు అన్నారు .అయితే ‘’బెక్ దృష్టిలో కినో అంటే
వేరెవరో కాదు నువ్వు నేను ,మనం అందరం ‘’.అందులో ఆత్మ శక్తిని నిద్రలేపి ,ఉద్దీపనం
చేయాలనే భావం ఉంది .అతను వర్ణించిన చీకటి ‘’ఆత్మ ‘’కు సింబల్ ...మానవుని
అసహాయత ,నిస్సహాయత ఈ నవలలో శిఖరాయమానం గా వర్ణించాడు బెక్ .
తెలుగు లో రావి శాస్త్రి నవలలు ,కధలు లాగానే జాన్ స్టెయిన్ బెక్ నవలలన్నీ
‘’ప్రో లిటేరియన్’’మనుషుల కధలే .గ్రేప్స్ ఆఫ్ రాత్ లో’’ మా ‘’పాత్ర ముందు చూపున్న
మహిళ గా పడమటి ప్రా ంతానికి మెరుగైన జీవనానికి తన కుటుంబాన్ని తీసుకొని వెడుతుంది
.ఇక్కడ మా అంటే ఒక రకం గా ‘’భూ దేవి ‘’.ఆమె తన కుటుంబాన్నే కాక బయటి వారినీ
పెంచి పో షిస్తు ంది .ఆమె గౌరవాన్ని పొ ందుతుంది దానితో బాటు తనను నమ్ముకొని తన
నాయకత్వాన్ని అంగీకరించిన వారికి తన శక్తిసామర్ధ్యాలను రుజువు చేసి చూపిస్తు ంది .
‘’బన్యన్ ‘’ రాసిన దానిలో లాగా ఆవాసం లేక ,దుర్భర జీవితాలను గడిపే వారి పాలిటి
ఆత్మ ప్రబో ధ శక్తి గా బెక్ రచనలుంటాయి ..’’the problem of restoring to world’s
original and eternal beauty is solved by the redemption of the soul ‘’జాన్ బెక్
రచనలు ఉంటాయి బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాతమాత్రమె మీడియా బాగా గుర్తించి
‘’common man’s every day life ‘’గురించి రాసిన మహా రచయిత అని మెచ్చింది .కొద్ది
మంది పత్రికా రచయితలు పెదవి విరిచారు .1935 కు ముందు బెక్ రాసిన రచన లను
దృష్టిలో పెట్టు కొనే నోబెల్ ఇచ్చారని ఈసడించారు కూడా .
నోబెల్ బహుమతి పురస్కార డిన్నర్ లో బెక్ ‘’literature comes out of life .it is as
old as speech .a writer who does not passionately believe in the perfectability of
man ,hqas no dedication nor any membership in literature ‘’అని చెబుతూనోబెల్
బహుమతి గురించి ప్రస్తా విస్తూ ‘’nobel kept my belief in the human mind and the
human spirit .Man’s power for good and evil is so awesome that he has usurped
many of the powers we once ascribed to God .now it is in man’s hands to
determine the life and death of all living things .The test of his perfeetability is at
his hand ‘’అని తనకు మానవుల మీద మానవత్వం మీద ఉన్న అపార గౌరవాన్ని
నమ్మకాన్ని ఆవిష్కరించాడు .తనకు నోబెల్ రావటం ఆశ్చర్యకరం అన్నాడుకూడా .న్యు
యార్క్ టైం మాగజైన్ మాత్రం బెక్ ను గొప్పగా సమర్ధించింది .’’Beck is a dated writer .His
sentimental books about the poor had given him a special place in the hearts of
adults growing up in the depression ‘’అని కీర్తించింది ..
బెక్ చని పో యిన పాతిక ఏళ్ళ తరువాత విమర్శకులు ,పర్యా వరణవేత్తలు బెక్ ఎంతటి
ముందు చూపున్న రచయితో ,యెంత పర్యావరణ ప్రేమికుడో ,మానవ తప్పిదాలను ఆనాడే
తెలియ జెప్పి జీవ వైవిధ్యానికి భంగం కలిగించ వద్ద ని మోర పెట్టు కోన్నాడో అతని రచనల్లో
వీటన్నిటిని ఎలా ప్రతి ఫలింప జేశాడో తెలుసుకొని చెంప లేసుకొన్నారు ఇప్పుడు అమెరికా
అంతా బెక్ అవగాహనా సదస్సులు నిర్వ హిస్తు న్నారు అతనిపేర ఒక అధ్యయన సంస్త ను నెల
కోల్పారు ఆయన పుస్త కాలన్నీ ఇంటింటా చదివే ఏర్పాట్లు చేస్తు న్నారు ఫెలోషిప్పులు
స్కాలర్షిప్పులు ఆయన పేరు మీద ఇస్తు న్నారు .ఒక మాగజైన్ను కూడా నిర్వహిస్తూ అతన్ని
అమరుడిని చేస్తూ తమ అజ్నానాన్ని పారద్రో లిన జ్ఞా న జ్యోతి గా జాన్ స్టెయిన్ బెక్ ను
ఔరవిస్తు న్నారు
డేనియల్ కీస్
పాట్రిక్ కాసేడి అనే ఆవిడ డేనియల్ కీస్ అనే అతని పై ‘’flowers for Algernon ‘’అనే
పుస్త కం రాసింది .ఈ పుస్త కం మానవాళికి గొప్ప సందేశం అన్నారు .అలాంటి మనుష్యులు
మనకెక్కడా కనీ పించరు .ఇలాంటి వారు మనల్ని జాగృతం చేస్తా రు ,ఆశ్చర్యం కల్గించి
,మనకు తెలియనిదేదో తెలియ జెప్తా రు .మన హృదయాలను విశాలం చేస్తా రు .మన
సో దరులు అని పించి సన్నిహితులవుతారు .దీన్ని ఒక కద గా చెప్పింది రచయిత్రి .
చార్లీ ఒక బేకరీ లో పని చేస్తూ తాను చాలా డల్ గా ఉన్నానని భావిస్తు ంటాడు .తాను
స్మార్ట్ గా అవ్వాలని కలలు కంటాడు .అందరు తనను అభిమానం గా చూడాలని
కోరుకొంటాడు .అలా అవటానికి ప్రపంచం లో సైంటిస్టు లు చేసే ప్రయోగాలను గురించి తెలుసు
కొంటూ ఉంటాడు .అంతకు ముందే ఆల్జీర్నాన్ అనే నర్సు కు ఆపరేషన్ చేసి ఇంటలిజెన్స్
పెంచి నట్లు చదివాడు . .అలాగే మన చార్లీకి కూడా ఆపరేషన్ చేశారు అతని కోరిక మీద
.ఇంటలిజెన్స్ పెరిగింది కాని ఎవరు ప్రేమ గా చూడలేదతన్ని .’’యారో గంట్ ‘’గా మారి
ఒంటరి వాడై పో యాడు .అతని తల్లి కూడా కొడుకు లో ఏమార్పు రాలేదని గ్రహించింది .తండ్రికి
ఇదే అభిప్రా యం .ఆలిస్ అనే టీచర్ తన ఆపరేషన్ కు కారణం అని చార్లీ తెలుసుకొన్నాడు
.ఆమె నూ ప్రేమ కు ఒప్పించ లేక పో యాడు .చివరికి మెంటల్ రిటార్దేషన్ వచ్చేస్తు ంది
.అల్లెర్గా న్ చని పో తుంది .ఈ కదనే ‘’చార్లీ ‘’పేరు తో హాలీవుడ్ సినిమా తీశారు .ఇదొ క
సైంటిఫక్
ి ఫిక్షన్ .బాక్సాఫీస్ హిట్ కొట్టింది .
ఇందులో మనిషి తన శక్తి కి మించి ఏదైనా కోరి సాధించాలను కోవటం ప్రమాదకరం
అని తెలియ జేస్తా రు .సైన్సును ఇలాంటి వాటి కోసం ఉపయోగింటమూ సరైన పధ్ధ తి కాదు
అని అర్ధమవుతుంది .
కీస్ అనే ఆయన 1927 ఆగస్ట్ తొమ్మిది న అమెరికా లోని బ్రూ క్లిన్స్ లో పుట్టా డు
.చిన్నప్పటి నుంచి కధలు వినటం చదవటం ఇష్ట ం .బాగా కధలు చెప్పగలిగే వాడుకూడా
.రచయిత కావాలని కోరుకొంటాడు .చాలా కష్ట పడే . తెగ చదివే వాడు .కంటికి కొంచెం మసక
.నెమ్మదిగా రచనలు చేయటం ప్రా రంభించాడు .1950 లో సైకాలజీ లో డిగ్రీ పొ ందాడు .ఒక
పేపర్ కు అసో సియేట్ ఫిక్షన్ ఎడిటర్ గా పని చేశాడు .1952-58 వరకు సైంటిఫక్
ి ఫిక్షన్ స్టో రీస్
చాలా రాశాడు .ఒక రకం గా చెప్పా లంటే టన్నుల కొద్దీ ఫాంటసి కామిక్స్ రాశాడు .ఒక సారి
అతని మనసులో ‘’మానవుడు తన ఇంటలిజెన్స్ ను పెంచుకో గలిగితే ఏమౌతుంది ?’’అని
ప్రశ్న వేసుకొన్నాడు .దాని పై ఒక కద రాశాడు .అది 1959 లో ప్రచురితమయింది .’’క్లా సిక్
రచన ‘’అనే పేరొచ్చింది .దానికి ‘’సైంటిఫక్
ి ఫిక్షన్ ‘’బహుమతికూడా లభించింది .
తరువాత కీస్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు .అదే కధను నవల గా మార్చాడు .అది
గొప్ప సంచలనం రేపింది .నెబ్యులా అవార్డ్ వచ్చింది .కీస్ కు ‘’impact of scientific
advance on human beings ‘’అంటే బాగా ఇష్ట ం .1968 లో ‘’the touch ‘’ను ,1960 లో’’
ది ఫిఫ్త్ సాలీ ‘’ని రాశాడు..’’పెర్సనాలిటి డిసార్దర్ ‘’ ను ఫిక్షన్ గా రాసి మంచి పేరు
తెచ్చుకొన్నాడు .ఇందులో మానవ మెదడు లోని కాంప్లెక్సిటీ గురించి రాశాడు .1981 లో
‘’ది మైండ్స్ అఫ్ బిల్లీ మాలిగాం ‘’రాశాడు .ఇది బిల్లీ అనే వాడి కధే .నిజం గానే జరిగిన కద
.మూడు హత్యలూ ,రేపులు చేసిన వాడి మానసిక ప్రవ్రు త్తి వివరణ ఇందులో చూపించాడు
.వాడికి శిక్ష పడలేదు .’’he was aquitted of his crimes by reason of insanity caused by
multiple personality –the first such decision in history ‘’అని కోర్టు తీర్పు నిచ్చి విడిచి
పెట్టింది .
కీస్ కు మిస్ట రి రైటర్ గా మంచి పేరు వచ్చింది .’’schizophernia ‘’అనే మానసిక
వ్యాధి ఉన్న ఒకడి కధను unveiling Claudia –a true story of a serial murder’’గా రాస్తే
గొప్ప ప్రశంశాలోచ్చాయి .దీన్ని మల్టిపుల్ పెర్సానాలిటి పై గొప్ప పరిశోధన గా భావించారు
.తర్వాత తన జీవిత చరిత్ర ను రాసుకొన్నాడు .దానికి Allegernon Charlie and I –A
writer’s journey ‘’అని పేరు పెట్టా డు .ఇది 1999 లో ప్రచురితమైంది .కీస్ రాసిన ఫిక్షన్ లు
అన్నీ నేడు జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా సుసాధ్యంయ్యాయి .అంతటి ముందు చూపున్న
సైంటిఫక్
ి ఫిక్షన్ రచయిత డేనియల్ కీస్ .
నతానియల్ హతార్న్ -1
న్యు ఇంగ్లా ండ్ వెళ్లి గుర్రా ల వ్యాపారం చేశాడు . తరువాత ఒంటరి జీవితం గడిపాడు
.ఎంతో చదవటం వల్ల చేయి తిరిగిన రచయిత గా మారాడు . మానవ మనస్త త్వ పరిశీలన
అబ్బింది . తన భావిశ్యత్ రొమాన్స్ రచనలకు ఎన్నో వస్తు సామగ్రి దొ రికింది. తన కధలను
''రొమాన్సేస్ ''అన్నాడు . వీటిలో ఊహ ,స్వీయ స్వతంత్రం ఉన్నాయి . మాసా చూసేత్స్ కు
వెళ్ళాడు . అక్కడ సో ఫియా పీ బాడ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు . బో స్ట న్
కస్ట మ్స్ ఆఫీస్ లో ఉద్యోగం దొ రికింది . కొద్దికాలమే చేసి రాజీ నామ చేశాడు . బ్రూ క్ ఫాం లో
నివాసమున్నాడు . అక్కడి కాపురం వలల శారీరక మానసిక బౌద్ధిక,నైతిక విద్యాభి
వృద్ధిదీకోసం వెయ్యి డాలర్లు ఖర్చు చేశాడు . విసుగెత్తి ంది '' it is my opinion that a man's
soul may be buried under a dung heap or in a furrow of the field just aswell as
under a pile of money ''. అని బాధ పడ్డా డు .
1846 లో మోసెస్ ఫ్రం అన్ ఓల్డ్ మాన్సె రాశాడు .ఇవన్నీ కధలే 1838-45 మధ్య ఇరవై
రెండు కధలు రాశాడు . మళ్ళీ స్ల మ్స్ కస్ట మ్స్ లో చేరాడు కొన్ని నెలలకే ఖాళీ 1849 లో
''కస్ట మ్స్ హౌస్ ''రాసి ప్రచురించాడు . .1850 అతని ప్రసిద్ధ రచన ''స్కార్లెట్ లెటర్ ''రాశాడు .
అప్పుడే లేనాక్స్ లో కాపురమున్నాడు. mobi dick నవలా రచయిత హెర్మన్ మెల్ విల్లీ తో
పరిచయమేర్పడింది .ఇద్ద రు తరచూ కలుసుకొనే వారు మె ల్విల్లీ మోబీ డిక్ ను హాతార్న్ కు
అంకిత మిచ్చాడు మిత్రత్వానికి చిహ్నం గా . తర్వాతా '' .the house of 7 gables ,''a wonder
book of girls and boys '' .రాశాడు రెండవది గ్రీకు కధల సంపుటి .
కాపురం కంకార్డ్ కు మార్చాడు . తోరో గారి వాల్దే న్ పాండ్ కు వెళ్ళాడు నచ్చక
తిరిగి వచ్చాడు ''the blithedale romances ''. ప్రచురించాడు .ప్రెసిడెంట్ పియర్స్ కు
రాజకీయ ఉపన్యాసాలు రాసి అందించేవాడు హాతార్న్ . ''tangle wood tales '' రాశాడు
.ఇంగ్లా న్ద్ వెళ్లి అక్కడి విశేషాలు రాశాడు రొం లో విహరించాడు . 1860 లో ట్రా న్స్ ఫర్మేషన్
రాసి అచ్చేశాడు. మూడేళ్ళ తరువాత ''అవర్ ఓల్డ్ హొమ్ ''రాశాడు . 1864 జులై నాలుగున
అరవయ్యవ ఏట నతానియాల్ హతర్న్ మరణించాడు .
ఆయన రచనా విశేషాలు ఈ సారి
రచనా పాటవం
తన జీవిత గమ్యమేమిటోహతార్న్ ఇలా తెలియ జేశాడు '' i do not want to be a
doctor live by men's diseases ,nor a minister to live by their sins ,nor a lawyer
and live by their quarrels .so i do not see that there is any thing left for
me ,but to be an author ''
రచయితకావాలనిఅంతతపించి పో యాడు. చెడు
లోనిసమస్యలనుచర్చించాడు. పాపంఅసలురూపంఏమిటోచెప్పాడుగర్వానికి,
మానవత్వానికి మధ్యఉన్నవైరుధ్యాన్ని వివరించాడు. . ఊహకుఉన్నశక్తినినిరూపించాడు. .
భౌతికంగాఆలోచించేవారి మనస్సులనుఆధ్యాత్మికతవైపుమళ్ళించాడు
నతానియల్ను''largest brain with largest heart ''అనిప్రశంసిస్తా రు
ఆయనసాహిత్యపరిజ్ఞా నంప్రధమశ్రేణికిచెందినదిగాకీర్తిస్తా రు. అమెరికాసాహితీ
వేత్తలలోఫస్ట్గ్రేడచ
్ర యితఅని పించుకొన్నాడు వారిలోమొదటి స్తా నంలోఉన్నవాడుకూడా
. ఆయన్ను''the obstruest man of letters in America ''అనిగొప్పగా చెప్పుకొంటారు
ఆయనలోసృజన,కొత్త ద నానికి అన్వేషణ,ఊహ, స్వీయభావసంపదా, పుష్కలం. .
అందుకే a man of rare genius ''అంటారు. . అంతేకాదు''finer than Emerson ''అని
పెద్దపీట వేశారు . ఆయనకున్నవిజన్ఎవరికిలేదని,
తనకున్నభావాలనుఅంతప్రస్పుటంగాసాహిత్యంద్వారావెలిబుచ్చినరచ
యితాకూడాలేడ నిఅని పించుకొన్నాడు. .
ఆయన్నుఅనుకరించటంఅసాధ్యమనీ భావిస్తా రు. . ''hawtharne is
one of the new and far better generations of our times ''గా
భావిస్తా రు. ఆయన 'allegory లో జీవించాడు.
సాహితీవిరాట్ స్వరూపుడుగాఆయన్నుకొలుస్తా రు. . ''he showed 22
colours of images in his literature ''. ఆయనరాసిన
స్కార్లెట్లెటర్స్లో ప్యూరిటన్ భావాలను ,ప్యూరిటన్
జీవన విధానాన్నినిక్షిప్త ం చేశాడు.
5-9-2002 గురువారం అమెరికా డైరీ నుండి
రిచర్డ్ రైట్
రిచర్డ్ రైట్ అనే నల్ల జాతి రచయితా ,హక్కుల పో రాట యోధుడు ''నేటివ్ సన్ ''అనే
పుస్త కాన్ని రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు అతను 1908 సెప్టెంబర్ నాలుగున మిసిసిపి లో
పుట్టా డు . తండ్రి ఇతన్ని దూరం చేశాడు ఽఅయన ఇంకో అమ్మాయిని పెళ్ళాడాడు . ఆకలి
బాధలతో బాల్యం గడిచింది తల్లే ఇతని బాధ్యతా తీసుకోండి . ఇంట రొట్టె కొద్దిగా టీ తో ఎన్నో
రోజులు గడిపాడు తల్లితో .తల్లికి జబ్బు చెసన్ది
ి .ఫ్రస్త్రెశన్ లో తాగుడుకు అలవాటు పడ్డా డు .
జాక్సన్ కు వెళ్ళాడు ఽమ్మమ్మ మత స్వభావం ఇతనికి నచ్చలేదు . వెస్ట్ హెలీనా కు పారి
పో యాడు . తల్లికి గుండె పో తూ తో పక్షవాతం వచ్చింది .తల్లికొసమ్ తిరిగి వచ్చాడు .నిద్రలొ
నడక అలవాటయింది . తాత గారింట్లో అందరి మధ్య ఇమడ లేక పో యాడు . అనేక చిన్న
ఉద్యోగాలు చేసి పొ ట్ట పో సుకొన్నాడు .ఇల్ల న్థా పస్తు లతో అలమటించే వారు . ఇంటింటికి తిరిగి
పేపర్లు వేసే వాడు .
అయితే విపరీతం గా పుస్త కాలు చదివాడు . మానవత్వాన్ని చిదిమేసే సంఘటన ల
ను చూసి చలించి పో యే వాడు . జాతి ద్వేషాన్ని జీర్ణించుకో లేక పో యాడు . తన నల్ల జాతి
వాళ్ళు పడుతున్న దుర్భర దారిద్ర్యాన్ని ,అణచి వెతను చూసి బాధ తో పాటు కోపం వచ్చేది
వారి అసహాయత కు జాలి పడే వాడు వారు ఎదిరించక పో వటాన్ని భరించలేక పో యాడు .
తెల్ల వాల్ల పకి కసి పెరిగింది .వాల్ల మానవతా రాహిత్యం పై ద్వేషం ప్రబలింది . ''bare bleak
pool of black life ''ను చూసి జాలి పడే వాడు . తానేమైనా తన జాతి వారికి చేయాలనే కోరిక
గాదం గా ఉండేది .
1922 లో ''the voodoo of hell's half acre ''అనే చిన్న కదా రాశాడు .యెవరో
మెచ్చలేదు ంఎమ్ఫిస్ కు ఒంటరి గా ప్రయాణం చేశాడు . సంపాదించిన దానిలో కొంత తల్లికి
పంపేవాడు . అక్క్కడ కొందరు తెల్ల వాళ్ళు మంచి వారు గా అని పించారు ఽక్కది లైబర
్ర ి లో
నల్ల వాళ్ల కు ప్రవేశం నిషిద్ధం . 1927 లో చికాగో చేరాడు
పూర్ న్యూట్రిషన్ తో చాలా బాధ పడ్డా డు . సంపాదస్నే ధ్యేయం గా ఎంచుకొన్నాడు . పో స్ట ల్
ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ంఅంచి శారీరక స్తితి లేనందు వాళ్ళ సెలెక్ట్ కాలేదు . అప్పుడే
స్టా క్ మార్కెట్ ఘోరం గా పతన మైంది . ఎక్కడా ఉద్యోగాలు లేవు . ''లాడ్ టు డే ''కదా
రాశాడు . 1930 లో పో స్ట ల్ ఉద్యోగం వచ్చింది . ''సూపరిష్టిషన్ '' అనే కద రాశాడు . '' . అది
బ్లా క్ జర్నల్ లో ప్రచురిత మైంది .
కమ్యూనిస్ట్ పార్టీ మీద మోజు పుట్టి చేరాడు . సరైన ఉద్యోగాలు రాక సేల్స్ మాన్
గా ,వీధులు ఊడ్చే వాడిగా పని చేశాడు . ఆటను రాసినవి న్యు మాస్ట ర్ ,లెఫ్ట్ ఫ్రంట్ జర్నల్స్
లో పడేవి .చికాగొ లో కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరి గా పని చేశాడు . 1935 లో ''American
writer's congres ''స్తా పన జరిగింది తరువాతి ఏడు ''national negro congress ''ఇతని
అధ్యక్షతానఏర్పడింది . ''బిగ్ బాయ్ లీవెస్ హొమ్ ''కదా రాస్తే తెల్ల వాళ్ళు కూడా మెచ్చారు .
టైం ,ట్రిబ్యూన్ మాగజైన్లు పో గిడాయి . కవిత్వం కూడా రాసి మెప్పించాడు క్రమం గా ''కమ్మీ
''లకు దూరమైనాడు . ''అంకుల్ టామ్స్ చిల్ద్రెన్ ''అనే నవలిక రాశాడు .
ధీమా అనే అమ్మాయి తో పెళ్లి . కొద్దికాలానికే విడాకులు . 1940 ''నేటివ్ సన్
''నవల ప్రచురణ . ఇరవై అయిదు వేల కాపీలు అమ్ముడయింది . గొప్ప గుర్తింపు లభించింది .
'' the first best selling black author of America ''గా గుర్తింపు పొ ందాడు . రేడియో కు
అనేక మేగాజైన్ల్ కు రచనలు రాస్తే హాట్ హాట్ గా ప్రచురించారు . నల్ల జాతి వాళ్ళపై
దౌర్జన్యాన్ని ప్రతిఘటించాడు ఆ దౌర్జన్యాలను ''blacks were
shot ,hanged ,maimed ,lynched ,and generally handed until they were either dead
or their spirits were broken ''అని ప్రపంచానికి కళ్ళకు కట్టించాడు .
''a black history of the negro in the U.S.A.'',''12 million black voices ''పుస్త కాలు
రాసి విపరీతమైన పేరు డబ్బూ,ప్రఖ్యాతి పొ ందాడు . నేటివ్ సన్నాటకం నూట పది హీను సార్లు
ప్రదర్శింప బడింది . ఎలెన్ ను పెళ్ళాడాడు . '' i tried to be a communist ''రాశాడు .స్వీయ
జీవిత చరిత్ర రాసుకొన్నాడు .బ్లా క్ బాయ్ నవల రాశాడు .ఇది బెస్ట్ సెల్లా ర్ అయింది .ఫ్రెంచ్
గవర్న మెంట్ ఆహ్వానం పై పారిస్ సందర్శించాడు .యోరప్ లో పర్యటించి అనుభూతి
పొ ందాడు . తనకు అక్కడ హాయిగా ఉందని అలాంటి ఆనందం తనకు అమెరికా లో
లభించలేదని అన్నాడు .యోరప్ దేశస్తు లు గొప్ప సంస్కారం ఉన్న వారని ఇంటర్ రేసియల్
కపుల్స్ ను అంగీకరించి గౌరవిస్తా రని మెచ్చాడు . నేటివ్ సన్ నవల ను నాటకం గా మార్చాడు
దానినే సినిమా గా తీశారు .''the out sider '' .రాశాడు .
ఎన్నో దేశాలను పర్య తించాడు . అంతర్జా తీయ ఖ్యాతి పొ ందాడు . అతని పుస్త కాలను
స్కూళ్ళలో బో ధించటానికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకొన్నది చఒప్పుకొన్నది ప కమ్యూనిస్ట్
అయినందువల్ల కొంతాకాలం ప్రభుత్వం అతన్ని నిఘాలో ఉంచింది . తల్లి చని పో యింది
ంఅల్లీ కస్తా ల కాలం ప్రా రంభ మైంది . పుస్త కాలపై రాయాల్తి రావటం లేదు . నిరుత్సాహాఆమ్
లో మునిగాడు . 800 .హైకూలు రాస్తే చని పో యిన తర్వాతా ప్రచురింప బడ్డా యి . లాంగ్ డ్రీం
అనే నవల రాశాడు . 1960 నవంబర్ 30 న నల్ల జాతి రచనా సూర్యుడు మరణించాడు తన
జాతిని మేల్కొల్పిన మహా ఘనుడిగా గుర్తింపు పొ ందాడు .
5-9-2002 గురువారం నాటి అమెరికా డైరీ నుండి
రాబర్ట్ ఫ్రా స్ట్ -1
అమెరికా లో ఎక్కువ మంది ,ఎక్కువ సార్లు ఉదహరించే కవి రాబర్ట్ ఫ్రా స్ట్ . వాళ్ళ
ప్రేమాభిమానాలు పుష్కలం గా పొ ందిన కవికూడా .ఽమెరికా ఆస్థా న కవి . ఆయన తీసుకొనే
వస్తు వు దాన్ని కవితాత్మకం గ చెప్పే తీరు చిరస్మరణీయం ఽఅయన రచనలకు ఆమెరికా
ప్రెసిడెంట్ కేంనేది రష్యా అధ్యక్షుడు కృశ్చెవ్ లు లు అమితం గా అభిమానించారు .ఒక రకం గా
అమెరికా మట్టి మనిషి ,మట్టి కవి ఫ్రా స్ట్ . అందరికి అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పి అందరికి
దగ్గ రైన కవి . ఆయన కవిత్వం లో ''some thing catching ''ఉంటుంది . అదే మనసుకు పట్టి
వీరభిమనుల్ని చేస్తు ంది . ఛందస్సు లేకుండా (మీటర్) రాయతానని నెట్ లేకుండా టెన్నిస్
ఆడటం లా గా ఉంటుంది అన్నాడు ఫ్రా స్ట్ . చాలా సాదా సీదా గా భావ గర్భితం గా ,స్పష్ట ంగా
,సంభాశానాయుతం గా రాయటం ఫ్రా స్ట్ ప్రత్యేకత . ఆయన్ను న్యూ ఇంగ్లా ండ్ పో యేట్
అన్నారు ఽన్దు లొ వికసించిన వజ్రం ఫ్రా స్ట్ . మాసా చూసేత్స్ ,మెయిన్ ,కనెక్టికట్ ,తో సహా
ఎనిమిది రాష్ట్రా లను న్యు ఇంగ్లా ండ్ అంటారు . ఇంగ్లీష్ వాళ్ళు మొదటి సారిగా ఇక్కడికే వలస
రావటం వలల న్యు ఇంగ్లా ండ్ అనే పేరొచ్చింది . ఆయన్ను ''he is the
strongest ,lonliiest ,frendliest ,poet ''అని ఆప్యాయం గా పిలుచు కొంటారు .
ఫ్రా స్ట్ కున్న పేరు ప్రఖ్యాతులు చాలా విలువైనవి .యెన్దరొ ప్రేసిదేన్ట్లతో రాజులతో
ఆయన విందులు స్వీకరించాడు . తన విద్యార్ధు లను అమితం గా ప్రేమించాడు . ''most landed
American poet of all time at home and abroad ''.యెన్తొ విషాదకర జీవితాన్ని
అనుభవించాడు ఫ్రా స్ట్ ఽన్ని సమయాలలోనూ ప్రజలు ఆయన్ను అభిమానించి ఆరాధించారు
. ఫ్రా స్ట్ చని పో యి యాభై ఏళ్ళు దాటినా ''best known ,best loved poet of the twenieth
century ''
రాబర్ట్ ఫ్రా స్ట్ 1874 మార్చి26 న కాలిఫో ర్నియా లో జన్మించాడు . చిన్నప్పుడే
''సెకండ్ సైట్ ''అంటే ''extrarordinary perception ఉండేది అంటే అందరికంటే భిన్నమైన
చూపు వస్తు పరిశీలనా ఉండేదాన్న మాట . తల్లికి ఫ్రా స్ట్ మీద పిచ్చి ప్రేమ .థన్ద్రి మాత్రం పిచ్చ
తాగుబో తు . తండ్రి చని పో గానే అమ్మతో తాత గారింటికి మసా చూసేత్స్ కు చేరాడు . తండ్రికి
కోపం జాస్తి ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పక పో యినా క్షమించమని అనకపో యినా పిచ్చ
కొట్టు డు కొట్టే వాడు చినారి ఫ్రా స్ట్ ను . తల్లి టీచరే కాక కవిత్వం రాసేది ఫ్రా స్ట్ ఎప్పుడూ మద్యం
ముట్ట లేదు ఽమెరికన్ కవులలో తాగని వారు దాదాపు లేరు అందుకు భిన్నం ఫ్రా స్ట్ . తండ్రి
ఉన్నదంతా హారతి కర్పూరం చేసి'' బాల్చీ తన్నేశాడు'' . అందుకని తాత వాళ్ళు తల్లిని చిన్న
చూపు చూస్తూ ఫ్రా స్ట్ ను ఆదరించే వారు కాదు . హైస్కూల్ లో చదివే తప్పుదే కవిత్వం
రాసేవాడు .
న్యు హాంప్ షిర్ అడవుల్లో ఒంటరిగా తిరిగే వాడు ఫ్రా స్ట్ . సో దరులు తాగి
తందానాలడుతుంటే ఇతను షికారుకు వెళ్తూ ఉండే వాడు .ఉన్ని మిల్లు లో పని చేశాడు .
వ్యవసాయ క్షేత్రా లలో వ్యవసాయ పనులు చేసే వాడు . హార్వర్డ్ యోని వర్సిటీ లో చేరాడు
కాని పూర్తీ చేయలేక పో యాడు . తల్లికి అనా రోగ్యం . భార్య పిల్లల్ని కనటం ,చదువుకు
పూర్తిగా స్వస్తి చెప్పాడు . రెండు సార్లు ''డ్రా పౌట్ ''అయ్యాడు . ఫ్రా స్ట్ కూతురు ఇలియట్
మూడేళ్లకే ''ఇంతేస్తినల్ ఫ్లూ ''తో చని పో యింది .న్యు హాంప్ షిర్ లోని దేర్రి హౌస్ లో
కాపురమున్నాడు . రచనలు చేస్తూ ండేవాడు వ్యవసాయం చేస్తూ మన పో తనా మాత్యుడు
లాగా . తల్లి చని పో యింది .పిల్లల్ని కంటూనే ఉన్నాడు నాన్ స్టా ప్ గా . అందులో అతి చిన్న
పిల్ల మరణించింది ఽప్పుదు కొంచెం జ్ఞా నోదయమైంది ''life is precious and tried to make
life sweet for his surviving children ''అని భావించాడు . అప్పుడే పుట్టు క ,జీవించటం
మరణం ల పై ధ్యాస పెరిగింది .వాతి పై తెగ ఆలోచించాడు .
కింగ్ ఆర్ధర్ కధలు బాగా చదివాడు . పొ ద్దు న్నే రాసుకోవాలని అర్ధ రాత్రే పాలు
పితికే వాడు . దేర్రి లోని పింకేర్తా న్ అకాడెమి లో టీచర్ గా పని చేశాడు . ఫ్రా స్ట్ అంటే
విద్యార్ధు లు తెగ ఇష్ట పడే వారు . అన్నిటిని బట్టీ పట్టే వాడు . కుటుంబాన్ని పో షించా తగిన
సంపాదన ఉండేది కాదు . తన కవిత్వం పో ట్ట గడవతానిక్ ఉపయోగ పడలేదు .
రాబర్ట్ ఫ్రా స్ట్ కు ,భార్యకు డిప్రెషన్ వచ్చింది. ఆ యనకు చెస్ట్న్ పెయిన్ అధికం .ఇంగ్లా ండ్
వెళ్ళాడు అక్కద ఎజ్రా పౌండ్ ,యిలిఎట్ ,,ఈట్స్ కవులతో మంచి పరిచయమేర్పడింది .
ముగ్గు రు ఫ్రా స్ట్ ను బాగా ప్రో త్సహించారు . '' a boy's will ''అనే పేరుతో ఫ్రా స్ట్ రాసిన కవితను
పౌండ్ బాగా అభిమానించి అమెరికా లోని తన మిత్రు లకు సిఫార్సు ఉత్త రం రాసిచ్చాడు .
1914 లో ''నార్త్ ఆఫ్ బో స్ట న్ ''రాసి ప్రచురించాడు . అది బాగా క్లిక్ అయింది . వేల కాపీలు
అమ్మడ యాయి. గొప్ప పేరు ,డబ్బూ వచ్చ్చాయి . యూరప్ లో యుద్ధ ం వల్ల అమెరికా కు
తిరిగి వచ్చాడు . అమెరికాలో ఘన స్వాగతం లభించింది .
న్యు ఇంగ్లా ండ్ కాలేజి లో ఇంగ్లిష్ టీచర్ గా పని చేశాడు . రెండేళ్లకు ''మౌంటేన్
ఇంటర్వెల్ ''రాసి అచ్చు వేశాడు . వెర్మాంట్ ,హాంప్ షైర్ లలో ఉన్నాడు . ''న్యు హాంప్ షైర్ ''
పుస్త కానికి పులిట్జ ర్ ప్రైజ్ వచ్చింది . 1930 లో రాసిన వన్నీ గొప్ప సక్సెస్ . అయినా పెర్సనల్
గా చాలా లాస్ .కూ తురు చని పో యింది .భార్య తీవ్ర అనారోగ్యం తో బాధ పడి మరణించింది .
''the unspoken half of every thing ,i ever wrote ''అని భార్యను గురించి బాధ పడ్డా డు .
కాతలీన్ మారిసాన్ అనే అమ్మాయి సెక్రెటరి గా ఫ్రా స్ట్ వద్ద పని చేసింది . ఆమె
ప్రశాంత చిత్త ం ,శ్రద్ధా ,దయా, సానుభూతి తో బాధనుండి ఉపశమనం పొ ందాడు మళ్ళీ
మానసిక స్వాస్త్యాన్ని పొ ందాడు . కొడుకు మెంటల్ డిప్రెషన్ తో ఆత్మ హత్య చేసుకొని మళ్ళీ
మానసిక బాధ కల్గించాడు . క్రమం గా చీకటి రోజులు కను మరుగై నాయి .వెలుగులలొకి
ప్రస్తా నం ప్రా రంభమైంది . నాలుగు పులిట్జ ర్ బహుమతులన్డు కోన్నకవి గా గౌరవం పొ ందాడు .
అడిగిన చోట్లకు వెళ్లి ఉపన్యాసా లిస్తూ ండే వాడు .''honourary consultant in the
humanities at the Liberty angels '' అయ్యాడు ఫ్రా స్ట్ . ఇలియట్ ,హెమింగ్ వె ,ఫాక్నర్ లతో
మంచి పరిచయం కలిగింది .వాళ్ళ శకం అయి పో యి ఖాళీ గా కూర్చుంటే ,ఫ్రా స్ట్ 80 వ ఏట
కూడా ఇంకా రాసి,కదిలిస్తూ , మెప్పిస్తూ నే ఉన్నాడు అదీ ఫ్రా స్ట్ ప్రత్యేకత . ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి
యోని వర్సిటీలు గౌరవ డాక్త రేట్లను ప్రదానం చేశాయి . అప్పటికే ''విశ్వ కవి ''(యూనివేర్సల్
పో యేట్ ) గా గుర్తింపు వచ్చింది . ప్రెసిడెంట్ కెన్నెడి తో పర్సనలల్ సంబంధాలను కోన
సాగించాడు . ఒక మీటింగ్ లో కేనేడి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని ఒక ఏడాది ముందే
ప్రకటించాడు ఫ్రా స్ట్ . కెనడి ప్రెసిడెంట్ గా గెలిచి1961 లో ప్రమాణ స్వీకారం చేస్ద్దినప్పుడు తన
మిత్రు డు ఫ్రా స్ట్ ను సాదరం గా ఆహ్వానించి ఒక కవిత చదవమని కోరాడు . అదొ క చారిత్రా త్మక
సంఘటన అయింది . '' it is the first time that an artist had been recognized in such a
special event '' . అప్పటికే చూపు మందగించింది . కేనేడి కోరిక పై వేదిక పైకి వెళ్లి ''the gift
out right ''అనే సందర్భోచిత కవిత రాసి చదివి జనాన్ని మరింత సంతోష పెట్టా డు . ''the debt
owed to America and to the earth itself ''అని అందులో తగిన పద బంధం తో హృద్యమైన
కవిత రాసి హృదయాలకు తాకేట్లు చేశాడు .
ప్రెసిడెంట్ కేనేడి ప్రతి మీటింగ్ లోను ఫ్రా స్ట్ కవితలను ఉదాహరించేవాడు . ''the
young president is a bridge to the young and old ''అని పించేది ''పొ లిటీశియను
,పో యేట్ ''కలిసి పని చేయ గలరు అని నిరూ పించారు వారిద్దరూ . రష్యా ప్రెసిడెంట్ కృశ్చెవ్
ఫ్రా స్ట్ కవితల్ని తెగ చదివి మెచ్చుకొనే వాడు. తన దేశానికి ఫ్రా స్ట్ ను ఆహ్వానించి సత్కరించి
గౌరవించాడు . ''mending wall ''అనే కవితను రష్యా అమెరికా సంబంధాల మెరుగు దల పై
సందర్భానికి తగి నట్లు రాసి రష్యా ,అమెరికా ప్రజలను మెప్పించాడు . 1962 లో ''ఇన్ ది
క్లియరింగ్ ''రాసి ప్రచురించాడు . 89 ఏళ్ళ వృద్ధా ప్యం లో ఆ'' అమెరికా కవి దిగ్గజం ''1963 లో
జనవరి 29 న పరమ పదిం చాడు . అశేష సాహితీ ప్రియులను విషాదం లో ముంచి
అమరుడైనాడు ఫ్రా స్ట్ .
అసలు పేరు ఫ్రా న్సిస్ స్కోట్ కీ ఫిట్జెరాల్డ్ . అమెరికా లోని మిన్నెసో టా లో 1896
september 24 న జన్మించాడు . ఆయన్ను కాలం కాని కాలం లో పుట్టిన రచయిత అంటారు .
కారణం ఆయన 18 వ శతాబ్ద పు అంతరంగం ఉంది ఇరవయ్యవ శతాబ్ది లో జీవించాడు . తండ్రి
ఇంగ్లా ండ్ కు తల్లి ఐరిష్ దేశానికి చెందినా వారు .చాలా బీద కుటుంబం . అతను ఉన్న టౌన్
ధనికులకు ఆవాసం .ధనిక కుటుంబాల మధ్య ఈ నిరు పేద జీవించాల్సిన పరిస్తితి . అలాగే
''అ పూర్ బాయ్ ఇన్ ఏ రిచ్ బాయ్స్ స్కూల్ ''లా చదువు సాగింది . తల్లి చాలా పొ గరు బో తు
,అందగత్తె . ఒక పో రుగింతావిడ భర్త చని పో యి ఏడుస్తు ంటే ఆమె దగ్గ రకు వెళ్లి సాను భూతి
ప్రకటించటానికి బదులు ''నువ్వు ఏడుస్తు ంటే నీ ముఖం ఎలా ఉంటుందో చూడ తాని కి
వచ్చాను ''అన్న స్వభావం ఆమెది .
స్కాట్ సో దరిలు చిన్నప్పుడే చని పో యారు . తల్లి కొడుకును తనలాగే తయారు
చెయ్యాలని సంకల్పించింది .ఇది నచ్చక స్కాట్ తల్లికి దూరమయ్యాడు . ఫిట్జెరాల్డ్ ఆ తర్వాతా
ఎప్పుడో తన కూతురుకు ఉత్త రం రాస్తూ ''నాకు జీవితం లో నేను తప్ప ఎవరూ లేని ఒంటరి
వాడిని ,అదే నాకు జీవితం లో పెను శాపం అయింది ''అని బాధ పడ్డా డు . తండ్రి అనేక
వ్యాపారాలు చేసి దివాలా తీశాడు . కుటుంబం ''బఫెలో ''కి మార్చారు . స్కాట్ పుట్టిన రోజు
ఘనం గా నిర్వహించాలని అందర్నీ పిలిస్తే విపరీతం గా వర్స్ధం కురిసి గెస్ట్ లెవరో రాక పో వటం
తో తీవ్ర నిరాశ చెందాడు . దీనికి తగ్గ ట్టు తల్లి పుట్టిన రోజు న కోసే కేక్ అంతటినీ అతనినే
తినెసెయ్య మందిట ఆపసి హృదయం యెంత క్షోభించిందో చెప్పలేం .
ఫిట్జెరాల్డ్ -2
రచనా విశేషాలు
1920 నాటి అమెరికాను ''రోరింగ్ ట్వం టేస్ '' అంటారు అప్పుడు అమెరికా ''ఇకారస్ ''లా
ఉందని చెబుతారు . అప్పుడు అమెరికా లో ''ప్రొ హిబిషన్ ''అమలు లో ఉంది . అకాలాన్ని ''ది
గ్రేట్ క్రా ష్ ''అంటారు . రెండు ప్రపంచ యుద్ధా ల మధ్యకాలం అది . ఆ ఆర్ధిక వినాశనం కాలం లో
జీవించిన వాడు ఫిట్జరాల్ద్ . ఆ పరిస్తితులను తన రచనల్లో చూపించాడు . అతని పరిశీలనం
నిశితం గా ఉండి ,దాంతో చాలా సంక్షిప్త ం గా ఆ నాడు అమెరికా ఎదుర్కొన్న పరిస్తితులను
రచనల్లో వివరించాడు . తన దేశం లో మారుతున్న పరిస్తితులకు అద్ద ం పట్టే లా రోజు వారి
వార్తా కధనాలు లాగా రాశాడు .
ఫిట్జెరాల్డ్ కు కధలు ,నవలలు అంటే మంచి వినోదం గ ఉండేవి . ఆ నాటి
యువతలో దుర్భర పరిస్తితులను చూసి రక్త ం ఉడికి పో యేది . ఇరవై నాటి పట్టించు కోని
పరిస్తితుల గురించి చర్చించాడు . మొదటి ప్రపంచ యుద్ధ ం తర్వాత అమెరికా అనుభవించిన
లోటు ఆర్ధిక పరిస్తితులను ,మద్య నిషేధం ఇంకా అమలు పరచటం పై రాశాడు . పద్దెనిమిదవ
రాజ్యాంగ సవరణ విజయ వంతం గా అమలు కాక పో వటం కూడా ఒక విషమ పరిస్తితిని
తెచ్చింది . ఈ నిషేధం 1919-1929 వరకు కోన సాగించారు అమెరికా లో . 1929 october 23
న అమెరికా స్టా క్ మార్కెట్ కుదేలయింది . దీనినే ''గ్రేట్ డిప్రెషన్ ''అంటారు .దీనికె ఫిట్జెరాల్డ్
''జాజ్ ఏజ్ ''అని పేరు పెట్టా డు .
కధా కధన సామర్ధ్యం
అమెరికా బహుముఖ రచయితా అల్లెన్ పో ను ''రేర్ రైటర్ ''అంటారు . హేన్ర్రి చని
పో యి వందేళ్ళు దాటినా ఇంకా పో ను, హెన్రీ ని జనం చదువుతున్నారు . ''millions of
readers still fascinate defying scholars and critics alike to explain or evaluate
unequivocably the source and quality of their literary achievement as well as its
enduring popular appeal .''అదీ ఆ యిద్ద రి రచనా సామర్ధ్యం .ఇద్ద రినీ ఆరాదిస్తూ నే ఉన్నారు
. హెన్రి ని అమెరికా చిన్న కదా మార్గ దర్శి గా ,షార్ట్ స్టో రీ విలువను నిర్ణయించే ''టచ్ స్టో న్''
ఒరిపిడి రాయిగా భావిస్తా రు . కొందరు అతన్ని హతారన్ తో పో లిస్తే మరికొందరు రుడ్యార్డ్
కిప్లింగ్ ,కంకార్డ్ ,జేమ్స్,మపాసా ,వార్టన్ ల తో పో ల్చటం ఉంది . అయితే వీళ్ళందరినీ మించి
పో యాడు వాళ్ళను ''ఓవర్ షాడో ''చేశాడు .'' ఒ. హెన్రి స్మారక అవార్డ్ ప్రైజ్ స్టో రీస్''వస్తు న్నాయి
అంటే ఎంత ప్రా చుర్యం పొ ందాడో అర్ధమవుతోంది . చిన్న కధకు గౌరవాన్నే కాక ,దానికి కళా
విలువను తెచ్చిన ఘనత హెన్రీ దే . కధల్లో ఎక్కడా నీతిని బో ధించలేదు . . కధల్లో జీవితాన్ని
ఉన్నది ఉన్నట్లు చిత్రించాడు అందుకే ఎవరికి అంద రానంత ఎత్తు లో ఉన్నాడు .
'' abounding verve ,intelligence ,armed with irony ,he dominates his characters
rather than suffering them '' అని తీర్పు చెప్పారు విశ్లేషకులు .
అమెరికా లోని మాన్ హట్ట న్ వేష భాషలే కాకుండా ,అమెరికా లోని అన్ని
ప్రా ంతాల వారి కధలను తన కధల్లో చెప్పాడు . అందులో టెక్సాస్ లో ఉండే చట్ట వ్యతిరేకులను
,స్వార్ధపరులను ,న్యాయానికి ,చట్టా నికి దొ రక్కుండా పారి పో యే వారిని గురించి రాశాడు .
అతని కధలు నమ్మ శక్యం కానివి అని తెలిసినా ,చదువుతూ ఉంటె ,ఆ రచనా ప్రవాహం లో
అలా కొట్టు కొని పో తాం . హెన్రి రాసిన ''ransom of red chief ''కద టెక్సాస్ కు చెందినదే
.దీన్ని మన పదవ తరగతి ఇంగ్లీష్ పుస్త కం లో చేర్చారు చాలా ఏళ్ళు దీన్ని లెసన్ గా
చెప్పాను . అలాగే ''the gift of Maggy ''ని తొమ్మిదవ తరగతి లెసన్ గా వేశారు . దాన్నీ
బో ధించాము . హెన్రి కధలలో ''irony and pathos ''ను అద్భుతం గా పండించాడు .అతను
టెక్సాస్ లో ఉండగానే కదా రచనకు మంచి బీజం పడింది . అది మొలిచి మహా వృక్షమై
కాయలు కాసి మధుర ఫలాలను అంద జేసింది . హెన్రి కధల్లొ ''చేకోవియన్ సెన్స్
''ఉందంటారు .
హెన్రి దగ్గ ర ఎప్పుడూ ''webster's dictionary ''వెంట ఉండేది . ఆయన చివర
రాసిన కద''let me feel your pulse ''. ఇది ''delightfully ironic little allegory based on
his own painful search for relief ''. చివరిరోజుల్లో న్యుయార్క్ వదిలి నార్త్ కెరొలినాకు
ఆరోగ్యం కోసం చేరాడు . అతను రాసిన '' alias Jimmy valentine '' నాటకం బాక్సాఫీస్
బద్ద లు ''కొట్టి స్మాషింగ్ హిట్ '' అయింది . అమెరికా ,,ఇంగ్లా ండ్ ,ఫ్రా న్స్ స్పెయిన్ దేశాలలో
ఒకే ఒక్క వారం లో నిర్వాహకులకు లక్ష డాలర్ల ఆదాయాన్ని చేకూర్చింది . క్రేజ్ వచ్చింది
తెచ్చింది హెన్రి రాసిన నాటకం .
టెక్సాస్ లోని ఆస్టిన్ ,హూస్ట న్ లలో తిరిగి ,అనేక ఉద్యోగాలు చేసి ,కదా ప్రపంచం
లో ధ్రు వ తారగా నిలిచాడు హెన్రి . అతను తిరిగి చూసిన ప్రదేశాలు ,మనుషులు వారి
ప్రవృత్తు లను కధల్లో పో దిగాడు మట్టి మనుషులేవారన్ద రూ . . దివి నుండి భువికి దిగి వచ్చిన
పాత్రలు కావు అవి . వాటిని మలచిన తీరు మహా ముచ్చటగా ఉంటుంది . తన కధల పై హెన్రి
చివరి రోజుల్లో ''no-they do not satisfy me .it depresses me to have people point me
out or introduce me as ''celebrated author ''అంటూ ఇంత రాసినా ,ఇంత ప్రసిద్ధి చెందినా
తన రచనల పై అసంతృప్తి వ్యక్త పరచిన పరిణత కధకుడు హెన్రి . ఆత ను'' ఒక కదా ''పో ర్టర్
,రిపో ర్టర్ ,ఓహో హో హెన్రి అని పించుకొన్న వాడు .
13-9-2002 శుక్రవారం అమెరికా డైరీ నుండి
జీన్ పాల్ సాత్రే అంటే తెలియని వారు లేరు .విశ్వ వ్యాప్త మైన పేరు అది . ఆయన
సిద్ధా ంతం కొరుకుడు పడక పో వచ్చు కాని వానవత్వ విషయాలపై ఎక్కడా దాడి జరిగినా
ప్రతిఘటించే మనస్త త్వం ఉన్న వాడు . 1905 june 21 న పారిస్ లో జన్మించాడు .
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు .తల్లి తరఫు వారి దగ్గ ర పెరిగాడు .బాల్యమ్ లోనే
''leucoma''అనే కంటి జబ్బు వచ్చింది . తర్వాత క్రమం గా నయమి పో యింది . సాత్రే చదువు
తాతను సంతృప్తి పరచలేదు . తల్లి మరోకదిని పెళ్లి చేసుకొన్నది . కుటుంబం అంతా ''లా
రోచేల్లా ''కు చేరింది .
అతి తక్కువ స్తా యిలో జీవితం ప్రా రంభించి , గొప్ప జర్న లిస్టు గా మారి ,అమెరికా
ఆత్మా ను ''లీవ్స్ ఆఫ్ గ్రా స్ ''కవితా సంపుటిలో ప్రదర్శించిన గొప్ప కవి వాల్ట్ విట్మన్ . అతని
జీవితం లో ప్రతి ఘట్ట ం అతన్ని గొప్ప కవి గా చేయటానికి తోడ్పడింది . చివరి జీవితం అత్యంత
దుర్భరం గా గడపాల్సి వచ్చింది . ఎమర్సన్ , మెల్ విల్లీ మహా రచయితలూ మెచ్చిన కవి
విట్మన్ . మానవత్వం మూర్తీభవించిన మహా కవి .యెన్నొ దేశాలకు ఆదర్స్ద ప్రా యమైన కవి .
ఒక వడ్రంగి కొడుకు అమెరికన్ కవిత్వానికి ఆత్యంత వైభవోపేతమైన మెరుగులు పెట్టి తీర్చి
దిద్దటం ఆశ్చర్యమేస్తు ంది ఽప్పతిదాకా అమెరికా కవిత్వం అంటే ఇంగ్లా డ్ కవిత్వానికి నకలు గా
ఉండేది అమెరికా మనుసుల ,మనుషుల మనో భావాలకు స్తా నం ఉండేది కాదు .ఇక్కది
తాడిత ,పీడిత జనం గురించి ,ప్రక్రు తి గురించి వస్తు వు గా తీసుకొని రాసి అమెరికా యొక్క
గ్రేటెస్ట్ పో యేట్ అని పించుకొన్నాడు శ్రీ శ్రీ లాంటి వారికి ప్రేరణ నిచ్చాడు . అమెరికా లోని న్యు
యార్క్ లో31-5-1819 లో జన్మించాడు . 73 ఏళ్ళు జీవించి 26-3-1892 లో న్యుజెర్సి లోని
కాండెన్ లో మరణించాడు .
అమెరికా సివిల్ వార్ లో నర్స్ గా పని చేశాడు . తన లీస్ ఆఫ్ గ్రస్స్ కవితా సంకలాన్ని
స్వంత ఖర్చులతో ముద్రించాడు . ఇది అమెరికన్ ఎపిక్ అని సామాన్య మానవుడి చిత్రణ
ఉందని మెచ్చుకొన్నారు అతని ఆల్బం ఉంది ,పాటల సంకలనానికి సాంగ్ ఆఫ్ అమెరికా
ఫ్రమ్ గాడ్ అని పేరు పెట్టా డు అతని సో దరులందరికి అమెరికా ప్రేసిదేన్ట్లైన వాషింగ్టన్ విట్మన్
,జఫర్సన్ విట్మన్ పేర్లను గౌరవం గా
తండ్రిఆరుగురు సంతానం లో రెండవ వాడు విట్మన్ . తండ్రి ఇల్లు కట్టి
అమ్మేస్తూ చాలా నష్ట పో యాడు . చిన్న తమ్ముడు మెంటల్ .పెద్దన్న తీవ్ర స్వభావం కల వాడు
మెంటల్ హాస్పిటల్ లో చేర్పిస్తే అక్కడే చని పో యాడు . మూడవ వాడు గొంతులో క్షయ తో
మరణించాడు . భార్య ''ప్రా స్టిట్యూట్ ''గా మారింది . సో దరి ''హైపో కాన్ద్రియా ''తో బాధ పడింది .
చిన్న తమ్ముడికి డిప్రెషన్ . ఇంట దుర్భర పరిస్తితుల నేపధ్యం లో విట్మన్ పెరిగాడు
జీవించాడు .వీతినన్నితిని తట్టు కొని మహో న్నత మానవతా వాడి గా మారి మహో న్నత
కవిత్వాన్ని రాశాడు అమెరికా ఆత్మను నిజం గా ఆవిష్కరించిన కవి విట్మన్ .
విట్మ ''సెల్ఫ్ క్రిటికల్ ఆర్టిస్ట్ ''అంటారు . ఆయన జీవితం కవిత్వం ఒక దానితో ఒకటి
పెనవేసుకు పో యాయి . అమెరికా లో అమలు జరుగుతున్నా నీగ్రో బానిసత్వాన్ని పూర్తిగా
వ్యతి రేకించాడు . ప్రజా స్వామ్యం పై అమిత విశ్వాసం . అమెరికా రాజకీయాలను తన కవితా
దృక్పధం ద్వారా ప్రభావితం చేసిన ఆదర్శ కవి మార్గ దర్శి విట్మన్ . ''prudence (cautious )is
the right arm of independence ''అని భావించాడు . అమెరికా అంటా తిరిగి ప్రజల విభిన్న
జీవన పరిస్తితులను అధ్యయనం చేశాడు .వారి దుర్భర జీవితాలను కళ్ళతో చూసి
స్పందించాడు వారి ఉన్నతికి కృషి చేయమని కవితల్లో ఉద్బోధించాడు ప్రభుత్వాలకు .వాల్లె
దేశాన్ని మోసే బో యీలన్నాడు . ఎన్నో పత్రికలకు ఎడిటర్ గా పని చేశాడు . బ్రూ క్లిన్ ,న్యు
యార్క్ లలో పత్రికలకు పని చేశాడు . అతన్ని ''common man incarnate ,collossal human
figure ''గా కీర్తిస్తా రు మానవత్వానికి ఎత్తి న పతాక విట్మన్ .
డాంటే
డాంటే అనగానే మనకు గుర్తు వచ్చేది ఆయన రాసిన ''Divine comedy '' . డాంటే ను
పిల్గ్రిం లేక యాత్రికుడు అంటారు .సాధికారమైన'' ప్రా ఫెట్ ''అని పేరు పొ ందాడు . షేక్స్ పియర్
సత్యాన్ని చెబితే , డాంటే ఆ సత్యం తో మనల్ని ప్రకాశమానమ్ గా చేస్తా డు ,ప్రభావంతో
ఉత్తేజితులను చేస్తా డు . అతనిలో ఈసా ,జోయాచిన్ అనే ఫ్లో రా కు చెందినా తత్వ వేత్తల
,జ్ఞా నుల సంయుక్త దృక్పధం ఉంది . క్రైస్తవ మతానికి పద్య రూప గ్రంధాన్ని అందించాడు .
ఎనభై ఒక్క ఏళ్ళు బతికి చరితార్దు దయ్యాడు
.
డాంటే ''ఇంఫరెంసేస్ ''అనే వాటిని యవ్వనం లోనే రాశాడు . జీవిత మధ్యకాలం
లో ''పర్గెటియా'' 'రాశాడు ంఉసలి తనం లో ''పారడైజ్ ''రాశాడు .ఒక రకం గా చెప్పాలంటే
డాంటే కవి ,ప్రా ఫెట్ ,యాత్రికుడు మాత్రమె కాదు షేక్స్ పియర్ కు వ్యతిరేక భావాలున్న వాడు
. అందుకే డాంటే ను ''యాంటి షేక్స్ పియర్ ''అంటారు .
1265 లో ఇటలీ లోని ఫ్లా రెన్స్ లో డాంటే జన్మించాడు . పూర్తీ పేరు ''డాంటే అలగె రి
''. వీరి వంశం వాళ్ళే రొం నగర నిర్మాణం లో బాధ్యత వహించారు . ''జేమ్మా జొనాటి'' అనే
ఆవిడను వివాహం చేసుకొన్నాడు . ''vita Nuova''ను పద్య గద్యాత్మకం గా అంటే
మనాఆఆఆమ్ చెప్పుకొనే ''మణి ప్రవాళ'' శైలి లో రాశాడు .దీనినె డాంటే ''poem ''అని
పిలుచుకొన్నాడు . ''Beatrice Portrinari'' అనే'' నారి ''ని చిన్నప్పటి నుండి ప్రేమించాడు
.ఆమె పై తనకున్న ప్రేమను '' platonic devotion ''అని చెప్పుకొన్నాడు . ఇటాలి సివిల్ వార్
లో చేరి పని చేశాడు . మరణ శిక్ష విధించారు .ఇల్లు వదిలి పారిపో యాడు . మళ్ళీ ఫ్లా రెంస్ లో
కాలు పెట్టలేదు .
''Dante had learned ''how salt is taste of another man's bread and how hard
is is the way up and down another man's stairs '' అంటే అన్నీ ప్రా క్టికల్ గా చేసి చూసి
తెలుసుకొన్నాడు .తన ప్రసిద్ధ రచన ''డివైన్ కామెడి ''ని 1307 నలభై రెండేళ్ళ వయసులో
రాశాడు . ఇక అప్పటి నుండి ఫిలాస ఫర్ అయి పో యాడు. ఆ లానె జీవించాడు . రేవేన్నా లో
స్తిరపడి పో యాడు . భార్య ముఖంను మళ్ళీ చూడనే లేదు . ఆయనాఆ ఏం ?చెప్పాడు
'' Dante personally reveals himself in the penances of pride ,wrath ,and lust ''these
were the areas where he felt he had sinned most in his life . ''
1321 లో మలేరియా తో మరణించాడు డాంటే . దంటే గొప్ప రాజకీయ ఆలోచనా
పరుడు ,వేదాంతి ,గొప్ప కవి . ప్రపంచ ప్రసిద్ధి చెందినా కవులలో డాంటే ఒకడు గా గా
పేర్కొంటారు . ఆయన రాసిన ''వీటా నోవా ''లో ప్రేమ అనుభవాలున్నాయి .'' love of a lady
far from disrupting the christian faith ,could in fact lead to the love of God .no
question of paradise without his love Beautrice .his lady was herself ''the
beautitude which is the goal of desire ''అంటే -''కామి గాక మోక్ష కామి కాడు'' అని మన
వాళ్ళు చెప్పిన దానికి దంటే కూడా వత్తా సు పలికాడన్న మాట . చలం కు రజనీష్ కు కూడా
మార్గ దర్స్ది డాంటేనెమో నని పిస్తు ంది . దంటే భాష లో '' salute''అంటే ''salvation ''అని
కూడా అర్ధం అంటే విముక్తి ,మోక్షం అని భావం . మన ''ముక్త పద గ్రస్తా న్ని '' డాంటే తన
కవిత్వం లో ప్రయోగించాడు . ''Dante is nothing but power ,passion and self will .his
power is in com
హో మర్
ఇలియడ్ 24 పుస్త కాలుగా విభజింప బడింది . 12,000 కవితా పంక్తు లున్న ఎపిక్
కావ్యం . హో మర్ చిత్రించిన హీరో లందరూ బాగా కడుపు నిండా తినగలిగిన వాళ్ళే కాక తాగు
బాతులు కూడా . హో మర్ కు ఒక గొప్ప ప్రతిభ వుంది .వ్యక్తు ల మనస్త త్వాన్ని ఒక్క మాట
ద్వారా ఆవిష్కరిస్తా డు . ఇలియడ్ ,ఒడిస్సీ లు పాశ్చాత్య దేశాల క్లా సిక్స్ .వీతికి ఆది కవి
హో మర్ . హో మర్ పురాతన గ్రీకు కధలు రాసిన వారిలో అగ్రేసరుడు . ఈ రెండు పాశ్చాత్య
సాహిత్యం లో తోలి రచనలు అని ముందే చెప్పుకొన్నాం . హో మర్ ప్రభావం ఆయన రచనల
ప్రభావం ఎన్నో తరాల వారిని ఉత్తేజ పరచింది .
హో మర్ కాలానికి సంబంధించిన వివాదం ఉంది .''హెరడో టస్''చరిత్ర కారుడు
హో మర్ కవి తనకంటే 400 ఏళ్ళ ముందరి వాడు ఽని చెప్పాడు 850b.c. కాలం వాడని
భావించారు . కొందరు ట్రో జన్ వార్ కాలం వాడు కనుక ఆయుద్ధా న్ని స్వయం గా చూసి
ఉంటాడు కనుక అంట బాగా వర్ణించ గలిగాడు అని ఊహించారు . అంటే 12.B.C. వాడుగా
అనుకొన్నారు . కాని ఆధునిక చరితక
్ర ారులు హో మర్ ను 7-8 B.C. కాలం వాడుగా
నిర్ణయిస్తు న్నారు .
గ్రీకులను అత్యంత ప్రభావితం చేసిన వాడు హో మర్ . ''గ్రీకుల గురువు ''గా
ఆరాధించారు . హో మర్ రచనలలో యాభై శాతం ''ఉపన్యాసాలే ''అంటే స్పీచెస్ గ్రీకు దేశం లో
''పాపిరాస్ ''పై రాయటం తో హో మర్ రచనలు రాత పూర్వకం గా మొదట లభించాయి .
హో మర్త న కవిత్వం లో వాడింది ''అయానిక్ గ్రీక్ మాండలికం ''.ఇన్దు లొ ''ఎయోలిక్ గ్రీక్
''మాండలికం కూడా కలిసి పో యింది . చివరికి ఇది ''ఎపిక్ గ్రీక్ ''అని పించు కొన్నది . ఆయన
ఉపయోగించిన ఛందస్సు ''dactylic Hexameter ''.దీని వాళ్ళ తానూ చెప్పదలచుకోన్నదాన్ని
అతి సరళం గా స్పష్ట ం గా వేగా వంతం గా చెప్పా గలిగాడు . ఇదే హో మేరిక్ పో యెట్రి ముఖ్య
లక్షణం . ఫ్రెంచ్ మొదలైన వారి కవిత్వం కంటే చాలా సాదు స్వభావం హో మర్ కవిత్వం లో
ఉందని విశ్లేషకుల అభి ప్రా యం .
జేమ్స్ బాస్వేల్
johnson
బాస్వేల్ తన గురువు జాన్సన్ ను 1763 లో మొదటి సారిగా కలుసుకొన్నాడు .
జాన్సన్ 1777 లో ''the lives of the poets ''రాయటం ప్రా రంభించి1781 లో ఆరు
వాల్యూములను పూర్తీ చేశాడు . 1784 లో డెబ్భై అయిదేళ్లకు జాన్సాన్ మాఅహాశయుదు
మరణించాడు . 1791 లో బాస్వేల్ తన గురువు జాన్సన్ పై రాసిన పుస్త కాన్ని ప్రచురించాడు .
బాస్వేల్1795 లో యాభై అయిదేల్లకే చని పో యాడు .
నేను ఇంటర్ లో ''జ్బాస్వేల్స్ లైఫ్ ఆఫ్ జాన్సన్ ''అనే ప్రా జ్ లెసన్
చదువుకొన్నది జ్ఞా పకం వచ్చింది .
''boswell and Gibbon in England have constructed factual narratives which stand as
literary master pieces of the very first rank ''అని పేరొందాడు బాస్వేల్ . అలాగే ఆటను
రాసిన పుస్త కాలు అంటేనే సాహిత్యం అయినాయి ఽతను ఎమోషనల్ రచయితా . విశ్వ
వ్యాప్త మైన యధార్ధా లను రచనలో పొ ందు పరచాడు . నిజాలాకే ప్రా ధాన్యత నిచ్చాడు . కనుక
అంతకు ముందు రాసిన వారి కంటే భిన్న దృక్కోణం బాస్వేల్ కున్నది అదే బాస్వేల్ ప్రత్యేకత
ఽన్దు కె అతని రచనలు ఒరిపిడి రాయి లని పించుకోన్నాయి . బాస్వేల్ రాసిన జాన్సన్ జీవిత్స్
చరిత్ర ఆయన చరిత్ర మాత్రమె కాదు ఆయన వ్యాక్తిత్వానికి దర్పణం కూడా . అదే బాస్వేల్
సృజనాత్మక కళ కు ఆయువు పట్టు .ఆ రచనను '' magnificient literary symbiosis ''అని
కీర్తించారు జీవిత చరితల
్ర ు రాయాలి అంటే బాస్వేల్ లాగా రాయాలి అని అంటారు ంఆర్గ దర్శి
అని పించుకొన్నాడు . అందులో బాస్వేల్ మేధావి తనం (జీనియస్ )కానీ పిస్తు ంది .బాస్వెల్
స్వయం సిద్ధమైన జ్ఞా పక శక్తి ఉన్న రచయితా . జాన్సాన్ లో ఉన్న అంతర్గ త గొప్ప తనాన్ని
గొప్ప గా ఆవిష్క రించాడు . అందుకేboswell's life of Samuel Johnson '' అనే జీవిత చరిత్ర
'' the greatest biography ever written ''అని పించుకోంది బెర్నార్డ్ షా ''Boswell is the
dramatist who invented Johnson .it is a judicious and fruitful narrative ''
అని మెచ్చుకొన్నాడు .
18-9-2002 బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి -
అరుదైన ప్రపంచ కదా రచయితా లలో అంటోన్ చెకోవ్ ఒకడు . చిన్న కదా రచయితలలో
అ త్యధిక ప్రభావం కలిగించిన వాడాయన . ఆయన పద్ధ తికి వ్యతిరేకి కాఫ్కా అయితే బో ర్గేస్ ఈ
విధానాన్ని అభి వృద్ధి పరచాడు . ఆయనది అతి సున్నితమైన సరళ విధానం .నిజాలకు
దగ్గ రగా ,దాదాపు తనను గురించే ఉన్నట్లు ఉంటుంది .చెకొవ్ ను గురించి రష్యా ప్రముఖ
'ఆనదర్ హో లీ సో ల్ ''అని అంటూ . ప్రముఖ రష్యా రచయితా టాల్ స్టా య్ ''వచన పుష్కిన్
''అని కీర్తించాడు .చెకోవ్ చిత్రించిన పాత్ర ''ఒలేంకా ''విశ్వజనీన మైనది అని మెచ్చాడు .
1860 january 17 న చెకోవ్ పుట్టా డు అ సలు పేరు అంటోన్ పావ్లొ విచ్ చెకోవ్
''. .కుతుమ్బమ్ మాస్కో చేరింది .కుతుమ్బ బాంధవ్యం బాగా ఉన్న వాడు చెకోవ్ . ఇరవై
నాల్గ వ ఏట వైద్య విద్య పూర్తీ చేశాడు . 1884 ,1886 లలో రెండు కదా సంకాఆఆలనాలను
వేలువర్చాడు . గ్రిగారో విచ్ అనే రష్యన్ నవలా కారుడు ''the real talent in you sets you
far above other writers of the younger generation ''అని చెకోవ్ బుజం తట్టి
అభినందించాడు .
1887 లో ''ఇవనోవ్ ''అనే నాటకం రాశాడు . అదే ఏడాది పెద్దకద గా ''ది స్టెప్పీ '' రాసి
పేరు పొ ందాడు .దీనికి పుష్కిన్ అవార్డ్ వచ్చింది . కొంతకాలానికి క్షయ వ్యాధి వచ్చింది జైల్లు
అన్నీ తిరిగి చూశాడు . వాటి నిర్వహణ పై తన అభిప్రా యాలను ''sakhalin island 1891 ''గా
రాశాడు . కరువు నివారణ పనుల్లో తన వంతు పాత్ర కూడా నిర్వహించాడు . 1894 లో ఎన్నో
అత్యద్భుతమైన కధలు రాశాడు .''అంకుల్ వాన్యో ''నాటకం రాశాడు కాని క్లిక్ అవలేదు
. 1898 లో ''సీ గల్ '' నాటకం రాసి ప్రదర్శిస్తే బ్రహ్మాన మైన విజయం లభించింది .
ఽఅరొగ్యమ్ తగ్గి పో వటం వాళ్ళ ''ఎల్తా హెల్త్ రిసార్ట్ ''లో చేరాడు . అక్కడే టా ల్ స్టా య్
,మాక్సిం గోర్క్రీ లతో పరిచయం ఏర్పడింది . ''medicine is my lawful wife and literature is
my mistres '' అని చెప్పి రెండిటిని సమర్ధ వంతం గా జీవితాంతం నిర్వహించాడు ''.chekov
offers theatre mood and a submerged life in the text ''అతని నాటకాలున్దేవి . సి గల
నాటకం పరాజయం పొ ందిన తర్వాతా దియేటర్ కు సలాం కొట్టేశాడు కాని మాస్కో ఆర్ట్
దియేటర్ లో మళ్ళీ ప్రదర్శించిన తర్వాత ఊపిరి పీల్చుకొని న్ప్లేస్ రాయటం కోన సాగించాడు .
చెకోవ్ మొదట్లో డబ్బు కోసమే కధలు రాసినా క్రమం గాసృజనాత్మక శైలి తో ఆధునిక
కదా కు బీజం వేసిన రచయితా అయ్యాడు .'' చైతన్య స్రవంతి '' టెక్నిక్ విదాన్నాన్ని
ప్రా రంభించిన వాడుకూడా చేకోవే . ఆ తర్వతే జేమ్స్ జాయిస్ వగైరాలు కోన సాగించారు .
కధకుడు ప్రశ్నించి వదిలి పెట్టా లె కాని సమాధానం చెప్పరాదని చెకోవ్ అంటాడు తన రీడర్స్
తో .
1901 లో ఓల్గా నిప్పర్ ''అనే నటి ని పెళ్లి చేసుకొన్నాడు . తర్వాత ''ది లేడి ఆఫ్ ది
డాగ్'', ది డార్లింగ్''కధలు రాశాడు . 1991 లో'' ది డార్లింగ్ ''అనే నాటకం రాశాడు .నలభాఇ
నాలుగు ఏళ్ళు మాత్రమె జీవించి 1904 july 2 న జెర్మని హాస్పిటల్ లో అంటోన్చెకోవ్ ''
అస్త మించాడు .
చెకోవ్ చాలా సహజ వాతావరణం లో కధలను చెబుతాడు అంటే నేచురాలిటి ఎక్కువ
. ఒకడు ఇంకొకడితో సంభాషిస్తూ చెబుతున్నట్లు గా కదా రాస్తా డు . అదీ ''చేకోవియన్ వె ఆఫ్
స్టో రి టే ల్లింగ్ ''అని పిలుస్తా రు . పాత్రలు నిండుగా ఉంటాయి జీవమ్ తో తోనికిస లాడతాయి .
ప్రత్యెక మైన నీటి ఏదీ కధలో కానీ పించాడు చెప్పాడు కూడా . ప్రత్యెక మైన సందేశమూ
ఉండదు ఽలలలు అలలుగా కదా సంవిధానం జరిగి పో తుంది . మానసిక పరిస్తితి ని బట్టి కదా
నడుస్తు ంది ఽన్తె మూడ్ ను బట్టి కదా విధానం ఉంటుంది . అంతర్గ త హాస్యం తో కవితాత్మకం
గా అక్కడక్కడ ప్రా జ్ ను నడిపిస్తా డు . కదా కు నిజమైన ముగింపు నివ్వదు .దీనికి కారణం
మానవులు ఉన్నంత వరకు ,వారి కస్టా లు ,ఇబ్బందులు క లలు ,ఆశలుఉన్నంత వరకు
స్పష్ట మైన ఆఖరు సన్ని వేశం కాని ,ముగింపు కాని ఉండదని చెకోవ్ అభిప్రా యం .
ఒకరికొకరు కదా చెప్పే విధానం ఉన్నందు వాళ్ళ ఇద్ద రు వ్యక్తు ల భిన్న స్వభావాలు నటన
మనకు కధలో కానీ పించి బహు తమాషా గా ఉంటుంది .
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
ముచ్చటగా మూడు చెకోవ్ కధలు -
రెండవ కద -దిదార్లింగ్
చెకోవ్ దీనిని1899 లో రాశాడు . ఇది ''డిపెండెంట్ వుమన్ మీద మాకరి ''.
ఇందులో ''ఒలేంకా ''అనే ఆవిడను స్త్రీత్వానికి ప్రతి రూపం గా తీర్చి దిద్దా డు'' .అని టాల్ స్టా య్
అన్నాడు . ఆయనే '' the soul of darling with her capacity for devoting herself with
her whole being to one she loves ,is not ridiculous but wonderful and holy ''అని
మెచ్చాడు . అయితే ఈ కధను గోర్కీ ఇష్ట పడలేదు . ఈ కధకు రష్యన్ భాషలో పేరు
''duschechka ''అంటే ''soul ''ani'' అని అర్ధం . ఇక కదా లోకి వద్దా ం
''ఒలేంకా ''అనే ఆవిడ ఒక ఓపెన్ ఎయిర్ దియేటర్ లో ''కుంకిన్ ''అనే మేనేజర్ దగ్గ ర
కూర్చుని ఉంటుంది . వాడు వాతావరణం గురించి మాట్లా డుతుంటాడు . దియేటర్ నడవ లేని
స్తితి . ఇవి ఆమె కు కలిసి ఒస్తా యి . వాడిలో డిప్రెషన్ గమనిస్తు ంది ఽఅమె లో ని మృదు
స్వభావం ప్రశాంత చిత్త ం అతన్ని ఆకర్షిచాయి . ఇద్ద రు ఇష్ట పడి పెళ్లి చేసుకొంటారు . . ఇప్పుడు
దియేటర్ బాగానే నడుస్తో ంది . ఇద్ద రు కలిసి సమర్ధం గా నిర్వ హిస్తూ న్తా రు . ఆమె కు పెళ్లి
వాళ్ళ సంతృప్తి లభిస్తు ంది .వీదికి నష్ట ం వాళ్ళ బాధ ఉంటాయి . వాడు ఏదో పని మీద మాస్కో
వెళ్లి అక్కడే చని పో తాడు .
మూడు నెలలు ఆఅమె వాడి జ్ఞా పకాల తో ఏడుస్తూ నే ఉంది . ఒక రోజు చర్చి కి
వెళ్తు ంటే ''pustovalov ''అనేత టి మ్బర్ ,మ ర్చంట్ తో పరిచయ మేర్పడుతుంది . ఇద్ద రు పెళ్లి
చేసుకొంటారు . ఆరు ఏళ్ళు సుఖం గా నే ఉంటారు . భర్త కున్న అభిరుచులతో ఏకీభావం తో
పని చేస్తు ంది . వాడు బిజినెస్ ట్రిప్ మీద దూర దేశాలకు పో తాడు . అప్పుడు భార్యను
వదిలేసి ,ఒక పిల్లా డున్న ''spirnin ''అనే వాడు పరిచయ మవుతాడు . ఇంతలో పుస్కలోవ్
చని పో తాడు . ఒక ''నన్'' జీవితాన్ని సాగిస్తో ంది . మళ్ళీ మామూలు స్త్రీ అయింది . మూడో
మొగుడు సైబీరియా వెళ్ళాడు . మళ్ళీ ఒంటరి తనం ,దిగులు . ''emotional emptiness ''తో
బాధ పడుతుంది . ఇలా కొన్నేళ్ళు గడిచి పో తాయి . మూడో భర్త ''సిమ్రిన్ ''మరో పెళ్లి చేసుకొని
పెళ్ళాం ఆమెకు పుట్టిన పిల్లా డితో దిగుతాడు . ఒలేంకా ఏ విధమైన స్వార్ధా న్ని చూప కుండా
నిష్కళంక మనస్సు తో వారిని ఆహ్వానించింది .
కొద్ది కాలం తర్వాత వాడి కొత్త భార్య వేడిని వదిలి వెళ్లి పో తుంది . సిర్మిన్
కూడా కొన్ని నెలల తర్వాత కొడుకు ను ఒలేంకా వద్ద వదిలి ఎటో వెళ్లి పో తాడు . ఇప్పుడామె
కు ఆ చిన్నారె ప్రపంచం . వాడితోనే ఆడుతోని ,పాడుతోంది ముద్దు ముచ్చట తీరుస్తో ంది
పాతవి అన్నీ మార్చే పో యింది . ''she loved her three husbands expecting nothing in
return .''అని టాల్ స్టా య్ ఆమె పాత్రను మెచ్చాడు . ఆయనే ''intended to damn but the
god of poetry forbade him to do so ordered him to bless and he blessed unwillingly
clothed this dear creature ,such wondrous light that it for ever will remain an
example of what a woman can be in order to be happy and to make happy those
with whom fate brings her '' అని చెబుతూ ''this story is so excellent because it came
out unconsciously ''అని తీరు నిచ్చాడు . బహుసా ఇలాంటి కధలు మన వాళ్ళు చాలా
మన కుటుంబాలలో ఈ సంఘటనలు జరిగి ఉండక పో వచ్చు రెండో పెళ్లి మూడో పెళ్లి
చేసుకొన్నా స్త్రీలు భర్త కు పుట్టిన సంతానాన్ని ఈ విధం గా నే ప్రేమించిన విధానం ఉంది . అది
పాశ్చాత్య దేశం కనుక ఆఅమె కు నచ్చిన వాడిని పెళ్ళాడింది పరిస్తితుల ప్రా బల్యమ్
వల్ల .
ఈ కదా మీద టాల్ స్టా య్ మాట్లా డుతూ చెకోవ్ మొదట్లో ఒక స్త్రీ ఎలా ఉండ రాదో
అనే విషయం మీద రాయాలను కొన్నాడు ఽయితె రాస్తు న్న కొద్దీ ఆయన దాన్ని ఒక
ఉదాహరణ గా నిలిచే మహిళ గా మార్చాడు . స్త్రీ కి తనకున్న వ్యక్తిత్వాన్ని ,మనసును
,బుద్ధిని ప్రదర్శించే స్త్రీ ని గురించి రాశాడు చివరికి . అందుకే విమర్శకులు ఒలేంకా ను ''merry
woman ''అని తేల్చారు .
తన ప్రేమను అంతటిని తనను ,తన మనసును ,సర్వస్వాన్ని కరగించి భర్త కు
అందించాలనే తాపత్రం ఉంది . దాని వల్ల ''that could give her ideas and an object in life
and would warm her old blood ''గా భావించింది ఒలేంకా . ఇందులో ''love is grace
proceeding from the lover's fulness of heart ,not from the beloved's attractive
qualities or high desires ''అనేది ముఖ్య మైన పాయింట్ . చెకోవ్ సృజన ఉన్న కధకుడు .
శూన్యం లోంచి శూన్యం లోకి వెళ్ళటం అనేది అతని ఫిలాసఫీ . సాదా సీదా గా ఉన్న వాళ్ళు
యెంత ఉన్నతం గా ఆలోచిస్తా రో జీవిస్తా రో ఒక్కలేంకో లో చూపించాడు . అందమైన
ప్రపంచాన్ని ఎలా సృస్తిన్చుకొంటారో తెలిపాడు కూడా .
కొంగ్త మంది ఒలేంకా ప్రేమ గుడ్డిది అన్నారు ఽన్దు లొనె ఉంది పో వాలను కొనే
తత్త ్వం అన్నారు . కాని ఆమెలో మనకు ఒక స్త్రీత్వపు సంపూర్ణ లక్షణాలు ఒక మాత్రు మూర్తి
పూర్తీ స్వరూపం కానీ పిస్తు ంది . అది ఆమె తిరుగు లేని ,ప్రశ్నింప రాణి ప్రేమకు నిష్కలంక
ప్రేమకు గొప్ప ఉదాహరణ గా అందరు చెప్పారు . ప్రేమ కు హడ్డు లున్ద వని ఆమె తన భర్త
ఎక్కడో కన్నా కొడుకును తన వాడుగా స్వీకరించటం మహో న్నత ఆదర్శం .''she devotes
herself with boundless love to future man (son ),the school boy in the big cap ''అని
చెకోవ్ ముగిస్తా డు .
''ఒలేంకా ఒక ప్రపో జిషన్ ''కు మూర్తి మత్వం .కాని నిజ జీవితం లోని పాత్ర కాదన్నాడు
ఒక విమర్శకుడు . అయితే రోనాల్డ్ రాయ్ ఫీల్డ్ ''death is less fearsome than a wasted
life . happiness lies in grasping opportunities in acting on desire ,in letting the
individual blossom to the full ,before it has to fade ''అని ఈ కదా మీద గొప్ప తీర్పు
నిచ్చాడు .
ముచ్చటైన మూడో కద ఇంకో సారి
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
సమాప్త ం
అందరికి కర్కాటక సంక్రమణ (దక్షిణాయణ )శుభాకాంక్షలు -ఈ రోజే
దక్షిణాయణం ప్రా రంభం .
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి -
యేవో కొద్ది పద్యాలు మాత్రమె సామాన్యులకు కొరుకుడు పదనివి అన్న వాటిని రాసిన విశ్వ
నాద ను ''పాషాణ పాక ప్రభూ ''అని జోక్ చేశాడు జరుక్ శాస్త్రి . ఆంగ్ల కవిత్వం లో అర్ధం కాని
కవి అని ''అ యః పిండ కవి ''అని పించుకొన్న వాడు రాబర్ట్ బ్రౌ నింగ్ . మనకాశీ ఖండానికి
,నైష ధా నికి ఆ పేరుంది . బ్రౌ నింగ్ ను అందరు తక్కువగా అంచనా వేసిన ఆంగ్ల సాహిత్య
మహా కవి అనీ బ్లూ మ్ అనే విమర్శకుడు తేల్చాడు . బ్రౌ నింగ్ ను పాశ్చాత్య యోని వేర్సితీ
లలో పూర్తిగా మర్చి పో యారని బాధ పడ్డా డు అంటే బ్రౌ నింగ్ కవిత్వం మీద వాటిలో బో ధనా
,అధ్యయనం పూర్తిగా నెగ్లెక్ట్ చేశారన్న మాట . ఆ కాలం లో టెన్నిసన్ మహా కవి బ్రౌ నింగ్ కు
ప్రత్యర్ధి కవి . బ్రౌ నింగ్ లో''nihilistic self deception '' ఉందని భావించారు .
1812 may 7 న బ్రౌ నింగ్ లండన్ దగ్గ రున్న ''కాంప్ బెల్ ''లో జన్మించాడు . తల్లికి
మాట విశ్వాసం అధికం . తండ్రి వద్ద పెద్ద గొప్ప లైబర
్ర ి ఉంది . పదమూడేళ్ళ
వయసులోనే''ఇంకాండిట ''పేరుతొ కవిత్వం రాశాడు బ్రౌ నింగ్ . కాని ప్రచురించలేదు . అప్పటికే
వోల్టై ర్ ,షెల్లీ లను క్షున్నం గా చదివాడు . అది ''spiritual questioning time ''.తండ్రి లాటిన్
గ్రీక్ భాషలను నేర్పాడు .షెల్లీ అంటే వీరాభిమానం కలిగింది . సంగీతం కూడా నేర్చాడు .
లండన్ యోని వర్సిటి లో చేరినా కవిత్వం రాయాలనే ఉద్దేశం తో మధ్యలోనే గంట కొట్టేశాడు .
1833 లో ''పాలిన్ '' రాసి మేనత్త సహకారం తో అచ్చు వేశాడు . ఏమీ ప్రో త్సాహం రాలేదు .
''స్టూ వార్ట్ మిల్ ''ఇచ్చిన సలహా తో ''dramatic monologue poet ''గా మారాడు . 1835 లో
రష్యా వెళ్లి వచ్చి '' paracelsus''రాశాడు . మంచి గుర్తింపే వచ్చింది . మేధావి వర్గ ం బాగా
మెచ్చింది . కాని దాని వాళ్ళ ఆర్ధికం గా ఏమీ లాభం రాలేదు పాపం .
డాస్తో విస్కీ-1
డాస్తో విస్కీ పేరు చెప్పగానే గుర్తు కు వచ్చే నవల ‘’క్రైం అండ్ పనిష్ మెంట్ ‘’అంటే
‘’నేరము-శిక్ష ‘’విశ్వనాద్ ఈ పేరుతొ సినిమా తీశాడు .పూర్తిగా ఆ నవలలో కధకాకపో యినా
ఆ ఛాయ కనీ పిస్తు ంది .ఏం .బాలయ్య సినిమా అది . దాస్తో విస్కీ నవలా కారుడు కధకుడు
వ్యాస మూర్తి కూడా .అన్నిటిలో సైకల్లా జికల్ అప్ప్రోచ్ ఉంటుంది అదే ఆయన ప్రత్యేకత .
ఈయన రచనలు క్లా సిక్ లని పించుకోన్నాయి .కధనం అత్యద్భుతం గా నిర్వహిస్తా డు .
పందొ మ్మిదో శతాబ్ద ం లో రాసిన నేరమూ శిక్షా చాలా ఆధునికం గా అని పిస్తు ంది . ‘’study of
psychic within a character ‘’ఆయన ప్రత్యేకత . ఆయకున్న ‘’మెంటల్ ఇల్ నేస్’’కూడా
రచనకు తోడ్పడింది .అతని భాషా ,వేదాంత భావనలు అబ్బుర పరుస్తా యి . అతనిలో మతం
పాత్ర ఉంది . ఆధునిక కాలానికి సరి పో యే రచన నేరమూ శిక్ష .
manuscript of the writer
బాల్జా క్ ,జార్జి సాండ పుస్త కాలను అనువాదం చేశాడు . మొదటి స్వంత రచన
‘’పూర్ ఫో క్ ‘’.అందరు మెచ్చుకొన్నారు . అప్పటికి గోగోల్ రచనలు ‘’రొమాంటిక్ ‘’గా
ఉండేవి . తర్వాత తీవ్రవాద భావ జాలం అతనిలో ప్రవేశించింది . ..1848 లో రష్యా పాలకుడు
మొదటి నికోలస్ రాజు రష్యాలో కూడా జర్మనీ లో వచ్చిన తిరుగు బాటు వస్తు ందేమో నని
భయపడి రాడికల్స్ ను అరెస్ట్ చేయించాడు . అరెస్ట్ ఐన వారిలో దాస్తో విస్కీ కూడా ఉన్నాడు
. విచారణ జరిగి మరణ శిక్ష విధించారు ఈయనకు . చావటానికి సిద్ధ పడ్డా డు . ఉరి
తీయటానికి సైబీరియా లేబర్ కాంప్ కు తరలించారు . గడ్డ కట్టే విపరీతమైన చలిలో పెరేడ్
చేయించారు .వరుసగా నిల బెట్టి ఉరి తీయటం ప్రా రంభించారు .ఆరుగురిని అప్పుడే ఉరి
తీయాలి ఆ రోజున .మొదటి వరుసలో ముగ్గు రు ,రెండో వరుసలో ఉన్న ముగ్గు రి లో దాస్తో
విస్కీ కూడా ఉన్నాడు . ఆ సంఘటన గురించి ఆయన వర్ణించిన మాటలు ‘’to day
December 22 ,we were taken to semyonov square .there were all read the death
sentence ,allowed to kiss the cross ,had sobers broken over our heads ,and our pre
death attire put on . then three people were stood against the stakes for the carrying
out the execution . I was sixth in the line. People were summoned by
threes ,consequently . I was in the second row and had no more than a minute left
to live. I remembered you brother Michail and all of your family .at the last
moment . .you only you were in my mind ,only then did I realize how much I love
you ,my dear brother . finally a retreat was sounded ,the ones tied to the stake were
led back and it was announced that His Imperial majesty was granting us our lives
‘’ఇలా మరణం అంచు నుంచి మళ్ళీ జీవితం లోకి వచ్చాడు మన కధకుడు . అంతఉత్కంత
భరిత సన్నీ వేశం అది . దీని టో కొందరికి మానసిక ఒత్తి డి ని తట్టు కోలేక ,ఫ్రస్ట్రేషన్
అనుభవించలేక మతి స్తిమితం తప్పింది . మన వాడు హాయిగా బయట పడి పో యి
‘’ఇడియట్‘’నవల రాశాడు . .
‘’ the village of stepanchikovo and its inhabitants ‘’కదా రాశాడు సో దరుడి తో
కలిసి ‘’టైం’’(వేర్మ్య )జర్నల్ ను ప్రా రంభించాడు . అందులో ‘’the insulted and the injuries
‘’ను ధారా వాహికం గా రాశాడు . నెమ్మదిగా ‘’కన్సర్వేటివ్ ‘’మనస్త త్వం వచ్చేసింది . భార్యా
భర్త ల మధ్య మన్స్పర్ధలోచ్చాయి . యూరప్ ట్రిప్ వెళ్ళాడు .’’winter notes and summer
impressions ‘’పత్రిక లో తన యాత్రను గురించి రాశాడు . 1883 లో ‘’టైం బూమ్ ‘’రాశాడు
.పదకొండు నవలలు మూడు నవలికలు ఇరవై ఏడు చిన్న నవలలు అనేక ఇతర రచనలు
చేశాడు ''he is considered one of the geatest and most prominent sychologist in
world literature ''గా ని భావిస్తా రు
సశేషం
డాస్తో విస్కి -2
అన్నా అనే అమ్మాయి ని రెండో పెళ్లి చేసుకొన్నాడు .కొత్త జంట జర్మనీ వెళ్ళింది
.అక్కడ మళ్ళీ జూడ వ్యసనం లో చిక్కుకొని పూర్తిగా దివాలా తీశాడు . అప్పుడే ‘’ the idiot
‘’నవల రాశాడు . ఇటలి వెళ్ళాడు . అక్కడి స్పిరిత్యువాలిటి ,వైవిధ్యం బాగా నచ్చాయి . ‘’the
eternal husband ‘’ను 1870 లో రాశాడు . ‘’రోల్ ఆఫ్ సీక్రెట్ పో లీస్ ‘’ను ‘’డైరీ ఆఫ్ ఎరైటర్
‘’లో రాశాడు . కొడుకు పుట్టా డు ఎపిలేప్సి జబ్బు వచ్చింది . ‘’the brothers
karamazov‘’ను కొడుకు చావు పై రాశాడు .
1880 లో పుష్కిన్ స్మ్రుతి చిహ్నాన్ని ఆవిశాక్రిస్తూ గొప్ప ప్రేరణ కలిగించే ఉపన్యాసం
ఇచ్చాడు దాస్తో విస్కీ . ఆ సమయం లోనే ‘’emphysema ‘’అని వింత జబ్బు వచ్చింది
.1881 లో సెప్టెంబర్ రెండు న 59 ఏళ్ళ వయసులో దాన్తో విస్కీ మహా రచయిత మరణించాడు
.
.1881 జనవరి ఇరవై అయిదు న రష్యా రెండవ జార్ చక్ర వర్తిని హత్య చేసిన టెర్ర రిస్ట్
ళ కోసం రష్యా సీక్రెట్ సర్విస్ పో లీసులు వెతుకుతున్నారు . దాస్తో విస్కీ అనుచరుడు ,పక్క
ఇంటి వాడిపై సెర్చ్ వారంట్ జారీ అయింది గాలిస్తు న్నారు . ఆ మర్నాడే దాస్తో విస్కీ కి
pulmonary haemorrhrage వచ్చ్చింది వెంటనే రెందొ డి మూడో ది స్ట్రో క్లు కూడా వచ్చాయి
.చని పో యేటప్పుడు ఆయన నోట బైబిల్ లోని మాథ్యూ అన్న వాక్యాలు బయటికి వచ్చాయి
.అంటే మరణించాడు రష్యా పధ్ధ తి ప్రకారం శవాన్ని ఒక టేబుల్ మీద ఉంచారు . ఆయన శవ
యాత్రలో లక్షకు పైగా అభిమానులు హాజ రాయి నట్లు అంచనా . తిక్విన్ సేమేతరి లో ఖననం
చేసి అశ్రు తర్పణం చేశారందరూ . '' .Verily, verily, I say unto you, Except a corn of
wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth
forth much fruit.
కాఫ్కా 1883 లో జులై మూడు న ప్రేగ్ లో పుట్టా డు .అతనిది మాంసం నరికే బుచర్
ఫామిలీ .చిన్నప్పుడే ముగ్గు రు చెల్లెళ్ళ మరణం . . 1901-06 వరకు ‘’లా ‘’చదివాడు .క్షయ
వ్యాధి తో బాధ పడ్డా డు . శానిటోరియం లో చేరి ట్రీట్ మెంట్ పొ ందాడు . 1910 లో
‘’మెడిటేషన్’’రాయటం ప్రా రంభించాడు . అనుకున్న అమ్మాయి పెళ్ళికి తిరస్కరించింది
.జర్మనీ కి వెళ్ళాడు .1915 లో ‘’ది మెటా మార్ఫిస్ ‘’రాసి ప్రచురించాడు . తిరస్కరించిన
అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు .జర్మన్ భాషలో కధలు ,నవలలు రాశాడు ఇరవయ్యవ
శతాబ్ది లో అత్యంత ప్రభావం చూపిన కాఫ్కా తలిదండ్రు ల మధ్య ఉన్న వ్యతి రేక ధో రణి ని
రచనల్లో చూపాడు . జర్మని హాష మాట్లా డే యూదు కుటుంబం అతనిది . కుటుంబ
సభ్యులకు స్త్రీ స్నేహితులకు వందలాది ఉత్త రాలు రాశాడు ఉత్త రం రాయటం అతనికి ఏంతో
ఇష్ట ం తండ్రి తో ఉన్న విభేదాలనే రచనల్లో చూపించాడు ''జ్యు''అవటం వాళ్ళ వచ్చిన
విభేదాలను గురించి బాధ పడే వాడు . అయితే అవే అతని రచనకు ఆధారంయ్యాయి కూడా
. ఆయన జీవిత కాలం లో ''కామ్లేన్తెషణ్ ''ఒక్కటే ప్రచురింప బడింది
ఏ హంగర్ ఆర్టిస్ట్ అనే కదా సంకలం ముద్రణకు ఇచ్చినా ప్రింట్ కాలేదు చని పో యే టప్పటికి
.చని పో యిన తర్వాతే అన్నీ ప్రచురితమయ్యాయి . .
కాఫ్కా ప్రభావం తో రచనలు చేసిన వారిలో ఆల్బర్ట్ కామస్ ,జేమ్స్ జాయిస్ ముఖ్యులు .
కాఫ్కా రచనల ప్రభావం వాళ్ళ ''కాఫ్కాస్కి ''అనే మాట డిక్షన రీ లోకి చేరింది .
టి.బి. వ్యాధి తీవ్రం అవటం వల్ల ఉద్యోగం మానేశాడు . 1921 ఇన్సురెన్స్ కంపని లో
ఉద్యోగం చేశాడు . 1922 లో ‘’దికాజిల్ ‘’నవల రాశాడు . బార్యకు విడాకు లిచ్చి మళ్ళీ కొత్త త
పెళ్లి కొడుకు అయాడు . 1924 లో మళ్ళీ ప్రేగ్ కు తిరిగి వచ్చాడు . నలభై ఒక్క ఏళ్ళకే
మరణించాడు .ఫ్రా యిడ్ సిద్ధా ంతం ప్రకారం ‘’death is the return of the organic for the
inorganic supposedly our earlier state of being ‘’అనే దాని పై నమ్మకం ఉన్న వాడు
కాఫ్కా . కాఫ్కాకు ‘’నేగటివిజం ‘’అంటే బాగా ఇష్ట ం . అదే అతని ‘’జూడాయిజం ‘’. I am a
memory come alone ‘’అంటాడు .అందుకే కాఫ్కా ను ‘’రెలిజియస్ హ్యూమ నిస్ట్
‘’అన్నారు .కాఫ్కా ను'' ఇరవయ్యవ శతాబ్ద పు డాంటే'' అంటారు విశ్లేషకులు . బ్యూరోక్రసి
మీద వ్యతిరేకతను కూడా రచనల్లో పొ ందు పరచాడు అతని న్యాయ పరిజ్ఞా నం కూడా రచనల్లో
కానీ పిస్తు ంది . కాఫ్కా రచనలు అనేక భాషల్లో కి తర్జు మా పొ ందాయి . ప్రేగ్ లో కాఫ్కా
మ్యూజియం ను ఏర్పరచి గౌరవం కల్గించారు . అనేక మంది కాఫ్కా పై పరిశోధనలు చేస్తూ నే
ఉన్నారు చేశారు చేస్తా రు కూడా అతని రచనలను ఉదాహరించని ఏ ఇరవయ్యవ శతాబ్ద పు
రచయితాలేడుఅంటే అతిశయోక్తి కాదు .సర్రియలిజం మీద ఏంటో కొంత పరిజ్ఞా నం ఉంటేనే
అర్ధమయ్యే రచనలు కాఫ్కా వి .
రుడ్యార్డ్ కిప్లింగ్
.ఈ పేరు వినగానే ఆయన ప్రసిద్ధ రచన ‘’ది జంగిల్ బుక్ ‘’తప్పక గుర్తొ స్తు ంది .
రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబర్ 30 న ఇండియా లోని బొ ంబాయి లో జన్మించాడు . తల్లి
ఆలీస్ ,తండ్రి జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ . 1882-87 మధ్య కాలం లో లాహో ర్ లో ‘’ది సివిల్
అండ్ మిలిటరీ గెజెట్ ‘’లో పని చేశాడు . తర్వాత అలహా బాద్ లో ‘’ది పయనీర్ ‘’పత్రికకు
పని చేశాడు . 1888 లో ‘’ఫెయిర్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ప్రచురించాడు . ‘’అండర్ ది
దియోడార్స్ ,’’’’ది ఫాంటం రిక్షా ‘’లను రాసి ముద్రించాడు . 1889 లో లండన్ ,జపాన్
,అమెరిక లలో పర్య టించాడు . sea to see ‘’రచన పూర్తీ చేశాడు .
రుడ్యార్డ్ కిప్ప్లింగ్ రాసుకొన్న స్వీయ జీవిత చరిత్ర ‘’some thing of my life
‘’1937 లో మరణానంతరం వెలువడింది . కిప్లింగ్ రాసిన ‘’కిం ‘’నవల అతని మాస్ట ర్ పీస్
అని పేరు పొ ందింది . ఇది’’epic of the American consciousness ‘’అని పించు కొంది.వాల్ట్
విట్మన్ ,రాసిన లీవ్స్ ఆఫ్ గ్రా స్ ,మేల్విల్లీ రాసిన మోబి డిక్ ,మార్క్ ట్వేన్ రాసిన హకల్ బేరి
ఫెన్ లసరసన నిలువ దగిన రచన గా కిప్ప్లింగ్ నవల ‘’కిం ‘’ను యెంచుతారు . ‘’my soul
drew one area to the great soul which is beyond all things . I saw nothing for ,I was
all things ,having reached the ‘’great soul ‘’.అని ఈ నవలలో కిం చేత కిప్ప్లింగ్ అని
పిస్తా డు .అందుకే కిం అనే వాడు కిప్ప్లింగ్ యొక్క భావాలకు సంపూర్ణ ప్రతినిధి అని పిస్తు ంది
..ఒక రకం గా ఇది ‘’being and becoming ‘’గురించిన కద . ఇందులో విషయం ,నిర్మాణం
కలిసి పో యి ఉన్నాయి . ఆత్మ ను తెలుసుకోవాలనే తాపత్రయం కనీ పిస్తు ంది ఇందులో .
అందుకే ‘’ఫస్ట్ రేట్ బుక్ ‘’ అంటారు . అస్తిత్వం కోసం అన్వేషణ ఉన్న నవల .రుడ్యార్డ్ ను
ఇరవయ్యవ శతాబ్ద పు ''బ్రిటిష్ ఇమ్పీరియలిజంకు ప్రా ఫెట్ ''అన్నాడు జార్జి ఆర్వెల్ అనే
ప్రఖ్యాత విమర్శకుడు కాలాన్ని బట్టి రాజకీయం మార్చాడు కిప్ప్లింగ్ . బ్రిటిష్ ప్రబుత్వ
ఆస్తా నకవి గా ''కిట్ హుడ్ ''కు ప్రతిపాదనలు చేస్తే తిరస్కరించాడు సున్నితం గా కిప్ప్లింగ్
అనేక వివాదాత్మక విషయాలను ప్రకతిన్చాదాయన .ఇమ్పీరియలిజమ్ అంతమయ్యాక
కిప్ప్లింగే అసాధారణ రచయితా అని పించాడు .
కిప్ప్లింగ్ రాసిన జంగిల్ టేల్స్ స్ప్పూర్తితో స్కౌట్ వ్యవస్తా పకుడు బాడెన్ పావెల్''ఉల్ఫ్
క్ల బ్స్ ''లాంటివి యెర్పరచాదు.
జోసెఫ్ కాన్రా డ్
1857 లో డిసెంబర్ మూడున రష్యా ఆక్రమిత పో లాండ్ లో జోసెఫ్ కాన్ రాడ్ జన్మించాడు .
అసలు పేరు ‘’Jozef Teodor Konrad Nalicz Korzieniowski ‘’చిన్నప్పుడే తల్లి
మరణించింది . తండ్రికి టి.బి. జబ్బుతో ఆరోగ్యం కోల్పోయాడు .తండ్రి కవి ,నాటక రచయితా .
పన్నెండేళ్ళ వయసులో తండ్రి కూడా చని పో యాడు . 1874 లో ‘’ఫ్రెంచ్ మెర్కండైస్ ‘’లో
ప్రవేశించాడు . మూడు సార్లు వెస్ట్ ఇండీస్ కు వెళ్ళాడు . ప్రేమ విఫలమై బాధ పడ్డా డు .
ద్వంద్వ పో రాటం లో ఒక సారి బులెట్ దెబ్బ తగిలింది . 1886 లో షిప్ కు యజమాని
అయ్యాడు .
బ్రిటన్ చేరాడు పౌరసత్వాన్ని పొ ందాడు . ‘’concord ‘’గా పేరు మార్చుకొన్నాడు .
మలేరియా టో బాధ పడ్డా డు . కాంగోలో ఉద్యోగం లో చేరాడు 1894 .కాంగో ఉద్యోగానికి రాజీ
నామా చేసి ఇంగ్లా ండ్ వెళ్ళాడు ..’’the black mate ‘’అనే మొదటి కద 1886 లోరాశాడు .
మూడేళ్ళ తర్వాత ‘’an out cast of the island ‘’,’’the Nigger of the Narassus ‘’రాశాడు
..తర్వాత ‘’టేల్స్ ఆఫ్ అన్ రెస్ట్ ‘’ ,హార్ట్ ఆఫ్ డార్క్ నేస్’’పూర్తీ చేశాడు 1902 లో ‘’టైఫూన్
అండ్ ది యూత్ ‘’అనే చిన్న కదా సంపుటి వెలువరించాడు .
1904 లో ‘’nostroma ‘’,1907 లో ప్రసిద్ధ రచన అని పించుకొన్న ‘’the secret
agent ‘’నవల రాశాడు ఇది చలన చిత్రం గా కూడా వచ్చింది . అతని ‘’మిర్రర్ ఆఫ్ ది సి ‘’కి
కూడా పేరొచ్చింది . తర్వాత ‘’మెంటల్ బ్రేక్ డౌన్ ‘’వచ్చింది కాన్రా డ్ కు. ‘’చాన్స్ ‘’అనే
నవల బాగా క్లిక్ అయింది . పాప్యులారిటి పెరిగింది .తర్వాత ‘’the shadow line ‘’,the arrow
of gold ‘’రాసి ప్రచురించాడు . 1923 లో అమెరికా వెళ్ళాడు . అక్కడ న్యు యార్క్ లో ఘన
స్వాగతం లభించింది .1923 లో చివరి నవల ‘’the rover ‘’విడుదల చేశాడు .1924 ఆగస్ట్
మూడు న ఇంగ్లా ండ్ లో మరణించాడు
హార్ట్ ఆ ఫ డార్క్ నేస్ లో సంప్రా దాయ వైవిధ్యత కన్పిస్తు ంది . రాజకీయ వ్యంగ్య
వైభవం ఉంటుంది .అందుకే దీన్ని ‘’సైకలాజికల్ ఒడిస్సీ ‘’అంటారు . కాన్రా డ్ జీవిత చరిత్రే
ఇది .ఎన్నో ఐరనీలతో సింబాలిక్ గా పెసిమిజం తో నిండి ఉంటుంది .అతని ‘’షాడో లైన్ ‘’ను
మాస్ట ర్ పీస్ ‘’అంటారుగొప్ప స్టైలిస్ట్ రచయిత అని ముద్ర పొ ందాడు . .ఆయన వాణ్ణి అంటి
హీరోయిక్ పాత్రలే .ది హెచ్ .లారెన్స్ ,హెమింగ్ వె , ఫాక్ నర్,ఫిట్జెరాల్డ్ ,ఆర్వెల్ వంటి ప్రముఖ
రచయితా లేందరి పైనో కాన్రా డ్ ప్రభావంఉంది స్వీయ జీవితాన్ని ,మాతృదేశం పో లాండ్
భావనలను కలబో సి రచన చేశాడు
.ఇరవయ్యెల్లు వచ్చే దాకా ఇంగ్లీష్ ను ధారాళం గా మాట్లా డలేని కాన్రా డ్''వన్ అఫ్ ది గ్రేటెస్ట్
ఇంగ్లీష్ రైటర్స్ ''అని పించుకొన్నాడు . ఇరవై ,ఇరవై ఒకటి శతాబ్ద పు అంతర్జా తీయ ప్రమాద
ఘంటికలకు అద్ద ంపడతాయి అతని రచనలు . అతని నవలలెన్నో సినిమాలుగా వచ్చాయి
లండన్ లో ఉన్నా తానూ పో లాండ్ వాడినే నని గొప్ప గా చెప్పుకొంటాడు కాన్రా డ్
పో లాండ్ లోని లితుయాన దగ్గ ర జేస్లా మిలోజ్ 1911 జూన్ ముప్ఫై న జన్మించాడు
.రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ప్రసిద్ధి చెందినా కవి కధకుడు ,వచన రచయితా .తన
కవిత్వాన్ని ‘’ది వరల్డ్ ‘’పేరిట అతి సాధారణ కవితలు ఇరవయ్యింటిని రాసి ముద్రించాడు .
పో లాండ్ రిపబ్లి క్ కు సాంస్కృతిక సంబందాదికారిగా పని చేశాడు . తర్వాత ‘’వెస్ట్ ’’కు చేరాడు
.1953 లో ‘’ది కాప్తివ్ ‘’అనే స్టా లిన్ వ్యతిరేక పుస్త కం రాశాడు .
అమెరికా లోని కాలి ఫో ర్నియా యూని వర్సిటి లో ‘’slavik languages and
literature ‘’కు ప్రొ ఫెసర్ గా 1961 నుండి 1998 వరకు పని చేశాడు . అమెరికా పౌరసత్వాన్ని
పొ ందాడు .1978 లో ‘’ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిట రేచర్ ‘’ను అందుకొన్నాడు .1980 లో
సాహిత్యం లో ‘’నోబెల్ పురస్కారం ‘’పొ ందాడు .ఆయన బహు భాషా పండితుడు .పో లిష్
,లిథువేనియన్ ,రష్యన్ ,ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో అమోఘ పాండిత్యాన్ని సంపాదించాడు .
కాధలిక్ మతం ను స్వీకరించాడు .
ఇరవైఆరు ఉన్నాయి . అనువాదం చేసినవీ ఎక్కువే ఽఅయన రచనలు అనేక భాషల్లో కి అనువదింప బడ్డా యి . తనను గురించి ఆయన ''i a faithful son of the
black earth ,shall return to the black earth '' అని చెప్పుకొన్నాడు .ంఇలొజ్ కవిత్వం లో కొన్ని ఝలక్ లు
''the rose is only a sexual symbol
జేస్లో క్ కు కమ్యూనిజం ,జాతీయ సో షలిజం తో సంబంధం ఉన్న వాడు ఱాజకీయ అవగాహన ను కవిత్వంరచన ల ద్వారా తెచ్చాడు .
1915 లో అక్టో బర్ పది హేడు న అమెరికా లోని న్యూయార్క్ లో ఆర్ధర్ మిల్ల ర్
జన్మించాడు . తండ్రిది ఆడ వాళ్ళ కోట్లు తయారు చేసే వృత్తి .,వ్యాపారం .తల్లి బాగా చదువు
కొన్నఆవిడ..మధ్యాహ్నం పుస్త కం చదవటం ప్రా రంభిస్తే రాత్రికల్లా ఆమె చదివేసేది .. చదివిన
నవల పై చర్చించటానికి ప్రతి వారం కొలంబస్ యూని వెర్సిటి విద్యార్ధు లను డబ్బు లిచ్చి
ఇంటికి పిలుపించుకోనేది . ‘’she was haunted by a world she could not reach out by
books she would not to read ,concerts she would not get to attend ,and above
alla ,interesting people ,she would never get meet ‘’/అని తల్లి ని గురించి చెప్పాడు
మిల్ల ర్ . .14 వ సంవత్సరం వరకు మిల్ల ర్ బాల్యం బాగానే గడిచింది . . అప్పుడు ‘’గ్రేట్
డిప్రెషన్ ‘’కూడా వచ్చింది . తండ్రి వ్యాపారం దెబ్బతిని వీధిన పడ్డా డు . తండ్రి చేతకాని తనం
పై తల్లికి విప రీతమైన కోపం .
కుటుంబం బ్రూ క్లిన్ చేరింది . సరి అయిన గ్రేడ్లు రానందున
యూని వర్సిటి లో ప్రవేశం లభించలేదు మిల్ల ర్ కు . ఆ సమయమే
ఆతను ‘’సేల్డ్స్ మాన్ ‘’నాటకం రాయటానికి గొప్ప నేపధ్యం
లభించింది .సేల్స్ మాన్ పాత్ర ను సాహిత్యం లో అద్భుతం గా
చిత్రించాడు .దాస్తో విస్కి ,టాల్ స్టా య్ పుస్త కాలను విపరీతం గా
చదివాడు 1934 .లో మిచిగాన్ యూని వర్సిటి లో చేరి జర్నలిజం
,ఏకనా మిక్స్ ,హిస్టరీ లను చదివాడు ..అప్పుడే ‘’ a quest to
understand how society changed ,how it influenced the
individual and how it could be improved ‘’అనే భావం ఏర్పడింది
. సో షలిజం మీద మోజు ఏర్పడింది . సామాన్య మానవుడి హక్కులు
,గౌరవం గురించి తెలుసుకొన్నాడు . ‘’ a social evolution of the
planet ‘’ వల్ల కొత్త న్యాయం ,చట్ట ం, ఉన్న వ్యవస్థ వస్తు ందని ఊహల్లో
తేలియాడాడు ..
కాలేజి లో నాటక రచన పో టీలో మొదటి బహుమతి పొ ంది , 250 డాలర్ల నగదు
పొ ందాడు . ఆ నాటకమే ‘’నో విలన్ ‘’.అందులోని పాత్ర లన్నీ తన కుటుంబం లోని వారి
వంటి వారే . ఇందులో మిల్ల ర్ ‘’introduced many of the themes and conflicts that
dominate his later and more artistic works ‘’. స్వార్ధా నికి ,పరాభవానికి మధ్య ఉన్న
టెన్ష న్ ను ,క్లా స్ స్ట గ
్ర ుల్ ను ,కుటుంబ సభ్యులకు కుటుంబ ఆనుకూల్యత కుమధ్య ఉన్న
విభేదాలను మొదలైన ఎన్నో విధానాలను అందులో చూపించాడు . దీని వల్ల వచ్చిన
ప్రో త్సాహం టో ఇంగ్లీష్ లో డిగ్రీ ని సాధించాడు . దియేటర్ ప్రా జెక్ట్ లో చేరాడు . మేరీ స్లేటరి ని
పెళ్లి చేసుకొన్నాడు . ఇద్ద రు పిల్లలు కలిగారు .బ్రూ క్లిన్ నేవీ యార్డ్ లో పని చేశాడు
.రేడియోకు నాటికలు రాసి మంచి పేరు పొ ందాడు . 1944 లో ‘’man who had all the luck
‘’నాటికను బ్రా డ్వే లో ప్రదర్శించారు . అది స్పందన కల్గించలేక పో యింది . ఆ విషయాన్ని
గురించి రాస్తూ ‘’I could become no body like music player on wrong instruments
ina false scale ‘’అని తనను తానూ ఎస్టిమేట్ వేసుకొన్నాడు
తర్వాత ‘’ఫో కస్ ‘’నవల రాశాడు . 1930 లో ఫ్రస్ట్రేషన్ తోనలిగి పో యాడు ఆర్ధర్ .
అప్పుడు ‘’ఆల్ మై సన్స్’’నాటిక రాస్తే ఒక మాదిరి స్పందన కలిగింది ప్రేక్షకులలో . కాని 328
సార్లు ప్రదర్శింప బడింది . దీనికి ‘’డ్రా మా క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ‘’వచ్చింది . అప్పుడు తాను
పొ ందిన విజయానికి గర్వ పడ్డా డు ఆనందం పొ ందాడు సంత్రు ప్తిలభించింది . ‘’my
identification with life’s failures was being menaced by my fame ‘’అని ఆనందం
గా మిల్ల ర్ రాసుకొన్నాడు .
1949 లో చిర కీర్తి తెచ్చి పెట్టిన ‘’the death of the sales man ‘’నాటకం రాశాడు .
దానిపై ప్రశంసా వర్షమే కురిసింది . మొదటి ప్రదర్శన ఫిలడెల్ఫియా లో జరిగింది . నాటకం
అయి పో గానే ప్రేక్షకులు ‘’did not applaud .Instead sat in silence ,stood up ,put their
coats and sat down again ,not wanting to leave the theatre . Some people were
crying ,finally almost as an after thought ,the applause exploded’’అని మిల్ల ర్ ఆ నాటి
అనుభవాన్ని ఆనందాన్ని అక్షర బద్ధ ం చేశాడు మంచి నాటకానికి రసజ్ఞు లైన ప్రేక్షకులు
స్పందించాల్సిన విధానం గా వారు స్పందించారు .నాటక కర్త కు జేజేలు పలికారు అదీ
సహృదయ స్పందన అంటే .అలా స్పందించాలి అసలైన ప్రేక్షకులు హాట్స్ ఆఫ్ టు ప్లే రైటర్
అండ్ ది ఆడియన్స్ .ఈ నాటకం 742 సార్లు ప్రదర్శింప బడి రికార్డు సృష్టించింది . పులిట్జ ర్
అవార్డ్ కైవశ మైంది . గొప్ప నాటక కర్త గా బహుళ ప్రా భవాన్ని పొ ందాడు మిల్ల ర్ .
1950 లో అగ్ర రాజ్యాల మధ్య ఆయుధ పందెం వచ్చింది అంతర్జా తీయం గా
ఒకరికొకరు శత్రు వు లై ప్రతి వారినీ అను మానించే స్తితి కల్గింది . ఆమెరికా జీవిత విదానినికి
కమ్యూనిజం విఘాతం కల్గిస్తో ండదనే అభిప్రా యం బల పడింది . దీని నే ‘’it was a tense
era ,when federal workers were required to take loyalty oaths to pledje their
allegiance to America and the government establishedloyalty boards to investigate
reports of communist sympathizers గా అభి వర్ణించారు . ‘’కమ్మీ భూతం ‘’అమెరికాను
వణి కించింది . ఆ సమయం లో అమెరికా లోని విస్కాసిన్ సెనేటర్ జోసెఫ్ మేకార్దీ తో బాటు’’
దిహౌస్ అన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ ‘’‘’ఏర్పడింది . ఎవరు కనీ పించినా ‘’నువ్వు
కమ్యూనిస్టు వా ?నీతో బాటు ఎవరున్నారు ?మీటింగు లకు వెళ్ళావా/’’’’అని అడగటం
మామూలయింది . రచయితలపై వారి కమ్యూనిస్ట్ భావజాలం పై ద్రు ష్టి పెట్టా రు . నిఘా ఎక్కు
వైంది.
red scare(mccarthy)
1947 లో మిల్ల ర్ కు మార్క్సిజం తోకొంత సంబంధం ఉండేది . ‘’డైలీ వర్కర్ ‘’అనే
సో షలిస్ట్ న్యూస్ పేపర్ లో రచనలు చేస్త్తూండే వాడు .. చివరికి’’ HU.A.C ‘’ముందు దో షిగా
నిల బెట్టా రు .’’contempt of congress ‘’గా అతన్ని గుర్తించారు .అతనిపై మోపిన
అభియోగం చాలా పెద్ద మెజారిటీ తో అంటే’’ 373 to 9 ‘’తో నెగ్గింది .అయితే పబ్లి క్ సపో ర్టంతా
మిల్ల ర్ వైపే ఉంది .అందుకని కేసును పునర్విచారించారు . 1958 లో కొలంబియా కోర్టు లో
మళ్ళీ వాద ప్రతి వాదనలు జరిగాయి . కొలంబియా కోర్టు మిల్ల ర్ ను ‘’నిర్దో షి ‘’గా తీర్పు
నిచ్చింది . ఆ మధ్య మనస్తా పం తో 1952 లో the crucible నాటిక ‘’రాశాడు . దాన్ని మాసా
చూసేట్స్ లోని సేలం దియేటర్లో ప్రదర్శించారు .పెద్దగా గుర్తింపు రాకున్నా 197 సార్లు
ప్రదర్శించారు . ‘’మీద పడిన ‘’యెర్ర మచ్చ ‘’తొలగి పో యింది .ఈ రకమైన యాంటి
కమ్యూనిస్ట్ భావాలను వ్యాప్తి చేయటాన్నే ‘’మేకార్ధిజం ‘’అన్నారు నొప్పించైనా ఒప్పింప
జేయటమే అతని పని . .క్రూ సిబిల్ ను సినిమా గా తీశారు మంచి పేరొచ్చింది . ఇప్పటికీ
చాలా సార్లు వేస్తూ ంటారు భార్య తోమనస్పర్ధలు పెరిగాయి .
1951 లో ప్రముఖ హాలీ వుడ్ నటీ మణి‘’మేరిలీన్ మన్రో ‘’తో ప్రేమ సంబంధం
పెట్టు కొన్నాడు .. the golden girl who was like champaigne on the screen ‘’అని
పించింది .1955 లో ఏ వ్యూ ఫ్రం ది బ్రిడ్జ్ ‘’,ఏ మెమరీ ఆఫ్ మండేస్ ‘’రాశాడు .క్లిక్ కాక
డిసప్పాయింట్ అయాడు.1956 లో మెర్లిన్ మన్రో ను రహస్యం గా పెళ్లి చేసుకొన్నాడు . .’’బస్
స్టా ప్ ‘’అనే సినిమాకు రచన చేశాడు .మన్రో కు తాగుడు ,మాదక ద్రవ్యాల అలవాటు తో బాటు
మానసిక రోగం ఎక్కు వైంది .మిల్ల ర్ డబ్బంతా వీటికోసం హారతి అయింది. ఒక రకం గా మన్రో
మిల్ల ర్ ను తినేసింది అన్నారు విమర్శకులు . ‘’దిమిస్ ఫిట్స్ ‘’సినిమా లో మన్రో సరిగా
నటించ లేక పో యింది .1961 పెళ్లి పెటాకులై విడాకులు పుచ్చుకున్నారు . మిల్ల ర్ తల్లి
మరణించింది . చిన్న కధలు చాలా రాశాడు . మన్రో 1962 లో నిద్ర మాత్రలు మింగి ఆత్మ
హత్య చేసుకోంది.ఆమె అంత్య క్రియలకు వెళ్తే అదొ క సర్కస్ అవుతుందేమో నని మిల్ల ర్
హాజరు కాలేదు .
ఇగ్నో అనే ఆవిడను పెళ్లి చేసుకొన్నాడు .’’ఆఫ్ట ర్ దిఫాల్ ‘’రాస్తే సక్సెస్ కాలేదు
.1965 లో పారిస్ వెళ్ళాడు .అక్కడ అందరి సహకారం టో ‘’international
writers’organisation of poets ,play wrights ,editors ,essayists and novelists
‘’(p.e.n.)ను ఎర్పరచాడు మిల్ల ర్ ఆసభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు .
బెర్నార్డ్ శా—షా ,హెచ్ జి వేల్స్ లాంటి ప్రముఖ రచయితలందరూ సభ్యులే . మిల్ల ర్ ను
ప్రెసిడెంట్ చేశారు ఏకగ్రీవం గా .
P.E. N .కు అధ్యక్షుడైన తర్వాత మిల్ల ర్ రచయితల రాజకీయ ,సాంఘిక అభి వృద్ధి కోసం
తీవ్రం గా కృషి చేశాడు . 1969 లో న్యూయార్క్ లో ఈ సంస్థ సమావెశం జరిగింది .మిల్ల ర్
తండ్రి ఆరోజే అకస్మాత్తు గా మరణించాడు . అయినా సభకు అధ్యక్షత వహించి నిర్వహించాడు
అప్పుడే ప్రపంచం లోని అన్ని ప్రభుత్వాలకు తమ వడ్డ రాజకీయ నెపం తో బందీలుగా ఉన్న
రచయిత లందరినీ ముఖ్యం గా లిథువేనియా ,దక్షిణ ఆఫ్రికా ,చెక్ ,లాటిన్ అమెరికా ,రష్యా
దేశాలలో జైళ్ళలో మగ్గిపో తున్న వారిని వెంటనే విడుదల చేయ వలసిందిగా కోరాడు .
మిల్ల ర్ రాసిన ‘’ప్రిన్స్ ‘’నాటిక ఒక కుటుంబం లో ఇద్ద రన్న దమ్ముల కదా . బ్రహ్మాండం
బద్ద లైన స్పందన .425 ప్రదర్శనలు జరిగాయి .అంతేకాదు మిల్ల ర్ రాసిన పాత నాటకాల
నన్నిటిని మోజు మీద ఆది గొప్ప గౌరవం కల్గిస్తు న్నారు . అతనికి అమెరికా లో విలువల
వలువలూది పో తున్నాయని దిగులు గా ఉండేది ..తన జీవిత చరిత్ర ‘’time bends a life
‘’రాసుకొన్నాడు .దిఅమెరికన్ కుక్ ,ఆర్చిబిషప్సీలింగ్ నాటికలు లండన్ మహా నగరం లో
బ్రహ్మాండం గా ప్రదర్శింప బడ్డా యి .
1970 లూడా మిల్ల ర్ రచయితల హక్కులకోసం,స్వతంత్రం కోసం తీవ్రం గా పని చేస్తూ నే
ఉన్నాడు . బ్రెజిలియన్ రచయిత అగస్తో బో ల్ ,పావెల్ కాహాట్ అనే జెక్ కవిని నిర్బంధం
నుంచి విముక్తి చేయించాడు . 53 మంది మిగిలిన రచయితల టో సంతకాలు పెట్టించి జెక్ లో
బందీలుగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక భావాలున్న రచయితలను విడుదల చేయమని అర్జీ
పంపాడు అలేక్సాందర్ సో ల్జె ంత్సి విడుదల కోసం తీవ్ర పో రాటం చేశాడు . మిల్ల ర్ జీవితమే
‘’క్రూ సిబిల్ ‘’నాటిక లో జాన్ ప్రో క్తా ర్ . పీటర్ రాల్లీ అనే అనే రచయితనుజైలు నుండి
విడిపించాడు సంఘటిత శక్తి ని నిరూపించి . మిల్ల ర్ కున్న న్యాయ పరిజ్ఞా నం వీటికి బాగా
దో హద పడింది . 1984 లో ‘’కేన్నేడి సెంటర్ ‘’. అ పురస్కారం అందుకొన్నాడు . ఎక్కడ
తనపై కేసు పెట్టి విచారించారో అక్కడే మిల్ల ర్ కు ఘన సన్మానం జరగటం చారిత్రా త్మక
విషయం . 1991 లో ‘’లాస్ట్ యాంకీ ‘’అనే కామెడీ డ్రా మా రాశాడు . 1996 లో దిక్రూ సిబిల్
నాటకాన్ని సినిమా తీశారు . 2005 ఫిబవ
్ర రి లో తొంభై ఏళ్ళ వయసులో కనెక్టి కట్ లో మిల్ల ర్
జీవిత నాటకం ముగిసింది .
మిల్ల ర్ తాననిర్మించిన పాత్రలు నైతిక పక్షవాతాన్ని అధిగమించాలని భావిస్తా డు
.తన నైతిక విలువలు బహుళ జన అభిప్రా యానికి వ్యతి రేక మైనా కట్టు బడి ఉంటాడు .
సంక్షోభం అడుగున అందరిని బంధించే ఒక విశ్వ జనీన భావం ఉంటుందని విశ్వ సిస్తా డు .
రచయిత సంఘం లో నిర్వ హించాల్సిన పాత్రను గురించి పూర్తిగా తెలిసి అలా ఆచరించిన
వాడు మిల్ల ర్ .ఆదర్శాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు జరిపాడు . తన అభిప్రా యాలను
సంఘం ,రాజకీయ పక్షులు వ్యతి రేకిన్చినా ,వ్యక్తిత్వాన్ని వదులు కోలేదు
మిల్ల ర్ నాటక రచన అంటే ‘’అర్ధా న్ని వెతుక్కోవటమే ‘’నన్నాడు . మిల్ల ర్ ‘’the
depression was my book ‘’అని తన రచనకు భాష్యం చెప్పాడు అంతే కాదు 1929 was our
Greek year ‘’ అనీ అన్నాడు తనకు కమ్యూనిజం తో ఉన్న సంబంధాన్ని గూర్చి ప్రశ్నిస్తే
‘’’’these were writers ,poets as far as could see and the life of a writer despite what
it some times seems is prettytough . I would not make it any toughter for any any
body .i ask you not to ask me that question .’’అనేశాడు .ఇంకో మనిషి బాధ్యతను
తానూ స్వీకరించాలేనన్నాడు . అతని నాటకాలలో ‘’domestic realism ‘’ఉంది . దీనిని ‘’వో
నీల్ ‘’అనే నాటక కర్త మొదట ప్రవేశ పెట్టా డు దీన్ని నాటకం గా ఆడి మెప్పించటం సాధ్యం
1950 కాలం లో మిల్ల ర్ ,టెన్నిసీ విలియమ్స్ బాగా ప్రచారం చేశారు .
‘’the American drama is for all practical purposes the 20 th century American
drama ‘’అని భావిస్తా డు డొ మెస్టిక్ డ్రా మాలను ఇస్బాన్ ,చెకోవ్ లు అంతకుముందే
సృష్టించారు ఇందులో మెలో డ్రా మా ఉండేది దీన్ని ‘’negative connotation ‘’గా
వాడుతున్నారు . దీని అర్ధం ఏమిటంటే –‘’shallow or excessive emotional effects ‘’అని
. 1930 లో డొ మెస్టిక్ రియలిజం రాజకీయ ,నైతిక పాఠాలకు అద్ద ంపట్టింది
సామాన్యుడిని మిల్ల ర్ దృష్టిలో పెట్టు కొని రాశాడు అతడు అసాధారణ సాంఘిక ఒత్తి డి లో
ఎలా నలిగి పో తాడు ఎలా ఎదుర్కొని విజయం సాధిస్తా డు అనేదే ఆయన రచనకు ఆధారం
మూలం . అయితే టెన్నిసీ విలియమ్స్ అసాధారణ వ్యక్తు ల గురించి రాశాడు మిల్ల ర్ నాటకాలు
నిలువుగా ఉంటె విలియం వి అడ్డ ం గా ఉంటాయి అంటారు ఈ ఇద్ద రు అమెరికా దేశపు
‘’outstanding dramatistsof the period ‘’.దీనినే the school of Miller and the school of
Williams ‘అంటారు మనిషి తన అదృష్టా నికి తానె బాధ్యుడు అనేదే సిద్ధా ంతం . దీనిని ‘’this
man who had all the luck ‘’. నాటకం లో మిల్ల ర్ చూపించాడు .
మిల్ల ర్ రచనల్లో మనిషి అస్తిత్వానికి సమాజం అతని నుండి ఆశించే దానికి సంబంధం
ఉంటుంది . ఈ వైరుధ్యం లో ఘర్షణ ఉంటుంది మిల్ల ర్ రచనల్లో అమెరికా కుటుంబ
విషయాలెలా ఉన్నాయో చర్చించారు విమర్శకులు ‘’American family is constantly
fragile ,constantly disintegrating attempt to crete a personal frame work of
affection and loyalty in a world where classes ,institutional aand local loyalties
have been reduced to a minimum or do not exist at all’’ అని తేల్చారు .అయితే ఈ
విషయం లో బ్రిటిష్ కుటుంబ జీవితం హాయిగా నే ఉంటుందని భావించారు . అమెరికా
కుటుంబం లో సుఖం లేదు బ్రిటిష్ మధ్యతరగతి వారికీ సొ సైటీ ఉంది ,దాని లో స్తా నమూ
ఉంటుంది .అమెరికా లో మిడిల్ క్లా స్ మాన్ కుటుంబం కంటే భిన్నుడు బిజినెస్ లో రక్షణ
లేదు .దీనికి సొ సైటీ కూడా లేదు ఎప్పుడూ డేంజర్ జోన్ లోనే ఉంటాడు .సాటి బిజినెస్ మెన్
సహాయ సహకారాలు లభించవు .
ఆ నాటి అమెరికా లో బీద వాడి స్తితి ఎలా ఉందంటే అందర్నీ వదిలి కుటుంబం లోను
బయటా అందర్నీ గట్టు కోవాల్సిన స్తితి .అన్నీ ఫామిలీ కోసం చెయ్యాలి .భర్త గా కుటుంబం
కోసం కష్ట పడాలి .కుటుంబ పటిష్టత కు తోడ్పడాలి . అందుకని కుటుంబానికి బానిస గా ఉండి
పో వాలి .అదే అతనికి తప్పని స్తితి ,అదీ సంతోషం గా చేస్తా డు .కాని అమెరికా బిజినెస్ మాన్
మాత్రం స్వార్ధ పరుడు కాదు . అతను తనను తానూ అర్పించుకొనే స్వయం సిద్ధు డు .ఈ
త్యాగానికి ఎప్పుడైనా ఒక గుర్తింపు రావచ్చు రాక పో నూ వచ్చు .
అమెరికా లో కుటుంబ స్తితి –బలహీన బంధాలతో కుటుంబం ఉండేది .దానికి సాంఘిక
చేయూత లేదు .కుటుంబానికి వ్యతిరేకం గా సంఘం ఉండేది .ఇద్ద రు వ్యక్తు ల సృష్టి యేవారి
కుటుంబం ..వారికొకరు తెలియని వాళ్ళు . వేర్వేరు భౌగోళిక పరిస్తితులనుండి వచ్చి చేరిన
వారు వారి సాంఘిక స్తితులు కూడా భిన్నమే . వేర్వేరు అభిప్రా యాల వాళ్ళు . పిల్లలు యేవో
వేర్వేరు సిటీ లకు వలస వెళ్ళే వాళ్ళు . అంటే ప్రతి విషయం లోను ‘’కంటిన్యుటి’’ లేని స్తితి .
ఇవే అమెరికా ఫామిలీ వ్యవస్త ను శాసిస్తు న్నాయి ఒక వేళ ఆ స్తితి అందుకోలేక పొ తే వారిని
క్షమించరు . .ఈ అపజయాలనే మిల్ల ర్ తన కధలకు వస్తు వు గా వాడుకొన్నాడు .
అమెరికా అనుభవం అతని రచనకు భూమిక . అది తండ్రి ,కొడుకుల అను
బంధం .బంధాలు సడలి పో యే సమయం లో కొడుకు దూరం అవటం ఉంటుంది .తండ్రి అనేక
ఒడి దుడుకులతో సతమత మావుతూంటాడు . తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర మనస్పర్ధలు .
తండ్రి అవి నీతి పఅరుడు .ఆ అవినీతిని కొడుకు అనేక సమయాల్లో బయట పెడతాడు
.అవినీతి విలువలతో తండ్రి జీవితం సాగిస్తా డు .కారణం అదే అతనికి తెలిసిన విధానం . దీనికి
ప్రత్యామ్నాయం తెలియని వాడు .
అమెరికా కల ఏమిటో ‘’డెత్ ఆఫ్ ది సేల్స్ మాన్ ‘’నాటకం లో అసలు సమస్య
. రాజ్యాంగం ప్రజా రక్షణ చేస్తా నని హామీ నిచ్చినా నిలుపుకోలేక పో యింది . వ్యాపారం
దెబ్బతిని పో యింది . మొదటి ప్రపంచ యుద్ధ ం తర్వాత సేల్స్ మాన్ షిప్ పెరిగి పో యింది
. .ఇదంతా అవినీతి మాయమై పో యింది .లాభమే పరమావధి గా బతుకులు గడుస్తు న్నాయి
మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం వస్తు వులే అంటే ‘’commadities’’మాత్రమె .
మనిషి మనిషిగా పూర్తిగా నశించాడు .ఆతను ‘’BECOMES A COMMADITY
HIMSELF .,A SPIRITUAL CIPHER ‘’అయ్యాడు .అంటే పూజ్యం ,పనికి మాలిన వాడు
అయి పో యాడు . ఇది మానవత్వానికే సిగ్గు చేటు .పతనానికి పరాకాష్ట . ‘’He sees his
personality . this personality became the means to an end namely consummated
sale .commercial face ,commercial smile ‘’తో బతుకు లాగుతారు . మనిషి ‘’oily cog
in the machine of the sales apparatus ‘’వ్యాపార యంత్రం లో చక్రం యొక్క పన్ను అయి
పో యాడు . . దీనితో ప్రవర్త నలో పెద్ద మార్పు వస్తు ంది అన్నిటా వైఫల్యమే .కూలి పో తాడు
.కుంగి పో తాడు .
కాని మనిషి యంత్రం కాదు .డెత్ ఆఫ్ దిసేల్స్ మాన్ లో సేల్స్మన్ చావు
‘’symbolic of the break down of the whole concept of salesmanship inherent in our
society ‘’గా భావిస్తా రు .ఇదే అ నాటి లక్షలాది మనుషుల నిస్సహాయ స్తితి .’’హిల్లీ లోమన్
‘’ఇదులో హీరో .అతడు కింది మధ్యతరగతి యువకుడు.ఆ ప్రా యం వారికి ప్రతినిది .ఇతన్ని
గురించి మిల్ల ర్ ‘’the lovable lower middle class mole to a type of living and thinking
which really all of us-professionals as well as salesmen ‘’. అని చెప్పాడు . ఇందులో
‘’stream of consciousness ‘’ఉంది . స్పష్ట మైన అ పూర్వక నైతికత కనీ పిస్తు ంది .
దిక్రూ సిబిల్ నాటిక లో మేకార్ధిజం పై తీవ్ర మైన విమర్శ ఉంది . అంటే ruisonous
accusation without any basis in evidence ‘’మొత్త ం మీద అమెరికా నాటక కర్త లలో ఓక
అద్భుత ప్రయోగ శీల నాటక కర్త ,సమాజ దృక్పధాన్ని మలుపు తిప్పిన వాడు సాటి
రచయితల అభ్యున్నతికి వారి నిర్బంధాలను ఎదిరించి పో రాడిన వాడు గా ఆర్ధర్ మిల్ల ర్ నిలిచి
పో యాడు .మన ఆచార్య ఆత్రేయ తోమిల్ల ర్ ను పో ల్చవచ్చు నని పించింది .
సమాప్త ం
యువత కోసమే అపూర్వ రచనలు చేసి వారికి మార్గ నిర్దేశం చేసిన రచయితపాల్
జిన్డేల్.1936 లో అమెరికా లోని న్యూయార్క్ లో జన్మించాడు . పదిహేనేళ్ళ వయసులోనే
క్షయ వ్యాధి బారిన పడ్డా డు . 1954 లో గ్రా డ్యుయేషన్ పూర్త యింది . 1958 లో కేమిస్త్స్ట్రి లో
బి.ఎస్. డిగ్రీ సాధించాడు .అల్లైడ్ కెమికల్స్ కు టెక్నికల్ రైటర్ గా పని చేశాడు . 1959 లో
M.S.in education ‘’చేసి కేమిస్ట్రి,,ఫిజిక్స్ లను బో ధించాడు .
‘’the effect of gamma rays ‘’,’’man in the moon ‘’రచనలు చేశాడు . 1967
లో ఉద్యోగాన్ని వదలి నాటక రచయితా గా మారాడు . 1968 లో ‘’pigman ‘’అనే మొదటి
నవల రాశాడు 1971 లో గౌరవ డాక్టరేట్ ను పొ ందాడు . రాసిన నాటికలన్ని విజయ వంతం
గా ప్రదర్శింప బడ్డా యి’’ childre’s picture books ‘’రాశాడు.సినిమాలకూ పని చేశాడు .
1981 లో ‘’the girl who wanted a boy ‘’. నాటకం రాశాడు .1982 లో మరో తోటి రచయితా
టో కలిసి గొలుసు నవల రాశాడు . to take a drive ‘’,runaway train ‘’సినిమా లకు స్క్రీన్
ప్లే రాశాడు . టి.వి.కోసంప్రత్యేకం గా ‘’babes in Toyland ‘’. రాశాడు . 1987 ల్’the
amazing and death defying diary of Eugine Dingman ‘’ప్రచురించాడు .
చిన్నప్పటి నుండి పాల్’’ నేగ్లేక్తేడ్ చైల్డ్ ‘’గా ఉండేవాడు .తండ్రి హృదయం లో స్తా నం
తనకు లేనట్లు భావించే వాడు .భార్య కు భర్త కు సిఫిలిస్ వచ్చిందేమో నని అనుమానం .తండ్రి
అనేక ఇళ్లు మారాడు .. తల్లి ప్రా క్టికల్ వుమన్ .నర్సు గా పని చేసేది . జీవితం అభద్రతకు
లోనైంది . తల్లికి ‘’సెక్సువల్ న్యూరోసిస్ ‘’జబ్బు .1986 లో తల్లి మరణం . పాల్ స్కూల్ లో
చదివే తప్పుడు తోటి విద్యార్ధు లంతా మత్తు మందుకు బానిసలై మరో లోకం లో విహరించటం
చూసే వాడు . 1970 లో ‘’గామా ‘’నాటకం హూస్ట న్ లో ప్రదర్శింప బడింది . దీనికి పులిట్జ ర్
బహుమానం వచ్చింది అప్పుడు మెక్సికో లో ఉన్నాడు . ఇతనికి ‘’tachy cardia ‘’అనే
జబ్బు వచ్చింది . దీని లక్షణం –గుండె బయటికి వచ్చి గంతు లేస్తు న్నట్లు అని పించటం .
సమయానికి వైద్యం అంది ప్రా ణాపాయం తప్పింది
తర్వాత ‘’. Nervous exhaustion ‘’దీనికోసం సైకో అనాలిసిస్ చేశారు . స్వయం
వ్యక్తిత్వం ,బాధ్యతా ,యువత సాధికారత ,సెక్సువల్ రోల్ అండ్ డెత్ లమీదే ఎక్కువ రాశాడు .
టీనేజర్స్
ే కు కధలు రాశాడు . కధల్లో పాత్రలు జీవితం తో మమైక్యం అవ్వాలని భావించే వాడు
.తన లక్ష్యాలను పదింటి ని దృష్టిలో పెట్టు కొని రచనలు చేశాడు . అంటే’’ టెన్ కమాండ్
మెంట్స్ ‘’లాంటి వన్న మాట .ఒంటరితనం నష్టా లు అవమానాలు పొ ందిన వారి కదలనే
వస్తు వు గా చేసి రాశాడు .రాసిన 39 పుస్త కాలన్నీ యువతకోసం పిల్లల కోసం రాసినవే
.1930 లో అమెరికా లో అనేక సార్లు నిషేధింప బడిన పిగ్మన్ ను ఇప్పటికి అమెరికా
స్కూళ్ళలో బో ధిస్తూ నే ఉన్నారు అందులోని భాష అఫెంసివ్ గా ఉందని అప్పటి ఆరోపణ .
పిగ్మన్ దగ్గ ర గ్లా సు తో ,మట్టి తో ,మార్బుల్ తో చేసిన ‘’పందులు’’ ఉండటం వల్ల
పిగ్మన్ అనే పేరు వచ్చింది . యూజీన్ దిన్గ్మాన్ నవలలో యూజీన్ అనే వాడు జీవితం పై
విరక్తి వచ్చి వేసారి పో యి’’మహాత్మా ‘’అనే హిందూ గురువు దగ్గ ర కు వెళ్తా డు . ఆయన
‘’before you expect some one to love you ,you must love yourself ‘’అని తారక
మంత్రం ఉపదేశిస్తా డు .వాడిలో మార్పు వస్తు ంది . చివరికి ‘’I finally learned that there
was in me an invisible summer ‘’అంటూ ‘'gine Dingman born ‘’అంటాడు .అమెరికన్
లైబర
్ర ి అవార్డ్,మార్గ రెట్ ఎడ్వర్డ్ అవార్డ్లను పులిట్జ ర్ తో బాటు పొ ందాడు . my
darling ,,gamaa rays ,pigman లను మూడిటిని కలిసి ''triology ''అంటే త్రయం గా
భావిస్తా రు .
రచయితను ‘’మీరు ‘’సినిస్ట్ కాదా’?అని అడిగితె మా’’ ఇల్లే యూని సెక్స్ ‘’అని
సమాధానం చెప్పాడు .2003 మార్చి ఇరవై ఏడున న్యూయార్క్ లో చని పో యాడు .
ఎర్నెస్ట్ జే..గ్రైన్స్ రాసిన నవల ‘’ఏ లెసన్ బిఫో ర్ డైయింగ్ ‘’.ఒక నల్ల జాతి కుర్రా డి మరణ
శిక్ష మీద కదా .హత్య చేసినట్లు ఒప్పుకోడు . వర్జిన్ అనే ప్రొ ఫెసర్ వాడికి చాలా ధీమా గా
గర్వం గా చావటం గురించి చాలా కాస్త పది నేర్పుతాడు . వాడిని మనిషి గా మార్చాలని
తాపత్రయం .చివరికి సాధిస్తా డు ‘’simple heroism of resisting and defying ‘’నేర్పిస్తా డు
.తనకు ఉరి శిక్ష పడే ముందు ఆ కుర్రా డు ప్రొ ఫెసర్ కు తనలో వచ్చిన మార్పు గురించి వివరం
గా ఉత్త రం రాస్తా డు .ఈ పుస్త కం గురించి ‘’the book will be read ,discussed and taught
beyond the rest of the lives ‘’అని ఈ నవల గురించి చికాగో ట్రిబ్యూన్ కితాబు నిచ్చింది
.చదివి తప్పక అర్ధం చేసుకోవాల్సిన పుస్త కం..
జెఫర్సన్ ను మానవ మాత్రు డిగా మార్చటానికి గ్రా ంట్ అనే మాస్టా రు చేసిన ప్రయత్నం
అంటా ఇందులో కనీ పిస్తు ంది .అందుకే దీని శీర్షిక చాలా ప్రా ముఖ్యత పొ ందింది . ఇందులో
సింబాలిక్ గా చివర వచ్చే సీతా కోక చిలుక ఇద్ద రిలో వచ్చే పరి వర్త నకు సాక్షయం .గా
నిలుస్తు ంది . జెఫర్సన్ చావుకు ముందు ఒక సత్యాన్ని గ్రహించాడని ఒక పాతం
నేర్చుకోన్నాడని తెలుస్తు ంది . జెఫర్సన్ లోని పిరికి తనం పో యిందని గ్రహిస్తా డు .తనతో
బాటు సమాజం లో ఉన్న తెల్ల జాతి వారు నల్ల జాతికి చెందినా ఈ కుర్రా డి మరణం ఒక గుణ
పాఠంగా గ్రహించి వారి హక్కుల కోసం ,వారి సౌకర్యాలకోసం విద్యకోసం సహకరించాలి అని ఒక
కర్త వ్య బో ధ ఉంది . అందరు చదివి తెలుసుకోవాల్సిన కద ఇది .
పారిస్ వెళ్లి చిత్రలేఖనం లో రెండేళ్ళు కస్ట పడి సాధించాడు . మేరి ఎలిజే బెత్ హేస్కేల్ ఆనే
ఆమె అతనికి ఏంటో సాయం చేసింది అభివృద్ధికి తోడూ పడింది . క్రిస్టియన్ మతానికి చెందినా
వాడ్సైనా ముస్లిం మాట ప్రభావం అందునా సూఫీ మాట ప్రభావం ఎక్కువ . సిరియా కు
అరబిక్ భాష జాతీయ భాష కావాలని వాంచించాడు
జీబ్రా న్ మ్యూజియం ,సమాధి వాషింగ్టన్ లో మెమోరియల్
బో స్ట న్ లో మెమోరియల్
1-‘’to steal a flower ,we call mean –to rob a field is chivalry ‘’
2-‘’hounours are but false delusions –like the froth upon the wave ‘’
3-‘’if you shall meet happy on –who is contented with his lot –unlike the rest of all
mankind –pray his Nirvana disturb not ‘’
5-‘’air is water aerated –and the dew –water distilled (soul and fertility )
1871 లో నవంబర్ ఒకటి న న్యూయార్క్ దగ్గ రున్న న్యు జెర్సీ లో స్టీఫెన్ క్రేన్
జన్మించాడు .పద్నాలుగురున్న సంతానం లో చివరి వాడు . క్రేన్ పూర్వీకులు అమెరికన్ డిక్ల
రేషన్ పై సంతకం చేసిన వాళ్ళు .తల్లి చాలా కాస్త పడేది .పుస్త కాలు బాగా చదివే వాడు
బాల్యం నుంచీ . తోమ్మిదిఏళ్ళప్పుడే తండ్రి గుండె జబ్బుతో చని పో యాడు .కుటుంబ బాధ్యతా
తల్లిదే . న్యు యార్క్ మిలిటరీ అకాడెమి లో చేరాడు . బేస్ బాల్ ఆట ఆడే వాడు దేశ ద్రిమ్మరి
గా కొంతకాలం తిరిగాడు .1893-94 లో చాలా దుర్భర జీవితం గడిపాడు . భరించలేని వ్యధ టో
నలిగి పో యాడు .బీదతనం ,ఒంటరితనం టో ఉక్కిరి బిక్కిరయ్యాడు .దీనికి తోడూ టి.బి.ఎటాక్
.1894 లో కస్తా ల కడలినే ఈదాడు ..అదొ క ప్రయోగమే అయింది .
‘’ మాగీ ఏ గర్ల్ ఆఫ్ ది స్ట్రీట్ ‘’రచన చేశాడు .ఆ తర్వాత ప్రసిద్ధ రచన ‘’the red badge
of courage ‘’రాసి ప్రచురించాడు. దీనిని సివిల్ వార్ సమయం లో రాశాడు . అమెరికా
అంతర్యుద్ధ ం లో ప్రజల మానసిక వేదనకు చలించి రాసిన నవల ఇది . ‘’I wonder that
some of these fellows do not tell how they felt in those scraps –they spout eternally
of what they did but they are as emotionless as rocks ‘’అని ఆ కాన్ఫ్లిక్ట్ లో చిక్కుకొని
నోరు మెదపని వారిని గురించి అంటాడు .
తర్వాత మెక్సికో వెళ్ళాడు .1895 లో ‘’the black riders ‘’రాశాడు . ‘’the third violet
‘’కూడా రాసి మెప్పు పొ ందాడు క్రేన్ రచనలన్నీ ఇంగ్లా ండ్ లో క్రేజ్ పొ ందాయి . ‘’one of the
deathless books which must be read every body who desires to to be or to seem ,a
connaiser of fiction ‘’అని శ్లా ఘించారు బ్రిటిష్ క్రిటిక్స్ . హెచ్.జి.వేల్స్ .మరీ
ముచ్చటపడ్డా డు క్రేన్ రచనా చాతుర్యాన్ని శిల్ప వైభవాన్ని చూసి . 1896 లో న్యూయార్క్
చేరాడు .కధలు రాయటం జర్నల్స్ లో శీర్షికలు రాయటం చేశాడు అక్కడి పో లీసులు
,అధికారులలో ఉన్న అవినీతి పై పేపర్ల లోఏకి పారేశాడు . జనం వీర తాళ్ళు వేశారు . ఫ్లా రిడా
లోని జాక్సన్ విల్ వెళ్లి కొంతకాలం పని చేశాడు యుద్ధ వార్త స్లు రాయటానికి క్యూబా వెళ్ళాడు
అక్కడ కోరా అనే అమ్మాయి తోపరిచయం .ఇద్ద రు ప్రయాణం చేసే షిప్ సముద్రం లో మునిగి
పో యింది .లైఫ్ బో ట్ పట్టు కొని తీరం చేరారు .ఈ అనుభవాన్ని పేపర్ లో అక్షర బద్ధ ం చేస్తే
గొప్ప రేస్పాన్సే వచ్చింది .
గ్రీకో టర్కిష్ యుద్ధ ం లో వార్త లకోసం ఇంగ్లా ండ్ వెళ్ళాడు .కోరా తోపెళ్లి జరిగింది . 1897
ఫిబవ
్ర రి 17 న అమెరికా మెరైన్ ను హవానా హార్బర్ లో పేల్చి వేశారు .దీనితో అమెరికా
క్యూబా పై యుద్ధ ం ప్రకటించింది .క్షయ వ్యాధి నవ నాడులనీ కుంగ దీస్తు న్నా యుద్ధ
వార్త లకోసం ‘’వరల్డ్ ‘’పత్రిక కు పని చేశాడు .పని ఒత్తి డికి తట్టు కో లేక పో యే వాడు
.మలేరియా టో బాధ పడ్డా డు ఉద్యోగం పో యింది పో ర్తా రీకా లో కాపురం పెట్టా డు .అక్కడి
నుండి హవానా వెళ్ళాడు .న్యూయార్క్ జర్నల్ కు రచనలు చేస్దా డు .ససెక్స్ లో కాపురం .
అది ఆనాడు ‘’డెత్ ప్లేస్ ‘’అనే పేరు తెచ్చుకోంది . అక్కడ వేడి లేదు వెలుతురూ లేదు
,కరెంట్ లేకుండా గడిపాడు .
1899 లో లండన్ చేరి గొప్ప విందు నిచ్చాడుక్రెన్ . వేల్స్ ,కాన్రా డ్ మొదలైన హేమా
హేమీలంతా ఆ పార్టీకి వచ్చారు .ప్రముఖ రచయితా లందరితో ‘’the ghost ‘’అనే నాటకాన్ని
రాయించాడు క్రేన్ . తెల్ల వార్లూ .1999 డిసెంబర్ 27 న ప్రదర్శించాడు . ఇరవై ఎనిమిదేళ్ళకే
1900 జూన్ అయిదు న రక్త నాళాలు తెగి పో యి క్రేన్ మరణించాడు ‘’the red badge of
courage ‘’రాసిన కర్త ఇక లేదని పించాడు .
‘’crane was the first great tragic figure in the modern American generation .His are
humorous tales with parody ,technical master pieces .he writes a kind of grammar
in which war is the subject ,the verb and the object of every sentence . It was an
effort born pain . ‘’అని కీర్తిస్తా రు క్రేన్ రచనలను . అమెరికా ఫిక్షన్ ప్రా జ్ కు సృజనాత్మక ట
ను చేకూర్చిన వాడు . మాస్ట ర్ ఆ ఫో రిజినల్ స్టైల్ అని పించుకొన్నాడు .అతని రచనలు ఈ
నాటికీ సజీవం గా కానీ పిస్తా యి .కారణం అత్సను గొప్ప కళా కారుడు క్రేన్ ను ‘’one of the
first –post impressionalists ‘’అంటారు అతని ‘’snake ‘’ లో డార్విన్ చెప్పిన జెనెటిక్
ఇండికేషన్ ఉంది . ‘’in the man was all the wild strength of the terror of his ancestors
,his raceof kind .A deadly repulsion had been handed over from man to man
through long dim centuries .later he seizes a stick and smashes the snake to death .
అని మానవ స్వభావాన్ని అద్భుతం గా ఆవిష్కరిస్తా డు .తనవి తన పూర్వీకులవి ఎమోషన్ల ను
అనచుకోలేక మనిషి పిచ్చ వాడి పో తున్నాడని బాధ పడతాడు .
క్రేన్ కధలు వాస్త వికత కు దగ్గ ర గా ఉంటాయి ఐరనీ అతని రచనల్లో ప్రా ణం పో సుకొంతుంది
. క్రేన్ రాసిన రెడ్ బాడ్జ్ అమెరికా మొదటి ఇమ్ప్రేశానలిస్ట్ నవల .ఇందులో హీరో కు తానూ
యుద్ధ ం లో ఒడి పో తానని తెలిసినా ,తానూ పిరికి వాడిన ,ముందుకు దూకి కర్త వ్యమ్ నేర
వేరుస్తా డు . అలాగే ఓపెన్ బో ట్ లో కూడా ప్రక్రు తినేదిరించి హీరో విజయం సాధిస్తా డు .క్రేన్
కధల్లో మాటలు వర్ష పాతం గా మీద పది తడిపెస్తా యి . బాడ్జ్ లో కదా ముగిస్తూ క్రేన్ ‘’he
had been to touch the greatdeath and found that ,afterall ,it was but the great
death .he was a man ‘’అని మహా గొప్పగా అంటాడు .
ఆతనొక వజ్రం .సాన బెట్టిన కొద్దీ మెరిసిన వాడు ..’’bubbling pond ‘’అన్న పేరు ను
సార్ధకం చేసుకొ న్న వాడు . శ్రీ శ్రీ ని మన అద్దేపల్లి రామ మోహన రావు ‘’అగ్ని సరస్సున
వికశించిన వజ్రం ‘’అన్నాడు .ఇది పౌండ్ కు కూడా వర్తిస్తు ంది . దీప శిఖ.స్వేచ్చకు సంకేతం
పౌండ్ .అయినా స్వేచ్చ అనుభవించని అతని చరమాంకం చూస్తె బాధే కలుగు తుంది’’
.solitary volcano ‘’అంటారు ఎజ్రా ను . ‘’flaming savanarola of modern poetry .un
predictable bundle of electricity అని అంటాడు జేమ్స్ జాయిస్ . ‘’whirl wind of
forked lightning ‘’ అని కీర్తించాడు టి.ఎస్.ఇలియట్ .
ఇరవయ్యవ శతాబ్ద పు విప్ల వ కవిత్వానికి ఆద్యుడు .’’ Trotsky of literature ‘’అని
ప్రముఖ రచయితా w. Lewes టో ప్రశంశ పొ ందాడు . పెడగాగిక్ వాల్కనో అనీ అన్నారు
విమర్శకులు . కోపాన్ని శక్తిని ముప్ఫై ఏళ్ళ పాటు అనుక్షణం కక్కిన విప్ల వ మాంత్రికుడు .
అతని నినాదమే ‘’make it new.’’.భావ చిత్ర శిల్పం అతని ఊపిరి . ‘’poetry is dance of
intelligence among words ‘’అంటాడు
బ్రిటిష్ కవిత్వాన్ని చేడా మడా తిట్టేశాడు .అతని దృష్టిలో ఆంగ్ల కవిత్వం ‘’boiled oat
meal consistency .Popy cock and rhetoric dim ,painted adjectives ,అని తిట్టినా తిట్టు
తిట్ట కుండా తిట్టి పో శాడు .’’it needed a constant change of manner if it was to live
‘’అని ఆంగ్ల కవిత్వాన్ని బతికిన్చుకొనే తరుణోపాయం చెప్పాడు . పౌండ్ దృష్టిలో మంచి
కవిత్వం అంటే శాశ్వత మైన కవిత్వం కాదు .’’by good art I mean the art that bears true
witness ‘’అని తీర్పు చెప్పాడు . ‘’I mean the art is most precise .Beauty in art
reminds one what is worth while ‘’అంటాడు .
పౌండ్ స్వభావాన్ని గురించి చెప్పాలంటే ‘’always self conscious and nervously
awares of others ,high strung impatient ,mercurial and exuberant .Pound presented
himself as the figure of the poet ‘’పౌండ్ ఆకారాన్ని వర్ణించాలంటే ‘’with green
trousersmade of billards cloth ,with his pink velvet coat and its blue glass
buttons ,a hand painted tie ,his mane of reddish blond hair tucked under a sombrero
his green eyes ,a beard cut to point to resemble ,a Spanish conquistador and as a
final touch a singular turquoise ear ring ‘’ఇదీ అయ్య గారి ఆకారం . ఇలా లండన్
వీధుల్లో చెడ తిరిగే వాడు .
పౌండ్ రాసిన కవితలనుచదివితే కోపం తో ద్వేషం టో ఉర్రూ త లూగి పో తారు .భూకం వచ్చి
నప్పుడు ఊగి నట్లు నవ్వుతో ఊగి పో తారు అన్నారు సమీక్షకులు .జేమ్స్ జాయిస్ పౌండ్
రాసిన ‘’యులిసెస్ ‘’ను సమీక్షిస్తూ ‘’ a new historical period has begun –the Pound
era ‘’అని పౌండ్ శతాబ్ది ప్రా రంభామైన్దన్నాడు . పౌండ్ రాసిన ‘’కాస్మోస్ ‘’లో సెల్ఫ్ పిటి
ఉంది. .పౌండ్ పారిస్ వెళ్లి పికాసో ఇలియట్ లతో స్నేహం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధ
కాలం లో ‘’Italian state radio ‘’లో ఫాసిజం ను సమర్ధిస్తూ చాలా సార్లు మాట్లా డాడు .
ప్రెసిడెంట్ రూజ్ వెల్త్ పౌండ్ ను తిట్టా డు . అమెరికా వెళ్ళిన తర్వాత ఆరు అడుగుల పొ డవు
ఆరడుగులు వెడల్పు మాత్రమె ఉన్న సెల్ లో వేసి విచారించారు .ఒంటరి వాడిని చేసే
ఉంచారు .. చలికి ఎండకూ గురి చేశారు . తర్వాత రాబర్ట్ ఫ్రా స్ట్ ,ఇలియట్ వగైరా ప్రముఖులు
జోక్యం చేసుకొని పౌండ్ ను విడుదల చేయించారు .
the death prision in pisa
ఇటలీ వెళ్లి పో యాడు .చివరి పదేళ్ళు ఎవరి తోనూ మాట్లా డకుండా గడిపాడు పౌండ్ .
కనీ పించిన ఆడదాన్ని చూపులతో యిట్టె పడేసే వాడు . అందుకే పౌండ్ ను ‘’King Lear of
modernism ‘’అన్నారు . చివరికి 87 వ పుట్టిన రోజున నిద్రలోనే మరణించాడు పౌండ్ .పౌండ్
జనం అమెరికా లోని ఫిలా దేల్ఫియా లో 1889 జూన్ లో .తనను గురించి పౌండ్ ఇలా
చెప్పుకొన్నాడు ‘’I knew at fifteen pretty much what I wanted to do . >I resolved that
at thirty I would know more about poetry than any man living .poetry is
indestructable ‘’.
తాను చని పో యే లోపు ఇది వరకేప్పుడూ ఎవరూ రాయని గొప్ప కవిత్వాన్ని సృష్టిస్తా ను
అన్నాడు పౌండ్ . దాన్ని నిజం గానే నిల బెట్టు కొన్నాడు . రవీంద్ర నాద టాగూర్ ను ఇలియట్
ద్వారా కలిశాడు పౌండ్ . తానూ సంకలనం చేసిన పుస్త కం లో రవి కవి గీతాలను చేర్చాడు .
1922 ను ‘’a year of modernism ‘’అంటారు . ప్రముఖ రచయితఎర్నెస్ట్ హెమింగ్ వే కు
రాసే మెలకువ నేర్పింది పౌండ్ మాత్రమె . అతని దృష్టిలో వివాహం ‘’ romantic love
marriage was more a sustained friendship .Artists were special cases who could be
expected to have many deep friendships .Pound felt a connection between his
creativity as apoet and his ability to attract and seduce women .He could woo and
win women even at the age of 60 .
నోటికి యెంత వస్తే అంట మాట్లా డే వాడు pope pious 11 ను ‘’ఏ సన్ ఆఫ్ బీచ్
‘’అన్నాడు తీవ్రం గా . ఇలియట్ కు స్నేహితుల ద్వారా ఆర్ధిక సాయం అందించాడు పౌండ్ .
ఏడాదికి కనీసం వెయ్యి ఉత్త రాలైనా రాసే వాడు . ఇలా కనీసం పదేళ్ళు చేశాడు . జైలు నుండి
విడుదల చేయ టానికి ఫ్రా స్ట్ చాలా ప్రయత్నాలు చేశాడు . ‘’our mood is your mood
mr.Frost ‘’అన్నాడు ప్రభుత్వ అధికారి .జైలు నుండి విడుదల అయిన తర్వాత ‘’not like an
old man ,but like a dead man ‘’గా అని పించాడు మిత్రు లకు . తనలో తానూ
‘’wrong ,wrong –I have always been wrong ‘’అనుకొనే వాడట . చివరికి తనకేమీ
తెలియదని తెలుసుకోన్నానని అనే వాడు . చివరి ఇంటర్ వ్యూ లో ‘’all my life I believed
I knew nothing yes ,I knew nothing . And so words became devoid of meaning
‘’అని చెప్పాడు
1965 లి ఇలియట్ కవి మరణించాడు . 1966 లో ‘’ఎకాడేమి ఆఫ్ అమెరికన్ పో ఎట్స్ ‘’
గౌరవించి సత్కరించింది . హామిల్ట న్ కాలేజి వారు గౌరవ డాక్టరేట్ నిచ్చారు . ఎమర్సన్ –తోరో
అవార్డ్ ను ‘’మానవత్వ కవిత్వానికి ఇస్తా రు . దీనికి పౌండ్ పేరు ను ప్రతి పాడించారు .దానికి
పౌండ్ జీవితాలను నరక ప్రా యం చేశాడు అనే నెపం తోఅభ్యంతరం వచ్చింది .1-11-1972 లో
మరణించాడు . జననం 30-10-1885 అమెరికా లోని ఇడాహా లోని హైలీ
లో .1905 లో గ్రా డ్యుయేషన్ ను రోమాన్స్ లో చేశాడు కొంతకాలం టీచర్ ఉద్యోగం చేశాడు .
చిలీ దేశం లో పుట్టి సాహిత్యం లో 1971 లో నోబెల్ బహుమతి పొ ందిన పాబ్లో నెరూడా కవి
రాసిన కవితా సంపుటి యే ‘’the sea and the bells ‘’.సృజనాత్మక కవి ‘’sound of stones
being born ‘’అంటూ వింతగా చెబుతాడు .
ఆయన ఇల్లు
ఈశీర్షిక లో బెల్స్ అంటే కదిలే షిప్స్ .అవి కాలానికి సంకేతం . సాగర తరంగాలు
తనను ధ్యాన ముద్ర లోకి తీసుకొని వెళ్తా యని భావిస్తా డు . అలానే ‘’merchandise ‘’అంటే
బీదతనం –పావర్టికి చిహ్నం . ఈ కవి చని పో యే సమయం లో ఈ కవితలు ఆయన డెస్క్
మీద ఉన్నాయట .తర్వాత మరణానంతరం ప్రచురింప బడ్డా యి . భార్య మేటేల్డీ పైన కూడా
కవిత రాశాడు . చాలా సహజం గా సాధారణం గా గా అవసరానికి తగిన సామగ్రి తోకవిత రాసి
రంజింప జేస్తా డు . ‘’he feels his life being regenerated daily by its intimate
knowledge of the seas of renewal and articulated by the generosity of love . Facing
imminent death ,he remarks in the past tense ‘’it was beautiful to live –when you
lived ‘’అంటాడు .భార్య తో తన ప్రేమ ‘’cyclic process of seasons of the feminine
principle of sunshine and rain and the day ‘’గా గొప్ప గా అభి వర్ణించాడు
1-‘’that is why I am so much and so little –so wealthy and so destitute –because I
am from below –from the earth
2-‘’slender is our country –and on the naked edge of knives –her delicate flag brns
3-‘’hour after hour one spoonful –of acid falls from the sky as to day falls from the
day –from the day of this day ‘’
4—‘’monotonous is my song –my word is a shadow bird –fauna of stone and sea
the grief –of winter planet in corruptible ‘’
5—‘’once more young men ready yourselves –for another chance to kill to die
again –and to scatter flowers over the blood ‘’
‘’all my work is meant to say ‘’you may encounter many defeats ,but you must
not be defeated ‘’అనేదినల్ల జాతి మహా రచయిత్రి మాయా యాంజేలో నినాదం .ఆ
స్పూర్తితోనే ధ్యేయం తోనే గడిపింది . అంతే కాదు అడ్డు అయ్యే ప్రతి సమస్య ఒక సవాలై ఒక
అనుభవమై జీవిత పురోగతికి తోడ్పడుతుందని చెప్పింది .దీని వల్ల వైవిధ్య దృక్పధం కస్ట
సహిష్ణత వస్తా యని నమ్మింది .తన జీవిత రేఖను ‘’fighting defeat ‘’గా అభి వర్ణించింది .
ఆరడుగుల అందహీను రాలు యాంజేలో . కవి రచయిత్రి ,నాటక రచయితా ,ఎడిటర్
,పెర్ఫార్మర్ ,సింగర్ ,ఫిలిం మేకర్ ,డాన్సేర్ ,టి.వి.పెర్సనాలిటి,విద్యా వేత్త ,ప్రపంచ దేశాలను
ప్రభావితం చేసిన సకల కళా సరస్వతి . ఒక రకం గా కొంత వరకు మన భానుమతి అన
వచ్చు
.
అమెరికా లోని మిస్సోరి లో 1928 ఏప్రిల్ నాలుగున జన్మించింది . తండ్రి వదిలేసి
పో యాడు .తల్లి ఇంకోడితో సంబంధం పెట్టు కోంది . అప్పుడు కు క్లు క్లా క్స్ ఉద్యమం తీవ్రం గా
ఉండేది . నిరాశామయ జీవితం .అంతశ్శక్తితో గౌరవం గా జీవించాలని నిశ్చయించు
కొంది..కాని విధి వంచిత అయింది .తల్లి బాయ్ ఫ్రెండే ఈమెను ఎనిమిదేళ్ళ వయసులో రేప్
చేశాడు .అది ఆమెకు దిక్కు తోచని స్తితి అవమానకరం . తాతమ్మ దగ్గ రకు చేరింది గత్యంతరం
లేక . జరిగిన చెడు అనుభవానికి నాలుగేళ్ళు మౌన వ్రతం పట్టింది . ‘’బెర్త్ ఫ్ల వర్స్ అనే
ఆమెతో పరిచయం కలిగింది . కధలు ,పుస్త కాలు చదవమని ఆమె చెప్పిన హిత బో ధ పని
చేసి నిరంతర పుస్త క వ్యాసంగం లో మునిగింది .
1941 లో చెల్లెలి తో మళ్ళీ తల్లిని చేరింది . స్కూల్ లో చేరి డాన్స్ డ్రా మా ప్రా క్టీస్ చేసేది .
ఒక అనాధ శరణాలయం లో కొంత కాలం ఉంది . ఇక్కడ ఉండటమే తన జీవితం లో
సహనానికి నాంది పలికిందని గమ్యం ఎర్పరచుకోవటానికి మార్గ మేర్పడిందని చెప్పింది . సిటి
బస్ కండక్టర్ గా ఎంపికైంది ఈమెయే మొట్ట మొదటి లేడీ బస్ కండక్టర్ . తానూ పరిణతి
చెందలేదని ,స్త్రీత్వం పూర్తిగా రాలేదని గ్రహించింది . ‘’లేస్బియాన్ ‘’గా ఉన్నానేమో అనే
సందేహమూ కలిగింది . ఈ సందేహం తీర్చుకోవటానికి తనతో చదివే కుర్రా డిని పిలిచి సెక్స్ లో
పాల్గొ ంది .కడుపో చ్చి పిల్లా డు పుట్టా డు . వాడికి గే జాన్సన్ అని పేరు పెట్టింది .
.తల్లి దగ్గ ర తన కొడుకును వదిలి ఉద్యోగాన్వేషణ చేసింది మాయా . వంటపని వైట్రేస్స్ పని
చేసింది . భుక్తి కోసం వేశ్యా వృత్తి నీ చే బట్టింది . మళ్ళీ తల్లిని చేరింది మాదక ద్రవ్యాల
అమ్మకమూ చేసింది . తానిన్ని పనులు చేస్తు న్నా చంద్రు ని కాంతి లా స్వచ్చమైన దానినే
నని బతక టానికి చేసిన పనులే ఇవని అంటుంది . తర్వాత సేల్స్ క్లా ర్క్ గా పని చేసింది
శాన్ఫ్రాన్సిస్కో లో అక్కడ తెల్ల జాతి వారితో పరిచయమేర్పడింది . తోష్ అనే అమెరికన్ గ్ర్గ్రీక్
తోపరిచయం, పెళ్లి అయ్యాయి .వాడు ఈమెను వంటింటికే పరిమితం కావాలని
శాసించాడు.వాడికి దేవుడి పై నమ్మకమూ లేదు . ఈవిడ చర్చికి వెళ్తు ంటే వద్ద నే వాడు
.కలహాల కాపురం . రెండేళ్ళ తర్వాత విడాకులు .
నైట్ క్ల బ్ లో డాన్సర్ గా,సింగర్ గా చేరింది . పేరును మాయా యాన్జేలూ నుంచి
‘’మాయా యాంజేలో ‘’గా మార్చుకోంది .ఈ పేరు క్లిక్ అయింది . కధలు రాయటం
ప్రా రంభించింది . న్యు యార్క్ చేరింది . అక్కడి రైటర్స్ గిల్డ్ లో చేరింది . ‘’the heart of a
woman ‘’ రాసింది . వరుసగా ది. ఫైర్,నెక్స్ట్ టైం లు రాస్తే మంచి ప్రో త్సాహమే లభించింది .
దియేటర్ లో పని చేసింది అక్కడే నల్ల జాతి హక్కుల పో రాట నాయకుడు మార్టిన్ లూధర్
కింగ్ తోపరిచయ మేర్పడింది . ఆయన ఉద్యమం పై తీవ్ర ఆసక్తి చూపి దాని కోసం ఒక
బెనిఫిట్ షో నిర్వహించింది . 1960 లో ‘’make ‘’ అనే సౌత్ ఆఫ్రికన్ తోపరిచయమై
దక్షిణాఫ్రికా కు అతనితో వెళ్ళి,పెళ్లి చేసుకోంది . .అక్కడ నాటకాలలో వేషాలు వేసి మంచి పేరు
,ప్రఖ్యాతి పొ ందింది .ఇది వాడికి నచ్చలేదు . వాడు ఇంకో అమ్మాయితో సంబంధం
పెట్టు కొన్నాడు . ఇదేమిటి అని ఈమె ప్రశ్నిస్తే అది తమ ఆచారం పొ మ్మన్నాడు . పేచీలు ,
విడాకులు .
1971 లో ‘’give me a cool drink before I die ‘’,కు పులిట్జ ర్ బహుమతి వచ్చింది
.1972 లో ‘’జార్జియా జార్జియా ‘’సినిమాకు స్క్రీన్ ప్లే రాసింది . అమెరికా సాహిత్య చరితల
్ర ో
మొదటి నల్ల జాతి స్త్రీ రాసిన స్క్రిప్ట్ అది .మూడో సారి ‘’పాంట్ ‘’అనే వాడితో పెళ్లి . 1974 లో
విజిటింగ్ ప్రొ ఫెసర్ అయింది .1976 లో ‘’all day long ‘’రాసింది .,roots ‘’సినిమా లో ‘’కిటా
కింటే ‘’పాత్ర లో గ్రా ండ్ మదర్ గా నటించింది ..1981 లో the heart of a woman ‘’కు మంచి
పేరొచ్చింది . తన జీవిత చరితల
్ర ో అయిదవ భాగానికి ‘’all god’s children need traveling
shoes ‘’అని పేరు పెట్టింది . ఇది బాగా క్లిక్ అయింది .
1093 లో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ స్వీకర ప్రమాణం చేసినప్పుడు
మాయా ను ఆహ్వానించి కవిత చదవమని కోరాడు . ‘’on the pulse of morning ‘’అనే
కవితను చదివి సార్ధకత తెచ్చింది . ఇప్పటికీ ఇరవయ్యవ శతాబ్ద పు గొప్ప కవిగా మయా
యాంజేలో కు గుర్తింపు ఉంది . ఆమె రచనలను విశ్లేషిస్తూ ‘’though Maya’s work is
personal ,she aspires to be universal ‘’అని శ్లా ఘిస్తా రు . ఆఫ్రికన్ అమెరికన్ మహిళ గా
జన్మించి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని జంకు లేకుండా ధైర్యం తో తన ధ్యేయాన్ని
సాధించి వివిధ రంగాలలో తన బహుముఖ ప్రా వీణ్యతను నిరూపించిన నల్ల జాతి వజ్రం
మాయా యాంజేలో .
రేజినాల్ద్ రోస్ అనే ఆయన రాసిన తమాషా నాటకం ‘’ట్వెల్వ్ యాంగ్రీ మెన్ ‘’.ఇది సినిమా
గా టి.వి.సీరియల్ గా కూడా గొప్ప ప్రా చుర్యం పొ ందింది . అమెరికా లో ‘’మేకార్దీ ముఠా’’-
రచయితలను కమ్యూనిస్టు లు అని ముద్ర వేసి విచారణ జరిపించచేవారు . నానా అగచాట్ల
పాలు చేసేవి ఆ నాటి అమెరికా న్యాయాలయాలు . ఆ విచారణ అంతా టి.వి.లలో ప్రత్యక్ష
ప్రసారం చేసే వారు . దీని ని స్పూర్తిగా తీసుకొని ఒక కుర్రా డు తన తండ్రిని చంపాడని ఒక
ముసిలాడు చంపుతుండగా చూశాడనిఅభియోగం మోపి దానిపై జరిగిన కోర్టు విచారణ ను
కళ్ళ ముందు చూపిన నాటకమే ఇది .
ఇందులో పన్నెండు మంది ‘’జూరర్స్ ‘’ఉంటారు . వాళ్ళ మనోభావాలు ,వారి వ్యక్తిగత
జీవితాలు ,వాళ్ళు కోర్టు లో మాట్లా డిన పద్ధ తులు అద్భుతం గా చిత్రించాడు నాటక కర్త రెజినాల్డ్
రాస్ . రచయిత కూడా మేకార్దీ కాలం లో జరిగిన ఒకానొక విచారణ లో ఒక ‘’జూరర్ ‘’గా
ఉన్నాడు .కనుక ఆ కాలం లో ఎలా కోర్టు లు స్పందిన్చేవో జూరర్లు అసలు విషయం వదిలి
తమ పర్సనల్ విషయాలకు ఎలా ప్రా ధాన్యత నిచ్చేవారో తప్పుడు అభియోగాలేలా ఉంటాయో
చివరికి కొండను తవ్వి ఎలుకను ఎలా పట్టు కోలేక పో తారో భలే ముచ్చటగా రాసి కడుపుబ్బా
నవ్విస్తా డు ఆయన అనుభవం ఈ నాటకం పండ టానికి భలే తోడ్పడింది ఆద్యంతం హుషారు
గొల్పుతూ పరిగేత్తి స్తు ంది .
దీనిలో ‘’fair and impartial juries are important ,the rights of the individual
need to be respected and defended –regardless of his or her ethnicity or political
belief s and beware of the dangers of big government and of a powerful few who
lose their perspective ‘’అనే కఠోర సత్యాన్ని ఆవిష్కరిస్తా డు రాస్. అమెరికా
న్యాయస్తా నాలలో కేసును విచారించే పన్నెండు మంది జూరర్స్ ఏక గ్రీవ నిర్ణయం ప్రకటించాలి
దో షి అనో కాదు అనో .కాని వీళ్ళు నిర్ధా రణ కు రాలేక పో తారు . జడ్జి వీరిని ఒక గదిలోకి వెళ్లి
మాట్లా డుకొని ఏకాభిప్రా యానికి రమ్మంటాడు .వీళ్ళు గదిలో చేరినా ఒకరితో ఒకరు
మాట్లా డుకోలేరు ఎవరెవరో వారికే తెలియదు జాతి మతం వగైరాలు అడ్డు వచ్చి అసలు
విషయం చర్చించనే చర్చించా లేని వింత పరిస్తితి లో ఉంటారు .ఇదీ ఇందులో కద .
మేకార్దీ పై గూడా ఆరోపణ వచ్చి ప్రెసిడెంట్ ‘’ఐసన్ హో వర్ ‘’కాలం లో ‘’censure ‘’
‘’చేశారు 1954 లో జరిగిన సెనేట్ లో జరిగిన వోటింగ్ లో అభిశంన తీర్మానానికి అనుకూలం
గా 67,వ్యతిరేకం గా 22 వోట్లు వచ్చి తీర్మానం నెగ్గింది . మేకార్దే ను
‘’contemptuous ,contumacious ,and denunciatory ‘’గా నిర్ణయించారు . వెయ్యి
రాబందులను తిన్న గద్ద ఒక గాలి వానకు రాలి పో యి నట్లు అయింది మేకార్దే పని . 1957
లో మేకార్దే చని పో యాడు అందుకే తప్పుడు అభియోగాలను మెకార్ధేఇజమ్ ‘’అనే పేరుతొ
పిలవటం అప్పటి నుండి అలవాటయింది
ట్వెల్వ్ ఆంగ్రి మెన్ నాటకం రాసిన రెజి నాల్డ్ రాస్ కూడా టి.వి. రచయితగా ప్రఖ్యాతుడే .
సినిమాలు తీసిన వాడే . జనం లో మంచి క్రేజ్ ఉన్న రచయితా కూడా . ఈ నాటకానికి నిజం
గా రోనాల్డ్ ఒక రోజ్ అని పిస్తా డు .
అమెరికా లోని న్యు ఇంగ్లా ండ్ లో పుట్టి మానవ నిరాశా నిస్పృహలను , ఆనందం లేని
జీవితాలను ,వారి కోరికలను ,వారి మనస్సులో చెలరేగే భావ సంఘర్షణ లను అత్యద్భుతం గా
చిత్రించిన రచయిత్రి ఎడిత్ వార్టన్ . ఆమె నవలలలో ,రచనలలో గోతిక్ ఎలిమెంట్స్ ,వాస్త వికత
,పెసిమిజం ఉంది కంట నీరు తెప్పిస్తా యి .
1892 లో జనవరి 24 న వార్టన్ సంపన్న కుటుంబం లో పుట్టింది .అసలు పేరు Edith
Newbold jones ‘’. ఆ సమయం లో కుటుంబాలు నీటి బుడగలలా ఉబ్బి ఠప్పున పేలి
పో యే స్తితిలో ఉండేవి . వీరు ‘’the 400 ‘’ అనే పాత తరం కు చెందినవాళ్ళు . ‘’the house
of mirth ,the custom of the country ,the innocence ‘’అన్నీ వీరి సాంఘిక జీవన
పో రాటాలను తెలిపేవే .1870 లో టైఫాయిడ్ జ్వరం వచ్చి ఎడిత్ కు చావు కొద్దిలో తప్పి
పో యింది .జర్మని ,ఇంగ్లా ండ్ లకు వెళ్లి ఐరోపా సాహిత్యాన్ని మధించింది . తండ్రి దగ్గ ర ఉన్న
అమూల్య పుస్త క భాండా గారాన్ని సద్వినియోగం చేసుకోంది .పన్నెండేళ్ళ వయసులోనే
‘’fast and loose ‘’నవల రాసింది .గొప్ప చేయి తిరిగిన రచయితా రాసిన రచనా అని
అందర్నీ ఆశ్చర్య పరచింది ఆ నవల .
Signature
‘’ఇంటీరియల్ డెకరేషన్ ‘’ మీద పుస్త కం రాసింది .1899 లో ‘’the greater inclination
‘’కదలు మంచి గుర్తింపు తెచ్చాయి . కాపురాన్ని మాసా చూసేట్స్ కు మార్చింది . ఇప్పుడే
ఆమె మేధో సర్వస్వం అని పించే ‘’Ethan Home ‘’నవల రాసింది .తర్వాత’’ సమ్మర్
‘’నవల రాసింది . ఎడిత్ రాసిన ‘’the house of mirth ‘’నవల 1,40,000 కాపీలు అమ్ముడు
పో యి ఆమె కు విశేష ప్రా చుర్యం కల్గించింది . ఆరు నెలలు పారిస్ లో మరో ఆరు నెలలు
అమెరికా లో ఉంది .1906 ప్రముఖ రచయిత హెన్రి జేమ్స్ తో పరి చాయం కలిగింది .1890 లో
భర్త కు దూరమైంది . చిన్న నాటి స్నేహితుని తో సహవాసం చేసింది . అతనికి డిప్రెషన్ . ఈమె
ఆదాయం పైనే వారి కుటుంబం గడవాలి . ఆమె పారిస్ లో, ఇతను బో స్ట న్ లో ఉన్నారు . భర్త
అప్పుల పాలయ్యాడు .ఈవిడ పట్టించుకో లేదు . 1912 లో ‘’the reef ‘’,the curtain of the
country ‘’రాసింది .1911 లో’’ ఈతాన్ ఫ్రేం ‘’నవల బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది .
1923 లో భర్త కు విడాకు లిచ్చేసింది . జర్మనీ లో కాపురముంది .’’ రెడ్ క్రా స్’’లో 1917 లో
చేరి సేవలందించింది . పారిస్ లో ఉన్న ఇల్లు ధ్వంసం అయింది .
ఎడిత్ వార్టన్ తన జీవిత చరిత్ర ను ‘’a backward glance ‘’పేర రాసుకొన్నది . 1924
లో ‘’ఓల్డ్ న్యూయార్క్ ‘’రాసింది . అందులో అమెరికన్ల డబ్బు ఆకలి ,నిజాయితీ లేని తనం
,కళ మీద వారికున్న నిర్ల క్ష్యం ,సంస్కృతిపై వారి ఏవగింపు ‘ల పై విరుచుకు పడి రాసింది .
అప్పుడే అమెరికా ‘’లీగ్ ఆఫ్ నేషన్స్ లో’’ అంటే నానా రాజ్య సమితి లో సభ్యత్వం
తీసుకోలేదు . ఆమెకు ‘’soul mate and closest literary adviser ‘గా వ్యవహ రించిన
‘’వాల్ట ర్ బెర్రీ ‘’అనే ఆమె ఆప్తు డు చని పో యాడు .1929 లో వచ్చిఅన అమెరికా ఆర్ధిక
సంక్షోభం వల్ల ఆమె ఆస్తికేమీ నష్ట ం కలగ లేదు .ఆమె రాయటం ప్రా రంభించిన ఆటో
బయాగ్రఫి 1932 లో పూర్తీ చేసింది .1937 ఆగస్ట్ పద కొండు న ఎడిత్ వార్టన్ ఫ్రా న్స్ లోని
పారిస్ నగరం లో 45 ఏళ్ళ వయసులోనే మరణించింది .
ఆమె చని పో యిన చాలా కాలం వరకు ఎడిత్ రచనల పై ఎవరూ ద్రు ష్టి పెట్ట లేదు .
1950-60 కాలం లో అమెరికన్ల కు ఆమె రచనల పై శ్రద్ధ పెరిగింది .పునర్ మూల్యాంకనం చేయ
ప్రా రంభించారు . ‘’her ability to incorporate a whole society ‘s rituals ,struggles ,and
beliefs ‘’తన రచనల్లో ప్రతి బిమ్బింప జేయ టానికి అద్భుత కృషి చేసిందని విమర్శకులు
కీర్తి కిరీటం పెట్టా రు .ఆమె రచనల్లో డ్రమాటిక్ ఐరనీ ఉండటం ప్రధాన లక్షణం . ఎన్నో కధలను
కూడా రాసింది అందులో దెయ్యాలు ,భూతాలు ఉండే రచనలే ఎక్కువ.సుమారు ఇర్వి
అయిదు నవలలు ,మూడు కవితా సంకలనాలు ,పదిహేడు షార్ట్ స్టో రీ కలెక్షన్స్ తో బాటు
తొమ్మిది నాన్ ఫిక్షన్ రచనలు చేసింది .''the book of the home '' అనే జర్నల్ కు ఎడిటర్
గా కూడా ఉన్నది . ఆమె ఫ్రెంచ్ ఇమ్పీరియలిజం ను ప్రో త్స హించింది ంఒదతి ప్రపంచ
యుద్ధ ం తర్వాతా మొరాకో వెళ్లి అక్కడ సైనికాధికారికి అతిధి గా ఉంది అక్కడే ''మొరాకో ''అనే
పుస్త కం రాసింది .ఫ్రెంచ్ భాష బాగా మాట్లా డేది ఽఅమె రచనలు ఫ్రెంచ్ లోను వచ్చాయి
అమెరక
ి ా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ --1
అమెరికా లో పాత దారిలో నడిచే నాటకాలకు కొత్త జవం ,ఉత్తేజితం చేసిన వాడు టెన్నిసీ
విలియమ్స్ .అసలు పేరు థామస్ లేనియర్ విలియమ్స్ .1911 మార్చ్ ఇరవై ఆరున
మిసిసిపి లోని కొలంబస్ లో పుట్టా డు .దీనినే ‘’హార్ట్ ఆఫ్ అమెరికన్ సౌత్ ‘’అంటారు .
అతని గురించి ఒక్క మాటలో ‘’williams acquired a great taste for light ladies and a
heavy drinker ‘’అని చెప్పేస్తా రు . తల్లి ఎద్వినా .కుటుంబం అంతా ‘’ మెంటల్ నెర్వస్
డిసార్దర్ ‘’ తో బాధ పడిన వాళ్ళే . తల్లికీ అదే జబ్బు . చిన్నప్పుడే డిఫ్తీరియ ,కాళ్ళకు పక్ష
వాతం వచ్చాయి విలియమ్స్ కు . తండ్రికి నికరాదాయం లేనందున పదేళ్ళలో పదహారు సార్లు
కుటుంబం వేరు వేరు చోట్లకు మారాల్సి వచ్చింది
బాధలు మరవటానికి తాగుడు అలవాటై బానిసే అయి పో యాడు . చెల్లెలు రోజ్ గ్లా స్
తో చేసిన చిన్న జంతువుల బొ మ్మలను సేకరించేది హాబీగా . హేజల్ అనే అమ్మాయి తో
పరిచయమేర్పడింది . సినిమాలు కధలు ,కవితలు టో చదువు అటకెక్కింది . ‘’can a good
wife be a good sport ‘’?అనే అంశం పై వ్యాసం రాస్తే మొదటి బహుమతి వచ్చింది ‘’.the
vengeance of nitocris ‘’కధలు ‘’స్మార్ట్ ‘’పేపర్ కు రాశాడు ప్రచురితమైనాయి .1928 లో
తాత తో కలిసి యూరప్ పర్య టిం చాడు .రోడ్డు మీద నడుస్తు ంటే అకస్మాత్తు గా ‘’he was
struck with an overwhelming fear othat by his own account pushed him within a
hair breadth of going quite mad ‘’అని పించింది అప్పుడే ఆలోచనలలో ఫో బియా
వచ్చింది . భరించ లేని భయం ఆవహించింది . అనుకోకుండా మతం పై అచంచల విశ్వాసాం
మిరకిల్ గా ఏర్పడి పో యింది .యేసు క్రీస్తు తన తలపై చెయ్యి వేసి ఒడార్చుతున్నట్లు గా అని
పించింది . అందుకే విలియమ్స్ రచనలలో ఎస్స్తేతిక్ సెన్స్ ఎక్కువ గా కనీ పిస్తు ంది .
‘’Iowa university ‘’లో చేరాడు .బామ్మ డబ్బు సాయం చేసింది .మళ్ళీ ఆరోగ్యం
దెబ్బతింటే ఆస్పత్రిలో చేరాడు .scizo phernia ‘’వచ్చి ‘’the frantal lo botomy ‘’ఆపెరేషన్
చేశారు 1938 లో డిగ్రీ పొ ందాడు .1939 లో డ్రా మా పో టీలలో ‘’అమెరికన్ బ్లూ స్ ‘’నాటిక
రాశాడు పేరును ‘’Tennesse ‘’గా మార్చుకొన్నాడు . అప్పుడే ఆండ్రి వుడ్ తో పరిచయం
కలిగింది .జీవితాంతం పెర్సనల్ మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చాడు రచనలు చేయటానికి
సహాయం గా అమెరికా కోటీశ్వరుడు రాక్ ఫెల్లర్ నుండి వెయ్యి డాలర్లు అందాయి .1940 లో
న్యూయార్క్ చేరాడు .’’battle of angels ‘’ నాటకం రాశాడు .న్యూయార్క్ లో ప్రదర్శిస్తే
ఫెయిల్ అయింది . ఎడమ కంటికి నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది పాపం . 1943 లో
M.G.M. కు వారానికి రెండొందల యాభై డాలర్ల జీతం మీద పని చేశాడు అ తను రాసిన
డైలాగ్స్ నచ్చక వదిలేశారు . అప్పుడే అతని ప్రసిద్ధ ‘’the glaas menagerie ‘’నాటకం
రాయటం ప్రా రంభించాడు
The rose totto ,cat on a hot tin roof నాటకాలకు పేరు ,ప్రఖ్యాతులే కాదు పులిట్జ ర్
బహుమానం కూడా వచ్చింది రచనలన్నీ సినిమాలుగా తీశారు’’sweet bird of incredible
youth ‘’ నాటకాన్ని నాలుగు లక్షల డాలర్లు ఇచ్చి హక్కులు కొనుక్కున్నారు .’’టైం
‘’మాగజైన్ విలియమ్స్ ముఖ చిత్రం తో ప్రత్యెక సంచిక తెచ్చి గౌరవించింది . ఈ ప్రత్యెక
సంచికయే తనకు మిలియన్ డాలర్ల బహుమానం అని సంబరపడ్డా డు టెన్నెసీ ..1957 లో
మళ్ళీ డిప్రెషన్ .వచ్చింది .పానిక్ గా మారాడు హైపో కాన్ద్రియాతో బాధ పడ్డా డు క్లా స్త్రో ఫో బియ
కూడా చేరింది .ఇంతలో తాత చని పో యాడు . వెంటనే తండ్రి మరణం . తట్టు కోలేక మందుకు,
డ్రగ్స్ కు బానిసైనాడు .’’intense psycho analysis ‘’కు సిద్ధ పడ్డా డు .దీని తర్వాత రాసిన
వన్నీ ఫైల్యూర్ అయాయి .విలియమ్స్ అభిమాని ఫ్రా ంక్ మెర్లో మరణం మరీ బాధించింది .
తన జీవితం గురించి చివరి రోజుల గురించి ‘’stoned age ‘’రాశాడు .
మాట పడి పో యింది .1969 లో సెయింట్ లూయిస్ లో ‘’psychiatric ward ‘’కు
తరలించారు . అక్కడ పరిస్తితులు అమానుషం గా ఉన్నాయి ఈ స్తితి లోను ‘’milk train
‘’,slapping tragedy ‘’రాశాడు .1970-80 కాలం లో తీవ్ర మైన ఫ్రస్ట్రేషన్ తో బాధ పడ్డా డు .
1982 లో తన జీవిత కదనే ‘’a house not meant for stand ‘’నాటకం గా రాశాడు .గుర్తింపు
రాలేదు .డ్రగ్స్ ఆల్కహాల్ విపరీతమైనాయి .1980 లో తల్లి చని పో యింది . తట్టు కోలేక
పో యాడు . 1969 లో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసి నప్పుడు
‘’presidential medal of freedom ‘’ఇచ్చారు . కార్టర్ విలియమ్స్ గురించి మాట్లా డుతూ
Williams has shaped the history of American drama .From paasionate tragedy to
lyrical comedy .his master pieces dramatize the eternal conflict of body and soul
and death and love and despair .Through the unity of reality and poetry tennesse
shows that the truly heroic in life or art in human compassion ‘’అని గొప్ప గా
మెచ్చాడు .
భయం ,సిగ్గు ,సెక్సువల్ కంఫూజన్ లతో విలియమ్స్ చివరి రోజులు చాలా
ఒడిదుడుకులతో సాగింది .అతని దృష్టిలో తానూ ‘’బో ర్న్ రైటర్ ‘’. ‘’I wrote not for
audience but for myself ‘’అన్నాడు . ‘’it is a therapy to expose and deal with inner
turmoil and doubts ..’’అని చెప్పుకొన్నాడు .ఒక రకం గా ఆయన రచనలన్నీ పాక్షిక స్వీయ
జీవిత చరితల
్ర ే . అతన్ని ‘’he was afraid of success ,had inordinate fear of insanity .he
was obsessed with his own death .As an artist he was a fighter . తన జీవితం లో
సంఘటనలు ఏవీ ఒకదానితో ఒకటి కూర్చబడలేదని వాటినే తానూ తెరకు ఎక్కిన్చానని
చెప్పాడు ‘’I just peakout from behind the curtain now and then and find myself on
totally different terrain . ‘’అని రచనా విధానాన్ని ఆవిష్కరించాడు .ఇరవై ఎనిమిది పెద్ద
నాటకాలు ,ఎనిమిది చిన్నవి ,రెండు నవలలు ,తొమ్మిది స్క్రీన్ ప్లే లు ,ఇరవై కధలు ,డజనుకు
పైగా ఏకాంకికలు ,రెండు కవితా సంకలనాలు ,ఇతరత్రా బో లెడు రాసిన వాడు విలియమ్స్
16 సంవత్సరాల వయసున్న జర్మనీ బాలిక అన్నే ఫ్రా ంక్ తన జీవిత చరితన
్ర ుడైరీ గా
రాసుకొని దానికి ‘’దిడైరీ ఆఫ్ ఏ యంగ్ లేడి ‘’ని పేరు పెట్టు కోంది.నాజీల దౌష్ట్యానికి గురైన
తనకుటుంబ చరిత్ర అంతా రాసింది అందులో .’’I want to live on after my death ‘’అనే
స్పూర్తి తో రాసిన డైరీ ఇది అదె ఆమెను చిరంజీవి ని చేసింది .
1929 జూన్ పన్నెండు న జర్మని లో ‘’Frankfurt am main ‘’లో ఆటో ,ఎడిత్ లకు
జన్మించింది అన్నే ఫ్రా ంక్ .వారిది జ్యూ కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్ .అప్పటికే నియంత
హిట్లర్ అధికారం లోకి వచ్చాడు .యూదు లంటే అతనికి విపరీత మైన ద్వేషం . వారిని అన్ని
రకాల హింసలకు గురి చేశాడు .వారి వ్యాపారాలన్నీప్రభుత్వ పరం చేశాడు . 1939 లో రెండవ
ప్రపంచ యుద్ధ ం మొదలైంది . నా జీలు హాలండ్ ను ఆక్రమించుకొన్నారు .పాపం వీళ్ళ
కుటుంబానికి అక్కడా నీడ దొ రక లేదు . తీవ్ర నరకం అనుభవిన్చేట్లు చేశాడు దుస్ట హిట్లర్
..యూదులంతా ఇంగ్లా ండ్ కో అమెరికా కో పారి పో యారు .
ఆమె నివశించిన అపార్ట్ మెంట్
యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధ ం పూర్తీ అయిన తర్వాతా
వాటిని ప్రచురిస్తా మని 1944 లో రేడియో లో ప్రకటన వచ్చింది . అయితే ఎవరో కుట్ర చేసి
వీరిని పట్టించారు . 1944 లో సెప్టెంబర్ మూడు న వీళ్ళందరినీ పో లాండ్ కు గొడ్ల ను తోలుకు
వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్ట లు ఊడ దీయించి వర్షం లో నిల
బెట్టా రు .గాస్ చేంబర్ లలో పెట్టి లక్షలాది మందిని చంపేశారు నాజీ నియంతలు . ‘Anne
wept when most of us had not tears left ‘’అని ఒక అమ్మాయి ఈ సంఘటన గురించి
రాసింది .
బట్ట లు లేకుండా నే వీళ్ళను ఫ్లా ష్ లైట్ వెలుతురుఎన్నో గంటల సేపు లో కూర్చో
బెట్టేవారు .విపరీత మైన ఆకలి ఊపిరి ఆడక పో వటం తో చాలా మంది చని పో యారు . 1945
లో బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు . అంతకు ముందే కాంప్ లో తల్లి చని పో యింది
.వీళ్ళిద్ద రూ అంటే అన్నే ఫ్రా ంక్ ,సో దరి , టైఫాయిడ్ తో పో షకాహారం లేక పో వటం వల్ల చని
పో యారు 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రా ంక్1945 march లో మరణించింది .తండ్రి ఇంటికి
తిరిగి వచ్చిన తర్వాతఅన్నే రాసిన డైరీ దొ రికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి
ప్రింట్ చేస్తే 25 మిలియన్ల అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి వారు చేసిన
దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రా ంక్ దైరీకున్న ప్రా ధాన్యత దేనికీ రాలేదు .
దాదాపు అరవై భాషల్లో కి అనువాదం పొ ందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ
వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా
అన్నే ఫ్రా ంక్ డైరీని తానూ చదివానని ఏంతో ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి
విని పించానని రాశాడు
ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది .ఫ్రా ంక్ తండ్రి 81 వ ఏట
1980 లో చని పో యాడు .అన్నే పేరఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకార మైన
పనులు చేస్తు న్నారు .ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు
లక్షల మంది దాన్ని సందర్శిస్తా రు .అన్నే డైరీ ని నాటకం గా కూడా మలచి ఆడుతున్నారు
దీనికి పులిట్జ ర్ బహుమతి వచ్చింది
1944 ఏప్రిల్ లో చివరి ఎంట్రి గా అన్నే ‘’I want to live on after my death ‘’అని
రాసుకోంది.ఈ మాటలే అందరికి మంత్రా లైనాయి గొప్ప స్పూర్తి కలిగించాయి . స్కూళ్ళల్లో
పాఠంగా పెట్టిబో ధిస్తు న్నారు ..అందుకే అన్నే ‘’has become a martyr rather than a victim
‘’అయింది ఆమె ఇంకా యవ్వనం లోకి ప్రవేశించక ముందే జీవితం నుండి నిష్క్రమించాల్సి
వచ్చింది .ఆమె డైరీని ‘’comforting document ‘’భావిస్తా రు బాదో ప శమన కారిణి అన్న
మాట .ఆమె డైరీ చదివితే ‘’even in the midst of history’s worst depredations ,the
human spirit is not quilled ,goodness and beauty endure ‘’అని నిరూపించింది
పిస్తు ందని విశ్లేష కాభి కాభిప్రా యం . అది ఆమె స్వంతమే అయినా దాని ప్రభావం అంతటిది
.అందుకే అన్నే ఫ్రా ంక్ డైరీ ని ‘’A record of triumphant defeats. Anne found her
strength in her love of the very world which was denied her ‘అని పిస్తు ంది మనకు
తానూ లక్షలాది మంది చావును విన్నదీ కన్నదీ . తానూ స్వర్గా నికి వెడితే ఈ క్రూ రత్వం
కూడా ఆగిపో తుంది అన్నది ఇంతకస్ట ం లో ను ప్రజలు నిజం గా మంచి మనసున్నా వారేనని
అంటుంది .చివర గా ‘’ I can not build up my hopes on a foundation of confusion
misery and death ‘’అని ఏంటో ధైర్యం గా నవ్వ్వుతూ నాజీలకు బలి అయి పో యిందా
అమాయకపు పిల్ల అన్నే ఒక తేజో రూపం ఒక ఆరాధ్య దేవత అయింది
లారెన్స్ 1885 లో ఇంగ్లా ండ్ లోని నాటిన్ఘా ం షేర్ దగ్గ ర ఈస్ట్ వార్డ్ అనే చోట జన్మించాడు .
పదహారేళ్ళ వయసులోనే ‘’వైట్ పీకాక్ ‘’నవల రాశాడు . బారోస్ అనే ఆవిడతో ప్రేమాయణం
సాగించాడు .1912 లో ఇంగ్లా ండ్ ,ఇటలీలు పర్య టించి అవి నచ్చక జెర్మని చేరాడు .ఈ లోపల
భార్య ఇంకోడితో జంప్ . 1814 లాక్ టు పెవిలియన్ గా ఇంగ్లా ండ్ చేరాడు . ‘’రైన్ బౌ ‘’అనే
విఖ్యాత నవల రాశాడు .తర్వాతా ‘’విమెన్ ఇన్ లవ్ ‘’రాశాడు .సావేజ్ పిల్గ్రిమ్స్ రాసి పేరు
పొ ందాడు ఇండియా తో సహా అనేక దేశాలు తిరిగాడు 1925 లో ఆయన ప్రసిద్ధ నవల ‘’lady
chatterley’s love ‘’రాశాడు దీన్ని ప్రభుత్వం నిషేధించింది .అతనొక గొప్ప చిత్రకారుడు కూడా
.వీటినీ బాన్ చేసింది . స్వాధీన పరచుకొంది ప్రభుత్వం . 1930 లోమార్చి రెండవ తేదీ న
ఇటలీ లోని వెనిస్ లో నలభై అయిదు ఏళ్ళకే లారెన్స్ మరణించాడు .50 కధలు ,12 నవలలు
,అనేక కవితలు ,ఎన్నో చిత్రా లు ,యాత్రా సాహిత్యం ,సాహిత్య విమర్శ మొదలైన అనేక మైన
రచనలు చేశాడు .లారెన్స్ రచన చదువుతుంటే కవిత్వం జాలు వారుతున్నట్లు న్డ టం అతని
శైలికి అద్ద ం . ధర్డ్ పెర్సన్ లోనే కదా చెబుతాడు .రచనలన్నీ యాభై సంపుటాలుగా వచ్చాయి
.లారెన్స్ మరణం తర్వాతా హెచ్.జి.వేల్స్ కొన్ని టిని ప్రచురించాడు .
‘’the very great literary talent f the time .he lived with
titanic energy and produced enormous quqntity of work ‘’అని
ఒక్కమాటలో లారెన్స్ గురించి చెప్ప వచ్చు .అతని భావ తీవ్రతను
‘’temperate tone ‘’అంటారు .తనను తాను ‘’మానవ బాంబ్ ‘’గా
చెప్పుకొన్నాడు లారెన్స్ . Lawrence bomb image suggests the
total annihilation Christian civilization which is condition for
a new birth like phoenix which rises to a new life from its
ashes ‘’అంతటి ప్రభావాన్ని చూపిన ఘనా ఘనుడు .
లారెన్స్ భావాలు చాలా తమాషా గా ఆలోచనాత్మకం గా ఉంటాయి .అతని దృష్టిలో ‘’sex
is understood by primitive peoples before the body has been purified and de
energiged ,civilized out of existence . it is when man fulfills his sexual nature ,that
he attains his highest human destiny and achieves god head ‘’మన చలం టైప్
అన్నమాట . రజనీష్ భావజాలం కూడా ఇంతే కదా .అదో యోగం .భోగం లో యోగం . క్రమ
పధ్ధ తి లో ఆలోచించే వాడాయన . ఇంకోరకం గా మానసిక శాస్త ్ర వేత్త కూడా . అన్ని రచన
లలోమానవుడే కన్పిస్తా డు .గొప్ప జీనియస్ అని పించుకొన్న లారెన్స్ అంటే విమర్శకులకు
అసహనం గా ఉండేది .రచనలన్నీ దాదాపు ఆయన స్వీయ చరితామ్రు తాలే .అతని ఆరోగ్యం
బాగుండేది కాదు కాని మైళ్ళ కొద్దీ నడిచే సత్తా ఉన్న వాడు .ఇంగ్లీష్ నవలకు కొత్త రూపు ను
సంతరించాడు తన కాలపురచయిత లందరిలో''దిగ్రేటెస్ట్ ''అనిపించుకొన్నాడు.
లారెన్స్ కధల్లో ‘’the Prussian officer ,the blind man ,two blind birds ,the fox the
rock of horse winner ‘’మంచి పేరు తెచ్చుకోన్నాయి . నవలలలో ‘’ women in
love ,rainbow లు అందరి మెప్పు పొ ందాయి కవితల్లో ‘’tortois ‘’. కవిత లో’’-traveller-
with your tail tucked in a little on one side –like a gentleman in a long skirted coat
–a life carried on your shoulder –invincible fore runner ‘’అని ఏంతో భావాత్మకం గా
చెప్పాడు దానినే ఇంకా వర్ణిస్తూ ‘’blotted –o n this small bird –this rudiment –this little
dome this pediment –of all creation –this slow one ‘’అని మన అది కూర్మ
అవతారాన్ని జ్ఞ ప్తికి తెస్తా డు .లారెన్స్ రాసిన ‘’స్నేక్ ‘’కూడా మన పుస్త కాలలో అంశం గా
చేర్చి బో ధించటం చూశాం .జీవితాలలో ప్రమాణాలతో కూడిన జీవితాలున్దా లంటాడు దీనినే
‘’kindling the life quality where it was lost ‘’అన్నారు
లారెన్స్ గొప్ప సాహితీ విమర్శకుడు .చాలా లోతుగా తీవ్రం గా అలోచించి చెబుతాడు
.అమెరికన్ మొదటి ఆధునిక కవి వాల్ట్ విట్మన్ గురించి ‘’and who ever walks a mile full
of false sympathy walks to the funeral of the whole human race ‘’అని కుహనా
మెచ్చు గాళ్ళకు చీవాట్లు పెట్టా డు .అలాగే ఎడ్గా ర్ అల్లెన్ పో కవి మీద అద్భుత ప్రశంశా
వాక్యాలను కవితాత్మకం గా చెప్పాడు ‘’fenimore cooper has two vibrations going on
together –a disintegrating and slowing of the old consciousness ,the forming of a
new consciousness underneath .Poe has only oneonly the disintegrative
vibration.this makes him more a scientist than an artist ‘’అని గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఇచ్చాడు
.శిల్ప హృదయం ఉన్న వాడుకనుక ఆ శిల్పి అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించాడు .పో
ఎందుకు అనారోగ్య కర మైన రచనలు చేశాడు అని మొరలిస్ట్ లు ఆశ్చర్య పో తే దానికి
సమాధానం గా ‘’they need to be written because old things need to die and
disintegrate because the old white psyche has to be gradually broken down before
any thing else come to pass ‘’అని ఘాటుగా క్లా స్ పీకాడు లారెన్స్ .అంతే కాదు’’ పో ’’ లో
ఉన్నది మానసిక ,చేతనా యొక్క రసాయనిక విశ్లేషణ ,.నిజమైన కళ లో ద్వంద్వ లయ
సృష్టి, మరణం ఉంటాయన్నాడు అందుకే కవి పో తన రచనలను ‘’కధలు –టేల్స్ ‘’అన్నాడు
.అవి కారణ కార్య సంబంధాల పై కేంద్రీకరణమే నంటాడు లారెన్స్ .అవి మనిషి హృదయం
లోని దెయ్యపు భావనలే అతన్ని చీకాకు పరచేవే వాటినే పో అద్భుత సృష్టి తో తీర్చి దిద్దా డు .
అతని దృష్టిలో జీవుల జీవితం లో ముఖ్య మైనది ప్రతి జీవి తాను ఒంటరిది,ప్రత్యెక
మైనదే నని .అది తన ఏకాంతాన్ని భగ్నం చేసుకొన్నా క్షణం నుంచి ఇతరాలతో కలిసినప్పుడు
దిక్కు తోచక గందర గోళం లో పడి పో తుందని దాని వల్ల మృత్యువుకు చేరువౌతుందని .ఈ
సృష్టి రహస్యం అన్ని జీవు జాతులకు సహజమేనని మనిషి నుండి అమీబా వరకు ఇదే
జరుగుతుందని చెప్పాడులారెన్స్ ‘
‘’ in spiritual love the contact is purely nervous .the nerves in the lovers are set
vibrating in unision like two instruments .the pitch can raise higher and higher .
But carry this too far and the nerves begin to break . ,to bleed ,as it were and aform
of death sets in ‘అని రెండు రకాల ప్రేమలలోని తారతమ్యాలను చెప్పాడు ఆయన మాటల్లో
చదివితేనే బాగుంటుందని అదే ఇక్కడ రాశా .ఇంత గొప్పగా చెప్పగలగటం అందరికి రాదు .
మనిషి లో ఉన్న చిక్కేమిటంటే తన అదృష్టా నికి తానె కారణం అధికారి
అనుకోవటమే అంటే కాక ఏకత్వాన్ని కోరుతాడు . spiritual love ‘’ సాధించిన తర్వాతా అదే
జీవితాంతం కావాలను కొంటాడు దీనినే అతడు ‘’ hightening llife ‘’అన్నాడు .ఈ కలయిక
తర్వాతా దీని ద్వారా విశ్వ సమ్మేళనాన్ని వాంచిస్తా డు మానవుడు అంటాడు లారెన్స్ మనిషికి
ఎప్పుడూ ప్రేమ కావాల్సిందే .దాన్ని పొ ందాల్సిందే .దాన్ని త్యాగం చేసి ఒంటరిగా ఉండలేడు
.ఇవన్నీ ఆలోచించే ఎడ్గా ర్ ఎల్లెన్ పో రాశాడని మెచ్చుకొంటాడు .
లారెన్స్ క్రిటిసిజం చదువుతుంటే వారేవా లారెన్స్ అని పిస్తు ంది .తన బ్రెయిన్ ను అం
తా డ్రైన్ చేసి అక్షర ప్రవాహం తో నిమ్పాడని పిస్తు ంది .సాహిత్య బీజాలకు సశ్య శ్యామల
ఫలితాన్నిచ్చే జీవనది గా మార్చాడని పిస్తు ంది .ఆ గడ్డ ం లో ఆ చూపులో ఒక దార్శనికత
స్పష్ట మౌతుంది .అతని రచనలలో ఏంతో నిగూఢ త ,భావ సాంద్రత ఉన్నాయి అతని
హృదయమంతా కవితామృతమే .అందుకే లారెన్స్ కలం పట్టు కొంటే మాట పాటై ,పద్యమై
హృద్యమై సద్యోగర్భితం గా వెలువడి ఆనందాన్నిస్తు ంది .శ్రీ పాద వారి కదన శైలి ఉంటుంది
.లోతైన అవగాహనా ఉంది ఎప్పుడు చదివానో ఇదివరకు లారెన్స్ మీద ఎందు వల్ల నో విపరీత
మైన ,వల్ల మాలిన అభిమానం ఏర్పడిపో యింది నా మనసులో .అతని మాటలు ‘’కో ట
బుల్ కోట్స్ ‘’చదివిన జ్ఞా పకం ఉంది అందుకే అంతటి ఆరాధనా భావం ఏర్పడిందేమో ?
ఉత్త ర అమెరికా లోని మెక్సికో ,హో ండూరస్ ,నికారుగ్వా ,కోస్టా రికా ,పెనామా ,దక్షిణ
అమెరికా లోని వెనిజుల ,కొలంబియ ,ఈక్వెడార్ ,పేరు ,బ్రెజిల్ బొ లీవియ ,పరాగ్వే ,అర్జంటీనా
,చిలీ ,ఉరుగ్వే దేశాలను లాటిన్ అమెరికా దేశాలని అంటారు .ఈ దేశాల రచయితలు 1960
నుండి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .ఇందులో స్పానిష్ ,పో ర్చుగీస్ ,భాషలు మాట్లా డే వారే
ఎక్కువ .వీటిని స్పెయిన్ పో ర్చుగీసు దేశాలు ఆక్రమించటం వల్ల నే ఈ భాషలు నిలిచినాయి
.క్రీశ.1500 ప్రా ంతం లో 300 ఏళ్ళు యూరోపియన్ కాలనీలు గా ఉన్న దేశాలివి .19 వ శతాబ్ద ం
లోనే విముక్తి పొ ందాయి .యూరస్ లోని అన్ని ప్రా ంతాల జనాలవారు వలస రావటం తో
ఆవాస భూములయ్యాయి .ఎక్కువ మందికి స్పానిష్ మాత్రు భాష . బ్రెజిల్ లో మాత్రం ఇంగ్లీష్
ఫ్రెంచ్ డచ్ భాషలు మాట్లా డుతారు
ఈ దేశాలన్నీ యుద్దా లతో ,అంతర్యుద్ధా లతో అతలా కుతల మై పో యాయి .నిలకడ గా
ఏ ప్రభుత్వమూ లేదు .వీళ్ళ రచనల్లో ‘’మాజికల్ రియలిజం ‘’ఎక్కువ గా ఉంటుంది
.అంతర్యుద్ధా ల వల్ల రచయితలూ ఇతర దేశాలలో తల దాచుకొనే వారు .ఇందులో కొందరు
సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ సాధించిన వారు కూడా ఉన్నారు .వారిలో కొందరి గురించి సంక్షిప్త ం
గా తెలుసు కొందాం
బో ర్జెస్ అర్జెంటీనా లో బ్యూనస్ ఐర్స్ లో1899 లో జన్మించాడు .చిన్ననాటి నుండి కధలు
వినటం చెప్పటం అలవాటు .ఆరవ ఏట మొదటి కద రాశాడు .స్కూల్ లో చదువు సాగలేదు
.మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో జెనీవా కు వెళ్ళాడు ..ఇరవయ్యవ శతాబ్ద పు ఈ రచయిత
లందరికి స్కూలు చదువు లేదు స్వంతం గా నే అన్నీ నేర్చుకొన్నారు .1921 లో మళ్ళీ
స్వదేశం చేరుకొన్నాడు .కళ్ళు సరిగ్గా కానీ పించక ఇబ్బంది పడే వాడు .కొంత కాలం
లైబ్రేరియన్ గా పని చేశాడు .1928 లో కళ్ళు అసలు కనీ పించేవికావు .తాను చెబుతూ ఉంటె
తల్లి రాసి పెడుతూ ఉండేది .నేషనల్ లైబర
్ర ి కి డైరెక్టర్ అయ్యాడు .దేశానికి ‘’పీరాన్ ‘’అనే
వాడు అధికారం లోకి రాగానేఉద్యోగానికి రాజీనామా చేశాడు .తర్వాత ఇంగ్లీష్ ప్రొ ఫెసర్
అయ్యాడు .ఇంగ్లా ండ్ రాణి బో ర్జెస్ కు ‘’నైట్ హుడ్ ‘’ప్రదానం చేసి గౌరవించింది .అమెరికా
కాంగ్రెస్ లో షేక్స్ పియర్ పై 1976 లో మహాద్భుత మైన ఉపన్యాసం ఇచ్చాడు .1986 జూన్ 14
న 99 ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా గడిపి మరణించాడు
3-.రోసారియో కాస్టెల నాస్
ఈమె 1925 లో జన్మించి 1974 లో మరణించింది .మెక్సికో లో సంపన్నుల ఇంట పుట్టింది
.ఆ కాలం లో ఆ దేశాలలో ఆడవాళ్ళకు చదువు చెప్పించే వారు కాదు .1933 లో ఒక
స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో ఒక చిన్నారి మరణం త్వరలో జరుగుతుందని జోస్యం చెప్పింది
.తమ్ముడు చని పొ తే బాగుండునని ఈ పిల్ల అనుకొంటే ఈపిల్ల చస్తే బాగుండు నని తల్లి
భావించింది .చివరకు తమ్ముడే చచ్చి పో యాడు .ఆ తర్వాత కుటుంబ ఆస్తి అంతా హారతి
కర్పూరం లాగా హరించుకు పో యింది .ప్రభుత్వం వీరి భూములను స్వాధీనం చేసుకొని నేటివ్
ఇండియన్ లకు పంచి పెట్టింది .ఈ విషయాలన్నిటిని ‘’the three knots in the net ‘’నవల
లో రాసింది .1948 తలిదంద్డ్రు లిద్ద రు చని పో యారు ..అప్పటిదాకా గారాబు బిడ్డ గా పెరిగింది
.1950 డిగ్రీ పూర్తీ చేసింది .స్పెయిన్ లో చదువు కోవటానికి అనుమతి సాధించింది యూరప్
అంతా పర్య టింన్చింది .ఆమె రాసిన ‘’the nine guardians ‘’నవలకు బహుమతి వచ్చింది
.భర్త రికార్డో ఫిసాసఫీ ప్రొ ఫెసర్ .పెళ్లి అయిన కొన్నేళ్ళకు విడి పో యారు
రోసారియో చిన్న పిల్లల కోసం చాలా కధలు రాసింది .1966 లో’’ professor for
comparative literature ‘’ అయింది .తర్వాతా విజిటింగ్ ప్రొ ఫెసర్ అయింది .’’one must
laugh ,then since laughter ,as we know is the first manifestation of freedom ‘’అని
నవ్వుకు గొప్ప అర్ధం చెప్పిందామె .1971 లో ‘’ఫామిలి ఆల్బం ‘’ విడుదల చేసింది .ఆ ఏడే
రాయబారి గా ఆమె ను ప్రభుత్వం నియమించి గొప్ప అరుదైన అవకాశాన్ని కల్గించింది
.ఆడవాళ్ళలో ఇంత గౌరవాన్ని పొ ందిన వారెవ్వరూ అప్పటి దాకా ఎవరూ లేరు ఆమెకే ఆ
మొదటి అదృష్ట ం దక్కింది .49 వ ఏటఇస్రా యిల్ లోని టెల్ అవైవ్ లో1974 august 7
న ఇంట్లో ఎలెక్ట్రిక్ లాంప్ ను అమరుస్తూ షాక్ కొట్టి మరణించింది .ఇక్కడ మన తెలుగు
నవలా రచయిత్రి మాది రెడ్డి సులోచనా దేవి గాస్ స్ట వ్ ప్రమాదం లో మరణించిన విషయం
మనకు గుర్తు కొస్తు ంది విధి వంచితలిద్ద రూ ‘’రోసారియో కా స్టేల నాస్ ‘’ను ప్రభుత్వ
లాంచనాలతో ‘’national heroes ‘’ఉంచే చోట సమాధి చేసి అత్యున్నత గౌరవాన్ని
కల్గించారు
చిలి దేశపు రచయిత్రి .1942 జననం చిలి అధ్యక్షుడు అలెండీ కి బంధువే .పదిహేనేళ్ళ
వరకు అనేక దేశాలు తిరగాల్సి వచ్చింది అనేక భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది ,అనేక మంది
స్నేహితులేర్పడ్డా రు దీనికి కారణం చిలీ లో రాజకీయ అస్తిరత్వమే ఏ ప్రభుత్వమో నిలకడ గా
లేదు .సైనిక పాలన లో జనం ఉక్కిరి బిక్కిరి.అలెండీ హత్య తో మరీ దిగ జారిపో యింది దేశం
.1970 లో సాల్వేడార్ చేరింది .అలెండీ దేశాధ్యక్షుదయ్యాడు .కాని మిలిటరీ వ్యూహం వల్ల
1973 లో హత్య గావింప బడ్డా డు దీనికి అమెరికా కూడా కారణమే నని అన్నారందరూ
.అలెండీ కి సో షలిస్ట్ భావాలు ఎక్కువే .దాని తో పాలనా పరమైన మార్పులు తెచ్చి ప్రజల
మనిషి గా నిలిచాడు .ఇసబెల్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన తో విందు
ఆరగించింది కూడా .భర్త విల్ గార్డెన్ .the house of the spirits ,city of the beasts ,eeva
luna daughter of fortune మొదలైన నవలలు రాసింది ఆమె రచనల్లో మాజిక్ రియలిజం
ఉంటుంది .ఆమెకు నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ,కామన్ వెల్త్ అవార్డ్ ,అమెరికన్ బుక్
అవార్డు లు లభించాయి .యునైటెడ్ నేషన్స్ కు చెందినా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కు చిలీ లో
పని చేసింది .చని పో యిన తన కూతురు పో రా పేరిట ఇసాబెల్ అల్లెండీ ఫౌండేషన్ స్తా పించి
సేవా కార్య క్రమాలు చేస్తో ంది .
5—జార్జి అమేడో
ఈయన బ్రెజిల్ దేశస్తు డు 1912 లో పుట్టా డు .ఆ దేశం చాలా పెద్దది కమ్యూనిస్ట్ అభిమాని
అయ్యాడు .తర్వాతా వదిలేశాడు .1966 లో ‘’donaflor and her two husabands ‘’ నవల
రాశాడు .మొత్త ం మీద 32 పుస్త కాలు రాశాడు .48 భాషల్లో కి అవి అనువాదం పొ ందాయి
‘’world’s most frequently translated author ‘’.గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్ కు
ఎక్కాడు ‘’బ్రెజిల్ అకాడెమి ఆఫ్ లెటర్స్ ‘’అనే గౌరవం పొ ందాడు .లండన్ వెళ్లి కొంత కాలం
ఉన్నాడు 1985 లో మళ్ళీ బ్రెజిల్ చేరాడు2001- 8- 6 న died . journa list ,federal
depuuty representative and satirist .had left views ,
1928 లో పుట్టా డు సాంస్కృతిక రాయ బారిగా మంచి ప్రఖ్యాతి పొ ందాడు .వైవిధ్య మైన
కధలతో కధనం తో లబ్ధ ప్రతిస్తు దయ్యాడు .ఆయన రాసిన ‘’హైడ్రా హెడ్ ‘’కు పెద్ద ప్రో చ్చింది
.వివాదకర మైన అనేక వ్యాఖ్యలు చేసి అందరికి దూరమయ్యాడు అందుకే ఆయన్ను ‘’స్వ
దేశం లో పరదేశి ‘’అంటారు
1914 -1984 కాలం లో జీవించిన రచయిత బెల్జియం దేశస్తు డు .అతని దృష్టిలో ‘’we have to
revolutionary literature rather thsan literate of revolution ‘’అని అభిప్రా యం ఉన్న
వాడు .wrote 10 novels ,poetry non fiction drama and criticism
అమెరికా రచయిత
అమెరక
ి ా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్
నిత్య యాత్రికుడు ,చిక్కడు దొ రకదు అని పించుకొన్న వాడు ,తనను తాను ఆవష్కరించు
కొన్న వాడు ,అనేక ఉద్యోగాల చేసిన ఘనా పాథీ,సంఘర్షణ జీవి ,తల వంచని వీరుడు అని
పించు కొన్న వాడు ,హాస్యం అంటే ఆమడ దూరం లో ఉండే వాడు ,డిప్యూటీ లామాన్
,నేరస్తు లకు సింహ స్వప్నమైన వాడు ఎనభై ఏళ్ళ వయసులో ఆరేళ్ళు మాత్రమె ఉద్యోగం
చేసినా ,ఇప్పటికీ అతని పేరు నే స్మరించెంత గుర్తింపున్న వాడు విట్ ఏర్ప్.
విట్ పాత పశ్చిమం లో లా మాన్ ఉద్యోగం చేశాడు .అదేమీ ఫుల్ టైంజాబెమీ కాదు
.పశువుల పట్నాలలో ,వాటిని వాగన్ ల దగ్గ రకు తోలుకొని వచ్చే కౌ బాయ్ లతో గడిపే వాడు
.ఒకలా హామా ,కాన్సాస్ ,టెక్సాస్ లకు పశువులను చేర్చటం ,వాటిని రైళ్ళలో తూర్పు
ప్రా ంతాలకు చేరచె తప్పుడు గుర్రా ల దొ ంగ తనాలు ,తాగుడు ,విపరీతం గా ఉండేవి
.పశువులను అమ్మిన డబ్బు చేతి నిండా ఉండటం తో జూదం ,తాగుడు వ్యభిచారం చేసే వారు
కౌ బాయ్స్ .అందుకని వారి కందరికీ చేతిలో తుపాకి తప్పని సరిగా ఉండేది .వాళ్ళల్లో వాళ్ళు
కలహించు కోవతమూ ఎక్కువే .ఆత్మా రక్షణ కోసం వారి కి తుపాకి అవసరమే .అందరి దగ్గ రా
ఆయుధాలు ఉంటె హింసే హింస .సాదా రణం గా మామూలు రోజుల్లో ప్రశాంతం గా ఉన్న
టోన్లు ,వీళ్ళ రాకతో సందడే సందడి గా ఉండేవి .ఆ సమయాలలో నేరాల సంఖ్యవిపరీతం గా
ఒక్క సారి పెరిగి పో యేవి .అందుకని శాంతి భద్రత కోసం ‘’పీస్ ఆఫీసర్లు ‘’ను నియమించే
వారు .ఇది సీజనల్ జాబ్ .సంవత్సరం అంతా డేప్యూటీలు ,మార్శల్సు ,షరీఫు లకు ఉద్యోగం
ఉండదు .అందుకని ఇంకో వ్యాపకం లో వారు ఆదాయం పొ ందుతారు .వ్యవసాయం ,రాన్చింగ్
,ప్రా స్పెక్తింగ్ ,జూదం మొదలైన వి చేసి పొ ట్ట పో సుకొంటారు .
పైన చెప్పిన ఈ ఉద్యోగాలు చట్ట సమ్మత మైన వేమీ కాదు .అందుకొని వీరు ఒక్కో సారి
చట్టా న్ని తమ చేతుల్లో కి తీసుకొంటే కాని పరిస్థితులు చక్క బడేవి కావు .విట్ ఎర్ప్ ఒక్కో సారి
చట్టా నికి అతీతం గా వ్యవహరించాడు .దాని తో చిక్కుల్లో పడే వాడు .ఆ ఉద్యోగం ఒక చిన్న
ప్రా ంతానికి తప్ప మిగిలిన ప్రా ంతానికి తెలీని వాడు గా ఉండేది .చాలా మొరటు మనుష్యుల తో
వ్యవహరించాల్సి వచ్చేది .అతని పూర్తీ పేరు wytt Berry Stapp Earp .1848 march 19 న
ఇలినాయిస్ లోని మాన్ మౌత్ అనే చోట పుట్టా డు .అతని ఇల్లు పదహారు ఎకరాల ఫారం
హౌస్ .ఇది మెక్సికన్ అమెరికన్ యుద్ధ ం లో పని చేసి నందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమి
.ఎన్నో ‘’గన్ షాట్ల ‘’నుండి తప్పించుకొని బ్రతికాడు .విపరీత మైన ఒర్పున్న వాడు .టూమ్బ్
టౌన్ లో వ్యవ సాయం చేశాడు .మాంచి ‘’బఫెలో హంటర్ ‘’గా ప్రఖ్యాతి పొ ందాడు .చాలా
నిశ్చయ బుద్ధి తో ఉండే వాడు .’’డాడ్జి సిట ీ ‘’లో లా మాన్ గా పని చేశాడు .గనుల
వ్యాపారమూ చేశాడు .కార్డ్ డీలర్ గా ఉన్నాడు .దీనికి తోడు స్టేజి కోచ్ డ్రైవర్ గా కూడా పని
చేశాడు .పెద్ద పెద్ద సెలూన్ ళ అది పతి అయాడు .
ప్రభుత్వం అతనికి ‘’shot gun riffle ‘’ను నేటివ్ ఇండియన్ల నుండి ప్రా ణ రక్షణ కోసం
ఇచ్చింది ‘’.six gun ‘’ను పొ ంది పేల్చటం నేర్చు కొన్నాడు .గొప్ప గురి ఉన్న
మొనగాడనిపించుకొన్నాడు .కాలిఫో ర్నియా లో రైల్ రోడ్ వర్కర్ గా కూడా వెలగ బెట్టా డు
.మళ్ళీ తూర్పు కు వెళ్లి బఫెలో హంటర్ గా మారాడు .”’wagon train scout ‘’గా కూడా పని
చేశాడు .ఇరవై రెండేళ్ళ వయసులో యూరిల్లా సండ ర్లా ండ్ తో పెళ్లి జరిగింది .ఒక్క ఏడాదే
ఆమె బతికింది .
ఒక్ల హామా అని పిలువ బడే ఇండియన్ టేరిటరి కి వెళ్లా డు .మళ్ళీ బఫెలో హంటింగ్ లో
కాలక్షేపం చేశాడు .అతడు రేసు గుర్రా లను దొ ంగిలించే వాడని అభి యోగం వచ్చింది . బెయిల్
పొ ంది ,.కాన్సాస్ కు చేరుకొన్నాడు .’’Dedliest pistol shot ‘’గా ,’’great courageous
person ‘’గా ఖ్యాతి పొ ందాడు .’’లెజెండ్ ‘’అనిపించుకొన్నాడు .కౌ బాయ్స్ ల ఆట కట్టించి
,దుండగులను గుర్తించటం లో దిట్ట అని పించుకొన్నాడు విట్ ఏర్ప్ .
అమెరక
ి ా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2
విట్ చిన్నతనం లో అతని తండ్రి కుటుంబాన్ని ‘’మిడ్ వెస్ట్ ‘’నుంచి కాలి ఫో ర్నియా కు
మార్చాడు .అందరు చిన్న వాగన్ ట్రైన్ ఎక్కారు .దాన్ని ఇరవై కి పైగా గుర్రా లు లాగే బండ్ల తో
నడిచింది .వాళ్ళను వాళ్ళు రక్షించు కోవటం ,పరస్పర సహకారానికి అలా ప్రయాణం చేసే
వారు .దారిలో బఫెలో హంట్ చేసే వారు .అప్పుడు జిం బ్రిద్జేర్ అనే అతను బఫెలో హంట్ లో
ఎక్స్పెర్ట్ .దారిలో నేటివ్ ఇండియన్స్ తో పో రాడా వలసి వచ్చేది .
కాలి ఫో ర్నియా లో సాన్బెర్నాన్ది నో లో ఉన్నారు .అప్పుడు అక్కడ జనాభా రెండు వేలు
మాత్రమె .అది ‘’గోల్డ్ రష్‘’కాలం .ఎర్పి పది హేడేల్ల వయసు లో స్టేజ్ కోచ్ డ్రైవర్ గా పని
చేశాడు .అతడికి అప్పుడు గుర్రా లంటే మహా సరదా గా ఉండేది .ప్రయాణం అంటే బలే
సంతోషం .ఇక్కడే మొదటి సారి విస్కీ తాగాడు .తర్వాతా ఇరవై ఏళ్ల లో మందు తాగనే లేదు
.బఫెలో హంట్ చేసినా ,పీస్ ఆఫీసర్ గా పని చేసినా మద్యం జోలికి వెళ్ళక పో వటం ఆశ్చర్యం
వేస్తు ంది .రైల్రో డ్ నిర్మాణానికి సరుకులు చేర వేసే వాడు దీన్నే ‘’స్టీం స్టా ర్ ‘’అంటారు .దీనితో
అతని ప్రయాణం సరదా బాగా తీరింది .ఎప్పుడూ తీరిక లేకుండా గుర్ర బ్బండీ లో సామాన్లు
చేర వేసే వాడు .ఈ పని అతను కాలి ఫో ర్నియా నుంచి అరిజోనా వరకు చేసే వాడు .దీన్ని
ఎక్కువ కాలం చేయలేదు .తండ్రి కుటుంబాన్ని మళ్ళీ మిడ్ వెస్ట్కు మార్చాడు .
తండ్రి లా గానే ఎర్ప్ కూడా లా ఆఫీసర్ అయాడు .1869 లో తండ్రి ఉద్యోగం ఇతనికి
వచ్చింది .తండ్రి శాంతి నిర్వహణ న్యా యాది పతి గా నియమింప బడ్డా డు .కొడుకు ‘’షరీఫ్
‘’అయాడు .ఆ ఊళ్ళో న్యాయాన్నీ ,చట్టా న్నే అమలు పరచే బాధ్యత వీరిద్దరిదే .చట్టా న్ని అతిక్ర
మించే వారి గుండెల్లో రైళ్ళు పరి గేత్తి ంచారుచాతండ్రీ కొడుకూ.
లా మార్ అనే చోట లా ఆఫీసర్ ఉద్యోగం హాయిగా ఉంది .పెద్దగా నేరాలు ,ఘోరాలు లేవు
.1870 లో స్వంత ఇల్లు కొనుక్కొని ఉరిల్లా ను పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు .ఏడాది
లోపే ఆమె చని పో యింది .అతనికి వ్యతి రేకం గా కేసు పెట్టా రు .రిజైన్ చేసే శాడు .డబ్బు
దుర్విని యోగం చేశాడని ,లైసెన్సుల కోసం ఇచ్చిన డబ్బు ను జమ చేయ లేదని అతని పై
అభి యోగం .ఇల్లు అమ్మేశాడు ఈ నాడు ఒక్ల హామా అని పిలువాబడే ఇండియన్ టేరిటేరి
చేరాడు .ఇక్కడ గుర్రా లను దొ ంగి లించటం ఆ నాడు పెద్ద నేరం .అలా చేశాడని మళ్ళీ అభి
యోగం .అరెస్ట్ వారంట్ వస్తే ,అక్కడి నుంచి నెమ్మది గా జారుకొన్నాడు .ఎవరికి కానీ
పించాకుండా తిరిగాడు .చివరికి ఇలినాయిస్ లోని పియోరియా చేరాడు .వ్యభి చార గృహం లో
ఉన్నట్లు పో లీస్ రికార్డు ల్లో ఉంది .ఇక్కడి రివర్ బో ట్లో బ్రో తల్ హౌస్ నిర్వ హించాడు .ఇదంతా
జులాయి తిరుగుడే .బఫెలో హంటర్ గా కూడా ఉన్నాడు .మాంచి వేట కాడని మహా గొప్ప
పేరు .రోజుకు రెండు వందల అడవి దున్న పో తుల్ని వేటాడ గలడు అని గుర్తింపు పొ ందాడు
.ఈ ప్రా ంతాల్లో వీటి సంఖ్యా మిలియన్ల లో ఉండేది .బఫెలో మాంసం అంటే సైనికులు
రోట్ట లేసుకొని తింటారు .అంత ఇష్ట ం వారికి .వేట గాల్ల బారి పడివేల సంఖ్య లో మిగిలాయి
.ఇప్పుడు అపురూపం అయి ,అంత రించే స్తితి లో ఉన్నాయి .ఈ సరి హద్దు ప్రా ంతాల్లో వెండి
,బంగారు గనులున్నాయి .గొడ్ల పెంపకం ఎక్కువ .గనుల వల్ల టౌన్లు బాగా పెరిగి పో యాయి
.రైల్ రోడ్ కూడా జనాభా పెరగటానికి కారణం అయింది .
వంటి మీద కు ఇరవై ఏళ్ళు వచ్చే సరికి ఎర్ప్ హంటింగ్ మానేశాడు .బఫెలో గన్ అమ్మేసి
కాన్సాస్ లోని’’ విచిటా’’ చేరాడు .టెక్సాస్ నుంచి వచ్చే కాటిల్ డ్రైవర్స్ తో బాగా రద్దీ గా ఉండే
ప్రదేశం ఇది .అక్కంసన్ నదీ తీరం కూడా .అందమైన లాండ్ స్కేప్ .ఇక్కడ అన్నీ చెల్లు బాటు
అవుతాయి .కౌ బాయ్స్ కు విహార భూమి .కనుక తగాదాలు ,గొడవలు ఎక్కువ .’’లా మాన్
‘’అవసరం చాలా ఉండేది .వారంతా తాగితే మనుష్యలు గా ప్రవర్తించరు .అక్కడ అమాయకుల
పాలిటి మరణ మ్రు దంగమే .ఈ డ్రో వర్స్ వల్ల పెద్ద ఆదాయం వస్తు ందక్కడ .అందుకని అక్కడి
వర్త కులు ఆగడాలను సహించి ఊరు కోవలసి వస్తో ంది .ఈ కౌ టౌన్ లో శాంతి భద్రతలు నెల
కొల్పటం సున్నిత మైన వ్యవహారమే .సమర్ధు డైన ‘’లా మాన్ ‘’కావాలని అందరి
అభిప్రా యం .ఈ వాతా వరణానికి తానే తగిన లా మాన్ అని అనుకొన్నాడు విట్ ఎర్ప్
.కొట్లా టలంటే భయం లేదు .పైగా బలిష్టు డు .ధైర్య శాలి .స్వచ్చంద మార్షల్ గా చేరాడు .పై
రాబడి బాగానే ఉండేది .1875 లో జీతం తో డిప్యూటీ గాఉద్యోగం ఇచ్చారు .బారుల్లో వచ్చే
తగాదాలు కూడా తీర్చాల్సి వచ్చేది .అతని మొరటు పద్ధ తికి తగిన ఉద్యోగమే .
డిప్యూటీ మార్షల్ గా బాగా పరిణతి చెందాడు .వీలైనప్పుడల్లా దొ రికిన పని చేసే వాడు
.వ్యక్తిత్వం పెంచుకొన్నాడు .శక్తి ,విధేయత ,ఆత్మ విశ్వాసం ,గౌరవం పెరిగాయి .విచిటాకు
తగిన ఆఫీసర్ అని పించుకొన్నాడు .ఒక సారి ఒక తాగు బో త ఫుల్ గా మందుకొట్టి రోడ్డు మీద
పడి పో యాడు .వాడి దగ్గ ర అయిదు వందల డాలర్లు ఉన్నాయి .అతన్ని నెమ్మది గా లేపి ,ఆ
డబ్బుతో వాడిని ఇంటికి చేర్చాడు .ఈ వార్త వార్తా పత్రికలలో కధలు ,గాధలుగా వచ్చింది
.అతను ఎంత గొప్ప ఆఫీసారో రుజువు చేసే సంఘటన ఇది .అరుదైన వ్యక్తీ అన్నారందరూ .
విలియం బాట్ అనే అతని తో స్నేహం చేసి జూదం ఆడే వాడు .పీస్ ఆఫీసరు గా పని చేస్తూ
,గుర్రపు దొ ంగల్ని పట్టిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈ ఉద్యోగమూ ఒక్క ఏడాదే .స్మిత్
అనే వాడితో తగాదా పడి వాడిని చావ చితక్కోట్టా డు .ఉద్యోగం హుళక్కి .పని లేక పో తే
,అతనికి పిచ్చులూ ,వేర్రు లూ ఎత్తెది .క్రమంగా శాంతి భద్రతలు మెరుగై నాగరకత ఆ
ప్రా ంతమంతా విచ్చుకోంది .ఇదంతా విట్ ఎర్ప్ పుణ్యమే .
అక్కడి నుంచి ఇంకో బూమింగ్ సిటీ ‘’డాడ్జి సిటి ‘’కి చేరాడు .ఇది కేంసాస్ లో ఉండి
.అది ఒకప్పుడు బఫెలో కాంప్.పెద్ద కౌ టౌన్ గా పెరిగి పో యింది .అన్నే అనే బ్రో తల్ తో
ఇక్కడికి చేరాడు .కొన్నేళ్ళు భార్యా భార్త ల్లా జీవించారు వారిద్దరూ .ఈ సిటీ చాలా మురికి
కూపం గా ఉండేది .సౌకర్యాలు లేవు .గోల ,గుర్రబ్బగ్గీల రద్దీ .డ్రో వర్సు ,పశువులు కొనే వాళ్ళు
,సో ల్ జర్లు ,బఫెలో హంటర్లు ,రైల్వె వర్కర్ల తో మహా సందడి గా ఉండేది .అందుకే దాడ్జి సిటి
‘’క్వీన్ ఆఫ్ ది కౌ టౌన్స్ ‘’అని పేరొందింది .దీనితో అసాంఘిక కార్యాలకు అడ్డా అయింది
.వేశ్యలు ,హంతకులు ,జూద గాళ్ళు ,గుర్రం దొ ంగలు అంతా అక్కడే ఉండే వారు .తాగుడు
,వ్యభిచారాల తో హో రెత్తి పో తోంది .ఎర్ప్ కు ‘’లా మాన్’’ గా పని చేయాలనే కోరిక మళ్ళీ
కలిగింది .డిప్యూటీ మార్షల్ (హైరేడ్ )గా పో లీసులు అద్దెకు అంటే హైర్ చేసుకొన్నారు ఎర్ప్ ను
.
అమెరక
ి ా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )
డాడ్జి సిటీ లో ఫ్రీ లంచ్ ఇచ్చే సెలూన్లు చాలా ఉండేవి .రోజంతా స్నాక్స్ ఇస్తూ నే ఉండే వారు
.చచ్చిన పశువు లను తొలగించటం ,ఊర కుక్కల్ని పట్టు కోవటం ,నడక కోసం చెక్క రోడ్ల
మరమ్మతు ,లను విట్ చేబట్టా డు .వింటర్ లో ఇక్కడ పని లేక పో తే ,’’డెడ్ వుడ్’’టౌన్ కు
వెళ్ళే వాడు .అప్పడు అది డకోటా సరి హద్దు లో ఉండేది .గోల్డ్ రష్ బాగా ఎక్కువ .టెక్సాస్
కు వెళ్లి జూదం ఆడే వాడు .ఇలా అప్పుడప్పుడు ‘’జంప్ జిలానీ ‘’గా ఉన్నా అతనంటే డాడ్జి
వాసులకు దేవుడే .మల్లీఉద్యోగం ఇచ్చారు .అక్కడే ‘’డాక్ హాలి డే’’ అనే పేకాట రాయుడి తో
పరిచయమేర్పడింది .ఒక కౌ బాయ్ తుపాకీ తో ఎర్ప్ వీపు మీద పేల్చ బో తే డాక్ కాపాడాడు
.
అక్కడి నుంచి న్యు మెక్సికో సరి హద్దు చేరాడు .అక్కడి సిల్వర్ గనులు తవ్వకం చే
బట్టా డు సో దరుడు వర్జిల్ తో కలిసి మైనింగ్ కోసం పది హేను గుర్రా లను కొన్నాడు .ఇద్ద రూ
‘’లాస్ వెగాస్ ‘’చేరారు .అక్కడి నుంచి అరిజోనా ,చేరి సిల్వర్ మైన్ల ను గుర్తించారు .దీన్నే
‘’టూమ్బ్ స్టో న్’’అంటారు .సిల్వర్ ఉండటం వల్ల ఆపెరోచ్చింది .సో దరుడు వర్జిల్ డిప్యూటి
మార్షల్ అయాడు .ఇది బాగా ఉందని పించింది .ఈ పట్ట ణం 4,500 అడుగుల ఎత్తు న ఉన్న
పట్ట ణం .బాగా కష్ట పడాలి జీవితం కూడా చాలా కష్ట ం గా ఉండేది .ఇది గన్ ఫైట్ల కు ప్రసిద్ధి
.ఇక్కడి ‘’సిమేటరి ‘’అమెరికా నైరుతి భాగం లోనే చాలా పెద్దది .ఇల్లు అన్నీ బుల్లెట్ల బొ క్క
లతో కనీ పిస్తా యి .గాంబ్లి ంగ్ విపరీతం .ఇక్కడి ‘’అపెచీ ఇండియన్లు ‘’దాడి చేస్తూ ంటారు
తరచుగా .పశువుల సంత ఉండి .దొ ంగలు ,బంది పో ట్లు ఎక్కువ .అయినా వేగం గా వృద్ధి
చెందింది .వెండి గనుల్లో లాభ పడ టానికి చాలా మంది వస్తూ ంటారు .ఎర్ప్ ఇక్కడికి చేరే సరికి
జనం అంతా టేన్తు ల్లో కాపురం .బిల్డింగు లనేవి లేనే లేవు .
చిన్న ఇంట్లో అద్దె కున్నాడు .స్టేజి కోచ్ డ్రైవర్ గా పని చేశాడు .కొంత కాలం తర్వాతా
‘’వేల్స్ ఫార్గో ‘’లో పని చేశాడు .‘’ఇప్పుడు బాంకింగ్ చేస్తో ంది . ఫార్గో ‘’లో సెక్యూరిటీ మాన్
గా పని చేశాడు .ఇది డబ్బు ,విలు వైన వస్తు వుల్ని చేర వేసే సంస్థ .షాట్ గన్ పెట్టు కొని కోచ్
డ్రైవర్ ప్రక్కన కూర్చోవటమే అతని పని .అతని బంధు గణంఅంతా చేరారు .తాను ‘’లామాన్
గా ,వర్జిల్ డిప్యూటీ మార్షల్ గా పని చేశారు .యాభై కిలో మీటర్ల దూరం లో ఫెడరల్ మార్షల్
ఉండే వాడు .త్వరలోనే అన్నదమ్ము లిద్ద రూ మంచి పేరు తెచ్చు కొన్నారు .విట్ విధి సక్రమం
గా నిర్వ హిస్తా డని ,సాహసి అని గుర్తింపు పొ ందాడు .పైన కోటు లేకుండా ,చేతి లో ఆయుధం
లేకుండా తిరిగే వాడు .ప్రశాంతం గా ,ఉద్రేక పడకుండా ఉండటం అతని లక్షణం .ఒక సారి
‘’మైక్ ఓ రూర్కీ ‘’అనే గామ్బ్లార్ ప్రా ణాలను కాపాడాడు .అతను ఒక మైనర్ ను హత్య చేస్తే
,జనం ఇతని పై దాడి చేస్తే ,ఉపాయం గా పట్టు కొన్నాడు .లేక పో తే మాబ్ చేతిలో మరణం
పొ ంది ఉండే వాడు ఆ గామ్బ్లార్ .ప్రజాగ్రహాన్ని శాంత పరచి వీడి ప్రా ణాన్ని కాపాడి కేసు
పెట్టా డు .ఇతని ధైర్యం చూసి జనం పొ ంగి పో యారు .’’వీర తాళ్ళు ‘’వేశారు .ఎవరూ ఎర్ప్ ను
గాయ పరచక పో వటం ఆశ్చర్యం గా ఉంది .
1882 లో అరిజోనా వదిలి కోలా రాడో ,అక్కడి నుంచి కాలిఫో ర్నియా ,అలాస్కా లకు
చేరాడు .మళ్ళీ సౌత్ వచ్చాడు .ఎర్ప్ జీవితం మీద చాలా పుస్త కాలు వచ్చాయి .అతిని
జీవితాన్ని సాహస గాధలను సినిమా గా తీశారు .అతను ‘’నేషనల్ ఫిగర్ ‘’అయాడు
.సెలిబ్రిటీ అని పించుకొన్నాడు .’’Wytt Earp –frontier Marshal ‘’,అనే పుస్త కం వచ్చింది
.’’horse rustling ‘’,boxing లలో రిఫరీ గా పని చేశాడు .ఎనభై ఏళ్ళు జీవించాడు 1920 .లో
కాలి ఫో ర్నియా లోని హాలీ వుడ్ లో నివాసం ఉన్నాడు .తన జీవిత చరిత్ర ను రాసుకొన్నాడు
.1929 జనవరి 31 న ‘’పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఎర్ప్ ‘’మరణించాడు ..అతడు
సాహసమే ఊపిరి గా జీవించి అందరి మన్ననలు అందుకొన్నాడు
అమెరక
ి ా జాతి పిత -జార్జి వాషింగ్ టన్
అమెరికా జాతి పిత గా ప్రజల చేత మన్ననలు పొ ందిన వాడు ,అమెరికా మొదటి అధ్యక్షుడు ప్రధమ పౌరుడే
కాక అన్నితాక్ ప్రధముడు గా'' first in war .first in peace and first in the hearts of his country men'' అని
విశ్లేషకుల చేత కీర్తింప బడ్డ వాడు ,అమెరికా కు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడై ,బ్రిటీష ప్రభుత్వం తరఫున ఫ్రెంచ్,
ఇండియన్ అమెరికన్ల తో యుద్ధ ం చేసి ,ఆ తర్వాత అమెరికా పై బ్రిటీష పెత్తనాన్ని నిరసించి ,పౌర సేన్యాన్ని
ఏర్పాటు చేసి దాని నాయ కత్వాన్నిస్వీకరించి బ్రిటీష ప్రభుత్వానికి సింహ స్వప్నం గా నిలిచి బ్రిటీష యెర్ర సైన్యంతో
యుద్ధ ం చేసి అమెరికా స్వాతంత్రా న్ని ప్రకటించిన ఫౌండర్ ఫాదర్స్ లో అగ్రగామి ,అమెరికా రాజ్యాంగాన్ని తయారు
చేయటం లో ప్రముఖ పాత్ర వహించిన వాడు ,మొత్త ం ఎలక్టో రల్ కాలేజి వోట్లు అన్నిటిని అంటే నూటికి నూరు శాతం
పొ ందిన వాడు ,వీటికి మించి సభ్యులందరి చేతఏకగ్రీవం గా ఎన్ను కో బడ్డ వాడు,అమెరికా కు ''నియంత ''గా
ఉండమనిప్రజలు, సైన్యమూ బల వంతం చేసినా ప్రజా స్వామ్యానికే కట్టు బడి ఆ ఆలోచనకే తీవ్ర వ్యతి రేకం తెలిపి
న వాడు,అమెరికా కేంద్ర ప్రభుత్వం బలం గా ఉండాలని భావించి వాటి కోసం సర్వ శక్తు లను ధార పో సిన వాడు
ఆయనకు నక్కల వేట ,కోడి పందాలు అంటే ఇష్ట ం .పేకాట రాయుడు కూడా .అదీ సరదాకే .తనను ఒక
రాజు గా నో చక్ర వర్తి గానో ప్రజలు ,అధికారులు గౌరవిస్తు ంటే ,రాజరికానికి కాలం చెల్లి ందని'' mr.president ''అని
పిలిస్తే చాలని తెలియ జేసిన వాడు .1789 లో అమెరికా ప్రధమ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత
ఆయన జీతాన్ని25,000 డాలర్లు గా నిర్ణయిస్తే ,తాను సంపన్నుడనని తనకు అంత జీతం అక్కర్లేదని మర్యాద గా
అవుతున్ద ని నచ్చ చెప్పి అంగీకరింప జేసింది .హుందా గా ఒప్పు కొన్నాడు .రెండు సార్లు అమెరక
ి ా అధ్యక్ష పదవి
లో రాణించి మూడవ సారి మళ్ళీ అధ్యక్షుడు గా ఉండమని అందరు బలవంతం చేసినా తిరస్కరించి అధ్యక్ష
స్తా నాన్ని రెండు సార్ల కే పరిమితం ఆయె సంప్రదాయాన్ని తన తో ప్రా రంభించిన వాడు వాషింగ్టన్ .స్వంత పిల్లలు
అంటూ ఎవరు లేరు .చని పో తు తీవ్ర బాధ అనుభవించాడు .''i die hard but i am not afraid to go ''అని ఒక
తన తర్వాత అధ్యక్షుడైన జాన్ ఆడమ్సుతో ఆనాటి రాజకీయ పరిస్తితి ని చర్చిస్తూ ఫ్రెంచ్ వారితో జరిగే
పో రాటాలకు కలత చెంది అవసర మైతే తాను మళ్ళీ సైన్యానికి నాయకత్వాన్ని వహించి అమెరక
ి న్ల కు విజయం చే
కూ రుస్తా నని చెప్పిన దేశ భక్తీ ఆయనది .దానికి ఆడంసు స్పందించి వాషింగ్ టన్ ను ''మిలిటరి కి లెఫ్టి నేంట్
జెనెరల్ అండ్ కమాండెంట్ గా'' గా గౌరవ స్తా నాన్ని కల్పించాడు .అమెరికన్ లాండ్ స్కేపుల చిత్రా లంటే ఆయనకు
ప్రా ణం .వాటిని సేకరించి తన వర్జీనియా రాష్ట ం్ర లోని వెర్నాన్ లోని స్వగృహం లో భద్ర పరచాడు .
ఆయన దగ్గ ర సుమారు వంద మంది బానిసలుండే వారు వారు వ్యవ సాయం లో సాయం చేసే వారు
.వారి తో సేవలు చేయించుకోవటం ఇష్ట ం లేక పో యినా తప్పని పరిస్తితి అన్నాడు '' .the unfortunate condition
of the persons ,whose labour in part i employed ,has been the only unavoidable subject of regret
''అని బాధ పడ్డా డు .అయితే బానిసత్వ నిర్మూలనకు తన శక్తి ని, అధికారాన్ని ఉపయోగించలేదు అని అంటారు
చరిత్ర కారులు .1797 లో అధ్యక్ష పదవి ని వదిలేసిన తరువాత ,పెన్సిల్వేనియా రాష్ట ం్ర లో ఉన్న చట్ట ం ప్రకారం తన
వద్ద ఉన్న కొందరు బానిసలకు విముక్తి కల్గించాడు .అక్కడ చట్ట ం ప్రకారం యజమాని రాష్ట ్ర నివాసి గా ఆరు
నేలలుంటే అతని వద్ద ఉన్న బానిసలకు విముక్తి కలుగు తుంది .వాషింగ్ టన్ ఆ తరువాత రెండేళ్ళ కు తన'' విల్లు
''లో రాసిన దాని ప్ర రకారం తన వద్ద ఉన్న బానిస లందరికి విముక్తి కల్గించాడు .
విస్కీ మీద వేసిన పన్నును ప్రజలు ఎదిరించారు .వారికి నచ్చ చెప్పాడు ''the tax was law.popular or
not ,it would be collected ''అని చెప్పటం తో తిరుగు బాటు తగ్గింది .అలాగే మిలీషియా కు జీతాలు చాలటం
లేదని గడువు ముగిసిన వారికి మళ్ళీ కొత్త గా తీసుకోవాలని ,లేకుంటే వారు ఇంటికి వేళ్ళు తాము అంటే
పంపించాలనే తిరుగు బాటు కూడా వస్తే దాన్ని సమర్ధ వంతం గా తిప్పికొట్టి వారి ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ను
ఒప్పించి జీతాలు పెంచే ఏర్పాటు చేశాడు .ఆయన పంటి వ్యాధి తో బాధ పడే వాడు .ఆ నాడున్న వైద్య విధానం
అధ్యక్షుడికి సైన్యం పై పెత్తనం ఉండాలని వాదించి అమలు ఆయె టట్లు చేశాడు .ఆయన వర్జీనియా
రాష్ట్రా నికి చెందినవాడు .అది తేయాకు పంటకు అగ్ర స్తా నం .వర్జీనియా తేయాకు ప్రపంచం లోనే నాణ్యతకు ప్రసిద్ధి
.అందుకే నేమో అక్కడ పుట్టిన వాషింగ్ట న్ ఆ నాణ్యత ను తన ప్రవర్త న లో ప్రదర్శించాడు అంతటి ఉన్నత స్తా నాన్ని
పొ ందాడు .ఆయన స్వభావ శీలాదులకు అది పరోక్ష ప్రేరణ గా ఉందని పిస్తో ంది .అలాగే వర్జీనియా పొ గాకు కు
ఘాటు ఎక్కువ .ఆ స్వభావం ఆయన ధైర్య శౌర్యాలలో ప్రతి బిమ్బించిదేమో నని పిస్తో ంది .ఆయన గొప్ప ప్లా న్
టేషనర్ కూడా .
సైన్యం లో కొందరు తమ జీవితాలకు తగిన ప్రతి ఫలం లభించటం లేదని తిరుగు బాటు చేశారు .వారితో సంప్ర
దించటానికి వెళ్లా డు .వాళ్ళ సమస్య లను తీరుస్తా నని చెప్పాడు .తన జేబు లో చెయ్యి పెట్టి కాళ్ళ జోడు బయటకు
తీసి పెట్టు కొన్నాడు వారితో మాట్లా డుతూ''gentle men! you must pardon me .I have grown gray in your
service and find my self growing blind '' అనే సరికి వాళ్ళ కళ్ళు అశ్రు పాతం తో జల జలా శ్ర వించాయి
.కొందరు ముఖం ప్రక్కకు తిప్పుకొని బాధను వెలి బుచ్చుకొన్నారు .అందరి హృదయాలు ద్రవించి పో యాయి .తమ
కోసం ఇంతటి త్యాగం తో, దేశ భక్తీ, తో ,అంకిత భావంతో సర్వ సమర్ధం గా ఈ ముసలి తనం లో పని చేసే
ఆయనంటే, విపరీత మైన ఆరాధనా భావం బయట పడి వారి తిరుగు బాటు మిలిటరి డిక్టేటర్ బావన ఒక్క సారి
ఇగిరి పో యాయి .ఇంతకి వారేమి కోరారు ?.దేశం లో మిలిటరి పాలన రావాలని , అమెరికా ప్రభుత్వాన్ని మిలిటరి
నడపాలని .బ్రిటీష వారి తో పో రాడింది మళ్ళీ రాజరికం కోసమో ,లేక డిక్టేటర్ షిప్ కోసమో కాదని నచ్చ చెప్పిన
జాతీయ ప్రజాస్వామికాభి మాని ఆయన .కారన్ వాలీసు బ్రిటీష సైన్యాధి కారి .అంతటి వాడిని యుద్ధ ం లో ఓడించి
అతనితో ''తెల్ల జెండా ''ను ఎగరే యించిన వాడు జార్జి వాషింగ్ టన్. కొన్ని చోట్ల ఓడినా అంతిమ విజయం తన
దేశానికి సాధించిన మహా యోధుడు .ఇంతకి ఆయన సర్వేయర్ గాజీవితాన్ని ప్రా రంభించి జిల్లా సర్వే యర్
ఉద్యోగం చేశాడు .వ్యవ సాయం కోసం ఆయన ఒక కొత్త నాగలిని తయారు చేసుకొన్నాడు .
ఇద్ద రు పిల్ల లున్న మార్తా కుస్తిస్ అనే ఆమె ను వివాహం చేసుకొన్నాడు .ఆమె అప్పటి వర్జీనియా లో
అత్యంత సంపన్ను రాలైన మహిళ .ఆమె సంపద 23,632 పౌండ్లు ఈ నాటి అమెరికా డాలర్ల లో దాని విలువ ఒక
మిలియన్ డాలర్లు .జార్జి తండ్రి చని పో యిన తర్వాతా వచ్చిన ఆస్తి260 ఎకరాలు .సర్వే చేయని 1600 ఎకరాలు .
ఈయన తండ్రి పేరు ఆగస్తా న్ .అందరు ''గస్ ''అని సరదా గా పిలిచే వారు .జార్జి వాషింగ్ ట న్ 22-2-1732 లో
జన్మించాడు ఆయన మరణించినది 14-12-1799-అరవై ఏడేళ్ళ వయసు లో .నిండుగా జీవించి అందరి మనస్సులో
నిలిచి అందరికి ఆదర్శ ప్రా యం గా ,రోల్ మోడల్గా ఉన్న వాడు .అందుకే ఆయన్ను గురించి the principles of
integrity and honesty to make him self richest and most powerful person in America .He re affirmed
his commitment to democracy in the strongest possible terms .
జెర్మనీ దేశపు సంగీతానికి చిర యశస్సు ను సాధించి పెట్ట్టిన ఎందరో సంగీత కారులున్నారు .వారిని
చిరస్మరణీయులు గా భావిస్తా రు .క్లా సికల్ విదానాన్నుంచి రొమాంటిక్ సంగీతానికి బాటలు వేసి ప్రపంచ దేశాలన్నిటి
లోను అభిమానాన్ని సంపాదించి ''త్రీ బి'అని పించుకొన్నారు ముగ్గు రు మహనీయులు .వారే బాచ్
జేసినా వాడు బీథో వెన్ .అలాంటి బీథో వెన్ కే గురువు-జోహాన్నెస్ క్రిస్తో మోస్ వోల్ఫాం,గ్గొ ట్టిలీబ్ మొజార్ట్ .బాల
మేధావి గా ఆయన సాధించిన కీర్తి అజరామర మై నిలి చింది .సంగీతాన్ని ఒక మాజిక్ లా,శ్రో తలను మంత్ర
ముగ్ధు ల్నిచేసిన మొ జార్ట్ర్ట్ గురించి మనం తెలుసుకో బో తున్నాం .ఆయన్ను వోల్ఫాంగ్ అనీ ,మొజార్ట్ అనీ
పిలుస్తా రు .
వోల్ఫాంగ్ మొజార్ట్ అమేయ మేధా సంపన్నుడు .తండ్రిలీ పో ల్ద్ గౌరవం గా సంగీత పాథాలు చెప్పి జీవితం
గడుపే వాడు .ఆయన వయోలిన్ టెక్నిక్కు ల మీద పుస్త కాన్ని కూడా రాశాడు .వీరి కుటుంబం ఈ నాటి ఆస్ట్రియా
లో ని సాల్జ్ బర్గ్ లో ఉండేది .తండ్రికి పుట్ట్టిన ఏడుగురు సంతానం లో మోజార్టే చివరి వాడు .ఇతని జననం1756.
ఇతని అక్క'' మారియా అన్నా ''కు తండ్రి సంగీతాన్ని నేర్పాడు .ఆయన సాల్జ్ బుర్గ్ లోని ఆర్చి బిషప్ దగ్గ ర
వయోలనిస్ట్ .తర్వాతా సహాయ సంగీత దర్శకు దైనాడు .మంచి పేరున్న వాడు .అక్క హార్ప్ కార్డ్ ప్లేయర్ .అదొ క
తమాషా వాయిద్యం .అందులో పియానో ,హార్ప్ ల కూర్పు ఉంటుంది .ఇతనికి ఎవరు సంగీతం నేర్ప లేదు .విని కిడి
తో వచ్చింది . అక్క నేర్చు కొంటుంటే సంగీతం ఇతనికి వచ్చింది .అంతే ,ఆమె లాగా నె వాయించేవాడు .అందరికి
ఆశ్చర్యమేసింది .దైవ దత్తు డు బాల మేధావి అని అందరు భావించారు .మూడేళ్ళ వయస్సు నాదే విన్నది అంతా
వాయించి చూపే వాడు .అయిదేల్లకే పేపర్ మీద ఏదేదో రాసే వాడు .ఏమి రాస్తు న్నా వాణి తండ్రి అడిగత
ి ే ''కీ బో ర్ద్
కన్సార్తో ''అని తక్కున సమాధానం చెప్పాడు .తండ్రికి నమ్మకం కలుగక వచ్చి చూస్తె నిజం గానే ఆ పని
చేస్తు న్నాడని తెలిసింది .''అయి పో వచ్చింది చివర్లో ఉన్నానని ఆ బాల మేధావి సమాధానం ''విని తన కొడుకు
అఘటన ఘటనా సమర్ధు డు అనుకొన్నారు తల్లీ దండ్రీ .నిజం గా చెప్పా లంటే అప్పటికి ఇంకా అతని పేరు కూడా
కొడుకు తెలివి తేటలకు మురిసిన తండ్రి అతని తో సంగీత కచేరీలు చేయించి డబ్బు సంపాదించ వచ్చు
నని భావించాడు .ఆర్చి బిషప్ అను మతి తీసుకొని మ్యూనిచ్ ,వియన్నా లకు1703 లో కుటుంబం తో వెళ్లా డు
.ఈ చిన్నారు లతో ఫ్రెంచి రాజు ,రాణి ల సమక్షం లో దర్బారు లో కచేరి చేయించాడు ట.తర్వాతా ఇంగ్లీష్ చానెల్
దాటి ,లండన్ చేరారు .ఫ్రా న్సులోని పారిస్ చేరి అన్ని చోట్లా ప్రదర్శన లిప్పించాడు కూతురు ,కొడుకు ల తో .దాదాపు
మూడున్నర ఏళ్ళు ఇలా వివిధ దేశాలు సంచారం చేసి మళ్ళీ1766 కు స్వగ్రా మం చేరింది కుటుంబం .వెళ్ళిన ప్రతి
చోటా ఏదో ఒక బహుమతి పొ ందారు అక్కా ,తమ్ముడూ .బంగారు నాణాలు గడియారాలు ,వెండి పొ డుం డబ్బాలు
అనేకం కానుకలుగా వచ్చాయి .మంచి విలువైన దుస్తు లను బాల మేధావి ఒళ్ఫాంగ్ కు లభించాయి చిన్న ఖడ్గ ం
కూడా కానుక గా లభించింది .కోతులను ఆడించి నట్లు ఈ పిల్లల్లిద్ద ర్నీ ఆడించి తండ్రి సొ మ్ము చేసుకొన్నాడు
.లండన్ లో ఉండగా మొజార్ట్ కు'' జోహాన్ క్రిస్టియన్ బాచ్'' అనే గొప్ప సంగీత కారుని తో పరిచయం కలిగింది
తొమ్మిది నెలలు ఇంటి వద్ద గడిపి తండ్రి మళ్ళీ యాత్ర చేబట్టా డు .వియన్నా కు ఒక పెళ్ళికి వెళ్లగా
అక్కడ మసూచికం బాగా ప్రబలి ఉండటం గమనించి ఇంటికి తిరిగి వచ్చారు .యువకుడైనప్పటి నుండి ఒంటరి
తనం తో బాధ పడే వాడు .కొమ్ములు తిరిగిన సంగీత కారుల తో సమానం గా వాయిద్యాలు వాయించే వాడు
.ఇప్పుడు దృష్టి అంతా కపో సింగ్ మీద కు మరలింది .ఆ నాటి ప్రసిద్దు లైన సంగీత కారుల పో కడలను అనుకరించి
సంగీతం కూర్చే వాడు .తరువాత తన స్వంత బాణీ ని ఏర్పరచుకొని ,విభిన్న కళా కారుడైనాడు .పన్నెండేళ్ళ
వయసు లో ద్రు ష్టి ''ఒపేరా ''మీదకు వెళ్ళింది .ఒపేరా అంటే అందులోని పాత్రలన్నీ లేక కొన్ని తమ మాటలను
పాటల రూపం లో సంగీతం గా విని పించే ఒక ప్రక్రియ .ఇదే నేటి మోడరన్ మ్యూజికల్స్ .అందులో భావావేశాలు
నాటకీయత సమ్మిలిత మై అందర్నీ ఆకర్షిస్తా యి మోజార్టు కాలం లో అది ఉత్కృష్ట స్తితి లో ఉండేది .అతను చాలా
ఒపేరా లను చూసి అందులోని లోతు పాతుల్ని అధ్యయనం చేశాడు .అతనికి ప్ల స్ పాయింటు అతని స్వరం
.మంచి స్థా యి లో పాడే నైపుణ్యం ఆయనది .నోట్ ను వినాల్సిన అవసరం లేకుండా నె పాడగలిగే వాడు .
'' the pretend simple ton'' అనే ఒపేరా ను 1768 లో వియన్నా లో ఉండగానే రాశాడు .అందరు విని
ఆశ్చర్య పో యారు .అసూయ తో కొందరు దాని ప్రదర్శన ను ఒక ఏడాది వాయిదా వేయించారు .ఫ్రా ంజ్ అంతాన్
అనే అతను తన కోసం ఒక ఒపేరా రాయించు కొన్నాడు .దాన్ని1768 అక్టో బర్ ఒకటి న మేస్మేర్ ధియేటర్ లో
ప్రదర్శించారు .అప్పటికే ఒక హీరో స్తా యి అందుకొన్నాడు మొజార్ట్ .అతని ప్రతిభ కు Amadeus అనే బిరుదు
వచ్చింది అంటే ''భగవంతునికిష్టమైన వాడు ''అని అర్ధం .నాల్గ వ పో పు క్లిమేంట్ - knight of the golden spur
''అనే అరుదైన పురస్కారాన్ని ప్రదానం చేసి గౌర వించాడు .అంత చిన్న వయసు లో అంతటి గౌరవాన్ని పొ ందిన
వారెవరూ లేరు .bologna అనే ఇటాలియన్ టౌన్ లో అతన్ని పరీక్ష కు పెట్టా రు .ఒక గదిలో ఒంటరి గా ఉంచి అతి
కష్ట మైన స్వర సమ్మేళనాన్ని చేయమని సవాలు విసిరారు .ఈ పరీక్ష ఇరవై ఏళ్ళు నిండిన వారికే పెట్టటం ఆచారం
.కాని ఈ బాల మేధావి 14 ఏళ్ల కే పరీక్షలో పాల్గొ న్నాడు .ఒక గంట లో తనకిచ్చిన దాన్ని పూర్తీ చేసి ,సరదా గా
బయటికి వచ్చేశాడు .అతను పరీక్ష పాస్ అయాడు .తండ్రి ,కొడుకుల ఉద్యోగాలు పో వటం తో మళ్ళీ స్వంత ఊరు
చేరారు .ఏమైనా వియన్నా లో గౌరవం సాధించాలి అని మొజార్ట్ మనసు లో స్తిరం గా భావించాడు .
అన్వేషణ
ఎందుకో తన పుట్టిన ఊరు సాల్జ్ బర్గ్ పై మోజు లేదు మొజార్ట్ కు .తండ్రి లాగే ఆ కొలువు లో ఉంటె ఏదుగు
బొ దుగు ఉండదని తలచాడు .తన సత్తా నిరూపించు కోవాలనే ధృఢ సంకల్పం కలిగింది కొన్ని నెలలలో డజను కు
పైగా సిమ్ఫనీలు రాశాడు .ఇతర చోట్ల అదృష్టా న్ని పరీక్షించు కోవాలను కొన్నాడు .తండ్రి తో కలిసి మ్యూనిచ్ చేరాడు
.అక్కడ ''the pretend gardener ''అనే ఒపేరా రాశాడు .ఆ తరువాత నాలుగు కాన్సర్తో లుపియానో కోసం ,
అయిదు వయోలిన్ కోసం రాశాడు .వాయిద్యాల తో సో లో నిర్వహించే దాన్ని కాన్సర్తో అంటారు .1777 ముందే
కొలువు చాలించాడు .ఆనాటి రోజుల్లో ఆర్చి బిషప్పులు ,ధనికులు ,సంపన్న వర్గా ల వారు సంగీత కారుల్ని తమ
దగ్గ ర ఉంచుకొని పో షించే వారు .యూరప్ వెళ్లా లని వోల్ఫాంగ్ అనుకొన్నాడు .తండ్రికి కూడా వెంట వెళ్లా లని ఉంది
.పర్మిషన్ అడిగాడు ఇక కొలువు లోకి రానక్కర లేదనుకొంటే వెల్ల మన్నాడుఅర్చిబిషప్ .తల్లిని తీసుకొని యాత్ర కు
బయల్దే రాడు .
తల్లి కొడుకు మ్యూనిచ్ చేరారు .అక్కడ తల్లిని ఒక ఇంట్లో ఉంచి ప్రయత్నాలు చేశాడు .ప్రేమ లోను పడ్డా డు
.పారిస్ వెళ్లా డు .తల్లి కూడా వెంట ఉంది .ఆమె ఒంటరిగా కిటికీ లేని ఇంట్లో ఉండటం తో జబ్బు చేసి చని పో యింది
.చేతిలో డబ్బు అయి పో తోంది .కొత్త అవకాశాలేవీ రావటం లేదు .అక్కడ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు .తిరిగి
తండ్రిని చేరాడు .మళ్ళీ బిషప్ గారి కొలువు తప్ప లేదు .అయిష్ట ం గానే చేరాడు .దర్బారు ఆర్గా నిస్ట్ గా చేరాడు
.కాన్సేర్ట్ మాస్ట ర్ గా సంపాదించిన దానికంటే మూడు రెట్లు సంపాదన వస్తో ంది .అక్కడ పని చేస్తూ నే ,దృష్టిని
ఇతరాల వైపు కు మరల్చాడు .సింఫనీ లకు రాయటం ప్రా రంభించాడు .అక్కతో కలిసి ఆడాడు .మ్యూనిచ్
కార్నివాల్ కు'' idomeneo ''రాశాడు .అది అతని మొదటి గొప్ప ఒపేరా అని అందరు మెచ్చారు .
బిషప్ కొలువు నరకం అని పించింది .వియన్నా రమ్మని బిషప్ ఆజ్న జారీ చేశాడు .అక్కడ జోసఫ్ గారి
కోసం రాత్రి ,పగలు కష్ట పడి కచేరీలు చేశాడు .చాకిరి ఎక్కువ, రాబడి తక్కువ .అతన్ని చాలా నీచం గా చూశాడు
.సేవకుల తో పాటు కూర్చో పెట్టి తిండి పెట్టటం సహించ లేక పో యాడు .వండే వారి సరసన కాకుండా కొంచెం
ఎక్కువ స్తా యి వారి తో కూచో బెట్టా రని జోకు చేశాడు .ఆర్చి బిషప్ కొలరేడో ఇతన్ని'' స్కౌంద్రేల్ అని రోగ్'' అనీ తిట్టే
అలోశియా అనే అమ్మాయిని ప్రేమించి ,ఆమెకిష్టం లేక పో తే చెల్లెలు కాం స్టా న్ జే ను పెళ్ళాడాడు
.1782 లో వోల్ఫాంగ్ కామిక్ ఒపేరా ను జోసెఫ్ చూసి ''ఇందులో చాలా గమకాలున్నాయి ''అన్నాడు .కాని ప్రజలు
మెచ్చారు .ఏదో అడపా దడపా కచేరీలే తప్ప స్తిర ఆదాయం లేకుండా పో యింది .తన కలలు సాకారం అయ్యే రోజు
1791 లో 36 వ ఏట భార్య తో కలిసి ప్రేగ్ వెళ్లా లని భావించాడు .అప్పటికే the marriage of figaro ,don
giovani అనే రెండు అద్భుత ఒపెరాలు రాసి ప్రదర్శించాడు .అవి అంత వరకు చరిత్ర లో ఎవరూ రాయనంత
గొప్పవి అని విశ్లేషకులు మెచ్చారు .అయితే వాటి వల్ల డబ్బులు రాలలేదు .సరస్వతీ ప్రసన్నమే కాని, లక్ష్మీ
ప్రసన్నం కాలేదు .చాలా నిరాశ పడ్డా డు పూట గడవని పరిస్తితి లో సంగీత శిఖరారోహకుడు ఉన్నాడు .విధి
బలీయం .వియన్నా లో సంగీత క్లా సులు చెప్పుకుంటూ పెళ్ళాం పిల్లల్ని పో షించుకోవలసి వచ్చింది పాపం ఆ
సంగీత సరస్వతికి .చివరికి నియన్నా దర్బారు లో చేంబర్ కంపో సర్ గా ఉద్యోగం లభించింది .అది చాలా ఉన్నత
1791 లో కొత్త అ వకాశాలు వచ్చాయి .''the magic flute ''అనే కామిక్ ఒపేరా కు రాశాడు అందులో
మాట్లా డే మాటల తో పాటు పాటలు కూడా ఉండేట్లు రాశాడు .అది మోజానిక్ ఉత్స వాళ రహస్యాలను తెలియ
జేసేది .అందులోని సిద్ధా ంతం ప్రకారం చావు తో శిక్ష పడుతుంది .అందుకని మాజన్లు మొజార్టు కు విష ప్రయోగం
చేశారని భావించారు .దీనితో ఆయన చాలా నెలలు జబ్బు పడ్డా డు .కాళ్ళు ఉబ్బాయి .వోల్ఫాంగు ను ఒక ''శవ
యాత్ర ''(ఫనేరాల్ )లో చేసే మాస్ ప్రదర్శన కు,రాయమని అడిగారు . దానికి ఇచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువ.
అత్యధిక పారితోషికం ఇస్తా మని వాగ్దా నం చేశారు .వియన్నా నోబుల్ అధికారి భార్య చని పో యింది .ఆమే కోసమే
ఇది .దానికోసం ,ఇతర కార్యక్రమాల కోసం ఇరవై నాలుగు గంటలూ కష్ట పడి సంగీతం సమకూర్చాడు .ప్రేగ్ లో రాజు
గారి పట్టా భి షెకానికి వెళ్లి వచ్చిన తరువాత రాస్తా ను అని . requiem రాయమని అడిగిన వారికి చెప్పాడు
.సెప్టెంబర్ లోవియన్నా లో the magic flute ప్రీమియర్ షో వేశారు . కొన్ని వారాల తర్వాతాతీవ్రం గా జబ్బు
చేసింది .100 ప్రదర్శనలు పొ ంది వియన్నా లో రికార్డు సృష్టించింది .అయితే వందో ప్రదర్శన చూసే భాగ్యం మన
సంగీత మహారాజుకు లభించ లేదు .'' requiem '' ను అనుకొన్న సమయం లో పూర్తీ చేయటానికి శక్తి యుక్తు లన్నీ
ధార పో శాడు .''చని పో యిన వారి కోసం సంగీత విభావరి చేయటం మోజార్టు చావుకు వచ్చింది ''.
అందులోని ఎనిమిది భాగాలకు సంగీతాన్ని సమ కూర్చాడు .డిసెంబర్ నాలుగు న ఆయన చేతులు రెండు
వాచీ పో యి ,నీరు పట్టి కలం పట్టు కో లేక పొ యాయి .తన శిష్యుడు ఫ్రా ంజ్ సుష్మీర్ సాయంతో ఆ మహత్త ర
విషాదాంత సంగీత స్వర సమ్మేళనాన్ని పూర్తీ చేశాడు ఆ స్వర బ్రహ్మ .ఆ రాత్రి ఒంటి గంటకు ఆ సంగీత స్రష్ట ఊపిరి
అనంత వాయువుల్లో కలిసి పో యింది .అప్పటికి మోజార్టు వయస్సు 35 ఏళ్ళు.మాత్రమె .అప్పటికే ఆయన సంగీత
స్వరాలతో అలరించిన రచనలు 600 పైనే ఉన్నాయి .కాని సరైన గౌరవ ప్రద మైన అంత్యక్రియలు చేయ టానికి
ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేక పో వటం అత్యంత విషాదకరం .ఆ మహా సంగీత విద్వాంసుడి శరీరాన్ని సామాన్య
జనాన్ని సమాధి చేసే చోటే భూస్తా పితం చేశారు .ఇది అత్యంత దుర ద్రు ష్ట కర మైన సంఘటన .
కొంత మంది కి బ్రతికి ఉన్నంత వరకు కీర్తి రాదు .చని పో యిన తరువాతే కీర్తి వచ్చి మీద
పడుతుంది అదే జరిగింది ఈయనకు .ఆయన మరణ దినాన్ని ఈ నాడు ప్రపంచం అంతటా మిలియన్ల మంది భక్తీ
తో శ్రద్ధ తో జరుపుతూ శ్రద్ధా ంజలి ఘటిస్తు న్నారు .హాలీవుడ్ ,పాప్ సంగీత కారులు మోజార్టు ను విపరీతం గా
గౌరవిస్తు న్నారు .'' amadeus ''..పేరా హాలీ వుడ్ లో సినిమా తీశారు .అందులో ఆయనకు ,సలేరీ కి ఉన్న సంగీత
స్పర్ధను హైలైట్ చేశారు .అంతటి సంగీత ప్రతిభా వంతునికి భగ వంతుడు అన్యాయం చేశాడని వాపో తారు సంగీతాభి
మానులు .ఆ సినీమాఉత్త మ చిత్రం గా ఆస్కార్ అవార్డు పొ ందింది .sallieri యే మోజార్టు ను పాశవికం గా విష
ప్రయోగం చేసి చంపించాడని అంటారు .2002 september 11 న న్యూయార్కు నగరం మీద తీవ్ర వాదులు దాడి
చేసి చేసి నపుడు ప్రపంచ ప్రజలంతా మ్యూజిక్ మజీషియన్ మోజార్టు ను జ్ఞ ప్తికి తెచ్చు కొన్నారు .వరల్డ్ ట్రేడ్
సెంటర్ వద్ద ఆర్కెస్ట్రా తో లక్షలాది మంది వింటూ చూస్తు ండగా మోజార్ట్ట్ట్ స్వర పరచిన ''rolling requiem ''ఒక
'' మిరకిల్ చైల్డ్ '' అని ప్రశంసలు పొ ంది ,ఇవాల్టి'' పాప్ స్టా ర్'' లకు ఆదర్శమై ,వయోలిన్ లోని అన్ని
టేక్నిక్కులను ప్రయోగించి ,స్వయం గా అన్నీ సాధించి, యే గురువు దగ్గ రా శిష్యరికం చేయకుండా ,మేధావి
,జీనియస్ అని పించుకొన్న వాడు మొజార్ట్.ఆధునిక డిస్క్ జాకీ లా ,చిన్న తనం లోనే ఇతర విద్వాంసుల రచన
లన్ని తన రచనలో మేళ వించాడు .పన్నెండు ఎల్ల ప్పుడే స్వయం గా ఒపేరా రాశాడు .ఆ రోజుల్లో వాడుక లో ఉన్న
సర్వ వాయిద్యాలను వాయించి అన్నిట్లో నూ ''మాస్ట ర్'' అని పించుకొన్నాడు .హార్ప్సి కార్డ్ ,పియానో ,వయోలిన్ తో
పాటు స్వంత స్వరం తో అద్భుత సంగీతాన్ని విని పించాడు .తన కంటే వయసు లో పెద్ద వారైన సంగీత కారుల
కంటేవిద్వత్తు లో ముందున్నాడు ,అంతా స్వయం గా సాధించిందే .డబ్బు ఎంత ఎక్కువ గా సంపాదించాడో అంత
విచ్చల విడి గా ఖర్చు చేసి దెబ్బ తిన్నాడు .అతని ప్రా భవం అంతా ఆయనకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకే .ఆ తర్వాత
ఆ సంగీత ధార కుంటు పడింది .ఆరేళ్ళ వయసు లోనే యూరప్ లో ఆరాధనీయ్డైనాడు .ఇరవై ఆరేళ్ళ వయసు లో
దాన్ని నిలుపు కోలేక పో యాడు .అతని లోని సంగీత జ్వాల కొద్దికాలమే భగ భాగ మండి,క్రమంగా వెలుగు తగ్గింది
.ఆ కాలమే ఆయనకు శిఖరారోహణ కాలం .ముప్ఫై అయిదేల్లకే తనువు చాలించిన దురదృష్ట వంతుడు .బాల్యం లో
కీర్తి ,ప్రతిభ చూపిన ఆయన్ను ,వయసు లో ఎవరూ పట్టించు కోలేదు .''భగవంతునికి ప్రియమైన వాడు''
-''Amadeus ''అని పిలిపించుకొన్న వోల్ఫాంగ్ మో జార్ట్ అమర సంగీతం- రసజ్న లోకాన్ని ప్రభావితం చేసింది .
మహనీయ సంగీత విద్వాంసుడుఅని పించుకొన్నాడు . .జర్మని కి చెందిన బీథో వెన్ అనే సింఫనీ కారునికి కు
రెండు వారాలువియన్నా లో సంగీతం నేర్పి ,ఆ తర్వాత ''ఈ కుర్రా డు కొద్ది రోజుల్లో ఉజ్వలం గా ప్రకాశిస్తా డు
చూస్తూ ండండి '' అనిబీథో వెన్ ప్రతిభ ను అంచనా వేసి తన శిష్యులకు తెలియ బరచిన సంగీత మర్మజ్నుడు
మొజార్ట్ .రెండు మూడు రకాల మాధుర్యాలను మేళ వించి కొత్త అందమైన రుచి మంత మైన అధిక మాదుర్య
విలసిత మైన భావాలను''-అంటే ''-కౌంటర్ పాయింట్ ''ను సృష్టించిన సంగీత స్రష్ట మొజార్ట్ అమర రహే .
అమెరక
ి ా రుషి -హెన్రీ డేవిడ్ థో రో
ఆయన ప్రకృతి ప్రియుడు .ప్రకృతి లో అందాలను అనుక్షణం ఆస్వాదించే సత్యా న్వేషి .సకల
మానవాభ్యుదయాన్ని కోరే వాడు .మనసు పరి పక్వత సాధించుకొన్న వాడు .బహుజన హితాయ ,బహుజన
సుఖాయ అని నమ్మి సంఘ సేవ చేశాడు .అక్షరాన్ని పరమ పూజ నీయం గా భావించి ,అక్షరార్చన చేసిన వాడు
.సాధారణ జీవితాన్ని గడిపి ,ఉదాత్త భావాలను వ్యాప్తి చేసిన వాడు .ఉన్నత విలువలకు కట్టు బడిన వాడు .జనం
లో జనార్దనుడిని దర్శించిన వాడు .ఆనాటి మహార్స్షుల లాగా అరణ్య మధ్య భా గాన కుటీరం నిర్మించుకొని ఏకాంత
వాసం గడిపిన వాడు .ఎందరికో ఆదర్శం ,ప్రేరణ .ఆయన గడ్డ ం ,ముఖ వర్చస్సు ,కళ్ళల్లో కాంతి రేఖలు గమనిస్తే
ఆధునిక రుషి పుంగ వుడు అని . పిస్తా డు .ఆయనే the hermit of America అని పిలువ బడ్డ హెన్రీ డేవిడ్ థో రో.
అమెరికా లోని మాసా చూసేత్స్ రాష్ట ం్ర లో కాన్కార్డ్ లో జన్మించిన కారణ జన్ముడు .ఆ ప్రా ంతం లోని ప్రతి
పురుగు ,పుట్టా ,పిట్టా ,గుట్టా పండు ,పువ్వు ,కాయ ఆకు ,ఆలమ అన్నీ క్షుణ్ణ ం గా తెలిసిన వాడు . ప్రజా హితం
చేయని ప్రభుత్వాన్ని నిల దీసిన వాడు .తాను చేసి ,ప్రజల చేత ''సహాయ నిరాకరణం ''చేయించిన వాడు .ప్రభుత్వ
న్యాయం కంటే పైన ఒక న్యాయం ఉందని ,అదే ఆత్మ ప్రబో ధమని ,ఈ రెండిటక
ి ి వైరుధ్యం ఏర్పడినపుడు ,అంతరంగ
ప్రబో దానికే కట్టు బడి ఉండాలని తెలియ జెప్పాడు .అహింసా మార్గ మే ఆయన మార్గ ం .సత్యమే ఆయన ఆయుధం
.మహాత్మా గాంధికి ,మార్టిన్ లూధర్ కింగు కు ,నాజీ లను ఎదిరించిన డేనిష్ ప్రజలకు ,వియత్నాంపై అమెరక
ి ా
యుద్ధా న్ని వ్యతి రేకించిన ప్రపంచ దేశాలకు,దక్షిణ ఆఫ్రికా లో వర్ణ వివక్ష పై పో రాటం సాగించటానికి ,చైనా లో
తియమిన్ స్క్వేర్ లో విద్యార్ధు ల శాంతి యుత ప్రదర్శనలకు థో రో గారి మార్గ మే శరణ్య మైంది .
ఆయన ,పొ లాలను సర్వే చేయటం నేర్చు కొన్నాడు .ప్రక్క వాళ్ల సరిహద్దు లెక్కడో వాళ్ళకన్నా
ఈయనకు బాగా తెలుసు .ఆయన సర్వే చేయని చుట్ట పక్కల గ్రా మం ,పట్ట ణం లేదు .సర్వేయర ఇన్ ఛార్జ్
గాప్రభుత్వం నియమించింది .ఆయన రోడ్ల ను సర్వ్ చేయించారు .కోర్టు లలో ఆయన డాక్యు మెంట్ల కే విలువ
మాట్లా డ గలదు .అయితే ఆయన సహచారి అయిన ఎమర్సన్ గారు మాట్లా డితే ఉపన్యాసానికి యాభై దాలర్లిస్తే
ఈయన మాట్లా డినప్పుడు పడి డాలర్లు కూడా చేతి లో పెట్టె వారు కాదని రచనకే అంకిత మవ్వాలని నిర్ణ
యించుకొన్నాడు . ఆయన చేతి లో ఎప్పుడూ ఒక నోటు పుస్త కం ఉండేది .తాను చూసిన వాణ్ణి అందులో రాసుకొని
తర్వాతా వ్యాసాలుగా రాసే వాడు .దాదాపు ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళే వాడు .నడక అంటే మహా ఇష్ట ం .కాకార్డు
నది లో స్వంతం గా నిర్మించుకొన్న బో టు లో విహరించే వాడు .చలి కాలం నది గడ్డ కట్టితే దానిపై స్కేటింగ్ చేసే
వాడు గంటకు పద్నాలుగు మైళ్ళ వేగం తో స్కేట్ చేసే వాడట .వాల్డె న్ పాండ్ లో ఒంటరిగా రెండేళ్ళ రెండు
నేలలున్నాడు రుషి జీవితం గడిపాడు . ఆతర్వాత మళ్ళీ స్వంత గ్రా మం చేరాడు .ఎందుకు వచ్చేశారు అని అడిగితే
''i have several more lives to live ''అని ఇదే కాక తాను నిర్వహించాల్సిన సామాజిక ధర్మాలు చాలా ఉన్నాయి
'' i have chosen letters as my profession ''అన్నాడు థో రో .అంటే రచన చేయటమే తనకు బాగా
ఇష్ట మని .'the week ''అనే తన యాత్రా దర్శిని ప్రచురించాడు .అది మిశ్రమ స్పందన కల్గించింది .దాని పై
స్పందిస్తూ విమర్శకులు ''a rare work in American literature ''అనీ ''a remarkable volume and its author
a remarkable man ''అని కితాబు ఇచ్చారు .అయితే ఆయన మరణించిన తర్వాతా ,ఆయన రచనల విలువ
పెరగ
ి ింది .తమ మధ్య ఒక మహాను భావుడు ఉన్నాడు అని ఆనాటి కన్కార్డు సమాజం గమనించలేదు .ప్రకృతి
అంటే పులకిస్తా దాయన . తన పళ్ళను తీసి, కృత్రిమ దంతాలను అమర్చి నప్పుడు గురువు ఎమర్సన్ తో ''art out
ఆయన చేతిలో ఒక పెద్ద గొడుగు ఉన్దేదేప్పుడూ .ఆయన ఇంట్లో పెద్ద శీల్ఫ్ లో తాను సేకరించిన
బొ టానికల్ స్పెసిమెన్ ప్లా ను అరల్లో దాచే వాడు .1850-57 మధ్య ఆయన 800 plant specimen లను న్న్యూ
ఇంగ్ల ండ్ ప్రా ంతం నుండి సేకరించాడు వాటిని తరువాత harvard gray herbarium లో భద్ర పరిచారు .లిల్లీ
పువ్వుల్లో ఎన్నో రకాలను సేకరించాడు .ఇండియన్ అమెరికన్ లతో సాక్ష్యాత తో ఉండే వాడు .వాళ్ళతో అడవులు
నదులు తిరిగి వారి జీవిత విధానాలను అధ్యాయం చేశాడు .వాళ్ళు ఉపయోగించే పదాల అర్ధా లు తెలుసు కొనే
వాడు .ఔషధ మొక్కల గురించి ఆరా తీసి వాటిని వారు వైద్యం ఎలా ఉప యోగించేది తెలుసు కొన్నాడు రాతి తో
వాళ్ళు చేసే బాణాల ములుకులు ,బల్లా ల చివరలు ,గొడ్డ ళ్లను ఆసక్తి గా చూసే వాడు .అడవి తల్లి ని నమ్ము కోవాలి
అమ్ముకో రాదనే సిద్ధా ంతం ఆయనది .అందుకే ఆనాడే వంయాలను వన్య మరుగ సంరక్షణ ను బో ధించిన వాడిగా
థో రో ను గుర్తిస్తు న్నారు .
'' the succession of forest trees ''అనే థో రో వ్యాసం ఆయనకున్న శాస్త్రీయ జ్ఞా నాన్ని వెల్లడి చేస్తు ంది
.యే చెట్టు ,యే మొక్క ఎప్పుడు ఫలిస్తు ందో , ,పుష్పిస్తు ందో అన్నీ ఆయన వివ రించాడు .బీజ వ్యాప్తి ని
అధ్యయనం చేశాడు .వీటి పై ఆయన రాసిన అభిప్రా యాలు నేటికీ శిరోధార్యమే .ఇంత శాస్త్రీయ విజ్ఞా నం ఉన్నా
ఏదో ఒక రోజు సైన్స్ జీవితం లోని రక్తా న్ని అంతను ఖాళీ చేస్తు ందని అందాన్ని కవిత్వాన్ని నాశనం చేస్తు ందని
భయ పడ్డా డు . the walking ,the wild అనేవి అట్లా ంటిక్ మంత్లీ లో ప్రచురిత మయాయి .''in wilderness is the
ఆయన ఆధ్వర్యం లో బానిసలకు అంటే దక్షిణ రాష్ట్రా లలో పొ లాల్లో పని చేసే వారికి తాటాకు టోపీలను
ఆడ వారు తయారు చేసి రవాణా చేసే వారు .చవక గా వచ్చే నూలు బట్ట లను తయారు చేయించి వారికి పంపే
వారు .ఆ రోజుల్లో బానిసలు యజ మాని నుంచి తప్పించు కొని బయట పడితే వారికి ఆశ్రయం కల్పించిన వారికీ
వెయ్యి డాలర్ల జరిమానా ఉండేది .ఆ నాటికి అది చాలా పెద్ద మొత్త మే .దీన్ని వ్యతి రేకైన్చాతానికి థో రో నె సరైన
నాయకుడని అందరు భావించి ఆయన నాయ కత్వం లో పో రాటం చేశారు .తప్పించుకొన్న బానిసలకు వారికి
ఆశ్రయం ఇచ్చి తిండి , బట్ట లు డబ్బు కూడా ఇచ్చి పంపే వాడు థో రో .బానిసత్వాన్ని బాహాటం గా మొదటి నుంచి
వ్యతి రేకిన్చినఆదర్శ వ్యక్తీ థో రో .''love without principle ''అంటే ఆయనకు ఇష్ట ం లేదు .''you must get your
ఆయన రాసిన ''వాల్డె న్ ''పుస్త కం పై డెబ్భై రివ్యూలు వచ్చాయి .అన్నీ బానే ఉన్నాయి .దాన్ని ''మాస్ట ర్
పీస్ ''అన్నారు .''one of the great american classics of non fiction ''అని కీర్తించారు .అక్షలది కాపీలు
అమ్ముడ యాయి. దాదాపు అన్ని భాషల్లో కి తర్జు మా అయింది .దాన్ని'' రుషి థో రో గారి స్వీయ చరిత్ర ''అని
ప్రశంసించారు .వాల్డె న్ పాండ్ లో రెండెక రాలలో నాలుగు వందల;'' పైన్ చెట్లను'' నాటించి పెంచాడు .జాన్ బ్రౌ న్ అనే
ఆయన బానిసల రక్షణ ఉద్యమం లో పో లీసు కాల్పుల్లో మరని స్తే శ్రద్ధా ంజలి ఘటిస్తూ '' ఈ మహో న్నత వ్యక్తీ
జన్మించి ఒక్క యాభై సంవత్స రాలు మాత్రమె జీవించి 1862 లో పుణ్య లోకాలకు చేరిన'' అమెరికన్ రుషి హెన్రీ
డేవిడ్ థో రో ''తర తరాలకు ఆదర్శ ప్రా యుడు .ఆయన మరణానికి చింతిస్తూ ఎమర్సన్ చెప్పిన వాక్యాలు చిరస్మర
ణీయం ''the country knows not yet ,or in the last part how a great son it has lost .where ever there
is knowledge ,where ever there is virtue ,where ever there is beauty Thoreau will find a home '',
అవి రెండవ ప్రపంచ యుద్ధ ం భీకరం గా జరుగు తున్న రోజులు జెర్మనీ ని సమర్ధించే దేశాలోక వైపు
,అమెరికా బ్రిట న్ల ను సమర్ధించే దేశాలోక వైపు మోహ రించి భీషణ పో రాటం చేస్తు న్నాయి .జర్మని నియంత
అడాల్ఫ్ హిట్లర్ జాతి దురహంకారం తో పెచ్చు మీరి పో తున్నాడు .యూదు లందర్నీ ఊచ కొత్త కోయిస్తు న్నాడు
.జ్యూ శాస్త ్ర వేత్తలను దేశం విడిచి పంపిస్తు న్నాడు .మహా మేధావి అయిన్ స్టీన్శాస్త ్ర వేత్త అమెరికా ప్రభుత్వ
ఆహ్వానం మేరకు ప్రిన్స్ టన్ యూని వేర్సిటి లో ప్రొ ఫెసర్ గా పని చేస్తు న్నాడు .ఏమైనా సరే అమెరక
ి ా ను ఓడించి
తన ఆది పత్యాన్ని నిలుపు కోవటానికి హిట్లర్ శతధా సహస్ర ధా ప్రయత్నిస్తు న్నాడు .సర్వ వినాశం చేసే బాంబు ను
కనీ పెట్టమని జర్మని శాస్త ్ర వేత్త లను ఆదేశించాడు .వారంతా తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు .తాను కనీ పెట్టిన ద్రవ్య
రాశి శక్తికి సంబంధించిన సూత్రం మంచికి ,చేడుకూ కూడా పని చేయ వచ్చు అని ఆందో ళన చెందు తున్నాడు
ఐన్స్టీన్ .అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వేల్టు కు ఉత్త రం రాస్తూ జెర్మని అణు బాంబు తయారు చేసే ఆలోచన లో
ఉన్నట్లు తనకు సమాచారం అందినదని ,హిట్లర్ చేతి లో ఆ బాంబు ఉంటె సర్వ ప్రపంచ వినాశనం జరుగు తుందని
వివరించాడు .అందువల్ల యురేనియం ను జర్మనీ కి దక్క కుండా చేసే జాగ్రత్తలను తీసుకోమని హెచ్చరించాడు .కా
ని హిట్లర్ దాన్ని సంపాదించి నిలావ చేసుకొని ఆటం బాంబు కోసం కలలు కంటున్నాడు .
లతో సమావేశమై అతి త్వర లో ఆటం బాంబు ను తయారు చేయమని ఆదేశించాడు .1942 లో కల్నల్ లెస్లీ
గ్రో వేస్ దీనికి పూనుకొన్నాడు .కాని ఆయనకు న్యూక్లియర్ ఫిజిక్స్ పెద్దగా తెలియదు .కాని దాన్ని తయారు
చేయాల్సిందే .అదీ అత్యంత రహస్యం గా .దానికోసం యుద్ధ నిపుణులు శాస్త ్ర వేత్తలు ,అందరి సహకారం కావాలి
.అప్పుడు ఆయన దృష్టి లోకి ప్రఖ్యాత శాస్త ్ర వేత్త ఒపెన్ హీమేర్ పడ్డా డు .ఆయన్ను పిలి పించి మాట్లా డాడు
.ఈయన కూడా జ్యూ శాస్త ్ర వేత్తయే .అందరి తో బాటు ఈయనకూ జెర్మని కంటే అమెరక
ి ా ముందే ఆటం బాంబు
తయారు చేయాలి అనే అభి ప్రా యం వుంది .సరే నన్నాడు దానికి సరైన ప్రదేశం గా న్యూ మెక్సికో లోని'' లాస్
బాంబు ప్రా జెక్ట్ ను 1942 లో ప్రా రంభించి the Man hattan project గా పేరు పెట్టా రు .అప్పటికే ఒపెంహీమర్
ే
ఫిలిప్స్ అనే మరో శాస్త ్ర వేత్త తో కలిసి transmutation function of deutrons అనే పేపర్ ను మూడేళ్ళ క్రితమే
continued gravitational attraction అనే పేపర్ ను విడిగా సబ్మిట్ చేసి ఇరవయ్యవ శతాబ్ద పు గొప్ప పేపర్ల లో
ఈ అనుభవం ఒపెంహీమేర్ కు బాగా కలిసి వచ్చింది .లాస్ ఆల్మోనాస్ చాలా సుదూరం గా ఎవరికి
అందు బాటు లేని స్త లం గా ఉంది కనుక రహస్య ప్రయోగాలకు అనువైన ప్రదశ
ే ం అని భావిచాడు .అతను
ప్రయోగాత్మక శాస్త ్ర వేత్త .కనుక ఆయనకు సహాయం గా వంద లాది ప్ల ంబర్లు శాస్త ్ర వేత్తలు అవసరం .అందుకని
వచ్చారు .యుద్ధ నిపుణులు శాస్త ్ర వేత్తలు ,ప్రయోగం నిర్వహించే వారు టెక్నీషియన్లు ,ఇజినీర్లు అంతా కలిస్తే 3000
మంది అయారు .వీరినందర్నీ కలిపి ఉంచి అందరి మధ్య సహకారం పొ ంది బాంబు ను తయారు చేయాలి .మాన వ
నాగరకత కోసం పని చేస్తు న్నామనే అభి ప్రా యాన్ని వారందరి లో కలిగించాడు .రాబర్ట్ ఒపెంహీమేర్ ఆ సంస్థ కు
డైరక
ె ్టర్ అయాడు .విషయాలనన్నిటిని తన బుర్రలోనే దాచుకొని పని చేయించాలి .ఎక్కడ లీకు అయినా ప్రమాదమే
.ఎన్రికో ఫెర్మి శాస్త ్ర వేత్త కూడా వచ్చి చేరి సహకరించాడు ఇంత చేస్తు న్నా రష్యా గూధ చారి సంస్థ కొంత ఇబ్బంది
కలిగించింది .దాన్ని అదిగ మించారు .ఆయనకు సెక్యూరిటి కూడా ఇబ్బంది కరమే అయింది .
1944 నీల్స్ బో ర్ శాస్త ్ర వేత్త ఈ ప్రా జెక్టు కు వచ్చి ,జరుగుతున్న పరిశోధనా వివ రాలను తెలుసుకొని
సంతృప్తి చెందాడు .ఆయన ఫిజిక్స్ లో ''క్వాంటం'' విప్ల వాన్ని తెచ్చిన శాస్త ్ర వేత్త .అయితే అనవసరం గా
న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేస్తే అది మళ్ళీ యుద్ధా నికి దారి తీస్తు ంది అని భావిన్చాడాయన .అందుకని
ప్రపంచ దేశాల శాస్త ్ర వేత్తలందరూ కలిసి ఆలోచించాలి అని తన అభి ప్రా యం చెప్పాడు కూడా .ఈ భావాలకు
ఒపెంహీమర్
ే కొంత బాధ పడ్డా డు .రెండో దశ ప్రా రంభ మైంది .జర్మని ఆటం బాంబు చేయటం లో విఫల మైందని
తెలిసి పో యింది .అది లేక పో తే జర్మని గెలవదు అని అందరు నిశ్చ యానికివచ్చారు .బాంబు తయారు
చేయటమా మానటమా అని సందేహం కల్గింది .కాని ఒపెంహీమేర్ పని ఆపటానికి వీలు లేదని ,కోన సాగించాలని
చెప్పాడు .ఎట్లా గో జర్మని ఒడి పో తుంది కనుక బాంబు ను జెర్మని మీద ప్రయోగించరు అనే అభి ప్రా యానికి
ప్రపంచానికి తెలియ జేయాల్సిందే అన్నాడు .దీని కి కొందరు అంగీకారం తెలుప లేదు.అప్పటికే యుద్ధ ం ముగిసి
1945 june లో చికాగో వర్సిటి కి చెందినా కొందరు శాస్త ్ర వేత్తలు అమెరికా బాంబు తయారు చేసినామొదటి
సారి గా ఎవరి మీదా ప్రయోగించరాదు అని ఒక దాన్ని యుద్ధ ం కోసం ఉపయోగిస్తే విశ్వ వినాశనమే
జరుగుతుందని,ఇప్పటి దాకా అమెరికా కు ఉన్న ప్రజా బలం క్షీణిస్తు ందని ,న్యూక్లియర్ ఆయుధాల పో టీ తీవ్ర
కూడా ఆలోచన లో పడ్డా డు .అందుకని జెర్మని మీద కాకుండా జపాన్ నగరం మీద ఆటం బాంబు వేయాలి అని
సైన్యానికి సలహా నిచ్చాడు .వారూ అంగీకరించారు .1945 july 16 న మొదటి ఆటం బాంబు ను ప్రయోగాత్మకం గా
పర్య వేక్షించాడు .అద్భుతం గా పని చేసి అనుకొన్న లక్శ్యం నేర వేరింది .అందరు ఆనందం లో మునిగి పో యారు
.దీని ఫలితాన్ని చూసి ఒపెంహీమేర్ ''ఇక నుంచి ప్రపంచం ఇప్పటి లాగా ఉండదు .నాకు భగవద్గీత లో ''నేను
ఇప్పుడు మృత్యువును .ప్రపంచాలను వినాశనం చేస్తా ను .'' అని చెప్ప బడిన వాక్యాలు గుర్తు కొస్తు న్నాయి
ను జపాన్ లోని హీరో షీమా పట్ట ణం పై ప్రయోగించింది .అక్కడే జపాను దేశపు డిఫెన్సు స్తా వరం ఉంది . .కాని
జపాను లొంగి పో లేదు .రెండో ఆటామిక్ బాంబు ను జపాను లోని నాగ సాకి పట్నం పై మూడు రోజుల తర్వాత
అమెరికా వేసింది .ఇక్కడే జపానుకు చెందిన యుద్ధ సన్నద్ధ స్థా వరం ఉంది ..మొత్త ం మీద రెండు బాంబుల వల్ల
రెండు న్నర లక్షల మంది చని పో యారు .ఇంకో యాభై వేల మంది అణు దూలి కి బలి అయారు .సెప్టెంబర్ రెండు
అదే చివరి రోజు అని చెప్పాడు .శాస్త ్ర వేత్త లందరూ అంకిత భావం తో కృషి చేసి సహకరించి నందుకు కృతజ్ఞ తలను
చెప్పు కొన్నాడు .వారి పని తీరుకు గర్వ పడుతున్నానని చెప్పాడు .కొంత కాలం తర్వాత లాస్ అల్మోనాస్ అ
మరియు హీరోషీమాలను మానవ జాతి శపిస్తు ందిఅన్నాడు .ఈ ప్రా జెక్ట్ పని అవగానే ,కాలి ఫో ర్నియా కు వెళ్లి
,మళ్ళీ పాత జీవితం ప్రా రంభించాడు ..1947 లో institute for advaanced study in priceton కు డైరెక్టర్ అయాడు
. 1946 లో అమెరక
ి ా atomic energy commission అనే పౌర సంస్థ ను దానికి general advisory committee ను
ఏర్పరచి ఒపెంహీమర్
ే ను దానికి చైర్మన్ ను చేసి గౌరవించింది .ఒపెంహీమర్
ే సృష్టించిన ఆటం బాంబు ''న్యూక్లియర్
ఫిషన్'' ఆధారం గా నిర్మించ బడింది .ఆ తర్వాత ''సూపర్ ''అనే బాంబు తయారయింది .అదే హైడ్రో జెన్ బాంబు
నిర్మించటం తగని పని అన్నాడు .ఇది మానవాళికి మహో పద్రవాన్ని తెస్తు న్ద న్నాడు .ఆ నాటి అమెరికన్ అధ్యక్షుడు
హారీ ట్రూ మన్ దీన్ని పట్టించు కోకుండా ఆటం బాంబు తో పాటు హైడ్రో జెన్ బాంబు నూA,E.C. తయారు
చేయాల్సిందే అని ఈ సంస్థ కు విస్పష్ట ం గా తెలియజేశాడు .రష్యా తయారు చేస్తు ందనే భయం కూడా ఉంది
హంగేరి శాస్ర వేత్త ఎడ్వార్డ్ టేల్లా ర్ సూపర్ అన బడే హైడ్రో జన్
ె బాంబు కు రూప కల్పన చేశాడు .దాన్ని
ఉత్త ర ఫసిఫక్
ి సముద్రం లో1952 november 1 న ప్రయోగించారు .1952 లో అయిసన్ హో వర్ అమెరికా అధ్యక్షు
డై నాడు .ఒపెంహీమర్
ే మీద కమ్యూనిస్ట్ అభి మాని అని హైడ్రో జెన్ బాంబు అమెరికా తయారు చేయకుండా
అడ్డ గించాడని ఆరోపణలు వచ్చాయి అప్పుడు మేకార్దీఅనే రిపబ్లి కన్ పార్టి సెనేటర్ కమ్యూనిస్టు లపై విరుచుకు పడే
వాడు .అతని విధానాలు క్రూ రం గా ఉండేవి. వాటిని మేకార్దీ చర్యలని సభ్య సమాజం ఈస డించు కొంది ఆ తర్వాతా
ఒపెంహీమర్
ే మీద అభియోగం రుజువు కాలేదు .చివరికి మేకార్దీని సెనేట అభి శంసించింది .అయితే ఒపెంహీమేర్
ఇంకా యే ప్రభుత్వ పదవులు నిర్వహించ రాదనీ తీర్మానించింది ..1963 లో లిన్డ న్ బి.జాన్సన్ ప్రెసిడెంట్
అయినప్పుడు ఒపెంహీమర్
ే కు అటామిక్ ఎనర్జీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని తన చేతుల మీదు గా అంద
జేశాడు .జీవితపు చివరి రోజుల్లో ఒపెంహీమేర్ ప్రపంచ శాంతి కోసం కృషి చేశాడు .మళ్ళీ institute of advanced
చదివాడు .హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో పై చదువులు పూర్తీ చేశాడు .బెర్కిలీ లో experimental physicist
అయాడు .1938 లో న్యూట్రా న్ స్టా ర్స్ మీద ప్రయోగాలు చేశాడు .న్యూట్రా న్ స్టా ర్ అంటే -చాలా సాంద్రత ఉన్న
నక్షత్రం సూపర్ నోవాలో కూలి పో యేది .దీనికి కారణం gravitational collapse .మిగిలిన విషయాలన్నీ పైన
చెప్పుకోన్నవే .ఒపెంహీమర్
ే ముఖ చిత్రం తో time mgazine 1948 november 8 సంచిక ను ప్రచురించి
ఒపెంహీమర్
ే కు అతున్నత స్థా నాన్ని ,గౌరవాన్ని కల్పించింది .అణు బాంబు పిత ''(ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్
ఉండేవాడు ''science is not answer for every thing . .But science very beautiful ''.
బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞా త కవి 3,182 పంక్తు ల్లో కవిత గా రాశాడు .అది మధ్య యుగ నాగరకత కు
ప్రతి బింబం .ఒక వెయ్యి సంవత్సరాల క్రి తం మరుగున పడిన చరిత్ర .''పాగాన్ ''మతం ,క్రి స్టి యన్ మతాల సంధి
కాలం నాటి కద .పాగాన్ మతం క్ర మం గా అంత రించి ,క్రి స్టి యన్ మత ప్రభావం పెరిగింది .
దీని వ్రా త ప్రతి క్రీ .శ.వెయ్యి లో దొరికింది .అది ఒక బై ండు పుస్తకం లో మిగిలిన రచన ల తో పాటు ఉంది .అలాంటి
వాటిని ''codex ''అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన మొదటి ఎలిజ బెత్
రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్ కాటన్ అనే పాత పుస్తకాల ప్రి యుడి దగ్గరకు చేరింది .ఈ పుస్తకం
లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వై విధ్యం కదా కధనం ఉండటం చేత బాగా
ఆకర్షి ంచింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి ఈ రచన బాగా ఉపకరిస్తు ందని పునాది అని సాహిత్య కారులు
చెబుతున్నారు .మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా
జ్ఞా నం కలగలుపు గా ఉన్నాయి ఒక రకం గా చారిత్రా త్మిక జ్ఞా పిక అన వచ్చు ..''the poem is a widow on
midieval culture an old english document of the first order and a deeply felt study of man;s
fate in an uncertain world '' అని విశ్లే షకుల భావన .
ఈ పద్య కావ్యం లో గతించిన రాజుల ,సాహస వంతుల ,భూతాలు ,దేయ్యాలవిషయాలు ,సంపద ,ద్వంద్వ
యుద్ధా లు ,అతీత శక్తు లు ఒకటేమిటి లేనిది లేదు .ఆ నాటి ప్రజల జీవన విధానం ,ఉంది .అందుకే అది లెజెండ్ గా
జనం నోళ్ళ నాని ఉంది .దీన్ని ''ఓల్డ్ డేనిష్ ''కవిత గా భావిస్తా రు .క్రీ .శ.నాలుగు లేక అయిదు శతాబ్దపు ఆంగ్లో
సాక్సన్ సామ్రా జ్య కద .దీన్ని పాటల రూపం గా పండుగపబ్బాలలో వేడుకలలో పాడు కొనే వారు .రాజాస్తా నాల్లో రాజ
కుటుంబానికి వినోదం కోసం జాన పదులు పాడి ఆనందం కల్గి ంచే వారు .
ఆంగ్లో సాక్సన్ కు డెన్మార్క్ దేశం స్థా నం .పూర్వ రాజుల ,వీరగాదా కావ్యమే బీ ఉల్ఫు కద.రాజు కోసం ,దేశం కోసం
సాహసాలు చేసే వీరుడే బీ ఉల్ఫు .ఆ కాలం లో మూడు తెగలు ఉండేవి .అవి -geats, swedes ,scandinavian లు
.వాళ్ళల్లో వాళ్ళ కు పోరాటాలు .ఆది పత్య పోరాటాలే అవి .స్కాండినేవియన్ కవిత్వం లో seyld scefing అనే
డేనిష్ రాజు గురించి కదఉంది .అతనే scyld రాజ్య స్తా పకుడు .ఆ పేరుకు అర్ధం ''రక్షకుడు ''.ఇతని
తర్వాత hrothgar రాజు అయ్యాడు .అతనికి royal mead hall అనే విశాల భవనం ఉంది .అక్కడే రాజు అది
కారులతో వింతలు ,వినోదాలు చూసే వాడు .ఈ భవనం రాజు గారి శక్తి కి చిహ్నం .విందులు ,వినోదాలు ,వేడుకలు
అన్నీ ఇక్కడే .
ఈ సందడి ఈ హాలుకు కొద్ది దూరం లో ఉన్న grendel అనే రాక్షసుడికి అసూయ కోపం కలిగించాయి అక్కడ విని
పించే వీనుల విందు అయిన harp సంగీతం వీడికి కర్ణ కథోరం గా ఉండేది .ఒక రోజు రాత్రి హ్రో త్ గార రాజు గారి వీర
సై నికులు అంటే నై ట్స్ ''హీర్రో ట్ 'అనే హాలులో నిద్ర పోతున్నారు .గ్రె ందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి సమయం లో
హతాట్టు గా వచ్చి మీద పడి ముప్ఫై మంది యోధులను ఎత్తు కొని పోయి ఎత్తు కు పోతుంటే అలజడి కి అంతా నిద్ర
లేచారు .మర్నాడు కూడా అలానే అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డా డు యోధుల్ని చంపి తినే వాడు .రాజు బంధువులు
చాలా మంది ఇలా చని పోయారు ..రాజు మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని సురక్షి త ప్రదేశం చేరు కొన్నాడు
.ఈహింస తగ్గి ంచ మని pagan దేవుళ్ళ ను రాజు వేడు కొన్నాడు .వారికి కానుకలు అంద జేసినా ఫలితం లేక
పోయింది .ఇలా పన్నెండేళ్ళు గడిచి పోయింది .నిత్యం రాత్రి ఇదే హింస కోన సాగింది .
ఈ రాజ్యానికి దగ్గర రాజ్యమై న geats రాజ్య యువ రాజు బీ ఉల్ఫు ఆరాక్షసుడి ఆగడాలు విన్నాడు .అతడు''
పాతాల భై రవి ''సినిమా లో రామా రావు ళా శక్తి బలం ,బుద్ధి వివేచనా ఉన్న యువకుడు .అతని తండ్రి hygelac
రాజ్యానికి రాజు .తండ్రి అనుమతి తీసుకొని బీ ఉల్ఫు పద్నాలుగు మంది తన లాంటి బలిష్టు లై న యువకుల్ని
వెంట బెట్టు కొని డెన్మార్క్ చేరాడు .రాజు స్వాగతించి కానుకలు సమర్పించాడు .అందరు ఆ రాత్రి herorot
భవనం లో నిద్రి ంచారు .గ్రె ందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డా డు .బీ ఉల్ఫు వాడితో పోరాడి ఒళ్లంతా
గాయాలు చేశాడు .వాడు ప్రా ణ భయం తో గుహ లోకి పారి పోయాడు .అక్కడ గాయాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తో
చచ్చాడు .
గ్రె ందేల్ చావు చూసి వాడి తల్లి అందర్ని చంపుతానని శపథం చేసింది .బీ ఉల్ఫు ఆమె గుహ చేరి పోరాడి ఆమె ను
చంపేశాడు .రాజు దగ్గర వీడ్కోలు తీసుకొని సన్మానాలు కానుకలు పొంది స్వరాజ్యం చేరాడు .తండ్రి చని పోయిన
తర్వాతా బీ ఉల్ఫు రాజు అయ్యాడు .యాభై ఏళ్ళు పాలించాడు .యుద్ధా లు అనేవి లేకుండా పాలించి ,ప్రజలకు
శాంతి సౌఖ్యాలను కలుగజేశాడు .అతనికి ముసలి తనం వచ్చింది .అయితే ఒక డ్రా గన్ అతని పై పగ బట్టి ంది
.డెన్మార్కు రాణి బీ ఉల్ఫు ను డెన్మార్క్ కు రాజు గా ఉండమని కబురు పంపింది భర్త మరణం తర్వాత ...అతను
తిరస్కరించాడు .కాని తప్పని పరిస్థి తుల్లో రాజు అయాడు .పద కొండు మంది యోదు లతో డ్రా గన్ ను చంపి ,దాని
దగ్గర ఉన్న సంపద ను అంతటినీ తెచ్చాడు .రాజ్యం సుభిక్షం గా వై భవం గా పరి పాలించి సాహస వీరుడు అని
చిరస్తా యి కీర్తి ని పొందాడు బీ ఉల్ఫు .
బీ ఉల్ఫు డి జెర్మని కి చెందినా geat తెగ .దక్షి ణ స్వీడెన్ లో ఉండే వాడు .తండ్రి మహా యోధుడై న ecgtheow.గెట్
రాజు హై జేలాక్ సమర్ధు డు .మంచి పాలన అందించాడు .బీ ఉల్ఫు కు ముప్ఫై మంది యోధుల బలం ఉండేది మన
భీముడి లాంటి వాడు .ద్వంద్వ యుద్ధా లలో మొన గాడు .
ఈ కధలో తెలిసిన్దే మిటి ?కొత్త నాగరకత ను రుద్ద టానికి ప్రయత్నిస్తే ,పాత నాగరకత వారు తిరస్కరిస్తా రు
.సాంఘిక అరాచకాన్ని అంతం చేసిన యోదుడే మన హీరో .మధ్య యుగ ప్రజలకు ప్రకృతి శక్తు లు అంటే భయం
.కొత్త వారికి రోత .పాతదే ముద్దు .కొత్త మార్గం లో నడవాలంటేనే భయం .పగలే ప్రయాణం చేసే వారు .అందులోను
ఒంటరి ప్రయాణాలే .ప్రకృతిని శాంతింప జేయటానికి బలులు ఇచ్చే వారు .
ఇందులోని ఎలిజీ -గ్రె ందేల్ అనే రాక్షసుడు ,వాడి తల్లి ప్ర కృతి కి ప్రతి నిధులు .అవి తండ్రి లేని జీవులు .వాటి
చరిత్ర అంతా గతం లో దాగి ఉంది .అవన్నీ తోడేళ్ళు ,నక్కలు మొదలై న వాటి తో తిరిగేవి .ప్రకృతి అలజడి ని
సృస్తి ంచి చంపేస్తు ంది .దాని నుంచి కాపాడు కోవా టానికి ఆయుధాలు సమ కూర్చు కోవాలి .దీనితో నాగరకత
ప్రా రంభమై ,అడవులను నరికి వ్యవ సాయం చేశారు .తరువాత సమూహాలు గా జీవించటం ప్రా రంభించారు .గానా
బజానా ,లతో వినోదం తో సుఖ జీవనం చేయటం ప్రా రంభించారు .heorot అనే హాల్ దీనికి అంతటికి ప్రతి
బిమ్బమే .అంటే నాగరకత కు ప్రతి బిమ్బమే .అందుకే నాగరకత ను సహించ లేని రాక్షసుడికి అసూయ అని
విశ్లే షకులు వివరించారు .ఈ కవిత లో ప్రకృతి శక్తు లకు వ్యతి రేకం గా మానవ పోరాటం ఉంది ఇంటా బయటా
,సమాజం లో ఉన్న అలజడి కి రూపం .ఎవరూ ఇతరుల సహాయం లేకుండా జీవించే లేరు అనే జీవిత సత్యాని
వ్యంగ్యాత్మకం గా ,ప్రతీకాత్మకం గా చెప్పటం మనం అందరం రాజ్యానికి ,దేశానికి రక్ష గా ఉండాలన్న సందేశమూ
ఉంది .
పై సైన్స్ చదివిన వారికి లైటేనింగ్ కండక్టర్ ను కానీ పెట్టి నదీ ఆయనే అని తెలిసి ఉంటుంది .ఆయన శాస్త ్ర వేత్త .ఒక
ఇన్వెంటర్ .బైఫో కల్స్ ను ,ఉప్పునీటి నుండి ఉప్పు ను వేరు చేయటాన్ని ,స్ట వ్ ను ,కాపీయింగ్ మెషీన్ ,మడిచి
పడుకునే వీలున్న చైర్ ను ,ఇంటి దర్వాజా వద్ద ఎవరు వస్తు న్నారో తెలియ జేసే అద్దా న్ని ఆయనే కానీ పెట్టా డని
చాలా మందికి తెలీదు .ఆయన తన కాలం కంటే ముందున్న వాడు .ఆలోచనలు అంత దూరం గా ఆలోచించే వాడు
.టేస్ట్ ట్యూబ్ అంచులను కాని ,పలుచని గాజు గ్లా స్ ను కాని శిలకు తోనో ,ఫ్లా నేల్ తో నో రుద్దితే విద్యుత్
పుడుతుందని మొదట కానీ పెట్టింది ఆయనే .దాన్నినే శతావర విద్యుత్తు -స్టా టిక్ కరెంట్ అన్నారు .ఎత్తైన
భవనాలను పిడుగుల నుండి కాపాడటానికి మొన దేలిన ఇనుప రాడ్ల ను అమరిస్తే మెరుపు లోని విద్యుత్తు దాని
ద్వారా భూమి లోకి ప్రవేశించి ప్రమాదాన్ని తప్పిస్తు ందని సూచింది ఫ్రా న్క్లినే .దాన్ని పేటెంట్ చేయ కుండా
వదిలేసినఉదారుడు .గాజు ను సిల్క్ తో రుద్దితే కరెంట్ వస్తు ందని చెబితే ఇంగ్లా ండ్ దేశం లో ఎవరు నమ్మక ఒక
పిచ్చాది కింద జమ కట్టా రు .అమెరికా వాడు ఇంత పని చేయగలడా అని ఏమీ చదువుకొని వాడా దీన్ని కనీ పెట్టేది
అనిఅవన్ని ''ఫీల దేల్ఫియా ప్రయోగాలు ''అని తేలిగ్గా తీసుకొన్నారు . నిరసించారు .తరువాత చెంప లేసుకొని ఆ
యన ప్రతిభ ను గుర్తించారు .మెరుపు లో విద్యుత్తు ఉందని ప్రయోగ పూర్వకం గా రుజువు చేశాడు .హార్వర్డ్ ,ఎల్
వర్సిటీలు ఆనరారి దిగ్రీలిచ్చాయి .చివరికి లండన్ లోని రాయల్ సొ సైటీ 1753 లో బంగారు పతకాన్నిచ్చి గౌర
వించింది .1756 లో రాయల్ సొ సైటీ మెంబర్ ను చేసింది .ఆయన వాతావరణం లోని గాలి కదలికల వల్ల తుఫాన్లు
ఎలా వస్తా యో చెప్పాడు .కొండలు ఏర్పడే విధానం ,సముద్రం లోని ఫాస్జిల్స్ ఏర్పడే వైనం గురించి పరిశోధించాడు
.సముద్రపు గుల్ల ల మీద ఆలోచన చేశాడు .మందుల గురించి క్షున్నం గా తెలుసు కొన్నాడు .శరీరం లోని ద్రవాన్ని
బయటకు తీసి పరీక్షించే ట్యూబ్ తయారు చేశాడు .చర్మం లోని సూక్ష్మ రంధ్రా లు చేసే పని ,రక్త ం ఎలా శరీరం లో
ప్రవహించేది తెలియ జేశాడు .చీమలు తమ లో తాము మాట్లా డు కొంటాయని తెలియ జేశాడు .పావురాలను పెంచే
విధానం సూచించాడు .వ్యవసాయాన్ని గార్డె నింగ్ ను స్కూల్ సబ్జెక్టు లలో బో ధించాలని సూచించాడు .ఆయన
ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు .అందులో ఎన్నో ప్రయోగాలు చేశాడు కాలెండర్ తయారు చేసిpoor richard's almanaak
అని పేరు పెట్టా డు . .ఇవన్నీ ఆయన లోని శాస్త ్ర వేత్త ను ఆవిష్కరించే విషయాలే .విద్యుత్తు కు సంబంధించిన
చేశాడు .ప్రీస్త్లీ మొదలైన శాస్త ్ర వేత్త లతో ప్రత్యక్ష పరిచయం ఉంది .లండన్ లో ఐజాక్ న్యూటన్ ను కలుద్దా మను
ఉత్త ర అమెరికా డిప్యూటీ పో స్ట్ మాస్ట ర్ జెనెరల్ గా నియమించారు .ఆ సమయం లో వర్జీనియా నుండి న్యూ
ఇంగ్లా ండ్ వరకు ఉన్న అన్ని పో స్టా ఫీసులను సందర్శించి వాటి పని తీరును వృద్ధి చేశాడు .ఆయన కాలం లోనే
మొట్ట మొదటి సారిగా రాత్రి ,పగలు ఉత్త రాల రవాణా ఫిలడెల్ఫియా న్యూయార్క్ బో స్ట న్ లకు జరిగింది .లేజిస్లా చ్ర్
లో గుమాస్తా గా పని చేశాడు ..ఫిలడెల్ఫియా నగరాన్ని పరి శుభ్రం గా ఉంచాడు .కాపలాదారును నియమించ
టానికి ఫండ్స్ లేక పో తే తేలిక పాటి పన్నులు వధించి ,ఆ డబ్బు తో వాచ్ మాన్ ను ఏర్పరచాడు .అగ్ని
ప్రమాదాలనుండి రక్షించ టానికి ఫైర్ ఫైటర్స్ ను తయారు చేశాడు fire engenes vaatiki కావలసిన పరికరాలను
కొని పించాడు .జార్జి విత్ఫీల్ద్ అనే మత ప్రచారకుని సాయం తో ''అనాదాశ్రమం ''ఏర్పరచాడు .వయోజన విద్యా
కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని భావించాడు .లాటరి విధానం ప్రవేశ పెట్టి, జూదాన్ని తగ్గించే ఆలోచన చేశాడు . పౌర
సైన్యాన్ని తయారు చేసి సమాజాన్ని రక్షించుకొనే శిక్షణ ఇచ్చాడు .గదులకు వెచ్చదనాన్ని కల్గించే హీటింగ్ స్ట వ్
తయారు చేశాడు .ఆయన -ఫసిఫిక్ అట్లా ంటిక్ సముద్రా ల మధ్య నార్త్ వెస్ట్ రహదారి నిర్మించాలని ,బానిసత్వాన్ని
నిర్మూలించాలని ,జిల్లా ను ఆధునీ కరించాలని తలచాడు .,అమెరికా లో మొదటి బాత్ టబ్ ఏర్పరచాడు . ,ఫైర్
డిపార్ట్మెంట్ ఏర్పడాలని ,వార్తా పత్రిక లలో కార్టూ న్ల కు ప్రా ధాన్యం ఉండాలని కోరాడు .ఆయన బైబుల్ ను సాధారణ
ఇంగ్లీష భాష లోకి తర్జు మా చేశాడు .పేపర్ల కు సంపాదకీయాలు రాసే వాడు .ఆస్పత్రు ల సంఖ్య పేర గాలాని
మెడికల్ స్కూల్ అవసరమని భావించాడు .ఇవన్నీ కాలం కంటే ముందున్న ఆలోచనలు .బిల్డింగ్ లోని సెకండ్
యుద్ధ ం లో వాటి సాయం చాలా ఉంటుందని తెలియ జేశాడు .ఇతర గ్రహాలలో జీవం ఉందని చెప్పాడు .సో ప్ ఒపేరా
రాశాడు .ఒక సారి ఆయన ఒక వైన్ గ్లా స్ లో పడి మునిగిన ఈగలు బతికి బయట పడటం చూశాడు .అప్పుడు
తనను కూడాచని పో యిన తర్వాత '' వైన్ కాస్క్'' లో భద్ర పరిస్తే శతాబ్దా ల తరువాత బతుకు తానని సరదాగా
అన్నాడు .
.అక్కడి నేటివ్ అమెరికన్ల తో ఒప్పందం కుదర్చు కోవటానికి నియమించ బడ్డా డు . సరిహద్దు రక్షణ కోసం
ఆయన్ను నియమించారు .కోటలను కట్టే ఏర్పాటు బాధ్యత అప్ప గించారు .సైన్యాన్ని తయారు చేసే బాధ్యతా
ఆయనదే .వారికి ట్రైనింగ్ ఇచ్చాడు .వాలంటీర్ ఆర్మి బాగా పని చేసింది అతని ఆధ్వర్యం లో . 1757 లో
పెన్సిల్వేనియా ప్రతి నిది గా లండన్ వెళ్లా డు .అక్కడి రాజును కలిశాడు .కాలనీ లకు బ్రిటీష సభలో సభ్యత్వం
ఉండాలని వివ రించాడు స్టా ంప్ ఆక్టు వ్యతి రేకించాడు .అయినా అది పాస్ అయింది ,మళ్ళీ తీవ్రం గా వ్యతి
రేకిన్చిచేప్పి దాన్ని రద్దు చేయించాడు .బ్రిటీష ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్ఫిల దేల్ఫియా లోని ఇల్లు తగల బెడ తామని
బెదిరించారు .లొంగ లేదు .అప్పటికే డెబ్భై ఏళ్ళు వచ్చాయి .అమెరికా స్వాతంత్ర పో రాటం తీవ్రం గా ఉంది .రెండవ
కాంటి నేన్తల్ కాంగ్రెస్ కు ప్రతి నిది అయాడు .అప్పటికే ఆయన కొడుకు విలియమ్స్ న్యు జేర్సికి బ్రిటీష గవర్నర్ గా
ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం ఫ్రా ంక్లిన్ ను పో స్ట ల్ ఉద్యోగం లో నుంచి పీకేసింది .కాని కాంగ్రెస్ మళ్ళీ నియమించింది
.పెన్సిల్వేనియా ను రక్షించే రక్షణ కమిటీ చైర్మన్ అయాడు .యుద్ధ పరికరాలు తయారు చేయటం మందు గుండు
సామాను తయారు చేసే బాధ్యత తీసుకొని సమర్ధం గా చేశాడు ..article of confederation and perpetual
union రాసి కాలనీ లన్నిటికి పంపాడు .కాంగ్రేస్ ఇతన్ని మీసా చూసేత్స్ కు జార్జి వాషింగ్ టన్ తో మాట్లా డ టానికి
పంపింది . .కాంటి నేన్తల్ ఆర్మితయారు చేయాలనే ఆలోచన లో పాలు పంచుకొన్నాడు .కెనడా ను కూడా
ఒప్పించటానికి ఫ్రా ంక్లిన్ ను పంపారు .కాని వాళ్ళు అంగీకరించ లేదు . 1776 july 4 న అమెరక
ి న్ కాలనీలన్నీ
స్వాతంత్రా న్ని ప్రకటించి డిక్ల రేషన్ తయారు చేసి విడుదల చేసింది .దానిలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు .
అమెరికా స్వాతంత్రా నికి మద్ద తు ఇవ్వమై ఫ్రా న్స్ ను కోరే పని మీద ప్రా భుత్వం ఫ్రా ంక్లిన్ ను పారిస్
పంపింది .వారిని ఒప్పించాడు .ఇక్కడ అమెరికా బ్రిటన్ సైన్యం తో యుద్ధ ం చేస్తో ంది .యుద్ధా నికి మద్ద తు కూడా గట్టె
ప్రయత్నం చేయాల్సి వచ్చింది .అక్కడ అమెరికా బ్రిటీష సైన్యాన్ని వాషింగ్ న్ నాయకత్వం లో చిత్తూ గా ఓడించింది
.ఇది విని ఆశ్చర్య పో యాడు .శాంతి సాధన ప్రక్రియ దివిజం గా ముగించాడు .1785 లో అమెరికా తిరిగి వచ్చాడు
.ఫ్రా న్స్ రాజు 408 వజ్రా లు పొ దిగిన తన ఫో టో ను కానుక గా ఇచ్చాడు .ఈయన రాజుకు బంగారు నశ్యం డబ్బా
కానుక గా ఇచ్చాడు .1785 లో పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ గా ఎన్నికయాడు .చాలా అలసి పో యాడు రాజకీయం లో
.ఇల్లు వదిలి దాదాపు పదేళ్లు బయటే ఉన్నాడు .రాగి తో చేయబడ్డ బూటు ఆకారపు వేడి నీటి తొట్టె లో స్నానం
చేసి ఆరోగ్యాన్ని పొ ందే వాడు . american consti tutional convention రాశాడు కాని దాన్ని పూర్తీ గా
ఆమోదించలేదు కాంగ్రెస్ .తన స్వీయ చరిత్ర ను రాసుకొన్నాడు .ఒక కాపీ ని జెఫర్సన్ కు ఇచ్చాడు .జార్జి వాషింగ్
ట న్ అమెరికా మొదటి అధ్యక్షుడయాడు .అవిశ్రా ంతం గా దేశానికి సేవ చేసి ఫౌండర్ ఫాదర్స్ లో ఒక్కడు అని
పించుకొన్న బెంజమిన్ ఫ్రా ంక్లిన్ 1706 జనవరి పది హేడు న బో స్ట న్ లో జన్మించి, 84 ఏళ్ళు జీవించి 1790 ఏప్రిల్
ఆదర్శాలే .
పో తాడు ,మేలాంక లిస్టు ,భగ్న ప్రేమికుడు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య అకస్మాత్తు గా మరణం ,అప్పుల అప్పా
రావు ,మాన్ ఆఫ్ మూడ్స్,నిరంతర చింతనా పరుడు ,ఉద్యోగాలలో స్తిరత్వం లేదు ,తండ్రి ఇద్ద రు పిల్లల్ని కానీ
పరారు ,తండ్రి ఆలనా పాలనా ఏమిటో తెలీని వాడు ,తల్లి విపరీతం గా కష్ట పడి సంసారాన్ని ఈదేది అది చూసి
విచలితుడుఅ యే వాడు ఆమె నే నిత్యం స్మరించే వాడు .ఎందుకూ కొరగాని వాడు అని ముద్ర పడిన వాడు.నిత్య
దరిద్రు డు . ఒంటరి తనం తో బాధ పడే వాడు డిప్రెషన్ తో నిత్యం బాధ పడే వాడు ..'ప్రేమించిన ఆమె ను తర్వాతా
ఎప్పుడో పెళ్లి చేసుకొని ,ఆమె అకాల మరణం తో తట్టు కో లేక పో యిన వాడు ,'ఇవీ అతని పై ఉన్న చీకటి కోణాలు -
''కవిత్వం లో అందం ,కొత్త దనం తెచ్చిన మొదటి తరం కవి .ఫాంటసి కి దారి చూపిన వాడు రొమాంటిక్ కవి
,కధకు చక్కని పునాదులు వేసిన వాడు కవిత్వం లో నాదాన్ని జత చేసి చెవులకు ఇంపు ,కవిత్వానికి సో ంపు
అన్ని దేశాల్లో ను ఆదర్శం గా ఉంది .దానికి మించి ఇంత వరకు ఎవ్వరు చెప్ప లేక పో యారు .పద బంధ
ప్రహేలికలను తయారు చేసి న మొదటి వాడు .సైన్స్ విషయాల లోతులు తరచి ,ఆ నాడే బ్లా క్ హో ల్స్ ను
ఊహించిన వాడు ఎన్నో పత్రిక లకు సంపాదకుని గా పని చేసిన వాడు రచన లతో జీవించ వచ్చు అని రుజువు
చేసిన మొదటి జర్నలిస్టు ,తన రచన లతో ,ప్ర పంచ దేశ సాహిత్యానికి మార్గ దర్శనం చేసిన వాడు ,స్వంతగా పత్రిక
లను పెట్టి నిర్వహించి చెయ్యి కాల్చుకొన్న వాడు ,విమర్శ కు కొత్త పంధా ను నిర్దేశించిన వాడు,ఎందరో
రచయితలకు ప్రేరణ గా నిలిచిన వాడు ,ముఖ్యం గా ప్రపంచానికి మార్గ దర్శనం చేసే కళల కాణాచి అయిన ఫ్రా న్సు
దేశ కళా కారులకు ఆరాధ్య మైన వాడు ,మంచి కళా స్రష్ట ,జీనియస్ ,బ్రిటీష వాళ్ళ జీవిత విధానాల నుంచి
,అమెరికా రచనలకు స్వంత వ్యక్తిత్వాన్ని చూపించి మార్గ దర్శి అయిన వాడు,కల కల కోసమే నని చాటిన వాడు ,
-- అన్నిటికి మించి గొప్ప స్వాప్నికుడు --ఇవీ అతని పై వెలుగులు -ఇలా చీకటి వెలుగుల అమెరక
ి ా రచయిత
పద్దెనిమిదేళ్ళ కే మొదటి కవితా సంకలనాన్ని ప్రచురించాడు పో .రొమాంటిక్ పంధాను వదిలి ,దాని
అవతలి పార్శ్వాలను ,ఎవరూ చూడని భాగాలను చూసి స్పందించి రాసిన వాడు .ఎంతో విజ్ఞా నాన్ని సంత
రించుకొన్నాడు .తన దేశ బలహీనత లను గుర్తించి వాటి లో నుంచి బయట పడాలని అమెరికా కు ఇతర దేశాలకు
తెలియ జేసిన వాడు .''నేను అనంత శోక భీకర లోకైక తిమిర పతిని ''అని కృష్ణ శాస్త్రి గారు అన్నారంటే పో మార్గ
దర్శకత్వమే అది .కీట్స్ ,షెల్లీ ల వంటి వాడు .ఆనందం వచ్చినా ,దుఖం వచ్చినా ఆపుకోలేని వాడు .తాను పతనం
కా కుండా ఉండ టానికి తాగుతున్నానని చెప్పుకొన్నాడు .ఒక సారివాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ tyler ను
పరిచయం చేద్దా మని స్నేహితులు ప్రయత్నించి తీసుకొని వెళ్తే , ఫుల్ గా మందుకొట్టి పడి పో తే ,ఇంటర్ వ్యూ ను
కాన్సిల్ చేసి తీసుకొచ్చారు .అదీ అతని మానసిక స్తితి .ఇలా ద్వంద్వ ప్రక్రు తి లో జీవించాడు .తల్లి వీధి నాటకాలు
వేసి కుటుంబాన్ని పో షిస్తూ అకస్మాత్తు గా మందూ మాకూ లేక చని పో తే ''even death might be ashamed
''అని రాసుకొన్నాడు .ఆమె త్యాగాన్ని చూసి విచాలితుడయ్యాడు .ఆమె ను గురించి మాట్లా డా లంటేనే భయ పడి
పో యే వాడు .
వర్జీఎనియా వర్సిటి లో చదివి నప్పుడు అందరిలోనూ చదువు లో ముందుండే వాడు .అక్కడ సరదాకి
''తాగుడు పో టీలు ''ఉండేవి .అందులో పాల్గొ ని విజేత అయ్యాడు .తాగు బో తూ కాదు .డబ్బు లేక జూదం ఆడే వాడు
.దానికోసం అప్పులు చేసే వాడు .డబ్బు ఇవ్వక పో తే బెదిరించటం కోదా అలవాటైంది .పరిస్థితులు వాతా వరణం
అతన్ని అలా చేశాయి .అత్యధిక ప్రతిభ తో పని చేస్తు న్నప్పుడు ,ప్రముఖ రచయిత గా చేలా మని అయినప్పుడు
రచన ''జీవిక ''అవు తుందని అతను భావించలేదు .కాని అదే అయింది .రచనలకు ప్రశంశ ళు ,బహుమతులు
పొ ందాడు .the raven అనే రచన టో ఒక్క సారి గా మహా రచయిత అని పించు కొన్నాడు .ఎపత్రికా సంపాదకుని గా
పని చేసినా పూర్తిగా అయిదు వేళ్ళూ నోట్లో కి వెళ్ళే జీతాలేమీ ఇవ్వ లేదు .ఉద్యోగ భద్రతా లేదు .ఆర్మీ లో పని చేసి
అధికారుల మెప్పూ పొ ందాడు .మంచి కాన్ద క్టు సర్టి ఫికేట్టూ సంపాదించాడు .సమర్ధు డని పేరు వచ్చింది .అయినా
ప్రపంచ ప్రసిద్ధ రచయిత లైన ఇలియట్ ,యేట్స్ ,రికీ అందరు పో వలన ప్రభావితు లైన వారే .ఫ్రెంచ్ రచయిత
బాదర్లేన్ అతని దారి లోనే నది చాడు .the best of poe is very nearly beyond improve ment ''అని ప్రశంశలు
పొ ందాడు .అతని ప్రభావం రష్యా ,కెనడా ,అర్జెంటీనా నుండి స్కాండినేవియా దేశాల వరకు ఉంది .సంగీతం ,సైన్స్
,ఆర్ట్ ,సింబాలిజం లలో పో ప్రభావం పడనీ దేశమే లేదు .మాటర్ లింక్ ,దయోల్ ,జూల్స్ వేర్న్ ,స్విన్బర్న్ దాస్తో
విస్కీ వంటి ప్రసిద్ధ రచయిత లంతా ''పో రచనా విస్కీ ''ని తాగిన వారే
.''a creative genius who falls just sort of the supreme masters ''--''poe is ajust judje some times the
justest ever to pass a verdict on the writ to question ''--''his criticism is derogatory and just ''--'tere is
no other such critic al survey in our literature ''అని ఎడ్గా ర్ అల్లా న్ పో ను అత్యద్భుతం గా విశ్లేషించి అతని
భావాన్ని పొ దగా గల మాటల పొ దుపరి .హాస్యానికి ,హారర్ కు సమ ప్రా ధాన్యమిచ్చి రచన చేశాడు .అతను యదార్ధ
వాడి ,ప్రతీక వాది,సర్రియలిష్టు ఇన్ని గొప్ప లక్షణాలున్న పో రచనలను ఫ్రెంచ్ ఫాషన్ లో విశ్లేషించాలి అన్నాడు
టి.ఎస్.ఇలియట్ .అందుకే ఫ్రెంచ్ వారికి పో ''క్లా స్సిక్ ''అన్నారు .బాల్జా క్ ,డికెన్స్ ,టాల్స్టాయ్ సరసన కూర్చో బెట్టా రు
.అతను చెప్పిన ''art is its own reward ''అన్న మాట ఫ్రెంచ్ వాళ్ల కు బాగా నచ్చింది .అడుకే ఫ్రెంచ్ రచయితలు
,కవులు అందరు made of Poe ''అని పించుకొన్నారు .ఇంతకీ కల కల కోసమే నని ఘంటా పధం గా చెప్పిన
అయిన స్టీన్ తండ్రి ధన వంతుడే మీ కాదు .రియల్ ఎస్టేట్ బిసినెస్ లో చేతులు కాల్చు కొన్నాడు
.అందుకని స్కూల్ మానేయాల్సి వచ్చి ,స్వతంత్రం గా లెక్కల మీద దృష్టి సారించాడు .పదహారేళ్ళ
వయసు లో స్విస్స్ స్కూల్ లో pure mathematics వదిలేసి భౌతిక శాస్త ం్ర వైపు మళ్ళాడు .ఇక్కడ
కూడా స్వతంత్రం గానే చదువు కొన్నాడు .కాలేజి క్లా సులకు హాజరు కాకుండా పరిశోధన శాలలో
ప్రయోగాలు చేస్తూ ,తన స్వీయ భావాలను రాసుకొంటూ గడిపాడు .గ్రా డ్యు ఎషన్ సాధించాడు .అయితే
ఫిజిక్స్ లో శిక్షణ పొ ంద టానికి ‘’ అసిస్టంట్ షిప్ ‘’నిరాకరించారు బెర్న్ లోని .పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం
లో చేరాడు .అందులో తన మనో భావాలన్నీ పరి పక్వం అయాయి అని రాసుకొన్నాడు ‘’that secular
cloister where i hatched my most beautiful ideas ‘’అని కవితాత్మకం గా చెప్పుకొన్నాడు .తనతో
పాటు చదువుకొంటున్న’’ మిలేవా మారిక్ ‘’అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఇద్ద రి ఆర్ధిక పరిస్థితీ
ఒక్కటే .పేదరికమే .దాన్ని గురించి ఆయన ‘’in my theories i put a clock at every point in
space ,but in reality I can hardly afford one for my house ‘’అంటాడు .చాలా మందికి తెలిసే
ఉంటుంది –ఐయిం స్టీన్ క్లా క్స్ గురించి .అంత రిక్షం లో ఊహల్లో చాలామూలల్లో గడియారాలను ఏర్పాటు
చేశాను కాని ఇంట్లో ఒక్క గడియారం కొంటా నికైనా డబ్బు లేదు అని ఆయన భావం .అయితే ఆఊహా
గడియారాలు బానే డబ్బును వర్షించాయి .1905 లో ఆయన the electro dynamics of moving
bodies మీద ఒక పేపర్ ప్రకటించాడు .ఇదే ఆయన సాపేక్ష సిద్ధా ంతం మీద విడుదల చేసిన మొదటి
పేపరు .అందులో కాంతి వేగం అన్నిటి కంటే చాలా ఎక్కువ అని చెప్పాడు .అంతే కాదు ఆ వేగం లేక
వేలాసిటి అందరికి ,ఎక్కడ ఉన్నా సమానం గా నే ఉంటుంది అనే గొప్ప ఆలోచన బయట పెట్టా డు .అంటే
ఏకాలం లో నైనా కాంతి సెకనుకు 3,00,000 కి.మీ .వేగం తో ప్రయాణం చేస్తు ంది .ఇంకా యే వస్తు వు
వేగమైనా ప్రా ంతం, కాలం బట్టి మారవచ్చు కాని కాంతి వేగం చచ్చినా మారదు .అని ఘంటా పధం గా
రుజువు చేశాడు .మిగిలిన వన్నీ సాపెక్షాలే కాని కాంతికి సాపేక్షత లేదు .కాలం, ద్రవ్య రాసి ,స్పేస్ మారి
పో తాయి .ఈ సిద్ధా ంతం తో పాత సిద్ధా ంతాలన్నీ మారి పో యాయి .దీని తర్వాతా ఆయన సామాన్య సాపేక్ష
సిద్ధా ంతాన్ని వివరించాడు .అందులో వస్తు వుల త్వరణ వేగాన్ని దృష్టిలో పెట్టు కోవాలని సూచన చేశాడు
.దీనితో అయిన స్టీన్ ఒక కొత్త భావానికి తెర లేపాడు .అదేమిటి అంటే సైన్స్ సరి అయిన రుజువు ను
ఇవ్వలేదు అందుకే సరైన నిర్ణ యాలకు రాలేము అంతే కాక మన నిర్ణ యాలు conjectures మాత్రమే
అన్నాడు .దీనికి కారణం విశ్వం లో లెక్కకు మించిన విషయాలను గమనించాల్సి వస్తు ందని ,అవి
ఎప్పటికప్పుడు మారి పో తు ఉంటాయని అన్నాడు .అందుకే సైన్స్ ఖచ్చిత మైన నిర్ణ యాలకు
రాలేము( nothing can be proved decisively ‘’) అని తేల్చి వేశాడు మహా మేధావి అయిన స్టీన్ .
.1932 లో జర్మని లో జాతి దురహంకారం పెచ్చు పెరగటం తో ,అమెరికా వారు అంతకు ముందే
ఆహ్వానించిన ఆహ్వానాని మన్నించి అమెరికా చేరాడు .అక్కడ జర్మనీ లో యూదు అవటం వల్ల ఆయన
సాపేక్ష సిద్ధా ంత కాగితాలన్నీ తగల బెట్టి ,వాళ్ల అహంకారాన్ని రుజువు చేసుకొన్నారు .ఇక్కడ ఒక
మేధావికి ఘన స్వాగతం లభించింది .ప్రిన్ స్ట న్ లో అడ్వాన్సెడ్ స్ట డి బో ధించా టానికి చేరాడు .1955 లో
మరణించే వరకు అక్కడే పని చేశాడు .
వేసవి కాలాన్ని లాంగ్ ఐలాండ్ లో ‘’ నాసువా పాయింట్’’ వద్ద గడిపే వాడు .నౌకా విహారం
సంగీతం లతో చుట్టూ ప్రక్కల వారితో కాల క్షేపం . .ఒక ఉత్త రం లో మానవ క్రూ రత్వం ,పైశాచిక చేష్టలు
ఇంత దారుణం గా జర్మనీ లో జరుగుతుండటం మానవత్వానికే సిగ్గు చేటు అని వాపో యాడు .మొదటి
ప్రపంచ యుద్ధా న్ని ఏవగించుకొని యువకుడు గా ఉండగానే జర్మన్ పౌరసత్వాన్ని వదులు కున్నాడు
.హిట్లర్ కు ఆయుధాలతోనే బుద్ధి చెప్పాలని గాదంగా భావించాడు .అణు విచ్చేదాన్ని అమెరికన్ శాస్త ్ర
వేత్తలు, మిలిటరి చేస్తు న్నారని తెలుసు కొని, ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ను సమరర్ధించమని ఉత్త రం రాశాడు
.యుద్ధా నంతరం హిట్లర్ పతనం తర్వాథ ‘’హీరో శీమా’’ పై ఆటం బాంబ్ ప్రయోగం జరిగిన తర్వాత అణు
విచ్చదం వల్ల ఏర్పడిన ఆటం బాంబు ను ఇంక యే దేశం మీదా ప్రయోగించ వద్ద ని గట్టిగా చెప్పాడు .
చిన్నప్పటి నుంచి ఒంటరిగా గడపటం అయిన స్టీన్ కు ఇష్ట ం అని తెలియ జేసుకొన్నాడు .తాను
ఇంత ప్రపంచ ప్రసద
ి ్ధ వ్యక్తీ అయి ఉండి కూడా ఒంటరిగా ఉండటం ఇష్ట మంటే వింతగా ఉంటుంది అంటాడు
.ఆయన 1879 లో జన్మించి76 ఏళ్లు జీవించి1955 లో మరణించాడు . 1921 లో ఆయన న్యూయార్క్
మొదటి సారిగా వీజ్మన్ తో కలిసి .జెరుసలెం లో హిబ్రు యుని వేర్సిటి కి నిధుల సేకరణకు వచ్చాడు
.అమెరికా లో అందరు ముఖ్యం గా యూదులు ఆయన ను చూడ టానికి ఎగ బడ్డా రు .వై హౌస్ లో ఘన
స్వాగతం లభించింది .ఎక్కడ చూసినా జన సముద్రం ఆయన్ను ఆప్యాయం గా పలకరించి .ఆయన
ఉపన్యాసాలను శ్రద్ధ తో విన్నారు .ఆయన తన సాపేక్ష సిద్ధా ంతాన్ని జెర్మని భాష లోనే వివ రించటం కొస
మెరుపు .
ముగ్గు రు మహాను భావులు
విల్ డ్యురాంట్ అనే గొప్ప రచయిత ను తనకు నచ్చిన పది మంది మేధావులను ,పది మంది కవులను
,పది మంది తత్వ వేత్తలను చెప్ప మంటే ఆయన చైనా తాత్వికుడు కన్ఫ్యూజియాస్ ను ,అమెరికా
జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను ,జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుల్ కాంట్ ను పేర్కొన్నాడు .వీరే అన్ని
కాలాలను చెందిన మహాను భావులు అన్నాడు . ఇప్పుడు వారిని ఆయన మాటల్లో నే సంక్షిప్త ం గా
పరిచయం చేస్తు న్నాను .
కన్ఫుసియాస్
మానవ నాగరిక చరిత్ర అంతా మానవ ఆలోచన మీదనే ఆధార పడింది .అందులో ప్రపంచాన్ని చైనా ను
ప్రభావితం చేసన
ి కన్ఫుసియాస్ ను ముందు పేర్కొనాలి .ఆయన జీవితం అంతా మతాతీత మైన ఆలోచన
ల తోనే గడిచింది .అతీత శక్తు లకు ఆయన ప్రా ధాన్యం ఇవ్వ లేదు .కన్ఫూజన్ స్థితి లో ఉన్న చైనా
సమాజానికి ఆరోగ్యం ,క్రమ పద్ధ తి ణి ఇచ్చి దారి చూపిన ఆలోచనా పరుడు .
జ్ఞా నన్ని పెట్టు బడి పెడితే వస్తు వులేర్పడతాయి .అప్పుడవి ఉన్న రూపం లో అంటే యదార్ధ రూపం లో
.కనీ పి స్తా యి .అలా కనీ పించి నపుడు విజ్ఞా నం పూర్తిగా ,సంపూర్ణ ం గా లభిస్తు ంది .విజ్ఞా నం సంపూర్ణం
అయితే ఆలోచనలు చాలా నిర్దు ష్ట ం గా ఉంటాయి .అప్పుడు ఆత్మలు పరిశుద్ధ మై పరి పూర్ణ మై
వికశిస్తా యి .అలాంటి స్థితిలో వ్యక్తు లకు సంస్కారం సంపూర్ణ ం గా లభిస్తు ంది ..అప్పుడే వారి కుటుంబాలు
పధ్ధ తి లో ఉండ గలుగు తాయి .దానితో సమాజం మంచి విధి విధానం లో ఉంటుంది .దాని వల్ల రాజ్యం
లేక దేశం సరైన మార్గ ం లో ప్రగతి పధం లో ముందుకు వెడుతుంది .ఈ ప్రభావం వల్ల ప్రపంచం అంతా
సుఖ సంతోషాలతో సమగ్రంగా వికసిస్తు ంది .ఇదీ కన్ఫూసియాస్ ఇచ్చిన అతి ముఖ్య మైన సందేశం .ఇదే
ఆయన చైనా దేశానికిచ్చిన నైతిక ,రాజకీయ వేదాంతం .దీన్ని మనం ఆలోచిస్తే stoicism కు ఆయన
భావాలు దగ్గ ర గా ఉన్నట్లు అని పిస్తు ంది .ఆయన ఎప్పుడూ ,ఎక్కడా ''మనుషులు అంతా ఒక్కటే''అని
చెప్ప లేదు .తెలివితేటలు అనేవి అందరికి లభించే కానుక కాదు అన్నాడు (intelligence is not
universal gift).అయితే తెలివి తక్కువ దద్ద మ్మ లకు రాజ్య నిర్వహణా ,ప్రజా పరి పాలనా ఇవ్వ వద్దు
అని ఖచ్చితం గా చెప్పాడు .తెలివి ,ఆలోచనా ఉన్న వాళ్ల నే పరి పాలకులు గా ఏర్పాటు చేసుకోవాలని
హితవు చెప్పాడు . ఆయన జీవిత కాలం2500 సంవత్స రాలకు పూర్వం .ఆయన చెప్పినవన్నీanelets గా
శిష్యులు రాశారు .చైనా ను పాలించిన రాజ వంశాలన్ని కన్ఫూసియాస్ సిద్ధా ంతాలను ఆదర్శం గా
చేసుకొనే పాలించారు .206 బి.సి.-220.--ad లో పాలించిన వారు .చైనా ను ఏకం చేసిన క్విన్ వంశీయుడు
చాన్కైషేక్ 221 ఏ.డి.1966-76 కాలం నాటి cultural revolution వరకు ఆయనే ఆదర్శం .1978 లో den
xiiao ping కూడా అవే ఆదర్శాల తో చైనా ను ఆర్ధిక సామాజిక రంగాలలో అభి వృద్ధి చేశాడు .ప్రపంచం
లో చైనా కు అగ్రా సనాది పత్యం సాధించాడు .1949 లో మావ సే టుంగ్ జెడాంగ్ పాలన నుంచి ,కాపిట
లిస్తిక్ భావాలను అరువు తెచ్చు కొని ,ముందుకు నడి పించాడు .getting rich is glorious అనేది డెంగ్
నినాదం .అన్నీ సాధించినా ధనిక ,పేద ల మధ్య దూరం పెరిగింది .అవి నీతి అధర్మం పెరిగాయి .ప్రజలు
ఒక సారి వెనక్కి తిరిగి చూసు కొని మళ్ళీ కన్ఫూసియాస్ మాత్రమె దేశానికి శరణ్యం అను కొన్నారు .
2000 ఏళ్ళ క్రితం హాన్ వంశానికి చెందిన''వు''అనే రాజు అంతకు ముందున్న వంద మంది తత్వ వేత్తలను
దూరం పెట్టి అన్ఫూసియాస్ సిద్ధా ంతాన్నే అమలు చేశాడు .వెయ్యేళ్ళ క్రితం సాంగ్ వంశానికి చెందిన zhao
pu అనే మొదటి ప్రధాని ''కన్ఫూసియాస్ పుస్త కం లో సగ భాగం చాలు ప్రపంచాన్ని పాలించ టానికి ''అని
గర్వం గా ప్రకటించాడు . కనుక అయన ప్రభావం అంత తీవ్రం గా అప్పటి నుండి ,ఇప్పటి వరకు కోన
సాగుతూనే ఉంది .
కన్ఫూసియాస్ చనిపో తే ఆయన అంత్య క్రియలను పరమ వైభవం గా జరిపంి చారు ప్రజలు .ఆయన
సమాధి దగ్గ ర చాలా మంది గుడిసెలు వేసుకొని మూడేళ్ళు ఏడుస్తూ కూర్చుని శ్రద్ధా ంజలి ఘటించారట
.అంతా వెళ్లి పో యినా tse king అనే శిష్యుడు మాత్రం ఇంకో మూడేళ్ళు అంటే మొత్త ం ఆరేళ్ళు గురువు
గారి సమాధి దగ్గ రే గడిపి జన్మ ధన్యం చేసు కొన్నాడట .దటీజ్ కన్ఫోసియాస్ .
విట్మన్ స్వీయ వ్యక్తిత్వం ,ప్రజాస్వామ్య భావం ,ఊహ ,సాను భూతి ,అను కంప ,ప్రజలను దగ్గ రకు
తీసుకోవటం ,ప్రపంచానికి సలాం చేయటం మనల్ని అబ్బుర పరుస్తా యి .ఇంగ్లీష వాళ్ళ వ్యామోహం లో
ఇప్పటి దాకా నడిచిన అమెరికా కవిత్వం ఆత్మను వెతుక్కొందిప్పుడు .తానేమిటో తెలుసు కొంది .ఆ
మార్గ ం వదిలి అసలైన అమెరికా కవిత్వాన్ని చవి చూసింది .అదీ విట్మన్ చేసన
ి అద్భుతం .మొదట్లో
''ఇదేమి కవిత్వం ?''అని ఈసడింన్చినా చివరికి ''ఇదే కవిత్వం మన కవిత్వం ''అని నిర్ణ యానికి వచ్చారు
.కొత్త ను వింతగా చూడటం లోపలి దాకా వెళ్లి పరిశీలించకుండా నే రోత అని చెప్పటం అన్ని దేశాల్లో నూ
ఉంది .ఇక్కడా ఉంది .విట్మన్ ను ఆకర్షించిన మహా వ్యక్తీ అమెరికా యోగి, తాత్వికుడు, రచయిత
ఎమర్సన్ మాత్రం పులకించి పో యాడు .i find it the most extrordinary piece of witand wisdom
America has yet contri buted ''అని మనస్పూర్తిగా ప్రశంశా వర్షం కురిపించాడు .ఇప్పుడు విట్మన్ మహా
కవి కవితా పంక్తు ల్ని కొన్ని దర్శిద్దా ం .
''if you want me again ,look for me under your boot soles --you eill hardly know who i am
But I shall be good health to you never less -and filter and fiber your blood
feeling to fetch me at first ,keep enquired --Missing me one place ,search another -i stop some
where waiting for you ''
విట్మన్ పేరు లో నే విట్ ఉంది ,మాన్ ఉన్నాడు అంటే అతను మనిషి కోసమే జీవించిన కవి .తనకు ,తన
కవిత్వానికి మనిషే ఆధారం మనిషి లో తనను ,తనలో సకల చరాచారాన్ని చూసుకొన్న ఉత్త మ కవి
విట్మన్ ..
''kant rescued mind from matter .He brought life a magician wisethe dear beliefs of ancient
faiths '' అని కీర్తించాడు విల్ డ్యురాంట్ .19 శతాబ్ద ం అంతా కాంట్ ప్రభావానికి లోనైంది ''back to kant''
అనేది మహో ద్యమం గా సాగింది .అంటే ఆయన ఆలోచనా ధో రణి ఎంత పరి పక్వ మైనదో తెలుస్తో ంది ..
''all reality of matter ,all nature with its laws are but constructs of the mind ,possibly but never
certainly known in their own elusive truth ?kant had battle won against matirialism and
atheism and the world could hope again ''అని భౌతిక వాదం నాస్తిక వాదాలను జయించి ఆధ్యాత్మిక
వాదానికి అపర శంకరులుగా కాంట్ మార్గ దర్శనం చేశాడు .
న్యూజిలాండ్ లోని సంపన్న కుటుంబం లో 1888 అక్టో బర్ నాలుగున కేథరీన్ పుట్టింది
.చిన్నప్పటి నుండి రచయిత కావాలనే తపన ఉండేది ..లండన్ లో చదువు కొన్నది .సంగీతం కూడా
బానే నేర్చింది .స్కూల్ న్యూస్ పేపర్ల లో చాలా రాసింది .ఆస్కార్ వైల్డ్ లాంటి ప్రముఖ రచయితల నందర్నీ
చదివి జీర్ణించు కొంది .మూడేళ్ళ తర్వాతా మళ్ళీ న్యుజి లాండ్ చేరింది .మంచి కుర్రా ణ్ణి చూసి పెళ్లి
చేయాలని తలిదండ్రు లు భావించారు .కాని ఆమె లో తిరుగు బాటు తనం ఎక్కువ .artistic
adventurous society తో అనుబంధం పెంచు కొన్నది .ఆస్ట్రేలియా మాగజైన్స్ కు రాస్తూ ఉండేది .మళ్ళీ
లండన్ చేరింది .విశృంఖలత ఆమె లక్షణం అయింది .కడుపు వచ్చిందని తెలిసి మూడు వారాల
పరిచయం మాత్రమే ఉన్న జార్జి బౌడెన్ ను పెళ్లి చేసుకోంది .ఆమె కడుపులోని బిడ్డ కు అతడు తండ్రి
కాదు .పెళ్లి రోజున నల్ల డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకొన్నది .ఆ రాత్రే అతన్ని ఓది లేసంి ది తల్లి ఈమె ను
భరించలేక ఆర్టిస్ట్ లకు దూరం గా ఉంచాలనే కోరికతో లండను కు తీసుకొని వచ్చింది ..జర్మని లో’’’
స్పా’’లో బో హీమియన్ ఆర్టిస్ట్ లకు దూరం గా చేర్పించింది ..అయినా ఆమె తిరుగుళ్ళు మాన లేదు
.మళ్ళీ కడుపు వచ్చి పో యింది .లండన్ తిరిగి వచ్చి రచన లో నిమగ్న మయింది .
In a German pension నే కధా సంకలనాన్ని 1911 లో విడుదల చేసింది ..జాన్ ముర్రే అనే
అతని తో పరిచయం పెంచు కొంది .అతను లిటరరీ మాగజైన్ ఎడిటర్ .పెళ్లి అయినా ఆమె అఫైర్ లకు
అడ్డూ ,ఆపు లేదు .ఇద్ద రు కలిసి’’ బ్లూ రివ్యు ‘’పత్రిక నడిపారు .మూడేళ్ళ తర్వాత పత్రిక పడకేసింది
.డి.హెచ్.లారెన్స్ లాంటి ప్రముఖులతో బాగా పరిచయమేర్పడింది .పాత భర్త బాడెన్ తో విడాకులు పొ ంది
ముర్రే ను పెళ్లి చేసుకోంది .1917 లో క్షయ వ్యాధి సో కింది .అయినా రచన చేస్తూ నే ఉంది .Bliss and
other stories ప్రచురించింది .మంచి పేరొచ్చింది .garden party and other stories రాసి ప్రచురించి
మంచి ఆదరణ పొ ందింది .ఆరోగ్యం మీద ఇప్పుడు శ్రద్ధ కలిగింది .ఫ్రా న్స్ చేరింది .భర్త ముర్రే కు దూరం గా
ఉన్నా ,ఆమె ఉత్త రాలు ,కధలను ప్రచురిస్తూ నే ఉన్నాడు .1923 లో 34 ఏళ్ల కే కేథరీన్ టి.బి.తో
అల్పాయుర్దా యం తో మరణించి సాహితీ లోకానికి తీరని లోటు కల్గించింది .
మాన్స్ ఫీల్డ్ ముఖం చూస్తె ధైర్యం ,వ్యతిరేక భావం ,స్వీయ వ్యక్తిత్వం ,ఆత్మా స్థైర్యం ,ఒకే
భావానికి కట్టు బడటం ,వాదనా సామర్ధ ్యం ఎల్యుసివ్నేస్స్ కని పిస్తా యి .ఇవన్నీ ఆమె రచనల లోను ప్రతి
ఫలిస్తా యి .బెర్ట్రా ండ్ రసెల్ ఆమె మేధస్సును మెచ్చి వశ పరచు కోవాలని ప్రయత్నిస్తే ఆమె వలలో పడ
లేదు .వర్జీనియా ఉల్ఫ్ తనకు సాహిత్యం లో ఎవరు పో టీ కాని ,సాటి కాని లేరని అన్నది .కాని కేథరిన్
విషయం లో’’ stank like a ciret cat that has taken to street walking ‘’అంటూ ‘’I suppose her in
my own way ‘’అని మెచ్చింది .కేథరిన్ రచనల పై మాత్రమే అసూయ అని ఆమె పై కాదని చెప్పింది
ఉల్ఫ్ .ఆల్ద స్ హక్స్లీ ,క్రిస్టఫర్ కొలంబస్ లు కేథరీన్ వాడిన అనేక మాటలనే తమ రచన లలో వాడారు
.లారెన్స్ తన ‘’women in love ‘’నవల లో gudrem అనే పాత్ర ను కేథరీన్ ను దృష్టి లో పెట్టు కొనే
రాశాడని అంటారు .అందులోని గుద్రేన్ ఎవరో కాదు -మాన్స్ ఫీల్డ్ .వీ ఇద్ద రు రచయితలకు సయోధ్య
బానే ఉన్నా ఒక సారి ఆమెను ‘’you are a loathe so me reptile ,i hope you will die ‘’అని
శపించాదట . కాతేరీన్ కు తన అస్తిత్వం మీద నమ్మకం లేదు .తళుక్కు మని మేర వాలనే ఆరాటమే
ఎక్కువ .జపాన్ బొ మ్మ లాగా హెయిర్ ట్ తో ఉండేది .కాని ఆమె కాలం లో స్త్రీలు అందరు ఎద్వర్దియాన్
ఫాషన్ లో ఉండే వారు .వారికి ఈమె పూర్తి విరుద్ధ ం ..ఆకర్షణ గా ఉండే ప్రత్యెక దుస్తు లను ఆర్డ ర్ ఇచ్చి
తయారు చేయించు కొనేది .ఆమె రచన ల న్నిటి లో సంస్కృతి విహీనత కన్పిస్తు ంది .’’life and work
are one thing ,indivisible ‘’అనేది ఆమె సిద్ధా ంతం .ఎలా ఉండేదో అలానే రాసేది .రెంటికి తేడా
ఉండకూడదని భావించేది .విశృంఖలత తో వీర విహారం చేసింది .ఆడ ,మగా అనే తేడా లేకుండా తిరిగింది
.దాని ఫలితమూ అనుభ వించింది .ఎంత బాధ లో ఉన్నా ,చాలా ధైర్యం గా’’ డేర్ డెవిల్’’ లా రచనలు
చేసింది .ఆమె విమర్శకుల దృష్టిని ఆకర్షించిన రచయిత అవటం గొప్ప విషయం .అందుకే ఆమెను’’
రైటర్స్ రైటర్ ‘’ అని విమర్శక లోకం గౌరవించింది .ఆమె రాసింది అంతా ‘’post modernism
‘’భావజాలంతో రాసింది .అప్పటికి ఆమె దానికి బీజాలు వేసిన రచయిత్రి .ఆమె చని పో యి నప్పుడు ఆమె
సమకాలీన రచయిత లందరూ ‘’our missing cotemporary ‘’అని కితాబు ఇచ్చారు .
వర్జీనియా ఉల్ఫ్ కు కేథరీన్ తో పరిచయం లేక పో తే;; Mrs Dollway ‘’నవల రాసి ఉండేది కాదు
అని విమర్శకుల అభి ప్రా యం ‘’.process of writing ‘’మీద అద్భుత రచనలు చేసి మార్గ దర్శకత్వం
చేసింది .ఆమె రాసిన ఉత్త రాలు ,నోట్ బుక్స్ అన్నీ సాహిత్య స్థా యిని పొ ందాయి .అంత వరకు యే
రచయితకు ఇది దక్క లేదు .తన స్వీయ అపజయాలతో విశ్వ శోధన చేసిన మహా రచయిత్రి కేథరీన్
.పో స్ట్ ఇంప్రెషన్ భావాలు ,ఆ పెయింటింగ్స్ ఆమె కు అధిక ప్రేరణ కల్గించాయి .
1923 లో gurdjeff లో మానసి క ప్రశాంతత కోసం చేరింది .మనసు సరిగ్గా పని చేస్తే
శరీర ఆరోగ్యం బాగా ఉంటుందని ఇప్పటికి తెలిసింది ‘’హెమరేజ్’’ వచ్చింది .కుటుంబ డాక్టర్ జేమ్స్ యంగ్
చేతుల్లో ప్రా ణాలు విడిచింది .తాను చూపించి నంత ప్రేమ భర్త ముర్రే తన పై చూపించ లేదని మనో వ్యధ
చెందింది .తన ఆస్తినంతా తనకు సహాయం గా ఉంది సేవ చేసిన ‘’idaa bekar ‘’కు ఇచ్చేసింది .భర్త
ముర్రే ఆమె మరణం తర్వాత ఆమె రచన లన్ని ప్రచురించి కాష్ చేసుకొన్నాడు. ఆమె మరణానికి
స్పందిస్తూ ముర్రే ‘’catherine ‘s love survived her own physical death ‘’అన్నాడు .
డిప్రెషన్ కాలమ్ లో అమెరికా లని మాసా చూసేత్స్ లో ఉన్న జమైకా కాప్లేయిన్ నైబర్ హుడ్
లో 1932 అక్టో బర్ 27 న జన్మించింది సిల్వియా పాత్ .తల్లి ఆస్ట్రియన్ అమెరికా
మొదటి తరానికి చెందిన స్త్రీ .తండ్రి జర్మన్ .ఆయన బో స్ట న్ universiti
లో జూవాలజి ప్రొ ఫెసర్ గా పని చేస్తూ బంబుల్ బీస్ మీద పుస్త కం రాశాడు .మూడేళ్ళ వయసు లో
ఈమె కుటుంబం విన్త్రా ప్ కు మారింది .ఆమె రాసిన మొదటి కవిత బో స్ట న్ హెరాల్డ్ లో పడింది .పైంటింగ్ లో
అవార్డ్ గెల్చుకొంది .unitreriyan క్రిస్టియన్ గా ఉండేది ..ఎనిమిదవ ఏట తండ్రి మరణించాడు .కాలేజి లో
చేరింది .''పుచ్చకాయ పండి విచ్చు కొన్నట్లు గా ప్రపంచం కని పిస్తో ంది ''అని రాసుకొంది .ది స్మిత్ రివ్యూ కు
ఎడిటర్ అయింది .న్యూయార్క్ సిటిఉండి విశ్లేషనాత్మక వ్యాసం రాసిఅనుభవాలను ''బెల్ జార్ ''అనే నవల
లో పొ ందు పరిచింది .హార్వర్డ్ రైటింగ్ స్కూల్ లో ప్రవేశానికి ప్రయత్నిస్తే తిరస్కరించారు .
దీనితో డిపష
్రె న్ కు లోనైంది .ఎలక్ట్రో కన్వల్సివ్ తెరపి జరిపారు .బాధ భరించ లేక 1953 లో
మందులు మింగి ఆత్మ హత్య కు ప్రయత్నం చేసింది .పాపం మళ్ళీ చికిత్స చేయించు కొన్నది .
ఇక సైకియాట్రిక్ కేర్ లో ఉంచాల్సిన స్థితి ఏర్పడింది .ఇన్సులిన్ షాట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది .కొంత
నయం అయింది .మళ్ళీ కాలేజి లో చేరంి ది .1955 లో దాస్తో విస్కీ నవల మీద ''మాజిక్ మిర్రర్ ''అ పేర
తిసీస్ సమర్పించింది .అంత అనారోగ్యం గా ఉన్నా ఆమె లో సాహిత్య సృజన ఆగలేదు .గ్రా డ్యుయేట్
అయింది .ఫుల్ బ్రైట్ స్కాలరశిప్ తో కేంబ్రిడ్జి కాలేజి లో చేరి రచన కొన సాగించింది ''.వర్సిటి ''అనే కాలేజి
మాగా జైన కు విపరీతం గా రాసేది .
1961 లో టేల్ హఘ్ అనే ముజిసియన్ ను పెళ్లి చేసుకోంది .ఇప్పటి నుంచి జ్యోతిషం మీద
,అతీత శక్తు ల మీద నమ్మకం బాగా పెరిగింది .1958 లో దంపతులు బో స్ట న్ చేరారు .అక్కడ సైకియాట్రిక్
కాలేజి లో రిసప
ె ్ష నిస్ట్ గా పని చేసింది
.ఈ విషయం చదివితే మనకు రామినీడు తీసిన సినెమా ''చివరికి మిగిలేది ''లో
సావిత్రి పాత్ర గుర్తు కు వస్తు ంది .క్రియేటివ్ రైటంి గ్ సెమినార్ లో పాల్గొ ంది .మహిళా పక్ష పాతి గా రాసేది
.తన అనుభావాలన్నిటిని ఎప్పటికప్పుడు రాసేది .జంట కెనడా మొదలైనవి తిరిగి బ్రిటన్ చేరారు .1960
లో మొదటి కవితా సంకలనం '' కలోస్సాస్''ప్రచురించింది . తన ఆత్మ కధను అంతా నిక్షిప్త ం చేసి ,''the
bell jar ''నవలను పూర్తి చేసింది .భర్త కు తేనెటీగల పెంపకం పై ఆసక్తి ఎక్కువ.దాని పై కవితలు రాసి
మెప్పు పొ ందింది .భర్త ఇంకో అమ్మాయి తో అఫైర్ సాగించాడు .ఈమెకు కార్ ప్రమాదం జరిగంి ది .
1962 లో ఆమె కవితా ప్రవాహం ఉధృతం గా ఉంది .ఒంటరి గా పిల్లలతో లండన్ తిరిగి వచ్చింది
.అద్దె ఇంట్లో కాపురం .ఆ ఇంట్లో నే ఒకప్పుడు w బి..యేట్స్ కవికవి ఉన్నాడు అని సంబర పడింది .ఆ
సంవత్సరం శీతాకాలం లో వందేళ్ళ లో
ఎప్పుడు లేనంత చలి విపరీత మై,నీతి గొత్త కల్లొ నీరు గడ్డ కట్టేసింది .పిల్లలకు జబ్బులు .టెలిఫో న్ సౌకర్యం
లేదు .ఇవన్నీ మళ్ళీ డిప్రెషన్ కు దారి తీశాయి ఆ అభాగ్యురాలికి .మరుసటి ఏడాది బెల్జా ర్ నవల
విడుదల అయింది .ఈ నవలను ''విక్టో రియా లూకాన్ '' అన్న మారు పేరు తో రాసింది డాక్టర్ జాన్ హో ర్ద ర్
ఆమె దయనీయ స్థితి ని గమనించి హాస్పిటల్ లో చేర్పించా టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .అఆమే
ఒప్పు కోలేదు .తప్పని సరి పరిస్థితులలో ఒక నర్సు ను తానే ఏర్పాటు చేశాడు .డాక్టర్ల లోను మాన
వత్వం ఉంటుందని రుజువు చేశాడు .ఆమెకు'' ఆంటీ డిప్రెషన్ ''మందుల్ని వాడాడు .అంతకు పూర్వం
ఆమెకు జరిగిన చికిత్స లో డాక్టర్లు ఇంక ఏ పరిస్తితుల్లో ను ఆ మందులు వాడకూడదని సలహా ఇచ్చారు
.కానీ ఈ డాక్టరు ఆ విషయం తెలిసో తెలీకో వాడే శాడు .1963 ఫిబవ
్ర రి పద కొండున ,సిల్వియా పాత్ తన
పిల్లల్ని రాకుండా తలుపులు బంధించుకొని గాస్ స్ట వ్ఓవెన్ లో తలను -ఉంచుకొని
కార్బన్ మొనాక్సిడ్ వాయువు పీల్చి చని పో యింది .పాపం తానెం చేస్తో ందో ఆ అభాగినికి తెలీదేమో ?
పాత్ ను అందరు'' symbol of blighted female genius ''అని ప్రస్తు తించారు .ఆమె కవిత్వం
అంతా చంద్రు డు ,రక్త ం హాస్పిటల్స్ fetues ,పుర్రేలే .ఆమె ఇంట్లో పూర్వం కాపురం ఉన్న ఈట్స్ కవి కూడా
ఇలానే రాసే వాడు'' .పో ఎమ్స్ ఫర్ బర్త్ డే'' లో ఏడు భాగాలున్నాయి .కలోస్సాస్ కవితల్లో ఆమె చావు
ప్రయత్నాలన్నిటినీ రాసింది ''.ariel '' కవితల్లో విలియమ్స్ ప్రభావం ఉందని అంటారు .తన మానసిక
వ్యాధిని tulips ,doddy ,lady lazarus కవితల్లో పొ ందు పరచింది .ఆమె రాసిన కవిత్వాన్ని
''comfessional poetry ''గా భావిస్తా రు .ఆమె మీద సినిమా తీద్దా మని ప్రయత్నిస్తే ఎదిగిన ఆమె
కూతురుతిరస్కరించింది .ఆ విషయాన్ని ఆమె ఒక కవిత రూపం లో రాసింది .అది చదివితే మనకు
కన్నీళ్లు వస్తే,ఆ అభాగిని కవయిత్రి పై సాను భూతి కలిగి ,ఆమె పిల్లలను అనాధ లను చేసి నందుకు
బాధా మెలి బెడుతుంది
''Now they want to make a film -for any one lacking the ability --to imagine the body head in
oven --orphaning children
they think --I should give them my mother's words --to fill the mouth of their mother --their
sylvia suicide doll ''
కొంతతీసి ఇంకేదో చేసి డాక్టర్లు తండ్రి చెవికి ఆపరేషన్ చేసారు దీనితో ఇతని చెవి సాగి పెద్దది అయింది అది
ఎట్ల వుందంటే తలకు పక్కగా ఒక కాలిఫ్ల వర్ వున్నట్లు గావుందట . ఈ అవతారం చూసి అంతా నవ్వే
వారట చెల్లి పెళ్లి కాన్సుల్ అవటానికి ఇదీ ఒక కారణం .
portrait అఫ్ a girl అతనికి నచ్చిన కధ అంటాడు .అతని అభిమాన రచయిత
చెకోవ్.లారెన్స్ కూడా ఇష్ట మే .తన జీవిత శకలాలు ఒక దానితో ఒకటి కలవవు అంటాడు ,.అతని జీవితం
లో హజెల్ అనే అమ్మాయి ప్రవేసిన్చాని సిగ్గు తో ప్రేమను చెప్పా లేకపో యాడు .అరవయవ దశకం లో చాల
విచిత్రా లు జరిగాయి డాక్టర్ జాకాబ్సన్ ఆదేశం మీద తాగుడు మానేసాడు .ఆయన injections ఇచ్చే
వాడు ఆ బాధ భరించటం మరీ కష్ట ం గా వుండేది .బాధ మర్చి పో వటానికి మళ్ళీ తాగే వాడు .తాను ఏమి
చేస్తు న్నాడో తెలిసేది కాదు .ఒక సారి తెలీకుండా కరెంటు స్ట వ్ మీద కూర్చున్నాడు కిందంతా కాళి
హాస్పిటల్ లో చేరాడు .అయిపొ యింది అనుకున్నారు అంతా .మానసిక వార్డ్ లో చేర్న్చారు .అక్కడి
జీవితం భరించలేనిది గా వుండేది .షాక్స్ ఇచ్చారు .ఎలా తట్టు కున్నదో తెలీదు .చర్చి జీవితం కొంత
ఉపసమనం కల్గించింది .కాతేలిక్ అని ముద్ర పడింది .తన్ను గురించి ఇలా చెప్పుకున్నాడు ''iam apoet
వెన్ ఇపుట్ ది poetry ఇన్ ది డ్రా మా .ఈ పుట్ ఇట్ ఇన్ శోర్త్స్తోరీస్ ,అండ్ ఇ పుట్ ఇట్ inplays poetry is
poetry .ఇట్ దో ఎస్ నాట్ have tobe called ఆ poem ''
తాను ఏది రాసినా ప్రతిభా వంతం గానే రాసానన్నాడు రాస్తు న్నప్పుడు dialogu లలు బిగ్గ రగా
బయటికి చెప్పటం అతని అలవాటు .ఇల్లు అద్దె కిచ్చిన వాడు అర్ధ రాత్రి కంగారు పడేవాడు తనను సరైన
పంధా లేనివాడిగా ప్రమాదకరమిన్ వాడిగా ముద్ర వేసారని బాధ పదే వాడు .తన మానసిక ఆనందానికి
మాత్రమే రాస్తా నని ఎవరి కోసమో కాదని తన అంతరాత్మ చెప్పినట్లే రాస్తా నని అనే వాడు .తాను రాసిన
సంభాషణల నుంచే లేక తనకిష్టమైన కవి హరనే రాసిన కవితల్లో ంచో నాటికలకు పేర్లు పెట్టె వాడు .
అయ్యా గారికి గంబ్లి ంగ్ పిచ్చకుడా వుంది చాలా డబ్బు పో గొట్టు కున్నాడు .తన నాటకం వేసే
మొదటి రోజున చాల కంగారు పడేవాడు .గొప్ప నాటక రచయిత వోనేయిల్ గొప్ప రచయిత కాదంటాడు
.ఆల్బీన్ గొప్ప రచయిత అంటాడు .ఒకే సారి మూడు ప్రా జెక్ట్ లకు పని చేసే వాడు .అతని జేవితానికి
ప్రతిబింబాలే అతని రచన తే ఒప్పుకోడు అవి తన భావావేశాలకు ప్రత్నిధులు అన్నాడు
.దేప్రేస్సన్ తగ్గ టానికి ద్రు గ్స్ వాడేవాడు .గునే కూడా బలమైనది కాదు ,బాధలు మర్చిపో వటానికి
తాగుడు ఎక్కువ చేసాడు .కుడి కాంతి చూపుకి ఎడమ కాంతి చూపుఅతనికి హెమింగ్వే
ఫిట్జెరాల్డ్ ,కాస్ట్రో కెన్నెడీ కార్టర్ ల తో గాఢ పరిచయం వుండేది .రేఅగాన్ జానే వ్య్మన్ ను
పెళ్లి చేసుకొన్నప్పుడు ""ముక్కు లేని వాడ్ని పెళ్లి చేసుకోంది '' అన్నాడు .హాలీవుడ్
సినిమాలకు పనిచేసాడు పని లేక పో యినా వారానికి 250 డాలర్లు ఇచ్చే వారు .వయసు మీద పడిన
కొద్దీ తనలో హాష్యం పెరిగిందనే వాడు .బ్ల క్ఖు మౌర్మరేఇస్త మ్ .యువ రచయితలూ తమ గురించే
ఆలోచిస్తు న్నారని సమాజం గురించి పట్టించుకోమని కోరాడు .ఆ జి enarshan ను "మీ,మీ
మీగే paristhit janaration అన్నాడు .విమర్శకులు రచయితల్ని తమ భావ జాలం తో
చంపేస్తు న్నారని బాధ పడ్డా డు . పరిస్థితులే మనల్ని ఆ రూపంగా మారుస్తా యి మనం ఏమి చెయ్యాలో
నిర్ణ యిస్తా యి మంహి మార్గ ం ఎంచుకోవరం రచయిధ్యత అన్నాడు నిజాయితీగా .నోబెల్ ప్రైజ్ రానందుకు
బాధ పడ్డా డు .జబ్బుతో నే చనిపో యాడు ''అయితె '' I have a very strong will .I have got un
finished work ''అన్నాడు నిజాయితీగా విల్లియమ్స్
అమెరిక లోని కాలిఫో ర్నియా లో జన్మించిన జాన్ స్టీన్ బెక్ గొప్ప కధా రచయిత ,నవలా
కారుడు ,నోబెల్ బహుమతి గ్రహీత .ఆయన పర్యావరణాన్ని జీవావరనాని గురించి కూడా అద్భుతం గా
రాశాడు .ఆయన జీవించి వున్న కాలమ్ లో ఎవరు దాన్ని పట్టించు కోలేదు .మరణానంతరం అదొ క
అద్భుత రచన అని అందరు మెచ్చారు .అంతే కాదు జీవావరణ పర్యావరణాన్ని గురించి రాసిన మొదటి
రచయిత గా గుర్తింపు పొ ందాడు .మాన వత్వం మూర్తీభవించిన రచయిత ,.అతనితో బాటు ఆ నాటి
జీవావరణ పర్యావరణ విషయాలపై అధ్యయనం చేసిన వారిలో అతని స్నేహితులు
edrickets ,కాంప్బెల్ కూడా వున్నారు
స్టీన్ బెక్ canery row రచన లో ఆ ప్రా ంతపు ప్రజల జీవన విధానాన్ని ,గొప్పగా చిత్రించాడు .అక్కడి
జనాభాని whores ,pimps ,gaamblers గా వర్ణించాడు .అదే సమయం లో రికెట్స్ ఫసిఫిక్ సముద్ర
ప్రా ంతపు జీవావరనాన్ని బాగా లోతుగా అధ్యయనం చేశాడు .బెక్ తో కలిసి రెండు పుస్త కాలు Between
fasific tides ,sea of cortez రాశాడు .వీటిని పర్యావరాణ శాస్త ్ర వేత్తలు ఇప్పటికీ claassics గా
భావిస్తా రు పర్యావరణం పై మానవుడు చేసే దౌష్ట ్యం ,దాని వల్ల కలిగే అనర్ధా లు చాలా లోతుగా చర్చి౦చిన
వాళ్ళిద్ద రూ .రికెట్స్ un assuming scientist గా భావించారు .ఒక legend అన్నారు .
తన స్నేహితుడు రికెట్స్ గురించి చెబుతూ బెక్ అతని ప్రభావానికి లోను కాని వారు
లేరని ,ఎలా ఆలోచించాలో నేర్పిన మహనీయుడని ,అందమైన అద్భుతమైన జీవులను ఎలా
పట్టు కోవాలో ఎలా పరిశీలించాలో నేర్పాడని అంటాడు .రికెట్స్ ఇరవైయిదేల్లు సముద్ర జీవుల specimen
collection లో గడిపాడు . tide pool fish ను వెన్నెముక లేని ఎన్నో స్పెసిమెన్ లను
కని పెట్టా డు .దీనివల్ల అతనికి sea shore ecology బాగా అర్ధ మైంది .ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇరవై
సముద్ర జీవుల చెందిన స్పెసిమెన్ లను రికెట్ అండ్ స్టీన్ బెక్ అని వాళ్ల పేర్ల మీద గౌరవం గా
పిలుస్తు న్నారంటే వారి జీవ శాస్త ్ర కృషి ఎంతటిదో తెలుస్తో ంది .సముద్ర జీవావరణ అధ్యననానికి ఆ
స్నేహితుల సేవ అపూర్వ మైనది అని శాస్త జ్ఞు
్ర లు ప్రశంసించారు .
కానేరి రో అనేది కాలిఫో ర్నియా లోmonetary వుంది .ఆ ప్రా ంతాన్ని ,అందులోని
జనాభాను బెక్ తిట్టినా 1957 తర్వాత ఆ ప్రదేశం గొప్ప యాత్రా స్థ లం గా మారింది .అక్కడ ప్రసద
ి ్ధ మైన
చేపలు దొ రుకు తాయి .మనిషి స్వార్ధ ం తో అక్కడి చేపల మరణానికి కారకుడు అవుతున్నాడని బెక్ బాధ
పడ్డా డు .ఇవ్వాళ అదొ క గొప్ప వ్యాపార కేంద్రమైంది .నగలకు ,ఫాషన్ కు ,గాల్లెరీలకు ,నిలయమైంది
.ఇదంతా ఎలా జరిగిందో తెలుసు కుంటే ఆశ్చర్య పో తారు .ఇదంతా తాము ఆప్యాయం గా ఆరాధించే తమ
మహా రచయిత జాన్ స్టీన్ బెక్ ను చిరస్మరణీయం చేయటానికి జరిగిన మార్పు .తన కాలమ్ కంటే
ముందు ఆలోచించే గొప్ప రచయితకు అక్కడి ప్రజలిచ్చిన నజరానా .మన దేశం లో మనం ఏ రచయిత
కైనా ఇంతటి ప్రా ధాన్యాన్ని ఇచ్చి కృతజ్ఞ త తెల్పుకున్నామా ని ఆలోచిస్తే సిగ్గేస్తు ంది .
స్టీన్ బెక్ దాదాపు ముప్ఫై పుస్త కాలు రాశాడు .కొన్ని సినిమాలు గా ,టి.వి.సీరియల్స్
గా వచ్చాయి .ఇరవై తొమ్మిది పుస్త కాలు academic nominations పంపబడినాయి ..పులిజర్
బహుమతి పొ ందాయి .1962 లో నోబెల్ బహుమతిని సాహిత్యం లో పొ ందాడు జాన్ స్టీన్ బెక్ ..ఇప్పుడు
అక్కడ స్టీన్ బెక్ సొ సైటీ ఏర్పడింది . Stein Beck”s news letter and quarterly journals
ప్రచురింప బడుతునాయి .రెండు విశ్వ విద్యాలయాల్లో స్టీన్ బెక్ research సెంటర్ లు నడుస్తు న్నాయి
.Intenational Stein Beck Congress ఏర్పడింది .door stop size biography లు ఆయనపై
వచ్చాయి .చాలా మంది ఆయన రచనలపై పరిశోధనలు చేసి పీ.హెచ్.డి. పొ ందారు .ఇప్పటికీ అతని
పుస్త కాలు ఏటా ఇరవై లక్షల కాపీలు అమ్ముడు పో తూనే వుంటాయి .ఆయన ,ఆయన రచనలు
చిరంజీవులు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదను కుంటా. బెక్ పుస్త కం east Eden
oprah’s book club లో re launch అయి గౌరవాన్ని ఆపాదిన్సింది .1998 లో అతని స్వగ్రా మం
సాలినాస్ లో multi million dollor stein beck center ఏర్పడింది .అతను జీవితాన్నపుడు
ద్వేషించిన వారంతా ఇప్పుడు అతన్ని ఆరాదిస్తు న్నారు .అతని స్మృతి చిహ్నాలలో గొప్పది మానేటరి లోని
ocean వ్యూ avenue .దీన్ని కానేరి వ్యూ అంటారు .ఇదిప్పుడు గొప్ప tourist attraaction . అయింది
రికెట్స్ తో కలిసి రాసిన పుస్త కం లో the reports of biologists are the measures ,not
of the science but of the men themselves ”అని రాశారిద్దరూ . రికెట్స్ రాసిన between the
facific tide పుస్త కం a claassic in the literature of marine bilogy అన్నారు అంతా .దీని రచనలో
బెక్ సహాయం ఎక్కువ గా వుంది .బెక్ రాసిన ది grapes of wrath నవల ను 93 పని రోజుల్లో అయిదు
నెలల్లో రాశాడు బెక్ .దాన్ని 75 వేల డాలర్లు ఇచ్చి సినిమా కు కొనుక్కున్నారు .అంత
డబ్బు ఏ రచయితకు అప్పటి వరకు ఇవ్వలేదట . .ఆ సినిమా డైరెక్టర్ జాన్ ఫో ర్డ్ కు అకాడెమి అవార్డు
వచ్చింది .తర్వాత the grapes of the wrath పుస్త కం ecology పాఠ్య పుస్త కం అవటం బెక్ కు
వున్న జీవావరణ అవగాహనకు జోహార్ అనిపిస్తు ంది .అతని మరో పుస్త కం sea of cortez అన్నది a
record of an ecological study of marine fauna ”అని పేరు పొ ందింది .సాధారణ నవలా రచయిత
అని ముద్ర పడ్డా బెక్ ఇప్పుడు అసాధారణ జీవావరణ శాస్త ్ర వేత్త అని పించుకోవటం ఆశ్చర్యం ,ఆనందం
కలిగిస్తు ంది
-- స్టీన్ బెక్ పుస్త కాల అమ్మకం క్రమంగా తగ్గ గానే మెక్షికొ కు వెళ్ళాడు . కాలిఫో ర్నియా కు తిరిగి
రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధ ం తర్వాత .''it is not my country any more ''అనీ అన్నాడు
.ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country అయి ఆరాధనా స్థ లం అవటం విశేషం .
Juvaan de fuca strait చాలా భయంకరమైనది .దీన్ని grave yard of pasific అంటారు ,.valanicia
అనే ఓడ 1906 లో సాన్ fraanisco నుంచి నూట యాభై నలుగురితో బయల్దే రి తీరానికి ఇరవై గజాలు
దూరం ఉండగానే మునిగి పో యింది 117 '' మంది చనిపో యారు .దీని తర్వాతే టైటానిక్ ఆరు ఏళ్ళు
తర్వాత మునిగింది .
స్టీన్ బెక్ ,రికెట్స్ కలిసి princes norah ship లో discovery కి బయల్దే రారు .పసిఫిక్ 75
మిలియన్ చదరపు మైళ్ళుంటుంది .భూమిని మూడొంతులు కప్పి వేసంే త అన్న మాట . అట్లా ంటిక్ కు
రెండు రెట్లు ంది పసిఫిక్ .దీనికి సౌత్ సి అనే పేరుంది .
స్టీన్ బెక్ ఎక్కువ గా యుద్ధ నవలలు రాశాడు .కానీ సైనికుల కోరిక మేరకు యుద్ధ ం సమస్య లేకుండా''''
కాన్నేరి రో ''వాళ్ల కోసమే రాసాడు .''where men hungering for love destroy every thing lovable
about them ''అని రాశాడు .ఈ నవల ఆయన idyll అంటారు .దాన్ని ''a dream that does not and
could not exist ''అన్నాడు ''it is an imaginary respite ఇన్ ఆ వరల్డ్ అఫ్ వార్ '''అన్నాడు .1945
లో ఈ భావాలను escapism. గా భావించారు కొంతమంది . అందుకే పుస్త కాల అమ్మకాలు తగ్గా యి
.రికెట్స్ పేర పది హీను ,స్టీన్ బెక్ పేర నాలుగు స్పెసిమెన్ కు తర్వాత పేరు పెట్టా రు . lampenyactus
Stein beckiyaa ' . అన్నది long fin lamp fish ను బెక్ కాలిఫో ర్నియా లో కనుక్కున్నాడు .1939 లో
rolf bolin ను గుర్తించాడు ఇలాగే మిగిలినవి కూడా .
జర్మని మేధావి ,రచయిత వేదాంతి గోథె రాసిన ''Rest not !life is sweeping by --go and
dare before you die ---something mighty and sublime --leave behind to conquer time ''అని
fraust లో రాసిన మాటలు రికెట్స్కు కు బాగా ఇష్ట ం అన్నాడు బెక్ .రికెట్స్ కు రోడ్ ఆక్సిడెంట్ జరిగి
చాలా ప్రమాదం గా వున్నప్పుడు ఒంటరిగా అతని లాబ్ లో ఉండలేక రఘు ప్రసాద్ అనే marine
విద్యార్ధిని తోడూ గా ''స్టెయిన్ బెచ్క్ వుంచుకున్నాడు .బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చినపుడు న్యూ యార్క్ టైం
పత్రిక కూడా ఏమీ ప్రా ధాన్యత నివ్వ లేదు .అతని జీవావరణ సందేశం వాళ్ల కు అర్ధం కాక పో వటమే కారణం
..ఆ పత్రికఅతన్ని ''మోర్ అబౌట్ socialogy than literature ''అని రాసి సరి పెట్టింది .ఇప్పుడు అతని
పుస్త కాలను 1930 లో అతను చెప్పిన radicalism గురించి అధ్యనం చేస్తు న్నారు . అతని రచనలను
రాదికాల్ అండ్ naturalistic హుమనిసం అన్నారు కొందరు మేధావులు ..బెక్ మాత్రం ''humans are
animals and thus are one with nature ''అని నోరు మూయించాడు .రికెట్స్ ,bek ఇద్ద రు కలిసి '' .
''why do we so dread to think of our species as species ?that human self love would suffer too
much and that the image of god might prove to be a mask ?''అని ప్రశ్నించారు .
స్టీన్ బెక్ కు నోబెల్ వచ్చినపుడు బ్లూ ం అనే విమర్శకుడు ''The people in Stock Holm often
seem to have a dusty file of people ,no one ever heard of that they pull out when making the
awards ''అని ఈసడించాడు . అతన్ని సరిగా అర్ధ ం చేసుకోక .ఇష్ట ం వచ్చినట్లు అనామకుడికి అవార్డు
లిస్తు న్నారు అన్నాడు .
1965 లో బెక్ చని పో యిన తర్వాత ecology మీద జనం లో శ్రద్ధ పెరిగింది . 1970 లో న్యూస్ వీక్ పత్రిక
ecology పై ప్రత్యెక వ్యాసాలను రాయించింది .ఆ సంవత్చ రాన్ని ''the year of ecology ''అని యు.ఎస్
.ఏ . పేరు పెట్టింది .అప్పట్నించి స్టీన్ బెక్ పడిన తపనేమితో జనానికి అర్ధ మైంది .''beck ;s ecoloogical
message finally began to resonate with the culture at large ''అదుగో అప్పటినుంచి అతని
రచనలను కొత్త కోణం లో చదవటం ప్రా రంభించారు .academician లు ,scientists స్టీఫెన్ బెక్ కు
గౌరవించటం ప్రా రంభించారు .అతడిప్పుడు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం అయాడు . ఒరెగాన్ లో ''marine
science center in new port ;'' ఏర్పడింది .దీనినే stein beck అండ్ the సిగా గౌరవం గా
పిలుస్తు న్నారు . ''
తన ''లైఫ్ అఫ్ లెటర్స్ '' పుస్త కం లో జాన్ స్టీన్ బెక్ ''to finish is sadness to a writer .--a little
death --.he puts the the last word down and it is done ..but it is not really done ..the story
goes on and leaves the writer behind ,for no story is ever done ''అని ముగిస్తా డు .
ఇదీ నాకు చాలా ఇష్టు డైన జాన్ స్టీన్ బెక్ చరిత్ర ,రచనలపై నాకు తెలిసిన నేను
తెలుసుకొన్న విషయాలు మీతో పంచుకున్నాను
జాన్ స్టీన్ బెక్ రచనల వైవిధ్యం ,నాణ్యత ,సంక్లిష్టత ,లను అంచనా వేయటానికి ఒక చట్రం
లోకుదించటం సాధ్యం కాదు అని విమర్శకులు చేతులెత్తేశారు .ఆయన తన పశ్చిమ తీర ప్రా ంత
స్వగ్రా మం నుంచి ,తూర్పు తీర మెట్రో పో లిస్ వరకు పయనం సాగించాడు .non fiction ఆయనుకు
ఇంకో దారి .The grape wrath తో అంతర్జా తీయ ప్రముఖ రచయిత అయాడు .దీనితతో పాటు తన దైన
స్వంత సంస్కృతీ కి out cast గా మారాడు .అతని రచనలన్నీ ఒక విధం గా ఆయన స్వీయ చరితల
్ర ే
.1930 లో కాలిఫో ర్నియా కు వలస వచ్చిన వారి జీవిత ఆటు పో ట్ల ను ,దైన్యాన్ని ,తన రచనలలో
ప్రతిబిమ్బించాడు .
గుల్ఫ్ అఫ్ కాలిఫో ర్నియా ను the sea of cortez అంటారు ..దాన్ని క్షున్నాం గా పరిశోధించాడు అంటె
expedition చేశాడు .సముద్ర జీవులను స్పెసిమెన్ గా సేకరించటానికి తన స్నేహితుడు ఎడ్ రికెట్స్ కు
చాలా ధన సహాయం చేశాడు .కొంత కాలమ్ లండన్ లో war time accounts చూశాడు .యుద్ధ ం లో
తాను చూసిన భీభాత్చానికి depress అయాడుకూడా .1947 లో రష్యా వెళ్ళాలని అనుకొన్నాడు .దీనిని
తన అంతర్జా తీయ అవగాహన పెంచుకోవటానికి తోడ్పడు తుందని బావించాడు .దురదృష్ట వశాత్తు తన
ముఖ్య స్నేహితుడు ,తోటి జీవావరణ శాస్త వ
్ర ేత్త రికెట్స్ మరణం అకస్మాత్తు గా సంభవించటం తో వెళ్ళ లేక
పో యాడు .వివాహ సమస్యలు అతన్ని కదల నివ్వ లేదు .అప్పటి మెక్షికొ revolutionary . నాయకుడు
Emiliyano Zapta పై సమగ్ర పరిశోధన చేసిపచ
్ర ురించాడు .ఆయన పై తీసిన సినిమా కు స్క్రిప్ట్ కూడా
రాశాడుబెక్ ..
తాను నివశించిన సాలీనా వాలీ గురించి East of Eden రాశాడు .ఇందులో తన తల్లి
వంశం గురించి తన బాల్యం గురించి వివరం గా రాశాడు .ఇది అంతగా ఆదరణ పొ ందలేదు .1961 లో The
winter of our discontent రాశాడు న్యూయార్క్ జీవితం లోని fictional సెట్టింగ్ గా దీన్ని రాశాడు
.1962 లో జాన్ స్టీన్ బెక్ కు నోబెల్ బహుమతి లభించింది .అప్పుడే Travels with Charley in search
of America రాశాడు .బాగా అమ్ముడయింది .1966 లో అమెరికా అండ్ అమెరికన్స్ పుస్త కం రాశాడు
.తర్వాత లెటర్స్త టు అలీసియ రాశాడు . .
టెన్నిసన్ కవి ''All experience is an arch where through gleams that un travelled world
whose margin fades -for ever and for ever when i move ''అని చెప్పినట్లే బెక్ జీవితం కూడా
సాగినట్లు అనిపిస్తు న్నది .
ఇదీ మహా రచయిత ,నోబెల్ పురస్కార గ్రహీత జాన్ స్టీన్ బెక్ గురించి న మరిన్ని
జ్ఞా పకాలు .
వాల్ట్ విట్మన్---2
వాల్ట్ విట్మన్ బానిసత్వాన్ని ద్వేషించాడు .equilibrium కావాలి అన్నాడు .అది కూడా
స్నేహపూర్వకం గా వుండాలి .ఇక్కడే ఒక చక్కని కవిత రాశాడు ''I am the poet of slaves and of the
master of the slaves ----I go with the slaves of the earth equally with the masters ---and i will
stand between the masters and the slaves ---Entering into both so that both shall understood
me alike ''అని తన మనసును బయట పెట్టా డు .
''I''అనటం విట్మన్ తో నే అమెరికన్ కవిత్వం లో ప్రా రంభ మైంది .జనం తో మమైక్యం చెందిన భావన .
కలిగించాడు
అందుకే '' he cultivated superb calm character to meliorate personal upheavals '' అని ప్రశంసలు
పొ ందాడు .తన ముఖ్య కార్యక్రమం ""great contribution of the New BIble ''అని ప్రకటించాడు .జేమ్స్
రాజు కొత్త bible రాసినట్లు ,తానూ కొత్త నీరు తేవాలని భావించాడు .అందుకనే తన గడ్డిపరకలు అనే
కవితా సంపుటిలో ''read these leaves in the open air season of every year of your life of all
nations
and specially tou.s. poets most need poets --since political leaders were failing miserably to
hold the nation to gether ,poets alone held the key to social cohesion .The presidents shall not
be their common refery so much as their poets shall .The poet is the orbitrator of the diverse
and he is the key .He is the eqallizer of the age and land he supplies what wants supplying
and checks what wants checking .''అని కవికి వున్న సామాజిక బాధ్యతను గుర్తు చేశాడు .ప్రజా
సమస్యల్ని కవులు చాలా ప్రతిభావంతం గా పాకులా దృష్టికి తే గలరు అని ఆయన భావన .
అతని గడ్డిపరకలు కవిత్వం లో ప్రజాస్వామ్య ద్రు ష్టి ముందు చూపు వున్నాయి .అందుకే సామాజిక ,వర్గ
,మత ,సెక్స్ ,వగైరా లకున్న అడ్డ ంకులను సవాలు చేశాడు .అంతకు ముందెవ్వరు వీటిపై ద్రు ష్టి పెట్టా లేదు
.ఇతనే ఆద్యుడు .1950 లో మాత్రమే సాంఘిక అడ్డ ంకుల్ని తొలగించింది అమెరికన్ ప్రభుత్వం .అంతే
విట్మన్ కవి ప్రభుత్వానికి మార్గ దర్శనం చేశాడు అని తెలుస్తో ంది అతనికి పూర్తి సమానత్వం కావాలి .అదే
ఆయన ధ్యేయం .అతనిలో దక్షిణ ,ఉత్త ర ప్రా ంత జనులు ఒక్కటే అందుకే అందరిని దృష్టిలో పెట్టు కొనే
''నేను ''అని అందరిని సమాన భావనతో చూశాడు ..
నేటివ్ అమెరికన్స్ పై portraits వేశాడు ..ఆ మధ్యనే వచ్చిన యురోపియన్ల పైన ,ఆఫ్రికన్
అమెరికన్ ల పైన వేశాడు .తనను బానిస గా భావించు కొన్నాడు ."I am the hounded slave ---I wine
at the bite of dogs --Helland despair are up on me ''అని వాళ్ల బాధ తన బాధ గా చెప్పుకొన్నాడు
.ఇదే మన శ్రీ శ్రీ కి ఆదర్శం అయింది .కవితామయ స్వర్గా న్ని ఊహించాడు (ఉటోపియా )అందులో
ధనవంతులు ,పేదలు ,అధికారులు ,సామాన్యులు అందరు అన్యోన్యం గా వుండాలి ఇదే democratic I'''.
సాంగ్ అఫ్ మై సెల్ఫ్ కవితలో ''of every hue and trade and rank ,of every caste ,and religion --Not
merely of the New World but of Africa ,Europe or Asia a wandering savage ---A farmer ,a
mechanist or artist ,a gentleman ,sailor ,lover or quaker ''అందరు ,అన్ని దేశాల వాళ్ళు ,అన్ని
వృత్తు ల వాళ్ళు తన వాళ్ళే నన్నారు .దీన్నే శ్రీ శ్రీకుమ్మరి కమ్మరి , దాగలి గొడ్డ లికట్టీ సుత్తీ సమస్త
వృత్తు ల వాళ్ళు తన వాళ్ళే నన్నాడు .
శ్రీకి ప్రేరణ విట్మన్. .తనను పిట్టలదో రగా ,న్యాయవాదిగా వైద్యునిగా మతాదికారిగా పో ల్చుకొన్నాడు .
తనను చూసి అమెరికా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని నేర్చుకోవాలని ఆశ పడ్డా డు . '' The
proof of the poet is that his country absorbs him as affectionately as he has absorbed ''అని
నమ్మాడు .కవి తన దేశం తో మమైక మయినట్లు దేశం కూడా కవిలో అయిక్యమవ్వాలని అతని
సుందరస్వప్నం అతను ఆశించి నట్లే అది నెరవేరింది .ఎమెర్సన్ ,రోసేట్టే ,స్విన్బర్న్ ,మొదలైన వారు
ముందుగా ,విట్మన్ ను అర్ధ ం చేసుకో లేక పో యినా ఇప్పుడు పూర్తిగా మారి అతని కవిత్వానికి పట్టా భి
షేకం చేయటం మొదలు పెట్టా రు .అరచేతితో సూర్యుని తేజాన్ని ఆపలేము అని తెలుసు కొన్నారు .""I
greet you at the beginning of a great career ''అన్నాడు ఎమెర్సన్ .''Your poetry has the best
merits ,namely of fortifying and encouraging ''అనీ అన్నాడాయన
మిగిలిన వారు ''It had attemppted to abolish all narrowness of
vision ,immediately became subject to narrow interpretations .his begign qualities are very
exemplary ''అని కితాబు ఇచ్చారు .గుడ్ గ్రే పో ఎట్ అని ప్రశంసించారు .
' లింకన్ అంతే వీర అభిమానం విట్మన్ కు .రోజూ ప్రెసిడెంట్ లింకన్ ఆఫీసు కు వెళ్ళటం చూశే
వాడు .లికన్ ను హో ం spun అని ,కెప్టెన్ అనీ గొప్పగా ఆరాధించేవాడు .''captain o captain ''అని లింకన్
పై అద్భుతమైన కవిత రాసి తన భక్తిని ఆరాధనా భావాన్ని వ్యక్త పరిచాడు .
race and caste విషయం లో conservative stand తీసుకొన్నాడు .
Witman is the master of language experimentation అని పేరు పొ ందాడు .తన కవిత్వం గురించి ''No
one can know leaves of grass who judges it piecemeal ,--do not take the trouble to examine
what they started out to criticize ,to judge a man from his own stand point ,to even find out
what that stand point is ''అని విస్శ్లేషించాడు .ఇది స్వంత డబ్బా కాడు .స్వయం వ్యక్తీకరణ
మాత్రమే .
సైంటిస్ట్ హేబర్
ె
అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్
పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen
లను ఎక్కువ పీడనం ,ఉష్నోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా
ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధ తినే హేబెర్ ప్రా సెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్
అనే జెర్మనీ శాస్త ్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త వ
్ర ేత్త గా పేరు .అమ్మోనియా తయారు
తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్ల వానికి నాందిఅయాడు హేబెర్ .తర్వాత యుద్ధ ం లోశత్రు
నాశనానికి విష వాయువులు కని పెట్టి ప్రయోగించాడు .సైన్యం లో అత్యున్నత పదవి పొ ంది యుద్ధ
వ్యూహం లో ఆరి తెరాడు .కానీ నాజీ ప్రభుత్వం ఏర్పడి హిట్లేర్ అధికారానికి రాగానే యూదు లందర్నీ ఏరి
చంపేశాడు .పాపం హేబెర్ కూడా సర్వస్వం కోల్పోయి ,అనామకుడుగా ,అనాధగా మిగిలి పో యాడు
.అతని జీవితం ఒక పాఠం మాత్రమే కాదు అందరికి గుణ పాఠం కూడా .ఎందుకు ,ఎలా
,ఏమిటీ అనుకుంటూ ,ఆ వివరాలు తెలుసు కొందాము . ,
ముందే చెప్పినట్లు హేబెర్ బాష్ తో కలిసి అమ్మోనియా తయారు చేశాడు .దీనితో
కృత్రిమ రసాయనిక ఎరువులు తయారయాయి .పంటలకు వర ప్రసాదం అయింది .పంటలు రెట్టింపు గా
పండాయి సశ్య విప్ల ం సాధన కు రాచ మార్గ ం ఏర్పడింది .మనం తినే అన్ని పదార్ధా లలో nitrogen వుంది
.జనుము ,పిల్లి పెసర మొదలైన మొక్కల వెళ్ళ మీద నైట్రో జెన్ స్థా పక శూక్ష్మ జీవులున్తా యని చదువు
కొన్నాం .హేబెర్ ఈ విషయాలను సూక్ష్మం గా పరిశోధించాడు .నైట్రో జెన్ వాడకం పెరిగితే అంతా మార్పే అని
భావించాడు .ఆయనకు laboratory ,ఫ్యాక్టరీ ,యుద్ధ రంగాలు ఇష్ట మైనవి ., మార్పు తేవటం ,కొత్త ది
సృష్టించటం అతనికి చాలా ఇష్ట ం .అతను క్రూ రుడు కాదు కానీ ,అతను మంచి విధేయుడు ,ఉదారుడు
,కష్ట పడే వాడు ,సృజన కలవాడు .వీటన్నిటికి తగిన ప్రతిఫలాలను పొ ందాడు .
బెర్లిన్ లో piperonal అనే వాసన వేసే రాసాయననాని కనిపెట్టా డు .1891 లో chemistry
,ఫిజిక్స్ ,philosophy ల లో డిగ్రీ సాధించాడు .physical chemistry నీ అధ్యనం చేశాడు .అప్పటికి జెర్మనీ
లో వున్నా పదివేల మంది యూదులలో హేబెర్ కూడా ఒకడు . ఆడవాళ్ళను అర్ధ ం చేసు కొనే మనస్త త్వం
అతనికి లేదు .వారి విషయం లో అతని అభి ప్రా యం ఇలా వుంది
''women are like lovely butterflies to me .I admire their colours and glitter ,but i get no
fuuture ''.రంగుల సీతా కొక చిలుకలు ఆడవాళ్ళు వారి పై మెరుగులే చూస్తా ను అనే తత్త ్వం ..బిస్మార్క్
అనే వాడట ''the german's fear nothing but god ''germany వాళ్ళు సిద్ధా ంతాన్ని
నమ్మితే అమెరికన్లు సాంకేతిక విధానం పై ద్రు ష్టి సారిస్తా రు . చివరికి germanlu
సాంకేతిక మిలిటరీ విధానాన్ని అనుసరించారు .సృజనకు విలువ నిచ్చారు .ఆయుధమే విజయానికి
కారణం గా తెలుసు కొన్నారు .ప్రప్పంచాదిపత్యం కావాలంటే జెర్మని కి ,దాని అస్తిత్వానికి ఆయుధబలమే
శరణ్యం అని తెలుసు కొన్నారు .జెర్మని దేశానికి జీవిత కాల సివిల్ సర్వీసు ప్రొ ఫెసర్ గా వున్నాడు హేబెర్
.అతని అమ్మోనియా ప్రా జెక్ట్ వల్ల దేశం లో ప్రతి వారికి తింది దొ రికింది .ఒక రకంగా అన్న దాత అయాడు
.అందరిలోనూ ముఖ్యుదయాడు .తాను జెర్మని లో అతి శక్తి సామర్ధ్యాలు కలవాడిని అన్నాడు .తాను
పరిశమ
్ర లకే ఆద్యుడు .జెర్మని మిలటరీ విధానం లోను ,ఆర్ధిక విషయాలల లోను అగ్రగామి కావటానికి
తానె కారకుడనని తనకు జెర్మని లో ప్రవేశార్హత లేని ప్రదేశం లేదని , చెప్పాడు కూడా ...
హేబెర్ తీరు తెన్నులు చూసి ప్రముఖ శాస్త వ
్ర ేత్త ఐన్స్టీన్ ''our entire much praised
technological progress and civilization generally could be compare to an ax in the hand of
pathological criminal ''అని హెచ్చరిన్న్చాడు ఇతను కనిపెట్టిన విష పదార్ధా లను గురించి తెలుసు కోని .
1914 లో germani దేశం లతో యుద్ధ ం చేసంి ది .ఫ్రా న్సు ఇంగ్లా ండ్ లతో యుద్ధ ం చేసంి ది
.వాళ్ళను జయించటం కష్ట మైంది .కందకాలలో వున్న శత్రు వులను తరిమి వేయటం కష్ట మైంది
.అప్పుడ dia nisidine chloro sulphate .ఉపయోగించారు .ఏ ప్రభావం కలిగించ లేదు .ఇదే ప్రపంచం లో
మొదటి వాయు ప్రయోగం ..తర్వాత బెంజాల్ bromide గ్యాస్ ప్రయోగించాడు .శత్రు వుల కళ్ళు
మండాయి .తరువాత tear దీనినే zxylyl bromide గ్యాస్ అంటారు .శత్రు సంహారం జరిగి జెర్మని
గెలిచింది ఇవన్నీ హేబెర్ సృష్టించినవే .''హేబెర్ was fascinated .his mind latched on to the problems
of gas weaponry and did not let go for the rest of the war ..అంతా ఎదిగి పో యాడు ,అంతా
ముఖ్యుడైనాడు యుద్ధ వ్యూహం లో .
క్రమం గా మిలిటరీ సలహా దారుడై నాడు .స్వయం గా యుద్ధ రంగం లో నిలిచాడు
.మిలిటరీ జనరల్ గా ఆలోచించాడు .తన మేధా సంపత్తి కి ,విధి నిర్వహణను జోడించాడు .చివరికి
ప్ర్సష్యాన్ ఆఫీసర్ అయాడు .autocratic and and useless in his will to victory అని పించుకొన్నాడు
. మిలిటరీ వ్యవస్థ ను నిర్వహించే దశ కు పెరిగాడు .ఒక సారి ఆయన ప్రయోగ శాలలో ఒక విద్యార్ధి
ప్రయోగం చేస్తు ంటే అనుకోకండా ఒక గ్యాస్ ఏర్పడి ఆ విద్యార్ధి చని పో యాడు .అప్పుడు హేబెర్ కు
అర్ధ మైంది గ్యాస్ వేఅపో న్ ఎంతటి దారుణం చేయ గలదో .అదే చ్లోరినే గ్యాస్ .దాన్ని తాన్కులలో ఎక్కువ
పీడనం తో నింపి బెల్జి యం సిటీ లోని ఎప్రేస్స్ లోని ట్రెంచ్ లో వున్న శ్శత్రు శైనికు లపై ప్రయోగించాడు
.వాళ్ళంతా ఊపిరి ఆడక దెబ్బకి ఠా . .దీనితో యుద్ధ ం లో విప్ల వాత్మక మార్పు వచ్చింది .గ్యాస్
నుపయోగించి శత్రు శైన్యాన్ని చంప వచ్చు అతి తేలికగా .ఈ రోజునే డే అఫ్ ypress అంటారు ఇలాంటి
ప్రయోగాలు భార్య క్లా రా కు ఇష్ట ం లేదు .వద్దు అని వారించింది .మాన వాలికి చేటు అని హెచ్చరించింది
.మొండి హేబెర్ వినలేదు .చివరికి ఆమె పిస్టల్ తో కాల్చ్కొని ఆత్మ హత్య చేసుకోంది . గ్యాస్ వేఅపో న్
మీద విల్ఫ్రెడ్ ఓవెన్ అనే బ్రిటిష్ సైనికుడు ,కవి ఒక కవిత కూడా రాశాడు దాని దుష్పరిణామం మీద
.తర్వాత అమెరికా hydrogen cyanide గ్యాస్ ను వాడింది .దీనినే pervertion of science గా అందరు
విమర్శించారు .అయితె దీన్ని ప్స్య్చోలూగికాల్ గా చూశాడు హేబెర్ .తేలిగ్గా తీసుకొన్నాడు . .
హేబెర్ అమ్మోనియా మీద రోయల్తి బాగా వచ్చేది హేబెర్ కు . లో 1918 ల్గేర్మనీ ఓడి పో యింది
.యుద్ధ విమానాల వాడకం అవసర మైంది .మిరచ్లె వేఅపొ ంస్ సాధించటం లో నిమగ్న మైంది .నోబెల్
బహుమతి పొ ందాడు హేబెర్ .౧౯౩౨ ఎన్నికలలో నాజి పారి అధికారం లోకి వచ్చింది హిట్లేర్ తిరుగు లేని
నాయకుదయాడు .యూదులను నిర్దా క్షన్యం గా కాల్చి చంపేశాడు .పదవులన్నీ పో యాయి హేబెర్ కు
.అస్తిత్వానికే ఎసరు వచ్చింది .జెర్మనీ నుంచి వ్ల్లిపో ఎవారికి కొంత అవాశం ఇచ్చారు .ఎల్లె వాళ్ళందరికీ
హేబెర్ సాయం చేశాడు .తాను ఎటు తేల్చుకో లేక పో యాడు .అమ్మోనియా అమ్మకం తగ్గి రాబడి బాగా
తగ్గింది .సహాయం కోసం అందర్నీ యాచించాడు ఎవరు ముందుకు రాలేదు .
సిర్గేర్లా ండ్ చేరాడు .ఖాయ వ్యాధి తో బాధ పడ్డా డు .సనితోరిం లో చేరాడు .తన భాగస్వామి బాష్ ను
ఆహాయం చేయమని రాశాడు .వాడేమి పాటించు కో లేదు .కొత్త ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకొని వాడు
మళ్ళీ సంపాదన మీద పడ్డా డు .1934 ౨౯ janavari న బాసెల్ లో చనిపో యాడు .ప్రముఖ భౌతిక శాస్త ్ర
వేత్త మక్ష్ ప్లా ంక్ మాత్రమే అంత్యక్రియలకు హాజరైనాడు .జెర్మనీ పట్టించుకోలేదు .పేపర్ లో వార్త కూడా
రాయ లేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలమ్ లో జెర్మని కి అత్యధికం గా సేవలందించిన వాళ్ళలో
ప్రధముడు హేబెర్ .అలాంటి వాడికే ఇంతట్టి దుర్గ తి .అతని బంధువులనందర్నీ గ్యాస్ చంబెర్ లలో పెట్టి
చంపేసంి ది నాజి ప్రభుత్వం .చివరికి విస్మృత శాస్త ్ర వేత్త గా మిగిలి పో యాడు .అతని స్మ్రుతి చిహ్నం కూడా
లేదు .
హేబర్ హీరో మరియు విలన్ .అయాడు .''german ,patriot ,a victim of naazi's .A patron
saint for guns and butter .he was the founder of the military industrial complex and the
inventor of the chemistry through which the world now feeds itself ''ఇంతటి గొప్ప శాస్త ్ర వేత్తకు
ఇంతటి దుర్గ తి ..ఆయన నిర్మించిన తూర్పు జెర్మని లోని Leuna -వేర్కే
ఆయన జీవిత సర్వస్వం .ఆ పేరు తీసేసింది నాజి ప్రభుత్వం .చివరి జీవిత కాలమ్ లో ప్రవాసి గా గడపప
వలసి వచ్చిది పాపం .1952 లోని బెర్లిన్ లోని . ''The fritz Haber institute of the Max plank
society మాత్రమే మిగిలింది .
celebration of a murderer --heber ---father of gas war fare '' ani 1968 లో న్యువ శాస్త ్ర
వేత్తలు గేర్మని లో జరుపు కొన్నారు
scientists could desclaim direct responsibility for theuse to which mankind had put their
disinterested discoveries .We feel compelled to tae a more active stand now ,because --
nuclear power is fraught with infinity greater danger than were all the inventions of the past
'''అని ఫ్రా ంక్ రిపో ర్ట్ వచ్చింది .ఇదే కొత్త ఉద్యమం గా మారింది .
సాంకేతిక శక్తిని the machine అన్నారు .గ్యాస్ weapons ను గ్యాస్ -troops అన్నారు . .శాస్త వేత్తలు
సరాసరి యుద్ధ విధానాలలో పాల్గొ న రాదు .తాము శోధించి సాధించిన విపత్కర ఆయుధాలు ,మాన వాళి
వినాశకరం కా కుండా జాగ్రత్త పడాలి .లేకుంటే రెండవ ప్రపంచ యుద్ధ ం తర్వాత జరిగిన అణు బాంబు
యెంత మానవ విధ్వంసం చేసిందో గుర్తు ంచు కోవాలి
శాస్త ్ర వేత్త ఆర్థర్ సి..క్లా ర్క్
-- దాదాపు 900 రచనలు చేసిన ఆర్థ ర్ క్లా ర్క్ 1917 లో డిసంె బర్ 17 న జన్మించాడు . ఏడవ
ఏడునుంచి శిలాజాల మీద ,డినోసార్స్,మీద FLYING మీద ద్రు ష్టి నిలిపాడు .స్వంత TELESCOPE
ను ,రాకెట్ ను తయారు చేశాడు .తండ్రి టెలిఫో న్ ,టెలిగ్రా ఫ్ లలో పని చేశాడు .తల్లి ,సో దరుడు కూడా
TELEGRAPHISTS పద్దెనిమిది ఏళ్ళ వయసు లోనే port ఆఫీసు లో పనిచేసి
,TRANSMITTER ,CRYSTAL RADIO సెట్ తయారు చేసన
ి సృజన ఉన్న వాడు .అతని టీచర్స్
అతని పై మంచి ప్రభావం చూపించారు .కధలు బాగా చెప్పే నేర్పు వుండేది .బాబి పియర్స్ అతనికి ఫిజిక్స్
,MATHS బో ధించిన గురువు . .
డబ్బు లేక యూనివెర్సిటీ .లో చదవ లేక పో యాడు .సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ,ఆ డిపార్ట్మెంట్ లో నే
పని చేశాడు .18 ఏళ్ళ వయసు లో లండన్ చేరాడు .SPACE TRVEL మీద ,సైన్సు
FICTION .మీద శ్రద్ధ చూపాడు . SPACESHIP తయారు చేయటం లో సాయ పడ్డా డు
.ASTRONOMY మీద శ్రద్ధ పెరిగింది .CELESTIAL NAAVIGATION చదివాడు .ఇంతటి తో
ఆగలేదు ELECTONICS లో శిక్షణ పొ ందాడు .''mORE TELEVISION WAVE FORMS ''అనే గొప్ప
వ్యాసం రాసి అందరి ద్రు ష్టి లో పడ్డా డు .GLIDE PATH అనే FICTION రాశాడు ..'' principle of
communication satillites ''మీద చాలా వివరణాత్మక వ్యాసాలు రాసి ,ఆ రంగం
లో అభ్యుదయానికి బాటలు వేశాడు .స్పేస్ fiction మీద preludes రాశాడు .
ఫిజిక్స్ abstract అనే పత్రిక కు సహాయ సంపాదకుడై నాడు .humorous stories about
psuedo science పేర చాలా కధలురాసి అందర్నీ ఆకర్షించాడు .ఇవన్నీ ''Tales from the white heart
''పేర ప్రచురితం .అయాయి .తాను రాసే వాటికి ఉద్యోగం అడ్డ ం గా వుందని భావించి పూర్తి కాలమ్
రచయిత అయాడు .స్పేస్ travel మీద శాశ్రీయ అవగాహనతో ''ఇంటర్ planetary ఫ్లైట్ ''పుస్త కాన్ని ,''An
introduction to astronautics ''ను రాశాడు .ఈ రెండూ సామాన్యులకు ,ఆ రంగం లో అవగాహన
కల్పించ టానికే రాశాడు .తర్వాత మొదటి సారి అమెరికా కు వెళ్ళాడు . తాను రాశిన ''The exploration
of space ''పుస్త కాన్ని అమెరికా లో ప్రచ్రించాడు .1952 లో newyork radio ,టి.వి. ప్రొ గ్రమ్మెస్
లో పాల్గొ న్నాడు .తనకున్న శాస్త్రీయ ఆవ గాహన తో ''The sands on Mars '' రాసి మంచి పేరు
తెచ్చుకొన్నాడు .ఈయన రాసిన ''స్పేస్ ఒడిస్సే ''అనే పుస్త కం( 2001 )యాభై సార్లు ముద్రణ పొ ంది
మూడు మిలియన్ల కాపీలు అమ్ముడయి రికార్డు సృష్టించింది .
లండన్ కు మళ్ళీ చేరాడు క్లా ర్క్ .ఒకే సమయం లో చాలా ప్రా జెక్ట్స్ చేబట్టి విజయ వంతం
గా ముగించాడు .''Childhood ''s end ''పుస్త కం రాశాడు .అదే సమయం లో ''Expedition to Earth ''రాసి
ఆశ్చర్య పరిచాడు .1953 లోమళ్ళీ అమెరికా వెళ్ళాడు ఫ్లో రిడా లో diving నేర్చుకొన్నాడు . పెళ్లి
చేసుకొన్నాడు కాని ఆరు నెలల్లో పెదాకులు .,విడాకులు ..ఎప్పటికి అప్పుడు కొత్త ది ''నేర్చుకోవాలనే
తపన .అందిన దానితో తృప్తి పడ లేదు .తర్వాత ద్రు ష్టి అంతా ఇప్పుడు సముద్ర యానం మీద పడింది
.1956 లో సింహళం లో స్థిర పదాలని పించింది .''The fortunes of paradise
రాశాడు .''Deep range ,dolphin island ,imperial earth ''అనే fiction పుస్త కాలు రాశాడు ఇరవై ఏళ్ళు
శ్రీలంక లో నే వున్నాడు . అక్కడి tax సమస్యల వల్ల లంకను ఆరు నెలలకు ఒక సారి వదిలి విదేశాలకు
వెళ్ళే వాడు .తర్వాత ,బ్రిటిష్ పో రాసత్వము పొ ంది ,లంక లో ఇల్లు కొనుక్కున్నాడు .ఒక దేశ పౌరిడిగా
వుంటూ ,వేరొక దేశం లో స్థిర నివాసం పొ ందిన ఘనుడు క్లా ర్క్ .లంక లో residential స్టేటస్ పొ ందాడు
.1976 లో లంక ప్రభుత్వం ''the clerk act ' 'తెచ్చింది ' ఇతరదేశీయులు లంక లో స్వంత ఇంటిలో
వుంటే పన్ను కట్ట క్కర లేదు అని సారాంశం ..ఇది ఆయన కోసమే చేసినా ,చాలా మందికి ప్రయోజనం
కలిగింది .తెచ్చింది ..residential గెస్ట్ గా మొదట గుర్తింపు పొ ందిన వాడు క్లా ర్క్ .
ప్లే బాయ్ లాంటి పత్రికలకు రాస్తూ నే వున్నాడు .''A fall of moon dust ''అనే సీరియల్
రాశాడు .శ్రీ లంక సముద్రం లో మునిగి ఈత కొడుతుంటే రెండు లోయలు ,చాలా వెండి నాణాలు కని
పించాయి /.తన యాత్రను ''indian ocean treasure ''గా రాశాడు .తరువాత '' the treasure of the great
reef ''అనే రెండవ పుస్త కమూ రాశాడు .1962 లో gummam తగిలి రక్త ం గడ్డ కట్టి పక్షవాతం వచ్చింది
పాపం .అయినా రచన మాన లేదు ' తర్వాత ఓల్డ్ polio జబ్బు చేసింది .''The ghost from the grand
banks ,the hammer of god ,garden of Rama ,Rama revealed ''పుస్త కాలు అంత వ్యాధి లోను రాసి
తన వ్యాధిని రాతతో జయించే పని చేశాడు .ఎన్నో విశ్వ విద్యాలయాలాకు వెళ్లి అద్భుతమైన
ఉపన్యాసాలతో విద్యార్ధు లను ,శాస్త్రీయ అవగాహన పొ ందేట్లు స్ఫూర్తి నిచ్చాడు .స్వంత తెలివి తేటలతో
సృజన తో ,పరిశోధన తో ,అరుదైన రచనల తో ప్రభావితం చేసి ఆదర్శ ప్రా యుడైన శాస్త ్ర వేత్త గా నిలిచాడు
,ప్రజా హృదయం గెలిచాడు అర్హర్ సి,క్లా ర్క్ .ధన్య జీవి .సకల కళా ప్రవీణుడు .
మార్టిన్ గార్దేనేర్
సదా సంచారి సాంకృత్యాయన్
రాహుల్ సాంకృత్యాయన్ అంటే అందరికి గుర్తు వచ్చేది ''వోల్గా సే గంగా ''అనే పుస్త కం .దీనితో
పాటు చాలా గ్రంధాలు రాసి ప్రసిద్ధి చెండాడు .నిత్య సంచారి .కొత్త విషయం ఎక్కడ వున్నా తెలుసు కోని
చరిత్ర కు ఎక్కించే దాకా నిద్ర పో డు .అలసట అంటే ఏమిటో తెలీని జీవితం గడిపిన స్కాలర్ .పరిశోధకుడు
.చరిత ను తవ్వి తీసి చరిత్ర పుటల్ని నింపిన మేధావి .అతను ఆంధ్రు డే అని నమ్మకం కలిగిస్తా యి ఆయన
రచనలను తెలుగు లో చదివితే .అంతగా చొచ్చుకు పో యాయి ఆయన పుస్త కాలు తెలుగు దేశం లో .ఇది
ఆ అనువాదకుల గొప్పతనం. అంత సరళ సుందర మైన ఆంధ్రీ కరణం చేశారు మన అణు వాదకులు
-- ఉత్త ర ప్రదేశ్ లో అజాం ఘడ్ జిల్లా లో ''పాండహా ''అనే చోట రాహుల్ సాంకృత్యాయన్ 1893 లో
ఏప్రిల్ తొమ్మిది న జన్మించాడు .చరిత్ర తత్వ శాస్త ్తం్ర ,జీవిత చరిత్ర కళలు ,ఖగోళ శాస్త ం్ర ,ఆరోగ్యం ,భూగోళ
శాస్త ం్ర ,మొదలైన వన్నీ చదివి జీర్ణం చేసుకొన్నాడు .అనేక దేశాలు పర్య టించాడు .ఇరాన్ ,ఇరాక్ ,రష్యా
,యూరప్ ,చైనా ,జపాన్ ,శ్రీ లంకా మొదలైన దేశాలను l సందర్శించాడు .అయితె అతనికి అత్యత పేరు
తెచ్చిన యాత్రలు మాత్రం టిబట్
ె యాత్రలు .టిబెట్ కు నాలుగు సార్లు వెళ్ళాడు .అందుకే ఆయన్ను
సంచార చక్ర వర్తి అనీ ,దేశ దిమ్మరుల ఆచార్యుడనీ ,అంటారు .1929 లో నేపాల్ వెళ్ళాడు .చేతిలో పాస్
పో ర్ట్ లేదు .తన కున్న పరిచయాలతో వెంటనే దాన్ని పొ ందాడు .16000 టిబెటన్ పదాలు సేకరించాడు
.అతని కోరిక ఒక్కటే బౌద్ధ గ్రంధాలను సంస్కృతం లోకి అనువాదం చేయించటం దొ రికిన పుస్త కాలన్నిటినీ
సేకరించాడు .తన దగ్గ రున్న పుస్త కాలు వస్తు వులు వారికి కానుకలు గా అంద జేశాడు అరుదైన ''కాన్జూ ర్
,టాన్జూ ర్ ,గ్రంధాలను కొన్నాడు .130 వర్ణ చిత్రా లు ,1600 కు పైగా వ్రా త ప్రతులు సేకరించి వాటిని 18
కంచర గాడిదల పై ,39 రోజులు ప్రయాణం చేసి డార్జిలింగ్ దగ్గ రున్న కాళీ పాంగ్ చేరాడు .. .
యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరు లేరని చరిత్ర కారుల
అంచనా .వీటినన్నిటినీ శ్రీ లంక ,పాట్నా ,మ్యూజియం లలో భద్ర పరిచాడు .అమ్మమని ఎంతో మంది
బ్రతిమి లాడినా ససేమిరా అన్నాడు .అవసర మైతే ఫో టోలు తీయించి ఉచితం గా అంద జేశాడు .అంత
నిక్కచ్చైన మనిషి .కలకత్తా లోని మహా బో ధి సొ సైటీ ,లండన్ బుద్ధిష్ట్ సొ సైటీ ఆయన ఆసక్తి గమనించి
ఆయన్ను వారి ఖర్చులను భరించి యూరప్ అమెరికా దేశాల్లో సాన్క్రుత్యాన్ ను బౌద్ధ మత వ్యాప్తి కోసం
పంపించాయి .తన సహచరుడు గా కౌసల్యానందన్ ను తోడూ తీసుకొని వెళ్ళాడు .
టిబెట్ యాత్ర ను గురించి ''టిబెట్ లో పది నెలలు ''పుస్త కం రాశాడు .దీన్ని యాత్రా సాహిత్యం లో
గొప్పది అంటారంతా .1934 ,36 ,38 లో కూడా టిబెట్ యాత్ర చేశాడు .అరుదైన బౌద్ధ గ్రంధాలను సేకరించి
తెచ్చాడు .ఆయన భాషా సాహిత్య సేవలకు అభినందించి ,ఒరిస్సా బీహార్ రిసెర్చ్ societee లు రాహుల్జీ ని
ఘనం గా సన్మానించాయి .ఆయన టిబెట్ నుంచి తెచ్చిన పుస్త కాలలో మాఘుడు రాసిన శిశు పాల వధ
కావ్యం పై ,భావదత్తు డు రాసిన టీకా ,బుద్ధ శ్రీ జ్ఞా న్ రాసిన ''ప్రజ్ఞా దీపావళి ''ఉనాయి .అఆగే వాద న్యాయం
,శత సాహశ్రిక ,గ్రంధాలను సేకరించి తెచ్చాడు .38 కట్ట లు గా వున సంస్కృత గ్రంధాలు ,ధర్మ కీర్తిరాసిన
పుస్త కాలు ,ప్రమాణ వార్హిక సేకరించాడు .8000 శ్లో కాలున్న అనంగుడు రాసిన ''యోగ చార భూమి ',చంద్ర
వ్యాకరణం ,తర్క రహశ్యం ,మొదలైన అపూర్వ గ్రంధ సేకరణ చేశాడు సాంకృత్యాయన్ .తన అన్ని
యాత్రలపైనా విపుల మైన సమాచారాలతో పుస్త కాలు రాశాడు .
రాహుల్ సాంకృత్యాయన్ మొత్త ం మీద 127 గ్రంధాలు రాశాడు .అందులో యాత్రా పుస్త కాలే ఇరవై
రెండు .ఆయన మొదటి టిబెట్ యాత్ర పై రాసిన పుస్త కమే ''నా లడక్ యాత్ర ''.యాత్రలు చేసే వారికి కర
దీపిక గ ,మార్గ దర్శి గా ''లోక సంచారి ''అనే పుస్త కం రాశాడు .
''దేశాటనం చాలా మంచిది .కళా ప్రా భవాన్ని ,సత్య ధర్మాలను సద్భావనలు చాటేందుకు చేసే మహా
ప్రస్తా నమే యాత్ర ''అంటాడు రాహుల్ .లోక సంచారి ప్రపంచాన్ని ప్రేమిస్తా డనీ ,మృత్యువుకు భయపడడని
,అతనికి పరిచయం అయిన వారందరి పైనా అనంత మైన స్నేహ భావాన్ని కురిపిస్తా డని ,ఈ స్నేహ
భావనలే అతనికి నిత్యమ్ మధుర స్మృతులు కల్గిస్తా యని అంటాడు సాంకృత్యాయన్ .
సాంకృత్యాయన్ కు హిందీ సంస్కృతం ,పాళీ భోజ్పురి ,ఉర్దూ ,పెర్షియన్ ,అరబిక్,తమిల్ కన్నడ
,సిన్హ లి ,ఫ్రెంచ్ ,రష్యన్ మొదలైన ఎన్నో భాషలు వచ్చు .ఆయన మార్క్సిస్ట్ భావ జాలం వున్న రచయిత
.ఇరవయ్యవ ఏట రచన ప్రా రంభించాడు .సో షియాలజీ ,హిస్టరీ ,ఫిలాసఫి ,బుద్ధిజం ,టిబెటాలజీ ,లేక్సికోగ్రఫి
గ్రా మర్ లపై పుంఖాను పుంఖాలుగా పుస్త కాలు రాశాడు .భారత దేశమంతా తిరిగాడు .ప్రపంచయాత్ర్
చేశాడు .జానపద ,శాస్త ్ర ,నాటక ,రాజకీయాలపై ఎన్నో వ్యాసాలు రాశాడు .
ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంధం ''వోల్గా సే గంగా ''లో ఆర్యులు యూరేశియా నుంచి రష్యా లోని వోల్గా
నదీ తీరానికి చేరారని అక్కడి నుంచి హిందూ కుష్ పర్వతాలు ,హిమాలయాలు దాటి గంగా తీర మైదానం
చేరారని రాశాడు .క్రీ.పూ.ఆరు వేల ఏళ్ళ కిందస్తి నుంచి ,1947 వక్రకు జరిగిన నాగరకతా వ్యాప్తిని సమగ్రం
గా ,ఆయన వ్యక్త పరిచాడు .ఇది చదువు తుంటే ఒక చరిత్రో సాంకేతిక పద జాలం తో కూడిన వేరే ఏదో
చదువు తున్నట్లు అని పించదు .ఒక నవల చదువు తున్నంతహాయిగ్సా వుంటుంది .అదీ దీని ప్రత్యేకత
.నిత్య సంచారం చేస్తూ విషయ సేకరణ చేస్తూ ,గ్రంధాలు గ వాటిని నిక్షిప్త ం చేస్తూ ,అన్ని విషయాల మీదా
సాదికారికం గా రాశాడు సాంకృత్యాయన్ .భావం మార్క్స్ ది అయినా హృదయం భారత దేశానిదే .మనం
గర్వించ దగిన మహా రచయితా, మహా యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ .
అమెరక
ి న్ చిత్ర కళ
Academy of creative art అనే సంస్థ విజయ వాడ లో 23 -08 -93 న నిర్వహించిన సభలో స్వర్గీయ
సంజీవ దేవ్ అభి భాషణ లోని కొన్ని విషయాలు మీ కోసం
-- చైనా లాండ్ scape చిత్రా ని ''షాన్ షూయీ ''అంటారు .అంటే కొండలు నీరు అని అర్ధ ం
.అమెరికా లో'' ఆర్ట్ అకాడెమి అఫ్ చికాగో ''వుంది .అమెరికన్ ఆర్ట్ లో రూపానికి ఎక్కువ ప్రా ధాన్యం .మన
దేశం లో మినియేచార్ ఆర్ట్
ఎక్కువ . .భావ ,రస స్పందన కు అమెరికన్ ఆర్ట్ లో ప్రా ముఖ్యత లేదు .
డాక్టర్ ఆనంద కుమారిల స్వామి అనే సింహళ చిత్రలేఖకుడు ,విశ్లేషకుడు ,అమెరికా లోని బో స్ట న్
లో భారతీయ చిత్ర కళకు అది పతి గా పని చేశారు .అక్కడే చిత్ర కళా మ్యూజియం వుంది .ప్రా చ్య కళా
అంతా అక్కడ వుంది .అన్ని దేశాల చిత్ర కళా రీతులు అక్కడ కన్పిస్తా యి .సంప్రదాయం గా
,PERSPECTIVE గా,త్రీ డైమెన్ష నల్ ,వాస్త వ చిత్రకళా అక్కడ కనిపిస్తా యి .అమెరికన్లు ఆధునిక చిత్రకళా
లో చాలా ముందుకు వచ్చారు .అయితే ఆధునికం అంతా నైరూప్యం కాదు .ABSTRACTION
లేని కళా వుంది .
విషయం తో పాటు TECHNIC ఉంటేనే గొప్ప కళ .అంటే మౌనం లోంచి శబ్ద ం పుట్టి నట్ల న్న మాట
.అమెరికన్ చిత్ర కళ ,భారతీయ చిత్ర కళ కంటే గొప్పదేమీ కాదు .చిత్ర కళ ను చూడాలి .మాట్లా డ రాదు .
అందరి నేస్తం డికన్స్
ె -01
ఇంగ్లా ండ్ కు చెందిన ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ అందరి వాడు .అందుకే అతన్ని రచయిత గా భావించారు
.రచన చదవ గానే అతడు మన నేస్తం అనిపిస్తు ంది .అన్నాడు జార్జి ఆర్వెల్ . ఆయనలో అన్నీ వుండటం వల్ల
అందరికి స్నేహితుదయాడు అంటాడు జూల్స్ వేర్న్స్ . ''న్యాయానికి స్వర్గ ం -చెడుకు -నరకం .డికెన్స్ విషయం లో
ను ,ఆయన దేశస్తు ల విషయం లోను ఇదే సత్యం అన్నాడు ఆండ్రీ గైడ్ .ఆలోచించే హృదయాన్ని ,వేదన చెందే
మెడను తప్ప కల లోని అన్ని ప్రతి బంధనాలను డికెన్స్ అదిగా మించాడు .ముస్సోలినీ కేమాల్ పాషా ,హిట్లర్ లు
డికెన్స్ రాసిన ''లిటిల్ డో రియాట్ ''చదివి వుంటే నియంత్రు త్వాది కారాన్ని చేలా ఇంచే వారు కాదు అంటాడు
బెర్నార్డ్ షా .డికెన్స్ శైలి బాగా లేదు అన్న వారు ఉండ వచ్చు కాని,అతని ఆకర్షణ ను కాదన్న వారు లేరు .అతని
క్రిస్మస్ కరోల్ అద్వితీయ రచన .అదో ప్రపంచమే అన్నారు మహా పండితుడు ఫూటే .ఆయన నవల ఒక చిన్న
కుటుంబం గురించి ఆక ,సమాజ చిత్రణమే కనిపిస్తు ంది .పాత్రల కంటే కారికేచర్ గా పాత్రలను మలిచాడు డికెన్స్.
బాల్యం
డికెన్స్ తండ్రి చార్లెస్ జాన్ డికెన్స్ .ఇంట్లో అందరు ఆయన్ను లేజీ ఫెలో అనే వార్రు .దరిద్రా నికి ,పెద్ద మనిషి
తరహాకు మధ్య వున్న దిగువ మధ్య తరగతి కుటుంబం .తండ్రి 18 ఏళ్ళ లో 20 సార్లు పైగా ఇళ్ళు మారాడు పెంచిన
అద్దె చెల్లి ంచే స్తో మత లేక ..తల్లిది ,తండ్రిది చిన్న పిల్లల మనస్త త్వం .అందుకని కుటుంబ బాధ్యత చిన్నప్పటి నుంచి
డికెన్స్ మీదే పడింది .ఒక రకం గా తండ్రి జాన్ కు కొడుకు డికెన్స్ తండ్రి లాగా వ్యవహరించాడు డికెన్స్ జీవిత
మంతా చిన్నతనం మీద తలిదండ్రు ల మీద ప్రతి చర్యయే .-(reaction ) .తల్లిదండ్రు లు చేసే తప్పులకు కొడుకే సాక్షి
.కాని అన్నీ తట్టు కోని నెట్టు కు రావటం అలవాటై పో యింది .వాళ్ల దుబార ఖర్చు చూసి ,పనికి విలువ నిచ్చే వాడు
.పెళుసు తనం అబ్బింది .విసర్జించ బడ్డ సొ త్తు అంతా తాను గా భావించాడు .బాధ్యతా రాహిత్యపు తల్లు లు
,అవివేకపు అమ్మలు అంతా ఎలిజబెతేన్ కారి కేచర్లె అంటే పరిహాస చిత్రా లే .అతను చిత్రించిన దుబారా తండ్రు
లంతా తండ్రి జాన్ క్లో నులే అన్నారు విమర్శకులు .
పెద్ద కొడుకు డికేంసే కనుక తలిదండ్రు లుబాగా వాడుకొన్నారు ,ఆడుకొన్నారు .పీల్చి పిప్పి చేశారు .1812
ఫిబవ
్ర రి ఏడున లండన్ దగ్గ ర potrs math లో జన్మించాడు డికెన్స్ . 12 ఏళ్ళకే చాలా చదివాడు .వేర్ హౌస్ లో
ఉద్యోగం లో చేర్పించాడు తండ్రి .ఆ వేర్ హౌస్ వైపు ఎప్పుడు వెళ్ళినా ఏడు పు వచ్చేది .ఆ ఉద్యోగానుభావాలు
,కష్టా లు బాధలు అతన్ని రచయిత డికెన్స్ గా మార్చాయి .అది తన జీవితం లో ఒక విద్యాలయమే అయింది
.అందులో గడిపిన కాలమ్ నుండే అతని వ్యక్తిత్వం ఆవిష్కరింప బడింది .తన చిన్నతనం , ,తలిదండ్రు ల బాధ్యతా
రాహిత్యం అతన్ని అన్ని అది కారాలను సవాలు చేసే స్తితికి తెచ్చాయి .అధికారుల ,పెత్తందార్ల దాష్టీకం ,బాధ పడే
వాణ్ని చూసి జాలి పద కుండా నిర్లిప్తం గా ఉన్న వారిపై కసి పెరిగింది .ఎదిరించే ధైర్యము వచ్చింది .
విక్టో రియా రాణి పాలనలో హింసించే హెడ్ మాస్ట ర్లు ,మతి మాలిన టీచర్లు ,బాధ్యతా రాహిత్య పాలనా సర్వత్రా
దర్శనం ఇచ్చింది .బెత్తం లేకుండా టీచర్ వుండే వాడు కాదు ఆనాడు .డికెన్స్ ఒక రకం గా అదృష్ట వంతుడే -
అలాంటి స్చూల్స్ లో చదవక పో వటమే ఆ అదృష్ట ం .అక్కడ చదివి వుంటే ఇంత పెద్ద మనిషి ఆయె వాడు కాదు
.విద్య మనిషిని శుద్ధి చేస్తు ంది .-మళ్ళీ అలాంటి నీచపు పనులు చేయక్కర లేదు అని పించింది .డబ్బు దాచి పెన్నీ
వీక్లీలు కొని చది వె వాడు .సాహిత్యం లో ఏ గొప్ప రచయితా లాగా డికెన్స్ చదువు సాగ లేదు .ఏదో సాధారణ విద్యే
అబ్బింది .15 ఏళ్ళకే డ్రా పవుట్ గా మిగిలి పో యాడు .తర్వాత ఎల్లిస్ అండ్ బ్లా కు మోర్ అనే లా ఫరం లో చేరాడు
.వారానికి 18 షిల్లి ంగుల జీతం .గంటల తరబడి లండన్ వీధులన్నీ తిరిగే వాడు .అదో జగత్ సహో దరులు వుండే
వీధులన్నీ కాలికి బలపం కట్టు కొని తిరిగాడు .వాళ్ళ స్థితి గతులు ,వేష భాషలు అర్ధం చేసు కొనే వాడు .ఇక్కడ జన
సమ్మర్దం తక్కువ .అన్ని రకాల మనుషులు కన్పించే వారు .బ్రిటిష్ మ్యూజియం కు వెళ్లి చదివే వాడు .చదవటం
అనేది డికెన్స్ జీవితం లో ఒక భాగమే అయింది .అక్కడే న్యూటన్ ,మార్క్స్లను చదివి జీర్ణించుకొన్నాడు .
రచనా వ్యాసంగం
1831 లో అంటే డికెన్స్ 19 వ ఏటనే ఫ్రీ లాన్స్ కోర్ట్ రిపో ర్టర్ అయాడు .షార్ట్ హాండ్ అతి వేగం గా
రాస్తూ దేశం లోనే ఫాస్తేస్ట్ షార్ట్ హాండ్ రిపో ర్టర్ అని పించుకొన్నాడు .ఇతని నవలలు ఆతర్వాత షార్ట్ హాండ్
లోకి అనువాదం పొ ందటం గొప్ప విశేషం .నటించాతమూ అతనికి బాగా తెలుసు .ఒక కంపెని మేనేజర్
అతన్ని ఆడిషన్ టెస్ట్ కు పిలిపించాడు .తలనొప్పి రాంప వల్ల వెళ్ళ లేక పో యాడు .లేక పొ తే రచయిత
డికెన్స్ బదులు కమెడియన్ డికెన్స్ మిగిలే వాడేమో ?ట్రూ సన్ పేపర్ కు రిపో ర్టర్ అయాడు .రిటన
పార్ల మెంట్ విశేషాలు రిపో ర్ట్ చేసే వాడు .రెండు నాల్కల లాయర్లు ,రంగులు మార్చే ఊసరవెల్లి రాజా కీయ
నాయకులు ,బద్ధ కస్తు లు ,లంచగొండి బ్యూరో క్రా ట్ లను చూసి ,వారు ఆడే మానవ నాటకాలను చూసి
ఆశ్చర్య పో యే వాడు .వాళ్ళందరి జీవితాలను చదివి అర్ధ ం చేసుకొన్నాడు .''న్యాయం అనే తండ్రి పిల్లల్ని
దూరం చేసుకొన్నాడు ''అని డికెన్స్ భావించాడు .వీళ్ళందరి జీవితాలను చదివే సరికి జీవితం అంత
సరిపడా రచనా సామగ్రి దొ రికింది .మంత్లీ మాగా జైన లలో ''విగ్నేట్స్ అఫ్ సిటీ లైఫ్ '('నగర జీవిత పుష్ప
చిత్రం )అని రాస్తు ండే వాడు .ఈ అనుభవమే ''పిక్విక్ పేపర్స్ ''రచనకు దారి తీసింది .ఎలెక్షన్ వార్త ల కోసం
ఇంగ్లా ండ్ ,స్కాట్లా ండ్ దేశాలన్నీ తిరిగాడు .మానవ ప్రవర్త న యెంత కృత్రిమం గా,బుద్బుద ప్రా యం గా
వుంటుందో తెలుసు కొన్నాడు .ఒక గంటకు 15 మైళ్ళు తిరిగాడు . లండన్ లో ప్రతి అంగుళం అతనికి
తెలుసు .సాన్నిహిత్యం ఏర్పరచు కొన్నాడు .21 ఏళ్ళ వయసులో మంచి పేరు ,ప్రఖ్యాతి వచ్చాయి .లండన్
గెజెట్ కు స్కెచెస్ రాశాడు .ఇద్ద రంమాయిల ప్రేమలో నలిగి పో యాడు .అందులో ఒకరైన మేరియా బీడ్న్స్
అనే అమ్మాయినే ''డేవిడ్ కాఫర్ ఫీల్డ్ ''నవలలో ''డో రా ''పాత్రగా చిత్రించాడు .ఇతనికి ఆమె పై ప్రేమ వున్నా
,ఆమె ఆకర్షితు రాలు కాలేదు .ఇది వాన్ సైడ్ ప్రేమ ట్రా క్ గా మిగిలి పో యింది పాపం .అతన్ని ''బాయ్
''అని అవమానించేది .మానసిక క్షోభ అనుభ వించాడు .మేరియ వాళ్ళ మిజేరి పెరిగింది .ఆమె నుంచి
దూరం అవుతూ తానూ అంట వరకు ఎవరిని ప్రేమించ లేదని బ్రతికి ఉండగా మేరియా ను తప్ప
ఇంకేవారిని ప్రేమించానని బీరాలు పో తూ రాశాడు .ఆ తర్వాతా ఆమె కు రాసిన ఉత్త రాలన్ని తగల బెట్టె
శాడు .ఇదంతా నవలలో డో రా -డేవిడ్ ల ప్రేమ గా రాశాడు
సీరియల్ రచన
కేథరిన హో గార్డ్ తో వివాహమైంది .గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలలో మోసెస్ అనే చిన్న
పిల్లా డు తానా పేరు చెప్పా మంటే ముక్కు మాటలతో ''బో జేస్ ''అనే వాడట .అదే'' బో జ్''గా మార్చుకొని
పేపర్ల కు రాశాడు .చిన్న తమ్ముడికి ఆ పేరే పెట్టా డు కూడా .వాడంటే వాళ్ళ మాలిన అభిమానం డికెన్స్ కు
.అసలు పేరు ''ఆగస్ట్ ''(ఘన మైన ).చివరికి వాడే అందరి ముందు డికెన్స్ ను ఆవ మానించి 1866 లో
చని పో యాడు .తానూ రాసే స్కెచెస్ లో నగర జీవితం ,అణగారిన సామాన్యుల జీవితాలను చిత్రించే వాడు
.పాత బట్ట లు అమ్మే వాళ్ళు ,కిల్లీ డుకానం వాళ్ళు ,టీ తోటల్లో పని చేసే వాళ్ళు కిల్లి దుకాణం వాళ్ళు
బాధితులైన భార్యలు ,శిక్ష పడ్డ ఖైదీలు ,అందరు పాత్రధారులే .గుమాస్తా ల మీదా ,ఆడంబరాల మీద ,ద్రా క్ష
సారాయి మీద ,వంచన మీద ,మోస కారుల పై మిలిటరీ బాచి లర్ల పై ,ఇచ్చకాలు ఆడే వారి మీద అధిక్షేప
రచనలు చేసి ''బో జ్ ''ప్రఖ్యాత రచయిత గా గుర్తింపు పొ ందాడు .''వేల మంది గొంతుక తానె అయాడు(a
MAN OF THOUSAND VOICES) .దీన్నే ''డికెన్స్ TERRITORY ''అన్నారు విశ్లేషకులు .ఆ
రచనలు ఆవేదనకు ,దుఖానికి ఆలంబనం .నగర సంస్కృతీ వీధి భాగోతం ,కింది తరగతి జనాల పలుకు
బదులు ,వాళ్ళ నివాసాలు ,జీవన విధానం అన్ని తానా స్కెచెస్ లో ప్రతి బిమ్బింప జేశాడు .లండన్ నగర
పాత్రను ఎవరు చిత్రించా నంత గొప్ప గా కళ్ళకు కట్టించి చూపించాడు .
డికెన్స్ కు పన్నెండు మంది పిల్లలు .౨౨ ఏళ్ళ తర్వాత భార్య కాతేరిన్ తన్ను అసలే ప్రేమించలేదని
,ఆమె లో ప్రేమ మృగ్యం అని సంచలనాత్మక ప్రకటన చేశాడు .ఆరోజుల్లో ఇంగ్లీష్ మధ్య తరగతి కుతుమాల
వారు పుస్త కాలను కోని చదివే వారు కాదు .అప్పుడు పుస్త కాల ఖరీదు పదిన్నర శిల్లిన్గు ల అర గినియా
.ఇవాల్టి వంద డాలర్ల కు సమానం .అయితె డికెన్స్ రాసిన వన్నీ సీరియల్ రచనలే .పిక్విక్ పేపర్ల లో తన
మేధస్సును ,స్వభావాన్ని రంగ రించి కొత్త రూపాన్ని సృష్టించాడు .శక్తి నంతా కూడ గట్టి ,అధిక శ్రమ తో
రెండు వారాలు దృష్టి నంతా నిలిపి సీరియల్ పూర్తి చేసే వాడు .అవగానే విశ్రా ంతి పొ ంది ఇంకోటి మొదలు
పెట్టె వాడు .ఇలా ఏక ధాటిగా ౪౦ ఏళ్ళు సుదీర్ఘ రచనా వ్యాసంగం చేశాడు .ధాకరే కు నలభై ఏళ్ళకే జుట్టు
నేరిస్తే ,డికెన్స్ చాలా చలాకీ గా పెద్ద మనిషి గానే వున్నాడు .
-- పిక్విక్ పేపర్స్ అరుదైన ,ఏ వర్గీ కరణకు అందని అడ్డు కోలేని నవల .అది నిజం గా నవల అనలేం
.అదొ క గొప్ప పుస్త కం అన్నాడు జార్జి ఆర్వెల్ .దాన్ని ఒక పుస్త కం గానే బేరీజు వేయాలి .అందర్నీ పూర్తి
సంతృప్తి పరచిన పుస్త కం .అద్భుత యత్న కృత నవల .అందులోని హాష్య సన్ని వేషాలను రాసే టప్పుడు
డికెన్స్ బిగ్గ రగా నవ్వే వాడట .అది ''పిక్వేరియాన్ ఫ్రేం ఆఫ్ మైండ్ ''ను తెలుపుతున్ద ంటారు .చెడుపై మంచి
మాత్రమే చివరికి విజయం సాధిస్తు ందని సందేశం .ఆనందాన్ని పంచటమే ధ్యేయం .గొప్ప కామెడి గా
ప్రశిద్ధి చెందింది .ఫ్రెంచ్ వాళ్ల ఫార్స్ లాంటిది అని విశ్లేషకుల భావన .నవ్వు పుట్టించే పుస్త కం మాత్రమే
కాదు .1827 మే 12 న ప్రా రంభమైంది .భాషా స్కలితాలు ,విడ్డూ ర మైన విషయాలు ,మాటల గారడీ
,ప్రభావితం చేసే పేర్లు అందులో వున్నాయి .సంఘటనల పరంపర ,టాగ్ ఫ్రేజులు ,సరదా పాత్రలు ,బాజ్
మాటలు (గుస గుసలు )పుష్కలం గా వున్నాయి .80 కి పైగా పాత్రలున్నాయి .ఇందులో ode of an
expiring frog'' అనేది సరదా జారదా .1836 -38 కాలాన్ని పిక్విక్ యియర్స్ అన్నారు .1938 వచ్చే
సరికి ఇంగ్లా ండ్ లో అత్యంత ప్రముఖులలో డికెన్స్ ఒకడైనాడు . .దీన్నే పిక్వీకియాన్ వరల్డ్ అన్నారు
.అవి పారిశ్రా మిక విప్ల వాణికి ముందు రోజులు .కోచ్ లు బాగా వున్న కాలమ్ .అప్పటికి లండన్ ఇంకా
ఒక పెద్ద గ్రా మమే .ఈ నవల వల్ల నవలా శైలి లో ,నవల రాసే విధానం లో విప్ల వాత్మక మైన మార్పులు
వచ్చాయి .మార్కెటింగ్ లో గొప్ప ప్రగతి సాధించింది .ముసలి రాజు పో యి యువరాణి ఇంగ్లా ండ్ కు రాజైన
కాలమ్ అది .అప్పటికే యువ నవలా రచయిత గా డికెన్స్ గుర్తింపు పొ ందాడు .ప్రేశాకులకు ఏమి కావాలో
అతనికి బాగా తెలుసు .వాళ్ళు దేనికి భయ పడుతున్నారో ,వాళ్ల కలలేమితో ,తెలిసి రాసాడని జాన్
ఇర్వింగ్ అన్నాడు .
1822 లో ప్రఖ్యాత నవలా రచయిత సర్ వాల్ట ర్ స్కాట్ మరణించాడు .అతనితో నవల చని
పో యిందని అందరు భావించారు .విక్టో రియన్ నవల ఇంకో ఏడేళ్లకు కాని బయటకు రాలేదు .ఈ ఖాళీ ని
డికెన్స్ పూరించాడు తన శృంఖల నవలలల తో .సాంఘిక ,రాజా కీయ ,వ్యంగ్య రచనలు సంగీతా శాలల
మూగ భాష ,మేలో డ్రా మా ,వీధి మనుషుల భాష ,పట్టా న చరిత్ర లతో దయా పూరిత రచనలు చేశాడు
డికెన్స్ .ఇందులో విక్టో రియన్ రుచి పెరిగి ఫిక్షన్ ఎదిగింది .పిచ్చి ఆమిక్ సీరియళ్ళను ఉల్లా స భరిత నవల
గా మార్చిన ఘంట డికెన్స్ దే .చీకటి వెలుగులను మిశ్రమం చేసి ,కొత్త పో కడ పో యాడు .అసంగత
విషయాలను స్వచ్చత తో నింపాడు .అంతవరకూ ఏ నవలా చేయని పని పిక్విక్ చేసింది .లింగ ,వయస్సు
,అంతస్తు లను అదిగా మించి ఆడ మగ పిల్లలను చదువు కున్న వారిని చదువు లేని వారిని అందర్నీ
ఆకట్టు కొంది .అన్ని తరగతుల వారు ఆదరించారు .యువకులకు ''బొ జ్ ''ఆదర్శ పురుషుదయాడు (కల్ట్
ఫిగర్ )పెద్దలకు 18 వశతాబ్ద పు గొప్పనవలను గుర్తు కు తెచ్చింది .న్యాయాధి కారులు బెంచి మీద కేసుల
విరామ సమయం లో దీన్ని చాదివే వారు .వ్యాపారస్తు లు తమ వస్తు వులను వీటి అత్త లలో వుంచి అమ్మే
వారు .ప్రతి వాడు డికెన్స్ తమ కోసమే రాస్తు న్నాడు అనే హావం కలిగించాడుఅని పించుకొన్న మేధావి
డికెన్స్ .అదే సౌందర్య దర్శనం గా సాధించిన విజయం .పిక్విక్ పిచ్చి (మేనియా )ఎక్కించాడు డికెన్స్ ఆ
కాలానికి అదంతా కొత్త దానమే .సమాజ పద్ధ తులు ,వాణిజ్యం ,సాంకేతికత ,పారిశ్రా మికత లోని కుట్ర
,కుతంత్రం ఈ కొత్త రచనకు దారి తీసింది .మేనియా గా చదువరులను పట్టు కుంది .నవల ఒక వినిమయ
వస్తు వు గా చలామణి లోకి వచ్చింది దీని వల్ల నే .(commadity )వేలాది మంది కోని చదవటం దీని
ప్రత్యేకత .ముద్రణ అయిన వెంటనే ఎగబడి ,కోని చదివే స్తితికి సమాజాన్ని తెచ్చాడు డికెన్స్ ,.అమెరికా
ఇండియా ,కెనడా లలోను ఇదే పరిస్థితి .అంత క్రేజ్ ను సృష్టించాడు .పిక్విక్ పేపర్ల కధే జనసంమాట మైన
సంస్కృతీ ,ఆధునిక మార్కెటింగ్ కధ .మాస్ -అంటే సామాన్య జనం చదివిన మొదటి నవల అదే .ఆ
సంస్కృతిని నిలు వెళ్ళా వ్యాపింప జేశింది .చాలా చౌకగా కాగితం అత్త పై పేపర్ పాక్ ఎడిషన్ గా వచ్చిన
తొలి నవల అది .కల్పనా సాహిత్య చరితల
్ర ో వచ్చిన మొదటి నవల .అందరికి అందుబాటు ధర .జన
సామాన్య సంస్కృతిని ప్రభావితం చేయటమే కాదు అదే జన సామాన్య సంస్కృతీ అయింది .లిటరేచర్ గా
పిలవబడి నప్పటికీ పూర్తి హాశ్యమే వ్యంగ్యమే .పాథకులు ఎదురు చూసే స్థా యికి సాహిత్యాన్ని తీసుకు
వచ్చిన ఘనత డికెన్స్ దే .అంటే కాదు సీరియల్ గా రాయాలన్న ఆలోచనా ఆయనదే .మొదటి పుస్త కం
విడుదల అయిన రోజున లండన్ కు దూరం గా ఉండాల్సి వచ్చింది .అదే సక్సెస్ అయింది .అంటే ఇంకా
ఏపుస్త కం విడుదల అయినా లండన్ లో వుండే వాడు కాదు అంత సెంటి మెంట్ ఏర్పడింది .పిక్విక్ పేపర్స్
లో 35 బ్రేక్ ఫాస్ట్ లు ,32 దినార్లు ,10 టీలు ,10 లంచులు ,ఎనిమిది సప్పర్లు ,59 ఇన్నులు (ఇన్స్
)వున్నాయని లెక్క వేశారు .865 మంది మనుషులున్నారు .దీన్ని స్టేజి మీద ఆడారు .ప్రతి పేజి లో ఒక
కొత్త కారెక్టర్ ,.కధ ౧౬౮ ప్రదేశాలలో జరుగు తుంది .బైబిల్ తర్వాత ప్రపంచం మొత్త ం మీద అధికం గా
అమ్ముడైన పుస్త కం .అదే ఆల్ టీం రికార్డ్ .చదవ గల వారి సంఖ్యను ,కోని చదివే వారి సంఖ్య తో
భాగిస్తే ఎనభై ఒక్క శాతం తో ఈ నవల అన్నిటికంటే ముందుంది .గాన విత్ ది విండ్ నవలకు ఈ
నిష్పత్తి నలభై మాత్రమే .బెస్ట్ సెల్లా ర్ పుస్త కం అంటే అదీ కొల మానం .ఈ నవల ఇంగ్లీష్ వకాబ్యులరి ని
సుసంపన్నం చేసింది .ఇంగ్లీష్ డిక్షనరీ లో డికెన్స్ వాడిన మాటలన్నీ చేరి శోభను చేకూర్చాయి .
డికెన్స్ అద్భుత కామిక్ రచయిత .ప్రపంచ జ్ఞా నాన్ని పెంచుతాడు .అతి నిజాలను జర్న
సామర్ధ్యం తో ,షీలా నిర్మాణానికి వీలు కల్పించాడు .ఆ బాధ్యతా మీద పడ్డా క చురుగ్గా కదిలే
యువకుడు సంక్లిష్ట సమయాల్లో అంతరంగం మాట వినే మనస్త త్వం .ఇదే ఫ్రా యిడ్
సిద్ధా ంతం . ఈ నవల చదివితే ఫ్రా యిడ్ ను చదివి నట్లే అని తీర్మానించారు విశ్లేషకులు
.''స్వీయ జ్ఞా నానికి జ్ఞా పక శక్తి కీలకం ''అని ఫ్రా యిడ్ చెప్పింది నిజం జరిగిన సంఘటన లను
విశ్లేషించుకొని న,భావ పరిపక్వత పొ ంద వచ్చు .అది ఒక స్వీయ చరిత్ర .జరిగిన నష్టా నికి
,ఆందో ళనకు స్వస్తి చెప్పే స్వీయ విశ్లేషణ వాళ్ళ విజయం సాధించ వచ్చు .కపటం లేని వాడు
,సులభం గా ఇతరుల చేత వంచింప బడే వాడు పరిస్తితుల ప్రభావం వాళ్ళ బలమైన శక్తి
యుక్తు లున్న యువకుడు గా మారటం ఇందులో చూస్తా ం .తను చెప్పిన దంతా అత్యంత
నిగ్రహం గా డికెన్స్ చెప్పాడు .శుక్ర వారం పుట్టిన వాడు దురదృష్ట వంతుడు అనే నమ్మకం ఆ
రోజుల్లో బాగా వుండేది .ఇందులోని హెలెన్ ,క్లా రా లు రెండు విభిన్న పాత్రలే అయినా ఒకే స్త్రీ
యొక్క రెండు పార్శ్వాలుగా మనకు కనిపిస్తా యి .తల్లి పాత్ర తో కలిపి త్రయాన్గు లర్ ఈడిపస్
కాంప్లెక్స్ నడిపించాడు .డేవిడ్ మనసు లోని భావాలను చెప్పే అవకాశం వాళ్ళిద్ద రూ ఇవ్వనే
ఇవ్వరు .ఆటను ఏ తండ్రి కొడుకూ కూడా కాదు .ఎవరికీ సో దరుడు కాదు .ఏ ఒక్కడికీ
స్నేహితుడు కూడా కాదు .గారాల పట్టి గా ఉన్న వాడు తిట్లు తినే మారుతి కోడుకై ,బడి
పిల్లా డి ,బాల కార్మికుడి ,అనాధ అయాడు .అతని స్తితి చివరికి ఎలా అయిందంటే ,తను ఎవరో
తనకే తెలీని వింత స్తితి .స్నేహితులు దరికి రాణి జీవి .అంటా ఉత్త మ పురుష లో రాయటం తో
విపరీతం గా అందర్నీ ఆ కట్టు కొన్నాడు .చివరికి ఉనికిని ,వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని
సాధించాడు .ఇదిడికెన్స్ ఆల్ట ర్ ఈగో అని అంటారు .ఇందులోని పాత్రల గురించి చెబుతూ
యి.ఏం.ఫార్స్తర్ అవి ఫ్లా ట్ గా రౌండ్ గా రెండు రకాలుగా వున్నాయని చెప్పాడు .ఫ్లా ట్ కారెక్టర్
మధ్య యుగం లోని మిసేరి ప్లే లలో నిరాశా ,నిష్ప్రుహా వుండే వారుగా వుంటారు .ఈ పాత్రలు
యాంత్రికం గా బొ మ్మల్లా గా కనిపించినపుదల్లా అదే భావాలను స్ప్రింగ్ కదలికల్లో బొ మ్మల్లా గా
ప్రవర్తిస్తా రు .''డికెన్స్ మనుషులు జీవిస్తా రు .దర్జీ కుట్టిన బట్ట లతో,లేక దేనికో చిహ్నాలు గానో
వుండరు ''అన్నాడు నేభారోవ్ అనే విమర్శకుడు .
డికెన్స్ నిఘంటువులు వచ్చాయి .ప్రతి పాత్ర ను విశ్లేషిస్తూ EVERY ONE IN
DICKENS వచ్చాయి .ఆటను సృష్టించిన పాత్రలు 13 ,143
గా లెక్క వేశారు .14 నవలలు రాశాడు .కొన్ని చిన్న కధలు రాశాడు .పాత్రల పేర్లు పెట్టటం లో
డికెన్స్ దిట్ట .ఆయన తర్వాతే ఇంకెవరైనా .ఆ పాత్రల స్వభావాలను బట్టి పేర్లు పెట్టా డు .ఆ
పేర్లు మార్చ టానికి ఇక కుదరదు అంతే .పేరే ఆ పాత్ర అన్నట్లు తీర్చి దిద్దా డు .రచనాసృష్టి లో
స్వభావానికి తగిన పాత్ర పేరు పెట్టటం డికెన్స్ కే సాధ్యమైంది .ఉదాహరణకు MAGWITCH
--MAAGAS+WITCH .ఆటను ఒక మంత్ర గాడు గా కనిపిస్తా డు .కుమ్మరి కొలిమి లో
సహాయకుడు గా ఉన్న వాణ్ని పక్కా జన్టిల్మాన్ గా మార్చాడు డికెన్స్ అతని స్వభావం
ఏమిటో ఆ పేరే మనకు తెలియ జేస్తు ంది .అంతటి లోకజ్నత తో డికెన్స్ రాశాడు కనుకే ఆ
నవల అంత అద్భుతం గా జనాన్ని ఆకర్షించింది .ప్రతి యువకుడు అది తన జీవిత చరిత్రే
అన్న అభిప్రా యం కలుగు తుంది .దటీస్ డికెన్స్ .
బ్లీ క్ హౌస్ నవల భయానక గమ్భేర్క నవల .౧౯ శతాబ్ద పు ఆంగ్ల సాహిత్య మకుటం లో
పిల్లల్ని కని ,పెంచి ,22 ఏళ్ళు కాపురం చేసిన భార్యను వదిలేశాదంతెందరూ ఆశ్చర్య పో యారు
.లండన్ లోని ౫౧,౮౫౮ మ్కన్ది పాతకులకు వివరాలన్నీ రాశాడు .అది చదివిన వారందరూ
సైకిక్ అయ్యాదేమో నని అనుమానించారు .కుటుంబం లో హార్మోని అంటే ఐక్యత లేదని
గ్రహించారు .అప్పటికే న౫౦ ఏళ్ళ వాడుగా కనిపించేవాడు డికెన్స్ .ఏ పనైనా అతి వేగం గా
చేసే వాడు .అందుకనే వేగం గానే పండి పో యాడు .వయసుకు మించి పని చేశాడు .''హ్హా ర్డ్
టైమ్స్ ''నవల లో పారిశ్రా మిక నగరం లో జీవచ్చ వాలుగా వున్న వారి గరించి రాశాడు
ఇందులో కోక టౌన్ అంటే యెర్ర ఇటుకల నగరం .అది భయానక నరక కోపం .అందులో
జీవించే వారి ముఖాలలో ఆనందం ,ఆశ మృగ్యం .ఒకప్పుడు సతత హరితం గా వుండే నగరం
.ఇప్పుడు పొ గ దుమ్ము ధూళి తో మసక బారింది మనుషులూ నల్ల బడి పో యారు
.ఒకరినొకరు గుర్తించ లేని వింత స్తితి .వాళ్ళను ''చేతులు 'అన్నాడు డికెన్స్ .ఓఏడూణ్ణే పనికి
వెళ్ళటం ,సాయంత్రా నికి తిరిగి రావటం తప్ప జీవితాల్లో వెలుగే ఎరుగరు .
మనసు శరీరం బుద్ధి పూర్తిగా ఉపయోగించి గానుగెద్దు జీవితం అనుభ విస్తు న్నారు .ఎఫ్ ఆర్
లూయిస్ ఈ నవలను 'మాస్ట ర్ పీస్ ''అన్నాడు .పూర్తిగా గంభీర మైన అలాక్రు తి అనీ ఆయనే
అన్నాడు
లిటిల్ దొ ర్బిట్ నవల దాస్ కాపిటల్ ను మించిన తిరుగు బాటు నవల (seditious )
.అన్నాడు షా .సమాజం లోని దో పిడీ అణగ దో క్కటం ,జైలు ఈవితం ,స్త ంభాన ,ఉక్కిరి బిక్కిరి
,రాజకీయం అన్నీ కలబో శాడు .చదువు తుంటే ఉక్కిరి బిక్కిరై పాథకుడు విశ్రా ంతి కోసం
కాసేపు పుస్త కాన్ని కింద బెట్టేస్తా డు .సివిల్ ఉద్యోగాస్తు లంతా పని ఎలా ఎగా గొట్టా లో
ఆలోచిస్తు ంటారు .లక్ష్యం చేరని పధకాలు కాగితాలకే పరిమితం .కోర్రీలా గొరిల్లా లు .సాచి వెత
ధో రణి .పాలనలో స్త బ్ద త .నత్త నడకలో అభివృద్ధి పనులు .ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
.సాంఘిక మార్పు గగన కుసుమం .శాఖా చంక్రమణం చేసే ఫెయిల్ వ్యవస్థ లో కని పించేది
వ్యర్ధ ప్రయాసే .ఎక్కడి పని అక్కడ ఆగి పో వటమే .mew street లో మిస్ట ర్ tite bonaancle
ఉంటాడు . mew అంటే ఒకదానికే కట్టు బడిన అని అర్ధం . చని పో యిన వ్లేస్ గాలి చొరని
ఇళ్ళలో పెరుగు తాయని అర్ధం .ఇందులో రెండు భాగాలు .దరిదం్ర ,సంపద .ప్రేమను పాథ
కాలమ్ నుంచి విముక్తి చెందటం చూపించాడు .circumlocution ఆఫీస్ అంటే సమాజం
లోని కాపత్యం .దివాలా కోరు విధానాలు ఎప్పుడు ఉంటూనే వుంటాయి .ముడుచుకున్న
ప్రపంచం లోనవల ప్రా రంభమై ,వికశించిన ప్రపంచం తో ముగుస్తు ంది .రచన చేసే టప్పుడు
మనం ఏ విశేషణం వాడాలో అవన్నీ డికెన్స్ వాడి దారి చూపించాడు .
dicken's depth comes from his breadth '' అంటారు .అతని కేన్వాస్ విస్త ృత మైంది
.సమాజ చిత్రా న్ని అన్ని రంగుల్లో ,అన్ని కోణాల్లో చిత్రించిన చిత్రకారుడు .''నేను ఇక్కడ
వున్నా ,అక్కడ వున్నా .అన్ని చోట్లా వున్నా ,ఎక్కడా లేను ''అని తనను గురించి
చెప్పుకొంటాడు .రచనలను పబ్లి క్ లో చదివి సొ మ్ము చేసుకోవటం డికెన్స్ తోనే ప్రా రంభ మైంది
.అప్పటికింకా రచయితలకు ప్రజా సంబంధాలుండేవి కావు .కొత్త పో కడలు పో యి ప్రేక్షకులకు
అతి సన్నిహితుడై పో యాడు .దీనితో 45000 పౌండ్లు సంపాదించి క్రేజ్ పెంచుకొన్నాడు .అతని
పుస్త కాలనీ అమ్మినా అంత డబ్బు రాలేదు .ఈ సంపద తో అత్యంత ధన వంతుడైన రచయిత
అని పించుకొన్నాడు .ఎవరికి రానంత కీర్తి ,ప్రతిష్ట ధనం సంపాదించుకొన్నాడు .
a tale of two cities అతని నవలా చరిత్ర లో సువర్ణా ధ్యాయం .గొప్ప చారిత్రిక నేపధ్యం లో
వచ్చిన నవల ఇది .ఇందులో సిడ్నీ కార్టన్ ఒక సెక్స్ హీరో .అలాంటి పాత్ర ను ఇంత వరకు
డికెన్స్ శ్రు స్టించ లేదు .శైలికి ,ధైర్య సాహసాలకు దర్పణం .సంఘటన ప్రా ధాన్యం బాగా ఉన్న
నవల .మూడీ గా ,సంఘ వ్యతి రేకిగా ,ఆత్మా హనన దృక్పధం తో కార్టన్ కానీ పిస్తా డు .ఇతని
జీవిత చార మానకం లో డికెన్స్ స్వహావాలే వున్నట్లు కానీ పిస్తు ంది .ఇందులో అసలు కదా
నాయకులు చీమల దండు లాంటి అట్ట డుగు వర్గా లు అంటే మాస్ అన్న మాట .మూక లోని
సైకాలజీ ని అద్భుతం గా వ్యక్తీకరించాడు డికెన్స్ .ఆ మూక భావం తో వ్యక్తీ గత ఇష్ట ం
,వ్యక్తిత్వాలు కలిసి పో యి తందానా తాన అనటం చూస్తా ం .''మండర్లో అద్భుతాలు గుండెల్లో
దాక్కున్నాయ్ .అవసర పరిస్తితులు వస్తే అవే నిద్ర లేస్తా యి ,పని చేస్తా యి ''అంటాడు డికెన్స్
.డికెన్స్ కు విప్ల వం ఇష్ట ం లేదు .అదంటే భయం కూడా .అది సాంఘిక విధానాన్నిభయ పెడు
తుందని అతని భావన .అస్త వ్యస్త పరిస్తితి ఏర్పడి ,వ్యక్తిత్వం దెబ్బతిన్తు న్ద ంటాడు .విప్ల వ
కారులు అందర్నీ ద్వేషిస్తా రు .అంతటినీ ద్వంశం చేస్తా రు .మంచి ,ఐశ్వర్యం మాత్రమె కాక విద్య
,సౌందర్యం ,దయ ,న్యాయం కూడా దెబ్బతింటాయని అతని ఆలోచన .స్వీయ వ్యక్తిత్వం నాశన
మై మూక భావం వ్యాప్తి చెందుతుంది .వాల్లెవరో యేంచేస్తా రో తేలీ కుండా ,తెలుసు కో కుండా
,వాళ్ళు దేనికో చెందుతారని భావించి ఉరితీయటం రాక్షసం అంటాడు .నవల ప్రా రంభ వాక్యాలు
గొప్ప భావ స్పోరకాలు .అలానే చిట్టా చివరి వాక్యాలూ ఆలోచన లను గిల కొడతాయి .నవల
లండన్ నుంచి పారిస్ కు కదుల్తు ంది .బ్రిటన్ ఐక మత్యం నుంచి ,ఫ్రెంచ్ కలోలం వరకు
ప్రా యనిస్తు ంది .చావు నుంచి పునరుద్ధా నం కు చేరుతుంది .రెండు భిన్న వ్యక్తిత్వాలున్న
నాయకులు ఇందులో వున్నారు .నిజాయితీ ఉన్న చార్లెస్ దార్నీ సినిక్ అయిన సిడ్ని కార్టన్
.ఒకే వ్యక్తీ లో భిన్న పార్శ్వాలు .వ్యక్తిత్వాల మార్పు తోనవల ముగింపు ..
కార్టన్ జీవితం చావుతో బతుకు .అతని ధైర్య మరణమే అతని జీవిత పరిష్కారం .దార్నే
మూడు మరణ శిక్షల్ని తప్పించుకొన్నాడు .విప్ల వ రుధిరం తో కొత్త ప్రజాస్వామ్యం పుట్టింది
.ఫ్రెంచ్ మాబ్ దెబ్బను తట్టు కొనే దమ్ము లేక కొదరు ఆత్మా హత్య చేసుకొన్నారు .కార్టన్
డికెన్స్ యొక ఆల్ట ర్ ఈగో అంటే బహిప్రా ణమే .నిరంకుశ కాలమ్ లో జీవించిన ఆదర్శ జీవి
.అతని అసమర్ధత ,విషాద మరణం కార్టన్ నిజమైన వ్యక్తిత్వాన్ని సఫలం చేసింది .అతను కధా
నాయకుడు కాదు .కాని అందులోంచి వచ్చిన వ్యక్తీ .అతని చివరి మాటలు పాథకుల కు కళ్ళ
నీళ్ళు తెప్పిస్తా యి .ఇందులో మేడం దిఫార్జ్ పాత్ర తిరుగు బాటుకు మూర్తి మత్వమే
.మాటలతో చెప్పలేని క్రూ రత్వం, పగకు ప్రతీక .ఆ నెలలో 23 వ తారీకు న ఉరితీయ బడ్డ 23 వ
మ్వాడుకార్టన్ .
డికెన్స్ రాసిన గ్రేట్ expectations చాల గొప్ప నిజాయితీ నవల గా గుర్తింపు పొ ందింది
.ఉత్త మ పురుష లో రచన వుంది .ఒక యువకుని ఉత్తా న ,పతనాలు ,సాజం లోని అస్తిత్వ
వికాసం కనిపిస్తా యి .ఇది డికెన్స్ పరి పక్వ రచన అంటారంతా .పిప అనే యువకుడి పై కలిగే
జాలి డికెన్స్ కే చెందు తుంది . 1867 లో డికెన్స్ రెండవ సారి అమెరికా కు
వెళ్ళాడుఇరవైయిదేల్ల తర్వాత .మూడు వెళ్ళ దూరం ప్రయాణం .డబ్బుకోసం ఆత్మ హత్యా
సదృశ మైన ప్రయాణం అన్నారు .చావు తప్పి కన్ను లొట్ట పో యినట్లు సాగింది అంతా .౭౬
రీదింగ్స్ లో 2 28000 డాలర్లు మూట కట్టు కోచ్చాడు .రోజుకు యాభై వేల దాలర్ల న్న మాట
.బానిసత్వ చట్ట ం అమెరికా లో వచ్చి నల్ల వారు ,తెల్ల వారు కలిసి జీవిస్తు నారు .కనుక
ఆవిషయం పై మాట్లా డ లేదు .newyork యాభై వేల మంది హాజరు .అయిదు వేల మంది
టికెట్ కోసం అర మైలు క్యు లో నిలబడ్డా రు .కొంత మంది అయితే రాత్రికే అక్కడికి చేరి చల్ల
గాలి భరిస్తూ నిల బడ్డా రు .ఎదురు లేని ,ఊహించ లేని విజయం .అనవసర వ్యాఖ్యలు
చేయలేదీ సారి .ఇంగ్లా ండ్ తిరిగి వచ్చి our futual ఫ్రెండ్ పేర వ్యాసాలు రాశాడు
''రచయిత జీవితం లో అనేక మార్పులు రావటం సహజం ''అంది వర్జీనియా ఉల్ఫ్ .''మా
నాన్న సృష్టించిన కొడుకులు అంటే మా నాన్న కు మా కంటే ఎక్కువ ఇష్ట ం ''అన్నాడు డికెన్స్
పుత్ర రత్నం జూనియర్ డికెన్స్ .డికెన్స్ కు డేవిడ్ కాపర్ ఫీల్డ్ అటే విపరీత మైన అభిమానం
.గొప్ప వాళ్ల కొడ్కులు తండ్రి అంత గొప్ప వారు కాదు .''ఒక తరం లో ఇద్ద రు డికెన్స్ లు
లభించటం అసంభవం ''అన్నాడు ప్లో బ్ .డికెన్స్ కొడుకులకు దికేంసే తరగని ఆస్తి అని తీర్పు
చెప్పాడాయన .
'' the mystery of edvin drod ''అతి చినా నవల .దైన్యం అలసట ,దిగజారు తనం తో
వుంటుంది .సాధారణం గా డికెన్స్ నవలలు 19 నెలలుసీరియల్ గా వస్తా యి .దీన్ని
పన్నెందుకే ముగించాడు .గొప్ప రచయిత వీడ్కోలు చెబుతున్నట్లు గా సాగిన నవల ఇది
.''ఇప్పటికే మూడొంతులు చని పో యిన వాడి భావన -అరిష్కారం లేనిమిస్త్రి ''అన్నాడు
.అందులోని ఎడ్విన్ ద్రూ డ్ పాత్రనుచంప కుండా వుండాల్సింది అని అతని ఒదిన అన్నది
.దీనికి సమాధానం గా డికెన్స్ ''నా పుస్త కాన్ని మిస్త్రి అన్నాను కాని ఎడ్వి ద్రూ డ్ హిస్టరీ అని
నేను చెప్ప లేదే ,ఆ పేరు పెట్ట లేదే ''ఆనాడు .''ఒక డిటెక్టివ్ కధ రాశాను .అందులో రహశ్యాలు
దాచ లేదు .దాన్ని ఈనాటి వరకు కాపాడు కుంటు వచ్చాడు డికెన్స్ ''అన్నాడు
జి.కే.chestartan .
ఆధునిక ఇంగ్లీష్ నవల డికెన్స్ తోనే ప్రా రంభ మైంది .ఆయన్ను స్వీయ చారిత్రా త్మక
రచయిత అన్నారు .తనను మించి పో యేట్లు రాశాడు .''తన మీద కంటే ఇతరుల మీద
ఆయనకు చాలా అభిరుచి .''ఆనాడు జోనాధన్ ఆర్డ్లీ .ఆయనలో ఎంత ఆధునికత వుందో
ఆయన రచనలుతెలుస్తు ంది .మానవ జీవన సంఘర్షణను అంతా రచనలో చూపించాడు
.చాలా తీవ్రం గా ,బలం గా బతకటం వల్ల డికెన్స్ తక్కువ వయసు లోనే మరణించాడు .ఎడమ
కాలు ఇంఫెచ్ట్ అయింది .గౌట్ -అంటే వాతం కమ్మింది .జూన్ లో రైల్ ప్రమాదం జరిగినా
కంగారు పడ లేదు .వేగం గా వెళ్ళే రైళ్ళలో ప్రయానిన్చాతమంటే డికెన్స్ కు చాలా ఇష్ట ం
.దీనితో షాక్ అయాడు .వేగం తగ్గా లని కోరుకొన్నాడు .ప్రమాదం జరిగిన అయిదేళ్లకు
చనిపో యాడు .నరాల వ్యవస్థా బాగా డెబ తింది .డికెన్స్ చైన్ స్మోకర్ అని చాలా మందికి
తెలీదు .సిగారట్లు ,చుట్టా లు బాగా తాగే వాడు .1869 లో .ఫరేవేల్ టూర్ పాన్ చేశాడు .1870
లో పిక్విక్ అనే పేరే ఉచ్చ రించా లేక పో యాడు .అంత మాటకారి ఉపన్యాసకుడు మాట్లా డ లేక
పో వటం విధి విచిత్రం .రీడింగ్ చేస్తు న్నా హాశ్యం పండించా లేక పో యే వాడు .అతి మందుల
వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది .58 మవ ఏడు ప్రవేశించింది .కూతురు కిట్టి కి వీడ్కోలు చెప్పాడు
.తాను ఒక మంచి తండ్రిగా ,మంచివాడు గా బ్రతికాను అం చెబుతూ ''గాడ్ బ్లెస్ యు
''అన్నాడు .తనకేం పర్వాలేదు కంగారు పడక్కర లేదని ఆమెకు ధైర్యం చెప్పాడు .జూన్
ఎనిమిదిన కొంత దూరం నడిచాడు కూడా .కళ్ళల్లో కన్నీరు ధారా పాఠం గా వస్తో ంది .కూతురు
వచ్చి పడుకోమని చెప్పింది ''ఎస్ ఆన్ ది గ్రౌ ండ్''అన్నాడు నర్మ గర్భం గా .౧౮౭౦ జూన్
తొమ్మిదవ తేది ఉదయం ఆరు పది నిముషాలకు తుది శ్వాస వదిలాడు డికెన్స్ .''అసమాన
మహా రచయిత అస్త మించాడు '.అంత్య క్రియలకు హడావిడి చేయవద్ద ని విల్లు లో రాశాడు
కానీ టైం మాగజైన్ వెస్ట్ మినిస్ట ర్ అబ్బే లో చేయాలని సూచించింది .అలానే చేసి గోరా
వించారు .''జీవించి నంత
కాలమ్ విధ్యుక్త ధర్మా లుంటాయి .నాకు మాత్రం దాని ఆనందం ఎప్పుడో పో యింది ''అన్నాడు
డికెన్స్ .డికెన్స్ పేర ఫెలోషిప్ ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వెస్ట్ మినిస్ట ర్ ఆబే లో డికెన్స్
వర్ధంతిని అత్యంత ఘనం గా చేస్తూ నే వున్నారు .ఆయన ఋణం తీర్చుకొంటున్నారు ..
సమాప్త ం ఆధారం --friendly dickens --రచయిత norrie epistein
డికెన్స్ పై ఈ వ్యాస పరంపరను ఇంగ్లీష్ లో అమోఘ పాండిత్యం ,ఆంగ్ల సాహిత్యం లో లోతైన
పరిశీలన చేసి అమ్రు తోప మాన మైన ఆంగ్ల ప్రసంగాన్ని చేస్తూ ,నిర్దు ష్ట మైన భాషను
మాట్లా డుతూ ,ఆ సాహిత్యాన్ని మదించి ,సాటి వారిలో ఎవరు తనకు సాటి లేరని అందరు
చెప్పుకొనే రీతిలో వుండే మా అన్న గారు స్వర్గీయ జి.ఎల్ శర్మ(1912 -1958 ) గారికి అత్యంత
భక్తీ శ్రద్ధలతో అంకితమిచ్చి నా భ్రా త్రు ఋణం తీర్చుకుంటున్నాను .
ఆధునిక అమెరికాసాహిత్య చరిత్ర లో నలభై ఏళ్ళ కు పైగా లలిత కవిత్వాన్ని (light verse ) రాసి
ప్రజాభి మానాన్ని పొ ందిన కవయిత్రి ఆమె .రెండవ ప్రపంచ యుద్ధా నికి దశాబ్ద ం ముందే కవిత్వ రచన
ప్రా రంభించి ,ఆ తర్వాతా మూడు దశాబ్దా లు పాటు అప్రతి హతం గా రాసి,విజయ బావుటా ను ఎగా రెసిన
గొప్ప రచయిత్రి .సమకాలీన కవులందరి కంటే ముందుకు దూసుకు పో యింది .హాస్యం ,వ్యంగ్యం జోడించి
సమకాలీన విషయాలను వెలుగు లోకి తెచ్చింది .ప్రజా జీవితానికి అద్ద ం పట్టింది . మేటి పత్రిక లైన’’
న్యూయార్కర్’’ ‘’,సాట ర్ డే ఈవెనింగ్ పో స్ట్’’ పత్రికల లో ఆమె రచనల చోటు చేసుకోన్నాయంటే ఎంత
గొప్ప రచనలు చేసిందో తెలుస్తు ంది ..
బాల్యం విద్య
1905 మార్చ్ 11 ణ గిన్లి అమెరికా లోని ఓరిగాన్ రాష్ట ం్ర ఒంటారియా లో జన్మించింది .తండ్రి రియల్
ఎస్టేట్ వ్యాపారాన్ని చేసి నష్ట పో తూ తరచుగా వూళ్ళు మారుస్తు ందే వాడు అందుకని ఆమె బాల్యం ఒక
ఊరికే పరిమితం కాలేదు .చివరికి కొలరేడా లోని ఐలిఫ్ అనే మారు మూల ప్రా ంతానికి కుటుంబాన్ని
మార్చాడు .అక్కడ తమ్ముడి టో వంటరి గా ఉండాల్సి వచ్చింది .పన్నెండవ ఏటే తండ్రి మరణం .తల్లి
ఊతా కు వీరిని తీసుకొని వెళ్లి ఉంది .అక్కడి యునివేర్సిటి లో చేరింది కాని తానేమీ పెద్దగా నేర్చు
కొన్నదేమీ లేదని చెప్పింది .కవిత్వం ,కధ ,వ్యాస రచన పో టీల్లో పాల్గొ ని రెండు సార్లు నగదు బహుమతి
సాధించింది .ఆపాటికే ప్రసిద్ధ పత్రికల కు రాసేది .న్యూయార్కర్ పత్రిక వాటిని స్వీకరిస్తూ నే ‘’మీ స్త్రీలందరూ
రాసే ఏడుపు గొట్టు కవిత్వాన్నే నువ్వూ ఎందుకు రాసి ఏడి పిస్తా వు ?ఏదైనా కొత్త గా రాయటానికి
ప్రయత్నించు ‘’అని సున్నితం గా సలహా కూడా ఇచ్చాడు సంపాదకుడు .అది మనసు లో పడి ,నచ్చి
కొత్త గా రాయటం ప్రా రంభించింది .
గిన్లి న్యూయార్క్ చేరింది .రాయటం ,ప్రచురించటం ప్రా రంభించి కోన సాగించింది .హాస్యం
,వ్యంగ్యం కలిపి జోడించి మనసులకు చేరు వై నది. జూనియర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగమూ చేసింది
.ఆమె హాస్యం ఆ ప్రిన్సిపాల్ వంటికి పడ .లేదు .మానేసి’’ టౌన్ అండ్ కంట్రి ;; పత్రిక లో చేరింది .బెల
టెలిఫో న్ లో పని చేస్తు న్న చార్లెస్ హేదేన్స్ కు చేరువై పెళ్లి చేసుకొన్నది .ఇద్ద రు కూతుళ్ళు పుట్టా రు
.చిన్న ప్పటి నుంచి స్వంత ఇల్లు ఉండాలని కల లు కనేది .ఆ కల ను భర్త సాఫల్యం చేశాడు న్యూయార్క్
దగ్గ ర్లో ఇల్లు కొని సంతోషం కలిగించాడు అక్కడ రచనా వ్యాసంగాన్ని అప్రతి హతం గా సాగించింది .
కుటుంబ వ్యవహారాలే కాదు సాంఘిక కార్య క్రమాలలోను పాల్గొ ంది .ఆనాడు bright young అని
పించుకొన్నా ఆడెన్ వంటి యువా కవులు యుద్ధ నినాన్దా లతో లేక్చర్ల తో రాజకీయాలను చెరిగి
పారేస్తు న్నారు .వారంతా హాయిగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ,కుర్చీలకే పరి మిత మైన వారు .వారి పై
’stones from the glaas house ‘’,small wonder ‘’వంటి మ్యూజికల్ లిరిక్స్ రాసి ప్రచు రించింది .ఆమె
ప్రతిభకు తగ్గ పురస్కారాలు లభించాయి .గౌ రవాలు దక్కాయి .national academy of arts and
letters కు ఎన్నిక అయింది .లైట్ వేర్స్ లో పులిట్జ ర్ బహుమతి పొ ందిణ మొదటి మహిళా గా గుర్తింపు
పొ ందింది .బాలల కోసం డజను కు పైగా పుస్త కాలు రాసింది .అమెరికా ,అమెరికన్ స్కాలర్ ,రీడర్స్ డైజెస్ట్
వంటి పేరున్న పత్రికలలో ఆమె రచనలు చోటు చేసుకొని ఆమె కు గౌరవాన్ని కల్గించాయి .ఆనాటి ప్రసిద్ధ
చర్చి బిషప్పు లతో ప్రముఖ రచయితలైనా జాన్ అప్డైక్ వంటి వారితో ,మాకార్దీ ,రాక్ ఫెల్లర్ వంటి రాజ
కీయ నాయకులతో థియేటర్ ఆర్టిస్ట్ లతో ఆమె ఉత్త ర ప్రత్యుత్త రాలు జరిపింది ..1968 లో వచ్చిన
న్యూయార్క్ అబార్షన్ యాక్ట్ పానెల్ కమిటీ లో సభ్యురాలైంది .
1965 జూన్ 18 టైం మేగజైన్ ఫిలిస్ మెక్ గిన్లి ముఖ చిత్రం వేసి ప్రచు రించి ఆమె ఖ్యాతి కి
నీరాజనం పట్టింది .గృహానికే పరిమిత మైనా .ఆమె తన పై విమర్శలు చేసిన వారి ని దృష్టి లో ఉంచు కొని
సమాధానం గా ‘’సిక్స్ పెన్స్ ఇన్ హర్ షో ‘’, లో’’ ఎంత చదువు కొన్న వారి కైనా సుఖ సంతోషాలు ఇంటి
లోనే సాధ్యం అని చెప్పింది .ఆడ వారు ఇంట్లో నే ఉండటం వారికే కాక సమాజానికీ మంచిది అని తెలియ
జేసింది .గృహిణి మిగిలిన వారి కంటే విచక్షణ జ్ఞా నం ఎక్కువ గా కలిగి ఉంటుందని ,రాజకీయాలకు చక్కని
భాష్యం చెప్ప గలదని ,పేపర్లో వచ్చే విషయాలను బాగా విశ్లేషించ గలదని,భర్త ల వ్యాపార లావా దేవీలలో
స్పష్ట మైన సలహా ఇవ్వగలరని ,వారికి సహాయ కారి గా ఉండగలరని స్పష్ట ం చేసింది .పిల్లలకు వినోదాన్ని
గృహిణి మాత్రమే పంచ గలదని ఆమె నిశ్చితాభి ప్రా యం .ఇప్పటికే పుస్త కాలు ,సంగీతం ,నాటకం ,చిత్ర
లేఖనం మొదలైన రంగాలలో స్త్రీలు గొప్ప సాంస్కృతిక విని యోగా దారు లు గా చేలా మణి లో ఉన్నారని
కుండా బద్ద లు కొట్టింది .’’మహిళలు గా ,ఇల్లా ండ్రు గా మేము రాబో యే తరాలను ప్రభావితం చేయ గల శక్తి
సంపన్నులం .ఆడ ,మగ తమ పరిధుల్లో తాము పని చేసుకొని పో తూ ఉంటె ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు
.గృహ ధర్మానికి భంగం కలుగ నంత వరకు ఇంటికి బయట సాంఘిక సేవ చేయటం మంచిదే .’’అని తన
సిక్స్ పెన్స్ రచన ముగించింది .ఉన్నది ఉన్నట్లు గా మాట్లా డటం చెప్పటం రాయటం గిన్లి ప్రత్యేకత
.అందుకే ఆమె కు అందరు అభిమానులున్నారు .ఆ పుస్త కం ఒక లక్ష కాపీలు అమ్ముడు పో యింది అంటే
ఆమె పాప్యులారిటి ఎంత గొప్పదో ,ఆమె ప్రభావం ఎందరి మీద ఉందొ అర్ధ ం అవుతుంది .
గిన్లి రాసిన వచన రచనలు province of the heart ‘’,wonderful time ‘’,saint watching
‘’పుస్త కాలు విశేష ఆదరణ పొ ందాయి .1972 లో భర్త చని పో యే వరకు రాస్తూ నే ఉంది .1978 ఫిబవ
్ర రి
22 న గిన్లి ఇహ జీవితాన్ని చాలించింది .
హిల్డా డూ లిటిల్
H.D.గా అని అందరికి సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా
పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్ ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి
మాటల్లా ఉంటాయని ప్రశంస పొ ందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు పొ ందింది. ఇమేజిస్ట్ ల
ప్రభావం నుంచి క్రమంగా దూర మైనా ,ఇంకా ఆమె ను అలాగే భావిస్తా రు .
హిల్డా ,అమెరికా లోని పెన్సిల్వేనియా లో బెతేల్హా ం లో 1886 సెప్టెంబర్ పది న జన్మించింది
.తండ్రి ఆమె కు ఖగోళం ,గణితం బో ధించాడు .పెన్సిల్వేనియా యూని వేర్సిటి లో ప్రొ ఫెసర్ గా ,ఫ్ల వర్
అబ్సర్వేటరి డైరెక్టర్ గా పని చేసంి ది .తల్లి ప్రో తెస్తంట్ మతంలో అసమ్మతి వర్గా నికి చెందినా మొరోవియన్
బ్రదర్హు డ్ లో సభ్యురాలు .దేవుని తో ప్రత్యక్ష అనుభవం ఉన్నట్లు గా తల్లి భావించేది .కూతురు కూడా తన
కవితా ప్రతిభ దైవీ కృతం అన్నది .క్వేకర్ స్కూల్ లో ,బ్రియాన్ మార కాలేజి ల్లో విద్య నేర్చింది
.మిరియాన్ మూర్ అనే ఆర్టిస్ట్ టో పరిచయం కలిగింది .ఎజ్రా పౌండ్ తో సరస సల్లా పాలు సాగించింది
.తర్వాతా w.c.విలియమ్స్ కవితో క్లో జ్ గా ఉంది .కాలేజి లో కొద్ది కాలమే చదివింది .పౌండ్ ,గ్రెగ్ ల ప్రవర్త
నతో మానసికం గా కుంగి పో యి,డిప్రెషన్ లో పడింది .ఈ విషయాన్ని స్వేయ చరిత్ర HERmione లో
రాసుకోన్నది .గ్రెగ్ ,అతని తల్లి టో యూరప్ పర్యటనకు వెళ్ళింది .లండన్ లో పౌండ్ ఆమెను
ప్రముఖులకు పరిచయం చేశాడు .అప్పటికి ఇంకా జేమ్స్ జాయిస్ వెలుగు లోకి రాలేదు .D.H. laarens
తో H.D.స్నేహం చేసింది .ఈ విషయాన్ని portrait of a genius పుస్త కం లో ఆల్లిన్గ్తాన్ రాశాడు .పౌండ్
ఒంటెత్తు పో కడ లకు విసిగి పో తోంది .ఆలింగ్తా న్ ఆమెను ఫ్రెంచ్ సింబాలిజం అధ్యయనం చేయమని ప్రో త్స
హించాడు .దాని పై ద్రు ష్టి పెట్టింది
1913 లో ఆలింగ్తా న్ ను పెళ్ళాడింది .పౌండ్ ,భర్త ల సహకారం తో the egoist పత్రికా సంపాదకు
రాలు అయింది . . 1917 లో భర్త ’’ గ్రేట్ వార్’’ లో పని చేయటానికి వె డితే, సిసిలీ గ్రే అనే సంగీత కళా
కారుడి తో వ్యవహారం నడిపింది . న్యు మోనియా వచ్చి బాధ పడింది .బ్రిహర్ అనే నవలా రచయిత టో
పరిచయం పొ ంది ,చివరిదాకా కోన సాగించింది .అతడు ఇంకో అమ్మాయి మెక్ ఆల్మన్ తో ప్రేమాయణం
సాగిస్తే వారితో పాటే పారిస్ చేరింది .ఆమె రచనలను సరి దిద్ది ప్రచురించింది .1921 లో hymen అనే
కవితా సంకలనాన్ని ప్రచురించింది హిల్డా .ఆ తర్వాతా hyppolitus timporizes ,the red roses for
bronze కవితా సంకలనాలను విడుదల చేసంి ది .
బ్రిహర్ భార్య కు విడాకులిచ్చాడు .కెన్నెత్ ను కళ్యాణం ఆ డాడు .ఆమె సినీ నిర్మాత .భార్యా
భర్త లు’’ క్లో జప్’’ అనే జర్నల్ నడిపారు ‘హెచ్ .డి .మూడు సినిమాల్లో కన్పించింది .ఫిలిం డైరెక్టర్లతో
పరిచయం పెంచు కొంది .బ్రిహర్ ఆమె ను ఇటలి తీసుకొని వెళ్లి సిగ్మండ్ ఫ్రా యిడ్ కు పరిచయం చేశాడు
.tributes to freud అనే విశ్లేషణాత్మక రచన 1956 లో చేసింది .అందులో ఫ్రా యిడ్ జబ్బులు కని పెట్టె
విధానం తప్పు అని తేల్చింది .తర్వాతా బ్రిహర్ కుటుంబం టో స్విత్జేర్లా ండ్ వెళ్ళింది .నాజీ ల ఘోర
కృత్యాలకు బలి పో తున్నయూదులను , ,వామ పక్షీయులను తప్పించటానికి బ్రిహేర్ సరి హద్దు దాటి
వారిని తప్పించు కోనేట్లు సాయం చేశాడు .
రెండవ ప్రపంచ యుద్ధ ం కాలం లో లండన్ నగరం లోని హైడ్ పార్క్ దగ్గ ర్లో కాపురం ఉండే
వారు .అతను life and letters to day అనే మాగజైన్ ప్రచురించే వాడు .కొత్త వచనం కవిత్వం మీద డూ
లిటిల్ శ్రద్ధ వహించింది .the walls do not fall అనే కవిత లో యుద్ధ సమయం లో లండన్ వణికి
పో తున్న స్తితిని కళ్ళకు కట్టి నట్లు వర్ణించింది .ఆ తర్వాతా tribute to angels ,flowering of the rod
కవితా సంకల నాలను తెచ్చింది .ఈ మూడిటిని triology అంటే త్రయం అంటారు .ఆ తర్వాతా ఆమె
ఆధ్యాత్మిక భావన లో మునిగి పో యింది .తంత్ర శాస్త ం్ర ,ఖగోళ శాస్త ం్ర ,tarot cards వంటి వాటి మీద
ద్రు ష్టి ఎక్కువైంది .యుద్ధా నంతరం నరాల బలహీనత బాధించింది .స్విస్ లో చికిత్స చేయించు కొన్నది
.అయినా ఆమె లోని కవితా వేశంఆగ లేదు .నిత్య శ్రో తస్విని లా ప్రవహిస్తూ నే ఉంది .1957 లో ‘’ సెలెక్టెడ్
పో యెమ్స్ ‘’ప్రచురించింది .1960 ,61 ల లో bid me to live ,,helen in egypt అనే నవల ల ను
రాసింది .చివరి సారిగా 1960 లో అమెరికా వచ్చి వెళ్ళింది .అప్పుడామే కు American academy of
arts and letters మెడల బహూక రించారు .1961 లో జూరిచ్ వెళ్ళింది .అక్కడే తీవ్ర మైన గుండె పో తూ
వచ్చి మరణించింది .
ఆమె మరణించిన తర్వాతా ఆమె కవిత్వాన్ని అధ్యయనం చేయటం ఎక్కు వైంది .సాహిత్య
చరిత్ర కారులు దృష్టిని కేంద్రీకరించారు .Her self Defined ane aame jeevitha charitra
raashaaru .the poet HD.and her world 1984 లో వచ్చింది .ప్రముఖ విమర్శకులందరూ ఆమె
సాహిత్యం పై పరిశోధనలు చేస్తూ గ్రంధాలు రాస్తూ నే ఉన్నారు .ఆమె పేరు ’’ Doo Litil ‘’అయినా ‘’Did a
great job ‘’అని పించుకోన్నది హిల్డా డూ లిటిల్ .
an incident here and there –and rails gone (for guns )—from your (and my )old town
square
must and must gray not colour –still the luxor bee –chick and hare –pursue un
alterable purple
for i know how the lord god ---is about to manifest when I –the industrious worm –spin
my own shroud ‘
ఫిక్షన్ లో పేరు పొ ందినా ఆమె సాహితీ జీవితం కవిత్వం తో ఆరంభమైంది .అద్భుత కవిత్వాన్ని వర్షించింది
.నవలలు ,కధలు ,మానవ జీవిత చరిత్ర (anthro pology ),అనేక సాహిత్యేతర అంశాలు ,విమర్శ రాసి పుంఖాను పున్ఖ ం గా
పుస్త కాలను విడుదల చేసింది .ఆమె రచనలు చాలా భాగం ప్రజా పక్షమే అయినా ,కవిత్వం మాత్రం ఆమె స్వంతమే
.సాంద్రం గా ,భావ స్పోరకం గా ,సూటిగా ఆమె కవిత్వం ఉండటం తో మనసును ఇట్టే ఆకర్షిస్తా యి .వాటిల్లో మానవులు ప్రకృతికి
దూర మై పో వటం ,మనుష్యుల మధ్య సంబంధాలు దృశ్యమాన మవుతాయి .మంచి తెలివి తేటలతో చాతుర్యమైన వాదాలతో
,వివేకం టో ,ఆలోచనా ధో రణి టో ,ఇతిహాసాల కధలను ఆధారం గా చేసుకొని ఆమె రచనలు చేసింది .నాటకీయ ముగింపులు
,మాటల్లో అమిత శక్తి ఆమె కు పెద్ద వరాలైనాయి .
అసలు పేరు మార్గ రేట్ ఎలినార్ అట్ వుడ్ . ..అమెరికా లో ఒంటారియా రాష్ట ం్ర లో అట్టా వా లో 1939
నవంబర్ పది న జన్మించింది .తండ్రి జంతు శాస్త ్ర వేత్త .అరణ్య ప్రా ణుల పై పరిశోధన కోసం ఉత్త ర క్యుబెక్ అడవులకు తరచూ గా
వెళ్ళే వాడు .కుటుంబం ఆయనతో నే ఉండటం వల్ల ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగింది .అయితేనేం అందిన
ప్రతి పుస్త కం చది వింది .క్లా సిక్స్ నుంచి కామిక్స్ దాకా దేన్నీ వదల్ల కుండా చదివేసింది .కెనడా దేశం మీద అభిమానం పెరిగింది
.wildernes tips and other stories లో తన అనుభావాలన్నిటిని రాసే సింది .కుటుంబం తత్వాత కెనడా లోని torento కు
చేరింది .అక్కడి యునివేర్సిటి లోని విక్టో రియా కాలేజి లో చదివింది . .అక్కడి అధ్యాపకులు సాహిత్య కారులు ,సాహితీ
విమర్శకులు అయిన ఫెయిర్ ,మాక్ ఫెర్సన్ ల దృష్టిని ఆకర్షించింది .వారి ప్రభావం ఆమె పై గాడ్హ ం గా పడింది .మొదటి
పుస్త కం’’ ''డబల్ పెర్స ఫో న్ ‘’స్వంతం గా ప్రచురించింది .ఇది గ్రీకు మైథాలజీ లోని స్త్రీలను ఉద్దేశించి రాసిన కవితలు .దీనికి
E.J.Pratt మెడల్ ను మొదటి సారిగా అందు కొంది .ఉడ్రో విల్సన్ ఫెలోషిప్ తో హార్వర్డ్ ఉమెన్స్ కాలేజి లో ,చదివి ,ఆ
తర్వాతా విక్టో రియన్ సాహిత్య పరిశోధన కోసం పి.హెచ్.డి..కోర్సుకు చేరి పూర్తీ కాకుండా నే ఆ డిగ్రీ పొ ందకుండానే మానె సింది
.కాని ఆ తర్వాతా డజన్ల కొద్దీ గౌరవ డాక్టరేట్లను అందుకొన్న విద్యా రాణి
తర్వాత రెండు చిన్న కవితా సంకలనాలు మొదటి నవల మొత్త ం అయిదింటిని అతి తక్కువ కాలం లో రాసి
ప్రచురించింది .తన తరం ప్రసిద్ధ రచయిత గా గుర్తింపు లభించింది .’’the animals of that country ‘’,the journals of
susannaa ‘’,moodee ‘’రచనలు ఆమెకు గొప్ప పేరు తెచ్చాయి .రెండో ది కెనెడియన్ పయనీర్ చరిత్ర .అంటే ఆ దేశాన్ని
మలుపు తిప్పిన మహనీయుల చరిత్ర .తరువాత నవలలు రాసి మెప్పు పొ ంది నవలా రచయిత గా చిరస్తా యి పొ ందింది
.వాటిలో ముఖ్యమైనవి –procedures for under ground ,power politics ,you are happy ,lady
oracle ,suffering ,Edith women .ఆమె రాసిన the handa maid’s tale ఆర్ధ ర్ సి.క్లా ర్క్ అవార్డ్ పొ ందింది .అది సినెమా గా
కూడా తీశారు .ఇప్పటికే లబ్ధ ప్రతిష్టు రాలిన నవలా రచయిత అని గుర్తింపు వచ్చింది .కవిత్వం వెనకడుగు వేసింది ..ఆమె
కవిత రాసినా ,నవల రాసినా జీవన పో రాటం అందు లో ఉంటుంది .అంటే సర్వైవల్ ను ద్దృష్టి లో పెట్టు కొనే ఏదైనా రాసింది
.ఆమె నవలలో ని నవలా మణులు అధికార పో రాటం లో నలిగి పో వటం సర్వ సాధారణం .వ్యంగ్యాన్ని మేళవించి రచనకు
జీవం పో స్తు ంది .
మార్గ రేట్ బ్రిటీష కొలంబియా ,మాంట్రియల్ ,ఆల్బెర్తా లలో బో ధనా చేసింది .టోరంటో లో ని న్యూయార్క్
వర్సిటి లో అధ్యాపకురాలైంది .న్యూయార్క్ ,ఆస్ట్రేలియా,అలబామా లలో'' రైటర్ ఇన్ రెసిడెన్స్'' గా పని చేసింది .గ్రీన్ గిబ్సన్
అనే నవలా రచయిత ను పెళ్ళాడింది .1982 లో’’ సెకండ్ వర్డ్స్’’ ,-‘’సెలెక్టెడ్ క్రిటికల్ ప్రో స్ ‘’రాసింది ‘’.ది న్యు ఆక్స్ ఫర్డ్ ఆన్తా లజి
ఆఫ్ కెనెడియన్ వేర్స్ ‘’ కు ప్రధాన సంపాదకు రాలి గౌరవం పొ ందింది .ప్రతిభకు తగ ప్రతి ఫలం లభించింది .
ఎనభై వ దశకం లో అట్ వుడ్ రాసిన నవల లన్ని కెనడా ,బ్రిటన్ దేశాల బహుమతులను సాధించి నవే.
‘’.కాట్స్ ఐ ‘’ అన్నది 1988 లో రాసింది .ఇదీ బహుమతి పొ ందింది .1970 –2006 మధ్య కాలం లో తొమ్మిది సంపుటాల షార్ట్
స్టో రి ఫిక్షన్ ,మూడు ఆంత్రో పాలజిలు , ఎడిట్ చేసింది .అందులో రెండు ఆక్స్ ఫర్డ్ కోసం చేసినవి ఉన్నాయి .అరడజన్ కు పైగా
బాల సాహిత్య పుస్త కాలు రాసింది .negotiating with dead ,a writer on writingwith intent ,essays ,reviews ,personal
prose వంటివి ఓహ్ ఎన్నో రాసింది .రాసినవన్నీ వన్నె ,వాసి గలవే .నవల మీద ద్రు ష్టి ఎక్కువ అవటం టో కవిత్వం పలచ
బడింది .అయితేనేం -2007 లో’’ ది డో ర్ ‘’ కవితా సంకలనం టో తానేమీ వెనక పడి లేనని సామర్ధ్యాన్ని రుజువు
చేసుకొంది. .అభిమానం కూడా పెంచు కొంది . కవి గా తన స్థా నం ఎప్పుడు అగ్రభాగమే అని రుజువు చేసింది .
'' రైటర్స్ యునియన్ ఆఫ్ కెనడా'' కు ఆఫీసర్ అయింది .’’P.E.N. ‘’ కు ప్రెసిడెంట్ అయి రాజ కీయ ఖైదీలుగా బందీలైన
రచయిత లను విడి పించే అవకాశాన్ని పొ ందింది .వారి తరఫున తీవ్ర పో రాటమే చేసింది .మార్గ రేట్ రాసిన ‘’బ్లైండ్ అస్సాసిన్ ‘’
అనే నవలకు 2000 సంవత్సరం లో’’ బుకర్ ప్రైజ్ ‘’వస్తే ,వారు అంద జేసిన 50,000 డాలర్ల భారీ నగదు పారి పారితోషిక
ధనాన్ని’’environmental group ‘’కు ఉదారం గా ఇచ్చిన త్యాగ మూర్తి ఆమె .మాటల్లో నే కాదు చేతల్లో ను తనకు సాటి
లేరని నిరూపించు కొంది .గత పాతిక ఏళ్లు గా ఆమె సాహిత్యం పై నిరంతర అధ్యనం జరుగు తూనే ఉంది .ఎన్నో పరిశోధనాత్మక
గ్రంధాలను వెలువ రించారు .వేలువరిస్తూ నే ఉన్నారు .అందులో ముఖ్యమైనది ‘’the cambridge companion to M.Atwood
అనేది రెండు వేల సంవత్సరం లో ప్రచురిత మైనది .ఇంకో పుస్త కం ‘’అట్ వుడ్ ఎ .క్రిటికల్ కంపానియన్ ‘’
మార్గ రేట్ కవితా సంకలనాలన్ని నిత్య నూతనం గా ఉంటాయి .ఆమె లోని ధైర్యం ,నిబ్బరం గా చెప్పే భావాలు
,ఎంచుకొన్న భాషా ,పద జాలం అందర్ని ఆకర్షిస్తా యి .పురాతన విషయ మైనా ,ఆధునిక విషయ మైనా ఒక'' లాండ్ స్కేప్'' గా
మన ముందు చిత్రించి నిల బెట్టటం ఆమె ప్రత్యేకత .హింసాత్మక సంఘటనలను రాయాల్సిన అవసరం వచ్చినా ఎక్కడా
బాలన్స్ తప్పక పో వటం ఆమె కున్న గొప్ప రచనా లక్షణం .కోపాన్ని ,ద్వేషాన్ని చాలా అదుపు లో ఉంచు కొని రాసి, ఆ
భావాలను నిండుగా ఆవిష్కరించే నేర్పు ఆమెది .అందుకే అట్ వుడ్ అన్నిటా అగ్రగామి అంటారు .మార్గ దర్శి మార్గ రేట్ అని
గౌరవిస్తా రు .
ఉరక లెత్తే కవితా ప్రవాహం ,ఆవేశం ,దానికి తగ్గ ఆలోచన ,కొత్త పదాల సృష్టి
,విశృంఖలత ,వీర విహారం ,సెక్సు ,కలహాల కాపురం ,వ్యసన పంకిలం ,విపరీత మైన తాగుడు
,ఆందో ళన ,డిప్రెషన్ ,అలజడి ,అస్తిత్వ నిరూపణ ల తో ఒక కల్లో ల కెరటం గా ,నల్ల జాతి వజ్రం
లా మెరిసే రచయిత డొ రోతి పార్కర్ .వ్యక్తిగా స్నేహ శీలి ,పదునైన మేధస్సు ,హాస్యం ,రిపార్టీ
,ఆమె కవితాభర ణాలు .1920 -30 కాలం లో ఆమె యువకుల ఆశాజ్యోతి
,ఐకాన్.ఎంత అభిమానాన్ని పొ ందిందో ,అంత నిరాశా చవి చూసింది .ఆమె
తరం కవుల్లో స్వయం విచ్చేదకకవి అయింది .పడి లేచ ే ఉత్తు ంగ తరంగం పార్కర్ .ఎంతఘాటుగ
ా చెప్పినా,కవిత్వాన్ని ఆదరించటం విశేషం .కధలు ,సమీక్షలు ,దశాబ్దా ల పాటు రాసి అక్షరాల
కు వన్నె తెచ్చింది .
అక్షరాలకు వన్నె తెచ్చింది .ఒక రకం గా కలం కింద పెట్టని రచయిత .ఆమె కవితా పంక్తు లు
తీర్చి దిద్ది నట్లు న్ది ,పలకరించి పులక రింప జేస్తా యి
డొ రోతి రోశీల్ద్ పార్కర్ 1893 ఆగస్ట్ 22 న అమెరికా లో న్యుజేర్సి రాష్ట ం్ర ,లాంగ్
బ్రా ంచ్ లో జన్మించింది .సాంప్రదాయకం గా ధనికులైన ఆ కుటుంబానికి ఆ గ్రా మం వేసవి
విడిది. మాన్ హట్ట న్ లో
పెరిగింది .పుట్టిన అయిదేళ్లకే తల్లి చని పో యింది .తండ్రి దుస్తు ల ఉత్పత్తి దారు .మళ్ళీ పెళ్లి చేసు
కొన్నాడు .పార్కర్
కు సవతి తల్లి మీద అయిష్ట ం .ఇరవై ఏళ్ళకే తండ్రీ పో యాడు .జ్యూ అయినా ఆమె
కేథలిక్ గ్రా మర్ స్కూల్ లో చేరింది .అప్పటికే మంచి కవితలు రాసి పేరు తెచ్చుకొంది . పియానో
బాగా వాయించేది .''టీనజి
ే లోనే టీజ్ చేసే ''హాస్యం రాసింది .అది పండి పేరు వచ్చింది .oge
,వానిటి ఫెయిర్ పత్రికలు ఆమె కవితలను ప్రచు రించి ఉత్సాహ పరిచాయి .ఆ రెండు పత్రికలు
ఆమె ను సంపాదకత్వ బాధ్యత తీసుకోమని కోరాయి .స్టా ఫ్ రైటర్ గా వానిటి ఫెయిర్ లో చేరి
డ్రా మా క్రిటిక్ అయింది .మాగ జైన ను స్పాన్సర్ చేసే వారి నాటకాలనే చీల్చి చెండాడేది
.తప్పక ఉద్వాసన పలికారు .ఎడ్విన్ పాండ్ పార్కర్ ను వివాహం చేసుకొన్నది .అతను గ్రేట్
వార్ లో పాల్గొ న టానికి వెళ్ళాడు .విపరీత మైన తాగుడు తో ,ఆక్సిడెంట్ చేసి ,మార్ఫీన్ కు
అలవాటు పడి ,కొంపకు చేరాడు .విడాకులు తీసుకున్నారు .అయినా ఈమె zew
సాంప్రదాయం ప్రకారం పార్కర్ ట్యాగ్ ను వదల కుండా అట్టే పెట్టు కొంది .
1919 లో dramatist అయిన రాబర్ట్ shervud ,హాస్యనటుడు రాబర్ట్
బెరాచ్ లీ లతో కలిసి ''రౌండ్ టేబుల్ ''అనే ప్రసిద్ధ సంస్థ ను న్యూయార్క్ లోని ఒక
హో టల్లో ఏర్పాటు చేసింది .గిట్టని వాళ్ళు దీన్ని విష వలయం (విషస్ సర్కిల్ )అన్నారు .కామి
క్ రచయిత జేమ్స్ తర్బార్ ,సినీ రచయిత రింగ్ లార్దేనర్ మొదలైన వారినీ దీని లో
సభ్యులను గా చేర్చింది .ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే తో ,స్కాట్ ఫిట్జెరాల్డ్ తో
ప్రేమాయణం సాగించింది .1925 లో న్యూయార్కర్ పత్రిక స్థా పన దగ్గ ర్నుంచి ౩౦
ఏళ్ళ దాకా అందు లో పని చేసి తనకు ,పత్రికకు పేరు తెచ్చింది .ఎన్నో విలువైన కవితలు
,కధలు ,రివ్యూలు రాసింది ఆ కాలమ్ లో .1927 లో మొదటి కవితా సంకలనం ''enough
rope'' వచ్చ్చింది .అది బెస్ట్ సెల్లా ర్ గా నిరూపించు కొంది .తర్వాత సన్సెట్ గన్ ,డెత్ అండ్
టాక్సెస్ రాసి అంతే పేరు పొ ందింది .లామేంట్ ఫర్ ది లివింగ్ ,ఆఫ్ట ర్ సచ్ ప్లెజర్ ,హియర్ లైస్-
ఫిక్షన్ పుస్త కాలతో విశేష ప్రా చుర్యం పొ ందింది .''పార్కర్ రచనలన్నీ నిక్షిప్త స్వీయ చరితల
్ర ు
''అన్నాడు ప్రముఖ విమర్శకుడు బ్రిన్దా న్ గిల్ .పేరు ,ప్రఖ్యాతి డబ్బు వచ్చి మీద
పడుతున్నాయి .తాగుడు కు బానిసై డిప్రెషన్ కు గురైంది .ఈ జబ్బు ఆతరం రచయిత
లందరికీ సర్వ సాధారణం గా ఉన్నదే .ఎంత విశృంఖలత జీవితం లో ఉన్నా ,సాహిత్యం లో
మాత్రం చెలియలి కట్ట దాటకుండా రాసిన సంస్కారి .నగ్న సత్యాలతో ,గుండెల్లో గునపాల్లా
గుచ్చే మాటలతో ,,అత్యంత సంక్షిప్త త తో ,ఆమె కవిత్వం సాగి పో తుంది .
న్యూయార్కర్ రచయిత లందరూ హాలీ వుడ్ గుమ్మం తొక్కి బాగు పడ్డ వాళ్ళే
.పార్కర్ కూడా హాలీ వుడ్ సినిమాలకు పని చేసింది .ఎన్నో సినిమాలకు రాసినా పేరేమీ
రాలేదు .అలాన్ కాంప్ బెల్ అనే నటుడిని పెళ్ళాడింది .ఇద్ద రు కలిసి చాలా సినిమాలకు స్క్రిప్ట్
రాశారు .అందులో ''ఏ స్టా ర్ ఈజ్ బార్న్''అనే సినిమా వీరిద్దరి సృష్టి .అకాడెమి అవార్డ్ కు 1937
లో నామినేట్ అయింది . పెళ్లి మళ్ళీ పెటాకు లైంది . .అమెరికా వ్యతి రేక కార్య క్రమాలు
చేస్తో ంది అన్న ఆరోపణ లతో ఆమె విచారణ కు గురైంది .ఆ కాలమ్ లో ఇది రచయితలకు
మామూలే .సినీ జగత్తు లో ఆమె పేరు ను బ్లా క్ లిస్టు లో పెట్టా రు .స్క్రీన్ రైటర్స్ గిల్డ్
ఏర్పాటుకు సాయ పడింది .ఈ సందర్భం గా ఆమె ఒక సారి ''un empoloyment office ''కు
వెళ్ళింది .ఆమెను వందలాది మహిళలు ఆనందం తో చుట్టూ ముట్టి ఆమె రాసిన కప్లేట్ '' men
seldom make passes --at girls who wear glasses'' అనే కవితను అందరు పాడి ఆమె కు
అభి నందనాలు తెలిపారు .
సినీ రచయిత గా చేతులారా సంపాదించింది .కాని తన రంగం అయిన ఫ్రీ లాన్స్
జర్న లిజం కు మళ్ళీ వచ్చింది ''.esquire ''పత్రిక కు సినీ సమీక్షలు రాసింది .తాగుడు
విపరీతం అయింది .అడపా ,దడపా కవితలు రాస్తూ నే ఉంది .మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్ కు
మళ్ళింది .ఇంత అస్త వ్యస్త ం గా జీవితం ఉన్నా ,పార్కర్ కు 1959 లో
అమెరికన్ ఎకాడేమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ కు ఎంపికైంది .అది తీసుకొని మళ్ళీ న్యూయార్క్
చేరింది .1967 జూన్ ఆరు న తీవ్ర గుండె పో టు తో న్యూయార్క్ హో టల్ లో మరణించింది .
ప్రఖ్యాత ''పార్కర్ అనే కలం ;;ఆగి పో యింది .ఆమె
అస్తికలను కావాలని అడిగిన వారెవ్వరూ లేక పో వటం బాధాకరం . ''excuse my dust ''అనేది
ఆమె తరచూ వాడే మాట .అలానే జరిగింది .తన సాహితీ సర్వస్వాన్ని మార్టిన్ లూధర్ కింగ్
కు చెందేట్లు చేశారు .కింగ్ ఈమె మరణం తర్వాత పది నెలలకు హత్య గావింప బడ్డా డు .
ఆమె రచనలు చాలా సార్లు పునర్ముద్రణ పొ ందాయి .ఎంతో మంది ఆమె జీవిత చరిత్ర రాశారు
.ఎందరెందరో ఆమె కవితా వాక్యాలను పాటలలో నాటకాల్లో టి.వి.ప్రో గ్రా మ్స్ లో తరచు
వాడుతూనే ఉంటారు .అంటే ఆమె కవిత్వం సజీవం గా ఉంది. ప్రజల నాలుక మీద నాట్యం
చేస్తూ నే ఉందన్న మాట .1995 లో ,mrs .parker and the vicious circle ''చిత్రా న్ని తీశారు
.పార్కర్ పాత్ర ను జెన్నిఫర్ జేసన్ లీ అద్భుతం గా పో షించింది .పార్కర్ మన పార్కర్ పెన్ను
లా విలువైన సాహితీ వేత్త .
హిమాలయాల తర్వాతఎత్తైన పర్వతా లు ఆండీస్ పర్వ తాలు .అగ్ని పర్వతాలు అక్కడ ఉన్నాయి .అవి
‘’పె రు దేశం ‘’నుంచి వ్యాపించాయి .పెరు లో ని పురాతన ‘ఇంకా ‘’ప్రజలన జీవన విధానం ,దాన్ని పరి
పాలించిన చక్రవర్తు ల పరి పాలన గురించి తెలుసు కొందాం .అక్కడ సూర్య దేవుణ్ణి విరకోచ అంటారు .
(మన –విరోచానుడికి దగ్గ ర గా ఉందా?)ఆయనే వారి దైవం .ఒక సారి విరోచ కు ప్రజల మీద దయకలిగి
,ఆకాశం నుండి కొంచెం కిందికి వచ్చి చూశాడు .అక్కడి వారంతా అడవి జంతువుల్లా బతుకు తుండటం
చూసి బాధ పడ్డా డు .తన కొడుకు ‘’మాన్కొక పాక్ ‘’కూతురు ‘’మామా ఒకలా’’లను భూమి పైకి పంపి
,ప్రజలకు ఇల్లు ,పట్ట ణాలు నిర్మించ టానికి వ్యవససాయం కు సాయం చేయ మన్నాడు .చివర రెండుగా
చీలిన రెండు పొ డవైన లావు బంగారు కడ్డీలను వారికచ్చి
ి ,వాటితో పొ లాలు దున్నామని చెప్పాడు .అవి
ఎక్కడ లోతుగా భూమి లోకి దిగి పో తాయో అదే గొప్ప పట్ట ణం అవుతుందని చెప్పి పంపాడు .తండ్రి
మాట ప్రకారం వారిద్దరూ భూమికి చేరారు .ప్రదేశాలను గాలిస్తూ సారవంత మైన భూమి కోసం ఒక లోయ
చేరారు ..ఒక రోజు ఉదయం మాంకో కాపాక్ తానే మెరిసి పో యే దేవుడిగా భావించాడు .బంగారు కాడి
నేల మీద లోతుగా దిగిన చోటు నుండి ,మైళ్ళ కొద్దీ భూమిని దున్నారు .అప్పుడు సూర్యుని కుమారుడిని
తానే అని ప్రకటించు కొన్నాడు .అతనినే ‘’ఇంకా ‘’అంటారు .అక్కడే స్తా నికుల సహాయం టో పెద్ద నగరాన్ని
నిర్మించాడు .సో దరి కూడా సహాయం చేసింది .ఆ నగరాన్ని’’ కూజో ‘’అని పిలిచారు అంటే ‘’భూమికి నాభి
‘’అని పేరు .ఆ తర్వాతా ఇంకా పాలన లో అది దక్షిణ అమెరికా లో గొప్ప నాగరక కేంద్రం అయింది
.ఇదంతా ఇంకా ప్రజలు తార తరాలుగా చెప్పు కొంటున్న కధ
అయితే చారిత్రిక కధనం వేరుగా ఉంది .వారి దృష్టి లో మాన్కోకపాక్ మామూలు
మనుష్యుడే .క్రీ.ష 1200 లో దక్షిణ అమెరికా నేటవ్
ి ఇండియన్ల ప్రభువైనాడు .వారి భాష ‘’.quechua ‘’ఆ
సామ్రా జ్యమే ఇంకా సామ్రా జ్యం .చక్రవర్తి కి మాత్రమే ఇంకా అనే పేరు ఉండేది .13 మంది ఇంకా చక్ర
వర్తు లు ఆ సామ్రా జ్యాన్ని స్పెయిన్ వారు 1532 లో ఆక్ర మించే వరకు పాలించారు .సామ్రా జ్యాన్ని రెండు
వేళ అయిదు వందల మైళ్ళు విస్తీర్ణం తో ఉత్త రాన ఈ నాటి కొత్త కొలంబియా నుండి ,దక్షిణ మధ్య చిలి
వరకు వ్యాపించి ఉండేది .దక్షిణ అమెరికా పడమటి భాగం ఆండీస్ పర్వతాల పుట్టి నిల్లు .ఇరవై వేల
అడుగుల ఎత్తు న్న ఈ పర్వతాల పై ఇంకా సామ్రా జ్యం వ్యాపించి ఉంది .
ఇంకా సామ్రా జ్యం లో పటిష్ట మైన కమ్యునికేషన్,రవాణా ,సమర్ధ వంత మైన పాలనా ఉండేవి
.రెండు పర్వతాల మధ్య ఖాళీ ప్రదేశాన్ని దాట టానికి ‘’ఎగేవ్ ‘’అనే మొక్కల పీచు ను తాల్లు గా పేని
వేలాడే వంతెనలను నిర్మించారు .14000 మైళ్ళ రోడ్ల ను నిర్మించారు .మంచు గడ్డ లు జారి పడే చోట రాతి
గోడలు కట్టి పడ కుండా చేశారు .ఎడారులలో ఇసుక తుఫాన్లు తట్టు కొనే విశ్రా ంతి మందిరాలు నిర్మించారు
.వీటిని ‘’ఎడో బ్ ‘’ అంటారు .స్పానిష్ పత్రిక’’ పెడ్రో డీ కూజా ‘’రాసిన దాని ప్రకారం ప్రపంచం లోనే ఇంకా
వారు నిర్మించిన రోడ్లు చాలా నాన్య మైనవనీ ,గొప్ప వని తెలుస్తో ంది .లోతైన లోయల్లో ,ఎత్తైన పర్వతాల
మీద ,టన్నెల్స్ లో ,మంచు గట్ల మీద ,జారే మంచులో మెట్లతో ,రక్షణ ప్రదేశాల తో రోడ్ల నిర్మాణం చేశారు
.దారి లో పరిశుభ్రత ,విడిది గదులు ,సూర్య దేవాలయాలు ,స్టో ర్ హౌసులు ,అన్ని సౌకర్యాలతో నిర్మించి
మనకే ఆశ్చర్యం కలిగించేట్లు చేశారు .
ఇంత విశాల సామ్రా జ్యం లో వార్త ల్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకు చేర వేయటం కష్ట ం .దీని కోసం
వేలాది ‘’పో స్ట్ రున్నేర్స్ ‘’ను ఏర్పాటు చేశారు .పది హేను రోజుల షిఫ్ట్ డ్యూటి తో వాళ్ళు పని చేసే వారు
.డ్యూటి అవగానే విశ్రా ంతి గదుల్లో ఉండే వారు .కంచుశంఖ ధ్వని విని వార్తా హరులు వస్తు న్నారని
తెలుసు కొనే వారు .వార్తా హరుల్ని chasquis అంటారు .ఎలాంటి భయంకర వాతావరణం లో నైనా వీరు
రెండు మైళ్ళ దూరం సునాయాసం గా వెళ్ళ గలరు .రాత్రి ,పగలు లెక్కే లేదు .దారి అంత సుపరిచితం గా
వుండేది వీరికి .వ్యాపారం ,కాని వార్త కాని రోజుకు దాదాపు రెండు వందల మైళ్ళు చేరేవి .
ఇంకా ల ముఖ్య వ్రు త్తి వ్యవ సాయం .ప్రతి కూల వాతావరణం లో కూడా ల్యాండ్ స్కేప్ ల పై పంటలు
పండించే వారు .రాళ్ళతో మెట్లు మెట్లు గా కట్టి మధ్యఖాళీలు ఉండేట్లు చేసి ,ఆ మధ్య భాగాన పంటలు
పండించే వారు .మనకు తేయాకు తోటలున్నట్లు .ఇప్పటికీ అదే తరహా వ్యవ సాయమే కోన
సాగిస్తు న్నారు .పర్వతాల మీద ఈ వ్యవసాయ ఏర్పాట్లు పెద్ద’’ స్టేయిర్ కేసులు’’ ల్లా కన్పించి కను విందు
చేస్తా యి ఎడారులలోనూ ప్రత్యెక నీటి వసతులు కల్పించి ,నీటి పారుదల సౌకర్యాలేర్పరచి పంటలు
పండించారు .వారిచే సస్య శ్యామలం కాని భూమి వుండేది కాదు .స్క్వాష్ ,చిలగడ దుంప ,పత్తి ,యామ్స్
,ఔషధ మొక్కలు ,బీన్స్ ,మిర్చి ,కోకా ,క్వినోవా లను పండిస్తా రు .మొక్క జొన్నతో రొట్టెలు ,కేకులు ‘’ఛి
చా’’. వంటి తినే పదార్ధా లను తయారు చేసే వారు .నీరు లేకుండా గడ్డ కట్టించిన బంగాళా దుంప ను
‘’చునొ ‘’(staples )అంటారు .
కుటుంబం
చక్ర వర్తి ప్రతి ఇంటి పెద్ద కు వ్యవ సాయం కోసం కొంత భూమి ని ఇస్తా డు .దీన్ని ‘’తూపు ‘’
అంటారు .అందులో వంద పౌండ్ల పంట పండించాలి .మూడో వంతు ఫలసాయం రాజుకు ,ఆయన
కుటుంబానికి ,అధికారులకు ,మత గురువులకు ఇవ్వాలి .ఇంకో వంతు సైనికులకు ముసలి వారికి జబ్బు
పడ్డ వారికి అందించాలి .మిగిలిన మూడో వంతు కుటుంబానికి .పది మంది రైతుల గ్రూ ప్ కు ఒక మేనేజర్
,పది గ్రూ పులకు ఇంకో అధికారి ,యాభై గ్రూ పులకు పర్య వేక్షకుడు ఉంటా రు .పది వేల మందికి ఒక
నాయకుడుంటాడు .వాడిని’’ బిగ్ యియర్స్’’ అంటారు .వాడి చెవులకు చేట లంత బంగారు చక్రా లున్డ టం
వల్ల ఆ పేరొచ్చింది .వయసు ప్రా తి పదిక మీద ఆడ ,మగా గ్రూ పులుంటాయి .పదిహేను ఇరవై ఏళ్ళ మధ్య
మగాళ్ళు సైన్యం లో చేరటం తప్పని సరి .దాని తర్వాత వారికి మంచి పదవి లభిస్తు ంది .సైనికుల భార్యలు
ఊలు వడికి ,బట్ట లు నేయాలి .ఫాషన్ బట్ట లు కుట్టా లి .ముసలి మహిళలు పిల్లల సంరక్షణ చూసు కొంటె
చాలు .
అయిదు ఏళ్ళ లోపు పిల్లలు తలిదంద్రు లతో పాటు ఇంట్లో నే ఉంటారు .తొమ్మిదేళ్ళ వరకు
వడకాలి .చెడు ప్రవర్త నకు తీవ్ర దండన ఉంది .తొమ్మిది పన్నెండేళ్ళ మధ్య పిల్లలు చేలల్లో పంటలను
కాపలా కాయాలి .ఆడ పిల్లలు వంట ,వడకటం ఛి చా అనే ఆహారాన్ని తయారు చేయాలి .పన్నెండు
ముప్ఫై మధ్య స్త్రీలు ఇల్లా ళ్ళు గా ఉండాలి .వీరందరికీ ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తు ంది .
ఇంకా అది కారులు ప్రజల్ని కట్టు బాటు లో ఉంచు తా రు .తక్కువ నేరం చేస్తే అందరి ముందు
అవమాన పరుస్తా రు .లేక పో తే కోకా ప్లా ంటేషన్ కు పంపేస్తా రు .తీవ్ర నేరం చేస్తే రాళ్ళ టో కొట్టి చంపేస్తా రు
.లేక పో తే చచ్చే దాకా తలకిందుగా వేలాడ దీస్తా రు .ఒక్కో సారి వీపు మీద మోయలేనంత బండలను
పెడతారు .ఇవన్నీ మనకు భయంకరం గా కన్పించినా ,పరి పాలన చాలా ఆదర్శ వంతం గా ఉండేది
.ప్రజలు సుఖ సంతోషాలతో తృప్తి గా జీవించే వారు .
చక్ర వర్తి
చక్ర వర్తి అంటే సూర్య కుమారుడే అని వారి భావం .బంగారు సింహాసనం మీద కూర్చుని పరి
పాలించే వాడు ..చుట్టూ మందీ మార్బలం .ఒక సారి వేసుకొన్న దుస్తు లు మళ్ళీ వేసు కొనే వాడు కాదు
.వాటిని కుటుంబం లోని వారికిచ్చి వేసే వాడు .ఇంకా ప్రభువు మర ణిస్తే బిగ్ యియర్స్ అనే పెద్దలు రాజ
కుటుంబం లో సమర్దు న్ని ఎంపిక చేసి వారసుని గా ప్రకటిస్తా రు .అతడు తండ్రి నివ శించిన భవనం లో
ఉండడు .వేరే ప్రత్యెక భవంతి ని నిర్మించుకొని అందులో ఉంటాడు .బంగారం ,వెండి అధికం గా లభించేవి.
ఇంటి గోడలకు బంగారు వెండి రేకులను తాపడం చేసే వారు . స చక్ర వర్తి తన పాలన ఎలా ఉందొ
చూడాలని కుజ్కో నుండి బయల్దే రి ఊరేగింపు గా ,వైభవం గా అది కారు లంతా వెంట ఉండగా
,బరాబరులు చేస్తు ండగా నగర సందర్శనం చేసే వాడు .ప్రజలు దారులకు ఇరు వైపులా చేరి ఆనందంగా
పూల వర్షం కురి పించే వారు .ఆయనంటే దేవుడే .ఆయన చని పో తే భరించ లేక కొందరు ఆత్మా హత్య
చేసుకొనే వారు .లేక పొ తే నోటిలో ఆకులు కుక్కు కొని ,లేక ముక్కు బిగించి శ్వాస ఆడ కుండా చేసుకొని
ఆత్మా హత్య చేసుకోవటం వారికి మామూలే .
ప్రకృతే దైవం
పర్వతాలను ప్రజలు దేవుని గా పూజించే వారు .పర్వత దేవుళ్ళ కరుణా కటాక్షాల కోసం ‘’కాపా కోచా
‘’అనే వేడుక చేసే వారు .చక్ర వర్తి చని పో తేనో ,ప్రక్రు తి వైప రీత్యాలు జరిగితేనో ఈ ఉత్సవం చేసే వారు
.దేవుని ప్రసన్నం చేసుకోవటానికి ,పర్వత దేవుణ్ణి సంతృప్తి పరచటా నికే ఈ ఉత్స వాలు .అందుకోసం
ఏంతో కష్ట పడి పర్వతాగ్రం చేరు కొనే వారు .అవన్నీ మంచు పర్వ తాలు .తమకున్న విలువైన వాటిని
కానుకగా అక్కడ సమర్పించే వారు .ఆహారం ,పానీయం ,బంగారు విగ్ర హాలు ,ఒక్కో సారి పది హేనేల్ల
ఆడ మగ పిల్లల్ని కూడా బలిదానం చేసే వారు. .ఈ పిల్లలు పెద్ద అధికారి లేక గ్రా మ పెద్ద ల పిల్లలే అయి
ఉండాలనే నియమం ..వారి అవయవాలన్నీ బాగా ఉండాలి అది ఇంకో నియమం .వీరిని బలి ఇస్తే
సంక్షోభాలు రావని ఇంకా ప్రజల నమ్మకం .వారిని ఊరేగింపు గా తెసుకొని వెళ్తా రు .ఆ పిల్లలు కూడా
తామొక పవిత్ర కార్యానికి ఉప యోగ పడుతున్నామని సంబర పడతారట .వారిని బాగా అలంకరించి
సకలాభరణాలతో ,పర్వతాగ్రా నికి త్తీ సుకొని వెళ్లి అక్కడ వదిలేసి రావటమే బలి అంటే .అక్కడ మంచు,
గాలి, వర్షా లకు వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చస్తా రు .
మమ్మీలు
ఇటీవలి పరిశోధన లో ఆండీస్ పర్వతాల మీద మంచులో పిల్లలు మమ్మీ లు గా కని పించారు
.వీరందరూ బలి ఇవ్వ బడ్డ పిల్లలే నని తేలింది .ఒక ఎనిమిదేళ్ళ పిల్ల ,అయిదు వందల సంవత్సరాల
మమ్మీ కని పించింది .ఇంకో పద కొండు ఏళ్ళ అబ్బాయిది అయిదు వేల సంవత్స రాల మమ్మీ
.దొ రికింది .హిమ ఘాతానికి చని పో యారని తేల్చారు .శరీరాలేమీ పాడు కాలేదు .అమ్మాయి శరీరం పై
కప్పిన శాలువా ,దానికి పెట్టిన బంగారు పిన్ను అలానే ఉన్నాయి .తాగే పాత్రలు మెరుపులకు కొంత కాలి
పో యి వారి పక్కన కని పించాయి .
1532 లో ఇంకా ప్రా ంతాన్ని అతి తక్కువ మంది సైనికులతో స్పెయిన్ ఆర్మీ దాడి చేసి వశ పరచు
కొన్నది .ఇరవై నాలుగు టన్నుల విలువైన సంపదను దో చుకొని స్పెయిన్ రాజు కు కానుక గా
సమర్పించారు .ఇక్కడి ఆదిమ ఇండియన్లు ,ఇప్పటికీ పర్వ తాలను దైవ స్వరూపం గా తండ్రు లు గా
ఆరాదిస్తూ నే ఉన్నారు .అక్కడ కరగ బెరన
్రి హిమ జలాన్ని జబ్బులు తగ్గ టానికి ఉప యోగిస్తు న్నారు
.ఇంకా చక్ర వర్తు లు మహాసామ్రా జయాన్ని ప్రజల ను సుఖ సంతోషాలతో పాలించి చరిత్ర సృష్టించారు
.మనకు వారి పాలనా సామార్ధ్యాని గురించి నేర్చు కావాల్సింది చాలా ఉంది .
అమెరక
ి ా లో బౌద్ధ ం
క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రా లను సందర్శించారు
.అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డా రు .1800 లో బౌద్ధ ం అమెరికా లో
ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధ ం లాటిన్ భాష లో ఉంది .అందుకని దాన్ని అమెరికా
వారు స్త్రెంజ్ రెలిజియన్ అని పిలిచారు .1844 లో బాగా వేళ్ళూను కొంది .the d col అనే మేగజైన్
మొదటి సారిగా ఆంగ్ల ం లో బౌద్ధ గ్రంధాన్ని ప్రచురించింది .1875 లో ఏర్పడిన థియాసాఫికల్ సొ సైటీ బౌద్ధ
ధర్మానికి ఆకర్షితం అయింది .కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఇక్కడ బౌద్ధ పతాకను ఎగర వేసి ,ప్రా చుర్యం
కల్పించాడు .ఆ సొ సైటీ స్థా పకులలో రెండవాడీ యన .
1949 లో కాలిఫో ర్నియా లో చైనీయుల సంఖ్యా 55 మాత్రమే .అయిదేళ్ళలో 40,000 అయారు
.మొదట్లో మగ వారు మాత్రమే వచ్చారు ..ఆ తర్వాతా కుటుంబాలను తర లించారు .కాలిఫో ర్నియా వీరిని
బాగా ఆద రించింది . 1852 లో కాలి ఫో ర్నియ లెజిస్లేటర్ గవర్నర్’’ చైనీయులు ఉత్త మ జాతి వారని ‘’
పేర్కొన్నాడు .అయితే కొన్ని నెలలకే వారి మీద ఆంక్షలు పెరిగాయి .వారికి పౌరసత్వ హక్కులు ఇవ్వం
అన్నారు .1882 వచ్చే సరికి చైనీయుల పై అంటి సెంటి మెంట్ పెరిగి పో యింది . 1892 .లో బహిష్కరణ
చట్టా న్ని తెచ్చారు .వారిని దేశం లోకి అనుమతించ లేదు .1910 లో వలస వారి బంధన సెంటర్లు
ఏర్పడ్డా యి . 1920 లో ఇతర దేశాలలోని అమెరికన్ల కు ప్రవేశం కల్పించారు .1924 లో ఏడాదికి వంద
మందినే అనుమతించారు .అదీ ఐరోపా దేశాస్తు లకే .ఇక్కడ పుట్టిన వా తెల్ల వారికే అమెరికా పౌరసత్వం
అని తేల్చి చెప్పారు .
శాన్ ఫ్రా నిస్కో లో మొదటి చైనా దేవాలయం ‘’కాంగ్ చు టెంపుల్ ‘’అనే పేరు తో చైనా టౌన్
లో ఏర్పడింది .1906 భూకంపం లో దెబ్బతింటే కూల్చేశారు ‘’.kuan tie ‘’అనేఅనే దేవుని విగ్రహాన్ని
మాత్రం కాపాడు కొన్నారు .1909 ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి కొత్త దేవాలయం కట్టా రు .శాన్ఫ్రాన్సిస్కో కు
వంద మైళ్ళ దూరం లో సియార్ర నెవాడా కొండల కింద ‘’ఆరో విల్లి ‘’లో వేలాది చైనీయులు చేరారు .గుడిని
ముందు కర్రతో తర్వాతా రాతి తో కట్టు కున్నారు . దాని ప్రవేశ ద్వారం ‘’పూర్ణ చంద్రు ని ఆకారం ‘’లో
ఉండటం వల్ల ‘’మూన్ టెంపుల్ ‘’అంటారు .బంగారు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు .
జపాన్ వారు 1865-1912 మధ్య వలస వచ్చారు .ఈ కాలాన్ని జపనీయులు ‘’మీజి కాలం
‘’అంటారు .1870 లో యాభై మంది మాత్రమే ఉంటె 1992 కి లక్ష మంది జపానీయులు అయ్యారు
.వ్యవసాయం చేశారు .వీళ్ళ పైనా ఆంక్షలు వచ్చాయి .కోర్టు ల దాకా వెళ్లా రు .అయినా పౌరసత్వం ఇవ్వ
లేదు .జోడో శింశు అనే బౌద్ధ దేవాలయానికి చెందిన స్కూలు ఇమ్మిగ్రంట్స్ పక్షాన నిలిచింది .’’యంగ్మెన్
బుద్ధిస్ట్ అసో సియేషన్’’ ఏర్పడింది .చైనా వారిలా కాకుండా జప్స్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొన్నారు .ఇక్కడి
తమ భర్త ల కోసం వేలాది మంది భార్యలు అమెరికా చేరి వారి ఫో టోల సాయం తో గుర్తించి కుటుంబాలను
ఏర్పరచు కొన్నారు .అందుకే 1908-21 కాలాన్ని ‘’picture bride era’’అని పిలుస్తా రు .
ఇమ్మిగ్రంట్స్ బాగా పెరిగి పో వటం తో b.m.n.a.సేవా కార్య క్రమాలను చే బట్టింది .ఇక్కడి బౌద్ధ
ఆలయాలను బుద్ధిస్ట్ చర్చ అని పిలిచే వారు .1960 కాలాన్ని’’zen decade for america’’అన్నారు ..
1950 నుండి జెన్ బూం బాగా వచ్చింది .ఈ కాలం లో ‘’బీట్ జెనెరేషన్ ‘’వాళ్ళు జెన్ బుద్ధిజం వైపుకు
వెళ్లా రు .ప్రసిద్ధ సాహితీ వేత్తలు దీనిలో చేరే సరికి గొప్ప ఆకర్షణ గా నిలిచింది .వారి భావన లో ‘’ఏదో ఒక
రోజు అమెరికా ప్రెసిడంె ట్ కూడా వైట్ హౌస్ లో ఒక గదిలో కూర్చుని ధ్యానం చేస్తా డు ‘’ అని నమ్మారు
.1990 లో బీట్ జెనెరేషన్ లో విప్ల వాత్మక మైన మార్పులు తెచ్చింది జెన్ . wake up ‘’అనే బుద్ధు ని
చరిత్ర హాండ్ బుక్ గా వచ్చింది
shunryu suziki అనే జెన్ గురువు సాన ఫ్రా నిస్కో కు వచ్చి బౌద్ధా లయం లో ప్రీస్ట్ అయాడు
.అతని ప్రభావంతో 1960,.జెన్ మౌంటేన్ సెంటర్ ఏర్పడింది tassa jaraa hot springs వద్ద .దీని ప్రధాన
కార్యాలయం లాస్ ఏంజిల్స్ .1965-2000 కాలం లో మూడవ ఫేజ్ బుద్ధిజం అమెరికా చేరింది
.అమెరికన్లు జెన్ మతం వైపుకు బాగా ఆకర్షింప బడ్డా రు .1965-1990 మధ్య చైనా అమెరికన్లు నాలుగు
రెట్లు పె రిగారు .తైవాన్ వారు లాస ఏంజెల్స్ లో అత్యంత సుందర ,విశాల బౌద్ధ ఆలయాన్ని’’ Hsi lai
‘’అంటే coming to west పేరిట halsinda heights లో ౩౦ మిలియన్ డాలర్ల తో నిర్మించారు .దీన్ని
వైస్ ప్రెసిడెంట్ అల్గో రే సందర్శించాడు .ఇక్కడ గురువులకు ఆశ్రమాలున్నాయి .ఇవన్నీ బౌద్ధ సంస్కృతిని
,చైనా ,జపాన్ సంస్క్రుతులను కాపాడు కోవటానికి సహక రిస్తు న్నాయి .
ఇక్కడి నూట యాభై బౌద్ధ ఆలయాలలో శ్రీ లంక ,థాయిలాండ్ ,లావోస్ ,కంబో డియా దేశాల నుండి
వ్యాపించిన ‘’తెరవాడా ‘’పధ్ధ తి లో పూజాదికాలను నిర్వ హిస్తు న్నారు .లంక లో ఉన్న బౌద్ధ విహారం’’ధర్మ
వజ్ర ‘’పేరుతొ 1980 లో బుద్ధ పౌర్ణ మి నాడు నిర్మించారు .వేలాది బౌద్ధు లు ,మత గురువులు హాజరైనారు
.
‘’ you will always be an asian ,always an out sider ,not an american ‘’అని
కిమ్మకొనే సిహరత్ అనే గురువు బో ధించాడు .ఇప్పటి బుద్ధిజం పై నిరసనలు విని పిస్తు న్నా ,అది అప్రతి
హతం గా ముందుకు సాగి పో తూనే ఉంది .1993 లో ‘’world parliament of religions ‘’శత వార్షి కోత్స
వానికి చికాగో నగ రానికి వేలాది ఏషియన్ అమెరికంలుతరలి వచ్చి అనుభూతి పొ ందారు .ఇరవైవ
శతాబ్ద ం లో అమెరికా లోని బౌద్ధు ల సంఖ్య మూడు మిలియన్ల ను దాటింది .
ట్రో జన్ వార్ అయిన నాల్గు గు వందల సంవత్సరాలకు హో మర్ రాశాడు గ్రీక్
పురాణాలను .హో మర్ రాసి అప్పుడే 2800 సంవత్స రాలైంది ఒకప్పుడు బాబిలోనియా ప్రముఖ వర్త క
కేంద్రం .ఇదే ఇవాల్టి ఇరాక్ .మధ్య ప్రా చ్యం లో గొప్ప సామ్రా జ్యం .రెండు వేళ ఏళ్లు వర్త కానినికి కేంద్రం గా
ఉంది .ఆ నాడు మెసపొ టేమియా అనే ప్రా ంతం నుండి ట్రా య్ కు చేరే వారు .మెసపొ టేమియా అంటే రెండు
నదుల మధ్య భూమి వర్త కానికి హిత్తి ట్టేతెస్ మీదుగా వెళ్ళేవారు .ఈ జాతి వాళ్ళు రహస్యాలను బాగా
జ్జా గ్రత్త గ కాపాడే వారుగా ప్రసద
ి ్ధి .ఇక్కడి దేవతలు బాబి లోనియా దేవతల కంటే భిన్నం గా ఉంటారు .’’
తుఫాను దేవత ‘’ను ఎక్కువగా పూజించే వారు .ఇక్కడి ప్రజల్ని విలూసా ప్రజలంటారు .అయితే వీరే ట్రో
జన్లు అనే అభిప్రా యం కూడా ఉంది .విలూసా యే ట్రా య్ అని .వైన్ డార్క్ సి అని హో మర్ పిలిచిన
ఆజియాన్ సముద్రం లో మూడు వేళ ఏళ్ళ కిందటి సముద్రం లో మునిగి .లేక ముక్కలైన నావలు కని
పించాయి .అందులో సారాయి నిలవ చేసే సా ధనాలు దొ రికాయి .ఇవి గ్రీకులవి ,త్రో జన్ల వి కావచ్చు
.ఇద్ద రు సారా సరసులే మర్మరా సముద్రం పక్కన ఉన్ననగరమెబాష్పోరస్ నే ఇస్తా ంబుల్ అని ఇప్పుడు
అంటున్నారు ..
క్రీ.పూ.1627 లో పెద్ద అగ్ని పర్వతం బ్రద్దలైంది .అప్పుడు తెర అనే చోట కొన్నికుడ్య చిత్రా లు
బయల్పడ్డా యి .అవి చెక్కు చెదర లేదు .అందులోని స్త్రీలు కంచు యుగానికి చెందిన వారు గా గుర్తించారు
.ఇవాల్టి ఆధునిక దుస్తు లు ఆనాడే ఆడవాళ్ళూ ధరించిన దాఖలాలు కని పించాయి .గ్రీకులకు చేపలు పట్టే
పని ఎక్కువగా ఉండేదని అంటారు .’’hali carnassus అనే పట్ట ణం లో హో మర్ జన్మించి నట్లు భావన
.అతడు క్రీ.ప్పూ.850 కాలం వాడు .వైన్ డార్క్ సి కి ఇరువైపులా గ్రీకుల పట్ట నాలున్దేవి .ఆసియా మైనర్
లో వారికి కావాల్సిన ముడి పదార్దా లున్దేవి .వాటిని సాధించటమే ధ్యేయం గా ఉండే వారు .వాణిజ్య
సామ్రా జ్యానికి ఆద్యులని పించుకొన్నారు .హిట్టితే సామ్రా జ్యం క్రీ.పూ.1150 కే కూలి పో యింది
.క్రీ.పూ..480 లో అశేష సేనా వాహినితో పర్షియా నుంచి xerxes దండెత్తి వచ్చాడు .అతని చూపు ట్రా య్
మీద పడింది .అక్కడ వెయ్యి నల్ల ఎద్దు లను బలి ఇచ్చాడు .ఒకప్పుడు గ్రీకుల స్వాధీనం లో ఉన్న ట్రా య్
ను వశ పరచుకొన్నాడు .అతని పేరుకు అర్ధ మే ‘’రాజాది రాజు ‘’అని .అప్పుడు సముద్రా లు దాటటానికి
పడవల బ్రిడ్జి లుండేవి .
ట్రా య్ గురించి త్రా వ్వాకాలు జరపాలనని Heinrich Schliemann అనే పరిశోధకుడు
వ్యాపారం లో డబ్బు బాగా సంపాదించి ,భార్య తో సహా 1873 లో హో మర్ రాసిన దాని ఆధారం గా
ట్రా య్ చేరి హిస్సార్లిక్ అనే చోట తవ్వకం మొదలు పెట్టా డు .అంతులేని ధన రాసులు కిరీటం బంగారు
నగలు దొ రికాయి .వాటిని జర్మని కి తరలించాడు .ఆ తర్వాతా అవి రష్యా చేరి సెయింట్ పీటర్ బర్ఘ్
మ్యూజియం కు చేరాయి .అతనికి అగమినన్ ముఖానికి తోడుక్కొనే బంగారు మాస్క్ దొ రికింది
మైసీనియా లో కూడా తవ్వకం సాగించి సమాదుల్ని కను గోన్నాడు ..ఆర్ధ ర్ ఇవాన్స్ అనే అతను క్రీట్ లో
చేసిన తవ్వకాలలో బాగా అలంకరించ బడిన ఒక గది అందులో గోడలక రంగుల చిత్రా లు వ్రా త ఫలకాలు
కనిపించాయి .బెల్జే న్ అనే పరిశొధకునికి ట్రా య్ లో మట్టి ,రాతి ఫలకాలు లభించాయి .1963 లో ఎట్ట
కేలకు బెల్జే న్ పురాతన ట్రా య్ నగరాన్ని ,అందులోని సౌధాలను కనుక్కొన్నాడు .కోర్ఫ్మాన్ అనే
పరిశోధకుడు కూడా తవ్వకాలు సాగించి కంచు యుగం నాటి ట్రా య్ బెల్జి న్ కనుక్కొన్న దానికంటే పది
హేను రెట్లు పెద్దదిగా ఉంటుందని తేల్చాడు .అప్పుడు జనాభా ట్రా య్ లో ఏడు వేల మంది మాత్రమే
ఉండ వచ్చు నని ,హో మర్ కవి చెప్పి నట్లు గా లక్ష మంది గ్రీకులు ట్రా య్ మీదకు దండెత్తి వచ్చే
అవకాశం లేదని వెయ్యి నౌకలతో వచ్చారని చెప్పటం కూడా అతిశయోక్తి అని చెప్పాడు .కంచు యుగం
లోని ట్రా య్ పైన ఎనిమిది సార్లు నిర్మాణం జరిగి మొత్త ం తొమ్మిది ట్రా య్ నగరాలు భూమి లో
ఉన్నాయని చెప్పారు అందరు .ప్రియాం రాజు సంపద అంతా రెండో ప్రపంచ యుద్ధ ం తర్వాతా రష్యా చేరింది
.ఎలా చేరింది అన్నది మిస్ట రీ గానే ఉంది .
అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో
అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లు గా
మాట్లా డటం ,స్వీయ వ్యక్తిత్వం తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ పరిచింది
.నల్ల జాతి విముక్తి పో రాటానికి నడుం బిగించింది .సాంఘిక దురన్యాయాలకు నెమ్మదిగా నిరసన
తెలుపుతూ ,క్రమంగా జాతి వివక్షత కు వ్యతిరేకం గా నిలిచి పో రాడింది .రెండవ నల్ల జాతి రచయిత ల
సామావేశం 1967 లో పాల్గొ ని ,ఆనాటి నేత అమిరీ బరాకా ప్రభావానికి లోనైంది .నల్ల జాతి వారు విడిగా
కొత్త సాహిత్యాన్ని .సర్వ స్వతంత్రం గా నిర్మించాలని నినదించింది .అప్పటి వరకు ఉన్న అమెరికన్ ఇంగ్లీష
,యురోపియన్ సాహిత్య సంప్రదాయ పద్ధ తులు శాశించే దారి వదిలి కొత్త దారి తొక్కాలని ఆలోచన చేసింది
ఆమె పూర్తీ పేరు’’ యోలాందే గివాని జూనియర్’’ .1943 జూన్ ఏడున అమెరికా లో టేన్నిసి
రాష్ట ం్ర లోని నాక్స్ విల్లి లో జన్మించింది .బాల్యం సిన్సినాటి లో గడిచింది .మళ్ళీ నాక్స్ విల్లి చేరి తాతయ్య
ఇంట్లో ఉంది. ఫిస్క్ స్కూల్ లో చేరంి ది .అనుమతి లేకుండా స్కూల్ మానేసి నందుకు మొదటి సెమిస్ట ర్
కు అనుమతించ లేదు ..సిన్సియాటి చేరి ,అక్కడి యునివేర్సిటి లో రాత్రి తరగతులలో చేరింది ..మళ్ళీ
ఫిస్క్ కు వచ్చి ,సో షల్ సబ్జెక్ట్ తీసుకొని చదివింది .ఒక వర్క్ షాప్ లో బ్లా క్ ఆర్ట్ ఉద్యమ కారులైన బరాకా
,జోన్స్ లను చూసింది .అప్పటికే పౌరహక్కుల ఉద్యమం ఉధృతంగా నడుస్తో ంది ..నిషేధింప బడ్డ ’’
స్టూ డెంట్ నాన్ వయలెంట్ కొ ఆర్డినేషన్ కమిటీ ‘’ ,ని పునరుద్ద రించింది .1967 లో ఆనర్స్ డిగ్రీ తీసుకొని
సిన్సినాటి కి వచ్చింది ..1968 ఏప్రిల్ నాలుగున పౌరహక్కుల నాయకుడు అమెరికన్ గాంధి మార్టిన్
లూధర్ కింగ్ జూనియర్ హత్య జరిగింది .గివాని హతాశు రాలై అట్లా ంటా లో జరిగిన ఆయన అంత్య
క్రియలకు హాజరైంది .న్యూయార్క్ లోని కొలంబియా లో ఉన్న స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరింది
.’’సృజనాత్మక రచన ‘’కోర్సు తీసు కొన్నది .కాని రాయ లేమో నని భావించి డిగ్రీ తీసుకో కుండానే
మానేసింది .
1970 లో గివాని నికితాం ప్రెస్ ద్వారా నల్ల కవితలను మొదటి ‘’ఆంత్రో పాలజీ ‘’ గా ,’’night
comes softly’’ పేరప్రచురించి ,తను ఎన్నాళ్ళ నుంచో అనుకొన్న కోరిక తీర్చు కొంది .తరువాత ‘’సో ల్
‘’అనే టి.వి.ప్రో గ్రా ం చేసింది .హార్లెం లో ప్రేక్షక సమూహాలకు కవితలను చదివి విని పించి మెప్పు పొ ందింది
.’’స్పిన్ యే సాఫ్ట్ బ్లా క్ సాంగ్ ‘’ను ముద్రించి ,రికార్డ్ చేసి మొదటి ఆల్బం ‘’ట్రూ త్ ఇస్ ఆన్ ఇట్స్ వే ‘’పేర
విడుదల చేసింది .దానికి మంచి ఆదరణ లభించింది .లండన్ లో గివాని జేమేస్ బాల్డ్విన్ కు ఇచ్చిన
ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ను 1971 లో ప్రచురించి ప్రా చుర్యం పొ ందింది .1972 లో ఆమె రాసిన ‘’ట్రూ త్ ‘’పాటల
ఆల్బం ‘’బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బం ‘’గా రికార్డు ,రివార్డు పొ ందింది .’’మై హౌస్ ‘’అనే ఆమె పుస్త కం 1973
అమెరికన్ లైబర
్ర ి అసో షియేషన్ వారి ఉత్త మ పుస్త కాల జాబితా లో చేరింది .ఆదర్శ కవి మార్గ రేట్ వాకర్
తో ‘టేపడ్
ే డయలాగ్ ‘’ను ఇచ్చింది .’’లేడీస్ హో ం జర్నల్ ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’అవార్డ్ నిచ్చి
సత్కరించింది ముప్ఫై వ జనం దినాన్ని న్యూయార్క్ లోని లింకన్ సెంటర్ లో కవిత్వం చదివి గడి పింది
.ప్రభుత్వ ఆహ్వానం పై ఘనా ,టాంజానియా ,జాంబియా దేశాల్లో పర్య టించి ఉపన్యాసాలనిచ్చింది .’’ego
tripping and other poems for young readers ‘’ను ప్రచురించింది .’’ల్like a ripple on a pond’’
‘’ఆల్బం విడుదల చేసింది .
కవిత్వం పై ఉదాహరణ ల తో మాట్లా డటం అంటే గివాని కి చాలా ఇష్ట ం .ప్రత్యక్ష ప్రసారాలు
,రికార్డింగులు అంటే మరీ ఇష్ట ం .అదే ఆమె వ్యాపకం అయింది .ప్రతి మాటను అర్ధ వంతం గా
ప్రయోగించటం ,ప్రయోగాత్మకం గా ,ప్రబో దాత్మకం గా రాయటం ఆమె ప్రత్యేకత .ఇంగ్లీష భాష భావ
వ్యక్తీకరణకు సరి పో దు ‘’అని ఆమె నిశ్చితాభి ప్రా యం .’’ఇంగ్లీష లో అందరు మాట్లా డుతారు కాని ,ఇంగ్లీష
మాట్లా డరు ‘’అంటుంది .మరి తనకు సరైన భాష ఏది అని అడిగితే ‘’ఆఫ్రికా లో మాట్లా డే భాష ‘’అంటుంది .
(african oral tradition ).నల్ల జాతి స్త్రీలు అంటే అత్యంత అభిమానం .మగవారిని ‘’బ్యూటిఫుల్ బ్లా క్
మెన్ ‘’అని అన్నా ,వారి భావాలన్నా ,మొరటు ప్రవర్త న అన్నా ఆమెకు కోపం .వారికి నల్ల జాతి స్త్రీలంటే
ఇష్ట ం ఉండదు అని గట్టిగా చెప్పింది ..అందుకే ‘’ఉమెన్ ‘’అనే కవిత లో it is a sex object if you are
pretty –and no love –or no love and no sex if you are fat –get back fat black women be a
mother –grand mother strong thing but no women ‘’అని నిర్భయం గా మన్ల మగవారి
ఆంతర్యాన్ని ఆవిష్కరించింది .
1970-80 కాలం లో రెండు వందల కవిత్వపు రీడంి గులు ,ఉపన్యాసాలు ప్రతి సంవత్సరం
ఇచ్చింది .సంవత్సరానికో పుస్త కం ,ఒక ఆల్బం విడుదల చేసింది .ఎన్నో సంస్థ లు ,కమీషన్లు ,ప్రజా
సంబంధ శాఖలు ఆమెను ఆహ్వానించాయి .అయినా విద్యా బో ధన మాన లేదు .ఒహాయో ,మిన్నిసో టా
,వర్జీనియా విశ్వ విద్యా ల యాలలో విజిటింగ్ ప్రొ ఫెసర్ గా పని చేసి గౌరవం పొ ందింది .1989 లో ‘’బ్లా క్
స్ట డీస్ ‘’లో ఇంగ్లీష ప్రొ ఫెసర్ గా పని చేసి పదవీ విరమణ చేసింది .
90 వ దశకం లో డజన్ల కొద్దీ డాక్టరేట్లు ఆమెను వరించాయి .ఎన్నో సాహిత్య ,పౌర సంస్థ లు
ఆమెకు అవార్డు లిచ్చి సత్కరించారు .ఒక డజన్ నగరాల తాళం చెవులను (కీస్ )లను ఇచ్చి అత్యధిక
గౌరవం చూపారు .ఒహాయో ఉమెన్స్ హాల్ఆఫీస్ కు ఎన్నుకో బడింది .తెన్నిసి రాష్ట ం్ర రాష్ట ్ర ప్రముఖ
మహిళా పురస్కారం ప్రదానం చేసింది .’’రోజా పార్క్ ఉమెన్ ఆఫ్ కరేజ్ ‘’అవార్డు పొ ందింది .ఎబని ,మాడే
మోసిల్లి ,ఎసెన్స్ పత్రికలూ ఆమె ను ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’గ ప్రకటించి గౌరవించాయి
..N.A.A.P.అవార్డ్ ను మూడు సార్లు దక్కించుకొన్న అరుదైన నల్ల జాతి సాహితీ మూర్తి ఆమె .ఎన్నో
పిలలల పుస్త కాలు రాసింది .స్వీయ చరితన
్ర ు రాసుకోన్నది .అది ఒక రకం గా నల్ల జాతి వారి చరిత్రే
.నేషనల్ బుక్ అవార్డ్ కు నామినేట్ అయింది .ఆమె వ్యాసాలను ‘’సేక్రెడ్ కౌస్ అండ్ ఆదర ఎడిబుల్స్ ‘’గా
ప్రచురించింది .’ లంగ్ కేన్సర్ వ్యాధికి గురి అయిణా విజయ వంత మైన ఆపరేషన్ తో జీవించింది .
2005 లో staan ford తో కలిసి ‘’బ్రేకింగ్ ది సైలెన్స్ ,’’ఇన్స్పిరేషన్ స్టో రీస్ ఆఫ్ బ్లా క్ కాన్సర్ సర్వైవర్స్’’
‘’పుస్త కాలను సంపాదకత్వం వహించి విడుదల చేసింది .
నల్ల జాతి అని పిలువ బడే ఆఫ్రో అమెరికన్లు సామాజికం గా ,ఆర్ధికం గా ,రాజకీయం గా
చైతన్య వంతులు కావాలని ,వారిలో ఈ భావ దీప్తి ప్రజ్వ లించాలని అహరహం శ్రమించిన అలుపెరగని
పో రాట యోధురాలు గివాని .అందు కోసం కొత్త ఆలోచనలను ,కొత్త పో కడలను ఆహ్వానించింది ,అమలు
జరిపింది .మాటలు కాక చేతల్లో సత్తా చూపించింది .నల్ల వారి శక్తి ని నిరూపించింది .నలుపు లో అందం
ఉందని తెలియ జెప్పింది .నల్ల వారినందర్నీ ఎకోన్ముఖులను చేసి బ్లా క్ పాన్ధ ర్స్ ను ఏర్పాటు చేసి తమ
అస్తిత్వాలను మేల్కొల్పింది .తమ జాతి లోని వారి త్యాగాలను ,కష్టా లను ,అంకిత భావాన్ని వెలుగు లోకి
తెచ్చే రచనలు చేసి జాగృతి నింపింది .మాండలికాన్ని ప్రో త్సహించి ,తానూ ఆ బాటలో నడిచి ఆదర్శ
వంతు రాలై ‘’ నల్ల వజ్రం’’ గా వెలిగింది నిక్కి గివాని .
ది హాబిట్ ,ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే రెండు రచనల తో ప్రపంచం లో లక్షలాది మందిని ని
ఆకర్షించిన బ్రిటీష రచయిత ,ఇంగ్లీష ప్రో ఫెస్సర్ ,భాషా ధ్యన వేత్త , కవి జే.ఆర్.ఆర్.టో ల్కిన్ .జర్మన్ భాష
లో ఆయన పేరు కు అర్ధ ం –తెలివి తక్కువ ధైర్యశాలి అని ,బుద్ధిలేని తెలివి గలవాడని అర్ధం ..చిన్నప్పుడే
గ్రీక్ ,లాటిన్ భాషల్లో అసమాన పాండిత్యం చూపాడు .గోతిక్ ఫిన్నిష్ ,మొదలైన మరుగున పడ్డ భాషలను
అధ్యనం చేశాడు .తన స్వంత భాషల్లో వాటిని మళ్ళీ జీవింప జేశాడు .ఇది సరదా కోసమే మొదట చేశాడు
.కాని తర్వాతా అదే ధ్యాస ,శ్వాస గా జీవించాడు .క్లా సిక్స్ అని పిలువ్ బడే లాటిన్ ,గ్రీకు భాషల్లో నూ
,భాషా శాస్త్రా ల లోను తగి నన్ని మార్కులు సంపాదించ లేక పో యాడు .దీనితో లాభం లేదని ఇంగ్లీష
భాషా సాహిత్యాల పై దృష్టి నిలిపాడు .1915 డిగ్రీ పొ ందాడు .ఫిన్నిష్ భాషా ప్రభావం తో ‘’quenya’’భాషను
సృష్టించాడు .సైనికుడు గా చేరి లంకా షిర్ లో సెకండ్ లెఫ్టినెంట్ అయాడు .తరువాత్ ఏడాది లో ఎదిత్
అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .వేస్త్రెన్ ఫ్రంట్ లో యుద్ధా నికి వెళ్లా డు .ట్రెంచ్ లలో ఉండి యుద్ధ ం
చేయటం తో ‘’ట్రెంచ్ ఫీవర్ ‘’తో బాధ పడి తిరిగి వచ్చే శాడు .యుద్ద్ధ అనుభవాలు ,చూసిన భీభాత్సాలపై
రాయాలనే సంకల్పం కలిగింది అవే ఆ తర్వాతా‘’book of lost tales ‘’గా వచ్చింది
ఒక సారి భార్య అతని కోసం హేమ్లా క్ అడవుల్లో డాన్స్ చేసింది .ఇది మనసు లో పడి
berene and luthern తమ కు మారు పేరుగా సృష్టించాడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష నిఘంటువు నిర్మాణం లో
సహాయ లేక్సికోగ్రా ఫర్ గా నియమింప బడ్డా డు ..ఎక్కువ కాలం ఉండలేక లీడ్స్ వర్సిటి లో రీడర్ గా
చేరాడు ..ఆ తర్వాతా ఆక్స్ఫర్డ్ లో ఇంగ్లీష ప్రొ ఫెసర్ అయాడు .అప్పుడే మైత లాజికల్ కధలెన్నో రాశాడు
.హాబిట , ,ది లార్డ్ అఫ్ రింగ్స్ అప్పుడే రాశాడు .1959 లో రిటైర్ అయాడు .
గ్రీక్ సాహస వీరుల ,పురాణ నాయకుల అద్భుత వీరోచిత కధలను ,ఆ నాటి సంస్కృతి ల పై
తీవ్ర పరిశోధనలు చేశాడు ‘’.మిడిల్ ఎర్త్ ‘’అనే కొత్త లోకాన్ని సృష్టించి ,పాత్రలను తయారు చేసి ఆ నాటి
భాష లో వాళ్ళు మాట్లా డి నట్లు కొత్త భాషలను సృష్టించిన మేధావి టోల్కీన్ .అతను సృష్టించిన పాత్ర
లన్నీ చెడు పై పో రాటం చేసేవే .చివరికి మంచే చెడు పై విజయం సాధిస్తు ందని సందేశం ఉంటుంది ఆయన
ఏది రాసినా .
ఓల్డ్ ఇంగ్లీష అని పిలువ బడే ఆంగ్లో సాక్సన్ ఇసిలాన్ది క్ ,భాషలను బో ధించాడు .గ్రీక్ ,వెల్ష్
,ఫిన్నిష్ ,స్కాండినేవియా ,భాషలకు వ్యాకరణం ,పద జాలాన్ని సృష్టించాడు .ఆంగ్లో సాక్సన్ క్రా నికల్
ఆధారం గా ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు .భాషా శాస్త ం్ర అంటే ఆరో ప్రా ణం .మిడిల్ ఇంగ్లీష నాటి sir
gowain and the green knight ‘’అనే దీర్ఘ కవిత ను ఎడిట్ చేసి ప్రచురించాడు .దాన్నే ఆధునిక ఇంగ్లీష
భాష లో కవిత్వం గా మార్చి ప్రచురించాడు .తోక్లీన్ రాసిన ‘’the monster and the critic ‘’వ్యాసానికి
చాలా పెద్ద పేరు వచ్చింది .అలాగే పాత ఇంగ్లీష కవిత ‘’beowulf’’లో వీర ధీర శూరులు చాలా మంది
వ్యక్తు లను చంపుతారు .ఆ కవిత ఆంగ్ల భాషా ధ్య య నానికి ,ఆవిర్భావానికి తోడ్పడు తుందని
భావించాడు .ఇప్పటికీ అతని sir gawain ‘’యునివేర్సిటి లో బో ధనా విషయం గా ఉంది .ఆర్దూ రియాన్
,ఎల్ష్ ,నార్స్ ,ఐస్లా ండ్ భాషల్లో ని పూర్వ కధలన్నీ అతను రాసిన కధలకు ప్రేరణ .టోల్కీన్ కు ఫిన్నిష్
భాష అంటే మహా ఇష్ట ం .దాని లోని kalevala ‘’అనే అతి ప్రా చీన కవిత అంటే మహా ప్రా ణం .ఇలాంటి
భాషలను ఎన్నిటి నో కనుక్కొని ,వాటిల్లో కవితలు రాసి తన ప్రతిభ ను చాటి చెప్పాడు .’’కలేవల’’ కవితకు
సాటి కవిత ఆంగ్ల సాహిత్యం లో లేనే లేదు అని ఆయన నిశ్చితాభిప్రా యం .అతను సృష్టించిన చిన
పాత్రలు elves ,drowrves ,trolls ,gobins hobbit.విమర్శకులు అతని రచనలను కాలానికి తగ్గ ట్లు లేవు
అని విమర్శించినా అసంఖ్యాకం గా ప్రపంచ వ్యాప్త ం గా ప్రజలు చదివి ఆదరించటం విశేషం .
1960 లో జీవావరాన ,పర్యావరణం పై దృష్టి పెట్టా డు .1997 లో టి.వి.ల సర్వే లో
టోల్కీన్ నంబర్ వన్ స్థా నం పొ ందాడు .అతని రచనల్లో పక్షులు ,వృక్షాలు కూడా మాట్లా డుతాయి .చెట్లు
కూడా మానవులతోసమానం అన్నాడు .ప్రజలకు ,ప్రకృతి కి మధ్య మంచి అవగాహన ,సంబంధాలు
ఉండాలని తన రచన లలో తెలిపాడు .మానవ అభివృద్ధి కృత్రిమం గా కాక స్వాభావికం గా ఉండాలన్న
ప్రో బో ధం ఆయనది .జీవావరణ ,లాండ్ స్కేప్ లకు ప్రా ధాన్యం ఇచ్చాడు .జీవావరణం మీద ఆలోచించిన
మొదటి తరం రచయిత టోల్కీన్ .ఆయన వాషింగ్ మషీన్ ,టి.వి .లు కూడా అసలు వాడ లేదు .పల్లెల్లో
నివ సించాలని బో ధించినా పట్నాల సరి హద్దు లో నివ శించాడు .
టోల్కీన్ రచన లో హాబిట్ కధ ఒక ఆస మర్ధు ని జీవిత యాత్ర .చివరికి రింగ్ ఆఫ్ పవర్ సంపాదిస్తా డు
.దుష్ట సంహారం జరిగి మంచికి పట్టా భి షేకం జరగట మే కధ సారాంశం .the silma rillion అనే నవల
ఆయన చని పో యిన తర్వాతా ప్రచురిత మైంది .దానిలో చాందస మధ్య యుగ ఆవిర్భావం ,ఉంది
.మిడిల్ ఎర్త్ లోని మొదటి యుగం తో ప్రా రంభించి తర్వాతా రెండు యుగాల కధ ఇందులో ఉంది .ఇది
చాలా సంక్లిష్టం గా ఉంది ఎక్కువ మందిని ఆకర్షించ లేదు .
టోల్కీన్ పాత ,కొత్త తరాలకు చెందిన రచయిత గా ఇంగ్లా ండ్ లో గుర్తింప బడ లేదు .భాషా విషయ
పరి శోధకుని గా గౌరవించారు .మిడిల్ ఎర్త్ లో మగాళ్ళ దాస్తీకానికి బలి పో యే అమాయిక స్త్రీలు ,పిల్లల
దయ నీయ గాధ ఉంది .అదంతా నేటి మన ఆధునిక కాలానికి చెందిందే నని విశ్లేషకుల అభి ప్రా యం
.మగాళ్ళు హింసా ,తీవ్ర వాదం వల్ల అధికారాలు సాధిస్తా రు .వారి మధ్య ఆడ వారు ,,పిల్లలు నలిగి
పో తారు .ఒక రకం గా నవీన ప్రపంచానికి అది దర్పణమే .లార్డ్ ఆఫ్ రింగ్స్ ను’’peaceful political
anarchy’’అన్నారు .అరణ్య సంరక్షణ అవసరాన్ని గట్టిగా చెప్పాడు .’’ప్రపంచాన్ని మార్చక పో యినా
ఫరవా లేదు కాని ఉన్నదాన్ని చెడ గొట్ట వద్దు ‘’అని ఆయన అందరికి సందేశం ఇచ్చాడు
ఆయన రెండు సార్లు అంటే ఎనిమిదేళ్ళు డెమొక్రా టిక్ పార్టితరఫున అమెరికా ఉపాధ్యక్షునిగ ,అదే పార్టీ కి
చెందిన ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తోకలిసి పని చేసిన వాడు .ఉపాధ్యక్షుడు అంటే ఉత్స విగ్రహం కాదు, అని తన పాత్ర
ద్వారా రుజువు చేసిన వాడు .అమెరికా ఆర్ధిక స్తితి ని సరైన దారి లో పెట్టి ,వేలాది యువకులకు ఉద్యోగ
అవకాశాలను కల్పించిన వాడు . క్లింటన్ పై ''నీలి నీడలు ''కమ్మి నపుడు ధైర్యం గా ఆయన వెన్నంటి నిలిచి
,దేశానికి వీటి కంటే ప్రజా పాలన ముఖ్యం అని నిరూపించిన వాడు .క్లింటన్ తర్వాత అధ్యక్షా స్తా నానికి ఆ పార్టీ
తరఫున పో టీ చేసిన వాడు .2000 దేశాధ్యక్ష ఎన్నికలలో పాప్యులర్ ఓట్ల ను అత్యధికం గా పొ ందినా ,ఫ్లా రిడా రాష్ట ్ర
ఎలేక్టరల్ వోట్ల విషయం ఏర్పడిన సందిగ్ధ స్తితిలో సుమారు అయిదు వారాలు గెలుపు -ఓటముల మధ్య ''sea saw
''ఆటలో సంక్షోభా న్ని ఎదుర్కొని నిలిచినవాడు ,చివరికి సుప్రీం కోర్టు నిర్ణయం తో ప్రత్యర్ధి రిపబ్లి కన్ పార్టి అభ్యర్ధి
బుష్ గెలిస్తే ,హృదయ పూర్వకం గా అభినందనలు తెలిపి ఉత్త మ రాజకీయ పండితుడు అని పించుకొన్న వాడు
,ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ రాజ కీయ జీవితానికి స్వస్తి చెప్పి ,మొదటి నుడి తన కిష్టమైన పర్యావరణం పై ప్రజలను
చైతన్య పరుస్తూ , ఇంటర్నెట్వ్యాప్తికి కృషి చేస్తూ ,లాభా పేక్ష లేకుండా అనేక సంస్థ లను నెలకొల్పి జనుల జీవన
ప్రమాణా లనుమెరుగు పరుస్తు న్న వాడు ,శీతోష్ణ స్థితి మార్పుల తో విశ్వం ప్రమాదం అంచున ఉందని ప్రచారం
చేస్తూ జాగృతి కల్పిస్తు న్న వాడు , నోబెల్ శాంతి బహు మతి పొ ంది ప్రశాంత చిత్తు డైన వాడు టేన్నీసీ రాష్ట ్ర ముద్దు
బిడ్డ డు అందరి రి చేత ఆప్యాయం గా '' ఆల్ గోరె'' అని పిలువ బడే ఆల్ఫ్రెడ్ ఆల్బర్ట్ గోరె .
16 ఏళ్ళు కాంగ్రస్ కు సేవ లందించాడు గోరె .పర్షియన్ గల్ఫ్ వార లో పాల్గొ ని దేశానికి సైనికుడిగా
సేవలు చేశాడు . 'తనను వైస్ ప్రెసిడెంట్ గా పో టీ చేయమని క్లింటన్ కోరి నప్పుడు ''అగస్త ్య భ్రా త ''గా ఉండ టానికి
ఇష్ట పడను అని చెప్పి ,సముచిత గౌరవం స్తా నం సంపాదించు కొన్నాడు .గోరె వల్ల అమెరికా కు ''పాజిటివ్ చేంజి
''వస్తు ందని క్లింటన్ భావించాడు .అదే నిజ మైంది. క్లింటన్ -గోరె ల సన్నీ హితత్వం తో అంతకు ముందు పాతిక
ఏళ్లు గా గెలవని దక్షిణ రాష్ట్రా లన్నీ డెమొక్రా ట్ల వశం అయి చరిత్ర సృష్టించాయి .దీనికి వీరిద్దరి జంట పై ఉన్న
అపూర్వ నమ్మకం .క్లింటన్42 వ అమెరికా ప్రెసిడెంట్ అయితే గోరె 45 వ వైస్ ప్రెసిడెంట్ .గోరె- క్లింటన్ కు అత్యంత
నమ్మక మైన వాడు .ప్రభుత్వ వ్యవస్థ లోని అన్ని టి ని అధ్యయనం చేశాడు .ఎన్నో సంస్కరణలు చేయించాడు .
''పెట్టమని దాని వల్ల పిల్లలు చెత్త ప్రో గ్రా ములు చూడ కుండా తలి దండ్రు లు అడ్డు కో గలరని చెప్పి ,అమలు
చేయించాడు .ఇంటర్నెట మీద విప రీత మైన అవగాహన ఉన్న వాడు గోరె .అందుకని white house లో web site
ను ప్రవేశ పెట్టించి ప్రజలకు ప్రభుత్వ విధానాలను తెలుసు కొనే అవకాశం కల్పించాడు .తాను ఇదివరకటి వైస్
ప్రెసిడెంట్ల లాగా ఆలోచించనని ,తాను ఆ పదవి లో ఉంటె ,ఇది వారికంటే మేలు చేయ గలననే నమ్మకం తనది
అన్నాడు ''I am not spending any time or energy ,thinking about to morrow and the ambition to be
president .some people might find that implausible ,but that is the honest truth'' అని తన మనసు లో
క్లైమేట్ లో మార్పులు వస్తు న్నాయని దీని ఫలితం దారుణం గా ఉంటుందని యు.యెన్.రిపో ర్ట్ వచ్చింది 1997 లో
జపాన్ లోని ''క్యోటో ''లో ప్రపంచ దేశాలన్నీ సమావేశమై దీని పై చర్చించాయి .కార్బన్ ఉద్గా రాలను లిమిట్
చేయాలనే సూచన వచ్చింది .దాన్ని అమలు చేయాలని క్లింటన్ ప్రభుత్వానికి సూచన చేశారు .360 బిలియన్
డాలర్ల జాతీయ అప్పును పెయిడ్ ఆఫ్ చేయించారు .ఇరవై రెండు మిలియన్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డా యి .అప్పుడే
దేశం లో మొదటి సరిగా నిరుద్యోగ శాతం అత్యంత కనిష్ట స్తితి కి చేరి భేష్ అని పించుకోంది క్లింటన్ -గోరె ప్రభుత్వం
.ఉద్యోగులకు జీతాలు విప రీతం గా పెరిగాయి .పన్నులు చాలా తగ్గి పో యాయి .దాని వల్ల స్వంత ఇల్లు కొనుక్కొనే
అవకాశాలు ఎక్కువై ఎక్కువ మంది స్వంత ఇంటి వారయ్యారు . .స్టా క్ మార్కెట్ ఆశా జనకం గా ఉంది .ప్రెసిడెంట్
క్లింటన్ ఇంపీచ్ మెంట్ కు గురి అయాడు .ఆ కల్లో ల సమయం లో గోరె క్లింటన్ కు బాసట గా నిలిచి పో రాడాడు
.చివరికి క్లింటన్ దేమీ తప్పు లేదని తీర్పు వచ్చింది .క్లింటన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాడు .ప్రెసిడెంట్ గా కోన
సాగాడు .ఆ సందర్భం గా గోరె టి.వి.ఇంటర్ వ్యూ లో మాట్లా డుతూ ''you know what american people
want ..they want us to move us on the future ,and talk about them ,and work on their problems and
build their future ,not wallow in the past ''.అని ప్రజల ను అభి నందించాడు .వాళ్ళ సేవ లో ఉన్న వాళ్ళం
రాజ కీయాల పై విసుగు పుట్టి ,తన జీవితాన్ని మరో మాలు పు తిప్పు కొన్నాడు గోరె .''గ్లో బల్ క్లైమట్
ే చేంజి ''ని
సవాలుగా తీసుకొని సమస్త జీవ రాసుల మేలు కోరి ఉద్య మించాడు .పదవి లోంచి తప్పుకోగానే అనేక యూని
వేర్సిటీలు ఆయన్ను విజిటింగ్ ప్రొ ఫెసర్ గా ఉండమని అర్ధించాయి . కాని కొలంబియా, ఫిస్క్ ,మిడిల్ టేన్నేసి,కాలి
ఫో రియా వర్సిటీ లలో మాత్రమె విసిటింగ్ ప్రొ ఫెసర్ గా ఉండటానికి ఒప్పు కొన్నాడు .గూగుల్ ఇంటర్ నెట్ సెర్చ్
కంపనీ కి సీనియర్ అద్వైసేర్ గా ఉన్నాడు .ఆపిల్ కంప్యూటర్స్ బో ర్ద్ ఆఫ్ డైరెక్టర్ ల లో ఒకని గా ఉన్నాడు
.జెనెరేషన్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజి మెంట్ లోభాగ స్వామి అయాడు .ఇది claints ధనాన్ని మదుపు చేసి సమాజ
సేవ కు తోడ్పడుతుంది .దీని ముఖ్య కేంద్రం లండన్ .గ్లో బల్ వార్మింగ్ నివారణ లో సహాయ పడే కంపెనీ లకు ఆసరా
గా నిలబడుతుంది .ఆయనకు వాణిజ్య ,వ్యాపారా లలో ,సాంకేతిక విషయాలలో మహా అభి నివేశం ఉంది .ట్రెండు
లను గుర్తించటం లో ,భవిష్యత్తు లో లాభాలు తెచ్చే ఏర్పాట్లు ఆయనకు కొట్టిన పిండి .బుష్ పై ఒడి పో యినా
సెప్టెంబర్ 11,2001 నాడు జర్గిన సంఘటన పై దేశాధ్యక్షుని కి అండగా నిలబడి ,ఒక జాతీయ ప్రతి పక్ష నాయకుడి
పాత్రను సమర్ధ వంతం గా పో షించాడు .జాతీయ ఐక్యత కావాలని సందేశం ఇచ్చి బుష్ కు బాసట గా నిలిచాడు
.2004 అధ్యక్ష ఎన్ని కలలో గోరె నే పో టీ చేయాలని డెమోక్రా ట్లు అర్ధించినా ససేమిరా అన్నాడు .''re -elect gore
నిర్ణయం మార్చు కోలేదు .కిందటి ఎన్ని కలలో తనకు వచ్చిన ఫండు లో మిగిలిన ఆరు మిలియన్ డాలర్ల ను అనేక
డెమొక్రా టిక్ పార్టి గ్రూ పు లకు ప్రచారం నిమిత్త ం ఇచ్చేసిన ఆదర్శ వంతుడు గోరె .
అమెరికన్ ప్రజాస్వామ్యం అడ్డ దిద్దం గా నడుస్తు న్నందుకు బాధ పడ్డా డు .''the assault on reason ''అనే
పుస్త కాన్ని రాశాడు అందులో చివరిగా american democracy is in anger -not from any one set of ideas ,but
from un precedented changes ,in the environ ment within which ideas either live and spread ..or
wither and die .i do not mean the physical environ ment ,,i mean what is called the public sphere or
the the market place of ideas ''అని యదార్ధ స్తితిని చూపించాడు .''indeendent cabletelivison net work
called current t.v.ని ఏర్పాటు చేశాడు .యువకులకు చిన్న చిన్న ఎపిసో డు ళు తీసి వారిలో పర్యా వారం స్పృహ
కల్గించాడు సామాన్య ప్రజలకు ఇది ఒక వరమే అయింది .వారి అభిప్రా యాల ఫీడ్ బాక్ కు కూడా గొప్ప అవకాశం
కలిగింది .అయన ఒక'' visionary ''అని అల్గో రే ను అందరు ప్రశంసించారు .''gore is doing things that are
new ,daring ,difficult ,just as he tried to do as a public servant ''అని ఎంతో అనుభవం ఈ రంగం లో ఉన్న
ఇప్పుడు ఆయన దృష్టి గ్లో బల్ క్లైమేట్ చేంజి మీద కేంద్రీక రించాడు .భార్య టిప్పర్ సలహా పై
పూర్వకాలం లో ''స్లైడుల ''ద్వారా విషయాలను జనానికి తెలియ జేశారో ఇప్పుడు ఆయనా అలా స్లైడు లను మళ్ళీ
విన యోగం లోకి తెచ్చి ప్రజలను అప్రమత్త ం చేశాడు .వేల ప్రదర్శనలు ఇప్పించాడు గోరె స్వంతం గా ''earth in the
balance ''అనే అంశాన్ని బాగా ప్రజా దృష్టికి తెచ్చాడు .దీనికోసం ఆధుఇనిక సాఫ్టు వేర్ ను ఉప యోగించాడు
.విషయాలను కంప్యూటరీకరించాడు .అమెరికా అంతా తిరుగుతూ ,ప్రదర్శన లిస్తు ,ఉపన్య సిస్తు ప్రజా చైతన్యం
తెచ్చాడు .రాబో యే కాలం లో కూడా ప్రదర్శన లు ఇచ్చే ఏర్పాటును పకడ్బందీ గా చేశాడు .గ్లో బల్ క్లైమట్
ే చేంజి
గురించి ఆయన సో దాహరణం గా మాట్లా డుతూ ,దాని వల్ల కలిగే ప్రమాదాలను చిత్రా ల ద్వారా చూపిస్తు న్నప్పుడు
వేలాది మంది భవిష్యత్తు లో జరుగ బో యే అనర్ధా న్ని తలచు కొని ''ఎడ్చేసే వారట ''ఇదొ క ఉద్యమం గా కోన
సాగిస్తు న్నాడు .సుశిక్షితు లయిన వెయ్యి మందిఉపన్యాసకులను ప్రపంచం మొత్త మీద తయారు చేశాడు .
గోరె చేస్తు న్న ఈ అద్భుతాలను చూసి డేవిస్ డగ్గిఎంహెం అనే ఫిలిం ప్రొ డ్యూసర్ స్లైడ్ షో ను సినెమా గా తీశాడు
.దీని పేరు''an inconvenient truth '' .ఇది2006 may 24 న విడుదలై హిట్ల మీద హిట్లు కొట్టింది.ఎన్నో ఎద్ద పెద్ద
ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్లి ప్రజాభి మానం పొ ందింది .దీన్ని చూసిన జనం ''లేచి నిలబడి హర్ష ధ్వానాలు చేసే వారు
''అంటే స్టా ండింగ్ వోవేషన్ అన్న మాట .అంత పాప్యులర్ అయింది .లెక్క లే నన్ని అవార్డు లను గెల్చు కొన్నది ఈ
సినిమా .బాక్సాఫీసు రికార్డు లు బద్ద లు కొట్టి 50 మిలియన్ల డాలర్ల పంట పండించింది .కనకాభి షేకం చేశారు
ప్రేక్షకులూ ,పర్యావరణ ప్రేమికులూ కలిసి .ఇది ఆల్గో రే కు ఎంతో సంతృప్తి నిచ్చింది ఒకటిన్నర మిలియన్ల డి.వి.డి
.లు అమ్ముడయాయి .దీనిలో గ్లో బల్ వార్మింగ్ గురిచి చెబుతూ గోరె సేవ లనూ స్ప్రుశించటం కూడా శించటం
జరిగింది .ఒక రాజ కీయ వేత్త, పర్యావరణ వేత్త గా రూపొ ందిన క్రమ విధానం అందులో చూపించారు .క్లైమేట్ క్రైసిస్
అత్యంత ప్రమాదకరం అని జనం పూర్తిగా తెలుసు కోనేట్లు చేశాడు గోరె .కార్బన్ డై ఆక్సైడ్ విడుదల ఎక్కువై వేడి
ఎక్కువ అవుతోందని ఆయన ప్రపంచ పర్యటనలకు విమానాల మీద వెళ్తు న్నప్పుడు'' కార్బన్ ఆఫ్
సెట్''ఉపయోగించే వాటిల్లో నే వెళ్తా డు ''.carbon offsets provide sell the green house gas reductions
associated with projects like wind farms ,to customers who want to off set the emission they caused
by flying driving ,or using electri city ''
''an inconvenient truth ''అని గోరె తీసిన సిని మా 2007 బెస్ట్ డాక్యు మెంటరి ఫీచర్ ఫిల్ముఅవార్డు ను
అకాడెమి అవార్డు లలో సంపాదించింది అవార్డు ప్రదానం రోజున గోరె ,సినీ డైరెక్టర్ మిగిలిన బృందం అందరు కలిసి
దాన్ని స్వీకరించారు .ఆ సందర్భం గా మాట్లా డుతూ గోరె '' my fello Americans ,people all over the world ,we
need to solve the climate crisis .it is not political issue ,it is a moral issue .we haave to create
renewable resource .let us renew it'' అని చక్కని సందేశాన్నిచ్చాడు .దీని తర్వాత కార్బన్ ఏమిషాన్
ఉంచుకొని గోరె'' alliance for climate protection '' అనే లాభా పేక్ష లేని సంస్థ ను ఏర్పాటు చేశాడు .సమస్యను
రాజ కీయ సమస్య గా కూడా చేయాలని భావించాడు .ఈ సంస్థ ఒక పెద్ద ఇంటర్నెట ను టి.వి మరియు పత్రిక లను
ప్రా రంభించి విస్త ృతం గా ప్రచారం చేస్తో ంది .ఈ అలఎన్సు సంస్థ ''live earth benefit '' కోసం సంగీత కచేరీలను పెద్ద
పెద్ద సంగీత కారు లతో ఇప్పిస్తో ంది .ప్రపంచ వ్యాప్త ం గా ఈ కార్య క్రమాలను నిర్వహించటం ప్రశంషనీయం .ఇదంతా
గోరె పుణ్యమే .
ఇలా తన పని ని తాను చేసుకొని పో తున్న సమయం లో నోబెల్ పురస్కార ప్రదాన కమిటీ 12-10-
2007 న నోబెల్ శాంతి బహు మతి ని గోరె కు ,అతని తో పాటు united nation's inter govern mental panel on
climate change '' కు కలిపి ప్రకటించింది .ఈ సంస్థ భారత దేశానికి చెందిన కే.పచౌరి నాయకత్వాన పని చేస్తో ంది
.గోరె కు ఆయనకు సంయుక్త ం గా ఈ అవార్డ్ ను ఇస్తా రన్న మాట .10-12-2007 న అవార్డు ను ప్రదానం చేశారు
గోరె ,పచౌరీ ఇద్ద రు తీసుకొన్నారు .ఆ సందర్భం గా గోరె ను ప్రశంసిస్తూ ''gore ,the individual who has done
most to create ,greater world wide understanding of the measures that need to be adopted''అని
అన్నది .గోరె తనకు వచ్చిన బహుమతి మొత్త ం 1.5 మిలియన్ డాలర్ల ను Alliance for climate protection ''
పచౌరీ కి ,ఆ విషయాన్ని ప్రపంచ వ్యాప్త ం గా ప్రచారం చేసి నందుకు గోరె కి ఆ బహుమతిని ఇస్తు న్నట్లు కమిటీ
ప్రకటించింది .
'' Newyork times ''పత్రిక ఒక పూర్తీ పేజి advertise ment తో ఒక విజ్ఞ ప్తిని గోరె కు చేసింది ''మీ కు మీ పార్టీ
కి దేశానికి భూమికి మీ నాయకత్వం అత్యవసరం ''అని 2008 ఎన్నిక లలో మళ్ళీ పో టీ చేయమని కోరింది
.తనకుఇప్పుడు ఆ ఉద్దేశ్యం లేనే లేద ని స్పష్ట ం గా చెప్పాడు .భవిష్యత్తు లో లేక పో లేదని విశ్లేషకులు ఊహా గానం
చేశారు .తన భావాన్ని '' I honestly believe that the highest and best use of my skills and experience is
to try to change the minds of people in the u.s. and else wher e in the world about this planetary
emergency that we simply have to confront 'అని సవినయం గా తన లక్ష్యాన్ని స్పష్ట ం గా తెలియ జేసిన
పర్యా వరణ ప్రేమికుడు,ప్రధమ సేవకుడు 'మన ఆల్ గోరె ''.long live Al Gore ''
ఆల్ గోరె లో1948 మార్చి ముప్ఫై ఒకటిన జన్మించాడు.హార్వర్డు వర్సిటి లో గ్రా డ్యు ఎట్ అయాడు .మేరి
ఎలిజే బెత్ ఐ చెంసన్ అనే ఆమెను వివాహం చేసుకొన్నాడు .ఈమెనే ''టిప్పర్ ''అని పిలుస్తా రు 1971 లో
వియత్నాంయుద్ధ ం లో ఆర్మీ జర్న లిస్టు అయాడు .1984 లో టెన్నిసీనుంచిడెమొక్రా టిక్ పార్టి సెనేట్
సభ్యుడయాడు .మళ్ళీ ఆరేళ్లకు తిరిగి ఎన్నిక అయాడు .1988 లో డెమొక్రా టిక్ పార్టి నుంచి అధ్యక్ష స్తా నానికి పో టీ
చేద్దా మను కొన్నాడు కాని పార్టి నుంచి సపో ర్టు రాలేదు .1989 లో''earth in the balance '' అనే గొప్ప పుస్త కం
రాశాడు .1992 లో క్లింటన్ ప్రెసిడెంట్ గా, గోరె వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయారు .ఇంకో సారి కూడా 1996 లో ఈ జంట
అదే పదవి దక్కించు కొన్నారు .2000 ఎన్నిక లలో బుష్ పై ఓటమి పాలై నాడు .ఆ తర్వాత ఆయన చరిత్ర అంతా
పైన చెప్పు కొన్నాం .2007 లో పర్యా వరణ రక్షణకు ఆయన చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి ని పొ ందాడు
.ఓడినా, దేశం, ప్రపంచం ,పర్యా వరణం అంటూ స్వచ్చంద సేవ లందిస్తు న్న గోరె అందరికి ఆదర్శమే .
ఫాంటసి, సైన్స్ ఫిక్షన్ హారర్ మిష్ట రీ ఫిక్షన్ మొదలైన అనేక ప్రక్రియలలో రాటు దేలిన ణ రచయిత గా ప్రఖ్యాతి
పొ ందాడు రే బ్రా డ్ బారీ .22-8-1920 లో జన్మించి తొంభై రెండేళ్లు సంతృప్తి గా జీవించి ఎన్నో పురస్కారాలను
వచ్చాయి ఇరవై వ శతాబ్ద పు ప్రఖ్యాత రచయిత గా గుర్తింపు పొ ందాడు .ఆయన రాసిన అనేక సైన్స్ ఫిక్షన్ రచనల
వల్ల ''గ్రా ండ్ మాస్ట ర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ''అని విఖ్యాతు డైనాడు .ఆయన జీవితం రచయిత లందరికి ఉత్తెజమే
.ఆయన వ్రా సింది అంత కవిత్వం వంటి వచనం అవటం అందర్నీ ఆకర్షించింది .
అసలు పేరు ''రే డగ్లా స్ బ్రా డ్ బరీ ''.ఇల్లినాయిస్ రాష్ట ం్ర లో ''వాకేంగాన్ ''లో టెలిఫో న్ ,పవర్ డిపార్ట్
మెంట్ లో లైన్ మాన్ గా పని చేసే ఈస్త ర్ బాడ్ బరీ ,లినోల్ద్ స్పాల్డింగ్ దంపతులకు జన్మించాడు .ఒక్క రెండు సార్లు
మాత్రమె అదీ ఏడాది పాటు మాత్రమె జన్మ భూమి గి దూరం గా ఉన్నాడు .కుటుంబం అరిజోనా లోని ''టక్సాన్
''చేరింది .అదొ క ఎడారి ప్రా ంతం గా భావించాడు .ఆ నేపధ్యం లో కధలు రాశాడు .పద్నాలుగేళ్ళ వయసు లో
కుటుంబం కాలిఫో ర్నియా లోని లాస్ ఏంజిల్స్ కు చేరింది .అక్కడే హై స్కూల్ చదువు పూర్తీ చేశాడు .చేతికి అందిన
ప్రతి పుస్త కం చదివే వాడు .అతని సాహిత్య దాహానికి అన్తు ండేది కాదు .క్రమంగా స్వంత రచనలు ప్రా రంభించాడు
.అవి పత్రికల్లో పడేవి ఆని డబ్బులేవరూ ఇవ్వలేదు .1944 లో రాసిన సూపెర్ సైన్స్ స్తో రీలకు మొదటి సారిగా లక్ష్మీ
కటాక్షం కలిగింది .అదేబాటలో కోన సాగి అందులో మహా రచయిత అని పించుకొన్నాడు .1947 లో ''dark carnival
కుజ గ్రహానికి సంబంధించిన కధలను ''the martial chronicles ''పేర 1950 లో ప్రచురించి స్సిన్స్ ఫిక్షన్
కు దిశా నిర్దేశం చేశాడు .తర్వాత ఏడాది ''the illustrated man ''రాసి రచయిత గా చిర కీర్తి పొ ందాడు .మరి
మూడేళ్ళ లో రెండు డజన్ళ కు పైగా కధలు రాసి సెభాష్ అని పించుకొన్నాడు .రేడియో లో అవన్నీ అందర్నీ
అలరించాయి .వీటిని x minus one ,suspense ,lights out గా మార్చి టెలివిజన్ సీరియల్స్ గా ప్రసారం చేసి గొప్ప
ప్రా ముఖ్యత కల్గించారు .c.b.s.television work shop ,aalfred hitch cock presents పేరా బ్రా డ్ బారీ సీరియల్సు
ప్రసారమై దేశ విదేశాలలో మంచి ఉత్సాహాన్ని కల్గించాయి .ఆయన రాసిన వాటి లోంచి ఎంపిక చేసి the
meteor ,the fog horn లను ప్రసారం చేశారు . 1953 లో ఆయన మొదటి నవల'' fahrenheit 451
''వెలువడింది .మంచి పేరొచ్చింది .ఇదొ క హారర ధో రణి కధ .దీనికి అనుబంధం గా చాలా రాశాడు .'' october
country ''రెండేళ్ళ తర్వాతా వచ్చింది ఇంకో రెండేళ్లకు ''dandelian wine ''అనే రెండో నవల వచ్చింది .1960-
70 కాలం లో ఆయన రాసిన చాలా వాటిని ప్రేక్షకులకు అందించారు .ఫారెన్హీ ట్ ,దాన్దేలిన్ సీరియల్స్ గా సినిమా గా
వచ్చి జనాన్ని మేస్మేరైజ్ చేశాయి .ఆయన రాసిన వాటిలో మొత్త ం 35 పైగా సినిమాలుగా టెలివిజన్ ప్రో దక్షన్లు గా
వచ్చాయి అంటే ఆయన రచనలను ప్రజలు ఎంత ఇష్ట పడ్డా రో తెలుస్తో ంది .అన్ని రకాల ప్రేక్షకులు ఆయన
సీరియల్స్ ను సినిమాలను విప రీతం గా ఆదరించారు .అరవై ఏళ్ళు పైగా రచనలు చేస్తూ న్నా ఆయన కలం వాడి
తగ్గ లేదు.చదువరులలో అభిమానం తగ్గ లేడు .ఆయన మీద క్రేజ్ ఇంకా ఉండనే ఉంది .ఇంతటి అభిమానాన్ని
బారీ కి ''national medal of arts ''బహూక రించి సన్మానించారు .వరల్డ్ ఫాంటసి కమిటీ ,ఆయన్ను సత్కరించింది
ఆయన ఇల్లినాయిస్ లో ఉండగా ''గ్రీన్ టౌన్ ''అనే పేరు ను సేఫ్టీ ,కి ఇంటికి సింబాలిక్ గా పెట్టు
కొన్నాడు .ఆయన రాసిన మోడరన్ క్లా సిక్ అని పిలువ బడ్డ రచన ''డాండలిన్ వైన్ ''కు ఇదే నేపధ్యం .ఆయన
అంకుల్ ఇక్కడే ఆయనకు అతీత శక్తు లను ప్రదర్శించి చూపింది కూడా ఇక్కడే .అవే ఆయనకు కదా వస్తు వులై
నాయి .అలాగే ఆయన రాసిన ''సమ్మర్ మార్నింగ్ ,సమ్మర్ నైట్స్'' కదా స్రవంతి గ్రీన్ హౌస్ నేపధ్యం లో రాసినవే
.పదకొండేళ్ళ వయసు నుంచి స్వంతం గా కధలు రాసిన చాతుర్యం ఆయనది .గ్రేట్ డిపష
్రె న్ రోజులలో కధలు
రాశాడు .అమెరికా షేక్స్ పియర్ స్కాలర్ అని పిలువా బడే దగ్లా స్ స్పాల్డింగ్ తో స్నేహం చేశాడు .పడి హేదేల్ల
వయసు లో ఆర్థర్ క్లా ర్క్ రాసిన సైన్స్ ఫిక్షన్ అంతా ఊదేశాడు .ఆయన అభిమాన రచయితలు రాబర్ట్ ఫ్రా స్ట్ ,షెల్లీ
స్టీన్ బెక ,ఆల్దా స్ హక్స్లి థామస్ వుల్ఫ్ లు .ఎదిత్ వార్టన్ అంటే ప్రత్యెక అభిమానం .లైబర
్ర ి లో కూచుని ఎంతో
సాహిత్యం అధ్యయనం చేశాడు అందుకే ''libraries raised me ''.అని గర్వం గా చెప్పుకొన్నాడు .కాలేజీ లలో ఏదీ
నేర్చుకోలేరని అక్కడ చదువుతూ రాయటం సాధ్యం కాదని చెప్పాడు ''you can not learn to write in college .it
is very bad place for writing because the teachers always think they know more than you -and they
do not ''అని తన అనుభవాన్ని కుండా బద్ద లు కొట్టి చెప్పాడు .పబ్లి క్ లైబర
్ర ి సిష్టెం బాగా అభి వృద్ధి చెందాలని
కోరాడు .
ఆయన నవల పేరుతో ''dandalin cretar ''అని ప్పేరు పెట్టి ఆయన ఫిక్షన్ కు జేజల
ే ు పలికారు .1992 లో కానీ పెట్ట
బడ్డ ''asteroid '' ను ''9766 brad buri ''అని ముద్దు గా పిలిచారు .ఆయనకు 1994 లో ఎమ్మీ అవార్డు వచ్చింది
.2003 లో wood bury university ఆయన కు గౌరవ డాక్ట రేట్ ఇచ్చి సత్కరించింది .2004 లో నేషనల్ మెడల
ఇచ్చారని ముందే చెప్పుకొన్నాం .world fantasy award ,A.C.clerke award అందుకొన్నాడు .pulidjer board
ఆయన్నుప్రత్యేకం గా పిలిచి సత్కరించి ''citation ''అందజేసింది .2007 ఫ్రెంచ్ కమాండర్ అవార్డ్ పొ ందిన కలం
వీరుడు రే బ్రా డ్ బరీ ..2008 లో ''S.F.P.A.grand master award ,2009 లో చికాగో లోని కొలంబియా కాలేజి
వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించారు .2012 N.A.S.A.curiosity rover on planet mars ను ''బ్రా డ్ బరీ
లాండింగ్ ''అని అత్యుత్త మం గా,అధిక గౌరవాస్పదం గాఅమిత అభిమానం గా పిలిచారు .ఇంత కంటే రచయిత కు
పేరు పొ ందింది ఆధునిక సాంకేతికత అత్యంత వేగం గా పురోగా మిస్తు న్న సంగతికి అద్ద ం పట్టింది .క్లా సిక్ అని పేరు
పొ ందింది .''యాంటిటి టోటలిటేరియన్ సాహిత్యం'' గా ప్రా ముఖ్యం వచ్చింది .ఇరవై నాలుగో శతాబ్ద పు అమెరికా ఎలా
ఉండ బో తోందో చూపే నవల. అందుకే దీన్ని'' dystopian novel '' అన్నారు .అంటే ఊహాత్మక నాగరి కాభి వృద్ధి ని
తెలియ జేసేది అని అర్ధం .అయితే అందులో నిజమైన సుఖం ,ఆనందంఅనేవి అసాధ్యం అని కూడా సారాంశం .ఈ
నవల లో ''అగ్ని ''అనేది ఒక ప్రతీ కాత్మకం గా చెప్ప బడింది (symbolic ).దాన్ని జాగ్రత్త గా నియంత్రించక పో తే
అనర్ధం అని భావం .శక్తి ని అత్యాశ గా ఖర్చు చేస్తే విప రీత పరిణామాలు యేర్పడతాయనే నీతి . .భవిష్యత్తు ను
అప్ టాన్ సిన్క్లైర్ రచన లు చాలా మందిని ప్రభావితం చేశాయి .జర్మన్ రచయిత ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,తామ
స్ మాన్ ప్రముఖ నాటక రచయిత బెర్నార్డ్ షా లు చదివి ఆనందించి ఆయన్ను ఇరవై వ శతాబ్ద పు రాజ కీయమార్గ
దర్శి అన్నారు . అవి నీతి సామ్రా జ్యపు కూకటి వేళ్ళ ను పెకలించే విశ్వ ప్రయత్నం చేశాడు .దానితో కళ వళ పడిన
రాజ కీయ పెద్దలు తప్పులు దిద్దు కొనే ప్రయత్నాలు చేశారు కంటి తుడుపు గా నైనా .జంగిల్ నవల కు
ప్రభావితులైన వారు ''చికాగో ఇస్ అవర్స్ ''అనే నమ్మక మైన అభిప్రా యానికి వచ్చారు .ధనస్వామ్యాన్ని అన్ని
కొణాల్లో నుంచి చూసి ,చూపించాడు .అబ్బా ! ఇంత దరిద్ర స్తితి లో మనం ఉన్నామా ? అని ముక్కున వేలు
వేసుకోనేట్లు చేశాడు .ఈ అవినీతి కధలు చదవలేక ,వినలేక ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ సిన్క్లైర్ రచనలు అచ్చు వేస్తు న్న
పబ్లి షర్ కు ''అయ్యా ! మీ సిన్క్లైర్ ను ఇంటికి వేళ్ళ మనండి .కాసేపు నా దేశాన్ని నన్ను హాయిగా పాలించు
కొనివ్వ మనండి ''అని రాయాల్సి వచ్చింది .అదీ రచన ప్రభావం అంటే .తాను చెడిపో యిన ఆహార పదార్ధా ల
విషయం లో జాగ్రత్తలు తీసుకొంటున్నానని ,అక్కడి పరిస్తితులు సిన్క్లైర్ చెప్పి నంత దారుణం గా లేవని సంజాయిషీ
ఇచ్చుకొన్నాడు పాపం .
న్యు జెర్సి లోని సిన్క్లైర్ అతని బృందం ''హేలికాన్ హిల్ ''లో ''academy of engle wood ''అనే సంస్థ ను
ఏర్పరచి సమావేశం జరిపితే ఎందరెందరో మేధావులు రచయితలు ఆలోచనా పరులు స్త్రీ ,పురుషులు హాజరైనారు
.శాకా హారం యొక్క విశేషాలను అందరు ప్రత్యక్షం గా అనుభవించి తెలుసుకొన్నారు .బీన్సు బంగాళా దుంప
సిన్క్లైర్ లెవిస్ అనే కుర్రా డు మిగిలిన విద్యార్ధు లుపాల్గొ ని ఆనందించారు . .అదంతా ''ఫ్రీ లవ్ సొ సైటీ ''లాంటిది
అన్నారు కొందరు .కాని దాని విషయం అందరికి తెలిసి ఎందరో పెద్దల్ని ఆకర్షించింది .అందులో విలియం జేమ్స్
,ఏమ్మా గోల్డ్ మాన్ ,జాన్ డ్యుయీ వంటి వారున్నారు .ఫ్రా యిడ్ ప్రభావం బాగా ఉన్న కాలం లో సిన్క్లైర్'' డయటింగ్
''ను ,హో మియో పతి వైద్యాన్ని వ్యాప్తి చేశాడు .''ఫాష్టింగ్ ''ప్రయోజనాన్ని తెలియ జేశాడు . .ఇలా చేయ టానికి''
యే ప్రతీక శక్తు ల్ని ఏది రించాడో అవే ఆయన్ను నిర్వీర్యుడిని చేసే ప్రయత్నాలూ చేశాయి .ఆయన జంగిల్
నవల పది హేడు భాషల్లో కి అనువాదం పొ ందింది అంటే ప్రపంచ వ్యాప్త ం గా దాని ప్రభావం ఏమిటో తెలుస్తో ంది
.పారిశ్రా మిక అమెరికా లో ఉన్న బాధలు ఆందో ళనలు వ్యధలు అన్నీ అర్ధమయేట్లు చేసింది .ఆయన చేసిన
ఆరోపణలు అన్నీ యదార్ధా లే నని పరిశీలన లో తేలిన విషయాలే .చికాగో లోని మాంసం పాకెట్లు తయారు చేసే
చోట జరిగే అవి నీతి ని బయట పెట్టా డు .దీన్ని చదివిన ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ చికాగో కు ఒక కమీషన్ ను పంపి
ఎంక్వైరీ చేయించాడు .అదీ పబ్లి క్ బాగా విరుచుకు పడిన తర్వాతే .అదీ సిన్క్లైర్ ప్రభావం .మన రచయిత ఊరు
కొంటాడా ? తన స్వంత డబ్బు ఖర్చు చేసి ఒక ప్రైవేట్ కమిటీ ని పంపి అక్కడి అధ్వాన్న స్తితులను అధ్యయ నం
చేయించాడు . .అతను రాసిన వన్నీ యదార్ధా లే అని అన్ని కమీషన్లు నిర్ధా రించాయి .అదీ ఆయన సాధించిన
నైతిక విజయం .ఆ కాలం అంతా'' muckraaking ''అని పేరు తెచ్చుకోంది .ఇవన్నీ గమనించిన బిజినెస్ వర్గ ం,
మేధావి వర్గా న్ని నియంత్రణ చేసే ప్రయత్నాలెన్నో చేసింది .అయినా పబ్లి క్ డిమాండ్ ముందు ఓటమి పాలైంది .
ఆయన రచనలలో మానవులు జంతువుల కంటే కొద్ది నయం అన్నట్లు గా ఉంటుంది .రాసే టప్పుడు
ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు దారా పాతం గా కారి పో యేవి .చలించి పో యే వాడు .ఆయన రాసిన నలభై ఏళ్ల
తర్వాత అమెరక
ి ా ప్రజలు బిజినెస్ వర్గా లను ఎదిరించి వాటి పై తమ కంట్రో ల్ ను సాధించే ప్రయత్నం చేశారు. స్టా క్
యార్డ్ ప్రజలకు న్యాయం జరిగింది .ఆయన నినదించిన సామాజిక న్యాయం ప్రపంచ ఘోష గ విని పించింది
.అమెరికా జనం ఎదుర్కొన్న పరిస్తితుల తో బాటు వలస వచ్చిన వారి బాగోగుల విషయం మీదా రాశాడు .వారి
సమస్యలను ఫో కస్ చేశాడు .వీరికి తమ మత స్వేచ్చ లేదని ,కుటుంబం గురించిన అభిప్రా యాలకు విలువ
నివ్వటం లేదని ,వారి సాంస్కృతిక విషయాల పై నియంత్రణ ఉందని ,తమ సంగీతాన్ని తాము పాడుకొనే స్వేచ్చ
లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు .ఒక ఆటవిక రాజ్యం లో ఉన్న భావం కలుగుతోందని చెప్పాడు .కనుక
ప్రజాస్వామ్యాన్ని కొత్త వాతావరణానికి అల వాటు పడేట్లు చేయాలన్నది ఆయన దృష్టి .మనిషి'' ఒక మూక
మనిషి'' గా మార రాదని సిన్క్లైర్ అన్నాడు .
సిన్క్లైర్ మనిషి సామర్ధ్యాన్ని ,కష్ట పడి పని చేసే విధా నాన్ని మెచ్చాడు .పని లో శక్తినంతటిని
వినియోగించాలని అలసత్వం పనికి రాదనీ కార్మికులకూ చెప్పాడు .ఇళ్ళ లోని అసౌకర్యాలను డ్రెయినేజి ని అభి
వృద్ధి పరచాల్సిన ఆవ సారాన్ని ఆయన రచనలో వీలున్న చోటల్లా చెప్పి ప్రభుత్వ దృష్టి లో పడేశాడు .ఆరోగ్య వంత
మైన ఇళ్ళ నిర్మాణాన్ని కోరాడు .నాలుగు రూముల ఫ్లా ట్ లను ఎర్పరచాలన్నాడు .ఇరుగు పొ రుగు లు కలిసి
సౌభాగ్యం గా జీవించాలని చెప్పాడు .ఇళ్ల కు ,ఆఫీసులకు పరిశుద్ధ మైన తాగు నీటిని అందించాలని .ప్రతి మూల
నీటి టాప్ ఉండాలని సూచించాడు .వీటన్ని ఫలితం గా1905 చికాగో మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో చికాగో ఫెడ
రేషన్ ఆఫ్ లేబర్ ఇమ్మిగ్రంట్ వర్కర్లు ,స్టా క్ యార్డ్ డిస్ట్రిక్ట్ లోని కార్మికులు బల పరచిన ఐరిష్ అమెరికన్ ''ఎడ్వార్డ్
అందరికి సమాన ఆవ కాశాలు అన్నది సిన్క్లైర్ నిరంతర నినాదం .''meat packing industry ''ని
ఆధునీకరించాలనే ఆయన పట్టు దల విజయం సాధించింది .జబ్బు చేసిన పశువులను వేరే ఉంచాలని,వధీం చే
ప్రదేశాలు వేరుగా ఉండాలని ఎలుకలను చంపటానికి విషాన్ని ప్రయోగిస్తు న్నప్పుడు ఆ ఎలుకలు మంచి మాంసం
మీద తిరిగితే ప్రమాదం అనే ఆన్నీ ఆయనే చెప్పాల్సి వచ్చింది .కో ఆపరేటివ్ కామన్ వెళ్త ను సెల్ఫ్ గవర్నింగ్
కమ్మ్యునిటి ల ద్వారా సాధించాలని కోరాడు .అమలు చేయ టానికి వీలున్న పద్ధ తులన్నీ నేర్పాడు. కొన్ని చోట్ల
గ్రీకుల ''ఆదర్శ వాదం ''కనీ పించ వచ్చు .''the soul of man under socialism ''గురించి చెప్పి, మనిషి తనకోసమే
కాక ఇతరుల కోసమూ జీవించటం నేర్చుకోవాలని హితవు చెప్పాడు .కార్మికుల క్షేమం కోసం వర్క్ ఇన్స్పెక్టర్లు ,వారి
చికాగో లోని meat cutters ,butchers అందరు ఆఫ్రో అమెరికన్లే ఉండే వారు .వారి పని సామర్ధ్యం
మెరుగ్గా లేదని భావించి రాశాడు .వాళ్ళు సమ్మె చేస్తే సమర్దించటానికి తట పటాయించాడు .వారికి ''మాబ్ ష్టిగ్మా''
ఉందన్నాడు .ఇది చివరికి జాతి సమస్య గా తయారయింది .తెల్ల వారు నల్ల వారిని దీపపు స్త ంభాలకు కట్టేసే వారు
.ఇవన్నీ గ్రహించి చివరికీ వారికి మద్ద తు నిచ్చాడు .నల్ల వారందరూ యూనియన్ల లో చేరి సంఘీభావంప్రకటించారు
.సమస్యల సాధనకు ఆది బాగా తోడ్పడింది .అనేక ఆందో ళనల ఫలితం గా1980 లో మాంసం కార్మికుల .వేతనం
ఇప్పటికీ ఇమ్మిగ్రంట్స్ కు రక్షణ కరువు గ ఉందని అనుకొంటారు .2006 లో న్యూయార్క్ గవర్నర్
మూడు బిల్లు ల పై సంతకాలు పెట్టా డు .వాటి వల్ల రిఫ్రిజి రేటర్లు ,పో లీసులు ,విష వాయువులున్నచోట పని చేసే
వారు'' గ్రౌ ండ్డ్ జీరో ''దగ్గ ర పని చేసే వారందరికి లాభాలు చేకూరాయి .అయినా జబ్బు తో ఉన్న ఇమ్మిగ్రెంట్స్
విషయం ఎవరికీ పట్ట లేదు .సిన్క్లైర్'' జంగిల్ నవల'' రాసి వందేల్లయిన తర్వాతా కూడా O.S.H.A..సంస్థ చీఫ్
మాట్లా డుతూ ''ఇంకా ఈ విషయం లో చేయాల్సింది ఎంతో మిగిలి పో యింది ''అని బాధ పడ్డా డు .''cantinental
harass ment'' విషయం లో ఆడ వాళ్ళు భయ పడటాన్నీ ఆయన చిత్రించాడు మగబాస్ ఆడ వారి పట్ల అసభ్య
ప్రవర్త న ను నిరశించాడు .దీనిపై రిపో ర్ట్ ఇవ్వ టానికి ఆడ వారు భయ పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు
.ఆయనద్రు స్ష్టి కి రాని సమస్య లేదు అంటే అతి శయోక్తి కాదు .బాల కార్మిక వ్యవస్థ పై రాశాడు .బనానా లలో del
monte ,chiquita ,dole రకాలు ప్రసిద్ధ మైనవి .ఇవి ఈక్వెడార్ నుండి అమెరక
ి ా కు వస్తా యి .వీటిపై స్టిక్కర్లు
అంటించే పనిని ఈక్వెడార్ లో బాల కార్మికులే చేస్తా రట .ఎని మిదేల్ల లోపు పిల్లలు పని చేస్తా రు వీరికి పన్నెండు
గంటల పనికి 4.72 డాలర్లు మాత్రమె ఇస్తా రట .బాలుర శక్తిని యెట్లా పిండి పారేస్తు న్నారో తెలిపే విషయం ఇది
.మామూలు వేతనం లో ఇది నలభై శాతం కంటే తక్కువత .మక్ డో నాల్డ్ తయారు చేసే ప్లా స్టిక్ ఆట వస్తు వులలు
పని లో బాల కార్మికులకు పద్నాలుగు గంటల పనికి గాను గంటకు ముప్ఫై సెంట్లు మాత్రమె ఇస్తా రట .ఇది ప్రపంచ
వ్యాప్త ం గా ఉన్న సమస్యే .దీనికి అంతు దరీ లేదు .ఇన్ని సమస్యలను తన నవలలో పాత్రల ద్వారా చెప్పాడు
.రూజ్ వెల్ట్ సిన్క్లైర్ ను కసురుకొన్నా ఈయన చెప్పినదానికి పరిష్కారం ఆలోచించాడు .ఆయన తర్వాతా వచ్చిన
ప్రెసిడెంట్లు సిన్క్లైర్ ను గొప్పగా అభి మానించి సమస్యలను తెలుసుకొని ఆయన మాటలకు అత్యంత విలువ
నిచ్చారు .ఈ విధం గా ప్రజా సమస్యలను ఫో కస్ చేసి పరిష్కార మార్గా ల కోసం ప్రయత్నించిన ప్రజా రచయిత అప్
దాదాపు వంద నవలలు రాసి ,సమకాలీన సమస్యలను చర్చించి ,కార్మికుల కష్ట సుఖాలను ప్రభుత్వం
దృష్టికి తెచ్చి ,ప్రజా రచయిత గా ,అధో జగత్ సహో దరులకు అండగా నిల బడి, కాలిఫో ర్నియా గవర్నర్ పదవికి
సిన్క్లైర్ అంటేనే వేతన జీవుల ఆశా జ్యోతి .ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ను తరచుగా కలిసి వారి సమస్యలను చర్చించి
పరిష్కారం కోసం ప్రయత్నించిన వాడు వర్కర్ల హృదయాలలో చిర స్తా నం పొ ందిన వాడు .''i aimed at the public
heart ,but by accident hit in the stomach ''అని గర్వం గా చెప్పుకొన్నాడు రచయిత అప్టా న్ సిన్క్లైర్ .ఎక్కువ పై
గంటలను తగ్గించటం లో ,జీతాలను పెంచటం లో పని చోట్ల ఆరోగ్య రక్షణ విషయం లో రచయిత చేసిన కృషి ప్రశంస
నీయం .మాంసం దుకాణాలలో పని చేసే వారి దుర్భర వేదనలను నివృత్తి చేయటానికి ,పారిశుద్ధ ్య పని వారల గతి
మార్చటానికి ఆయన ప్రయత్నించిన తీరు మరువ లెండి .ది జంగిల్ ''అనే నవలలో సమకాలీన జీవన చిత్రణ
చెశాదు .అన్నీ సాధించ లేక పో యినా ఆయన ఒక ఆదర్శ నీయడు గా ''ఐకాన్ ''గా ఉన్నాడు .
1878 లో సెప్టెంబర్ ఇరవై న మేరి లాండ్ లోని బాల్టిమోర్ లో అప్టా న్ బి ఆల్ సిన్క్లైర్ జన్మించాడు .పదేళ్ళ
వయసు లోనే కుటుంబం న్యు యార్క్ లో స్తిర పడింది అతని ద్రు ష్టి అంతా రాజకీయం ,ఆర్ధిక సామాజిక సమస్యల
పైనే ఉండేది .సామాజిక న్యాయం కోసం తపించే వాడు .అవినీతికి సింహ స్వప్నం .ఆది ఎక్కడున్నా వెతికి జనం
ముందుంచే బాధ్యత తీసుకొన్నాడు అలాంటి వారిని ''muckraker'' అంటారు .రూస్ వెల్ట్ అలానే సంబో ధించాడు
ఈయన్ని .అమెరికా లోని రాజ కీయ ,సాంస్కృతిక చరిత్ర లో సిన్క్లైర్ స్తా నం స్తిర మైనదే .ఆయన్ను పందో మిదో
శతాబ్ద పు ఆదర్శ వాది అయిన రచయిత అంటారు .యువకుడు గా ఉన్నప్పుడే వందలాది కధలు రాసి పారేశాడు
pulp రచయిత అని పించుకొన్నాడు .సంగీతం రాజకీయం ఆయన్ను బానే ఆకర్షించాయి .క్రమంగా సామాజిక భావ
వ్యాప్తి మీదకు దృష్టి మరలింది .
1900-04 కాలం లో నాలుగు నవలల ను విజ్రు మ్భించి రాశాడు .అందులో రొమాంటిక్ అయిడ లిజం
నింపాడు . క్రమం గా దృష్టి సో షలిజం వైపుకు మరలింది .1904 లో రాసిన ''manassas ''నవల లో అమెరక
ి న్ సివిల్
వార్ సమయం లో ప్లా ంటేషన్ యజమాని కొడుకు బానిస నిర్మూలన కోసం కృషి చేయటం వస్తు వు గా తీసుకొని
రాశాడు ఇక్కడితో అతని సో షలిస్ట్ భావాల ద్వారాలు తెరుచుకోన్నాయి .ఆ తర్వాత రాసిన'' lanny budd ''సిరీస్
అని పదకొండు పుస్త కాలు రాశాడు .వీటిలో ఆదర్శ వంత మైన సమాజంకోసం తపన ,సాంఘిక అన్యాయాలను
ఉపో ద్ఘా తం లాంటిది .ఉద్యోగస్తు లను ''వేతన బానిసలు ''(wage slaves )అని పిలుస్తా రు .చికాగో లోని పాకింగ్ ప్లా ంట్
కు వెళ్లి అక్కడి పరిస్తితులను రహస్యం గా ,బహిరంగం గ చూసి అర్ధం చేసుకొన్నాడు .అక్కడి దీన ,హీన స్తితులకు
చలించి పో యాడు .దీని నేపధ్యం గా'' ది జంగిల్ '' నవల రాశాడు .ఇందులో సృజన తో పాటు అవినీతి ని బహిర్గతం
చేసే విధానమూ ఉంది .ఆ ఉద్యోగుల లో ఒకడి జీవితాన్ని నవలగా రాశాడు .అందులో మొత్త ం సమాజం అంతా
ప్రతి ఫలించే టట్లు చేశాడు .అవి నీతి రాజకీయ నాయకులను ఎండ గట్టా డు .ఏది రాసినా సిన్క్లైర్ తన స్వంత కళ్ళ
తో చూసే రాస్తా డు అందుకే ఆయన రచనలకు అంతటి విలువ ఏర్పడుతుంది .ఈ నవల అందరి దృష్టిని ఆకర్షించింది
.దీని ఫలితం కూడా కనీ పించింది .అక్కడి పారిశుద్ధ ్యం పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొన్నది .మాంసం పాక్ చేసే విధానం
లో ఎన్నో జాగ్రత్తలు వహించేట్లు చేయ గలిగారు .నవల కు ఇంతటి కన్నా కావాల్సిన దేముంది ?
1906-14 కాలం లో సిన్క్లైర్ ఆయన ఉద్యోగ విషయాలలో మార్పులు వచ్చాయి .న్యు జెర్సి లోని
హేలికాన్ హాల్ లో అందరు కలిసి జీవించే విధానాన్ని ప్రయోగాత్మ కం గా అమలు చేశాడు.అయితే ఆ భవనాన్ని
ధ్వంసం చేశారు గిట్టని వాళ్ళు .ఆయన వివాహ జీవితం కూడా ఒడిదుడుకులకు లోనైంది .ఆరోగ్య రహస్యాల మీద
రచనలు చేశాడు .ఉపవాసం చాలా మేలు చేస్తు ందని చాలా జబ్బులను దూరం చేస్తు ందని తెలియ జేశాడు
.1908 లో ''the metro polis '',the money changers ''మంచి ద్రు ష్టి తో రాసినా గొప్పవిగా పేరు రాలేదు
.1910 లో రాసిన ''samuel the seeker ''నవల ఒక యువకుడు సో షలిజం ను స్వీకరించే ముందు అనేక మతాల
లో ఉండి ఏవీ నచ్చక పో వటాన్ని వివ రించాడు .చివరికి సో షలిజం అతన్నేమీ ఆకర్షించక రాజ కీయ బాధితుడవటం
చివరలో చూపిస్తా డు .ఇందులో సిన్క్లైర్ కూడా భౌతిక మానసిక సంచారం చేసిన తీరు కనిపిస్తు ంది .తర్వాత వచ్చిన
నవల ''love's pilgrimage ''లో తన మొదటి వివాహం దాని అనుభవాలు వివ రిస్తా డు .అందులో పెళ్లి అయిన
మహిళకోరుకొనే జీవితాన్ని గురించి చెప్పాడు దీనిలో ఆయన మహిళా పక్ష పాతి అని పిస్తా డు .1913 లో సుఖ
రెండో పెళ్లి ఆయనకు కొంత సుఖ శాంతులనిచ్చింది .సౌత్ కెరొలినా లో నివాసం ఉన్నాడు .బొ గ్గు గనుల
కార్మికుల సమ్మె తీవ్రం గా ఉంది. స్వయం గా వెళ్లి వాళ్ళ సమస్యలను పరిశీలించి తెలుసుకొన్నాడు .కొలరాడో దాకా
వెళ్లి గని యజ మానులతో సంప్రదించి పరిష్కార మార్గా నికి ప్రయత్నించాడు .ఈ అనుభవాలను ''king coal ''లో
వర్ణించాడు .తర్వాతా అమెరికా మొదటి ప్రపంచ యుద్ధ ం లో పాల్గొ న టాన్ని వ్యతి రేకించాడు .ఆయన లో స్తిరమైన
అభిప్రా యాలు లేవని కొన్ని సందర్భాలలో తెలుస్తు ంది .1918 లో బో ల్షె విక్ రివల్యూషన్ ను అమెరికా సైన్యం అణచి
వేయటానికి చేసే ప్రయత్నాన్ని నిరశించాడు .దీన్ని అంతటిని ''jimmie higgins '' లో నవలాత్మకం గా చిర్తించాడు
.ఇప్పటి నుంచి ఇరవై మూడేళ్ళు అనేక పుస్త కాలను ఫామ్ఫ్లేట్ల ను రాసి ప్రచురించాడు .వీటిలో విద్య గురించి
,తప్పుడు దేశ భక్తీ గురించి ,అమెరికా లోని కాపిటలిజం గురించి ,జర్నలిజం గురించి ,మంచి ఆర్ధిక స్తితి గతుల
గురించి ,కళా సాహిత్యాల గురించి అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తు న్న అనేకానేక అంశాల గురించి
సిన్క్లైర్ రాసిన ''oil '',''bostan ''నవలల తర్వాతాదాదాపు ఇరవై ఏళ్ళు ప్రభావం చూప గల
రచనలేమీ చేయ లేక పో యాడు .మెంటల్ టేలి పతి విషయం పై ''mental radio ''రాశాడు ప్రొ హిబిషన్ ను
తేవాలని కోరాడు .1934 లో '' గవర్నర్ అఫ్ కాలిఫో ర్నియా '',''హౌ ఐ ఎండెడ్ పావర్టి '' నవలల తర్వాత రాజ
ప్రచారం ఏమిటో తెలుసా'' E.P.I.C.''అంటే''end poverty in california '' అని .పాపం ఓడి పో యాడు .కాని దీని
ఫలితం మాత్రం కనీ పించింది .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ కార్మికుల అంటే లెఫ్ట్ వింగ్ వారి డిమాండ్ల ను తీర్చటానికి
ముందుకు వచ్చి ఆసరా గా నిల బడ్డా డు .కాలిఫో ర్నియా రాజ కీయాలను చర్చిస్తూ ''co-op ''అనే నవల 1936 లో
రాశాడు .తర్వాతి ఏడాది లో ''the flivver king ''అని హెన్రీ ఫో ర్డ్ ఆయన కార్మిక వ్యతి రేకత పై నవల రాస్తూ
అందులో కార్మిక సమస్యలను చర్చించాడు .''లిటిల్ స్టీల్ ''అనే నవల లో స్పానిష్ సివిల్ వార్ పై రాశాడు .1938 లో
''the steel ''నవల లో ఇనుము ,స్టీల్ కంపెనీ లలో కార్మిక యూనియన్ల నిషేధాన్ని గురించి రాశాడు .ఆ తర్వాతా
పద కొండు చారిత్రా త్మక నవలలు రాశాడు .అందులో 1913 -50 కాలం లో పశ్చిమ దేశాల చరిత్ర ను గురించి
రాశాడు .అందులో పాత్ర పేరు ''లాన్నీ బడ్డీ ''.అందుకని వీటిని ''లానీ బడ్ సిరీస్ ''అంటారు .
1950 లో సిన్క్లైర్ ఎనభై వ పడి లో పడ్డా డు .ఇక రచనకు స్వస్తి చెప్పే ఆలోచన కు వచ్చాడు .
ను 1740-42 కాలం లో samuel richardson ''రాసిన ''పమేలా ''కు ఆధునిక విధానం లో రాసి ప్రా ముఖ్యత
చేకూర్చాడు .1954 లో ''what didimus did ?''నవల లో కాలిఫో ర్నియా లో జరిగిన అసంపూర్ణ సాంఘిక
సంస్కరణలను చర్చించాడు .1964 వచ్చిన ''the auto biographyof upton Sin clair ''అనేది ఆయన ''అమెరికా
పో స్ట్ ''లో ఇది వరకు రాసిన దానికి పూరణే.ఇందులో అభ్యుదయ భావ రచయిత గా ఆయన దర్శనమిస్తా డు
.ఆయన తల్లి కి నిశ్శబ్ద ం అంటేఇష్ట ం .తాగుడుకు ఆమె వ్యతి రికి గొప్ప డిసిప్లినీర్ .ఇవేవి నచ్చక సిన్క్లైర్ తల్లికి
దూరం గా 35 ఏళ్ళు గడిపాడు .''time ''మేగ జైన్ సిన్క్లైర్ గురించి ''a man with every gift except humor
''అని రాసింది .ఆయన 25-11-1968 న 90 ఏళ్ళు నిండు జీవితాన్ని అనుభవించి ప్రజా రచయిత గా అందరి
ప్రశంశలను పొ ంది మరణించాడు .ఒక ఉన్నత భావాల వ్యక్తిగా, మంచి వాడుగా ,పెద్ద మనిషి గా, ఆధ్యాత్మికతను
,రాజకీయాన్ని, సాంఘిక విషయాలను, శాకా హార అవసరాన్నితెలియ జెప్పిన వాడిగా సామాజిక సమస్యల పై
పో రా ట దృక్పధాన్ని కనపరచిన రచయిత గా సిన్క్లైర్ చిర స్మర ణీయుడు .ప్రజా హృదయ పీఠం పై మకుటం లేని
అంతా స్వంత విమానం లో చుట్టి వచ్చిన మొదటి మహిళా పైలట్ ,ఆకాశం లో అధిక ఎత్తు లో రికార్డు స్తా యి లో
విమానాన్ని నడిపిన మొదటి మహిళ ,ఇన్ని రికార్డు లను నెలకొల్పి ,ప్రపంచం అంతా చుట్టి వచ్చిన మొదటి
మహిళా కావాలనే ధ్యేయం తో బయల్దే రి గమ్యానికి కేవలం వంద మైళ్ళ దూరం లో ఉండగా .ఆమె విమానం
కనిపించకుండా పో యి మిస్ట రీ గా మారి,అమెరికా వాయు రాణి అని పించుకొన్నమహిళా పైలట్ అమీలియా ఎర్హా ర్ట్
హిస్టరీ ఇది .
నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వెలిసింది .తల్లి అమీ ఓటిస్14,110 అడుగుల ఎత్తు న్నరాకీ పర్వతాలలోని పైకేస్ పీక్
ను అధిరోహించి రికార్డు నేల కొల్పిన మొద టి మహిళ .తండ్రి ఎడ్విన్ స్టా న్తా న్.చిన్నప్పుడే తాత అమ్మమ్మల
ఇంటికి వెళ్లి అక్కడి గుర్రా లను ఎక్కి స్వారీ చేయటం ,కొండ గుహల్లో తిరగటం అలవాటు చేసుకోండి .అయితే
ఆమెను రూల్లెర్ కాస్ట ర్ ఎక్కి తిరగటాన్ని ఒప్పుకోలేదు .బాస్కెట్ బాల్ ఆడేది .స్లెడ్జి ల పై చక్కగా నడిచద
ే ి గుర్రపు
తండ్రి రైల్ కంపెని లో ఉద్యోగి .అందుకని ఫ్రీ గా వీలైన ప్పుడ ల్లా కుటుంబం తో ప్రదేశాలు తిరిగి చూసే
అవకాశం వచ్చింది .ఆయనకు ఉన్న కార్ లో కిచెన్ ,భోజనాల గది ,వంట వాడు ఉండే వారు .తండ్రి బాగా తాగుబో
తు .అందువల్ల ఉద్యోగ భద్రత ఉండేది కాదు .ఈమె అమ్మమ్మ తాత చని పో వటం తో తల్లికి ఆస్తి బానే
సంక్రమించింది .తండ్రి మిన్న సో ట లో రైల్ క్లెర్క్ గా పని చేయాల్సి వచ్చింది .కుటుంబం మిస్సోరి లోని మిన్నే
సో టా కు మార్చాడు .అక్కడి నుంచి చికాగో వెళ్లి ఉన్నాడు .అక్కడ ఎమీలియా బేస్ బాల్ టీం లో చేరి ఆడింది
.కుటుంబం పెనిసిల్వేనియా కు చేరింది .అక్కడ రైడాల్ లోని ogantz school లో చేరి చదివింది .ఇట్లా ఊళ్లు
తిరగటమే సరి పో యింది చిన్న తనం అంతా .అక్కడ హాకీ నేర్చింది అక్కడి alpha phi టీం ఈమెను తమ టీం లోకి
ఆహ్వానించి ఆడమన్నారు .ఈమెకు మొదటి నుంచి సంప్రదాయ విధానాలు నచ్చేవి కావు .స్థా నిక రెడ్ క్రా స్ కు
1917 లో టోరంటో లోని సో దరి దగ్గ రకు వెళ్ళింది అప్పుడే యుద్ధ భీభత్సాన్ని కళ్ళారా చూసింది .రెడ్
క్రా స్ లో ఉన్న ఎమీలియా సైనికుల కోసం స్వెట్ట ర్లు అల్లి అంద జేసింది గాయ పడిన సైకులకు సాయం చేసింది
.ఇదంతా మనసును కలచి వేసింది .అందుకని మళ్ళీ స్కూల్ లో చేరి చదవటానికి మనసు అంగీకా రించ లేదు
.ఒక నర్సు దగ్గ ర సహాయకురాలిగా పని చేసింది .ఆమ్బులన్స్ బ్రిగేడియర్ లో వాలంటరీ చేసింది .తర్వాతా స్పాడినా
మిలిటరి హాస్పిటల్ కు వచ్చి యుద్ధ ం లో అసహాయు లైన వారికి సేవ లందించింది .అందులో ''షెల్ షాక్ ''తో బాధ
పడ్డ వాళ్ళు ,ఉండే వారు .వారి మానసిక పరిస్తితి వింత గా ఉండేది. రోజుకు పన్నెండు గంటలు పని చేసేది
.ఉదయం యేడు నుండి రాత్రి యేడు వరకు ఆమె డ్యూటి .సో దరి తో ఖాళీ సమయాన్ని గడిపేది .అక్కడ గుర్రపు
సవారీని ఇద్ద రు బాగా చేసి ఆనందాన్ని పొ ందే వారు .అమీలియా గుర్రం పేరు ''డైన మైట్''.వీరున్న చోటికి దగ్గ రే
విమానాలు నడిపే ట్రైనింగ్ సెంటర్ ఉంది .అక్కడి ఆఫీసర్ ఈమె ఉత్సాహాన్ని చూసి విమానాలు ఎగరటం వచ్చి
చూడమన్నాడు .అలా చూస్తూ విమాన యానం పై అభిమానం బాగా పెంచుకోంది .ఈమెకు సైన స్ బాధ ఉండేది
టోరంటో వదిలి మాసా చూసేట్స్ లోని నార్త్ ఆంప్ టన్ కు చేరింది .అక్కడ తల్లి సో దరి ఉన్నారు . ఆటో
మోటివ్ మేషిన్ ట్రైనింగ్ పొ ందింది .డాక్టర్ కావాలన్న ఆలోచన కలిగింది .న్యూయార్క్ వెళ్లి కోంబియా వర్సిటి లో
అందర్ని ఆశ్చర్య పరిచింది .అకస్మాత్తు గా వర్సిటి చదువు మానేసి కాలి ఫో ర్నియా లోని తలి దండ్రు ల దగ్గ రకు
చేరింది .
daughert field లోని ఎయిర్ మీట్ కు హాజరైంది .అప్పుడే పైలట్ కావాలి అన్న ఆశయం మనసు లో మెదలి
ి ంది
.అక్కడి అది కారులతో మాట్లా డి ఆమె తండ్రి ఈమెను విమానం ఎక్కించి చక్కర్లు కొట్టించే ఏర్పాటు చేశాడు .ఆది
అద్భుతం అని పించిన్దా మెకు .పైలట్ శిక్షణ తీసుకోవాలను కొంది .చాలా ఖర్చు తో కూడిన పని ఆది .ఒక చిన్న
ఉద్యోగం చేస్తూ నేర్చుకోవాలను కొంది .మహిళా పైలట్ అయితే బాగా నేర్పు తుందని భావించింది .అక్కడ ఇరవై
నాలుగేళ్ల ''నేతా స్నూక్'' అనే ఆమె నేర్పటానికి అంగీకరించింది .1920 decembar లో గ్లేన్దేల్ లోని కిన్నెర్ ఎయిర్
పో ర్ట్ కు చేరుకొంది .స్నూక్ దగ్గ రుండి నేర్పాలి గాలిలో ఉన్న ప్రతి నిమిషానికి ఒక డాలరు ఆమె కు ఇవ్వాలి
.అప్పటికే యుద్ధ ం లో దాచుకొన్న liberty బాండ్ల ను ఉపయోగించి ఆమె బిల్లు చెల్లి ంచింది 1921 january 3 న
మొదటి లెసన్ ..ఐరో డైనమిక్స్ మీద పుస్త కాన్ని తన దగ్గ ర ఉంచు కొంది .ముందు భూమి మీడదే విషయాలన్నీ
నేర్పింది .ఆరు నెలల శిక్షణ తర్వాతా స్వంత విమానాన్ని రెండు వేల డాలర్లు పెట్టి కొనుక్కోన్నది .అదే ఎల్లో కిన్నెర్
ఐర్స్తేర్ .దాన్ని ఆమె'' ది కానేరి ''అని ముద్దు గా పిల్చుకోన్నది .ఒక టేలి ఫో న్ కంపెని లో కూడా పని చేసింది .లక్ష్య
సాధనానికి ఎన్ని తంటాలు పడాలో అన్నీ పడింది .ఇంకా ఒంటరిగా విమానం నడపటం సాధ్యం కాలేదు .స్ట ంట్
ఫ్లైయింగ్ ,బ్యాంక్స్ ,బారెల్ రోల్ల్స్ ,లూపస్ లలో ప్రా ధమిక విషయా లన్నీ నేర్చింది .అన్నీ నేర్చిన తర్వాతామొదటి
మీదే పడింది .ఆమెను గురించి స్తా నిక పత్రికలన్నీ పెద్ద పెద్ద ఫో టో లతో గొప్ప గా రాశాయి .1922 october 22 న
తన ఐర్స్తేర్ విమానం ఎక్కి ఒంటరిగా ఆకాశం లో విహరించి వీలైనంత ఎత్తు కు ఎగిరింది .బారో గ్రా ఫ్ ను సీల్
చేయించింది .చివరికి చూస్తె తాను 14000 అడుగుల ఎత్తు న ఉన్నట్లు గమనించింది ఇది అంతవరకు యే మహిళా
పైలట్ కూడా చేరని ఎత్తు .అంటే అమీలియా రికార్డు స్తా పించిందన్న మాట .వీరి కుటుంబం నవేడా లోని జిప్సం
మైనింగ్లో పెట్టు బడి పెట్టిన డబ్బు కు ప్రతి ఫలం లభించలేదు .ఇదో నిరాశ .
సో షలిస్టు భావాలున్న industrial workers of the world కు మిత్రు లతో హాజ రింది .అక్కడ అరవై
ఏళ్ళు దాటినా వారందరికి పెన్ష న్ ను ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేశారు .1923 may 16 న ఎమీలియ కు
స్టూ డియో లో ఉద్యోగం లో చేరింది .తర్వాతా తానే స్వంతం గా ఫో టోలు తీయటం అమ్మటం నేర్చింది .మళ్ళీ కొత్త
విమానాని కొనుక్కోంది .మళ్ళీ సైన్స్ ఆపెరేషన్ చేయించు కోవాల్సి వచ్చింది పాపం .విమానాన్ని అమ్మేసి ఇంకోటి
కొంది దీనికి కిజేల్ (ఎల్లో పెరిల్ )అని పేరు పెట్టింది .తల్లి తో 7000 మైళ్ళు విమానం లో ప్రయాణం చేసి బో స్ట న్
చేరింది .మళ్ళీ సర్జరీ అవసరమై చేయించింది .తర్వాత న్యూయార్క్ వగైరాలు తిరగటం తో చేతిలో డబ్బు ఖాళీ
.బో స్ట న్ చేరి హార్వర్డ్ సమ్మర్ స్కూల్ లో లెక్కల కోర్సు లో చేరింది . సాంఘిక సేవా
కార్య క్రమాలు
విమానం నడిపే దానిలో ఎక్కడా ఉద్యోగాలు రాలేదు .పొ ట్ట గడవాలి .డేనిసాన్ హౌస్ లో సో షల్ వర్కర్
గా పని చేసింది .అక్కడే syrian mother's club స్తా పించి ,సిరియా నుంచి వచ్చిన వలస దారుల పిల్లలకు చదువు
కొనే వీలు కల్పించింది .చైనీస్ ఆడ పిల్లల తో బాస్కెట్ బాల్ ఆడించింది .ఆ హౌస్ కు డైరక
ె ్టర్ అయింది .బో స్ట న్ లో
జరిగే జాతీయ బో స్ట న్ సెటిల్ మెంట్స్ సమావేశానికి ఎమీలియా ప్రతినిధి గా ఆహ్వానాన్ని పొ ందింది .1927 లో
.అమీలియా ను సంప్రదించాడు .ఈమె బో స్తా నియాన్ పత్రిక లో మహిళా పైలట్ల గురించి మంచి వ్యాసం రాసింది
ఇంకా ఎక్కువ మంది విమానాలు నడపటానికి ముందుకు రావాలని కోరింది .చార్లెస్ లిన్డెర్ బెర్ఘ్ మొదటి సారి
అట్లా ంటిక్ ను దాటినప్పటి నుండి అమీలియా కు తానూ దాన్ని సాధించాలన్న కోరిక పెరగ
ి ింది .1928 april 7 న
ఆమెకో ఫో న్ వచ్చింది .అందులో ఆమె అట్లా ంటిక్ సముద్రా న్ని దాటే విమానం నడ ప టానికి ఆహ్వానం వచ్చింది
.వెంటనే న్యు యార్క్ వెళ్లి జార్జి పుత్నాం ,డేవిడ్ లెమన్ లను కలిసింది ఆ ప్రయాణానికి స్పాన్సర్ అయిన amy
phipps guest కు బదులు ఈమె ప్రయాణం చేయాలి పుస్త క రూపం లో లెక్చర్ల రూపం లో వచ్చిన ధనాన్ని గెస్ట్ కు
ఇచ్చేయాలి .అదీ ఒప్పందం .సరే నంది అమీలియా .ఫ్రెండ్ షిప్ అనే విమానాన్ని నడపాలి .జూన్ మూడు న బో స్ట న్
నుంచి న్యు ఫౌంద్ లాండ్ ,కెనడా మీదుగా నోవా స్కాతియా లోని హాలిఫాక్స్ విమానాశ్రయం చేరింది .అక్కడి నుంచి
వేల్స్ లోని బారీ పాయింట్ చేరి ప్రయాణాన్ని విజయ వంతం గా ముగించింది . పేపర్ల న్నీ విజయ గీతికలు పాడాయి
ఆమెను ''లేడీ లిన్దెర్ బెర్గ్ ''అని పొ గిడారు .అట్లా ంటిక్ ను దాటిన మొదటి మహిళా గా రికార్డు సాధించింది .వేల్స్
లో చాలా కాలం ఉన్న తర్వాతా ఇంగ్లా ండ్ కు వెళ్ళింది .అందరు తనను పొ గుడుతుంటే ''నేను ఒక ప్రయాణీకు
రాలను మాత్రమె ''అని చెప్పింది .అమెరికా కు తిరిగి వచ్చి ఎంతో అభిమానాన్ని సంపాదించింది .ఆమె ను lady
Lindy '' ''the queen of the air ''అని గౌరవం గా పిలిచారు .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ఆమె కు వీరోచిత స్వాగతం
పలికాడు .న్యు యార్క్ సిటి తాళం చెవిని ఇచ్చి గౌరవించారు .ఆమె అమెరికన్ హీరోయిన్ అయి పో యింది .ఇది
చారిత్రా త్మక సత్యం .అనేక సభలు సమావేశాలలో మాట్లా డి ఎందరికో స్పూర్తి కలిగించింది ..ఎంతో డబ్బు చేతికి
అతని తో తో బయల్దే రింది .కాని పిట్స్ బర్గ్ లో ఆది దొ ర్లి పో యింది .ఇంగ్లా ండ్ నుంచి తగిన పరికరాలు తెప్పించి
బాగు చేయించాడు పుత్నాం .1931 లో పుత్నాం ను పెళ్లి చేసుకోంది .ఆ తర్వాతా 19000 అడుగుల ఎత్తు కు
విమానాన్ని నడిపి రికార్డు నేల కోల్పింది .తాను మొదటి సారి అట్లా ంటిక్ ను దాటినా స్వంతం గా స్వంత విమానం
లో దాట లేదనే బాధ ఆమెలో ఉంది .ఆ కోరిక 1932 లో తీరింది .ఒంటరిగా అట్లా ంటిక్ ను నాన్ స్టా ప్ గా దాటి రికార్డు
సాధించింది అమెరక
ి ా కాంగ్రెస్ ఆమెకు అత్యంత విలువైన ''the distinguished flying cross ''ను ప్రదానం చేసి
గౌరవించింది .1932 లో ఫసిఫిక్ మహా సముద్రా న్ని ఒంటరిగా దాటి రికార్డు నేల కోల్పింది .ఈ రెండు సముద్రా లను
దాటిన వారిలో మొదటి స్థా నం ఆమెదే .హనో లూలు నుండి కాలిఫో ర్నియా లోని ఓకే లాండ్ కు చేరింది ఫసిఫిక్
స్పీడ్ రికార్డు 2100 మెయిల్ల ను సాధించింది .మెక్సికో నుండి వాషింగ్ టన్ కు 14 గంటల్లో చేరి లిండ్ బెర్గ్ రికార్డు ను
మీద సుమారు లక్ష మందిని ఆనందింప జేసింది .ఒక్కో సమావేశానికి మూడు వందల డాలర్లు వసూలు చేసింది .
పొ ందింది .సాలుకు రెండు వేల డాలర్లు . ఆమె కు ఎయిరో నాటిక్స్ లో రిసెర్చ్ చెయ్యాలనే సంకల్పం కలిగింది
.దానికి విరాళాలు కావాలి. జనానికి తెలియ జేశింది .విరాల వెల్లు వె వచ్చింది దానితో ఒక విమానాన్ని కొని ''flying
laboratory '' గా మార్చాలనుకోంది .ఆమె''ameelia earhaart fund for aeronautical reserch '' అనే సంస్థ ను
నేల కోల్పింది .'' ఎలెక్ట్రా ''అనే రెండు ఇంజన్ల విమానాన్ని కొన్నది .దాని వేగం గంటకు 210 మైళ్ళ అత్యంత వేగం
.దాదాపు 27000 అడుగుల ఎత్తు కు ఎగిరే సామర్ధ్యం దానిది .అప్పటికి అలాంటి విమానాలు ప్రపంచం లో ఇద్ద రి
వద్ద నే ఉన్నాయి .ఒకటి అమీలియా దగ్గ ర రెండో ది ఏవియేషన్ గురు అని పిలువా బడేhoward hughes దగ్గ రా
మాత్రమె ఉన్నాయి .ఈ విమానం తో ప్రపంచ యాత్ర చేస్తూ విమానం లోని విషయాలను తెలుసుకొంటూ ,దేశకాల
పరిస్తితులకు ఆది ఎలా నిలబడుతుందో గ్రహిస్తూ పర్యటన చేయాలని ఆమె ఆశ .కాలి ఫో ర్నియా లోని ఓక్లా ండ్
లో1937 february 12 ప్రపంచ యాత్రకు శ్రీ కారం చుట్టింది .తూర్పు పడమర లను కాలి ఫో ర్నియా నుండి
హవాయి కి ప్రయాణించి రికార్డు నేల కోల్పింది .మియామి నుండి రెండో దశ ప్రా రంభించింది .ఇండియా పాకిస్తా న్
ఐరోపా దేశాల్ని చుట్టింది .పసిఫిక్ సముద్రం లోని ''హౌలాండ్ ఐలాండ్ ''కు చేరితే ప్రపంచ యాత్ర సంపూర్ణం .అశేష
జనం ఆమె కు స్వాగతం పలకటానికి ఆ ద్వీపం చేరారు .ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేసింది .కాని దురదృష్ట
వశాత్తు ఇంకా వంద మైళ్ళు గమ్య స్త్నానికి దూరం గా ఉన్న సమయం లో అప్పటి దాకా వచ్చిన రేడియో
సంకేతాలు ఆగి పో యాయి .ఆమె విమానం ఎక్కడ ఉందొ తెలీ లేదు .అందరు కంగారు పడ్డా రు .
ఎంత ప్రయత్నించినా విమానం జాడ లభించ లేదు .అమెరికా ప్రభుత్వం2,50 000 చదరపు మైళ్ళ
విస్తీర్ణం అంతా వేదికించింది .65 విమానాలు పర్య వేక్షణ జరిపి వెతికాయి .10 నౌకలు 4000 మంది జనం
అడుగడుగు గాలించి జల్లెడ పట్టినా విమానం మిస్ట రీ గా అదృశ్య మైంది .బ్రిటన్, జపాన్ దేశాలు కూడా సహక
రించాయి . 1937 july 18 న అన్వేషణ ను నిలిపి వేశారు .ఆమెను రష్యా వాళ్ళు హైజాక్ చేసి తీసుకొని వెళ్లా రనే
ఊహాగానాలున్నాయి .కాని ఏదీ నిర్ధా రణ కాలేదు .ప్రపంచ యాత్ర చేయాలన్న అమీలియా ఎర్హా ర్ట్ సంకల్పం చివరి
క్షణాల్లో విఫల మైనా ఆమె చరిత ్ర సంకల్పానికి, ధైర్య సాహసాలకు పట్టు దలకు, సేవా నిరతికి ఆదర్శం గా నిలిచి
పో యింది సమాజం లోని మౌధ్యాలను తిరస్కరించిన మహిళ ఆమె .''వాయు రాణి ''అని అందరి చేతా ఆప్యాయం
గా పిలిపించుకొన్న గగన విహారిణి ప్రా ణ వాయువు అనంత గగనం లో కలిసి పో వటం బాధా కరం.
''.though she may gone from this world ,the spirit of Amelia Earhart lives on in any a person
who looks out to the horizon and dreams that ,despite their circumstances ,they can fly higher ''.
నాలుగు అద్భుత మైన నవలల తో ప్రసిద్ధి చెంది ,జీవితం లో తాను అనుభవించిన వేదనలు అవహేళనలు
మొదలైన వాటి నన్నిటికి నవలా ప్రక్రియ లో అపూర్వ సృష్టి చేసి మిలిటరి పదవిలో ఉండి అదే వారసత్వం గా పొ ంది
,ఆ క్రమ శిక్షణ పైనా విరుచుకు పడ్డ నవలా రచయిత పాట్ కాన్ రాయ్ .పూర్తీ పేరు డో నాల్డ్ పాట్రిక్ కాన్ రాయ్
జననం 1945..తండ్రి మిలిటరి ఉద్యోగస్తు డు .ఎప్పుడూ స్త లం మార్పులే .తలి దండ్రు ల మధ్య లోపించిన అవగాహన
,అతి సంతానం ,తన దేహ వైక్లా బ్యం అన్నీ కాన్రా య్ ని మిగిలిన వారితో కలవ కుండా చేశాయి .ఇంట్లో ఎప్పుడూ
ఏదో ఒక టెన్ష న్ .
ఆయన తల్లి తండ్రిని వదిలి ముప్ఫై ఏళ్ళు పైగా విడిగా ఉండి ఒంటరి తనం తో వేదన చెందాడు
. .తండ్రి క్రూ రత్వాన్ని తల్లి భరించ లేక పో యేది .ఈ సంఘర్షణ ఆయన పై పెద్ద ప్రభావాన్నే కల్గించింది .పన్నెండేల్లలో
పద కొండు స్కూళ్ళలో లో చదవాల్సిన పరిస్తితి .ఎప్పుడే క్కడ ఉంటాడో ఎవరితో స్నేహం చేయాలో తెలీని వింత
పరిస్తితి .ఎప్పుడూ కొత్త వారితో ఉండాల్సిన రావటం అతను జీర్ణించుకో లేక పో యాడు .ఆ కుటుంబం లో హీరోఇజం
ఒక సమస్య .తండ్రి గొప్ప మిలిటరి ఉద్యోగి. కొడుక్కు కూడా ఆ హో దా రావాలని తండ్రికోరిక .ఇతని భావాలేమితో
ఆయనకు అక్కర్లేదు తన భావాలు ,అభి రుచులు కొడుకు పై రుద్దు తున్నాడని ఈతనికి లోపల అసహ్యం .కాని
ఎదురు చెప్పలేని తనం .గుండె గొంతుకలో కొట్లా డటమే .అమెరికా సైన్యం లో చేరి రెండు సార్లు వియత్నాం యుద్ధ ం
లో పాల్గొ న్నాడు .దీన్ని తన నవల'' the great satini ''లో చిత్రించాడు .అందులో ప్రేమ అసహ్యం లను నింపాడు
.రాయ్ చాలా మొండి గా ఉండే వాడు .బిరుసు స్వభావం .తన మనసు లోనిది ఎప్పుడూ బయటకు చెప్పేసే వాడు
.తల్లి బయటి ప్రవృత్తి కి అంతర ప్రవృత్తి కి భేదం ఉందని ముప్ఫై ఎల్ల తరువాత గ్రహించ గలిగానని ఒప్పుకొన్నాడు
.తండ్రి కోప్పడినా తిట్టినా ఆమె ఎంతో సహనం చూపెది .ఒక సారి తండ్రి రాయ్ ని బాగా కొట్టి గాయ పరిస్తే తల్లే
ఆస్పత్రికి తీసుకొని వెళ్లి డాక్టర్ తో కింద పడితే దెబ్బ తగి లిందని చెప్పమని అతనితో చెప్పిందట .ఆమె సౌత్
కెరొలినా నుంచి వచ్చిన మహిళా .ఆమె పేరు పెగ్ కాన్ రాయ్. తండ్రి పేరు ఫ్రా న్సిస్ కాన్ రాయ్ .
1963 లో దక్షిణ కెరొలినా సిటడేల్ మిలిటరి కాలేజి లో చేరాడు .అక్కడ చాలా వికృత చేష్టలకు గురైనాడు
.తండ్రి చదువు మానేసి రమ్మంటే వచ్చాడు ,మళ్ళీ వెళ్లి కోర్సు పూర్తీ చేశాడు .మిలిటరి కెరర్
ీ ఇష్ట ం లేక పో యినా
తప్పలేదు .అతనికి మియోపియా కలర్ బ్లి ండ్ నేస కూడా ఉండేవి .అందుకని పైలట్ కాలేక పో యాడు .నల్ల వారిని
''నిగ్గ ర్లు ''అని మొదట ఈస డిం చిన తర్వాత వారితో మంచి స్నేహమే చేశాడు అతనికి టీచింగ్ అంటే మహా ఇష్ట ం
.1970 లో మొదటి పుస్త కం ''the boo ''నవల రాసి ప్రచురించాడు .ఇది ఒకరకం గా ఆతని జీవితమే .అతనిలోని
అమాయకత్వం హాస్యం ను బాగా పండించాడు .తర్వాతా''the water is wide '' నవల పబ్లి ష్ చేశాడు .స్వంత ఖర్చు
తోనే ప్రచురించాడు రెండు నవలలను .1976 లో ''the great santini ''నవల రాసి విడుదల చేశాడు .ఇదీ ఆత్మా
కధే .తన కుటుంబం వారి నరాల బలహీనతను బయట పెట్టు కొన్నాడు ఈ నవల లో .దీన్ని అందరు గొప్ప నవల
గా భావించారు .పెళ్లి అవటం విడాకులు ఇవ్వటం జరిగింది దీన్ని అట్లా ంటా మేగజైన్ లో తెలిపాడు .తండ్రి ఒక సారి
మూడు రోజులు కనిపించక పో తే ఆత్మా హత్య చేసుకోన్నాడేమో నని భయ పడ్డా డు శాటిని నవల అతని భావ
''the lords of discipline ''నవల బాగా డబ్బు ను చేకూర్చింది .పెరూ బానే వచ్చింది .సినిమా గా
కూడా వచ్చింది .తర్వాతా రాసిన ''the prince of the tides ''విమర్శకులు మెచ్చిన నవల .బెస్ట్ సెల్లర్ అయింది
.గొప్ప సినిమా గా తీశారు .ఈ నవల తో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కాన్ రాయ్ కి .దక్షిణ రాష్ట ్ర భావాలు
చిత్రేకరణ తో మంచి ఊపు నిచ్చింది .దీన్ని పాఠ్య పుస్త కం గా కూడా చేశారు .భాష విషయం లో కొంత ఇబ్బంది
ఉందని పించినా విషయ ప్రా ధాన్యత కలది రచనా విధానం మీద రాయాలని ఆలోచించాడు .అన్నీ వున్నా అతని
విధానం బాధ కలిగించేది .1990 లో వచ్చిన ''బీచ్ మ్యూజిక్ ''నవల కొంత ఆలస్యం అయినా మంచి గుర్తింపు
పొ ందింది .1993 లో వెన్నెముక కు ఆపరేషన్ జరిగింది .ఆబాధ తట్టు కోవటానికి తాగుడు బాగా అలవాటయింది
.ఆత్మా హత్యా ప్రయత్నమూ చేశాడు .అయితే సరైన సమయం లో మంచి కొంసేలింగ్ లభించటం వల్లా అన్నిటికి
దూరమై రచన కోన సాగించాడు దీనికి కారణ మైన ''డాక్టర్ మారియాన్ నీల్ ''అభి నంద నీయుడు .సో దరుడు
మానసిక వ్యాధికి గురై ఆత్మా హత్యా ప్రయత్నం చేసు కొన్నాడు .తల్ల డిల్లి పో యాడు రాయ్ .బీచ్ మ్యూజిక్ లో
దీన్ని వర్ణించాడు ,.ఈ నవల విజయ వంతం అవటం తో పబ్లి సిటి కోసం 34 సిటీలు పర్యటించి పుస్త కాలపై
సంతకాలు చేసే కార్య క్రమం ఛే బట్టా డు .సినిమా గా తీసే ప్రయత్నం లో సహక రించాడు .తాను రాసే అన్ని
పుస్త కాలకు ప్రేరణ ''thomas wolfe ''అనే ప్రఖ్యాత నవలా రచయిత రాసిన'' home land angel ''నవల అని
చెప్పాడు రాయ్ .సాన్ ఫ్రా న్సిస్కో లో ఫ్రిప్ప్ ఐలాండ్ లో హాయిగా కాలక్షేపం చేస్తు న్నాడు .
కాన్ రాయ్ నవలలు వ్యంగ్యాత్మక రచనలు అని అంటారు లార్డ్స్ ఆఫ్ డిసిప్లిన్ నవల లో కెరొలినా
మిలిటరి కాలేజి గురించి వివరించాడు .అతని రచన లలో దక్షిణ రాష్ట్రా ల కుటుంబ జీవనం సాహిత్య దృక్పధం
ఉంటాయి .తన అంగ వికారత్వాన్ని అధీ గా మించి ,తండ్రి చంద్ర శాసనత్వాన్ని సహించి కాలేజిలో మిత్రు ల
అవహేలనాను భరించి పెళ్ళిళ్ళు పేటాకులు అయినా తల్లిని ఆలస్యం గా అర్ధం చేసుకొన్నా ,తన కుటుంబ గాధలను
,స్వీయ చరిత్ర గా జీవిత చరిత్ర గా నవలలను రాసి హిట్లను సాధించాడు పాట్ కాన్ రాయ్ .
అమెరికా కాలనీ వాసుల కాలం లో జరిగిన అనేక సంఘటన ల పై స్పందించి ,ఆ చరితన
్ర ు నేపధ్యం గా
తీసుకొని గొప్ప నవలలు రాసిన రచయిత్రి ఈస్త ర్ ఫో ర్బ్స్ .ఆ నవలల్లో గొప్ప ఖ్యాతి పొ ందిన నవల ''జాని ట్రేమేన్
''.ఆమె మాసా చూసేట్స్ రాష్ట ం్ర లో బో స్ట న్ నగరానికి దగ్గ ర లో ఉన్న వెస్ట్ బో రో లో28-6-1891 లో జన్మించింది
.మాసా చూసేట్స్ ను ''న్యూ ఇంగ్లా ండ్ ''అంటారు .చిన్నప్పటి నుండి అక్కడ యుద్ధ వాతా వరణమే .తలి దండ్రు లు
బాగానే విద్యా వంతులు .తండ్రి ఆమ్హేస్ట్ కాలేజి గ్రా డ్యుయేట్ .ఆయన కాన్ స్టా ంటి నోపుల్ ,టర్కీ లకు వెళ్లి గణితం
బో ధించే వాడు ఆయన గ్రీకు నగరం ''ట్రా య్ ''వెళ్లి అక్కడి త్రవ్వ కాలు చూసి ఆ విషయాలన్నీ వచ్చిన తర్వాత
ఇంట్లో పిల్లలకు చెప్పాడు .ఆది వారి మీద పెద్ద ప్రభావమే కల్గిచింది .ఆయన ప్రో బేట్ కోర్టు లో జడ్జి అయాడు .తల్లి
హారిఎట్ మెర్రి ఫీల్డ్ ఆనాటి మొదటి విద్యా సంస్థ అయిన'' oread academy in worsester ''చదువు కొంది మంచి
చరిత్ర కారిణి .రెండు మూడు పుస్త కాలు రాసి ప్రచురించి ,కూతురికి ప్రేరణ కల్గించింది .కాలనీ ల చరిత్ర రాయటం లో
తలిదండ్రు లకు ఉన్న సంతానం లో అయిదవ అమ్మాయి ఈస్త ర్ .పై వాళ్ళంతా బాగా చదువుకొన్నారు
ఒక సామాజిక మేగజైన్ తయారు చేసింది .ఆమె రాసింది రెండవ సంచికలో వచ్చింది .తోమ్మిదేల్లప్పుడు డు కీళ్ళ
జబ్బు తో బాధ పడింది .తల్లి ఈమెను చదవమని ,రాయమని, బొ మ్మలు వేయ మని ప్రో త్స హించేది .,హై స్కూల్
చదువు అయినతర్వాత బో స్ట న్ లోని worester art museum లోను బ్రా డ్ ఫో ర్డ్ లోని జూనియర్ కాలేజి లోను చది
వింది .తన రచన కోన సాగిస్తూ నే ఉంది .1912 లో బ్రా డ్ ఫర్డ్ నుండి గ్రా డ్యుయేట్ అయింది .మళ్ళీ బో స్ట న్ లో
రచయిత ల ట్రెయినింగ్ లో చేరింది .చెల్లెలు కేథరిన్ విస్కాన్సిస్ వర్సిటి లో టీచింగ్ లో చేరితే ఈమె కూడా వెళ్ళింది
.గుర్రపుస్వారీ చేసేది .ఆమె కధకు బహుమతి వచ్చింది .విస్కాన్సిన్ లిటరరీ మేగజైన్ లో ఆమె కధ పడింది .దాన్ని
1917 లో మొదటి ప్రపంచ యుద్ధ ం లో వాలంటీర్ గా పని చేసింది .వెస్ట్ వర్జీనియా లోని ఒక వ్యవ సాయ
క్షేత్రా నికి ఈస్త ర్ ను పంపారు .అక్కడి రైతు ఈమె కున్న ఉత్సాహాన్ని గమనించి గుర్రా లను ఆమెకు అప్పగించాడు
.వాటితో బాగా గడిపింది .విస్కాన్సిన్ లో చదువుతూ రచనకు మెరుగులు దిద్దు కొంది .విస్కాన్సిన్ లిటరరీ మెగ
జైన ఎడిట ోరియల్ బో ర్డు లో పని చేసింది .అక్కడే రౌలింగ్ అనే మహా రచయిత తో పరిచయం ఏర్పడింది .ఆయన
రాసిన'' yearling ''పుస్త కం బాగా ప్రా చుర్యం పొ ందింది .తను విస్కాన్సిన్ రావటానికి కారణం గొప్ప నవల
రాయటానికే అని చెప్పేది ఫో ర్బ్స్ .1919 లో ఇంటికి తిరిగి వెళ్ళింది .అక్కడ ఒక పబ్లి షింగ్ కంపెని లో అసిస్టెంట్
ఎడిటర్ అయింది .ఆమె స్పెల్లింగ్ మిస్టేకులు ఎక్కువ గా చేసేది .అందుకనే హో దా తగ్గింది .లేక పో తే చీఫ్ ఎడిటర్
అయి ఉండేది .అక్కడ ఆమె ఎంతో మంది రచయితలు పంపే రాత ప్రతుల్ని శ్రద్ధ గా చదివేది .అందులో పదార్ధం
ఉంటె తప్పక ప్రచురించేది .ఫ్రెంచి విప్ల వ నేపధ్యం లో వచ్చిన ఒక నవల ను అవసరం మేరకు తగ్గించి ఎడిట్ చేసి
పత్రిక లో ప్రచురితం అఎట్లు చేసింది .ఆది ''rafael sebatini ''రాసిన'' scaramouche ''.ఆ నవల చారిత్రిక నేపధ్యం
తో రాయబడి ఉండటం తో బాగా పాప్యులర్ అయింది సినిమా గా కూడా తీశారు .ఇది ఈస్త ర్ పుణ్యమే .
తాను పని చేస్తు న్నా, నిరంతరం రాస్తూ నే ఉంది .బో స్ట న్ ఈవెనింగ్ ట్రా న్స్క్రిప్ట్ కు తరచురాసేది . అందులో
మెసా చూ సెట్స్ లోని రచయితల జీవిత చరిత్ర ఆ రాష్ట ్ర చరిత్ర రాసేది .అవి బాగా పేరు పొ ందాయి .కేంబ్రిడ్జి
అపార్ట్మెంట్ లో మిగిలిన యువ స్నేహితులతో కలిసి ప్రతి వారం డిన్నర్ పార్టి ని చేసుకొంటూ కొత్త అతిధిని
ఆహ్వానిస్తూ ఆయన చెప్పింది తెలుసుకొంటూ ఉండేది .అప్పుడే హార్వర్డ్ లా కాలేజి విద్యార్ధి ఆల్బర్ట్ హాస్కిన్స్ తో
పరిచయమైంది అయితే అదేమీ ప్రేమ గా చిగురించి పూలు పూయలేక పో యింది కారణం ఆమె కు దీని గురించి
ఆలో చించే సమయం తీరికా లేక పో వటమే .కాని 1926 లో అతన్నే పెళ్లి చేసుకోంది.
పెళ్లి అయిన తర్వాతా కొన్ని నెలలకు ''o genteel lady ''అనే విక్టో రియా పాలన లోని ఒక స్త్రీ గురించి
నవల రాసింది .దీనికి తనకు ప్రేరణ ''goodies lady's books ''అని తెలియ జేసింది .ఎప్పుడో ఇంగ్లా ండ్ లో జరిగిన
చారిత్రిక విషయాల నేపధ్యం లో ఆమె అంత విషయ సేకరణ చేసి అద్భుతం గా రాసిందని మెచ్చారు .newyork
time book review ''miss forbes has caught and kept through out the charm of the by gone days she
describes .she has captured the elusive lace and lavender element without its mustiness ''అని
పొ గిడింది .ఒక్క నెలలో ఈ పుస్త కం అమ్మకాలు విపరీతం గా పెరిగాయి .హనీ మూన్ కు దంపతులు యూరప్ వెళ్లి
వచ్చారు .న్యూయార్క్ లో నివాసం .భర్త లా ఫారం లో పని చేస్తు న్నాడు .ఈమె కొత్త నవల ''a mirror for witches
''పై ద్రు ష్టి పెట్టింది .తన తల్లి కుటుంబం సేకరించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది .అందులో తల్లి చెప్పిన
ఒక యదార్ధ గాధ ఆమెను బాగా కదిలించింది .rebeca chamberlain అనే ఆమెఒక దెయ్యం అని జైల్లో విచారణ
ఎదుర్కొంటుండ గానే చని పో యిన కధ ఆది .దీని ప్రభావం ఈమె మీద బాగా ఉంది .కేంబ్రిడ్జి లో ఉండగా కూడా
ఒక అభాగ్యురాలిన యువతీ మాంత్రికు రాలు అని నింద మోసిన ఏడవ శతాబ్ది లో ''సేలం ''లో జరిగిన
కధ ఆధారం గా1928 లో ''a mirror of witch craft ''నవల రాసి ప్రచురిస్తే అద్భుత మైన అప్ప్లాస్ వచ్చింది
.విమర్శకులూ మెచ్చారు అందులో డాల్ బిల్లీ అనే ఇంగ్లీష్ అమ్మాయి ని హీరోయిన్ ను చేసింది .ఇది గొప్ప
సృజనాత్మక నవల అన్నారు .ఇలా మంత్ర గత్తే లు ,దేయ్యాల కధలు చివరిదాకా రాస్తూ నే ఉంది .ఫో ర్బ్స్ భర్త కు
తన కంటే భార్యకు పేరు ఎక్కువగా రావటం అసూయ కలిగించింది .ఆమె ను రాయ వద్దు అని ఆంక్ష పెట్టా డు
.అతను ఇంట్లో ఉన్నంత సేపు రాసేది కాదు .ఆ తర్వాతా రాసేది .చివరికి ఇద్ద రు విడాకులు తీసుకొన్నారు .ఈమె
మళ్ళీ స్వంత ఊరు వోర్సెస్ట ర్ చేరింది .తన ఇంటికి కొద్ది దూరం లోనే సో దరి కేథరిన్ ఉండేది .ఆమెకు అప్పుడు
అర్ధమైంది రచయిత రాసుకోవటానికి ఏకాంతం అవసరం అని .అమ్మా చెల్లెలు సో దరి కర్నిల్లా ఉన్న ఇంట్లో మూడో
షార్ట్ హాండ్ రాసి నంత వేగం గా రాసేది ;మళ్ళీ తిరిగి చదువుకొని సాఫు చేయటం అలవాటు .మెసా
చూసెట్స్ లోని కాలనీలజనాన్ని గురించి నవల రాయాలని సంకల్పించింది .ఈ లోపునే ''మిస్ మర్వేల్ ''అనే
నవలను కేవలం పది రోజుల్లో రాసేసింది .ఇది వరకు అనుకొన్న ప్లా ట్ ఆధారం గా ''paradise''పై ఆలోచన పెట్టి
ఆరునెలల్లో పూర్తీ చేసి 1937 లో పబ్లి ష్ చేసింది .ఇదీ విపరీతం గా అభిమా నం సంపాదించింది .తర్వాతఏడాది
''the genteel lady ''విడుదలై విజం సాధించింది .ఇది ''బాత్ శీబా స్పూనేర్ ''అనేఆమె తన భర్త ను మరో
ముగ్గు రిని చంపిన నేరం కింద ఉరితీయబడిందిఅనే కధ .మంచి పాత్రలు ,నిర్వహణ ఆమె కు పేరు తెచ్చాయి
. .ఉరితీయ బడ్డ ఆవిడకు బ్రిటీష ఆఫీసర్ తో అనైతిక సంబంధం ఉందనేది తరువాత తెలుస్తు ంది .ఇందులోని
చారితక
్ర యదార్ధం అందర్ని ఆశ్చర్య పరచింది .ఆమె పరిశీలనా దృష్టికి జేజేలు పలికారు .పులిత్జేర్ బహుమతి
పొ ందిన స్టీఫెన్ విన్సెంట్ బెనేట్ అనే ఆమె గొప్ప రివ్యు రాసింది .ఈ నవల విడుదల అయిన తర్వాత గొప్ప పార్టీ
'' paul revere and the world he lived in '' అనేది1943 పులిద్జేర్ బహుమతి పొ ందింది .న్యాయం గా
ఆ బహుమతి తన తల్లికి చెందాలని అంటుంది ఈస్తేర్ .మంచి విమర్శలతో ఈ పుస్త కం దూసుకు పో యింది
.పులిద్జేర్ సాధించిన తర్వాతా మరో విజయ వంత మైన నవల రాసి చరిత్ర లో స్తిర స్తా నం సంపాదించాలని
నవల గా రాయాలని పించింది .అంతే దీక్ష గా దానిపై పరిశోధన చేసి నవలను సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దింది
.1943 లో ప్రచురితమై గొప్ప విజయం సాధించింది దీనికి న్యు బేరి అవార్డు పొ ందింది .ఆ తర్వాతా నాలుగేళ్ళు నాన్
ఫిక్షన్ రాసింది .1948 లో ''the running of the tide ''రాసింది దీనికి m.g.m.ప్రిఅజ్ వచ్చింది సినిమా గా తీశారు
.దీనికి ఆమెకు ఒక లక్షా యాభై వేల డాలర్ల పారితోషికం లభించింది .వాల్ట్ డిస్నీ జానీ ట్రేమన్ ను సినిమా గా
తీశాడు .దీని మూవీ హక్కుల కింద ఆమె కు దక్కింది కేవలం అయిదు వేల డాలర్లే .
1954 లో చివరి నవల''rain bow on the road '' రాసి విడుదల చేసింది .ఇది 1830 కాలం నాటి జాన పద
కళా కారుని యదార్ధ కధ .పడి హేడవ శతాబ్ద ం లోనిమాసా చూసేట్స్ ''విచ్ క్రా ఫ్ట్ ''పై రాయాలని మొదలు పెట్టింది
.కాని పూర్తీ చేయ లేక పో యింది . .''american Antiquarian Society in worester ''కు 1960 లో ఎన్నిక అయిన
మొదటి మహిళా రచయిత్రి ఫో ర్బ్స్ .ఆ సంస్థ అరుదైన విషయాలను సేకరించి భద్ర పరచి ప్రజలకు అందు బాటు
లోకి తెస్తు ంది .డెబ్భై ఆరేళ్ళు జీవించి అమూల్య మైన చారిత్రా త్మక నవలలు రాసి న ఈస్తేర్ ఫో ర్బ్స్ 12-8-1967 లో
మరణించింది .ఆమె నవల జానీ ట్రేమేన్ పదికి పైగా భాషల్లో కి అనువదించ బడింది .ఎన్నో సార్లు పునర్ముద్రణం
పొ ంది లక్షలాది కాపీలు అమ్ముడు పో యాయి .ఆమెను గురించి new york time ''పత్రిక గొప్ప ప్రశంషను
కురిపించింది ''Forbes is a novelist who wrote like a historian ,and a historian who wrote like a
novelist ,achieved a reputation as one of the most exciting and knowledgeable authors on the
revolutionary era ''.
''the catcher in the rye '' నవల తో ప్రఖ్యాతి చెందిన రచయిత శాలింజేర్ .అసలు పేరు'' జేరోం డేవిడ్ శాలింజేర్
''(j.d.salinger ).పేరు ,ప్రఖ్యాతులకు దూరం గా జీవించాడు .న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తు న్నాడు అదే
ఆయన కోరుకొనేది .వ్యక్తిత్వానికి ,శక్తి వంత మైన అభి భాషణకు ఆయన ప్రసిద్ధి .అమెరికా లోని మాన్ హట్ట న్ లో
1-1-1919 న జన్మించాడు .తండ్రి సో ల్ .తల్లి మేరీ జిల్లీచ్ .మాన్హ ట్టన్ లో రెండేళ్లు చదివాడు .1936 లో valley forge
military academy -నుంచి గ్రా డ్యుయేట్ అయాడు .ఇది పెన్సిల్వేనియా లోని వెన్ లో ఉంది .అక్కడే crossed
sabers పత్రిక కు సంపాదకుడి గా చేశాడు .ఆయన చదివిన అకాడెమి జీవితం లో నుంచే ఆయన రాసిన నవల కధ
కు విషయం గా ఎంచుకొన్నాడు .
1937 లో ఆస్ట్రియా లోని వియన్నా వెళ్లా డు .ఆ తర్వాత,పో లాండ్ కూడా చూశాడు .అక్కడే దిగుమతి
వ్యాపార రహస్యాలను తండ్రితో పాటు తెలుసుకొన్నాడు .తిరిగి వచ్చి పెన్సిల్వేనియా లోని ''అర్సినాస్ ''కాలేజి లో
చేరాడు .అప్పుడే ''skipped diploma ''ను కాలేజి మేగజైన్ కు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .కొలంబియా
వర్సిటి లో చిన్న కధలు రాసే కోర్సు చేశాడు .క్లా సులకు వెళ్ళ కుండా ,వెళ్ళినా చివరి బెంచీల్లో చేరి కాలక్షేపం చేసే
వాడు .ఆయన మొదట ప్రచురిత మైన కధ ''దియంగ్ ఫో క్స్''.ఇది ''స్టో రి ''అనే పత్రికలో 1940 లో వచ్చింది .దానికి
పాతిక డాలర్ల పారితోషికం అందుకొన్నాడు .ఆ తర్వాత''the hang of it '',the heart of a broken story ''
మొదలైన కధలు ప్రముఖ పత్రికల లో వచ్చాయి .రెండో ప్రపంచ యుద్ధ ం లో ఆయనకు సైన్యం నుంచి పిలుపు
వచ్చింది .సెలెక్టివ్ సర్విస్ లో చేరి M.S.kung sholm లో వినోద నిర్వహణ డైరెక్టర్ గా పని చేశాడు .
1942 లో అమెరికా ఆర్మీ లో కి ఆయన్ను తీసుకొన్నారు .ఆయన ఆఫీసర్ల మొదటి సార్జేంట్లు మరియు
ఇంస్త క
్ర ్త ర్ల స్కూల్ లో చేరాడు .తర్వాత army counter intelligence corps కు బదిలీ అయాడు .అప్పుడే ''స్టో రి
''అనే పత్రిక లో ఆయన రచన'' the long debut of lois taggett ''అచ్చయింది .అలాగే ''colliers''పత్రిక
లో''personal notes of an infantryman ''వచ్చింది .ఈ కాలం లోనే చార్లీ చాప్లిన్ భార్య ,ప్రఖ్యాత నాటక రచయిత
యూజీన్ వో.నీల్ కుమార్తె ఊనా తో పరిచయమయింది .తర్వాతా టేన్నీసీలోని నాష్ విల్ లో ఉన్నప్పుడు'' the
varioni brothers ''ను సాటర్డే ఈవెనింగ్ పో స్ట్ పత్రికలో రాశాడు .తర్వాతా ఆర్మీ కొంటర్ ఇంటలిజెన్స్ కార్పస్ కు
బదిలీ అయి ఇంగ్లా ండ్ లో tiveton in Devonshire లో శిక్షణ పొ ందాడు .6-6-1944 న నార్మండీ మీద యుద్ధా నికి
వెళ్లా డు .ఈ రోజునే'' D -Day ''అని చరిత్ర కారులు పిలిచారు .ఆ తర్వాతా utah beach లో నాల్గ వ డివిజన్ కు పని
చేశాడు .యుద్ధ కాలం లో అంతా ఏదో ఒకటి రాస్తూ నే ఉన్నాడు .యూరప్ లో సెక్యురిటి ఏ జేంట్ గా పన్నెండవ ఇన్
ఫాన్ట్రీడివిజేన్ కు పని చేశాడు .దీని లో వసతులు లేని ,నడకకు అసాధ్యం గా ఉన్న రోడ్ల మీద నడవాల్సి వచ్చేది
.అలాగే పారిస్ చేరాడు .అక్కడే ఉన్న అమెరికా ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే ను కలుసుకొన్నాడు
.ఆయనా యుద్ధ వార్త లను రాయటానికి అక్కడికి వచ్చాడు .హెమింగ్వే సాలింజేర్ రాసిన the last day of the last
furlough ''కధనుహృదయ పూర్వకం గా మెచ్చుకొన్నాడు .
పారిస్ లో కొంత కాలం ఉండి బెర్లిన్ చేరాడు .ఆయన రాసిన'' a boy in france '' సైనికుడి జీవాలను
పో గొట్టే సుదీర్ఘ ప్రయాణం ను వివరిస్తు ంది .మళ్ళీ జెర్మని చేరి ,గడ్డ కట్టే చలిలో ,ఎందరో మృత్యు వాత
పడుతుండగా'' ట్రెంచులలో '' నక్క బొ క్కల్లో , గడపాల్సి వచ్చింది అతని భార్య అల్లిన సాక్సు వల్ల నే అతను ఆ చలిని
తట్టు కో గలిగా డట .1945 may 5 న నూహాస్ లోని హీర్మాన్ గోరింగ్స్ సౌధం ను స్వాధీనం చేసుకొనే కార్యక్రమం లో
పని చేశాడు .అక్కడ సెక్యురిటీ ని పర్య వేక్షించాడు .ఎందరో ఉద్యోగం లోంచి తొలగించ బడ్డ వారి మధ్య పని
చేయాల్సి వచ్చింది .జూలై లో యుద్ధ అలసట వల్ల ఆస్పత్రి పాలైనాడు .తన పరిస్తితిని హెమింగ్వే కు ఉత్త రం ద్వారా
తెలియ జేశాడు .ఆయన యుద్ధ అనుభూతులనన్నిటిని ''the catcher in the rye ''నవల లో అద్భుతం గా
ఆవిష్కరించాడు .ఇదే సమయం లో ''elaine ''అనే కదా సంపుటిని ప్రచురించాడు .తర్వాతా ''i am crazy '',''no
1945 సంవత్స రాం తానికి ఆర్మీ నుండి విముక్తి లభించింది .న్యూయార్క్ చేరాడు .''గ్రీన్ విచ్''
విలేజి యొక్క రాత్రి సౌందర్యాన్ని చాలా కాలం అనుభవించాడు .తర్వాతా ఆసక్తి అంతా ''జెన్ బౌద్ధ ం ''మీదకు
మళ్ళింది .తరచుగా the newyorker ''పత్రికకు రాస్తూ నే ఉన్నాడు .1949 లో'' మై ఫూల్ హార్ట్ ''రాశాడు .1950 లో
''for esme with love and squalor ''న్యూయార్కర్ కు రాశాడు .ఆయన రాసిన ''కాచేర్ ఇన్ రై'' నవల
న్యూయార్కర్ బెస్ట్ సెల్లర్ గా పేర్కొన్నది .పబ్లి సిటీ అంటే ఇష్ట పడని సాలింజేర్ న్యు హంప్ షైర్ లోని కోర్నిష్ కు లో
ప్రశాంతం గా గడిపటానికి వెళ్లా డు . .కాని అ క్కడ నీటి వసతి, సౌకర్యాలు లేవు .కూతుళ్ళు బాధ పడ్డా రు .తనకు
హాయిగా అడవిలో ప్రశాంతం గా జీవించటానికి చిన్న షెడ్డు చాలు అని వారికి చెప్పాడు .ఇక్కడే ఆయన రోజుకు పద
హారు గంటలు పని చేస్తూ ,రాసుకొంటూగడుపుతున్నాడు ..శాకా హార భోజనం, ఎరువులు వెయ్య కుండా
పండించిన కూరలు తింటాడు . ఆయన విధించుకొన్న ఏకాంత జీవితం ఇది హెన్రీ డేవిడ్ థో రో లాగా . ఆ తర్వాత
అందులో అనేక రచనలు చేశాడు .ఆయన కధలన్నీ సంపుటాలుగా వచ్చాయి .1987 లో సాలింజేర్ జీవిత చరిత్ర
సృజన ఉన్న రచయిత గా ,సాధించాలన్న తపన ఉన్న వాడిగా సాలింజేర్ కనిపిస్తా డు .ఆయన
భావాలను rouseaustic అని ఈసడించిన వారూ ఉన్నారు .ఆయన న్యూ యార్క్ నగరాన్ని ''spiritual waste
land of isaiah ''అని తీసి పారేశాడు .దాన్ని the city of wealth and dissipation ,the city of anti christ
అంటాడు .సెక్స్ లో ఎక్స్పెర్ట్ ను ''sexpert''అని అర్ధవంతం గా అంటాడు .తను పని చేసిన సైన్యాన్ని గురించి'' the
army was as practically as full of bastards as the nazis were '' అన్నాడు .యుద్ధా నంతర కాలమంతా
ఆయనకు నిరాశా జనకం గా కనిపించింది .అందుకే ఆయనకు ప్రా చ్య దేశాల భావన మీద గురి ఏర్పడింది .ముఖ్యం
వ్యామోహం కలిగింది .
ఎమిలి బ్రా ంట్
1847 లో ఇంగ్లా ండు దేశం లో వచ్చిన పారిశ్రా మిక విప్ల వం వల్ల సంప్రా దాయ జీవన విధానం దెబ్బతిన్న తీరును
,సాంఘిక వర్గ భేదాలను ,భూమి పై యాజ మాన్యం పో వటాన్ని దానివల్ల అప్పటి దాకా వచ్చిన సాంఘిక హో దా
మారి పో యి ధనిక సంపన్న వర్గా లకే హో దా రావటాన్ని వారే'' జెంటిల్ మెన్ '' గా చేలా మణీ అవటాన్ని ఎమిలీ
బ్రా ంట్ అనేఇంగ్లా ండ్ రచయిత్రి ''wuthering heights ''అనే తన నవల లో అద్భుతం గా ఆవిష్కరించింది .ఆమె
1818 లో ఎమిలి బ్రా ంట్ట్ జూలై 30 న లండన్ దగ్గ ర thornton -yarkshire లో జన్మించింది .తండ్రి పాట్రిక్
బ్రా ంట్ ,తల్లి మెరియా .ఆరుగురు సంతానం లో అయిదవ పిల్ల ఎమిలి .మూడేళ్లకే తల్లిని కోల్పోయిన అభాగిని
.ఆతల్లి సో దరి ఎలిజ బెత్ వీరందర్నీ సాకి ,పెద్ద వాళ్ళను చేసింది .ఏడేళ్ళ తర్వాతా స్కూల్ లో చదువుతున్న
అక్కలు మెరియా ఎలిజే బెత్ లు అంట వ్యాధి తో మరణించారు .ఎమిలీ ని వేరు గాహావర్త్ లో ఉంచారు .ఇక్కడ
ఆమె పదేళ్లు ఉంది .తండ్రి పిల్లల కోసం కొయ్య సైనికుల బొ మ్మలు కొని ఇచ్చాడు .వీటితో ఈమె ఆడుకొంటూ వాటి
గురించి ఊహ తో కధలు రాసింది .అవే ''గొందాల్ ''కధలు గా ప్రసిద్ధి చెందాయి అవి ఆమె భావోద్వేగాలే అంటారు
విశ్లేషకులు . చార్లెట్అనే సో దరి టీచర్ గా చేరి ఏమిలిని తన శిష్యురాలిగా చేసుకోంది.తర్వాతా ఎమిలీ కూడా
అసిస్టంట్ టీచేర్ అయింది .ఆమెకున్న సిగ్గు ,బిడియం కలిసి పో నీ తనం, ఆమె ను టీచర్
ే గా రాణించ టానికి
ఉపయోగ పడ లేదు .
ఇరవై ఏళ్ళ వయసు లో ఎమిలి ''హావర్త్ ''కు తిరిగి వెళ్ళింది .సో దరి లంతా కలిసి ఒక స్కూల్ పెడదామని
అనుకొన్నారు కాని .డబ్బు లేక ఆగి పో యారు .తండ్రి పైన్టి ంగ్ చేస్తూ కొంత సంపాదిస్తు న్నాడు .ఇతర భాషలు నేరిస్తే
కాని బడి పెట్టటం కుదరదని తెలిసి ఎమిలి ,చార్లేట్లు బ్రసేల్సు కు వెళ్లా రు .అక్కడ ఫ్రెంచ్ ,జర్మన్ భాషలు నేర్చారు
.వీరిని పెంచిన పేద తల్లి చని పో యింది .ఆమె వీరికి కొంత ధనం ఇచ్చి చని పో యింది .దాన్ని ఎలా బాగా
ఉపయోగించాలా అని ఆలోచిస్తూ తండ్రి దగ్గ రే ఉంది ఎమిలి .తాను ఇది వరకు రాసిన కవితలన్నీ కాపీ చేసి ''గోదాన్
పో యెమ్స్ ''గా పేరు పెట్టింది .వీళ్ళ సో దరుడు బ్రా న్వేల్ సరిగ్గా పని చేయక పో వటం ఉద్యోగం పో గొట్టు కొని నెత్తి న
చార్లేట్ బ్రా ంట్ రాసిన'' jane eyre ;''నవలా ఎమిలీ రాసిన'' wuthering heights ''నవల ఒకే సారి
ప్రచురితం అయాయి .చార్లేట్ నవల బాగా ఆకట్టు కొంది కాని ఎమిలి నవల ఆశ్చర్యాన్ని కల్గించింది .ఈమె రాసిందా
అనుకొన్నారు అందరు .సో దరుడు బ్రా న్వేల్ చని పో యాడు .మిగిలిన ముగ్గు రు సో దరిలు చాలా ఆందో ళన కు గురై
నారు .తండ్రి కూడా అంతకు ముందే పో యాడు .చివరికి ఎమిలీ కూడా క్షయ వ్యాధి తో1948 december 19 న
మరణించింది .ఆమెను హో వార్త్ స్మశాన వాటిక లో సమాధి చేశారు .32 ఏళ్ళ కే ఆమె తనువు చాలించింది .సో దరి
చార్లేట్ shirley అనే పుస్త కాన్ని ఎమిలీ అన్నే లకు అన్కితమిచ్చింది .1850 లో ఎమిలీ రాసిన wuthering
heights ;;నవలను పునర్ముద్రణ చేస్తూ ఎడిట్ చేసి ఉపో ద్ఘా తం రాసింది చార్లేట్ . .ఈ నవలను సినీమా గా కూడా
అదే పేరుతో తీశారు .చార్లేట్ ,ఎమిలీ లు ఇద్ద రు అక్కచెల్లెళ్ళు నవలా సాహిత్య రచన లో నవలా మణులని
పించుకొన్నారు .
ఈ నవలలో ఎమిలీ తాను చూసిన పల్లె ప్రా ంతాలను ,జనుల్ని కధలో చేర్చింది .తన ఊహా శక్తిని
.సో దరుడు బ్రా న్వేల్ పాత్రను అందులో చొప్పించి చెడుకు సమాజం లో స్తా నం లేదని తేల్చింది .ఈ నవలలో వర్గ
పో రాటం ఉంది .దాని ప్రతిభా వంతం గా చిత్రించింది .ఇంగ్లా ండు లోని పారిశ్రా మీకరణ విప్ల వం వల్ల సమాజం లో
వచ్చిన కొత్త సామాజిక అధికారాలను,హో దా లను .పారిశ్రా మీ కరణ తో మధ్య తరగతి కుటుంబాలు పొ ందిన ఆటు
పో ట్ల ను తెలియ జెప్పింది . వర్గ శత్రు త్వాలను వివరించింది .సమాజం పై దీని ప్రభావం ఎలా ఉందొ ,దాని వల్ల
వచ్చిన కొత్త విదానాలేమితో తెలుస్తా యి.సహజ విలువలకు సామాజిక విలువలకు మధ్య ఉన్న విభేదాలు
కాపిటలిజం పెరుగుతున్న తీరును చూపించింది .వర్గ పో రాటం తప్పదన్న మార్కిస్టు భావనా
కనిపిస్తు ంది .మనుష్యులు అప్పటి దాకా అనుభ వీస్తు న్న స్వాతంత్రం పో తోంది అనే భావన కల్పించింది నవలలో
.కొందరు విశ్లేషకుల భావన లో డార్విన్ సిద్ధా ంతానికి ఈ నవల ఒక వ్యాఖ్యానం .వారసత్వ అధికార కేంద్రీకరణ ను
నిరసించింది .బీద వారు బ్రతకటానికి సమర్ధ వంతులు అని చాటి చెప్పిన్ది ఎమిలీ అన్నారు .మనషి ఈ విశ్వానికి
కేంద్రం కాదని చెప్పింది అన్నారు ఒకరు .సంపద ను కేంద్రీక రించే వారిని ఎదిరించి నిలవాలనేది సిద్ధా ంతం గా
కనిపిస్తు ంది .అనేక సాంఘిక సమస్యలను ఈ నవలలో చర్చించి తన భావనా బలాన్నిరచనా శక్తిని అధ్యన
స్వభావాన్ని జోడించి ఎమిలీ బ్రా ంట్ట్ రాసిన ఈ నవల ఇప్పటికీ అందర్నీ చదివిన్చేట్లు చేస్తూ నే ఉంది .
ప్రపంచం
జర్మనీ సంగీత త్రయం అని పిలువ బడే ముగ్గు రు మహా ''బీ''ల గురించి మనం తెలుసు కుందాం .వారి ముగ్గు రి
పేర్లు బి అనే అక్షరం తో ప్రా రంభం అవటం ఒక విశేషం .అందుకే వారిని'' ది త్రీ బి'' లని గౌరవం గా పిలుచు కొన్నారు
. .వారే బాచ్ ,బ్రా మ్స్ మరియు బీథో వెన్ .ముగ్గు రి సేవా గణనీయ మైనదే .వారి సంగీతజ్నత ను తెలుసు కొనే
జర్మన్ కంపో జర్ , ,వాద్య కారుడు- సైకార్దిస్ట్ , హార్ప్ కార్దిస్ట్ ,వయోలిస్ట్ మరియు వయోలనిస్ట్ .ఆయన ఉన్న
కాలాన్ని''Baroque period ''అంటారు .అప్పటికే ఉన్న అనేక సంగీత శైలులను శోభాయమానం చేసి నాణ్యత
చేకూర్చాడు .కౌంటర్ పాయింట్ లో ఆయనది ప్రత్యెక మైన స్తా నం ఉంది .శ్రా వ్య మైన ,ప్రేరక మైన ,వాద్య
సమ్మేళనం నిర్వహించాడు. లయ కు ఎక్కువ వీలు కల్పించాడు . ఇటలీ మరియు ఫ్రా న్సు దేశాల నుండి భావాలను
,ప్రేరణ ను పొ ందాడు .ఆయన సంగీతం లో ప్రతిభా వంత మైన లోతులున్నాయని,సాంకేతిక పరి ణతి.వాటి పై గొప్ప
పట్టు ఉన్న వాడు అని విశ్లేషకులు భావించారు . ఆయన చేసిన వన్నీ కళా సౌందర్యం తో విల సిల్లేవే అని
భావిస్తా రు .అసలు ఆయనది గొప్ప సంగీత వంశం .అంటే ఇంగువ కట్టిన గుడ్డ అన్న మాట .వాద్య కారుడిగా ఎంత
పేరు పొ ందాడో పాటకుడి గా,సుమధుర శ్రా వ్య స్వరాలతో అంతే కీర్తి పొ ందిన వాడు .యూరపు అంతా ఆయన
,చని ఆయిన తర్వాత ఆయన కీర్తి బాగా వ్యాపించింది .మొత్త ం మీద యూరప్ అంతటిని తన సంగీతం తో స్నానం
కాలం లో సంగీతం లో నాయక స్థా నాన్ని సాధించాడు .ఈయనా మంచి కంపో జర్ కాక గొప్ప పియానిస్టు కూడా
.జీవితం లో ఎక్కువ కాలం ఆస్ట్రియా లోని వియన్నా లో ఉన్నాడు .అక్కడే ఆయన కీర్తి పతాక స్తా యి ని పొ ందింది
బాష్ తోను కచేరీలు నిర్వహించిన చరిత్ర ఆయనది .పియానో వాయించటం లోనే కాక ,సింఫనీ సృజించటం లో
,ఆర్కెస్ట్రా తో సంగీత కార్య క్రమాలకు మార్గ నిర్దేశం చేయటం లో సంగీత పాటకుడి గా ,కోరస్ లు పాడటం లోను
వాటిని పాదించటం లోను ప్రశస్త మైన భూమిక నిర్వ హించాడు .అన్నిటి కంటే పియానో వాయించటం లో అత్యధిక
ప్రతిభా వంతుడి గా గుర్తింపు పొ ందాడు .ఆనాడు బ్రా మ్స్ చేసిన వన్నీ ,ఈ నాటికిఆదర్శ ప్రా యం గానే సంగీతజ్ఞు లు
భావించి ,వాటిని ఉపయోగిస్తు న్నారు .''never compromise in perfection'' అని పేరు తెచ్చు కొన్నాడు
.సంపూర్ణత పరి పూర్ణతా సాధించే దాకా నిద్ర పో యే వాడు కాదు .అందుకనే ఇప్పటికీ ఆయన సంగీతానికి
ప్రా చుర్యం ఉంది .తనకు నచ్చని ట్యూనులను ,సింఫనీ లను రాసిన వన్నీ మిగల కుండా తగుల బెట్టె వాడు .కొన్ని
రచనలు ఆయనకే నచ్చక ప్రచురించ నే లేదు .అంతటి perfectionist బ్రా మ్స్ కు రాసి కంటే వాసి ముఖ్యం అని
భావించిన సంగీత నిది ,అంబుధి . బ్రా మ్స్ సంప్రదాయ వాది .దానితో పాటు సృజన శీలి .
అతని సంగీతం అంతా ''firmly rooted in structure and compositional techniques of Boroque and
classical masters'' అని సంగీత మర్మజ్నులు నిగ్గు తేల్చారు .ఆయన ''కౌంటర్ పాయింట్ ''లో అద్వితీయుడు
అంటారు .దీనిలోనే బాష్ చాలా కృషి చేశాడని ముందే చెప్పు కొన్నాం .ఈయన దానికి మెరుగులు దిద్ది మరింత
structure ను పరిశుద్ధి చేసి (ప్యూరిఫై )రొమాంటిక్ idioms లోకి తెచ్చిన వాడిగా ఈయనను చెప్పు కొంటారు .వాటి
స్తా యిని గౌరవాన్ని పెంచిన ఘనత బ్రా మ్స్ దే .కొత్త మార్గా లు తోక్కటం అంటే మహా సరదా .ఐక్యత ,శ్రా వ్యత లను
సంగీతం లో బాగా సాధించి సంగీతాన్ని ఉన్నత స్తా నం లో కూర్చో పెట్టా డు .అయితే'' మరీఎకడమిక్ ''అనే ముద్ర
నుంచి తప్పించు కోలేక పో యాడు .ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఘనత సాధించాడు సంగీత బ్రహ్మ బ్రా మ్స్ .
జీవించి26-3-1827 న ఆస్ట్రియా లోని వియన్నా లో మరణించాడు .సంగీత వంశం లో జన్మించాడు .తాత ,తండ్రి
సంగీత విద్వాంసులే .తండ్రి ఇతని చిన్నప్పుడే తీవ్రం గా సంగీత సాధన చేయించే వాడు .ఒకో సారి అలా చేస్తూ నిద్ర
పో యే వాడు .ఏడవ ఏట సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు .బాల మేధావి అనే వారు .నీఫే అనే ఆయన వద్ద శిష్యరికం
చేశాడు .తండ్రి పని చేసే కొలువు లోనే ఆర్గా నిస్ట్ గా ఉద్యోగం పొ ందాడు .పద మూడేళ్ళ వయసు లోనే మొదటి
సారిగా కంపో జు చేసిన పుస్త కాన్ని ప్రచురించిన ఘనత బీ థో వెన్ ది .దీనిలో key board variations అద్భుతం గా
చూపి గొప్ప గొప్ప సంగీత విద్వామ్సులనే ఆశ్చర్య పరిచాడు .గురువు నీఫే తో కలిసి కొన్ని కచేరీలు చేసే గౌరవాన్ని
పొ ందాడు .పద్నాలుగేళ్ళ కే court chapel లో ఉద్యోగి అయాడు .వెంటనే మూడు పియానో సొ నాటా లను రాసి
1787 లో అంటే పద్దెనిమిదో ఏట వియన్నా వెళ్లి ఆ నాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మొజార్ట్ దగ్గ ర
శిష్యరికం చేశాడు. ,రెండు వారాలు మాత్రమె ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు .తల్లి చని పో యింది .తండ్రి విపరీత మైన
తాగు బో త' .ఎలేక్తా ర్ ను అడిగి తండ్రి జీతం లో సగం కుటుంబ పో షణ కు ఇచ్చే ఏర్పాటు చేసుకొన్నాడు .1790 లో
హేడెన్ అనే గొప్ప సంగీత విద్వాంసుడి తో పరిచయం కలిగింది .అప్పటికే బీథో వెన్ ఎన్నో వాటిని కంపో జు చేసి గొప్ప
పేరు పొ ందాడు .మోజార్టు చేసిన ఒపేరా లకు మూడింటికి సంగీతం కూర్చిన ఘనత బీథో వెన్ ది .అతను కూర్చిన
వాటిలో స్థా యి, పరి పక్వత గొప్ప గా ఉంటాయి .హేడెన్ దగ్గ ర శిష్యరికం చేసి చాలా విశేషాలు గ్రహించాడు .ఇరవై
మూడు ఏళ్ల కే గొప్ప improviser అని పేరు పొ ందాడు .క్లా వియర్ విద్య లో నిష్ణా తుడు అని పించుకొన్నాడు
వృద్ధి ,అవసరానికి తగిన మాడ్యు లేషన్ ,భావాల వ్యక్తీ కరణ (ఎమోషన్స్ )బీథో వన్
ె ను మిగిలిన సంగీత
విద్వాంసుల కంటే ఎంతో ఉన్నతాసనం పై కూర్చో బెట్టా యి .ఆయన సరసన కూర్చునే స్తా యి ఎవరికి లేదని సంగీత
దురదృష్ట వశాత్తు 26 ఏళ్ల కే బీతోవెన్'' చెవిటి వాడు'' అయాడు .ఒక సంగీత విద్వామ్సుడికి ఇది పెద్ద
శాపమే .అయినా దాన్ని అధిగమించి ముందుకు సాగి పో యాడు .ఫుల్ మూన్ సొ నాటా అనే ఆయన చేసిన సంగీత
సృష్టికి ప్రపంచం అంతా అమోఘం గా స్పందించి జేజే లు పలికింది .అతన్ని అన్ని దేశాల వారు తమ వారు
అనుకొన్నారు .సంగీతానికి ఎల్ల లు లేవు అని నిరూపించాడు బీథో వెన్ ఆయన చేసిన'' ninth symphony ''న భూతో
న భవిష్యతి అంటారు .18 వ శతాబ్ద పు క్లా సిజం నుండి ,సంగీతాన్ని19 వ శతాబ్ద పు ''రోమాన్ టిజం ''లోకి తీసుకు
ఉన్నాడు .సింఫనీ కి ఒక కొత్త శోభ, నాణ్యత గౌరవం తెచ్చిన ఘనా ఘనుడు .ఆయన సంగీతాన్ని ఎస్టి మేట్
చేస్తూ ''A broad sample of images ,cmmon sounds ,languages ,music of earth '' ఆయన సంగీతం లో
ఉన్నాయని ప్రపంచం అంతా శ్లా ఘించింది .అందుకే ఆ మహా విద్వామ్సుడికి ''హాట్స్ ఆఫ్ ''అంటారు .ఎన్నెన్నో
వాయిద్యాలను అవసరాన్ని బట్టి వాడాడు .నిండుదనం పరి పూర్ణతా సాధించాడు .ఆయన గొప్పగా పాడనూ గలడు
.పాడించను గలడు. శబ్దా నికి ఉన్న సంగీత శక్తి బీథో వెన్ కు తెలిసి నంత గా ఎవ్వరికీ తెలీదు అని విశ్లేషకుల భావన
.చేంబర్ మ్యూజిక్ కు విలువైన సంగీతం అందించాడు .మొత్త ం మీద ఆరు వందల కార్య క్రమాలను నిర్వ హించిన
ఘనత బీతోవన్ ది. ఆయన సంగీతం ఇచ్చిన వాటిలో 32 piono sonataas ,10 violin sonatoas ,5 cello sonatas
ఆయన మరణిస్తే ఇరవై వేల మంది ప్రజలు ఆయన అంతిమ యాత్ర లో పాల్గొ ని నివాళులు
అర్పించారు .అదే అతని గురువు మొజార్ట్ అంతకు ముందెప్పుడో అక్కడే చని పో తే ,పట్టు మంటూ పది మంది
కూడా స్మ శానానికి వెల్ల లేదట . ఆయన మరణానంతరం 75 .వ పుట్టిన రోజున ఆయన పుట్టిన బాన్ లోవిగ్రహం
ఏర్పాటు చేశారు .జర్మని లో ఒక సంగీత విద్వామ్సుడికి ఏర్పాటు చేసిన మొదటి విగ్రహం ఇది .1880 వరకు
వియన్నా లో ఆయన విగ్రహం పెట్ట లేదు .బో స్ట న్ లోని సింఫనీ హాల్ లో ఆయన పేరు ను బంగారు అక్ష రాలతో
రాశారు బాన్ లో ఆయన పేర మ్యూజియం ఏర్పాటు చేసి గౌరవాన్నిచ్చారు .ఆయన పై ''erocia''అనే సినిమా ను
ఆస్ట్రియా ప్రభుత్వం 1949 లో నిర్మించింది .ఇది cannes film festival కు వెళ్ళింది .1962 లో వాల్ట్ డిస్నీ '' the
magnifishient rebel ''పేర టి.వి.కి తీశాడు .1994 లో'' immortal beethoven ''సినీగా వచ్చింది .2006 లో
బీథో వెన్ ninth symphony ఆధారంగా ''copying beethoven ''సినీమా తీసి ఆ సంగీత సార్వ భౌముడికి నివాళు
లర్పించారు .''లుడ్విగ్ వాన్ బీథో వెన్ ''అంటుంటే నే ఒక రిధం ఆ మాటల్లో నే ప్రతిధ్వనిస్తు ంది .పేరులోనే సంగీత
దేశస్తు లు ''అయిదవ శతాబ్దా న్ని'' తమ ''స్వర్ణ యుగం ''గా భావిస్తా రు .అప్పుడే విద్యా వైద్య కళా సాహిత్య శిల్ప
రాజకీయ,సాంస్కృతిక వేదాంతాదివిషయాలలో ఏంతో అభి వృద్ధి సాదించిం దని ,ఆ కాలం లో జన్మించిన కవులు
రచయితలు ,కళాకారులు ,శాస్త ్ర వేత్తలు ఆదర్శ వంతులని ,అప్పుడే అద్భుత గ్రంధాలన్నీ వెలువడి భవిష్యత్తు
తరాలకు కర దీపక
ి లు గా నిలిచాయని వారి భావం .అంతే కాదు వారి వైద్య శాస్త ్ర పితామహుడు హిపో క్రటీస్ ఆ
కాలం లోనే జన్మించి వైద్య శాస్త్రా నికి పునాదులు నిర్మించాడనీ గర్వ పడతారు .అందుకే వారు ఆ కాలాన్ని ఆయన
ఈ కాలం లోనే ప్రపంచమ్ లో మొట్ట మొదటి ప్రజా ప్రభుత్వం -డేమోక్రా సి ఏర్పడింది ఎతేన్సు లో .ప్లా టో
,అరిస్టా టిల్ మొదలైన తత్వ వేత్తలు సత్య దర్శనం చేసి ప్రపంచానికి చాటారు .ఆనాడు దేశాలకు సరి హద్దు లనేవి
లేవు .అంతా ఐక్య గ్రీకు రాజ్యమే .పో లిస్ అనే పౌర రాజ్యాలున్దేవి .తమ ప్రభుత్వాలను తామే పాలించుకొనే వారు
.పో లిస్ అంటే ముఖ్య పట్ట ణం దాని చుట్టూ జనావాసాలు పొ లాలు ,అడవులు చుట్టూ ప్రక్కల గ్రా మాలు అన్నీ
పో లిస్ కు చెంది ఉంటాయి .అక్కడ గ్రా మీణ వికాసం బాగా జరిగేది .ఎన్నో మార్బుల్ ,వెండి గనులున్దేవి .ముఖ్య
నగరానికి చుట్టూ ఎత్తైన గోడ ఉండేది .ఆ కాలం లో యుద్ధా లు ఎక్కువే .సాధారం గా గ్రీకు నగరాలు ఒక కొండ దగ్గ రే
నిర్మింప బడేవి .దేవాలయాలు ఎత్తైన కొండల మీద ఉండేవి .వీటిని ''ఆక్రో పో లిస్ ''అనే వారు .గ్రీకుల నగర
మధ్యభాగం లో ఎంతో సందడి ఉండేది .దీన్ని ''అగోరా ''అంటారు .మన డౌన్ టౌన్ లాటివన్న మాట .ఇక్కడే
ప్రభుత్వ ఆఫీసులు దుకాణాలు ,మార్కెట్లు దేవాలయాలు గ్రీకు పో లిస్ లుఈ నాటి ఉత్త ర ఆఫ్రికా ,ఆసియా మైనర్
,ఫ్రా న్సు ,ఇటాలి రష్యా ,సిరియా ల వరకు వ్యాపించి ఉండేవి .అన్నిటి మధ్య దృఢ మైన బంధం ఉండటం విశేషం .
హిపో క్రా టి క్ కాలపు రచయితలు ''కాస్'',మరియు'' స్నిడాస్ ''అనే ప్రా ంతాలకు చెందిన వాళ్ళు
.కాస్అనేది ఏజియన్ సముద్రం లోని దీవి .ఏషియా మైనర్ కు సమీపం లో ఉండేది .ఇప్పుడు దాన్ని టర్కీ
అంటారు .''స్నిదాస్ ''దానికి దగ్గ రే ఉన్న తీర ప్రా ంతం .హిపో క్రటీ ''కాస్ ''నివాసి .గ్రీకులు తమను తాము
ఎతీనియన్లు ,కొన్సు ,క్నాడియన్లు అని గర్వం గా చెప్పుకొంటారు .అంటే ఒకే గ్రూ ప్ రక్త ం కల వారని ఒకే భాష కల
వారని ,ఒకే మతం కల వారని భావన .వీరందరి పూర్వీకులు గ్రీకులు అని అర్ధం .వారందరి భాషా గ్రీకు .గ్రీకు భాష
మాట్లా డని వారిని ''బార్బెరియన్లు ''అంటారు .అంటే వీరికి మిగిలిన భాషా శబ్దా లు ''బర -బర''లాగా వినిపిస్తా యని
భావం .మనం అరవ భాష మాట్లా డే వారిని ''డబ్బా లో రాళ్ళు పో సి వాయించి నట్లు ఉంది ''అనటం తెలిసే
ఉంటుంది .అలానే వాళ్ళకూ .ఒకే మతం అంటే ఒకే ''దేవతా సమూహం ''ను అందరు పూజిస్తా రు అని అర్ధం .గ్రీకు
పురాణాలలో పన్నెండు మందిదేవుళ్ళు దేవతలు ఉన్నారు .వారంతా మానవ రూపాలతో సంక్లిష్ట వ్యక్తిత్వాలతో
ఉంటారు .మానవ జీవితాలతో చెలగాటం ఆడతారు .ప్రతి దేవతకు నిర్దు ష్ట శక్తి కార్యక్రమం ఉంటాయి .అందులో
''జియాస్ ''అధిక శక్తి వంతుడు .పో సిదాన్ సముద్రా నికి అది పతి .ఆఫ్రో డైట్ ప్రేమ కు నిలయం .వీరు గాక కొందరు
చిల్ల ర దేవుళ్ళు కూడా ఉన్నారు .సైన్స్ కు సంగీతానికి వేరే దేవతలుంటారు .మూడో వర్గ ం లో హీరో లు ఉంటారు
.హీరోలు శక్తి సామర్ధ్యం ఉన్న వారే కాని మరణాన్ని తప్పించుకో లేరు .ఆస్లేపయ
ి ాస్ అనే దేవుడు రోగ నివారణకు
గ్రీకు కాలెండర్ లో పండుగలకు ప్రా ముఖ్యం ఉంది .దేవతలను ప్రసన్నం చేసుకొనే ప్రక్రియలు చేస్తా రు
.సంబరాలు ఉత్స వాలు పూజలు నిర్వ హిస్తా రు .దేవతలకు విలువైన కానుకలు సమర్పిస్తా రు జంతుబలి చేస్తా రు
.వారిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా చేస్తా రు అందమైన శిల్ప సౌందర్య విలసిత మైన దేవాలయాలను నిర్మించి
అందులో వీరిని ఉంచి సేవిస్తా రు .హిపో క్రటిస్ కాలానికి బాలుర బడులు బాగానే ఏర్పడ్డా యి .ఎడేల్లకే బడిలో చేరే
వారు .ఆడ వారికి విద్య లేదు .ఇంటి పని ,పెనిమిటి పని తప్ప .బడులలో హో మర్ రాసిన ''ఒడిస్సీ ''''ఇలియడ్
''లను నేర్పే వారు సంగీత వాయిద్యాలతో వాటిని గానం చేసే వారు .''లైర్'' అనే వాయిద్యం బాగా ప్రచారం లో
ఉండేది .ఆటలను అబ్బాయిలు బానే ఆడే వారు .పరుగు పందెం ,డిస్కస్ త్రో ,జావెలిన్ ,కుస్తీ పో టీలు జరిగేవి .అన్నీ
ప్రైవేటు బడులే .కొద్ది కాలమే బడి చదువు .ధన వంతుల పిల్లలు ఎక్కువ కాలం చదివే వారు .
గ్రీకు పురాణాలలో విజ్ఞా న ద్రు ష్టి కనిపిస్తు ంది .జియాస్ అనే దేవుడు మెరుపులు సృష్టిస్తా డని నమ్మకం
.పాసిదాన్ భూకంపాలు.తుఫాన్లు ,గ్రహణాలు ఋతువులు ఎర్పరుస్తా డని నమ్మే వారు .ఈ కాలం లో ప్రకృతిని
అధ్యయనం చేయటం పెరిగింది .వివేచనా తో కార్య కారణ దృష్టితో సమాదానాలకోసం ప్రయత్నించారు .తెలేస్ అనే
ఆయన అన్ని వస్తు వు లకు కారణ భూత మైన ఒక పదార్ధం ఉంటుందని అదే ''నీరు ''అని భావించాడు
.భూమిలోని నీటి పొ రల కదలిక వల్ల భూకంపం వస్తు ందని చెప్పాడు .ఇలా పురాణాల నుండి కాక సహజ ప్రకృతి
నుండి సమాధానాలను తెలుసుకోవటం ప్రా రంభామైనదిఇ ప్పుడే .anaximander అనే అతను సూర్య చంద్ర
నక్షత్రా లను అధ్యయనం చేశాడు .భూమి సిలిండర్ ఆకారం లో ఉంది అని చెప్పాడు. జంతువులూ ''తడి ''నుంచి
ఉద్భవించాయి అన్నాడు మనిషి ఒక రక మైన చేప నుండి ఆవిర్భా విన్చాడని భావించాడు .మన మత్సా
ఈ కా లం లో మేదావులందరూ తరచూ గా కలుసు కొంటూ తాము సాధించింది మిగిలిన వారికి తెలియ
జేస్తూ దాని పై తర్జన భర్జనలు చేస్తూ నిజాన్ని రాబట్టు కొనటం గొప్ప అలవాటు గా ఉండేది .అలా చేయటం వల్ల
ఎవరు యే రంగం లో ఏమేమి సాధించారో తెలుసుకొనే ఆవ కాశం లభించింది .తరు వాతి తరాల వారికి మార్గ
దర్శనం చేసి నట్లూ ఉండేది .హిపో క్రటిస్ కు ముప్ఫై ఏళ్ళ ముందు empedocles జన్మించాడు .ఆయన ప్రకృతి లో
నాలుగే నాలుగు మూల కాలున్నాయని వాటి వల్ల నే పదార్ధా లన్నీ ఏర్పడుతున్నాయని చెప్పాడు .అవే అగ్ని ,నీరు
,భూమి ,గాలి .వాటిని ఆయన మూలకాలు అన్నాడు కాని అవి సంయోగ పదార్ధా లు ,ఇవాళ మనకు117
మూలకాలున్నాయి .ఆయన భావన లో ఎముక అనేది నాలుగు భాగాల నిప్పు ,రెండు భాగాల నీరు ,రెండు
భాగాల మట్టి కలిస్తే ఏర్పడుతుంది .ఈ నాలుగు మూలకాల భావన చాలా కాలం గ్రీకు శాస్త ్ర వేత్తల దృష్టిలో ఉండి
పో యింది .
ఈ యుగాన్నే హిపో క్రటిస్ యుగం అన్నాం కదా మరి ఆయన వైద్య శాస్త్రా నికి చేసిన సేవ లేమిటో
తెలుసు కొందాం .ఆయన కాస్ దేశ వాసి .460 b.c.లో జన్మించాడు .వైద్య శాస్త ్ర పితామహుడు అనిపించుకొన్నాడు
.వైద్యాన్ని ఒక శాస్త ం్ర గా నిర్వహించాడు .ఆరోగ్యం ప్రకృతి ఇచ్చే వరం అన్నాడు వ్యాధులను వర్గీకరణ చేసి ''the
sacred diseases ''పేరా ఒక విభాగం రాశాడు .అలాగే హృదయం పైన విషయాలను క్రో డీకరించి చెప్పాడు .శరీరం
లో blood ,yello bile ,black bile ,pelgm '',అనే రసాలున్నాయన్నాడు .ఇవి నియంత్రణ ను కోల్పోతే శరీరాంకి
జబ్బు చేస్తు ందని అన్నాడు .on the nature of man లో వీటిని గురించి పూర్తిగా వివరించాడు .వైద్యాన్ని ''ఒక
కళ''గా గుర్తించిన మహానుభావుడాయన .ఆయన పుస్త కం లో మొదటి వాక్యాన్ని మనకు ఆయన రాశాడని
తెలీకుండానే ఉప యోగిస్తా ం ఆది ''life is short and the art is long ;''
వైద్యులకు నీ తి సూత్రా లు చెప్పాడు .రోగిని బ్రతికించే అన్ని ప్రయత్నాలు చెయ్య మన్నాడు .మంచి'' పధ్యం''
గురించి చెప్పాడు .ఎముకలు విరిగితే, కీళ్ళు జారితే చేయాల్సిన ప్రక్రియ లన్ని హిపో క్రటిస్ యుగపు వై ద్యు లకు
తెలుసు .వైద్యులు రోగం తగ్గించటానికి విశ్వ ప్రయత్నం చేయాలి ''the prime objective ofthe phy sician .in the
whole art of medicine should be to cure that which is diseased and if this can be accomplished in
various ways ,the least troublesome should be selected ''.అని డాక్టర్లకు జ్ఞా న బో ధ చేశాడు .వైద్యు లందరూ
వ్రు త్తి లో చేరే టప్పుడు ఒక ప్రమాణాన్ని చేయాలని శాసించాడు .అదే '' hipopocrates oath'' అనే పేర పిలువ
బడుతోంది .అందరు డాక్టర్లు ఆ ప్రమాణాన్ని చేస్తా రు .ఆది నిలుపు కోవా టా నికి మంచి వైద్యులు అందరు
ప్రయత్నిస్తా రు .ఒక తరాన్ని తన పేరు మీద పిలి పించుకొనే ఘనత హిపో క్రటి స్ కు దక్కింది .ఆయన కాలం
ఆకాలం లోగ్రీ కుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు .మధ్యధరా ప్రా ంతపు
ఎండ ప్రతి ఫలించ టానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు .కిటికీలు పై న ఎత్తు లో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు
గదులున్న ఇల్లు న్దే వి .ధనికుల ఇళ్లలో ఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దే వి .ఇంటి మధ్య ఖ్ఖా లీ
ప్రదేశానికి చుట్టూ గదులున్దే వి .భోజనం సాధారణ భోజనమే .చాలా తాజా గా ,రుచి కరమై న వాటినే తినే వారు .వేడి
ప్రా ంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గా లభించేవి .మాంసం తినటం
తక్కువే .మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగా ఉండేది
.భోజనం లో ద్రా క్ష సారా తప్పని సరి .
బానిసలు ఎక్కువ .యుద్ధా లలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద
భేదం నాలుగవ శతాబ్దా నికి పెరిగింది . అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి .ధనిక
పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికి పెరరిగింది.ఆడ వాళ్ల కు
హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది .ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం
.స్పార్టా లో మాత్రం స్త్రీలకు స్వాతంత్రం ఉండేది .అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమై న ,ఆరోగ్య వంత మై న
పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీ డలలో పాల్గొ నే వారు .బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు
.ఆడ పిల్ల లకు ఇంట్లో నే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లి చదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ
వారికి సమాన ప్రా ధాన్యత ఉండేది .
గ్రీ కు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ .నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల
ప్రదర్సనలు ఎక్కువ .అరిస్తో ఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లా స్ రాసిన ట్రా జెడీలు ప్రదర్శిస్తే జనం
బాగా చూసి ఆనందించే వారు ..కవిత్వం అంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి
.ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటి ట్రో జన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది
విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం .
క్రీ డలు గ్రీ కులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు .దేవత లను
ఆరాధించటం గ్రీ కు సంప్ర దాయం .చాంపియన్ క్రీ డా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ''క్లా సికల్
పీరియడ్ ''గా గుర్తి ంపు పొందింది .
ఇన్నీ ఉన్నా గ్రీ కులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధా లే .ఆ కాలం లో పర్షి యా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి
ఇరాన్ )అయోనియా భాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం .ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో
ఎన్నో గ్రీ కు వలస దేశాలున్నాయి .ఇవి పర్షి యా పై 499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి
స్టే ట్స్ సమర్ధి ంచాయి .డేరియస్ 1 అనే పర్షి యా రాజు వీటిని అణచి వేశాడు .అంతటి తో ఆగ కుండా నావల మీద
bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రా ంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు ,పర్శియన్లకు భీకర యుద్ధం
జరిగింది .గ్రీ కుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండా స్వదేశానికి పారి
పోయాడు .
.
480b.c. లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డా డు .తెర్మో పై ల్ అనే ఇరుకు ప్రా ంతం లో యుద్ధం
జరిగింది .స్పార్తా న్ సై నికులుమొదటి రోజు యుద్ధం లో పర్షి యన్ల అంతు చూశారు .ఒక గ్రీ సు మోస గాడు
పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు .పర్షి యన్లు గెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ
మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారి పోయారు .కనుక జన నష్టం జరగ లేదు
తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షి యన్లు చావు దెబ్బ తిన్నారు .ఈత రాక
సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షి యన్ సై న్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లో
పర్శియన్లను పూర్తి గా ఓడించేశారు .దీనినే battle of plataca అంటారు .యుద్ధా లు ముగిశాయి .గ్రీ కులకు
చారిత్రా త్మక విజయం లభించింది . 431b.c. లో మళ్ళీ కొత్త తగాదా .ఏథెన్స్ వాసుల ఆది పత్యాన్ని స్పార్టా
సహించ లేదు .సిటీ స్టే ట్స్ మధ్య తగాదాలు పెరిగాయి .స్పార్టా కోరింత్ లు కలిసి ఏథెన్స్ పై దాడి చేశాయి
.ఇదే pilopennessian war(ఏథెన్స్ ఓడిపో యింది ..స్పార్టా బలీయ మైన సిటి స్టేట్ గా అయింది .మోనార్క్
ల పాలన లో నిలబడింది స్పార్టా .ఏథెన్స్ ప్రజాస్వామ్యం ఎన్నో దశాబ్దా ల పాటు కడ గండ్ల పాలైంది .c
మాసి డో నియా కు సిటి హో దా అప్పటి దాకా లేదు .సామ్రా జ్యాధి పతుల అంటే మోనార్క్ ల ఏలుబడి లో
ఉంది .వంశ పారం పర్య పాలన ఉంది .359b.c.లో ఫిలిప్స్ రెండు అధికారానికి వచ్చాడు .చిన్న రాజ్యమైనా
పెద్ద వ్యూహాలున్న వాడు ఫిలిప్స్ .సైన్యాన్ని బలోపేతం చేశాడు .మంచి శిక్షణ నిచ్చాడు .అవసరమైన
ఆయుధాలను సమ కూర్చాడు .కొద్ది కాలం లోనే యూరప్ లోనే గ ర్వించ దగ్గ సైన్యాన్ని తయారు చేశాడు
.ఆమ్ఫీ పో లిస్ అనే గనులు అధికం గా ఉన్న కాలనీ ని వశ పరచుకొన్నాడు .అందులోని బంగారపు
గనులు అతనికి బాగా కలిసి వచ్చాయి .ఐశ్వర్యం పెరిగింది .చుట్టూ ప్రక్కల ఉన ట్రైబల్ కమ్యూనిటి లను
ఆక్రమించి మాసిడో నియా సామ్రా జ్యాన్ని విస్త రింప జేశాడు .ఇక సరి హద్దు లు దాటి విజయాలను
సాధించాలనే వ్యూహం లో ఉన్నాడు .అదికారానికి వచ్చిన పదేళ్ళ లోనే దక్షిణాన గ్రీస్ వరకు రాజ్య విస్త రణ
చేసి అందరికి పక్కలో బల్లెమైనాడు .
500-300b.c.కాలాన్ని'' క్లా సికల్ ఏజ్ ''అంటారు .గ్రీక్ సిటి స్టేట్ ల మధ్య భీకర యుద్ధా లు జరిగాయి
.గ్రీకుల ఐక్యతా కుదిరింది .అంతా ఒకే గొడుగు కిందకి వచ్చారు .మాసిడో నియా కు ఇది నిజం గా నే
సువర్ణా వ కశం .దానికి ఇప్పుడు ప్రపంచం మీద దృష్టి పడింది .అది గో అప్పుడే'' ప్రపంచ విజేత ''అవాలని
ఉవ్విల్లూ రిన ఫిలిప్ రాజు కొడుకు అలెగ్జా ండర్ పుట్టా డు .
బుసే ఫలస్(bucephalus)
ఈ పెరేక్కడిది అని కంగారు పడకండి .అది'' అలేగ్జా న్ద ర్ ది గ్రేట్ ''పంచ కల్యాణి గుర్రం పేరు .దీనికింత కధ
ఉందా?అని ఆశ్చర్య పడకండి .లేక పో తే మనకేందు కా సంగతి ?అలెగ్జా ండర్ తండ్రి ఫిలిప్ మాసిడో నియా
కు రాజు అని అందరికి తెలిసిందే .ఆయన ఒక జవనాశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి తెప్పించు కొన్నాడు .జాతి
,వంశం లెక్కలు అన్నీ చూసే తెప్పించాడు .తన దగ్గ ర ఉండవలసిన అశ్వం అని .కాని అది పొ గరు బో తు
.ఎవ్వరినీ దగ్గ రకు రానిచ్చేది కాదు .మీద చెయ్యి వేస్తె ఈడ్చి పెట్టి తన్నేది .చాలా మంది ఆశ్వికులు దాని
పని పట్ట టానికి ప్రయత్నించి ,కాళ్ళూ చేతులు పో గొట్టు కొన్నారు .తిండి పుష్టి నైవేద్యం నష్టి .మేపటం
తప్ప దేనికీ పనికి రాకుండా పో యింది .రాజు కు ఇక దాని మీద విరక్తి పుట్టింది .యెట్లా గైనా వదిలించు
కోవాలని ప్రయత్నం చేశాడు .బేరాలు పెట్టా డు .దాని సంగతి తెలిసి ఎవరూ కొనే సాహసం చెయ్య లేక
పో యారు .చివరికి ఏమీ పాలు పో క ఏదో విధం గా వది లించు కోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అదీ
లాభం లేక పో యింది .
ఇంతలో ఫిలిప్ రాజు గారి కుమారుడు అలెగ్జా ండర్ నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ప్రవేశించాడు
.అశ్వ శాల లో గుర్రా ల్ని పరి శీలిస్తు ంటే అతని దృష్టి దీని మీద పడింది .తండ్రి కి తన అభీష్టా న్ని తెలియ
జెప్పాడు .ఆయన కన్న కొడుకుతో ''నాయనా !ఈ గుర్రం మంచి జాతిది అని కొన్నాను .కాని వచ్చి
నప్పటి నుండి అది ఎవరికి అలవి కాలేదు .దగ్గ రకే రానివ్వటం లేదు .దాన్ని వది లించు కోవటమే
మంచిదని పించింది .కనుక దాని జోలికి వెళ్ళద్దు .ఇంకో జాతి గుర్రా న్ని ఎన్నిక చేసుకొని స్వారి చెయ్యి
''అని హితవు పలికాడు .కొడుకు తండ్రి మాట విన్నాడు కాని తన మనసులోని విషయాన్ని తెలియ
జేశాడు .''నాన్నా !గుర్రా లకు హృదయం ఉంటుంది .అందులో మీరు ఎంపిక చేశా రంటే దానికి ఎన్నో
మంచి లక్షణాలు ఉండే ఉంటాయి .అయితే నాదొ క విన్నపం .గుర్రా నికి తనను ఎవరు లొంగ దీయ గలరో
తెలుస్తు ంది .అలాంటి వీరుడి కే అది లొంగి నిల బడుతుంది .గుర్రా నికి కూడా సమర్ధు డు తనను అధి
రోహించాలను కొంటుంది. చెప్పిన మాట వింటుంది .కనుక దాన్ని లొంగ దీసే బాధ్యత ను నాకు వదిలి
పెట్టండి .దాన్ని అమ్మటం మాత్రం చేయ కండి ''అని నెమ్మదిగా చెప్పాడు .''సరే నీ ఇష్ట ం .నీ ప్రయత్నాన్ని
నేను ఆప బో ను .నీకూ లొంగక పో తే దాన్ని ఏదో ఒక రేటు కు అమ్మి వదిలించు కొంటాను ''అన్నాడు
.సరే నన్నాడు కొడుకు .
బుసే ఫలాస్ ను అందం గా అలంకరించి కొలువు దగ్గ రకు తెచ్చారు .అలేగ్జా ండర్ దాని దగ్గ రకు వచ్చి చెవి
లో ఏదో ఊదాడు .ముందుకు వచ్చి ముక్కులో నోటి లో వ్రేళ్ళు పెట్టా డు .అసలు మనుష్యుల్ని దగ్గ రకే
రానివ్వని గుర్రం ఇవన్నీ చేస్తు ంటే మైనపు ముద్దా లా ఒదిగి పో యింది .వీపు మీద చెయ్యి వేసి నిమి
రాడు .అంతే మంత్ర ముగ్ధ లాగ గుర్రం లొంగి పో యింది .అమాంతం గుర్రం పైకి లంఘించి ఎక్కి
కూర్చున్నాడు అలెగ్జా ండర్ .అది ఒక్క సారి సకిలించి ఆఘ మేఘాల మీద దౌడు తీసింది . .మెరుపు వేగం
తో దూసుకొని పో యింది .సభాసదులు ,రాజు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పో యారు .యువరాజు కే
మైనా ప్రమాదం సంభ విస్తు ందేమో నని శంకించారు .అది పంచ కల్యాణి లా దూకి మళ్ళీ యదా
స్థా నానికిఅరగంట తర్వాత మళ్ళీ సకి లించు కొంటూ అక్కడికి చేరింది .నవ్వుతు యువ రాజు దిగాడు
.జైజై ద్వానాలలో ప్రజలంతా హర్షా న్ని తెలియ జేశారు .అప్పుడు ఫిలిప్ రాజు తన కొడుకు అలెగ్జా ండర్ ను
దగ్గ రకు తీసుకొని చాలా గొప్పగా అభినందించి ''కుమారా !నీకు ఈ రాజ్యం సరి పో దు .కనుక ఇంకో
రాజ్యాన్ని చూసుకో ''(this country is not enough for you .Find out another'')అని కుమార రత్నానికి
భవిష్యత్తు ను నిర్దేశించాడు .తగిన వీరుడు తనకు లభించాడని ఆశ్వమూ ,తనకు తగిన గుర్రం లభించిందని
అలెగ్జా ండర్ సంబర పడ్డా రు .
వీరిద్దరి స్నేహం ఎంతో కాలం నిలిచింది .విశ్వ విజేత అవ్వాలన్న అలేగ్జండర్ మనసు గుర్రా నికీ తెలుసేమో
.చాలా సేవ చేసింది .ఎన్నో యుద్ధా లలో అది అతనికి విజయాన్ని చేకూర్చింది .అలెగ్జా ండర్ అందరిరాజుల్లా
కాకుండా స్వయం గా సైన్యాన్ని నడిపి యుద్ధా లు చేశాడు .అతని విజయాలకు అది భాగ స్వామి
అయింది .సుదీర్ఘ యుద్ధా లలో అది సుమారు 25,000k.m.దూరం తన స్వామి తో ప్రయాణం చేసి , అలసి
పో యి చివరికి 326b.c.లో సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో తన నేస్తం ప్రియ అలెగ్జా ండర్ ను
వదిలి తుది శ్వాశ పీల్చింది .battle of hydraspes యుద్ధ ం తర్వాత దాని మరణం సంభవించింది
.అలెగ్జా ండర్ దుఖం వర్ననాతీతం .కుమిలి పో యాడు .మనసును చిక్క పట్టు కో లేక పో యాడు .అప్పటికి
అతను పర్షియా ను జయించి ఇండియా దాకా వచ్చాడు .దాని అంత్య క్రియలను ఎంతో వైభవం గా
జరిపించాడు .దానికి మనసారా కృతజ్ఞ త లను తెలియ జేశాడు Hydespas నది ఒడ్డు న ఒక
నగరాన్ని''బూసా ఫాలియా'' పేరు మీద నిర్మించి కృతజ్ఞ తలు తెలుపు కొన్నాడు . ఈ నగరం జీలం నది
ఒడ్డు న ఉంది .అదీ అలెగ్జా ండర్ గుర్రం'' బూసే ఫలస్ ''కధ .
300b.c.నాటికి పర్షియా రాజ్యం ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యం గా ఉంది .ఇవాల్టి మధ్య ఇరానే ఆనాటి
పర్షియా .భారత దేశం వరకు వ్యాపించింది .పడమర మధ్య ధరా సముద్రం ,ఉత్త రాన నేటి తార్కి ,దక్షిణాన
ఈజిప్ట్ ,లిబియా ల మధ్య విస్తా రించిన సువిశాల సామ్రా జ్యం పర్షియా సామ్రా జ్యం .డెబ్భై దేశాలను
జయించి జయ పతాకాన్ని ఎగుర వేసిన రాజ్యం .మేదిస్ ,పార్దియన్లు ,బాక్త్రియన్లు ,బాబి లోనియన్లు
,అసీరియన్లు ,ఈజిప్షియన్లు ఉన్న రాజ్యం .వీరివి వివిధ భాషలు .ఆరోమిక్ ,మీడియన్ ,పాత పర్షియా
భాషలను ఎక్కువ మంది ప్రజలు మాట్లా డే వారు .
అనేక ముఖ్య పట్నాలను కలిపే 2,400 కి.మీ .''రాయల్ రోడ్ ''తూర్పు పడమర లకు వ్యాపించి ఉంది .ఈ
రాజ్యానికి పెర్సి ఆలిస్ ,సుసా ,ఆర్ష గాదే ,అనే మూడు రాజ దానులున్డ టం విశేషం .పర్షియా రాజును ''గ్రేట్
కింగ్ ఆఫ్ పర్షియా ''అని గౌరవం గా పిలుస్తా రు .రాజరికం వంశ పారంపర్యం .పెద్దల యెడ గౌరవం ఎక్కువ
.రాజుకు వంగి వంగి సలాం చేయటం ఆచారం .అందరు రాజు ముందు వంగి నిలబడాల్సిందే .ఆస్థా నం లోని
వారిని ,సంమానితులను రాజు ముద్దు పెట్టు కొనే సంప్రదాయం ఉంది .
స్థా నిక పాలకులను సాత్రపులు అంటారు అంటే గవర్నర్లు .సత్రపి అనే నిర్ణీత భూభాగానికి అతను అది పతి
.రాజు తరఫున పాలిస్తా డు .రాజు వీరి పరిపాలనా సామర్ధ్యాన్ని తెలుసు కోవటానికి చార చక్షువులను
ఏర్పాటు చేస్తా డు .వీరే రాజు కు కళ్ళు ,చెవులు .మంచి న్యాయ వ్యవస్థ ఉండేది .దీన్ని సైరస్ రాజు
ఏర్పాటు చేశాడు .''he would allow his subjects to continue to following their own faiths and
other traditional practices''అని చరిత్ర కారులు రాశారు .అంతే కాదు దీనినే ''official charter of
human rights''అని గొప్పగా కీర్తించారు .అంత ఉదార హృదయం తో రాజ్య పాలన సాగేది .
పర్షియన్లు pantheon అనే సామూహిక దేవత లను పూజిస్తా రు .సముద్రం ,భూమి ,గాలి ,ఆకాశం వాళ్ల కు
ఆరాధ్య దేవతలు .achemendis కాలం లో జోరాష్ట్రియాన్ మతాన్ని అవలంబించారు .ఇప్పుడు
జోరాష్ట్రియాన్ ఒక్కడే దేవుడు .సర్వ సమర్ధు డు ,సర్వ వ్యాపకుడు ,సర్వ శక్తి మంతుడు ''ఆహూరా మజ్దా
''అని ఆయన బో ధించాడు .అగ్ని ని పూజిస్తా రు .రాజు తాను దేవతల ప్రభావం తో పాలిస్తు న్నానని
నమ్ముతాడు .అంటే రాజు దైవాంశ సంభూతుడు అన్న మాట .వీళ్ళ మత గ్రంధం జెండ్ అవెస్తా .
ప్రజలు రెండు అంతస్తు ల ఇళ్ళ లో నివ సహించే వారు .కాల్చని ఇటుక లతో ఇల్లు కట్టే వారు .దానికి తెల్ల
సున్నం పూసే వారు .లోపల రంగులు వేసుకొనే వారు .ఎత్తైన ప్రహరీ గోడ ఉండటం సహజం .ఇంటికి తోట
కూడా ముఖ్యం .గులాబి ,నిమ్మ చెట్లను పెంచే వారు .నీటిని చిమ్మే ఫౌంటెన్స్ ఉండేవి .సాధారణ భోజనమే
చేసే వారు .బార్లి ,గోధుమ ,లింతెల్స్ ,బీన్స్ ,వీరి ఆహారం .వెన్న ,పెరుగు తినే వారు .మేక మాంసం
,చేపలు తినే వారు .కాయగూరలను బాగా పండించే వారు .ఖర్జూ ర,పియర్స్ పళ్ళు లభ్యం .వైన్సేవించే
వారు .ఇది ఖర్జూ రం తో చేస్తే మహా ప్రశస్త మైనది గా భావించే వారు .
మంచి కుటుంబ వ్యవస్థ ఉండేది .బహు భార్యాత్వం మామూలే .పిల్లల్ని ఎక్కువ గా కనే వారు .మగ పిల్ల
లంటే ముద్దు .ఆడవారికి స్వాతంత్రం ఉంది .ఉద్యోగాలు చేసే వారు .ఉన్నత ఉద్యోగాల్లో నూ మహిళలు
రాణించే వారు .ఆడ పిల్లలు బడి కి వెళ్లటం తక్కువే .ఇంటి పనులు నేర్చే వారు .వ్యాపార వాణిజ్యాలు ఈ
దేశం లో ఎక్కువే .సరకు రవాణా జాస్తి .మంచి రహదారి సౌకర్యం ఉండటం తో సరుకు త్వరగా చేరేది
.వ్యవసాయం చేయటం ,చిన్నా ,చితకా పనులు చేయటం బానిసల పనే .రోడ్ల నిర్మాణం భవనాల నిర్మాణం
వీరే చేస్తా రు .
పర్షియా లో achaemends కాలం లో కళలు బాగా అభి వృద్ధి చెందాయి .అసలు ఆయనే ఒక గొప్ప కళా
కారుడు .పెర్సిపో లిస్ నగరాన్ని అత్యంత సుందరం గా ,సకల సౌకర్యాలతో వైభవో పేతం గా నిర్మించాడు
.ఇదే మొదటి డేరియన్ రాజు గారి రాజధాని .బలీయ మైన సామ్రా జ్యం గా పర్షియా ఉండేది .శత్రు దుర్భేద్య
మైన కోటలున్దేవి .సమర్ధ వంత మైన రాజుల పాలన ,సుస్తిర రాజ్య వ్యవస్థ దానికి బాగా కలిసి వచ్చాయి
రాజ్యం సకల సౌభాగ్య విలసితం గా ఉండేది .ప్రజలు కూడా భోగ భాగ్యాలతో సుఖం గా ఉండే వారు .ఆర్ధిక
స్తితి అద్భుతం .
అయితే రోజులేప్పుడు ఒకే రీతి గా ఉండవు కదా .385b.c.నాటికి అస్తిరత్వం ఎక్కువైంది .మూడవ ఆటా
xerxes తన కుటుంబం లోని తనకు శత్రు వు లని పించిన బంధువు లందర్నీ చంపి రాజు అయ్యాడు
.రక్త పు కూడు తిన్నాడు .అతని ఇరవై ఏళ్ళ పాలన అంతా ఒడి దుడుకులే .326 b.c.లో మూడవ
డేరియస్ మాయో పాయాలతో రాజయ్యాడు .issus వద్ద జరిగిన యుద్ధ ం లో అలెగ్జా ందర చేతిలో ఒడి
పో యి మధ్య పర్షియా చేరాడు .మళ్ళీ సైన్యాన్ని సమ కూర్చుకొని 331 లో బాబిలాన్ కూడా వదిలి వెళ్లి
పో యాడు .అలెగ్జా ండర్ ముందుగా కొంత సేనను పంపి ,యూఫ్రా స్ నదికి వంతెన కట్టించి ,మెస
పో తెమియా అంటే ఇవాల్టి సిరియా ,ఇరాక్ ల మీదుగా ఇక్కడికి వచ్చి టైగ్రెస్ నది దాటి వెళ్లా డు .ఇక్కడే
మానవ నివాసం 7000 b.c.కే ఉండేదని చరిత్ర కారుల కధనం .దీనినే'' cradle of civilization ''అంటారు
కొందరు కొన్ని పనుల కోసం కారణ జన్ములు గా పు డతారేమో నని పిస్తు ంది .వారి వల్ల నే ఆ కార్యాలు
పూర్తీ అయి ,లోకో పకారకమ్ అవుతాయి .అలాంటి వారిలో Demetrius Phalerius ఒకడు .క్రీ.పూ.350-
360 మధ్య ఫేలేరిం లో జన్మించాడు .తండ్రి, కానేన్ అనే వాడి బానిస .ఏధెన్స్ కు చేరాడు .అరిస్టా టిల్ ఆఫ్
స్తా జీరియ -లైసియం లో చదువు కున్నాడు .తియోఫ్రో తాస్ కు సహాధ్యాయి .317 లో'' దేస్పాట్ ఆఫ్ ది
సిటీ ''అనే పదవిని పొ ందాడు .జనాభా సేకరణ ,చట్టా ల రూప కల్పనా ,రాజ్యాంగ నిర్ణ యాల లో
సహకరించాడు .ఆనాటి వేదాంతులకు స్నేహితుడు అయాడు .అతను అందరికి తలలో నాలుక గా ఉండే
వాడు .అతనికి ఎంత గొప్ప పేరు వచ్చిందో తెలియ జేయటానికి ఒక చిన్న ఉదాహరణ -దేమేత్రియాస్
విగ్రహాలను మూడు వందలు నెల కొల్పి అతని సేవలను ప్రజలు ప్రస్తు తించారు .307 b.c. లో ఇదే పేరు
గల దేమోత్రేస్ పో లియార్సిస్ అనే వాడు ఇతనిని ఉద్యోగం నుంచి బర్త్ రఫ్ చేసి ,ఏథెన్స్ ను వశ పరచు
కొన్నాడు .
ఏదో కాస్త కనిక రించి తేబ్స్కు వెళ్ళటానికి మాత్రం పాస్ ఇచ్చాడు .అక్కడికి చేరి గ్రీకు తొలి కవి ,అందకవి
అయిన హో మర్ గురించి చది వాడు .ఎన్నో విషయాల మీద పుస్త కాలు రాశాడు .మళ్ళీ ఏధెన్స్ వెళ్ళే
వీలు లేదని తెలుసు కొని ,అలెగ్జా ండ్రియా చేరాడు .ఇది క్రీ.పూ.331 లో నైల్ నది డెల్టా కు పడమర ఉన్న
అలెగ్జా ండర్ పేర వెలసిన పట్ట ణం .దీన్ని ర్హో డేస్ కు చెందిన''దినోకేరేస్''అనే ఆర్కిటెక్ట్ నిర్మించిన అతి
సుందర నగరం .ఇందులో మాసిదో నియాన్ చార్మిస్ లను ఏర్పాటు చేశారు .గుర్రం పైన ఉన్న యోధుడి
చేతి లో కాగడా ఉండటం దీని చిహ్నం .ఇందులో అయిదు జిల్లా లున్నాయి . గ్రీకు లిపి లో మొదటి
అయిదు అక్షరాల పేర్లు వాటికి పెట్టా డు .దీనిని Alegjaander the king born of god founded it '' గా
భావిస్తా రు .
దేమ్మేత్రియాస్ టా లమి రాజ దర్బారు లో ఉద్యోగం పొ ందాడు .అప్పుడు ఈజిప్ట్ రాజు మొదటి
టాలమి.ఇతను 307 b.c.లో పుట్టా డు .ఇతడు అలెగ్జా ండర్ సైనికాధి కారుల్లో ఒకడు .ఇతనికి
''సో టర్''అంటే రక్షకుడు అని బిరుదు ఉంది .ఎనభై ఏడేళ్ళు జీవించాడు .దేమేత్రియాస్ రాజును రాజ్యం
,రాజ్య పాలన ,శిక్షా స్మృతి మొదలైన పరిపాలనా సంబంధించిన విషయాల పై పుస్త కాలను చదవమని
చెప్పేవాడు .''స్నేహితులే వరు చెప్పలేనివి పుస్త కాల లో ఉంటాయి ''అని హితవు చెప్పాడు .రాజకీయ
కళ(art of politics )మీద పుస్త కాన్ని ptolemy అనే పేరా తానే రాశాడు .రాజును ఒక మ్యూజియం
ఏర్పాటు చేయమని కోరాడు .అది రాజ ప్రా సాదం లో భాగం గా ,ఈజిప్ట్ సంస్కృతికి విలసనం గా ,గ్రీకులకు
ఇష్ట మైనదిగా ,టాలమీ గౌరవ చిహ్నం గా నెలకొల్పాలని వివ రించాడు .
టాలమీ రాజు కు ఈ సూచన బాగా నచ్చింది .వెంటనే అమలు జరపటానికి పూను కొన్నాడు
.దేమేత్రియాస్ సలహాలను పాటిస్తూ అత్యంత వైభవో పెత మైన గ్రంధాలయం తయారు చేయించాడు
.మొత్త ం బాధ్యత అంతా దేమేత్రియాస్ మీద నే పెట్టి ఆర్ధిక విషయాలు తాను చూస్తూ ,ఏ లోటూ రాకుండా
వెన్నంటి నిలిచాడు రాజు .ఇద్ద రి సుందర స్వప్నం సాకారం అయింది .letter from Aristotle to
Philocrates వరకు అంటే 2 b.c.వరకు అన్ని పుస్త కాలను సేకరించాడు .దీని నిర్వహణకు దేమేత్రియాస్
ఫిలోక్రేతెస్ అది కారి గా రాజు నియమించి తగిన గౌరవాన్ని కల్పించాడు .దీనినే రాజ గ్రంధాలయం (king's
library )అన్నారు .రాజసం లోను ఆకారం లోను అది నిజం గా కింగ్ అని పించుకోన్నది .పుస్త కాలు కోన
టానికి ఎంత డబ్బు కావాల్సి వస్తే అంతా ఇచ్చే వాడు రాజు .ఎక్కడా లేని పుస్త కాలు ఈ గ్రంధాలయ రాజం
లో ఉండాలన్న తపన .''if possible all books in the world ''అలెగ్జా ండ్రియా గ్రంధాలయం లో ప్రపంచం
లోని అన్ని గ్రంధాలు ఉండాలని రాజు గారి భావం .అప్పటికే అయిదు లక్షల పుస్త కాలను సేకరించాడు
దేమేత్రియాస్ .పుస్త కాలకు ప్రతులు రాయటానికి ఎన్నో టెక్నిక్ లను అతడు వాడాడు .రాజు టా లమి కి
యూదులు అంటే జూస్ తో సత్సంబందాలున్దేవి. ఆ మత గురువు లతో సంప్రదంి చి అనువాదకులను
పంపించే ఏర్పాటు చేయించాడు .72 మంది వచ్చి ,72 రోజులు పని చేసి జ్యూ ల మత గ్రంధం torah లో
genesis నుండి malachu వరకు అనువాదం చేశారు .వారందరికి వసతి భోజన సౌకర్యాలు కల్పించారు
.వాటిని పాపిరాస్ పై కాపీలు గా రాయించారు .వారందరికి విలువైన బహు మతులిచ్చి సగౌరవం గా
వీడ్కోలు చెప్పారు .దీని పర్య వేక్షణ అంతా దేమేత్రియాస్ డే .దీనినే the cage of the muses ''
అన్నాడాయన .ఇతర దేశాస్తు లేవరైనా అలెగ్జా ండ్రియ వస్తే వాళ్ళ దగ్గ రున్న పుస్త కాలను అప్పగించి ,వాటి
నకలు రాసుకొన్న తరు వాతే తీసుకొని వెల్ల నిచ్చే వారు .అలా అనంత అక్షర సంపద అక్కడ
నిక్షిప్త మయింది .సరస్వతీ మహా సామ్రా జ్యానికి తాలమి మహా రాజు అయితే దేమేత్రియాస్ ప్రధాని .
ప్రా చ్య దేశాలలో గ్రంధాలన్నీ దేవాలయాలలో ఉండేవని మనకు తెలిసిన విషయమే .అందుకనే వీరు
ఇక్కడ దీన్ని ''గ్రంధాలయం ''అన్నారు గౌరవ సూచకం గా (place of learning -a
temple ).అలెగ్జా ండ్రియా గ్రంధాలయానికి మొదటి డైరెక్టర్ దేమేత్రియాస్ కాదు .zinodotus of Ephesus -
(325-260 b.c.)ఈయన హో మర్ ,హీసాయిడ్ గ్రంధాలను ఎడిట్ చేయించాడు .ఇతనే హో మర్ గ్రంధాన్ని
ఇరవై నలుగు విభాగాలుగా చేశాడు .అందులో life of homer ఒక భాగం .హో మేర్ గురించి సమస్త
వివరాలు ఇందులో ఉన్నాయి .
తరువాత అపో లోనియాస్ జోడియాస్ (295 B.C.)అధికారిగా ఉన్నాడు .హో మర్ కవి గ్రంధాల లోని
వ్యాకరణ దో షాలను పరిష్కరింప జేశాడు మూడవ .తాలమీకి గురువు అయినా ,రాజు ఇతన్ని తప్పించి ,
ERESTHONES( 276-195 B.C.( కు బాధ్యతలు అప్పగించాడు . ఇతను సైన్స్ ఫిలాసఫీ చదివిన వాడు
.భూమి పరిధి 2,52 ,000 STAADRIYA లేక 29,000 మైళ్ళు అని చెప్పాడు .ఇవాల్టి లెక్క ప్రకారం
24,900 మైళ్ళు .
ఇంత మంది మహాను భావులు కంటికి రెప్ప లాగా కాపాడి నిర్మించి ,పెంచి పెద్దది గా చేసిన సర్వ మాన
వాలికీ ఉపయోగ కారక మైన ఈ బృహత్ గ్రంధాలయం 48 B.C.లో ఈజిప్షియన్ దండ యాత్ర లో
తగలబడి ధ్వంసమయింది . .సుమారు నలభై వేల అత్యంత విలువైన గ్రంధాలు మండి మసి అయాయి .
సేనేకా అనే మహా వేదాంతి నీరో చక్ర వర్తి గురువు ఈ విషయాన్ని ధ్రు వ పరచాడు .
అతని పార్టి ఫాసిస్ట్ పార్టి .ఫాసిస్ట్ ఇటలి ని గ్రేట్ పవర్స్ లో ఒకటి గా చేయాలన్నదే ముసో లిని మనోగతం
..ప్రజలందరికి ‘’ఐడెంటిటి కార్డ్ లు ‘’ఇచ్చిన ఘనత ముస్సోలినీదే .1930 లో వచ్చిన ప్రపంచ వ్యాప్త
డిప్రెషన్ నుండి ఇటలీని ఒడ్డు కు చేర్చేందుకు ,సంక్షోభ నివారణకు the battle of the lire ‘’కార్యక్రమాన్ని
చె బట్టా డు .లైర్అనేది ఇటాలి నాణెం .దీనితో ఇటలి లీరా విలువ తగ్గ కుండా కాపాడాడు ..వస్తు వుల
ధరలను తగ్గించాడు .సబ్సిడీలను పెంచాడు .అందువల్ల మద్య ,పేద తరగతుల వారు బతికే అవకాశం
బాగా కలిగింది .ముసో లిని పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగింది .
ఆర్ధిక సంక్షోభం దిగుమతులపై ప్రభావం చూపిస్తు ంది .దీనికి విరుగుడు గా ‘’the battle of
wheat ‘’కార్యక్రమం మొదలు పెట్టా డు .అధికోత్పత్తి దీని ధ్యేయం .తాను కూడా రైతు వేషం వేసుకొని
పో లాల లోకి వెళ్లి రైతుల్ని ప్రో త్సహించి కష్ట పడి పని చేయించి దిగుబడి అధికం చేయించాడు .దున్నాడు
,విత్త నం వేశాడు కోతలు కూడా కోశాడు .ప్రపంచం అంతా ఆర్ధిక సంక్షోభం లో కొట్టు మిట్టా డు తుంటే ఇటలి
ప్రజలు హాయిగా నిమ్మకు నీరెత్తి నట్లు ఉన్నారు .పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండాయి .ప్రపంచ దేశా
లన్నీ ఇటలి వైపు కు ఆశ్చర్యం గా చూశాయి .ఈ గోధుమ యుద్ధ ం అత్యంత విజయ వంతమయింది
.1933 నాటికి దిగుమతులు రెండు లక్షల ఇరవై వేలనుండి ఒక్క సారిగా పదిహేను వందల టన్నులకు
చేరింది .ఇంత గొప్ప మార్పు ఆ కాలం లో యే దేశం లోను రాలేదు .ఇటలీ హీరో అయాడు ముసో లిని .
చిత్త డి నే లలు ఎందుకు పనికి రాకుండా ఉండేవి .వాటికి నీటి సౌకర్యం కల్గించాడు .తొమ్మిది
మిలియన్ల ఎకరాలను అదనం గా సాగు లోకి తెచ్చిన ఘనత ముస్సోలినిదే .రొమ్ కు తెర్రసన
ి ామధ్య
ఉన్న మలేరియా వ్యాధి విపరీతం గా వ్యాపించి ఉండే ఒక లక్ష యాభై వేల ఎకరాల చిత్త డి నే లల్ని పంట
పొ లాలుగా మార్చి మలేరియా ను నిర్మూలించట మే కాక ,సాగు భూమి విస్తీర్ణా న్ని పెంచటం సాహసో పెత
మైన చర్య .వాటిల్లో దేశం మొత్త ం మీద ఉన్న దేబ్భై వేల కుటుంబాలకు నివాసం కల్పించాడు .ఆరు కొత్త
పట్ట ణాలను నిర్మించాడు ‘’.il duce’’అంటే ‘’మహానాయకుడు’’అని పించు కొన్నాడు .
ఇటాలి జనాభా పెంచాలి అనే ఉద్దేశ్యం తో ‘’battle of the people ‘’ అనే జనాభా పెంచే కార్య క్రమం
చేబట్టా డు .ఇటాలి జనాభాను నాలుగు కోట్ల నుండి ఆరు కోట్ల కు పెంచగాలిగాడు ..ఇలా చేస్తే తప్ప
పురాతన రోమన్ సామ్రా జ్యానికి ఉన్న ఘనత సాధించలేమని అతని ఉద్దేశ్యం .అదే అతని కల కూడా
.ఉన్న జనం లో సగమైనా పెరగాలని భావించాడు .ఖచ్చితం గా అలానే జరిగింది .మహిళలకు పిల్లల్ని
కన టానికి ప్రో త్సాహాలు ఇచ్చాడు .పెళ్లి చేసుకొని బ్రహ్మ చారులకు పన్ను విధించాడు .ఎక్కువ సంతానం
కన్నా సంతాన లక్ష్ములు కు బహుమతులు అంద జేశాడు .93 మంది మహిళలు 1300 మంది పిల్లల్ని
కన్నారు .వారందరినీ పిలిచి ఘన సత్కారం చేశాడు .ఆరోగ్యం ,మాత్రు సంరక్షణ ,పసి పిల్లల మరణాలను
తగ్గించటం వంటి ఎన్నో పనులు చేశాడు ..దీనికి కొంత రాజకీయ కారణం కూడా ఉంది .ఇటాలి లో రాజ
కీయ సంక్షోభం పెరిగి జనం ఇతర దేశాలకు వలస పో వటం జరిగింది .
అమెరికా ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ,ఇంగ్లా ండ్ ప్రధాని చామర్లేన్ ,లు ముసో లిని అంటే వీర
అభిమానం పెంచు కొన్నారు .గాంధీ మహాత్ముడు ముసో లిని ని ‘’సూపర్ మాన్ ‘’అన్నాడు .కాంటర్ బేరి
చర్చి ఆర్చి బిషప్ ‘’యూరపు లీడర్ల లో ముసో లిని అత్యున్నతుడు ‘’అన్నాడు .greatest genius of
modern times ‘ ’ అన్నాడు థామస్ ఎడిసన్ ‘అన్నిటా చితికి పో యిన ఇటాలి దేశాన్ని పేదరికం నుండి
ఒద్దే క్కించిన మహానాయకుడు అన్నాడు అమెరికన్ బాంకర్ ఆటో కాం.. ‘’చర్చిల్ కు ముసో లిని ముందు
చుట్ట కాల్చే ధైర్యం లేక పో యింది .అతను ముసో లిని సంతకం చేసిన ఫో టో తనకు ఇమ్మని కోరితే
తిరస్కరించాడు ముసో లిని .హిట్లర్ కు ముసో లిని అంటే వీరాభి మానం .ముసో లిని తనకు దేశ
విదేశాలనుండి రెండు మిలియన్ల ప్రజలు ఉత్త రాలు రాస్తే అందరికి సమాధానం రాసి హృదయాలను గెల్చు
కొన్నాడు .ప్రపంచం మొత్త ం మీద 35 వేళ గ్రీటింగ్ కార్డు లను క్రిస్మస్ పండుగ రోజు అందు కొన్న ఏకైక
నాయకుడని పించు కొన్నాడు .1920-30 కాలం లో ప్రపంచం మొత్త ం మీద ‘’సర్వోత్త మ నాయకుడు’’
అని పించు కొన్నాడు ముసో లిని .
వెనిస్ ను దేశం ప్రధాన వాహిని కి కలిపే బృహత్త ర కృషి చేశాడు .నాలుగు వేళ
మైళ్ళ రోడ్ల నిర్మాణం చేశాడు .అనేక ఆక్విడేక్ట్ లు కట్టించాడు .అపూలియా భూములకు నీటి పారుదల
సౌకర్యం కల్పించాడు ..నాలుగు వందల బ్రిడ్జి లను నిర్మింప జేశాడు .సకాలం లో రైళ్ళు నడిచే టట్లు
చేశాడు .టెలిఫో న్ వ్యవస్థ ను ఆధునీ కరణం చేశాడు .పో స్టా ఫీసులు ,గవర్న మెంట్ ఆఫీసులకు లెక్కే లేదు
.అయిదేళ్ళలో రోమన్ సామ్రా జ్యం ‘’marvel to nations of the world ‘’అవాలని ముసో లిని ధృఢ
వాంచ.అదే అతని నినాదం .పూర్వపు ఆగస్ట స్ సామ్రా జ్యం లా అతి విశాల ,క్రమశిక్షణ గల శక్తి వంత మైన
సామ్రా జ్య నిర్మాణమే తన ధ్యేయం అని పదే పదే ముసో లిని చెప్పే వాడు .ప్రజలను జాగృతం చేసి ప్రేరణ
కల్గించే వాడు .దీని కోసం తనకు సర్వాధి కారాలు కావాలను కొన్నాడు .పొ ందాడు .దాని తర్వాతే ఇటలీ
పునర్నిర్మాణం ప్రా రంభించి విజయం సాధించాడు
ముసో లిని కి ముందున్న పార్ల మెంట రి ప్రభుత్వం మాఫియా గ్రూ పులను అదుపు లో పెట్ట లేక
పో యింది .ముసో లిని కాలం లో హత్యలు 278 నుండి కేవలం ఇరవై అయిదు కు తగ్గా యి అంటే ఎంత
కఠినం గా రౌడీ షీటర్ల విషయం లో వ్యవహరించాడో తెలుస్తో ంది .ముసో లిని తర్వాతా మళ్ళీ ఎవరు
వాళ్ళను నియంత్రించ లేక పో వటం వల్ల మాఫియా గాంగ్ చేల రేగి పో యింది .1 వేల ప్రభుత్వ ప్రా ధమిక
విద్యాలయాలు నేల కోల్పాడు ముసో లిని .నగరాలలో ని పిల్లలకు ‘’సమ్మర్ కాంప్ పు ‘’లు ఏర్పాటు
చేశాడు . 1930 నాటికి ఇటాలి ప్రజలు అత్యంత సంపన్నులయారు .ఇరవై వ శతాబ్ద ం లో ఇటాలి ప్రజల
జీవితం అన్ని విధాల మెరుగైంది .ఆ కాలాన్ని ‘’the halcyon years ‘’ అంటే మన భాష లో స్వర్ణ యుగం
అని ప్రపంచం అంతా భావించింది .
పార్ల మెంటరి సాంప్రదాయం లేక పో యేసరికి ,ఏక వ్యక్తీ పాలన రావటం వల్ల హింసా కాండ తగ్గ్గింది
.ముసో లిని ప్రపంచ ప్రసిద్ధ రాజ కీయ వేత్తగా ప్రశంసలు పొ ందాడు .ఇతర దేశాల నుండి నాయకులు ఇటలీ
వచ్చి ,ఇక్కడి అభి వృద్ధి చూసి మెచ్చు కొన్నారు .కాని ముసో లిని యే ఇతర దేశాన్ని ఇంత వరకు
సందర్శించక పో వటం ఆశ్చర్యం .mussolini does not want advice-he only wants applause ‘’అని
ఒక అందర్ సెక్రెటరి అన్నది .అదీ ముస్సోలిని అంటే .ముసో లిని మహా వేగం గా కారు నడపటం అంటే
ఇష్ట ం .ఆ నాడు ప్రతి స్కూల్ లో ప్రతి క్లా స్ రూం లో ముస్సోలిని ఫో టో లున్దేవి .ఉదయం జరిగే స్కూల్
ప్రా ర్ధ న లో ముందు ముసో లిని ,ఆ తర్వాతే జీసస్ ప్రా ర్ధ న పిల్లలు చేసే వారట .
ఇంత గొప్ప ప్రజా పాలకుడు అయిన ముసో లిని రెండవ ప్రపంచ యుద్ధ ం లో అనవసరం గా ఇటలి ని
యుద్ధ ం లో దూర్చి ఓడి పో యి ప్రజా పరాభవం పొ ంది ,నిర్దా క్షిణ్యం గా కొత్త గా అధికారం లోకి వచ్చిన
సో షలిస్టు ల చేత కాల్చి చంప బడటం విధి లీల.
ఆమె అసమాన సాహస మహిళ .మడమ తిప్పని కార్మికోద్యమ నాయకురాలు .ఎక్కడ
కార్మిక ,శ్రా మిక సమస్య వచ్చినా అక్కడ వాలి ,పరిష్కారానికి మార్గ ం సులభం చేసిన
దీరోదాత్తు రాలు వివేచనా సంపన్నురాలు .బాలకార్మిక విమోచానానికి కంకణం కట్టు కొని
ఆహరహం శ్రమించిన నాయకురాలు .మహిళాభ్యున్నతికి ,సరైన విలువలతో కూడిన
రాజకీయ ,పరిస్తితుల కల్పనకు పార్టీని స్థా పించిన రాజకీయ దురంధురాలు కార్మికులందరికీ
ఆమె సేవలు ఒక తల్లి తన పిల్లలకు చేసే సేవలుగా అని పించాయి ఆమె లో తమ
మాతృమూర్తిని దర్శించుకొన్నారు .అందుకే ఆప్యాయం గా ,దరంగా , ప్రేమగా,,గౌరవం గా
ఆమెను ‘’మదర్ జోన్స్ ‘’అని పిలుచుకొని సంతృప్తి చెందారు అందుకే ఆమె ‘’కార్మిక మాత
‘’అయింది .అలాంటి విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ఆ విదుషీమణి పేరనే ఒక ద్వై మాసిక పత్రిక
ను పెట్టి ఆమె పేరును చిరస్మరణీయం చేసి ఆ మహిళామణికి నీరాజనలా లందించారు
అమెరికన్ పత్రికాధి పతులు ఆమె లాగా నే ఈ పత్రిక కూడా నిర్భాయత్వానికి నిజాయితీకి
పెద్ద పట వేసింది .ఆమెయే‘’’’ మదర్ జోన్స్’’అనబడే మేరి హారిస్ జోన్స్ . .ఆపత్రిక పేరే
‘’మదర్ జోన్స్ ‘’లేక ‘’మో జో’’.ఆమె జీవితం అందరికి ఆదర్శప్రా యం
మదర్ జోన్స్ పత్రిక ఆమె యే ఆదర్శాలకు ,విలువలకు ప్రా తినిధ్యం వహించిందో
వాటిని కాపాడటానికి తీవ్రం గా కృషి చేస్తో ంది .వామ పక్ష భావ వ్యాప్తికి అంకితమైన పత్రిక
..పరిశోధనాత్మక మైన బ్రేకింగ్ న్యూస్ కు అశేష గౌరవాన్ని పొ ందింది ఆ పత్రిక .రాజకీయ
,పర్యావరణ ,మానవ హక్కుల ,,సంస్కృతీ పరి రక్షణ కోసం అంకిత భావం తో పని చేస్తు న్న
పత్రిక .23 సార్లు ‘’నేషనల్ మేగజైన్ అవార్డ్ ‘’కు నామినేట్ అయిన పత్రిక .ఆరు సార్లు ఆ
అవార్డు ను దక్కించుకొన్న పత్రిక .2011 లో జనరల్ ఎక్సేలేన్సి అవార్డ్ తో బాటు 2010 లో
ఆన్ లైన్ టాపికల్ రిపో ర్టింగ్ కు ‘’ఆన్ లైన్ న్యూస్ అసో సియేషన్ ‘’అవార్డు ను పొ ండిది
.’’ఉట్నే రీడర్ ఇండిపెండెంట్ ప్రెస్ అవార్డ్’’ ను జెనెరల్ ఎక్సేలేన్సి లో సాధించిన అగ్రగామి
పత్రిక . ఇలాంటి పత్రిక కు ప్రేరణ గా నిలచిన మదర్ జోన్స్ గురించి తెలుసుకొందాం .
జోన్స్ జీవితం
మేరీ హారిస్ జోన్స్ ఐర్లా ండ్ దేశం లో ‘’కౌంటి కార్క్’’అనే చోట 1830 (1837 ?)లో
జన్మించింది .ఆమె చిన్నతనం లోనే ఐర్లా ండ్ లో తీవ్ర మైన కరువేర్పడింది కరువు బారి
నుండి తప్పించుకోవటానికి ఆమె తలిదండ్రు లు కుటుంబాన్ని ఉత్త ర అమెరికా కు తరలించారు
దురదృష్ట ం ఆమె ను వెంటాడింది అప్పుడే తీవ్రం గా విజ్రు మ్భించిన ‘’పచ్చజ్వరం ‘’తో తల్లిని
,తండ్రిని కోల్పోయిన అభాగ్యురాలైంది ఉపాధ్యాయురాలు గా జీవితాన్ని ప్రా రంభించింది
..మెంఫిస్ చేరి రాబర్ట్ జోన్స్ ను 1861 లో వివాహ మాడింది .ఆయన ఐరన్ వర్కర్ .కార్మిక
యూనియన్ కు మంచి సపో ర్టర్ కూడా .నలుగురు పిల్లలు కలిగారు .అయినా విధి ఆమె పై
పగ బట్టింది .మళ్ళీ ఎల్లో ఫీవర్ విజ్రు మ్భించి1867 లో భర్త ను ,పిల్లలను కోల్పోయింది
.’’skilled iron worker ‘అయింది .’చికాగో చేరి డ్రెస్ మేకర్ అయింది .గోరు చుట్టు పై రోకటి
పో టు అన్నట్లు చికాగోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో ఆమె ఇల్లు పరశురామ ప్రీతీ
అయింది . .అంటే నిలువ నీడ కూడా లేని నిర్భాగ్యురాలైంది .ఇలినాయిస్ ,మిచిగాన్
రాష్ట్రా లలో కొంత కాలం ఉంది
ఉద్యమజ్వాల
ఆఫ్రికన్ అమెరికన్ వర్కర్ల ను ఆహ్వానించి యూనియన్ లలో చేరేట్లు చేసింది జోన్స్
.అంతే కాదు మైనర్ ల భార్యల తో చీపురు ,తుడుపు గుడ్డ పట్టించి గనులలో చర్మ వ్యాధుల
వల్ల కలిగే ప్రమాదాలనుంచి రక్షణ కల్పించింది . చిన్న పిల్లలతో ‘’we want to go to school
and not to the Mines ‘’అనే ప్లేకార్డు ల నుచేత బట్టించి ప్రదర్శనలు నిర్వహించింది
.పారిశ్రా మిక విప్ల వం తో ఆమెరికా ముందుకు వెళ్తు ంటే ,అమెరికా స్వరూపమే పూర్తిగా మారి
అభివృద్ధి పధం లో దూసుకు పో తుంటే ,జోన్స్ కార్మికుల స్తితి గతులను మెరుగు పరచాలని
భావించి అంకిత భావం తో కృషి చేసింది . నిరుద్యోగులతో ఉద్యోగాల కల్పన
కోసం కాన్సాస్ సిటి నుంచి వాషింగ్ టన్ డి.సి.నగరం వరకు భారీ ప్రదర్శనకు నాయకత్వం
వహించింది .
కార్మిక ప్రయోజనాలే కాదు గనుల యజమానుల రక్షణ కూ ఆమె తీవ్రం గానే
కృషి సల్పింది .అలబామా రాష్ట ం్ర లోని బర్మింగ్ హాం పట్నం లోని తెల్లజాతి నల్ల జాతి మైనర్ల కు
‘’దేశవ్యాప్త బొ గ్గు గని కార్మికుల సమ్మె ‘’కాలం లో సహాయ పడిన వివేక వంతురాలు జోన్స్
‘’.యూజీన్ డేబ్స్’’ అనే అమెరికన్ రైల్వే యూనియన్ నాయకుని కి మద్ద తు కోసం భారీ
ర్యాలీ ని నిర్వహించింది .అతనికి కోర్టు దిక్కారానికి ఆరు నెలలు శిక్ష పడింది 1897 వేసవి లో
9000 మంది కార్మికులు దేశవ్యాప్త ం గా ‘’బిటూమినస్ కోల్ సమ్మె ‘’లో పాల్గొ న్నారు
.యజమానులు చేతులెత్తేశారు జోన్స్ అక్కడ హుటాహుటిన వాలి సాయం చేసి పరిష్కారం
సాధించింది .నూలు కార్మికులు ,స్టీల్ వర్కర్లు చేసిన సమ్మె లన్నిటికీ ఆమె మద్ద తు ఉంది
.ఆమె అంటే భయ పడిన ఆమెరికా లోని చాలా టౌన్లు .ఆమె రాక ను నిషేధించాయి .ఎన్నో
సార్లు జైలుకకెళ్ళింది అయినా ఆమెది చెక్కు చెదరని ఉక్కు గుండె .మొక్క వోని ధైర్యం .అన్ని
సార్లు కారాగార శిక్ష అనుభవించిన లేబర్ నాయకులెవ్వరూ లేరు అదీ ఆమె ప్రత్యేకత .
బాల కార్మికులతో పని చేయించి వారి ఆరోగ్యాన్ని చడగోడుతున్నారని, విద్యతో బంగారు
బాటలో నడవాల్సిన వాళ్ళ జీవితాలు ఛిద్రమవుతున్నాయని జోన్స్ గ్రహించి వారి విముక్తికి
కంకణం కట్టు కొంది ఫిలడెల్ఫియా లో ఒక లక్ష మంది సిల్క్ కార్మికులు పని గంటలు వారానికి
60 గంటల నుంచి 55 గంటలకు తగ్గించమని సమ్మె చేశారు అందులో 16 వేల మంది బాల
కార్మికులే ఉండటం ఆశ్చర్య కరం .బాల కార్మికుల చేత పని చేయించ వద్ద ని పిల్లల చేత
ఫిలడెల్ఫియా టెక్స్ టైల్ మిల్స్ నుంచి న్యూయార్క్ సిటి కి ప్రదర్శన నిర్వహించి నాయకత్వం
వహించింది .ఆమె ఉద్దేశ్యం ‘’to show New York millionaires our grievances
‘’.ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ఉన్న లాంగ్ ఐలాండ్ ఇంటి వరకు ప్రదర్శన గా వారిని తీసుకొని వెళ్లి
పరిస్తితి తీవ్రతను తెలియ జేసింది .
ఆమె 100 వ జన్మ దినాన్ని దేశ మంతా అత్యుత్సాహం గా,వేడుకగా, ఘనం గా
జరుపుకొన్నారు .ఆమె మాడిసన్ లోని సిల్వర్ స్ప్రింగ్స్ అనే చోట 1930 నవంబర్ 30 న తన
100 వ ఏట ‘’శతమానం భవతి’’ అని పించుకొని ధన్య జీవి గా మరణించింది .ఆమె కోరిక
ప్రకారం ఆమె శరీరాన్ని ఇలినాయిస్ లో ఆలివ్ లో ఉన్న ‘’కార్మికుల సేమిటరి ‘’లో ఖననం
చేశారు .’’folk hero ‘’అని పించుకొన్న మేరి హారిస్ జోన్స్ అంటే మదర్ జోన్స్ అమెరికా
కార్మికులకే మాత కాదు ‘’విశ్వ కార్మిక మాత ‘’.
కృతజ్ఞ తలు ---మదర్ జోన్స్ గురించి రాయమని నన్ను ప్రో త్సహించి,నాతో రాయించిన
ఆప్తు లు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారికి సర్వదా కృతజ్ఞు డను .వారు చెప్పి ఉండక
పో తే మదర్ జోన్స్ గురించి నేను చదివి ఉండే వాడిని కాదేమో ?
1967 అక్టో బర్ తొమ్మిదిన చేగువేరా ను బొ లీవియా లో అమెరికా సి.ఐ.ఏ .కాల్చి
చంపింది .దీన్ని గర్హిస్తూ జీన్ పాల్ సాత్రే ‘’Che was the most complete human being of
our age ‘’ అన్నాడు .క్యూబా లో కమ్యూనిస్ట్ పాలన ఫిడేల్ కాస్ట్రో నాయకత్వాన ఆవిర్భ వించ
టానికి కారణ మైన విప్ల వీరుడు చేగువేరా .గెరిల్లా యుద్ధా నికి ఆద్యుడైన వాడు .మిలిటరీ
యుద్ధ వ్యూహ నిపుణుడు,సైన్యాధి పతి మీదు మిక్కిలి డాక్టరు, గొప్ప రచయితా.కూడా
..వందలాది పత్రికలకు పుంఖాను పున్ఖ ం గా వ్యాసాలూ రాశాడు జన చైతన్యం తెచ్చాడు .నిద్ర
పో తున్న జాతిని జాగృతం చేశాడు .మంచి కవిత్వం రాసిన విప్ల వ కవి .జీవిత కాలం లోనే
చాలా పుస్త కాలు రాసి ప్రచురించాడు చేగువేరా .అతను గెరిల్లా యుద్ధ తంత్రం మీద రాసిన
పుస్త కాన్ని మిలిటరీ ఎక్స్ పర్త్స్అధ్యనయనం చేస్తు ంటారు ఇప్పటికీ . దీనికి తోడు అతను
ప్రొ ఫెషనల్ ఫో టోగ్రా ఫర్ ..లాటిన్ అమెరికా దేశాలకు న్యూస్ రిపో ర్టు లు రాసి పంపేవాడు
.తిరుగు లేని కమ్యూనిస్ట్ .కమ్యూనిజం నరా నరానా జీర్ణించుకొన్న వాడు .నిజం గా చెప్పా
లంటే గొప్ప సో ష ఫిలాసఫర్ .ఆయన్ను హేస్పానిక్ హీరో అని ,విప్ల వ నాయకుడని చెప్పుకొని
గర్విస్తా రు అనుచరులు .
క్యూబా ప్రభుత్వం లో ఉండి పూర్తీ కొత్త పాలనా విధాన్ని ప్రవేశ పెట్టిన ఆలోచనా పరుడు
అమలు చేసిన వాడు .లాటిన్ అమెరికా ప్రజల ఆశా జ్యోతి చేగువేరా .చేగువేరా చాలా ఇష్ట పడి
చదివిన పుస్త కం సేర్వాన్ టేస్స్ రాసిన ‘’డాన్ క్విక్సోట్ ‘’నవల .క్విక్సోట్ స్పెయిన్ దేశమంతా
బక్క చిక్కిన’’ రోసి నంటి’’అనే గుర్రా న్ని ఎక్కి తిరిగి అన్యాయాన్ని అక్రమాలనుంచి ప్రజల్ని
రక్షించాలని పగటి కలలు కనే వాడు .తన బల్లెం రోసి నంటి కంటే బల మైంది అన్నాడు
.
చేగువేరా 1928 జూన్ పద్నాలుగున అర్జెంటిన లోని రోసారియో లో జన్మించాడు .అసలు
పేరు ‘’Ernesto Guvera de la serna ‘’హిస్పియానిక్ సంప్రదాయం లో తల్లి పేరు ను చివర
పెట్టు కొని గౌరవించే విధానం ఉంటుంది .తండ్రి ఎర్నేస్తో .తల్లి సెర్నా .సంపన్న కుటుంబమే
వారిది .తండ్రి రియల్ ఎస్టేట్ చేసే వాడు బానే సంపాదించాడు .చిన్నప్పటి నుంచి చేగువేరా కు
ఉబ్బసం జబ్బు ఉంది .చిన్న నాటి నుంచే విపరీతం గా పుస్త కాలు చదివేసే వాడు .అందులో
సాహస గాధ లంటే చెవులు కోసుకొనే వాడు .ఇంజన్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా అంతా
2,680 మైళ్ళు ప్రయాణం చేసిన సాహసి ..హైస్కూల్ లోనే విప్ల వ భావాలు అంకురించాయి
.ఉబ్బసం ,కేన్సర్ వంటి వ్యాధుల పై రిసెర్చ్ చెయ్యాలనే ఆలోచన బలం గా ఉండేది .డాక్టర్
పాసైనాడు .
ఎలేర్జి ఇన్స్తి institute లో మేల్ నర్సు గా పని చేశాడు ముందుగా .ఎన్నో
వ్యాపారాలు చేయాలనాను కొన్నాడు .బొ ద్దింకలను చంపే ‘’లోకష్టు ‘’తయారు చేయాలని
ఆలోచించాడు .తన మోటారు సైకిల్ ను la ponderosa అంటే శక్తి వంత మైంది అని
పిల్చుకొన్నాడు .తొమ్మిది సార్లు సంచార యాత్ర దిగ్విజయం గా చేశాడు .ప్రజల పరిస్తితులను
గమనించే వాడు .ఎక్కువ పని గంటలు ,పారి శుధ్యం లేని జీవితాలు ,కారు చీకట్లో నివాసాలు
తో బతుకు దుర్భరం గా ఈడుస్తు న్న కార్మికుల, సామాన్య ప్రజల ను చూసి కలత చెందాడు
.డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే మళ్ళీ రైల్ లో మళ్ళీ యాత్ర చేశాడు .గ్వాటి మాలా వెళ్లి ‘’విజ్ఞా న
సర్వస్వాలు ‘’అమ్మాడు .దాని ప్రెసిడెంట్ జాకబ్ ఆర్బెంజ్ అంటే విపరీత మైన మోజేర్పడింది .
ఇంతకీ చే అంటే వాళ్ళ భాషలో ‘’బుడ్డా డు ‘’అని అర్ధం తలిదండ్రు లు పిల్లల్ని
పిలుచుకొనే ఆప్యాయపు పిలుపు అది .ఫిడేల్ కాస్ట్రో ఆ పేరు నే ఖాయం చేశాడు ..1950 లో
చేగువేరా కాష్ట్రో ని కలిశాడు .ఆ మరుసటేడాది ప్రేమించిన హీల్డా గాదియా ను పెళ్ళాడాడు
.బొ ద్దు గా లావుగా ఉన్న శరీరాన్ని తగ్గించుకోవ టానికి బ్రెడ్ ,పాస్త ,స్ట్రీక్ లు తినటం మనే
శాడు .కాస్ట్రో అతన్ని చాల్కో ట్రైనింగ్ కు నాయకుడిని చేశాడు .అతనొక్కడే క్యూబా దేశానికి
చెందినా వాడు కాదు అంటే నాన్ క్యూబన్ .ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ ని చేశాడు .అది
అప్పుడు లెఫ్టి నెంట్ రాంక్ ..1956 లో నవంబర్ ఇరవై అయిదవ తేదీన గువేరా, కాస్ట్రో మరో
81 మంది యోధులు మెక్సికో నుంచి క్యూబా కు చేరారు .చేను ఆర్మీ కామ్బాట్ చేయ వద్ద కని
వారించాడు కాస్ట్రో .
1963 లో ‘’గెరిల్లా వార్ ఫేర్ ‘’అనే క్లా సిక్ పుస్త కాన్ని రాశాడు చేగువేరా .అప్పటి
క్యూబా అధ్యక్షుడు బాటిస్థా క్రూ ర విధానాలతో ప్రజలు విసుగెత్తి పో యారు .1958 లో డిసెంబర్
ముప్ఫై న క్యూబా ను వశం చేసుకొన్నారు విప్ల వ వీరులు .విజయం లభించిన తర్వాతా ‘’no-
we have not won the war .the revolution begins now ‘’అన్నాడు చేగువేరా .క్యూబా లో
కమ్యూనిష్ట్ ప్రభుత్వం రావాలి అని కాష్ట్రో కు చెప్పాడు .1959 జనవరి రెండు న కాస్ట్రో గువేరా
ను మిలిటరీ కమాండర్ ను చేశాడు .చీఫ్ ఎక్సి క్యూషనర్ అయిన కాష్ట్రో కు కమ్యూనిజాన్ని
బో ధించాడు .సైనికులకు చదువు చెప్పాడు .1959 ఫిబవ
్ర రి ఏడున కాష్ట్రో చేగువేరా కు
పౌరసత్వం ప్రదానం చేశాడు .అంతే కాదు director of the national institute of agrarian
reforms అనే పదవి నిచ్చాడు .ఆ తర్వాతా క్యూబా జాతీయ బాంక్ కు అధ్యక్షుడిని చేశాడు
.వెంటనే తన మంత్రి వర్గ ం లో పరిశమ
్ర ల మంత్రి గా తీసుకొన్నాడు .దీనితో బాటు క్యూబా ఆర్ధిక
శాఖ కు ఇంచార్జి నీ చేశాడు .
క్యూబా లో చెరుకు బాగా పండుతుంది క్యూబా ను ‘’షుగర్ బౌల్ ‘’అంటారు .చెరకు
మీదే క్యూబా ఆర్ధికం గా ఆధార పడింది .ఇది అదను గా చేసుకొని అమెరికా పెత్తనం చేస్తో ండి
.దేశం లో అమెరికా ధనంనం ఎక్కు వై ప్రభావం చూపిస్తో ంది .అందుకని రష్యాతో ఒప్పందం
కుదిర్చి రష్యాకు పంచ దార ను ఎగుమతి చేయించాడు .వాళ్ళ పెత్తనమూ ఎక్కు వై పో యింది
.1959 జూన్ లో చేగువేరా చైనా కు డిప్లొ మాటిక్ యాత్ర చేశాడు ఆధికారికం గా .ఆసియా
యూరప్ ,ఆఫ్రికా దేశాలలో పర్య టీంచాడు .1965 మార్చి పద్నాలుగున క్యూబా చేరి చాలా
నెలలు జనానికి కనీ పించ కుండా అజ్ఞా త వాసం లో గడి పాడు ..
క్యూబా వదిలి పెట్టి ఆఫ్రికా కు చేరాడు .అక్కడి విప్ల వానికి తన అవసరం ఉందని
సాయం చేద్దా మని అను కొన్నాడు .కాంగో లో అనుకూల పరిస్తితులేమీ చేగువేరా కు కంపించ
లేదు .భార్య తో విడాకులు పొ ందాడు .అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు .బొ లీవియా
లో విప్ల వానికి సాయం చేద్దా మని ఉవ్విళ్ళూరి బొ లీవియా వెళ్ళాడు .అక్కడి జనం ఇంకా
విప్ల వానికి సిద్ధం గా లేరని తెలుసు కొన్నాడు .అమెరికా అక్కడి పాలకులకు అండగా ఉంది
.అనేక వేషాలు మార్చి అక్కడికి చేరుకొన్నాడు పాపం .
1967 అక్టో బర్ లో కాల్పుల్లో దెబ్బ తిన్నాడు .ఒడి పో యాడు .ఒక గార్డు అతని పై
ఉమ్మేశాడు .మళ్ళీ ఎదురు తిరిగి ఉమ్మేశాడు చేగువేరా .కట్టేశారు .’’I am thinking about
the immortality of the revolution –so feared by those you serve ‘’అన్నాడు .చేగువేరా
ను చంప వద్ద ని పై ఆధికారులు ఆదేశించినా కింది వారి పెత్తనం, అమెరికా ఒత్తి డి తో
ఉదయం ఒంటి గంటకు అమెరికన్ అధికారులు అక్కడికి చేరారు .అతని విప్ల వం గురించి
ప్రశ్నించాలని అనుకొన్నారు .కాని బో లీవియన్ అధికారులు ఒప్పు కో లేదు .మధ్యాహ్నం
ఒకటి పది కి ఒక స్కూల్ లో బంధింప బడిన అతన్ని ,గాయాలతో విపరీతం గ బాధ
పడుతున్న వాడిని ‘’టేరాన్’’అనే వాడు కాల్చి చంపేశాడు .39 ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి
పో యింది .’’I know that you are here to kill me .Shot coward.you are only killing a
man ‘’అని తనను చంపినా విప్ల వం ఆగి పో దని ధైర్యం గా చెప్పాడు .
1997 లో అక్టో బర్ 17 న గువేరాను క్యూబా శాంతా క్లా రా లో మళ్ళీ గౌరవం గా సమాధి
చేశారు ఆ సందర్భం గా కాస్ట్రో మాట్లా డుతూ .’’Che is fighting and winning more
battles than ever ..thank you Che for your birth ,your life ,and your example .thank
you for coming to re inforce us in difficult struggle in which we are engaged to
day to preserve the ideas for which you fought so hard ‘’అని ప్రశంసిం చాడు కాస్ట్రో
‘అదీ ఆ విప్ల వీరుని త్యాగం, బుద్ధి కుశలత,ప్రజా భ్యుదయం ,సేవ
మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని
ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తా రు .తాము చేస్తు న్నది దైవ కార్యమనే భావించి చేస్తా రు గొప్ప తనాన్ని
తమకు ఆపాదించుకోరు .తమను నడిపించి, చేయిస్తు న్న దైవానికే ఆ కృతజ్ఞ తలు ,ప్రసంశలు దక్కాలని
అనుకొంటారు .వారి సేవకు ఒక దేశం పరిమితం కాదు .ప్రపంచమంతా విస్త రించి ప్రజా హృదయాలను
గెలుచుకొంటారు తాము భగవంతుని పరికరాలమే నని వారి భావన .అలాంటి మానవ సేవా తత్పరురాలు
ఇటలీ దేశానికి చెందినమదర్ ఫ్రా న్సెస్ కాబ్రిని .ఆమె గురించే మనం ఇప్పుడు తెలుసుకొంటున్నాం .
మేరియా ఫ్రా న్సెస్ కాబ్రిని 1850 లో జులై 15 న ఇటలీ దేశం లోని మిలన్ కు దగ్గ ర లో డీజియానో
లో జన్మించింది .తండ్రి అగస్తినో .తల్లి స్టెల్లా కాబ్రిని .పదకొండు మంది సంతానం లో ఏడుగురు చిన్న
తనం లోనే చని పో యారు .తల్లికి 41 ఏళ్ళ వయసులో కాబ్రినిగర్భస్థ సమయం కంటే రెండు నెలలు
ముందుగానే బలహీనం గా . పుట్టింది .ఆమె ను ఎంతో జాగ్రత్తగా ఆ దంపతులు పెంచారు కుటుంబం
అంతా కాధలిక్ మతానికి అంకిత మైనదే ..ఇంటి పనులన్నీ కాబ్రినే చేసి తల్లికి సాయ పాడేది .అందుకని
చదువు అంతగా అబ్బలేదు ఆట పాటలూ ఒంట బట్ట లేదు .అర్భకు రాలు . ఆ నాటు ఉన్న
సాంప్రదాయం ప్రకారం ఈమెకు ఏడవ ఏటనే కాథలిక్ మత దీక్ష నిచ్చారు .ఆ దీక్షా సమయం లో ఆమెలో
గొప్ప అనుభవం కలిగింది .దానిని మాటలలో చెప్పలేక పో యింది .ఆ నాడు ఇటలీ అంతా సమైక్య
మవటానికి సిద్ధమవుతోంది .ఈమెను పదమూడవ ఏట మిలన్ కు పడమర ఉన్న’’డాటర్స్ ఆఫ్ సేక్రేడ్
హార్ట్స్ ‘’నిర్వహిస్తు న్న కాన్వెంట్ స్కూల్ కు పంపారు .ఆమెను చేర్చుకోవటానికి సుపీరియర్
తిరస్కరించాడు దానికి ఆమె అనారోగ్యం ఒకకారణం .రెండో ది ఈమె కొన్ని ఏళ్ళలో స్వంతం గా ఒక మత
సంస్థ ను ఎర్పరుస్తు ందేమో ననే అనుమానం .
ముందు తండ్రి ,ఆ తర్వాత తల్లీ మరణించారు .ఆదరించే బాబాయి కూడా చనిపో యాడు
.అనాధగా మిగిలి పో యింది .ఈ బాధలన్నీ మరిచి పో వటానికి నిరంతరం దైవ సాన్నిధ్యం లో గడపటం
ప్రా రంభించింది కాబ్రిని .స్కూలు పిల్లలకు నీతి, మతధర్మాలను బో ధించేది .బాధలతో ఉన్న వారిపై సాను
భూతి చూపింది .ఊరికి దూరం గా ఉంటూ ఎవరూ పట్టించుకోని ఒక కేన్సర్ బాధితుడికి సేవ చేసి నయం
చేసింది .మసూచికంఆ ప్రా ంతం లో విజ్రు మ్భించిన సమయం లో దాని బారిన పడిన వందలాది మందికి
సేవలందించి తానూ ఆ వ్యాధికి గురైంది .ఆమె కు తోడుగా ఉన్న రోసా సేవలతో మళ్ళీ మామూలు మనిషి
అయింది .అసలే అనారోగ్యం .దీనికి తోడూ ఈ వ్యాధి సో కి తగ్గింది అందుకని ఏ స్కూల్ లోను ఆమె ను
చేర్చుకోలేదు ..దీనికి కారణం ఆ నగర మేయర్ ను కాథలిక్ మతం లోకి మార్చటం .కాబ్రినికి క్రమంగా
మిషనరీ’’ నన్’’ గా మారాలనే సంకల్పం బలీయ మైంది ..హౌస్ ఆఫ్ ప్రా విడెన్స్ లో చేరి’’ సిస్టర్
సేవేరియా కాబ్రిని ‘’ అయింది .అక్కడ రెండవ స్తా నం పొ ందింది .ఆమె కు అనాధలకు విద్య ,నేర్పటం మత
దీక్ష నివ్వటం అప్పగించారు
బిషప్ జేల్మిని ఈమె లోని దీక్ష కు ,సేవా తత్పరతకు అబ్బుర పడి కాబ్రిని ని 1877‘లో
’మదర్ సుపీరియర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ప్రా విడెన్స్ ‘’అనే అత్యంత గౌరవనీయమైన పదవిని ఇచ్చాడు .కొద్ది
మందికి ఇది అసూయ కు కారణం అయింది .ఆమె జీవితాన్ని నరకప్రా యం చేశారు కూడా .అప్పటికి ఆ
సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కు మాత్రమె పరిమిత మైంది .దాని నిర్వాహకుడు ‘’తొండిని’’సంస్థ
నిధులన్నీ స్వాహా చేశాడు .ఈ పరిస్తితులలో మదర్ కాబ్రిని తన స్వంత సంస్థ ను తన సేవా ధర్మాలకు
అనుగుణం గా ఏర్పాటు చేయాల్సిన పరిస్తితి కలిగింది .వెంటనే ‘’’’సేలేశియన్ మిషనరీస్ ఆఫ్ సేక్రేడ్
హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ‘’ను స్తా పించింది .దీనినే అ తర్వాతా ‘’ది మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్స్ ఆఫ్
జీసస్ ‘’గా మార్చింది .
ఫ్రా న్సెస్ కాబ్రిని కి ‘’మదర్ మేరీ ‘’అనుక్షణం స్పూర్తి నిస్తూ ండేది .1887 లో రోమ్ నగరానికి
వెళ్లి అక్కడ ఒక సంస్థ ను ఏర్పాటు చేయటానికి పాప్ గారి అనుమతి పొ ందింది .ఆమెను ఎన్నో సంస్త లు
ప్రో త్సహించి ఆమె సేవా సంస్థ లను దేశామంతావిస్త రిల్ల జేయమని అభ్యర్ధించాయి అప్పటికి ఆమె సంస్థ
చర్చి ఒప్పుకొన్న మహిళా సంస్థ లలో రెండవది అయింది ..ఆ కాలం లో ఆడవారు క్రిస్టియన్ మత
ప్రచారానికి తగిన వారు కారనే అభిప్రా యం బలం గా ఉండేది .ఆ అభిప్రా యాన్ని కాబ్రిని తప్పు అని
రుజువు చేసింది మగవారు నిర్వహించే కార్యక్రమాల కంటే మహిళలు నిర్వహించేవే ఉత్త మోత్త మ మైనవని
రుజువు చేసింది .ఇది ఆమెకు ఒక సవాలు గా నిలిచింది ఎన్ని అడ్డ ంకులెదురైనా తన పని తాను దైవ
కృప తో చేసుకొని ముందుకు సాగింది .ఎన్నో మత సంస్త లు ఆమెకు బాసటగా నిలబడ్డా యి అవసరమైన
డబ్బు ,పరికరాలు స్త లం అన్నీ సమకూర్చినాయి . ఆమె సేవకు తామూ తోడ్పడ్డా యి .కొద్ది రోజులకే
అక్కడి కార్డినల్ బీద పిల్లలకు ఒక స్కూల్ ను ,దాంతో బాటు ఒక కిండర్ గార్టెన్ స్కూల్ ను
ప్రా రంభించమని కోరాడు ఆమె ఆ పని దిగ్విజయం గా నిర్వహించి అందరి అభిమానం సంపాదించింది
..క్రమంగా మదర్ కార్య క్రమాలకు విశేష స్పందన విశ్వ వ్యాప్త ం గా లభించింది
అమెరికా ,యూరప్ దేశాల వారు తమ దేశాలలో ఆమెను చారిటబుల్ సంస్థ లను నెలకొల్ప
మని అభ్యర్ధించాయి ఆమె మనసులో చాలా కాలం నుండి చైనా లో ఏర్పాటు చేయాలని అనుకొన్నది కాని
దేవేచ్చ ..అమెరికా లో తన సేవా కార్యక్రమాలను విస్త రించటానికి నిర్ణ యించుకోంది ..అప్పటికే ఆమె
విపరీతం గా పని చేసి అలసి పో యింది ఆరోగ్యమూ బాగాలేదు .అమెరికా లోని న్యూ యార్క్ సిటీ దాని
పరిసరాలలో ఇటాలియన్ ఇమ్మిగ్రెంట్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు .సరైన విద్యా వైద్య
సౌకర్యాలు వారికి లేవు .వారికి సేవలందించాలన్న ధ్యేయం తో కాబ్రిని 1889 లో అమెరికా కు కొద్ది మంది
సిస్టర్స్ తో చేరుకొన్నది .ఆహ్వానించిన వారే మొహం చాటేశారు అంతా కొత్త .కాని ఆమె అధైర్య పడలేదు
తన పని తాను ప్రా రంభించింది నెమ్మదిగా అక్కడి సంస్థ లు సహకారం అందించటం ప్రా రంభించాయి .పో ప్
లియో కూడా ఆమెకు బాసట గా నిలిచాడు .
సిస్టర్స్ వీధిలో తిరిగి అడుక్కొంటూ సాయం రాబట్టా రు .వీరిని చూసి మిగిలిన వారు
ముందుకొచ్చారు. ఒక చోట మంచి వాతా వరణంలో సంస్త నేర్పరచారు .ఉదయం అయిదింటికే
కార్యక్రమాలు మొదలు .ఆ తర్వాత ప్రా ర్ధ న ..తర్వాతా విద్యా బో ధనా ,ఆరోగ్య సూత్రా లు తెలియజేయటం
.ఇటాలియన్ ఇమ్మిగ్రంత్స్ కు గొప్ప ఊరట కలిగింది .కొద్ది కొద్ది మొత్తా లను ఆహార పదార్ధా లను
సేకరించేవారు .
తరువాత ఆమె అనాధాశ్రమం స్తా పించింది .అది అనాధలకే కాక బాధితులకు, అసహాయులకు
,అండగా నిలిచింది .సెయింట్ జోచిమ్స్ చర్చి ద్వారా రెండు వందల మంది పిల్లలకు సేవలందించింది ..ఆ
తర్వాతా బ్రూ క్లిన్ లో స్కూల్ పెట్టింది .స్తా నికులకు దేనిలోనూ ఇటాలియన్లు తీసి పో రని రుజువు
చేయించింది .న్యూ ఆర్లియాన్స్ ,డెన్వర్ ,లాస్ ఆంజెల్స్ ,ఫిలడెల్ఫియా ,న్యూ వార్క్ ,సియాటిల్ లలో
ఉచిత విద్యాలయాలను నెలకొల్పింది .విద్యతో బాటు వైద్యం, ఆధ్యాత్మిక చింతనలను అందించింది
.ఆదివారం బడులు నిర్వహించింది .వృత్తి విద్యాలయాలను నెలకొల్పింది ,.యువజన విద్యా ,నేర గాళ్ళకు
విద్యా బో ధనా కూడా ఆమె నిర్వహించిన వాటిలో ముఖ్యమైనవి .ఆమె సేవా సంస్థ లకు అనూహ్యం గా
దాతలు భూరి విరాళాలను సమర్పించి జన్మ ధన్యం చేసుకొనే వారు .డబ్బు కొరత అనేది మదర్
సంస్థ లకు ఎప్పుడూ కలగలేదు అవసరమైతే సిస్టర్స్ వీధుల్లో బిచ్చం ఎత్తి విరాళాలు సేకరించేవారు .
మదర్ కాబ్రిని నికారుగ్వా ,పనామా ,బ్యూనస్ ఐర్స్ ,అర్జ ంటినా ,లలో స్నేహ యాత్ర జరిపింది
కంచర గాడిదల పై ఆండీస్ పర్వతాల లో సంచరించింది .వెళ్ళిన ప్రతి చోటా అవసర మైన కేంద్రా లను
స్తా పించి సాయ పడింది .ప్రపంచం అంతా ఆమెను ‘’లా మదర్ ‘’అంటే ‘’మాతృదేవత ‘’ అని ఆప్యాయం
గా పిలుచుకొనే వారు ..అందరిపై అపారమైన కరుణా, ప్రేమా ఆమె చూపేది .బాధితులకు సానుభూతి
ఆమె నైజం .సకల ప్రా ణుల మీద ఆమెకు అపారమైన కరుణ ఉండేది .తన కార్యక్రమాలను ‘’హృదయానికి
చేసే విద్య ‘’గా భావించేది .విద్య అంటే ప్రేమను కురిపించటమే అనేది ఆమె .
బ్రజిల్ దేశం లో పర్య టించి నపుడు మదర్ కు మలేరియా సో కి చాలా కాలం బాధ పడింది
1912 లో మళ్ళీ సేవాకార్యక్రమాలకోసం అమెరికా వెళ్ళింది మొదటి ప్రపంచయుద్ధ సమయం లో అమెరికా
నుంచి బయటి దేశాలకు వెళ్ళే అవకాశం ఆమెకు లభించలేదు .1938 లోనే ఆమె కు ‘’beatified
‘’(declared sacred )లభించింది .1946 జులై 7 న మదర్ కాబ్రిని ని అమెరికా కు మొదటి పౌరురాలు గా
రోమన్ కాధలిక్ చర్చ్ ‘’సెయింట్ ‘’హో దా నిచ్చింది .1917 డిసెంబర్ 22 న 67 వ ఏట మదర్ కాబ్రిని తుది
శ్వాస విడిచింది .చని పో యిన తర్వాతా కూడా ఆమె ప్రభావం ఇసుమంత కూడా తగ్గ లేదు .
ప్రేమ కంటే ఏ త్యాగము గొప్పది కాదని కాబ్రిని భావించింది .భగవంతుడే మన చేత
అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తా డు అని చెప్పేది .
మైకేల్ కోప్ఆంగ్ల ం లో రాసిన నవల ‘’దిఫిషర్ మాన్స్ సన్ ‘’.ఆద్యంతం కట్టి పడేసే నవల
చేపలు పట్టే వాడి కొడుకు పరిస్తితుల ప్రభావం వాళ్ళ మళ్ళీ చేపలు పట్టేవాడే అవుతాడు అని
నిరూపించిన నవల .సముద్రం మీద జీవితం ,ఎంత కస్ట పడి చేపలు పట్టినా బ్రో కర్ల పైరవీల
వల్ల ,స్థా నిక కట్టు బాట్ల వల్ల ఈ కుటుంబానికి డబ్బు చాలా తక్కువ గానే వస్తో ంది .కష్ట ం
ఎక్కువ ఫలితం తక్కువ గా వారి జీవితాలు గడిచి పో తుంటాయి .తల్లికి తన కొడుకు ‘’నీల్
‘’మళ్ళీతండ్రి లాగాచేపలు పట్టే వాడిగా జీవించటం ఇష్ట ం లేదు .కాలేజి లో చదువు
కొమ్మంటుంది . కాని కొడుకు నీల్ కు తండ్రీ ,కావాలి, తల్లీ కావాలి .తల్లి ఊహా సంచార జీవి
.తండ్రి ప్రా క్టికల్ మాన్ ..ఈ రెండిటిని అర్ధం చేసుకొన్నవాడు కొడుకు .తండ్రి క్రమం గా ముసలి
వాడై పో తాడు కనీసం బో ట్ ను నడిపే ఓపిక లేని వాడవుతాడు .అప్పటికే రెండు ఆపరేషన్లు
జరిగాయి ..కోలుకో లేక చని పో తాడు తండ్రి .అంతకు ముందే ఈ దరిదప
్ర ు జీవితం వెగటుగా
తోచి తల్లి తన దారి తాను చూసుకొంటుంది .’’కానెరీ ‘’నడుపుతూ వేరోకడిని పెళ్లి చేసుకొని
వెళ్లి పో తుంది .తల్లీ తండ్రీ ఇద్ద రు లేని అనాధ అవుతాడు నీల్ ..కాని తరతరాలుగా వారిది
చేపలు పట్టే వృత్తి .కనుక తమ్ములు ముగ్గు రి తో కలిసి నీల్ ఒక కొత్త బో ట్ ను కొంటాడు
.మళ్ళీ ఆ కుటుంబం సముద్రం పై జీవనం ప్రా రంభిస్తా రు .
‘’it is an intimate story of a troubled family and an evacuative memorial to the fast
disappearing world of commercial fishermen .In mascular ,poetic prose and with a
powerful sense of authentic ‘on every page ,the author has created a triumphant
novel about our life to childhood and the pull of the sea ‘’
‘’the fisherman’s life was empty of pity was his father’s body was out of
balance because his mind was ?could it be that all men were fishermen ,sailors on
a pitiless sea carried the way and that by tide and current ,lost in fog ,lashed by
endless waves if un certainty ?was life itself without balance?Did his father mirror
it in the unseen depths of his heart ?’’ ఇవన్నీ జీవిత సత్యాలే నని పిస్తా యి అవే ఈ
నవలలో అడుగడుగునా ప్రతి ఫలించి గొప్పదనాన్ని చేకూర్చాయి .
అంతే కాదు ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన నవల ‘’the old man on the sea ‘’కు
నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయమూ గుర్తు కొస్తు ంది నిజ జీవితాలను అద్భుత శిల్పం తో
మలిచాడు హెమింగ్వే .హాట్స్ ఆఫ్ అని పిస్తు ంది .హెమింగ్వే కు నోబెల్ పురస్కారం లభించింది
అని ఒక సారి తన తో విజయ వాడ రోడ్డు మీద నడుస్తు న్న విశ్వనాధ తో ప్రో లా ప్రగడ సత్య
నారాయణ మూర్తి గారు అన్నారట .విన్న విశ్వ నాద ‘’ఒరే నువ్వు ఆ నవల చదివావా
?’’అని అడిగారట .అయన ‘’లేదు ‘’అని అన్నారట .’’మీరు చదివారా గురువు గారూ ‘’అని
మళ్ళీ మూర్తి గారి ప్రశ్న ..దానికి విశ్వనాధ ‘’ఒరే ఆ నవల మార్కెట్ లో రిలీజ్ అయిన
వెంటనే నాకు అమెరికా నుంచి మిత్రు డొ కడు కాపీ పంపాడు .వెంటనే చదివేశా ..దీనికి ఏదో
గొప్ప ప్రైజ్ వస్తు ందని అనుకొన్నా ‘’అన్నారట .’’దీనికి నోబెల్ రావటం పై మీ అభిప్రా యం
?’’మళ్ళీ ప్రో లా ప్రగడ వారి సంధించిన ప్రశ్న .కల్ప వృక్ష స్వామి ‘’ఒరే వాడు మన’’ గీత
‘’ను అర్ధం చేసుకోన్నాడురా .మన వేదాంతానికి అంత ప్రా చుర్యం ఉంది .దాన్ని చిన్న కధలో
ఇమిడ్చి ప్రతి వాక్యాన్ని రసాత్మకం గా రాశాడురా ..’’కర్మన్యేవాదికారస్య ‘’అన్నదే దీనిలోని
ముఖ్యమైన ముడి .దాన్ని అందుకున్నాడ్రా హెమింగ్ వే .అందుకే నోబెల్ వచ్చింది .మనం
అన్నీ ఇవే చెబుతాము కాని నవలా, కదా, నాటకాలలో వీటిని నిక్షిప్త ం చేస్తే హిందూ భూతం
పట్టిందేమో నని మన వాళ్ళు అనుకొంటారన్న భయం మనకు .కాని వాడు భారతీయ ఆత్మ
ను పట్టు కోన్నాడ్రా .అందుకే అంత అత్యుత్త మ పురస్కారం కొట్టేశాడు మనం కూడా గర్వ
పడాలి భావం మనదే అయి నందుకు .హెమింగ్ వే ను చూసి ‘’అని మన సారా
అభినందిన్చారట వేయి పడగల స్వామి .ఈ విషయాలన్నీ 2002 మార్చి లో బెజవాడ లో
భారతీయ సాహిత్య పరిషద్ ‘’కదా రచన ‘’పై ఒక సెమినార్ జరిగితే ప్రో లా ప్రగడ వారే
స్వయం గా చెప్పారు నేనూ, మా బావ మరది ఆనంద్ కూడా ఆ సెమినార్ లో పాల్గొ న్న
వాళ్ళమే .
ఇప్పుడు నేను రాసిన the fisherman’s son ‘’గురించిన విషయం మాత్రం మొదటి
సారి2002 లో అమెరికా వెళ్లి నప్పుడు చదివి,16-7-2002 మంగళ వారం నా డైరీ లో
రాసుకొన్న విషయాలు.ఇప్పుడు మీ కోసం అందించాను .ఇలాగే కొన్ని పుస్త కాలు కొందరు
రచయితలపై అప్పుడు నేను చదివి రాసుకొన్న విషయాలు వీలు వెంట మీకుఅంద జేస్తా ను .
బాలి
బాలి లో భగ వంతుడు
ఇండో నేశియా లోని బాలి లో హిందూ మతం విస్త ృతం గా వర్ధిల్లి ంది .వర్ధిల్లు తోంది .అక్కడ వినాయకుడి
విరిగిన దంతం విషయం లో ఒక చర్య చేబడతారట .ఇది మన దేశం లోని కధకు ఆధారం.చిన్న పిల్లలకు పై దవడ
లోని ఆరు ముందు పండ్ల ను మత పెద్ద, సాన పెడతాడట .ఈ ఆరు కామ ,క్రో ధ ,లోభ ,మద ,ఈర్ష్య ,మోహ
గుణాలకు ప్రతీకలు గా భావిస్తా రట .వారి దేశం లో చెడ్డ దెయ్యం అనేది లేదు .వాటిని సౌమ్య జీవులుగా భావిస్తా రట
.వాటికి కావలసినవి నైవేద్యం పెట్టి ,దాన్ని దైవం గా మార్చటానికి ప్రయత్నిస్తా రట .చెడును చంపటం వాళ్ల కు ఇష్ట ం
లేని పని .వాటిని మార్చటమే వారి ధ్యేయం .వాళ్ళ దృష్టిలో శివుడు అంటే సంహారకుడు కాదు .శివుడు మార్పు
తెచ్చే వాడు కాని నాశన కారుడు కాదు .దేవుడు సృష్టించినది ఏదైనా చెడు అని అంటే ,లేక దేవుడికి ఇష్ట ం లేదని
అంటే దేవుడే చెడ్డ వాడు అనే అభి ప్రా యం కల్గు తుందట .అదీ దేవుడే సృష్టించాడు కనుక చెడ్డది అంటూ లేనే లేదు
ముస్లిం దేశం కాని అక్కడ ఆ భేదం ఎక్కడా కానీ పించాడు .బాలి లో దేవాలయాలను ,ఇళ్ల ను నిర్మించే టప్పుడు
''భూమి పూజ ''చేస్తా రు .దీనికొక అర్ధం వారు చెబుతున్నారు .అదేమిటంటే ''బాలి లో ఉన్న హిందువు లైన మేము
ఇక్కడి భూమి పుత్రు లమే ఎక్కడి నుండో ఇతర మైన చోట్ల నుంచి వచ్చిన వారం కాము అని తెలియ జేయటానికే
''అని చెబుతారు .
బాలి లో హిందూ మతం క్రీ.శ .500 లో ప్రవేశించిందని తెలుస్తో ంది .మార్కండేయ మహర్షి ఇక్కడ
హిందూ మతాన్ని స్థా పించాడని వారి విశ్వాసం .1500 లో మహర్షి ద్విజేంద్ర బాలి కి వచ్చారట .నాలుగవ శతాబ్ద ం
లో మొదటి హిందూ సామ్రా జ్యాన్ని ,కుల వర్మన్ స్తా పించాడని చరిత్ర చెబు తోంది .ఇక్కడికి వచ్చిన హిందువులు
అందరు దాదాపు దక్షిణ భారత దేశం నుంచి ఒరిస్సా రాష్ట ం్ర నుండే వచ్చారట .ఇక్కడ శైవ ,శాక్తేయ ,తంత్ర ,పురాణ
,వైష్ణవ బుద్ధ ఆరాధనలు కన్పిస్తా యి .ఇవన్నీ కలిసి పో యి ఇప్పుడు శైవ సిద్దా న్త మొక్కటే కానీ పిస్తో ంది .అందుకే
ఇండో నేషియా ను ''శైవ సిద్ధా ంత ఇండో నేషియా ''అంటారు .కనుక బాలినీయుల హిందూ మతం అంటే శైవ
సిద్ధా ంతమే .ఇక్కడ ద్వైత ,అద్వైత సాంప్రదాయాలు రెండు ఉన్నాయి .మజీవుడికి దేవుడికి భేదం ఉంది అంటే
ద్వైతులు నమ్ముతారు .జీవుడే దేవుడు అంటే అద్వైతులు ఆనందిస్తా రు .ఈ రెండూ కూడా బాల్నీస్ ను బాల మైన
హిందువులు గానే చేసింది కాని భేద భావాన్ని కల్గించక పో వటం ఇక్కడి గొప్ప విషయం .
బాలినీయులు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లా రు .కుతుమ్బాలతోనే కలిసి వెళ్తా రు .అందరు కలిసి
దేవాలయానికి వెడితే దేవుడు సంతోషిస్తా డనే నమ్మకం వారిది .వారు అతిధులకు నమస్కారం చేసి ''ఓం స్వస్తి
రస్తు ''అని పలకరించటం సంప్రదాయం ''.భగవదాశీర్వాదం మీ పైన వర్షించు గాక ''అని అందులోని అర్ధం .బాలి లో
600 మంది పూజారులున్నారు .అందరు బ్రా హ్మణులే .ఇక్కడ ''అబ్రా హ్మణుడు ''అనే మాట విని పించదు .ఆది
నేరం .పూజారులు అన్ని కులాల కు సంబంధించిన వారూ ఉన్నారు .గురు శిష్య సంప్రదాయం లో వారికి శిక్షణ
నిస్తా రు .ఆడ వారు కూడా పూజార్లు గా ఉండటానికి అర్హత ఉంది .సాధారణం గా భార్యా భర్తా కలిసి కార్య క్రమాలను
నిర్వ హిస్తా రు .అలా చేస్తే ఫలితం ఎక్కువని వీరి నమ్మకం .ఇక్కడి దేవుళ్ళు ముఖ్యం గా ముగ్గు రు .వారే మన
త్రిమూర్తు లు బ్రహ్మ, విష్ణు , శివుడు .బాలి లో తమ పూర్వీకులు అందించిన సంస్కారాల వల్ల తర తరాలుగా
ప్రశాంతం గా జీవిస్తు న్నామని చెబుతారు .వాటి వల్లే తాము శక్తి వంతం గా బలీయం గా ఉన్నామని అంటారు
.అక్కడ విగ్రహారాధన ఉండదు .ఎత్తైన వేదికల మీద దేవుళ్ళను ఆహ్వానించి వారికి పూజ చేస్తా రు .ఈ విధానం
అంతా పూజారే నిర్వ హిస్తా డు .అతనికి సహాయ కులుంటారు .బాలి లో గ్రా మాన్ని ''దేశం ''అంటారు .దేశం లో అంటే
గ్రా మం లో బ్రహ్మ గుడి ఊరికి మధ్యన ,విష్ణు గుడి పొ లాల దగ్గ ర ,శివాలయాన్ని శ్మశానం దగ్గ ర నిర్మిస్తా రు .గ్రా మం
లోని భూమి అంతా అందరిదీ .అందరు వచ్చి దేవాలయాలలో పూజ చేయాలి .గ్రా మ నిబంధనలను పాటించక పో తే
గ్రా మం వదిలి వెళ్లి పో వచ్చు .హిందూ మతం లో నుంచి ఇంకో దాని లోకి మారినా గ్రా మం వదిలి వెళ్లి పో వాల్సిందే
అనేక శతాబ్దా లుగా బాలి లో హిందూ సంస్కృతి నిలిచి ఉండటానికి కారణం తమ సహన శీలతా ,చిరు నవ్వే నని
వారు చెబుతారు .''నవ్వు అనే సంస్కృతి నర నరానా జీర్నిన్చుకొన్న వాళ్ళం మేము'' అని గర్వం గా
ప్రకటిస్తు న్నారు .2002,2005 లలో టెర్ర రిష్టు లురెండు సార్లు విరుచుకు పడినా నవ్వు తోనే వారిని
ఎదుర్కొన్నామని చెబుతున్నారు .మౌనం ,ప్రా ర్ధన లతో వారికి సమాధానం చెప్పారట .ప్రతి రోజు దేశాన్ని
కాపాడమని సామూహిక ప్రా ర్ధనలు చేశారట .ఒక్క హిందువు ల కోసమే కాదు మొత్త ం ఇండో నేషియాకోసం
ప్రా ర్ధనలు చేశారు వారు .ప్రతి రోజు ప్రత్యెక ఉత్సవాలు నిర్వ హించారట .అందరి సంక్షేమం కోసమే ప్రా ర్దిన్చామని
వారు చెప్పారు .''ఆ దేవ దేవుని నుండి మాకు ఆశీర్వాదం, శక్తి లభిస్తా యి ''అని నమ్మకం గా చెప్పారు .
భారత దేశం తో సాంస్కృతిక సంబంధాలను నేల కొల్ప టానికి డాక్టర్ కరణ సింగ్ నాయకత్వం లో'' Indian
council for cultural relations ''అనే ప్రభుత్వ సంస్థ బాలి లో ఒక విభాగాన్ని ఏర్పరచింది .సాధారణం గా
ఇలాంటివి దేశానికి ఒకటి మాత్రమె ఉంటాయట .కాని ఇండొ నీషియా లో రెండు కేంద్రా లను ఎర్పరచారట .ఒకటి
జకార్తా లో ,రెండో ది బాలి లో .దీని ఆధ్వర్యం లో అన్ని పండుగలు నిర్వ హిస్తా రు .యోగా తరగతులు నిర్వ హిస్తా రు
.భరత నాట్యంనేర్పిస్తా రు .హిందీ నేర్పుతారు .ఇక్కడి విద్యార్ధు లకు సంవత్స రానికి 30 స్కాలర్షిప్పులను ఇండియా
లో చదువు కోవటానికి ఇస్తా రు .అక్కడి వారు గణేష్ చతుర్ధి ని వైభవం గా నిర్వ హిస్తా రు .Neiypi ,అనే పండుగను
,ప్రతి రెండు వందల పది రోజులకో సారి వచ్చే ''galungaan '' పండుగను చేస్తా రు .ఇది పది రోజుల పండుగ .ఆ పది
రోజుల్లో దేవత లంతా భూమి మీదకు దిగి వస్తా రని వీరి నమ్మకం .యజ్న కర్మలను నిర్వ హిస్తా రు .1960 కి
ముందు హిందువులు చాలా మంది క్రిస్టియన్లు గా మారారట.కాని ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకు అందరు
లందరూ ఒకే కుటుంబం లాగా కలిసి ఉంటారు .సంస్కృతే వారిని ఒకే కుటుంబం లా కలిపి ఉంచు తోంది .ఇక్కడ
రక్షణ కోసం పో లీసు వ్యవస్థ లేదు .ప్రతి గ్రా మం లో ప్రతి మూలా పౌరులే రక్షణ వ్యవస్థ ను నిర్వ హించటం ఇక్కడి
ప్రత్యేకత .వీరిని ''పాచాలకులు ''అంటారు .అలాగే ఇక్కడ వివాహం జరిగితే తలిదండ్రు లకు బాధ్యత తక్కువ
.సమాజమే ఆ బాధ్యత నిర్వ హిస్తు ంది .ఎవరిని పెళ్ళికి పిలవాలో అక్కర్లేదో యజమానికేమీ సంబంధం లేదు .పెళ్లి
రోజు ను చెప్పటమే తలిదండ్రు ల బాధ్యత .ఇక్కడి గ్రా మ పెద్ద ''బంజార్ ''యే అందర్నీ ఆహ్వానిస్తా డు .ఆయనే పెళ్లి
పెద్ద .అన్నీ గ్రా మమే ఏర్పాటు చేస్తు ంది .అలాగే ఇంట్లో ఎవరైనా చని పో యినా అంతే .గ్రా మానిదే అంతా బాధ్యత
.చావు యే ఒక్కడి విచారము కాదు .అందరిదీ .పెళ్లి ఎలాగో ఇదీ అంతే .ఇదీ ఇక్కడి సమాజ బాధ్యత
.బాలినీయులు తాము తమ కుటుంబం తమ సమాజం ,తమ దేశం కోసం ప్రా ర్ధనలు చేస్తా రు .అందరు కలిసి
సామూహికం ప్రా ర్ధించటం ఇక్కడి గొప్పతనం ,ప్రత్యేకతా .ఇదే సమాజాన్ని కలిపి ఉంచు తుంది .సమైక్య భావన,
హిందువులు ఇతర మతాల్లో కి మారి పో కుండా ఉండ టానికి బాలి లో ''institute of Hindu dharma
''ను ఏర్పాటు చేసుకొన్నారు .స్వామి వివేకా నంద ,సత్య సాయి బాబా ల ప్రభావం ఇక్కడ బాగా పని చేసింది
హిందూ అనాధ పిల్లలకు రక్షణ కల్పిస్తు న్నారు .ఎనిమిది అనాధ ఆశ్రమాలను ఏర్పరచి సేవ లందిస్తు న్నారు
.అందరికి శాకా హార భోజనమే .బాలి ఇండియన్ ఫ్రెండ్షిప్ అసో సియేషన్ దీన్ని పర్య వేక్షిస్తు ంది .భారతీయ
సంప్రదాయాలను ఇక్కడ ఇంకా పటిష్టం గా అనుసరిస్తు న్నారు .ఎడమ చేతి తో ఏదైనా ఇవ్వటం కాని చూపుడు
వ్రేలితో ఎవరి నైనా చూపించటం కానిచేయరు .అలా చేస్తే అపవిత్రం గా భావిస్తా రు .వారి భావన ప్రకారం భారత
దేశం లోని హిందువులు కలుషితం అయారు .కాని ఇక్కడి హిందువులు చాలా స్వచ్చం గా ఉన్నారు అంటారు.
వారి ఉన్నత సంస్కారం మనందరికి ఆదర్శనీయం అని బాలి ని సందర్శించిన హిందువులు చెబుతున్నారు .
బాలి కమ్యునిస్టు వ్యతి రేక భావనలున్న ప్రదేశం .1960 లో ఇక్కడి ప్రభుత్వం మత విధానాలకు ఒక
మంత్రిత్వ శాఖ ను ఏర్పరచింది కాని అందులో'' ఆగమ తీర్ధం '' అనే దానికి మాత్రం గుర్తింపు నివ్వ లేదని బాలీ
హిందువులు బాధ పడతారు .ఇక్కడి ముస్లిములు హిందూ పేర్లను పెట్టు కొంటారు .ఇక్కడి శూద్రు లు అంటే
ఇండియా లో లాగా తేలిక భావం లేదు .గర్వం గా భావిస్తా రు .రామాయణ మహా భారతాలు వారి జీవన సంస్కృతి
లో భాగమై పో యాయి .వీటికి సంబంధించిన నాటకాలలో ముస్లిములు ఆ పౌరాణిక పాత్రలను ధరించి రంజింప
జేస్తా రు .అక్కడి ఒక హిందూ పెద్ద చెప్పిన విషయం గుర్తు ంచు కో తగినది ''అయిదు వందల ఏళ్ల క్రితం
హిందువులు బాలి లోకి ప్రవేశించారు .వారి మతాన్ని కాపాడు కోవటం కోసం'' పంది మాంసాన్ని'' తిన్నారు .అలా
చేయటం వాళ్ళ ముస్లిములు తమను మతం మార్చుకోమని బల వంతం చేయరు అని భావించారు .ఆ ''స్ట్రే ట జి''
ఫలించింది .కనుక మతాంతీకరణ చాలా అరుదు గా జరిగి వీరంతా హిందువులు గా నె ఉండి పో యారు .
ఇక్కడి పూజారులు త్రీ సంధ్య లలో పూజ చేస్తా రు ఆరు శ్లో కాలను చదివి పూజ నిర్వ హిస్తా రు .మొదటి
శ్లో కం లో భూమి ఆకాశం ,స్వర్గా లను దేవతలు అని సూర్యుడు దేవుని ప్రతి నిది అని తమ లోని ఉన్నత భావాలకు
ఆ కాంతి కారణం అనీ అర్ధం వచ్చే శ్లో కంచదువుతారు . .రెండో ది నారాయణునికి చెందింది .నిర్గు ణ నిరాకార
స్వయంభు గా ఏక నిరంజన్ గా ఆయన్ను స్తు తించే శ్లో కం .మూడవది శివుడికి చెందినది .ఆయనే మహాదేవుడు ,
ఈశ్వరుడు , బ్రహ్మ,విష్ణు ,రుద్రా ,పురుష , అని భావిస్తా రు .అన్నిటికీ ఆయనే మూలం .సర్వ శక్తి మంతుడు .నాల్గ వ
శ్లో కం లో తామంతా పాపాత్ములమని తమ పాపాలను పో గొట్ట మని దుఖం పో గొట్టి ,శారీరక మానసిక బౌద్ధిక శాంతిని
కల్గించమని ప్రా ర్ధిస్తా రు .అయిదవ దానిలో మహా దేవుడిని ముక్తిని ఇవ్వమని కోరుతారు .మార్గ దర్శి యై మంచి
మార్గ ం లో ప్రయానిన్చేట్లు చేయమని ప్రా ర్ధిస్తా రు .ఆరవ శ్లో కం లో చేసిన తప్పులు పాపాలు క్షమించి శాంతి
సుఖాలను త్రీ శాంతులను ఇవ్వ మని ప్రా ర్ధిస్తా రు .వీటి వల్ల నే ఇక్కడి హిందూ ధర్మం సజీవం గా శతాబ్దా ల పాటు
ఉంది అని బాలినీయుల భావన . ఇక్కడ ''మహర్షి మార్కండేయ యోగా సిటి ప్రా జెక్ట్ ''యోగా శిక్షణ నిచ్చే అతి పెద్ద
బాలీ దేవాలయాలు
బాలీ లో చాలా దేవాలయాలున్నాయి .అందులో గొప్ప దేవా లయం అని పించుకోన్నది ''మదర్ బెశాఖి
దేవాలయం ''.ఇది 3610 అడుగుల ఎత్తు న మౌంట్ ఆగంగ్ పై ఉంది .మన మేరు పర్వతం గా వారు దీన్ని భావిస్తా రు
.నిజం గా ఇది ఇరవై రెండు దేవాలయాల సముదాయం .ఇది పది హేడవశాతాబ్ద పు నిర్మిత దేవాలయం .ముందు
గా ఇక్కడ''పురా గోవా రాజ గుహ'' దేవాలయాన్ని ను చూడాలి .ఇక్కడ దేవాలయాలకు వెళ్ళాలంటే ప్రత్యెక మైన
దుస్తు లు ధరించాల్సిందే.సామ్ప్రదాయమైన సారంగు ,శిరస్త్రా నం ధరించి లోపలి వెళ్ళాలి .అన్ని దేవాలయాలు ఆరు
బయటే ఉంటాయి .కాని ఇది ప్రత్యేకంగా గుహలో ఉంటుంది .దీనికో కధ ప్రచారం లో ఉంది .ఒకప్పుడు ఒక దుష్ట
రాజు ఇక్కడ పాలిస్తూ ప్రజల్ని పీడించే వాడు .దేవతలు, రాజు ను శిక్షిం చ టానికి మూడురకాల సర్పాల రూపం లో
వచ్చారు .బ్రహ్మ భూమి నుండి అనంత భోగ నాగు బామునేక్కి వచ్చాడు .విష్ణు నీటి నుండి వాసుకి నాగునేక్కి
వచ్చాడు .ఈశ్వరుడు ఆకాశం నుండి తక్షక నాగ రూపం లో వచ్చాడు .అవన్నీ ఇక్కడే పరి వేష్టించి ఉన్నాయి
.దీనికి ఒక పర మార్ధం ఉందని బాలీవాసులంటారు .భూమి ,నీరు ,గాలి ఇక్కడ సమ తూకం గా శాంతియుతం గా
ఉంటాయని అందు వల్ల ప్రపంచం సమతా స్తితి లో ఉంటుందని వీరి నమ్మకం .ఈ దేవాలయం ఆ మూడింటిని
మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్తే లక్ష్మి దేవాలయం వస్తు ంది .చాలా ప్రశాంత మైన వాతా వరణం .ఇక్కడ
కూచుంటే చిత్త శాంతి కలుగు తుంది .ప్రకృతి అందాలు పర వశింప జేస్తా యి .భక్తు లు తెల్ల వస్త్రా లతో తెలుపు
, ,పసుపు రంగు గోడుగులతో దర్శనాలకు వస్తా రు .ఇక్కడికి వచ్చిన వారు తమ పూర్వీకులు దేవతలుగా
మారాలని కోరు కొంటారు .అక్కడి పూజారి పవిత్ర జలాన్ని అందరి శిరస్సు ల మీదా చల్లు తాడు .నైవేద్యం పెట్టిన
బియ్యాన్ని అందరికి ప్రసాదం గా పంచి పెడతాడు .బియ్యమే ఇక్కడి ప్రసాదం .ఇక్కడ దేవాలయాలకు చెప్పులు
వేసుకొని లోపలి వేళ్ళ వచ్చు .అయితే పూజ చేయిచు కొనే వారు మాత్రం చెప్పులు వదిలి వెళ్ళాలి .
ఇక్కడి ''దేనా పాసార్ ''అనే చోట ద్విజేంద్ర ఫౌండేషన్ స్కూల్ ఉంది .అందులో 4000 మంది విద్యార్ధు లు
చదువు కొంటున్నారు .ఇక్కడ వీరికి.''HINDU HUMAN RESOURCES'' లో శిక్షణ నిస్తా రు .మతం, సంస్కృతి
,సాహిత్యాల పై అభినివేశం కల్గిస్తా రు. అవగాహన పెంచటమే వీరి ధ్యేయం .దీన్ని 1953 లో శ్రీ దాంగ్ హయాంగ్
ద్విజేంద్ర కట్టించారు .ఆది ఎనిమిదో శతాబ్ద పు జావా పూజారి స్మారకార్ధం అదే పేరు మీద నిర్మిత మైంది .ఈయనే
బెశాఖి దేవాలయాన్ని నిర్మించాడు .ఆ విద్యా లయం లో ద్వారం దగ్గ ర భారీ సరస్వతి, గణపతి విగ్రహాలుండి
గా ఉంటుంది .ఇక్కడ మతాతీత విద్యనే బో ధిస్తా రు .బి.యే.వరకు విద్యా బో ధన ఉంటుంది .ఇక్కడ చదివే వారిలో
99% హిందూ విద్యార్ధు లే .ప్రభుత్వం ఫ్రీ గా పుస్త కాలు అందిస్తు ంది .ఏడాదికి250 మంది విద్యార్ధు లకు ఉచితం గా
విద్య నేర్పిస్తా రు .కాని దీనికి హిందూ స్కూల్ అనే పెరుండదు అంతే .12 మంది టీచర్లు ,హిందూ ధర్మాన్ని
యోగాను బో ధిస్తా రు .ఫీజులు చాలా తక్కువ .కిండర్ గార్టెన్ విద్యార్ధికి నెలకు యాభై ఆరు అమెరికన్ సెంట్లు
మాత్రమె .సెకండరి వారికి ఒక డాలరు ముప్ఫై ఆరు సెంట్ల ఫీజు మాత్రమె .తొమ్మిదో గ్రేడ్ లో అవతారాలను ,నీతి
చెబుతారు .రామాయణ ,మహా భారత, భగవద్ గీత లను బో ధిస్తా రు . .భజనలు ,యోగా ,మంత్రా లు ,దేవతారాధన
,నైవేద్య విధానం నేర్పుతారు .విద్యార్ధు లు ప్రతి రోజు స్కూల్ కు రాగానే అక్కడ ఉన్న దేవాలయానికి అందరు వెళ్లి
దేవతలకు నైవేద్యం సమర్పిస్తా రు .ప్రా ర్ధన చేస్తా రు .ప్రతి పౌర్ణమి నాడు నాలుగు వేల మంది విద్యార్ధు లుసాంప్రదాయ
దుస్తు లు ధరించి సామూహికం గా పూజ నిర్వ హించి నైవేద్యం పేడ తారు .చూడటానికి రెండు కళ్ళు చాలవు
.ఇక్కడ బో ధించే ఉపాధ్యాయులు ''హిందూఇజం మాకు స్తిర చిత్తా న్ని ,ప్రశాంతతను ప్రసాదిస్తు ంది ''అని చెబుతారు
జీవితం లో అనుభవం లోకి తెచ్చుకోవటానికి ఆ స్కూల్ పుపయోగ పడుతోందని, విచక్షణ పెరుగు తోందని ,మంచి
చెడు తెలుసుకో గలుగుతున్నామని అంటారు .తాము యే వ్రు త్తి లో ఉన్నా మంచి ,మానవత్వం ఉన్న
బాలి లో ''హిందూ యూని వేర్సిటి '' ఉంది .ఇది ప్రైవేట్ సెక్యులర్ విద్యా లయమే అయినా హిందూ
ధర్మాన్ని తప్పక బో ధిస్తా రు .చదువు లో అదొ క భాగమే .ఊబాద్ అనే చోట'' ఆర్ట్ సెంటర్ ''ఉంది .అక్కడ బాలి
సంస్కృతిని ,వేదాంతాన్ని ,కళలను నేర్పుతారు .అవి సకల సమాజానికి ఎలా ఉప యోగా పడాలో బో ధిస్తా రు .బాలి
లో పద హారు సంస్కారాలను పిల్లలకు చేస్తా రు .అందులో పై దవడ ముందు ఆరు పండ్ల కు మెరుగు పెట్టటం ఒకటి
.ఇక్కడి ముఖ్య పూజారి కొన్ని కథిన నియమాలను పాటించాలి ఆయన మోటార్ సైకిల్, కారు లను నడప రాదు
.షాపింగు కు వేళ్ళ రాదు .సినిమాలు చూడ రాదు .పేకాట వ్యభిచారాలకు దూరం గా ఉండాలి .పూర్తీ శాకాహారమే
భుజించాలి .ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వేళ్ళ రాదు .ఎవరో ఒకరు తోడు ఉండ గానే వెళ్ళాలి
.బాలి లో దేవాలయాలను కట్టే వారిని ''అందగీలు ''అంటారు .వీరికి విశ్వ కర్మ ప్రధానం గా ఆరాధనీయుడు .ఇల్లు
,దేవాలయం నిర్మాణం మొదలు పెట్టెటప్పుడు భూమి పూజ చేస్తా రు .నిర్మాణం పూర్తి కాగానే ''మలపాస్ ''అనే
తంతు జ రుపుతారు .దీని వల్ల నిర్మాణానికి జీవ శక్తి లభిస్తు ందని భావన .పంచ ధాతువులను నిక్షేపిస్తా రు .అవి
బంగారం వెండి ,రాగి ఇనుము రూబీ .ఇవి పంచ మహా భూతాలకు ప్రతీకలు .
బాలి లో సాంప్రదాయ హిందూ ధర్మాన్నే పాటిస్తా రు .శంకర ,రామానుజ మొదలైన వారు సంస్కరణల
పేరు తో దీన్ని కలుషితంచేశారని భావిస్తా రు ఇది నవీన హిందూ ధర్మమని దాన్ని పాటించం అనీ అంటారు .''ఆర్ద
డాక్సు హిందూఇజం ''నె ఆచరిస్తా మని గర్వం గా చెప్పుకొంటారు .జంతు బలి వారికి నిషేధం లేదు .దేవుడిని
మూడు లెవెల్స్ లో పూజిస్తా రు .వారిది శైవ సిద్ధా ంతం అని మనం ముందే చెప్పుకొన్నాం .పరమ శివుడు అత్యంత
ఉన్నతుడు .ఆయన్నే''IDA SANGHYANG WIDI WASS '' అంటారు .ఈయనే వీరికి సర్వోత్కృష్ట దైవం .ఆ తరువాత
సదా శివుడిని ఆ తరువాత శివుడిని ఆరాధిస్తా రు .పరమ శివుడు నిర్గు ణుడు ఆయనకు ఆకారం లేదు .సదా
శివుడు ''అర్ధనారీశ్వరుడు ''అంటే సగుణ ,నిర్గు ణ మాత్రమె కాక రెండూ ఆయనే .శివుడు ,శక్తీ అన్న మాట.మూడవ
రూపం శివుడు .శివుడిని మహా రాజు గా భావించి ఆరాధిస్తా రు .ఇదే శైవ సిద్ధా ంతం .
దుర్గా దేవిని అంటే పార్వతి దేవిని, శివుడిని కొలుస్తా రు .వారిద్దరూ ఒకే నాణానికి బొ మ్మా బొ రుసు
అనుకొంటారు .ఏదైనా వింత జరగాలని మనసులో ఉంటె దుర్గా మాతను సేవిస్తా రు .ఆమెను పది హేను రోజుల కొక
సారి జంతు బలి తో పూజ చేయటం సంప్రదాయం .అక్కడ పూజా విధానం లో మూడు మార్గా లున్నాయి
.వామాచారం బెంగాల్ నుంచి వచ్చిందని చెబుతారు .తాంత్రిక విధానం ఇందులో ఉంటుంది . మనిషి పగలు
మానవుని గా ,రాత్రి పశువు గా కనీ పిస్తా డు .ఇదే వామ మార్గ ం .శక్తి మార్గ ం .అలాంటి శక్తి కల వాడు ఎవరి చెయ్యి
పట్టు కొన్నా వాళ్ళ చెయ్యి పక్షవాతం వచ్చి నట్లు చచ్చు బడి పో తుంది .పర్యాటకులు తమ సామ్ప్రాదాయానికి
ఇబ్బంది కలిగించ కూడదని వీరు కోరు కొంటారు .బాలీయులు త్రికరణ శుద్ధి పాటిస్తా రు .మంచిగా ఆలోచించటం
,మంచిగా మాట్లా డటం ,మంచి చేయటం వారికి అలవాటైన విషయం .వారికి మూడు ''హిత కరణాలు''చాలా
అభిమానమైనవి .అవే -ప్రకృతి పట్ల ఆరాధనీయభావన ,మానవుల యెడ సుహృద్భావం ,భగ వంతుని యెడ
అపార విశ్వాసం .వారి జీవితం లో ''పంచ యజ్ఞా లకు ''ప్రా ముఖ్యం ఉంది .మానవులకు ,జంతువులకు,దేవతలకు
,తమ పూర్వీకులకు ,ఋషులకు కానుకలు సమర్పించటం .ఇవన్నీ పాటిస్తే తాము'' సదా శివులం'' అయి
బాలీ ద్వీపం లో కళలు అద్భుతం గా వర్ధిల్లు తున్నాయి .అవి అక్కడి సంస్కృతి ,ప్రజల మనోభావాలను ప్రతి
బిమ్బిస్తా యి .అందులో దేవాలయ శిల్ప కళ ,నాట్యం ,చిత్రకళా ,సంగీతం ,నాటకం అన్నీ చాలా బాగా
రాణిస్తు న్నాయి .ఈ కళలన్ని భగవ రాధన గా భావిస్తా రు .ఇక్కడ యే కళ అయినా రామాయణ ,మహా భారత లే
ప్రా తి పదికలు గా ఉంటాయి .తోలు బొ మ్మ లాటకూ ప్రా ధాన్యత ఉంది .మతమే బాలి లో సంస్కృతికి మూల బీజం
.పదహారవ శతాబ్ద ం నుండి ,ఇరవై శతాబ్ద ం వరకు క్లా సికల్ కల్చర్ కు తూర్పు బాలి కేంద్రమైంది .ఊబుద్ ఇప్పుడు
ఆధునిక కళకు నిలయమైంది .
1920 వరకు సాంప్రదాయ ''కామసాన ''పద్ధ తిలో చిత్రకళా సాగింది ఇవి టు డైమెన్ష న్ కలవి .వీటిని వస్త ం్ర లేక
చెట్టు బెరడు మీద గీసే వారు .సహజ వర్ణా లను వాడే వారు .తక్కువ రంగులే ఉపయోగించే వారు .1930 లో
పాశ్చాత్య ప్రభావానికి లోనైంది .కొత్త పదార్ధా లను వాడటం ప్రా రంభించారు .అయినా బాలి సంస్కృతికి భిన్నం గా
లేకుండా జాగ్రత్త పడ్డా రు .దీన్నే'' modern traditional Balinese painting ''అని పిలుస్తా రు .ప్రపంచం లో చాలా
దేశాలలో వీరి చిత్రా లను ప్రదర్శిస్తా రు .మ్యూజియమ్స్ లో అలంకరిస్తా రు .సాధారణం గా దేవుళ్ళ దేవతల చిత్రా లే
ఎక్కువ గా ఉంటాయి .వీరే వారికి స్ఫూర్తి .తమ చిత్రా ల ద్వారా భగ వంతుడిని సేవ చేయ వచ్చు నని వాళ్ళ అభి
ప్రా యం .
దేవాలయ శిల్ప కళ ఇక్కడ బాగా వర్ధిల్లి ంది .ప్రా చీన ఆచారాలనే వారు పాటిస్తా రు .నిర్మాణమంతా ''హస్త
కౌశల కౌశలి ''పద్ధ తి లో ఉంటుంది .ప్రతి శిల్పి తన తండ్రి లేక తాత నుంచి వారసత్వం గా ఈ కళను పొ ందుతాడు
.ఇదొ క పరమ పవిత్ర కార్యం గా వారు భావిస్తా రు .దీనికి డబ్బు ఏమీ తీసుకోరు .అలా దేవాలయనిర్మాణాన్ని చేసే
వారిని ''ఉదంగి ''లంటారు .వీరికి ఉదర పో షణకు వేరే వ్యాప కాలుంటాయి. కనుక ధనం ప్రధానం కాదు .అలా
తీసుకొంటే తప్పు అని అంటారు ఇన్ని దేవాలయాలను ఇళ్ల ను కట్టినా ఇందులో చాలా మంది ఉదంగి లకు స్వంత
ఇల్లు ఉండడదు .
బాలి దీవి లో పదహారవ శతాబ్ద ం లో నిర్మించబడిన'' Ubud palace court yard ''అనేది నాట్యానికి
గొప్ప వేదక
ి .ఇక్కడే డాన్సు ,డ్రా మా లను ప్రదర్శిస్తా రు .బాలి మంచి టూరిస్ట్ అట్రా క్షన్ ఉన్న ప్రదశ
ే ం .ఈ కళను
చూసి యాత్రికులు పరవశిస్తా రు .వీటికోసమే వచ్చే వారు చాలా మంది ఉంటారు .హైస్కూల్ లో ప్రా ధమికం గా
అందరికి నృత్యం నేర్పిస్తా రు .వీటికి తోడు ప్రైవేట్ విద్యాలయాలున్నాయి .వీటిని ''సంగార్ ''అంటారు .ఇవి సంస్కృతీ
రక్షక నిలయాలు .పాశ్చాత్య సంస్కృతి వల్ల తమ కళల కేమీ ప్రమాదం లేదని వీరి ధీమా .ప్రతి ఏడాది ''బాలి ఆర్ట్
ఫెస్టివల్ ''జూన్ ,జులై లలో నిర్వహిస్తా రు .అందుకని ఇది ప్రదర్శన కళ గా బాగా రాణించింది దీని ఆత్మ అంతా
హిందూ ధర్మమే నంటారు వాళ్ళు .అక్కడ దేవాలయానికి కాని వివాహాది శుభ కార్యాలకు కాని ఉత్స వాలకు కాని
అందరు సాంప్రదాయ దుస్తు లనే ధరించి వెళ్ళాలి .అలానే వెళ్తా రు కూడా .కళలు వినోదానికి మాత్రమె కాదని
రిథం కు ప్రా ధాన్యం .వీరి సంగీతం లో metallo phones ,gongs , ,xylophones ,ను బాగా
ఉపయోగిస్తా రు .వీరి సామ్ప్రదాయమైన వాయిద్యం వెదురు తో చేసిన బూరా దీన్ని ''ఆన్క్లుంగ్ ''అంటారు .రెండు
తీగల ఫిడేల్ వంటి ''రేబాబ్ '' వీరికి చాలా ఇష్ట ం .వీరి డాన్సు లో బో రాంగు డాన్సు ముఖ్య మైనది .ఇందులో
దేవుడు దుష్ట శక్తు లను అణచటం ఉంటుంది .దుష్ట శక్తు ల్ని పరి మార్చటం కాదు కాని, సంస్కరణ వీరికి ఇష్ట ం .ఈ
డాన్సు చాలా సంక్లిష్టం గా ఉంటుంది .పాద విన్యాసాలు చాలా కష్ట ం గా ఉంటాయి .అయినా కష్ట పడి సాధన చేస్తా రు
.ఇది రాజ దర్బారుల్లో ప్రదర్శించే దైవీ కళ .దీన్ని ఆడపిల్లలే చేస్తా రు రజస్వల కాని పిల్లలే చేయాలి .అయిదేళ్ళ
లోపు పిల్లలకే తీవ్రం గా నేర్పటం ప్రా రంభిస్తా రు .ఈ డాన్సు చేసిన వారికి ఉన్నత ఉద్యోగాలు, పదవులు ,రాజ
కుటుంబీకుల తో వివాహాలు జరుగు తాయి .''kecak ''డాన్సు కూడా ముఖ్యమైనదే .ఇది రామాయణం లో కోతి
మూక మాట్లా డటం (monkey chat ).150 మంది గుండ్రం గా కూర్చుని సంబంధిత దుస్తు లు ధరించి చేసేది.
తమాషా గా వింత ధ్వని తో ''కాక్ ''అని ఆయుధాలు పడేస్తా రు .ఇదిరామ రావణ యుద్ధ ం లో హనుమంతునికి
సంబంధించిన కధ .వీరికి చాలా ఇష్ట ం .పపేట్ షో కూడా అమితం గా ఇక్కడ ప్రదర్శింప బడుతుంది నూనె దీపాల
వెలుతురు తో దీన్ని రామాయణ ,మహా భారత గాధలను ప్రదర్శిం ఛే వారు .ఇప్పుడు కరెంటు దీపాలోచ్చాయి .
చిన్నప్పటి నుంచే పిల్లలకు డాన్సు నేర్పుతారు .ఉయ్యాల్లో ఉండగానే సంగీతానికి ప్రా ధాన్యత నిస్తా రు తల్లి
అభినయ ముద్రలను పిల్లలకు నడక రావటాని కంటే ముందే నేర్పిస్తు ంది .ఎంతో మంది గురువులు గ్రా మాలలో
సంగీతం నాట్యం నేర్పుతారు .వారికి తగిన పారి తోషికం లభిస్తు ంది .సంప్రదాయం సంస్కృతి ల మీద అభి రుచే
వీరిని ముందుకు నడి పిస్తో ంది .ఇలా కళలకు కాణాచి గాఉండి బాలి- కళా కేళితో కళ కళ లాడుతోంది .
భలే బాలి
ఎన్నో ప్రత్యేకతలు సంత రించుకొన్న ద్వీపం బాలి .కొత్త సంవత్స రానికి చాలా ప్రా ముఖ్యత ఉంది .మిగతా
దేశాలలో లాగా ఇక్కడ కొత్త ఏడాది వస్తు ంటే టపాకాయలు కాల్చటం తెల్లా ర్లూ మేల్కొని హాపీ న్యు యియర్
చెప్పటం అర్ధ రాత్రి పన్నెండు కు ముందు కౌంట్ డౌన్లు లెక్కించటం ఉండదు .వీరి దృష్టిలో ప్రతి కొత్త సంవత్సరం
మనలోని కల్మశాల్ను విసర్జించుకొని ,శుద్దు లవటానికే నని భావిస్తా రు .కొత్త సంవత్స రాది నాడు సమ్పూర్ణ
మౌనాన్ని పాటించటం బాలీ ప్రత్యేకత .మొత్త ం దీవి అంతా నిశ్శబ్ద ం తాండ వీస్తు ంది .వీరికి రెండు రాకా లైన
కేలన్ద ర్లు న్నాయి .అందులో'' pawukon '' అనే కేలండర్ ప్రకారం ఏడాదికి 210 రోజులే .రెండవది ''saka ''కేలండర్
సూర్య ,చంద్ర గమనం ఆధారం గా ఉంటుంది .దీని ప్రకారం'' nyepi''అంటే కొత్త సంవత్స రాన్ని గణిస్తా రు .2012 లో
ఇది మార్చి నెల 23 న వచ్చింది .ఈ పండుగ తో కొత్త సంవత్సరం ప్రా రంభ మైనట్లు గా భావిస్తా రు .ఇది వసంత
రుతువు ప్రా రంభం లో మార్చి ఏప్రిల్ మధ్య లో వస్తు ంది .మనకూ అంతే .
కొత్త సంవత్సరం కు ముందు రోజు అందరు సముద్రపు బీచి ల వద్ద కు చేరుకొంటారు .అందమైన దుస్తు లు
ధరిస్తా రు .ఈ రోజున ''melaasti ''అనే సంబరం జరుపుతారు .దీని భావం ఏమిటంటే సముద్రా నికి , భూమి కి అధి
దేవత దేవుడే అని తెలియ జేయటం .సముద్ర తీరాన ఉన్న దేవాలయాలలో పూజలు నిర్వ హిస్తా రు .దేవతలకు
నైవేద్యాలు పెడతారు .వరుణ,విష్ణు దేవుల ప్రసాదం గా నీటిని భావించి దాన్ని ''అమృతం ''అని పిలుస్తా రు .ఆ
నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకొని బాహ్య, అంతర శుద్ధి పొ ందుతారు .తీర్ధం గా గ్రహిస్తా రు .ఆ తర్వాతా రోజు ను భూత
యజ్న దినం గా చేస్తా రు .సంవత్సరం లో చేసిన పాపాలు ,తప్పులకు పశ్చాత్తా పం ప్రకటించుకొంటారు .తమలోని
వ్యతి రేక భావాలను విసర్జిన్చుకొంటామని ప్రతిన పూను తారు .ఇది దేవుడికి మనిషికి, ప్రకృతికి ,మధ్య
సమతుల్యతను సాధించటమే .ముందు రోజు స్థా నిక హిందువు లంతా గ్రా మం అంతా తిరిగి వెదురు దీపాలతో
వీలైనంత పెద్ద పెద్ద శబ్దా లను చేస్తా రు .దీనితో చెడ్డ భావాలు చెడ్డ దేయ్యాలు వ్యతి రేక శక్తు లు లు పారి పో తాయని
భావన ,.దీన్ని''ngerupuk ''అంటారు .దీనితో బాలి లోని చెడు అంతా తరిమి వేయ బడిందని అనుకొంటారు ..
ఈ పని అయి పో గానే ద్వీపం అంతా నిశ్శబ్ద ం అలము కొంటుంది .దీన్నే'' nyepi ''.లేక ఉగాది
అంటారు .ఉదయం ఆరు గంటల నుండే నిశ్శబ్దా న్ని పాటించటం ప్రా రంభిస్తా రు .ఇరవై నాలుగు గంటలు పాటు
.అసలు ద్వీపం లో మనషులు ఉన్నారా అన్నంత నిశ్శబ్ద ం ఏర్పడు తుంది .ఆది ఒక్క బాలి లోనే సాధ్యం .ఈ రోజున
స్వీయ భావ పరావర్త నం గా అనుకొంటారు .స్థా నిక సెక్యురిటీ వాళ్ళు నల్ల యుని ఫాం వేసుకొని బజార్ల వెంట
తిరుగుతూ పర్య వేక్షిస్తా రు .యే వాహనాన్ని అనుమతించారు .కాలి నడకా ఉండదు .ఇళ్ళ దగ్గ ర యే పనీ చేయరు
.దాదాపుగా అందరు ఇళ్ళల్లో ఉపవాసం ఉండి పూజాదికాలు నిర్వ హిస్తా రు .అగ్ని ప్రజ్వలన ఉండదు
.విద్యుద్దీపాలార్పెస్తా రు .వీధి దీపాలు వెలిగించరు .రేడియో ,టెలివిజన్ వగైరా లేమీ ఉండవు .రతి కార్యమూ బందే
.విశేషం ఏమిటి అంటే కొత్త సంవత్సరం రోజున కుక్కలు కూడా మొరగవు .గప్ చిప్ .ఇలాంటిది యే దేశం లోను
సాధ్యం కాదు .నిజం గా ఇది హిందువుల పండుగ అయినా ,ముస్లిములు, క్రిస్టియన్లు కూడా దీన్ని శ్రద్ధ గా
మౌనాన్ని పాటించటం గొప్ప సంగతి .బాలి లోని విమానాశ్రయాన్ని కూడా మూసి వేస్తా రు .ఈ విషయాలు ముందే
తెలుసుకొని యాత్రికులు జాగ్రత్త పడ తారుదీని తర్వాత రోజున మళ్ళీ జీవితం యదా ప్రకారం మొదలవు తుంది .ఈ
ఇక్కడ ఆవు మాంసాన్ని కూడా తింటారు .ఆవు వారికి ''హో లీ''(పున్యమైనది ) యే కాని
సేక్రెడ్(పవిత్రమైనది ) కాదని అంటారు .హో లీ అంటే గౌరవింప తగినదని సేక్రెడ్ అంటే అలాంటి దాన్ని తాకను కూడా
తాకరాదని అర్ధం చెబుతారు .ఇది భలే గా ఉంది కదూ .అదే భలే బాలి అంటే .ప్రతి వంద ఏళ్ల కొక్క సారి ''ఏకా దశ
రుద్రఉత్సవం ''చేస్తా రు .ఆ రోజున 200 రకాల జంతువులను బలి ఇస్తా రు .సాధారణ గృహస్తు ఏడాదికి రెండు నుండి
ముందే చెప్పుకొన్నాం బాలి లో ఎవరైనా చని పో తే ఆది సమాజం అంతా బాధ్యత గా నిర్వ హిస్తు ందని
.మేళ తాలతో బాజా భజంత్రీ లతో పెద్ద అట్ట హాసం గా శవాన్ని ఇంటి నుంచి శ్మశానానికి వేడుక గా తీసుకొని వెళ్తా రు
.ఎవ్వరూ ఏడ వరు నవ్వుతూ ,తుళ్ళుతూ పండుగ లాగా ప్రవర్తిస్తా రు .సంగీతం పాడిస్తా రు, డాన్సులు చేయిస్తా రు
.''ఎందుకిలాగా ''? అని మనం సుబ్బరాయ శర్మ లాగా ప్రశ్నిస్తే ''చని పో వటం అంటే దేవుడి దగ్గ రకు వెళ్లటం .మనం
ఆయన దగ్గ ర్నుంచే వచ్చాం కదా .మళ్ళీ అకడికి వెళ్తు ంటే సంతోషం వ్యక్త ం చేయాలి కాని ఏడుపు లెందుకు "'అని
వేదాంత రహస్యాన్ని అద్భుతం గా ఆవిష్కరిస్తా రు నిజం గా ఆ విషయం మనకూ తెలుసు .కాని ఏడవ కుండా
ఉండలేము. మనం మాటలు మాత్రం చెప్ప గలం .బాలీయులు చేతల తో వేదాంతాన్ని అనుష్టించి చూపిస్తా రు
.అందుకే భలే బాలి అన్నాను .అంతే కాదు శ్మశానాల దగ్గ ర కొనుక్కోవ టానికి దుకాణాలు చాలా ఉంటాయి
.హాయిగా కొనుక్కొని తింటూ శవ యాత్ర లో పాల్గొ న వచ్చు చావును వేడుక గా ,పండుగ గా నిర్వ హించే
బాలీయులు భలే వారు .ఆడ వాళ్ళు కూడా చక్కగా శవ యాత్ర లో వెంట వెడతారు నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తా రు
.శవాన్ని మోసుకు వెళ్ళే బండీకి ముందు ఒకటే చిన్న చక్రం ఉంటుంది .ఇదో తమాషా .మనం శవాన్ని పెట్రో ల్ తో
,కిరోసిన్ తో కాల్చం .కాని వారు వెంటనే దహనం అవ్వాలని వాటిని సమృద్ధి గా వాడేస్తా రు .ఇదీ భలే .
ఇక్కడ దహన సంస్కారం మనిషి చని పో యిన వెంటనే చేయరు .మంచి రోజు చూసి చేస్తా రు .ఒక్కో
సారి వారం పట్ట వచ్చు నెలలు కూడా పట్టా వచ్చు .రెండు రకాల క్రియలుంటాయి ఒకటి వక్తి గతమైనది ,రెండో ది
సామూహిక మైనది .ధన వంతులు మంచి రోజు వచ్చే దాకా శవాన్ని ఇంట్లో నే ఉంచుతారు .సాధారణ ప్రజలు
స్మశానం లో వెంటనే పూడ్చి మంచి రోజు వచ్చిన తర్వాతా త్రవ్వి తీసి వందా ,రెండు వందల శవాలను ఒక్క సారే
సామూహికం గ అ ఖననం చేస్తా రు .ఆ రోజున హడా విడి ఎక్కువే .బాజాలు భజంత్రీలు. ఉంటాయి పల్ల కీ లో
వూరేగిస్తా రు .పూజారులు పవిత్ర మంత్రా లు చదువుతుండగా కార్య క్రమాన్ని చేస్తా రు .దీనితో అయి పో లేదు ఆ
తర్వాతా తంతులు చాలా ఉంటాయి .ఇవన్నీ చేసే సరికి చాలా ఖర్చు అవుతుంది .
మనకు లాగానే అక్కడా పూర్వపు గ్రంధాలన్నీ తాళ పత్రా లలో లిఖించ బడి ఉన్నాయి వీటిని''
లోన్తా ర్'' ల పై రాసే వారు .ప్రా చీన 50.,000 లోన్తా ర్తా ర్ గ్రందాలున్నాయని అంచనా .అందులో పురాణాలు ,ఇతి
హాసాలు ,వేదాలు ,ఆగమాలు ,భూమి రికార్డు లు ,మత గ్రంధాలూ వైద్యానికి సంబందినవి ,మాజిక్ కు చెందినవి
,వంశ చరితల
్ర ు .శిల్పశాత్రం , ,చిత్ర లేఖనం ,కోడి పందాలు నిబంధనలు ఒకటేమిటి సమస్త ం అందులో ఉన్నాయి
.ప్రతి ఇంట్లో లోన్తా ర్ గ్రంధాలలో ఏదో ఒకటి ఉంటుంది .చాలా భాగం ''కావి ''భాషలో అంటే ప్రా చీన జావా భాష లోను
, కొన్ని సంస్కృతం లోను ఉన్నాయి .రామాయణ ,మహా భారతాలు సంస్కృతం లో నుంచి కావి భాషలోకి అను
వదించి రాసుకొన్నారు .ఇవి పల్ల వుల నుండి లభించాయి .కొత్త లాంతార్ గ్రంధాలు'' అక్షర బాలి లిపి'' లో ఉన్నాయి
.ఇది15 శతాబ్ద ం లో ఇక్కడికి చేరింది .మజా పెహిత్ రాజ్యం ధ్వంసం అవగానే ,ముస్లిములు తమ తో బాటు ఇండో
నేషియా కు జావా ,నుండి దీన్ని తెచారు .ఇప్పుడు వీటిని భద్రం చేసుకోవాలని ప్రయత్నిస్తు న్నారు డిజిటల్ గా
మార్చే ప్రయత్నాలు ముమ్మరం అయాయి .అసలు లోన్తా ర్ అంటే ఏమిటో తెలుసు కొందాం .ఇది పురాతన జావా
మాట .రోన్ అంటే ఆకు .అని ,తాల్ అంటే తాళ వృక్షం అని అర్ధం .అంటే తాటి ఆకు. అదే తాళ పత్రం .రఅనేది ల గా
కాల క్రమం లో మారి పో యింది వీటిని తగిన పరి మాణం లో కత్తి రించి చివరి భాగం లో మూడు రంధ్రా లు చేసి
కట్ట గా కడతారు .వీటిపై రసాయన పదార్ధా లు బాలీ లోని ఔషధాలు పూసి శుద్ధి చేస్తా రు .వాటిపై గంటం తో రాస్తా రు
.ఇవి అమూల్య పత్రా లుగా ప్రభుత్వం భావించి సంరక్షిస్తో ంది .లోన్తా ర్గ ్రందాలలో ఎక్కువ శివుని గురించినవే
ఉంటాయి .శైవ ఆగమాలు ఎక్కువ .వీటిని డిజిటల్ గా మార్చటానికి సాన్ ఫ్రా న్సిస్కో సహాయం చేస్తో ంది .ఇప్పుడు
ఆం లైన్ మీద ఇవి లభిస్తు న్నాయి ఇదీ భలేగా ఉంది .కొబ్బరి ఆకులను ఎక్కువగా పూజా సమయం లో
వాడుతారు చదరం గా ఉన్న అరటి ఆకు లో పదార్ధా లను పెట్టి దేవుడికి నైవేద్యం చేస్తా రు .రక రకాల పూలు ,పండ్లు
ఉపయోగిస్తా రు . ఈవిధం గా బాలీ ద్వీపం హిందూ సంస్కృతిని పరి రక్షించుకొంటు, ప్రా చీన ధర్మ మార్గ ం లో
నడుస్తూ ఆ సంస్కృతిని నిత్య జీవితం లో అవలంబిస్తూ తర తరలకు అంద జేస్తో ంది .బాలీ ప్రజలు తమ ప్రత్యేకతను
కాపాడుకోవటానికి తీసుకొంటున్న శ్రద్ధ అందరికి ఆదర్శ ప్రా యం .బాలీ అంటే'' జాలీ ''కాదు. బాలీ అంటే కర్త వ్య