Professional Documents
Culture Documents
హేతువాది వేమన - atheist vemana
హేతువాది వేమన - atheist vemana
వేమన పద్యాలు అనగానే మనలో చాలా మందికి ఉప్పు కప్పురంబు, గంగిగోవు పాలు లాంటి అతి సాధారణమైన పద్యాలు మాత్రమే
గుర్తు కొస్తా యి. కానీ వేమన చెప్పని అంశం లేదు. కులం, మతం, దేవుడు, దెయ్యం, మత గురువుల మోసం, సమాజంలోని
రకరకాల మూఢనమ్మకాలు, వేదాలు, యజ్ఞాలు, బూటకపు ఉపనయనాలు, కలిమి లేములు, బలవంతుల దోపిడి.... మొదలై న
సమాజంలోని చెడునంతా ఎండగట్టి తన హేతువాదంతో మేడిపండులాంటి సంఘం గుట్టంతా విప్పాడు. తర్కబద్ధమైన తన పద్యాలతో
అజ్ఞానపు జనాన్ని సూటిగా ప్రశ్నిస్తూ అన్యాయంపై దాడి చేసిన, వేమన ఆ కాలానికే కాదు నేటి సమాజానికీ ఆదర్శవంతుడే.
బంగారు లేడి భూమి మీద ఉండదని, మారీచుడు రాక్షసుడని గుర్తించలేని రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నిస్తు న్నాడు.
అగ్నిభాణంతో సముద్రాన్ని ఇంకించినప్పుడే లంకలోకి ప్రవేశించకుండా వానర సేన సహాయంతో వారధికట్టి సముద్రాన్ని దాటిన రాముని
బుద్ధిమాంద్యాన్ని వేమన అవహేళన చేశాడు.
పాల సాగరమున పవ్వళించిన వాడు
గొల్ల యిళ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ
పాల సముద్రంపై పవళించే విష్ణుమూర్తి దొంగతనం ఎందుకు చేశాడో, పరుల సొమ్ము అంటే ఎవరికైనా తీపియే అని చెబుతున్నాడు
తనలో కామం పుట్టించినందుకు శివుడు మూడో కన్ను తెరిచి మన్మధున్ని బూడిద చేశాడు, చివరికి అదే కామానికి బానిస అయ్యాడు
వినాయకుడ్ని యధాతధంగా శివుడు బతికించుకోలేకపోయాడు, శివుడు బూడిద చేసిన మన్మధుడ్ని విష్ణువు బతికించుకోలేకపోయాడు దైవ
బలం ఎంత గొప్పదో ఇక్కడే తెలిసిపోతుంది అన్నాడు వేమన
వాస్తవ జీవితానుభవం లేకుండా, వేదమంత్రాలూ, మత గ్రంథాలూ వల్లిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా మతిపోవడం ఖాయమని,
చిత్ర(గారడీ) దీపం వల్ల చీకటి పోతుందా... అని ప్రశ్నిస్తు న్నాడు.
యజ్ఞం చేసేటప్పుడు, యజ్ఞం చేసే అతని భార్య (సోమయాజి భార్య) తాను గతంలో వ్యభిచరించి ఉంటే, ఎన్నిసార్లు ఎవరెవరితో
వ్యభిచరించిందీ సూచించడానికి, అన్ని గడ్డిపోచల్ని యజ్ఞవేదిక మీద పెడతారు. అంటే సోమయాజి భార్య రంకు యజ్ఞంతో
బయటపడుతుంది. అదే విధంగా పిండం వేసేవాడి తండ్రి, తల్లికి రంకు మొగుడైతే, ఆ పిండం వీడికే చెందుతుందిగానీ, పేరుకు
తండ్రిగా ఉన్నవాడికి మాత్రం కాదు అని వేమన యజ్ఞంలోని గుట్టు నీ, తద్దినంలోని కట్టు ని బట్టబయలు చేశాడు.
అసలు ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తా రు...??? ఈ యజ్ఞాలు చేస్తే, చచ్చిన తరువాత స్వర్గానికి పోయి, దేవేంద్రు డి ఉంపుడుకత్తె
రంభతో సంభోగాన్ని పొందవచ్చనే రాక్షస కాంక్ష, అంధవిశ్వాసం నాటి పురోహిత వర్గాల్లో ఎక్కువగా ఉండేది. యజ్ఞంలో నల్లమేకను
చంపి, ఆ మేకనంజుడు ఆరగిస్తే, ఆ యజ్ఞం కామయజ్ఞంగా మారుతుందని, స్వర్గంలో రంభా సంభోగం లభిస్తుందని భావించేవారు.
అప్పుడు సోమయాజి కాస్తా కామయాజిగా మారుతాడు అని వేమన దారుణంగా గేలిచేశాడు.
యజ్ఞం చేస్తా మని విర్రవీగుతూ, కచ్చ కడిగే నెయ్యిని కడుపారా తాగే రంకు కొడుకుల్ని వైకుంఠంలో (రంగాన) మెచ్చుతారా అని
సూటిగా ప్రశ్నించాడు.
మూఢవిశ్వాసాలపై దాడి
చనిపోయిన తల్లిదండ్రు లు పరలోకంలో ఉంటారని నమ్మి వారికి తద్దినాలు, మాసికలు పెట్టి పిండాలు వేయడం హిందూ సంప్రదాయం.
ఆ పిండాలు కాకుల ద్వారా పరలోకంలోని తల్లిదండ్రు లకు చేరతాయని నమ్మేవారి సంఖ్య సమాజంలో నేటికీ అధికంగానే ఉంది. ఈ
గుడ్డినమ్మకాన్ని వేమన ఆ కాలంలోనే తన తర్కంతో ఎండగట్టా డు. ఆ ఆచారాలను గేలిచేశాడు.
అశుద్ధం తినే కాకులు పిత్రు దేవుళ్లు ఎలా అయ్యారు అని ప్రశ్నించాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఆలోచించలేక తద్దినాలు పెట్టడం
గొప్ప పుణ్యకార్యంగా ఆచరించే వారిని గాడిదలతో పోల్చాడు. బుద్ది జెప్పువాడు గుద్దితే ఏమయా..! అంటూ హిందూ సంఘం
ముక్కుమీద గుద్దిమరీ బుద్ది చెప్పాడు.
హిందువులు మేనత్త , మేనమామ పిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు. మహ్మదీయుల్లో చెల్లెలి వరుస అవుతుంది. హిందువులకు పెదనాన్న,
చిన్నాన పిల్లలు చెల్లెలి వరుస అయితే మహ్మదీయుల్లో ఆ వరుస వ్యతిరేకంగా ఉంటుంది. హిందువులు చెల్లెలుగా భావించేవారిని
మహ్మదీయులు వివాహాలు చేసుకుంటారు. వీరిది వారికి తప్పు వారిది వీరికి తప్పు. సమాజంలో చెలామణి అవుతోన్న ఇలాంటి మలిన
సిద్దాంతాల్ని నిలదీశాడు.
తీర్థయాత్రల వల్ల పంది ఏనుగు కాదు, నదుల్లో మునిగినంత మాత్రాన కుక్క సింహము కాదు. ఇవన్నీ అజ్ఞానంతో చేసే వృధా ప్రయాస
అంటాడు.
తీర్థయాత్రలకు పోయి గుండ్లు గొరిగించుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మంగలి వద్ద గొరిగించుకోవడం మేలు... అని
గేళిచేశాడు.
పెళ్లి మంత్రాల పేరిట వెర్రి కూతలు కూసి, ముహూర్త బలం గొప్పదీ అంటూ, జాతకాలు, శుభలగ్నం గాడిద గుడ్డు అని విర్రవీగే
జ్యోతిష్యులను సూటిగా ప్రశ్నించాడు.
గొప్ప ముహూర్తమని, మంత్రాలు చదువి పెళ్లి చేస్తా రు. కానీ పెళ్లి జరిగిన కొంత కాలానికే విధవరాళ్లు అయిన వారి సంగతేంటి?
అగ్రకులంగా భావించే బ్రాహ్మణులు ఉపనయన సంస్కారం (జందెం వేయడం) వల్లే వారికి బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని చెబుతారు.
అయితే ఈ ఉపనయన సంస్కారాన్ని శాస్త్రా లు స్త్రీలకు నిరాకరిస్తు న్నాయి. ఉపనయన సంస్కారం లేని ఈ బ్రాహ్మణ స్త్రీలు శూద్రు లతో
సమానం. తరతరాలుగా అలాంటి శూద్ర స్త్రీలకు పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అయ్యాడని ప్రశ్నిస్తు న్నాడు వేమన.
మెడలో వేసుకున్న తాడు వారికి ఏదో గొప్పతనాన్ని తెస్తుందనుకొనే వారు బుద్ధిలేనివారని, కడుగునీళ్లు తాగిన కాకి కర్రు కర్రు
అన్నట్లు గా ఈ బుద్ధిలేని మనుషులు వడుగు (ఉపనయనం) చాలా పవిత్రమైనదని విర్రవీగుతారని బూటకమైన ఉపనయనాలపై
దుమ్మెత్తిపోశాడు.
బ్రాహ్మణుల్లో వసిష్ట గోత్రానికి చెందినవారే ఎక్కువ. తమది చాలా గొప్ప వంశంగా చెప్పుకుంటుంటారు. వసిష్టు డి తల్లి వేశ్య, భార్య శూద్ర
కులానికి చెందినది. వసిష్టు డి కులమేదో ప్రపంచానికి తెలుసు అని ఎద్దేవా చేశాడు
ఒక కులం పెద్దది, మరొకటి చిన్నది అని చూడవలసిన అవసరం లేదు. మనుషులంతా ఒక్కటే అని చెబుతూ.. 300 సంవత్సరాల
క్రితమే వేమన ఈ కులపిశాచి మీద దాడి చేశాడు.
అంటరానితనాన్ని అసహ్యించుకుంటూ........
మాలవాడిని ముట్టు కుంటే అపవిత్రు లైపోతారని భావించి నీళ్లలో మునిగి తమని తాము శుద్ధిచేసుకుంటారు. చచ్చినపుడు వారిని కాల్చేది
ఆ మాలవాడే కదా, అప్పుడేమైంది వీళ్ల అంటు అని సూటిగా ప్రశ్నించాడు.
కులం తక్కువ వాడైనా డబ్బు ఉంటే అందరూ గౌరవిస్తా రు. డబ్బులేని వాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా డబ్బు ఉన్నవాడికి అణుగి
ఉండాల్సిందే. మురికి బట్టలతో జిడ్డు కారుతూ ఉండేవాడు అగ్రకులమైనా ఎవ్వరూ పట్టించుకోరు. బంగారం దిగేసుకుని, కండపుష్టి
కలిగిన వాడు తక్కువ కులం వాడైనా అతడిని అందరూ గౌరవిస్తా రని, నేటి సమాజంలో కులం కంటే ధనమే ప్రధానమని, డబ్బు
ఉన్నవారికి అందరూ లొంగి ఉంటారని స్వార్థపూరితమైన మనుషుల స్వభావాన్ని బట్టబయలు చేశాడు.
భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే కంచంలో వడ్డించి, వారి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి, కులాన్ని సర్వనాశనం చేస్తా మని,
అందరిలో ఆ నమ్మకా న్ని కలిగించే విధంగా అందరూ విశ్వసించేలా తలపై
చేయిపెట్టి (ప్రమాణపూర్తిగా) మరీ చెప్పి కుల గజ్జిని
పారద్రోలమని, కులరహితమైన సమాజాన్ని నిర్మించమని చెబుతున్నాడు. మూడు వందల ఏళ్ల క్రితమే ఇంతటి విప్లవాత్మకమైన సూచనను
ప్రతిపాదించిన వేమన మహనీయుడు.
పొట్టకూటి కోసం బాబాలు, స్వామీజీలంటూ కాషాయవేషాలు వేసుకొని అమాయక జనాన్ని మోసగించే పనిదొంగలు, తిండిపోతులు,
స్త్రీలోలులూ అయిన దొంగసన్యాసుల, కపట
యోగుల బూటకాల్ని వేమన బట్టబయలు చేసాడు.
పులితోలు కప్పుకుని, జడలు పెంచుకుని, బూడిద పూసుకుని ప్రగల్భాలు పలుకుతున్నా వీరి మనసు మాత్రం మగువ మీద ఉంటుందని,
ఈ వేషాల వల్ల మోత బరువేగానీ మోక్షంబు ఉండదని ఎద్దేవా చేశాడు.
అల్లబోడి తలలు
, తెల్లని గొంగళ్ళు,
ఒడల బూది పూసియుందురెపుడు,
ఇట్టి వేషము లిల పొట్టకూటికేగాని
కష్టపడి
పనిచేసి బతకడం
చేతగాని చవటదద్దమ్మలు పొట్టకూటికోసం ఇలాంటి దొంగబాబాల వేషాలు వేస్తే స్వార్థపరులైన మరికొందరు వీరికి
ముందుగా దండాలు పెడుతూ అండగా ఉంటున్నారని ఆనాడు వేమన చెప్పిన మాటలు ఎంతటి నగ్నస త్యాలో బాబాలకు సాస్టాంగాలు చేసే
ఇప్పటి రాజకీయనాయకులను చూస్తే అర్థమవుతుంది.
అమాయక ప్రజలకు ముక్తి మార్గం పేరిట మోసం చేసే ఈ దొంగ సన్యాసులు ఆడదాన్ని చూడగానే అన్నీ మర్చిపోయి వారికి
దాసోహమంటారని, గురువుల కోసం గుహల్లో వెదికితే అప్పుడు ఏదైనా క్రూ రమృగం ఎదురైతే ముందుగా అదే వారి ముక్తిమార్గం
చూపిస్తుందని హేళన చేశాడు.
ఆకులూ, అలములూ తింటేనే మోక్షం వచ్చేపనై తే రోజూ ఆకులు తినే మేకపోతుకు మోక్షం రావాలి కదా..! అని మూర్ఖపు జనాన్ని
తన హేతువాద దృక్పధంతో సూటిగా ప్రశ్నిస్తు న్నాడు వేమన.
ఇంద్రు డు, మన్మధుడు, బ్రహ్మ కామానికి దాసులై ఎలా భ్రష్టు పట్టిపోయారో చెబుతున్నాడు