Professional Documents
Culture Documents
vuyyuru.com/2015/10/12/%e0%b0%b6%e0%b0%b0%e0%b0%
a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b5-
%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%bf-
%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be
%e0%b0%95%e0%b0%be
%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/
సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రా రంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు .
నిరుడు నవరాత్రు లకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ
నామాల విశిష్ట తను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను .
సాధారణం గా మనమందరం కలలు కంటూ ఉంటాం మరి జితేంద్రియు లైన యోగులకు కూడా కలలు వస్తా యా?వస్తే ఎలా
ఉంటాయి ?దీన్ని తెలుసుకోవటం కోసం గుంటూరు జిల్లా చందవోలు లో అనునిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనతొ
తరించి ఎందరెందరికో గురుమూర్తు లై దీక్షనిచ్చి, ”నడయాడే దైవం ”అని పించుకొన్న శ్రీ కంచి పరమాచార్యులు మరియు ,శ్రీ
శృంగేరి పీఠాదిపతులు స్వయం గా చందవోలు వచ్చి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద భిక్ష స్వీకరించారంటే శాస్త్రి
గారి యోగ వైశిష్ట ్యం ఎంతటిదో తెలుస్తు ంది. అలాంటి సిద్ధ యోగిపు౦గవులు శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అయిన శ్రీ
శాస్త్రి గారికి ఒక కల వచ్చింది .దానిని సంస్కృత శ్లో కాలలో ”మత్స్వప్నః”(నా కల )గా రాశారు అందులో అమ్మవారు ప్రత్యక్షమై
వారికి ఏమి తెలియ జెప్పారో వీరేమి అడిగారో ఆ వివరాలన్నీ రేపు 13-10-15 మంగళవారం నుండి అమ్మవారి అనుగ్రహం తో
ధారావాహికం గా అందజేస్తా ను .. మరొక సారి నవ రాత్రి శుభా కాంక్షలతో -దుర్గా ప్రసాద్
https://sarasabharati-vuyyuru.com/2015/10/13/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0/
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1
తాత్పర్యం –మంగళకరమైన తల్లి ,సహస్ర నామాది భూతమైన శ్రీ మాత్రు మంత్రా నికి అధిదేవత
,సంపత్కారిణి ,శ్రీ విద్యా స్వరూపిణీ ,శ్రీ విద్యలో సర్వాధిస్టా త కామేశ్వర స్వామి పట్ట పు దేవి అయిన
ముత్తైదువు,పూజనీయ ,మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని ,కల్పలతలచే సృస్టింపబడిన
అంతులేని శిల్ప ప్రా వీణ్యం గల సర్వ ఆభరణాలచేత ప్రకాశించే నా తల్లి నా అదృష్ట వశాత్తు నాకు స్వప్నం
లో కనిపించింది .
తా –సౌందర్య సంపాదకు నివాసమైన యష్టివంటి శరీరం కల ఆతల్లిని చూసి నేను చిన్నగా నవ్వాను
.ఎందుకు నవ్వావు అని ఆమె అడగగా ,ఆ ఏమీ లేదు స్వాభావికంగానే నవ్వా అని వినయం తో చెప్పా .
తా-‘’నవ్వు ఊరికే రాదు .నీనవ్వుకు కారణం ఏమిటి ‘’?’’కారణం చెప్పాలంటే వేద వ్యాసమహర్షి ఇక్కడికి
పిలి పించాల్సి ఉంటు౦దితల్లీ ‘’అన్నాను
4-‘’కిం కార్యం తే నాత్ర రేత్వం వదేతి –నిర్భార్త్యోక్తః ప్రా ంజలి ప్రహ్వ భాస
5-‘’ప్రు చ్వా మిత్వా మాంబ సందేహ మేతం –న ప్రస్టవ్యం బాల భావాద వోచం
తా-ఈ కొంటె ప్రశ్న కు కారణం ఏమిటి అని అడిగితె నాకేం తెలీదమ్మో-మనిద్ద రికీ ఈ సందేహ నివృత్తి
చేయగలాడు వ్యాసుడే .నన్నే పిలిచి అడగమంటే ఏను కుర్రా డిని .అంతటి మహర్షిని అడిగే
దమ్ము,అధికారం లేనివాడిని .నువ్వే పిలిచి అడగమనే రాజసమూ లేని వాడిని .క్షమించు .
తా-మంత్రం ద్రష్ట అంటే మంత్రా లను చూసినవాడు అలాంటి వ్యాస భగవానుడు పురాణ ఇతిహాసాలలో
లక్షలకొద్దీ శ్లో కాలు రాసి లోకాలకు మేలు చేశాడు .అవన్నీ చదవాలంటే మనిషి ఆయుర్దా యం చాలదు
.ఇక విమర్శించటానికి సమయమెక్కడిది తల్లీ !
తా- ఆ పురాణ ఇతిహాసాలను కొంచెం కొంచెం చదివి మానవులు సందేహాలలో మునిగిపో యారు .అది
రాసినవాడిదో గ్రందానిదో తప్పుకాదు .రుషి ప్రో క్తా లలో ప్రశ్న ఉన్న చోటేసమాదానమూ ఉంటుంది .ఆరు
ప్రమాణాలతో మీమాంస శాస్త ం్ర పద్నాలుగు ప్రమాణాలతో అలంకార శాస్త ం్ర ద్వారా అర్ధం చేసు
కోమని,గురుని ముఖతానేర్చుకోమని వేదం వేదాంగాలు చెప్పాయి .
తా-బ్రహ్మాండ పురాణ లలితోపాఖ్యానం లో మూల అజ్ఞా నం తో నివారింప లేని భండుడు అనే రాక్షసుడు
,ప్రయోగ దక్ష్టతతో ప్రపంచాన్ని అంతటిని తన స్వాధీనం లోకి తెచ్చుకొని ప్రా ణులను విపరీతంగా
హింసించాడు .
తా-భండాసురుడు మంత్రి సేనా కుమారాదాలుతో కలిసి ఆరేడు లోకాలను గ్రీష్మ తాపంలాగా విజ్రు మ్భించి
కలవరానికి గురి చేశాడు .
తా-భేదో పాయం తెలిసిన వాదిమంత్రి విషంగుడు ఒకరితో మరొకరు కలవకుండా చేశాడు .స్త్రీ ,పురుషుల
శుక్ర శ్రో ణితాలనుదొ ంగతనం గా ఎత్తు కుపో యి దుర్బలులను చేస్తు న్నాడు .ఇలా జగత్తు తల్ల డిల్లు తోంది .
12-‘’ఆతార్ణ ం వ్యాప్నోతిచా బ్రా హ్మ లోకాత్ –నాస్తి త్రా తా కశ్చి దన్యోహ్య ముష్మాన్
తా-భయం అభయం రెండూ లేని నారదుడు విష్ణు లోకానికి వెళ్లి ,ఆయన్ను స్తు తించి సత్కారం పొ ంది
లోకం లోని విశేషాలేమిటి అని అడిగిన దేవ దేవునితో ఇలా చెప్పాడు .
సశేషం
https://sarasabharati-vuyyuru.com/2015/10/14/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0-2/
తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపో యాయి .వాడి
పీడ తొలగించి లోకాలను కాపాడే వాడు నువ్వు తప్ప వేరవ
ె రూ కనిపించలేదు’’అన్నాడు నారదుడు .
నాహం జానే క్వాపి లోకామయ౦ ప్రా –గిత్ధం హాజీ వంశ్చ కాలం విశాలం ‘’
తా-మనసులో ఆలోచిస్తు న్నావా ,కళ్ళతో ఆలోచిస్తు న్నావా ?తక్షణ కర్త వ్యమ్ ఏమిటి ?నేను చిరంజీవిగా
ఉన్నా ఇంతటి ఘోరం పూర్వం ఎప్పుడూ చూడలేదు .
తా-లోకబాదను తన బాధగా చెప్పిన నారదుని చూసి ‘’వాడిని చంపే విధానం వివరంగా చెబుతాను .విని
ఆ ప్రకారం నువ్వే కద నడిపించాలి ‘’అన్నాడు హరి .
తా-‘’ఒక కల్ప గ్రంధాన్ని నీకిస్తా .నువ్వ్వు అధ్వర్యుడివి గా ఉందడి దానిలో చెప్పబడిన ప్రకారం ,దేవతల
చేత హిమాలయ సానువు మీద నలభై ఆమడల కుండం నిర్మించి విధి విధానంగా ఒక యాగం చేయించు
..
18-‘’జీవానాం తూష్ణీం స్థితిం బాధ తేయ –సో ఢా కస్మా త్సప్త తంతు ప్రవృత్తి ం
మాశంక స్త్వైవం మయా భ్యూ హితం తత్ –మాయా మయ్యౌ ద్వే సృజామ్యద్య కన్యే ‘’
తా-వాడు ఆటంకం కలిగిస్తే దేవతలు ఏం చేయగలరనే అనుమానం వద్దు .నేను విరుగుడుగా ఇద్ద రు
మాయావిను లైన కన్యల్ని సృష్టిస్తా ను .
19-‘’మంత్రీ రాజా ద్వౌ తయో ర్మోహ మగ్నౌ –యస్మిన్కాలే సాధ్యతే యాగ యేషః
యాగ త్రా ణ ప్రా ణితం యజ్వ లోకం –విఘ్నం కృత్వా బాధితుం కస్సమర్ధ ః ‘’
తా-భండుడు,వాడి మంత్రి మోహ పరవశం తో కామం కైపెక్కి ఒళ్ళు తెలీకుండా ప్రవర్తించే టప్పుడు ఈ
యాగ విశేషం నెరవేరుతుంది .సత్సంకల్పం తో ప్రా రంభమైన ఈ యాగము వల్ల కలిగే రక్షణ ఆపటానికి
ఎవరి సాధ్యమూకాదు .ప్రయత్నాలన్నీ క్రమంగా ఫలిస్తా యి .
20-‘’ఇత్యుక్త్వాతం ప్రా హిణో ద్దేవ తేజ్యా –సాకల్యార్ధ ం సృస్ట వాన్ కన్యకే ద్వే
తా –దేవతలు చేసే ఈ యజ్ఞా నికి ఒప్పించి నారదుడిని విష్ణు వు పంపాడు .అప్పుడే ఇద్ద రు కన్యల్ని
సృష్టించాడు .వారెం చేయాలో వివరించి పంపేశాడు .
21-‘’ప్రా రబ్ధ శ్శై లస్యమూర్ధ ్న్యధ్వరోహం-దేవై ర్మౌనీ౦ ద్రై ర్యదో క్తం విరాజా
22-‘’విష్ణో ర్మాయా వాగురాం భ్రు త్య దిస్టా ం-అజ్ఞా త్వా తౌమార్గ యంతౌ మృగీవత్
గత్వా తస్యాం పేత తుర్దైవ యోగాత్ –ద్వౌ ద్వౌ పాణీ అగ్రహిస్టా ం వినస్టై’’
తా-రాక్షరాజు ,మంత్రి ఈ వార్త ను సేవకుల వలన విని విష్ణు మాయ అని తెలీక మొహం పట్ట లేక కన్య
లుండే చోటుకు వెళ్లి చెరొకరు వాళ్ళ చేతుల్ని పట్టు కొన్నారు .
23-‘’మామా మేమే త్యుచ్య మానౌచ తాభ్యాం –మేమే మేమే మేషవ ద్భాష మాణౌ
స్యాతాం భూతా విష్ణ వ చ్చా స్వతంత్రౌ –దత్వా దేయా న్యర్ధ మానాం స్త దిస్టా న్ ‘’
తా-వద్దు వద్దు అని కన్యలు వారిస్తు న్నా ఇదినాది ఇది నాది అని పో టీ పడుతూ మేకల్లా అరుస్తూ వాళ్ళు
అడిగే ఇయ్యకూడని వారాల నన్నిటి ఇచ్చేసి దెయ్యం పట్ట్టిన వాళ్ళు లాగా బలవంతులైనా
అస్వతంత్రు లైపో యారు వారి చేతుల బందీలలో .
సశేషం
తా-ధైర్యం లేని ,బలహీనులు ,భయపడే ఆడవాళ్ళ తో భోగం ఆనందం ఇవ్వదు.కనుక మా భయం పో గొట్టే
ట్లు అభయ మివ్వాలి .మామాటకు కట్టు బడాలి .మేము ఒద్ద న్నదాన్ని చేయరాదు ‘’
తా-మీ రాజ్యాలమీద ,మీ స్త్రీల పైనా మాకు అధికారం ఇచ్చి మీరు సుఖం పొ ందండి .మాటతప్పరాదు
‘’అనే షరతులు పెట్టగా మూర్ఖ రాక్షసులు డూడూ బసవన్నల్లా గా తలలూపి ఒప్పుకొనగా కన్యలు వాళ్ళ
ఇళ్ళకు చేరారు .
తా-ఇలా విష్ణు మాయలో పడి కన్నెల కౌగిలి చెరసాలలో బందీలై రాజు మంత్రీ అన్నిపనులూ వదిలేసి
అనుక్షణం రతి కార్యం లోనే నిమగ్నులయ్యారు .
27-ఇత్ధ ం భూతే దైవ యోగా ద్వ్యతీతా –దుర్విజ్నేయా పంచ శత్యబ్ద కానాం
దేవా నిర్బాదా యజ౦తి స్మ యాగం –హృస్టిం పుష్టిం తుష్టి మా సాధ్య సద్యః ‘’
తా-ఈ కామకేళీ విలాసం 500 ఏళ్ళు నిరంతరంగా సాగింది .దేవతలు ఈ రాక్షస బాధ లేకుండా యాగం
చేస్తు న్నారు .యాగ ఫలంగా సంతోషం శారీరక బలం పొ ందారు .
తా-ఏనుగు మందల్లా ,మబ్బుల గు౦పుల్లా ,చీకటి ప్రో వుల్లా హో మ ధూమ స్తో మం బయల్దే రి
బ్రహ్మా౦డమంతా వ్యాపించి భండాసురుని అంతః పురం ప్రవశి
ే ంచింది .
30-శ్రు ణ్వన్నేవం సో ట్ట హాసం చ కార –హస్తే హస్త ం నిష్పి పేషా రుణాక్షః
తా-ఆ మాటలు విన్న వాడు విపరీతపు నవ్వునవ్వి చప్పట్లు కొట్టి కనులెర్రబడగా మంత్రి
సైనికాదులనుసమాయత్త పరచి శత్రు నాశనం చేస్తా నుఅని బీరాలు పలికాడు . .
సర్వో పాయై ససాద యంతీ స్వమర్ధ ం –నోయా తవ్యం భీత భీతే త్ద మూచే ‘’
తా-మహా అటో పం తో యుద్ధా నికి బయల్దే రిన వాడిని మాయాకన్య భయం నటిస్తూ వెళ్ళవద్ద న్నది .
32-‘’నో భేతవ్యం ఘాస కల్పా న్సురేశాన్ –నిష్పిష్యా గంతాస్మి దేవి క్షణేన
తా-భయపడద్దు . గడ్డిపరకల్లా ంటి దేవతల్ని పిండి చేసి క్షణం లో వచ్చేస్తా .ఈభూమ్మీద మమ్మల్ని జయి౦
చేవాడేవ్వడూ లేడు (అజేతా అంటే మమ్మల్ని’’ జయించని వాడు ఉండడు’’-అని మరో అర్ధ ం ).అని ధైర్యం
చెప్పాడు .ఎడబాటును సహించ నట్లు నటిస్తూ ఆమె బాధతో
33-‘’ఆద్యే సంగే సంగరో యో భవన్నౌ –విస్మర్త వ్యో నైవ రాజం స్త ్వయాద్య
తా-మన మొదటి పొ ందులో చేసిన వాగ్దా నం మరచిపో వద్దు .అసత్యం ఆడటం వలననే మధు కైటభులు
విష్ణు వు చేతిలో చచ్చారు .
34-‘’కిం కిం వేత్దం వాదినీం తామతీత్య –ప్రా ణాపాయే సంగరః కస్త వేతి
తా- నా ప్రా ణాల మీదకొస్తే నీ సంగరం(ప్రతిజ్ఞ ) ఏమిటి అని చీత్కరించి ఆరు రకాల సైన్యాలతో యుద్ధా నికి
బయల్దే రాడు .
తా-బాణం లాగా రివ్వున యజ్న భూమి చేరాడు .దేవతలకు నోటమాట రాలేదు .అప్పుడు యజ్న ప్రదేశం
చుట్టూ ఆకాశం దాకా ఒక కంచు కోట ఏర్పడి కాపాడుతోంది .
తా-వాడికాలి తన్నుతో బ్రద్దలై ముక్కలై పొ డి పొ డి అయిన కోట క్షణం లో అంతకంటే బలీయంగా మళ్ళీ
ఏర్పడింది .
38-భగ్నస్సోపి ప్రా దురాశీ త్త దన్య –స్సోపి ధ్వస్త స్త త్పర స్సద్య ఉత్ద ః
ఇత్ధ ం భండ శ్చండ విక్రా ంతి రుచ్చ్చై-ర్జా తం జాతం తచ్చతం సంబ భంజ ‘’
తా-వీడు కూల్చేయటం,దాని స్థా నం లో మరో కోట మొలవటం ఇట్లా నూరు కోట్ల కోటలు కూలటం మళ్ళీ
ఏర్పడటం జరిగింది .
తా-దమ్ము తగ్గిన దానవుడు సిగ్గు పడి అయినా పౌరుషం చావక వికార చేష్టలతో ‘’మీ ఇష్ట ం వచ్చినట్లు
యాగం ఏడవండి .,అప్పుడు నా మీదకు రండి .రేపు మీపని పడతాను ‘’అన్నాడు .
ప్రా పద్గేహం కామినీ కామ కామా –క్రా ౦త స్వాన్త స్చేతన శ్చాప్య నీశః’’
తా-ఆక్రో శం తో అట్ట హాసం చేస్తూ సైన్యం తో మన్మధో ద్రేకం తో ఇంటి దారి పట్టా డు భండాసురుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
https://sarasabharati-vuyyuru.com/2015/10/16/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0-4/
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4
తా –ఎత్తి పో డుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా విపరీత వింత ప్రవర్త నతో ఆమె వాడితో
ప్రవర్తిం చింది .తీపి ,కారం ఉన్న పానకం లావిష్ణు మాయ చేత ఈ పద్ధ తీ వాడికి నచ్చింది
42-‘’విజ్ఞా యాసౌ కార్య కాలం చరంతీ –తంచి క్షే పాంధౌ యదో ద్దేశమేవ
శాస్త ం్ర శాస్త ం్ర నోపకుర్యా త్ప్రసక్తే –ప్రా రబ్దే నీశస్య ధాతా విధాతా ‘’
తా-కావాలనే కన్య వాడిని కామపు రొంపిలో దింపి లేవ కుండా చేసింది .ప్రా రబ్ధ ం వాడిని అసమర్దు డిని
,శస్త ్ర విహీనుడిని చేసి౦ది .విధాత రాతకు తిరుగులేదు కదా.
తా-హో మాగ్ని కుండం లో కొత్త వెలుగు కనిపించింది .అందులో యెర్రని ఎరుపుదనం తో బాటు ఒక బాలిక
ప్రౌ ఢ లైన కన్యల పరివారం తో ఆవిర్భవించి౦ది .అర్వణం లేకుండానే ఉపాసించ దగిన పరోక్ష బ్రహ్మ విద్య
ఆమెయే .
తా-దేవతలు అగ్ని హో త్రం చుట్టూ తిరుగుతూ ఆదేవికి ప్రదక్షిణ చేస్తూ జయజయ ధ్వానాలు చేశారు
.అందరూ భక్తితో సాష్టా ంగ ప్రణామ౦ చేశారు . స్తో త్రపాఠాలు పఠించారు.
అస్మాం స్త్రా తుం విష్ణు నోద్దిస్ట యాగా –దావిర్భూతా చేజ్జయో జస్ర మస్తు ‘’
తా-‘’అమ్మా !నువ్వెవరు ?ఎక్కడినుండి ఇక్కడికొచ్చావు ?మాతో నీకేమైనా పని ఉందా ?మాకోసం శ్రీ
మహా విష్ణు వుచే పంపబడిన దేవతవా ?నీకు జయం ‘’అన్నారు .
తా-విద్యా మూలమైన పరోక్ష బ్రహ్మ విద్యా స్వరూపిణీ !పుస్త కం జపమాల ,వరదహస్త ం ,అభయ
హస్తా లతో కనిపిస్తు న్న దేవీ! ఎర్రకలువ పువ్వు లో కూర్చున్న బాలా౦బా ,ఆపన్నులమైన మా
ప్రా ణికోటిని కాపాడు .
‘’48-‘’బాలే బాల ప్రా భవే బాధ్యమానా –నస్మాన్భండే నాను రేణారి ణాత్వం
త్రా హి త్రా హి హ్యాపదబ్దేః పరం త్వాం-పారం ప్రా ప్తో విశ్వ సిత్యంత రాత్మా ‘’
తా-లోక కంటకుడైనా భండుని నుండి మమ్మల్ని కాపాడు .నిన్ను చూస్తె మమ్మల్ని తరింపజేసే నౌకలాగా
ఉండివిశ్వాసం కలిగించావు .
తా-యాగ బాల ‘’విష్ణు సంకల్ప యజ్ఞా నికి నేను సిద్ధి రూపం .అంతమాత్రా న భండుని అజ్ఞా నాన్ని పూర్తిగా
నశింప జేయలేని దానిని .దానికి మా అమ్మ సమర్ధు రాలు .ఆమెను పిలుస్తా ను ‘’అన్నది .
తా-నా చేతిలో ఉన్న గ్రంధాన్ని అర్ధ ం తో కూడా బాగా చదివి జపమాలతో ఆ మంత్రా న్ని జపించాలి .దానితో
అంతర్యాగ సాధన జరుగుతుంది .అప్పుడు మీకున్న సర్వ అరిస్టా లు తొలగిపో తాయి భయం లేదు నేను
వరమిస్తా ను .
53-‘’బ్రహ్మా౦ డేస్మిన్ చక్ర సో పాన పంక్త్యా –తీర్త్వా మార్గ ం దివ్య దేశే నిషన్ణా
తా-బ్రహ్మాండాలు దాటి దివ్య ప్రదేశం లో దేవి ధ్యాన ముద్ర లో అంతర్గ తుడైన దేవుని ధ్యానిస్తో ంది
.అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు .
54-‘’అంతర్యామీ కార్య మాహేత్య ప్రు చ్చత్ –నత్వా స్తు త్వా ప్రా దిశ త్సాపి బాలా
తా-ఎందుకు పిలిచావని బాలను ఆయన ఆడిగితే వినమ్రంగా స్తు తి చేసి ‘స్వామీ దేవతలంతా
కర్మకా౦డాగ్ని చేత శుచులై వచ్చారు వీరికి చిదగ్నిని పొ ందేట్లు చేయండి ‘’
దీక్షా దక్ష శ్చిత్త మాజ్యం జుహావ –చిత్యా చిత్యగ్నౌ సృచా సర్వ గోసౌ ‘’
తా-బాల కోరిక తీర్చటానికి ఆయన స్వయంగా యజ్న దీక్ష పొ ంది చిత్త వ్రు త్తి అనే స్రు క్కు తో ,చిత్త ం అనే
నెయ్యిని గ్రహించి జ్ఞా నాగ్నిలో హవనం చేశాడు .ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు కనుక అది అందరి
యజ్ఞ ం అయింది .
తా-చిత్తి చేత గ్రహింప బడిన చిత్త ం అనే నేతిని అగ్ని గ్రహించి,తన రూపం తో కమ్మేసి ‘’అనమస్క యోగం
‘’గా ప్రసిద్ధి చెందింది .ఆ స్తితిలో ఇక వినటానికి వేరొకటి లేనే లేదు .నిరంతర చిత్పదార్ధ ం ఒక్కటే మిగిలింది
.
57-‘’చిత్యగ్నౌ మగ్నం మనో నాస్తి వాస్తీ –త్యేతత్ప్రుచ్చే త్కంక ఏతద్బ్రవీతి
తా-చిదగ్నిలో మగ్నం అయిన చిత్త ం ఉందా పో యిందా ?దీనికి సమాధానం చెప్పాలి అంటే భారత కధలోకి
వెళ్ళాలి .అశ్వత్ధా మ హతః ‘’అన్నాడు ధర్మ రాజు ద్రో నణుడిని అర్జు నుడు ఓడించటం కోసం .ఇందులో
సత్యం ఏమిటో ధర్మ రాజునే అడగాలి .ఇక్కడ శ్వత్దా మా అంటే గుర్రం లాగా పరిగెత్తే మనసు .గురువు
ద్రో ణుడు అడగ్గా శిష్యుడు ‘’అశ్వత్దా మ అహతం కున్జ రరూపమైన వ్రు త్తి హతం అయింది అని లౌక్యంగా
సమాధానం .ఇది ప్రశ్నోత్త రలలాగా నడిచిన విషయం ఆని శ్రీ రాఘవ నారాయణుల మహా భాష్యం .
తా –కనిపించేదంతా కల్పితమే అంటుంది వేదం .బ్రహ్మ సాక్షిత్వం కూడా అందులోనే కలిసిపో యింది
.శూన్యత్వానికి ప్రతి పక్షం గా ఒకటి ఉండనే ఉంది .ఆ దీపం దగ్గ ర సర్వాభావం భాసిస్తు ంది ఇదే
చిద్విలాసం ,సత్యం .
తా-అలాంటి సమయం లో అన్నీ మరచి దేవతలు ఉండగా రూపం లేనిది కనుక ఒక అద్భుత శక్తి అతి
లోక సుందరిగా చిదగ్ని నుండి ఆవిర్భావిస్తూ వారికి దర్శన మిచ్చింది .
తా-శక్తి స్వరూపిణి అయిన ఆసర్వేశ్వరి దేవతల్ని చిదగ్నిలో పడేసి మనోమాలిన్యాలను వదిలించి జ్ఞా న
బల సంపన్నులను చేసంి ది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-15-ఉయ్యూరు
https://sarasabharati-vuyyuru.com/2015/10/17/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9/
’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5
https://sarasabharati-vuyyuru.com/2015/10/19/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae
%e0%b0%b6/
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-15-కాంప్ -బాచుపల్లి -హైదరా బాద్
https://sarasabharati-vuyyuru.com/2015/10/19/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae
%e0%b0%b6-2/
తా-మొహాన్ద కారా !చండ శాసన భండా ప్రత్యక్ష బ్రహ్మ విద్యాత్మిక లలితా దేవి ప్రత్యక్షంగా యుద్ధ ం
చేయటానికి సిద్ధం గా ఉంది ,
యిత్యా భాష్య ప్రస్తితా విష్ణు మాయా -ద్రు శ్యానా భూత్క్వాపి కాపి ద్విరూపా ”
శ్రు త్వా కాశే వాచ మర్ధ్యాం స భండ -స్సన్నద్దో భూత్సర్వ సైన్యై ర్వదాయ ”
సంరబ్దా ం స్వాం సైన్య రాజిం గృహీత్వా -దైత్యో దేవ్యా శ్శక్తి సేనా సమభ్యైత్ ”
జ్వాలా మాలిన్యా వ్రణోతిస్మ వహ్ని -ప్రా కారేణ స్వ ప్రభా భాసు రేణ ”
89 -మంత్రిన్యంబా గేయ చక్రా ది రూడ్హా -కోలై శ్చ క్రైహ్ స్యన్ద నే దండ నాధా
తా-గేయచక్ర రాదాన్నిఎక్కి మంత్రిణీ దేవి ,వారాహ చక్ర రధం పై దండనా శక్తి ,అలాగేమిగిలిన శక్తు లన్నీ
వారివారి ప్రత్యెక రదాలెక్కివచ్చారు .
గేయచక్రం ఏడ 0 తస్తు లతో ,కిరి చక్రం అయిదు అంతస్తు లతో ఉంటాయి మంత్రిణి అంటే శ్యామలాదేవి
.కిరి చక్రం పై వారాహిదేవి ఉంటుంది యుద్ధ ంలో ఈ మూడు రధాలు ఒక దాని వెంట ఒకటి ఉంటాయి ..
90-”సంతు స్త ంబా భండ సైన్యాది సర్వా-ణ్యాని ఘ్నంతీ0 శక్తి విక్రా ంతి మైక్ష
నిత్యా వీర్యా టోప మాలోక యంతీ –సౌత్సు క్యాతా అస్తు అద్భావ భంగ్యా”
తాశక్తి సైన్యం భండాసుర సర్వసైన్యాన్ని హతంచేస్తు ంటే శ్రీ మాతసిద్విలాసంగా నవ్వుతూ ,వారి
పరాక్రమాన్ని మెచ్చుతోంది .
సశేషం
తా-అంతటి భండుడితో యుద్ధ ం అని భయం కాని కంపం కాని లేని దేవి భర్త వామాంకం పై కూర్చునే
ఉండి సైన్యం తో భీకర యుద్ధ ం చేయించింది .వాడు చిత్రమైన విఘ్న యంత్రా న్ని పెట్టించాడు .
తా-ఆ యంత్రం దేవి కార్యాలకు విఘ్నాలు కలిగిస్తో ంది .పాలుపో క అమ్మవారు అయ్య వారి ముఖం వైపు
సాభిప్రా యంగా చూడగానే గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు .
93-ప్రు స్టా కార్యం కిం మయే త్యేతకేన -భంజా రాతే ర్విఘ్న యంత్రం దురంతం
తా-‘’నాతొ ఏమిపని ‘’? అని అడుగగా అమ్మ ‘’విఘ్న యంత్రా న్ని విచ్చిన్నం చేయమన్న’’ది .కాలితో
ఒక్కతన్ను తన్నగా అది ముక్కలై పొ డి పొ డి అయింది .రాక్షసుని మనసూ విరిగిపో యింది .
తా-యువరాజ పదవిలో ఉన్న ప్రౌ ఢ అయిన బాలలేక్కలేని భండుని కొడుకుల్ని సంహరించింది ఈపనికి
జగన్మాత బాలను భేష్ అని మెచ్చింది .
తా-భండుని తమ్ముడు విషండుని మంత్రిని శ్యామలాంబ చంపింది .వాడికంటే దుర్మార్గు డైన తమ్ముడు
విశుక్రా సురుడిని దండనాద అయిన వారాహి మట్టు పెట్టింది .
తా-ఈ రెండు పనులకు రాజ రాజేశ్వరి సంతోషించింది .స్వయంగా రాక్షసులని సృష్టించే సామర్ధ ్యం ఉన్న
భండుని చేత తోడబుట్టిన వారు అనే భావం తో మళ్ళీ పుట్టించటం లేదు .
తా-ఆ రాక్ష బలాన్ని చూసి నవ్వుతూ లోకమాత లలితా త్రిపురసుందరి రెండు చేతులలోని పది వ్రేళ్ళ
గోళ్ళను విదిల్చి నారాయణుని పది అవతారాలను సృష్టించి ,వారందర్నీ యుద్ధ ం చేయమని ఆజ్ఞా
పించింది .
99-‘’రక్షాం స్మేతాన్యాసు జీవేశ వ్రు త్తి –ప్రా యైః ప్రా యో హన్యమానాని వేశుః
జాతా విష్ణో ర్మూర్తి భేదా స్త దైవ-దేవ్యా దృష్టా నిర్ర్వ్యాణి స్శ్రమా శ్చ’’
తా-భండ సృష్టిని నారాయణ దశాక్రు తి సృష్టి పూర్తిగా నశింప జేసింది .విష్ణు అవతారాల పరాక్రమాన్ని దేవి
అభినందన పూర్వకం గా ప్రసన్న దృష్టితో చూసింది .దీనితో వారికి గాయాల బాధ లేకుండా పో యింది .
తా-తనవారు చచ్చి దేవి సైన్యం హెచ్చుతుంటే వాడికి మండి స్వయంగా యుద్ధా నికి దిగి అస్త శ
్ర స్త వ
్ర ర్షం
కురిపించాడు .
సశేషం
\తా
https://sarasabharati-vuyyuru.com/2015/10/21/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d/
మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -9
తా-అంతా కోల్పోయినవాడు కామకం అనే తన పట్ట ణం తో సహా దేవిపైకి వచ్చాడు .భవానీ దేవి వాడిని
కామేశ్వరమనే అస్త ం్ర తో కొత్త గా వాడినీ వాడి పట్ట ణాన్ని కాల్చి బూడిద చేసంి ది .
అస్త్రా లలో కామేశ్వరాస్త ం్ర పాశుపతాస్త ం్ర కంటే శక్తి వంతమైనది .అమ్మవారి నామాలలో ‘’కామేశ్వరాస్త ్ర ‘’అని
ఉంది .భండుడు మొహానికి, శూన్యనగరం శూన్య వాదానికి ప్రతీకలు అని గ్రహించాలి .దేవుడిని చూపించి
శూన్యవాదాన్ని చిత్తు చేసంి ది అనీ భావం .
తా-వ్యాసమహర్షిగా జన్మించిన నారాయణుడు బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో చాలా విస్తా రంగా
దీన్ని రాశాడు .నేను సంగ్రహం గా చెప్పాను అంతే.అన్నారు శాస్త్రీజీ .
ఉద్వాహే తే లోక మాతృత్వ కార్యే (కీర్తౌ )-పౌర్వా పర్యం తద్వి మ్రు స్ట వ్య మత్ర’’
తా-నీకూ వ్యాసునికి పదే పదే నమస్కరిస్తూ మళ్ళీ అడుగుతున్నాను .నీ వివాహం ,లోకాలను కనటం
లలో ఏది ముందు ?వివాహం నాటికే దేవాసురులతో ఉన్న ప్రపంచం ఉందికదా .మరి ఆ ప్రపంచాన్ని ఈ
అమ్మ ఎలా కన్నది ?అని సందేహం .
107-‘’ఈశ స్స్రస్టా లోక జాలస్య తాతః –పత్నీ తాత స్యా౦బి కైవ ప్రజానాం
తా-అన్నిలోకాల్ని సృష్టించిన ఈశ్వరుడు వాటికి తండ్రి అవుతాడు కదా .తండ్రి పెళ్ళాం ప్రజలకు తల్లి
అవుతుందికదా .అని మహా కవి కాళిదాసు పార్వతీ దేవి యొక్క లోక మాతృత్వాన్ని సమర్ధించాడు .
108-‘’శక్త్యా యుక్త శ్శక్త ఏతత్ క్రియాసు –నో చే దీశ స్స్పందితుం చాప్య శక్త ః
తా-శక్తితో కూడిన శివుడు సృష్టి స్తితి లయ కారకు డౌతాడు .శక్తి లేకపో తె ఆయన వలన ఏ పనీ జరుగదు
అని సాక్షాత్తు శంకరావ తారమే అయిన శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు కనుక తిరుగు లేదు .
109-‘’వేదో మూలం వ్యాస వాచాం న చేత్స-మంత్రం ద్రస్టా నో వదేత్కించ నాపి
తా-మంత్ర ద్రష్ట వ్యాసుడు చెప్పిన ప్రతిదానికి వేదమే మూలం .వారి వాక్కుల ప్రభావం తో ఊహా పో హాలను
మేళవించి సత్కవి కావ్య రూపం లో ప్రపంచానికి తెలియ బరుస్తా డు .
తా-అసలు వేద వాణివి నువ్వేకదా తల్లీ !నా అదృష్ట వశాన కలలోను , నిజంగాను కన్పిస్తు న్నావు .ముని
ముఖ్యుడు వ్యాసుడు ఈశ భావం తో సన్నిహితుడయ్యే ఉన్నాడు .మీ ఇద్ద రి సమక్షం లో నేను సంధించిన
ప్రశ్నాస్త్రా నికి నేనే ఉపసంహారం చేసి వివరిస్తా ను. దయ చేసి వినండి మీ రిద్దరూ ‘’అన్నారు శాస్త్రిగారు .
సశేషం
https://sarasabharati-vuyyuru.com/2015/10/23/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9/
111-‘’ఈశో విష్ణు సశ్రీ రుమావా ణ్యు మా జో –పీశ శ్శక్ర శ్చేశ ఈశా శచీద్యా
స్త్రీ సర్వోమా పూరుష స్సర్వ ఈశః –ఇత్యూచే కోపి శ్రు తేర్మౌళి భాగః
సిద్ధం స్త్రీ పుం సస్య మాతా పిత్రు భ్యం –ప్రా దాన్యే నై తత్వయీశే తధాపి’’
తా-ఆ పక్షం గా ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులని నిర్దేశించి ,ఆ ధర్మాన్ని స్త్రీ
పురుషులకందరికీ ఆపాదించటం వలన ప్రజలకు తల్లి ఆడది, తండ్రి మగాడు అవుతుంది .కాని
ప్రా ధాన్యాన్ని బట్టి జగన్మాతవు నువ్వు తల్లివి ,జగత్పిత శివుడు కాక తప్పదు .ఇలా డొంకంతా తిరిగినా
నా ప్రశ్న ప్రశ్న గానే ఉండిపో యింది .ఉమా మహేశ్వరుల వివాహ కాలానికి ఈ ప్రపంచం ఉండనే ఉందికదా
.మరి దాన్ని ఎప్పుడు కన్నావు తల్లీ ! హద్దు మీరితే క్షమించు .
115-శాక్తా శ్రు త్యా జామితి స్పష్ట ముక్తా ం-అన్యోక్తిభ్యో రూపణీ యాం నిరూప్య
తా-శాక్తేయులు ‘’అజామేకాం లోహిత శుక్ల కృష్ణా ం బహ్వీం ప్రజాం జనయంతీం సురూపాం ‘’అనే శ్రు తి
వాక్యాన్ని బట్టీ ,మాటలతో నిరూపింప లేని స్వరూపాన్ని నిరూపించి యోగ, జప తపాదులు మొదలైన
వాటి చేత నిన్ను ఉపాసిస్తు న్నారు .
తా-‘’అన్నిటికీ మూలమైన పార్వతీ పరమేశ్వరులను చూసి స్త్రీ ,పురుషులుగా భావించి బ్రహ్మ అన్ని
జాతుల జంతువుల్ని సృష్టించాడు’’ అని ‘’ప్రౌ ఢ కవయిత్రి గంగా దేవి ‘’చెప్పింది .ఎవరే రకంగా చెప్పినా మీ
ఇద్ద రు లోకాలకు మొదటి తలిదండ్రు లు అనటం లో సందేహమే లేదు .
118-‘’ప్రశ్నో న్యోవాగ్బ్రహ్మ పత్నీ ప్రసిద్ధా –శ్రీ హర్ష స్తా ం విష్ణు పత్నీం బ్రవీతి
తా-అమ్మా మరో డౌటు –సరస్వతి బ్రహ్మ భార్య అని ప్రసిద్ధం .విష్ణు పత్ని సరస్వతి అని శ్రీ హర్షు డు
నైషధం లో రాశాడే .శంభుని పత్ని శాంభవీ అని ఆగమాలు ఆగమాగామ౦ గా ఎలు గెత్తి చాటు తున్నాయి
కదా .మరైతే నువ్వేమను కోనంటే ‘’ఈ సరస్వతి అందరికీ పెళ్ళామా “”?లేక ఒకరికే భార్య యా ?(నీతో
మాట్లా డుతున్నకొద్దీ సందేహాలు పుట్ట్టలో తేళ్ళులాగా బయటికోస్తు న్నాయి ).
ఆద్యే ప్రశ్నే సో త్త రే సో త్త రాస్యుః-సర్వే తస్త ం ప్రస్తు తం ప్రా ర్ధ యామః ‘’
తా-పురాణాలలో ,చరితల
్ర లో అన్వయ సరణి తెలియని వాళ్ల కు పొ ట్ట నిండా సందేహాలే .ఈ చిక్కు ముడి
విప్పుదాం .ముందు నా మొదటి ప్రశ్నకు అంటే ‘’నీ జగన్మాత్రు త్వం ‘’కు సమాధానం దొ రికితే మిగిలినవి
అవే విప్పుకొంటాయి .
శక్తిం నౌమి ప్రా ంజలి ప్రహ్వ దేహః –పాద క్ష్మా౦తే న్యస్య మూర్ధా న మర్దీ’’
తా-బ్రహ్మ వేదాల ప్రత్యక్ష శరీరం కలవాడు .శక్తి కూటం లో నిత్య నివాసి అయిన వేద వ్యాసునికి
నమస్కరించి నాకు శక్తి కలగ జేయమని అర్ధిస్తు న్నాను .
యుష్మద్వాత్సల్యా న్మయా త్రో చ్య మానాం-శ్రు త్వా బ్రూ తంసాధువా సాదు వేతి’’
తా-సజాతీ విజాతీ స్వగత భేదం లేని నిష్క్రియ గల మార్పు లేని వస్తు వు ఒకటి ఉంది .దానికి బాధ లేదు
.అదే బృహత్వం లో బ్రహ్మ౦ అని మనం పెట్టు కొన్న పేర్లు .ఆ బ్రహ్మం లో అగ్నిలోని వేడల
ి ాగా ,విత్త నం
లో మొలిపించే శక్తిలాగా మాయ అనే ‘’రూపం లేని శక్తి’’ కనిపించకుండా ఉంది .ఆ మాయ శుద్ధ మైంది
.దానిలో ప్రతి ఫలించిన బ్రహ్మం యొక్క ప్రతి బింబమే ఈశ్వరుడు .ఈ ఈశ్వరుడు సత్వ గుణంఉన్న
మాయ తో కలిసి అనేక రూపాలు పొ ందాలని భావించాడు .
తా-సర్వజ్ఞు డైన శ౦కరుడు ఈ శక్తినే మాయ అన్నాడు .సద సద్రూ పంగా ఉన్న ప్రపంచం అంతా ఈ మాయ
వలననే ఏర్పడుతుంది .సద్వస్తు వు దగ్గ రగా ఉంటె అసత్తు సత్తు లాగా భాసిస్తు ంది .ఈ భాసనం దీపం
దగ్గ ర ఇతర పదార్ధా లు కాంతితో కనిపించి నట్లు గా ఉంటుంది .
తా-శుద్ధు డు, సర్వజ్ఞు డు అయిన పరమేశ్వరుడు ,మాయలోని సత్వ గుణ ఉద్రేకం వలన ఇచ్చా శక్తి తో
కలిసి నానాత్వం కోరాడు .వెంటనే ఈశ్వరుడు విశ్వ రూపాన్ని దాల్చాడు .మదహంకార ,సూక్ష్మ ,స్థూ ల
భూతాలను ఒక క్రమం లో సృష్టించాడని రెండు పద్ధ తులలోశ్రు తి చెప్పింది .కనుక ఒకప్పుడు క్రమ సృష్టి
,మరొక్కప్పుడు సర్వ సృష్టి జరిగిందని భావించాలి .
బింబీ భూత స్త త్ర దేవః ప్రసూతే –సత్వన్నత్యా భిన్న రూపేచ్చ యేదం’’
తా-శుద్ధ మాయ- రూప రహితమైన నామం రూపం లేని పర బ్రహ్మానికి ‘’మహిషి ‘’అని శ్రీ శంకర
భాగవత్పాదు లవారు వర్ణించారు .దానిలో ప్రతి బింబిం చిన దేవుడు సత్వ ప్రధానం కలిగి ఉండటం వలన
వేరే రూపం లో ఉన్న మాయ లో ఉన్న గుణాలను తన వశం చేసుకొని తాను గుణ రహితుడైనా
గుణమయమై కనిపించి మనతో ఒకాట ఆడుకొంటున్నాడు .అంటే సృష్టి చేస్తు న్నాడు అని భావం .
సశేషం
ne image 1
https://sarasabharati-vuyyuru.com/2015/10/23/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9-2/
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11
తా-సర్వ ప్రపంచాని కంటేముందేపుట్ట్టిన మాయ- తల్లి ,మహేశుడు తండ్రి .ఆయన కామేశ్వరుడు అయితే
నువ్వు కామేశ్వరివి .కామం అంటే ఇచ్చ అని లోక వ్యవహారం .
తా-ఇచ్చా రూప మాయ ,శుద్ధ మాయా ప్రతి బింబ భూతుడైన ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించారు
.కామేశ్వరావతారం లో పెళ్లి చేసుకోవాలను కున్నారు .కామేశ్వరుడే రుద్ర రూపం లో దక్షుని కుమార్తె వైన
నిన్ను పెళ్ళాడాడు .ఆ దాక్షాయణి తర్వాత పర్వ త రాజ పుత్రిక పార్వతి అయి ఆయన్ను వివాహం
చేసుకొంది.
పాతి వ్రత్యం వర్ణ నీయం తవైవ –సూతాస్మాం స్తే నైవ సంభూయ భూమ్నా ‘’
తా-సత్యాత్మ స్వరూపుడు అయిన ఈశానుడి ని విడిచి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు .అందుకే
పాతివ్రత్యానికి నిన్నే ముందు చెబుతారు .’’భూమ ‘’ఆకారం అయిన ఈశ్వరునితో నిత్యం ఉంటూ
,అప్పుడూ ,ఇప్పుడూ కూడా మమ్మల్ని కని పెట్టు కొనే ఉంటున్నావు .
తా-‘’ఈశుని ప్రతి బింబా నికి ఆధార మైన గుణ వ్యవస్థ లోకానికి’’ నాయనమ్మ ‘’అయింది
.ఈశ్వరునితోకలిసి సత్వ ప్రధాన మాయవైన నువ్వు మా అందరికి’’ తల్లి’’ వైనావు .రజో గుణ ప్రధాన మైన
నీలో స్వయంగా’’ విరించి ‘’ పుట్టి బ్రహ్మ మొదలైన పేర్ల తో సృష్టి కర్త అయ్యాడు .ఆ ఈశ్వరుని శక్తి భాగం
విరాట్టు అంటే విష్ణు వు అయినాడు .
130-‘’సృ ష్ట్యా మస్యాం సాస్త్ర్యు మేశః పుమాని –త్వన్వేత్వేవ శ్రో త శీర్ష ప్రసంగః
త్వద్వంద్వ స్యేదం సమిద్ధ ం ప్రతీకై –ర్విశ్వం వేదః ప్రా హసో న్వేతి చాత్ర’’
తా-ప్రక్రు తి రూపిని వైన నిన్ను మాయగా తెలుసుకొని ,ఆ మాయనే కలుపుకొని వ్యవహరిస్తు న్న
ఈశ్వరుని సత్యం గా భావించి ,మీ ఇద్ద రి అవయవాలతో ఈ విశ్వం ప్రకాశిస్తో ంది అని వేదం చెప్పింది
.ఇక్కడకూడా వేద భావన సమన్వయము అయింది .
132-‘’తస్మాద్వక్తి త్వజ్జ గంమాత్రు కాత్వం –లోక శ్శాస్త ం్ర సర్వ మూలం హి వేదః
తా-నువ్వే జగాలకు మాతవు అని లోకం, శాస్త ం్ర , అన్నిటికీ మూలమైన వేదం ఘోషిస్తు న్నాయి .అప్పటి
సూక్షం సృష్టి లో ‘’మేళ,తాళాలు’’లేవు .వినేవాడు ,చూచే వాడు కూదాలేరు .భాజా భజంత్రీలు
,పురోహితుడు ,మంత్రం తంత్రా లు సాక్షులు ఎవ్వరూ లేరు కనుక ఆ వివాహం ‘’ఉత్తు త్తి బాంక్ లాగా
ఉత్తు త్తి పెళ్లి ‘’అని అనుకోవాలి .
తా-అమ్మా ! నా అధిక అజ్ఞా న ప్రసంగాన్ని క్షమించు .భండాసుర సంహార సమయం లో దేవతల కోరిక పై
నువ్వు శివుని ధ్యానించగా నీ నాధుడే వచ్చి నిన్ను ‘’మళ్ళీ పెళ్లి ‘’చేసుకున్నాడు .
తా-నిత్యం వేదం చెబుతూనే ఉన్నా ,నీ పెళ్లి నాటి నుండి వివాహం అనేది ఒక యజ్ఞ ం గా లోకం లో
సుప్రసిద్ధమైంది .వేదాన్ని అనుసరించీ ,లోకా చారాన్ని బట్టి కల్ప కారులైన ఆపస్త ంభుడు మొదలైన వారు
వివాహ విధానాన్ని శాస్తో క్త ం గా రచించారు .
తా-గౌరీకళ్యాణం అని సీతా కళ్యాణం ఇతర దేవతలకూ కళ్యాణాలు భక్తు లు భక్తీ శ్రద్ధలతో కళ్యాణ
మహో త్సవాలు అప్పటి నుంచీ చేస్తు న్నారు .స్త్రీ పురుష వివాహాలు కల్ప సిద్ధా లు .ఇదే ఇప్పుడు
దేశమంతా అనుసరించి భాజా భజంత్రీలతో హో రేక్కిస్తు న్నారు .
సశేషం
https://sarasabharati-vuyyuru.com/2015/10/25/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9-3/
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12
తా-భక్తీ ,ఆస్తిక బుద్ధి లతో నేను పలికిన వెర్రి మొర్రి మాటలను బిడ్డ మీద ప్రేమ ఉన్న తల్లిలాగా విని నా
పాపాలు పో గొట్టి నాకేది ఈయాలని పిస్తే దాన్ని ఇవ్వు .నీ సముఖం లోనే వ్యాస భట్టా రకునితో రెండు
మాటలు మాట్లా డతాను .దాన్నీ విను తల్లీ !.
తూష్ణీం స్థా తుం శక్ను వంతో న కిం వా –వచ్మో యుక్తా యుక్త తే కః ప్రవద
ే ‘’
తా-ఇలాంటి ప్రశ్నలు లోకం లో కో కొల్ల లున్నాయి .వాళ్ల కు ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు
.వాళ్ళ నోరు మూయించటానికి నాకు తెలిసిన సమాధానమేదో చెబుతున్నాను .అందులో సత్యా సత్యాలు
యుక్తా యుక్తా లు నాకు తెలియదు .సత్యాన్ని తెలుసుకోవటం ఎవరి తరం ?
140-‘’శ్రు ణ్వే తన్మే త్రో చ్య మానం సమాధిం –విష్ణ్వీశాది స్థూ ల సర్గో యదా భూత్
సర్వే దేవా స్సర్వ లోకా న్సమస్త ౦ –భూత ప్రా యం భూత మే వేతి మన్యే ‘’
తా-నేను చెప్పే సమాధానం విను స్వామీ !శివ ,విష్ణు ,బ్రహ్మా దుల స్థూ ల దేహ సృష్టి ఎప్పుడు జరిగిందో
,అప్పుడే సర్వ లోకాలు ,సర్వ దేవతలు ,సమస్త భూత జాలం ఏర్పడింది ఒకదానినొకటి పో లి ఉన్నాయి .
తా-అందరి దేహాలూ ఒకటిగానే ఉన్నా ,లౌకికులు వ్యావహారిక విషయాలనే గ్రా హి౦చారు .యోగులు
మాత్రం ఇందులో పారమార్ధిక మార్గా న్ని అనుసరించారు .యోగుల అనుభావమేమిటో మనకు తెలియదు
కదా. మనం వాడుకొనే పధ్ధ తి తుచ్చం అని వారి అభిప్రా యం .
142-బ్రహ్మాండం పిండాండ కేత్రా స్తి గూఢం-షట్సప్తా స్టౌ వాత్ర చక్రా ణి సంతి
తా-ఈ స్వల్ప మానవ శరీరం లో బ్రహ్మాండం అంతా గూఢం గా ఉంది ఇందులోనే ఆరు ,లేక ఏడు లేక
ఎనిమిది చక్రా లున్నాయి .ఆ చక్రా ల దళాలలో అ నుండి క్ష వరకు అక్షరాలు అమ్రు తాది శక్తి రూపం లో
ఉన్నాయి .ఈ చక్రా ల మధ్య కుండలిని అనే శక్తిగల నాడి వ్యాపించి ఉంది .
143-‘’ఊర్ధ ్వం వాలం శీర్ష మానీయ చాద –శ్శేతే స్మాకం పృష్ట వంశేషు సో హిః
తా- ఆ కుండలినీ శక్తి తకకి౦దు గా తోక పైకి ఉంచి మన వెన్నెముకలో నిద్రిస్తో ంది .దాన్ని వెన్నుపాము
అంటాము .యోగాభ్యాసం చేసేవాడు దానికి అటూ ఇటూ ఉండే ఇడ,పింగళఅనే నాడులలో గాలి గట్టిగా
పూరించి ,మధ్యలోని కుండలినీ శక్తిని కదిలిస్తా డు .
144-‘’ఊర్ధ ్వం శీర్షం వాల మూలం తధాధః-క్రు త్వోత్తి స్ట త్యజ్జ ్వలాత్మా సుసుమ్నా
తా-ఈ రెండు నాడులలో నిండిన గాలి ప్రేరేపి౦పగా తలపైకి తోక కిందికి ఉండేట్లు గా మహా ప్రకాశం తో ఆ
కు౦డలిని జ్వాలలను ఎగిసేట్లు చేస్తు ంది .ఆ గాలి అగ్ని రూపాన్ని పొ ంది ,సుషుమ్న తో ఎగసి నానా విధ
నాదాలతో భయంకరంగా సాధకుని మూర్ధ స్థా నానికి చేరుతుంది .
తా-ఇలా నాదమయం అయిన యా కుండలిని తో సహస్రా నికి వెళ్ళే మార్గ ం లో రాత్రి వేళ దీపం తీసుకు
పో తున్నప్పుడు దారిలో ఉన్న మేడల గోడల,పై చెట్ల నీడలు చూసినట్లు సాధకుడు అదృష్ట వశాన ఆ
చక్రా లను దర్శిస్తా డు .
తా-మొదట్లో మూలాధార చక్రం కని పిస్తు ంది .దీనికి గణపతి అధికారి .గణపతి శక్తి’’ పుష్టి దేవి ‘’అనే పేరు
కలది .ఇందులోని నాలుగు దళాలలో అవే’’ వ ,శ ష ,స ‘’అనే అక్షరాలు’’ వశిన్యాది ‘’శక్తు లుగా ప్రకాశిస్తూ
ఉంటాయి .
147-‘’వాణీ బ్రహ్మాదిష్టితం యత్త దూర్ధ ్వ్యం –స్వాధి స్టా నం చక్ర మాస్తే షడశ్రం
తా-దానిపై సరస్వతీ శక్తి తో కలిసి బ్రహ్మ చేత అధిస్టిం ప బడిన ‘’స్వాదిస్టా నం’’ అనే ఆరు దళాల చక్రం
ఉంటుంది .ఆ దళాలలో ‘’బ ,భ ,అ ,య ,ర,ల ‘’అనే వర్ణా లు ‘’బందిన్యాది శక్తు లు ‘’గా నిత్యం నిలిచి
ఉంటాయి .
డాద్యాః ఫాంతా అక్షరా అత్ర దేవ్యో –డాకిన్యా ద్యాస్స్యు ర్ద శ స్వశ్ర కేషు ‘’
తా-దీనిపైన(నాభి దగ్గ ర ) మణిపూరకమనే చక్రం ,దాని అధిదేవత విష్ణు వు ఉంటారు .ఇక్కడ లక్ష్మీ
దేవియే శక్తి .ఈ కమల దళాలలో’’ డ,ఢ,ణ,త,ధ.ద,ధ,న,ప,ఫ’’అనే అక్షరాలూ 15 దళాలలో’’ డాకిన్యాది
శక్తు లుగా’’ ఉంటాయి .
తస్యా రేషు స్యుః కఠాద్యంతవర్ణా -స్సర్వా దేవ్యః కాలరా త్ర్యాదయ స్తా ః’’
తా-మణిపూరకం పైన హృదయ స్థా నం లో ‘’అనాహతం ‘’అనే పేరుతొ 12 అంచుల చక్రం ఉంది ..దీనిలో
శక్తి పార్వతి శివుడు దేవుడు..దాని అంచులలో ‘’క ఖ ,గ ఘ ,జ్ఞ ,చ, ఛ జ ,ఝ ,జ,ట,ఠ ‘’అనే ఆగమ
ప్రసిద్దా లైన 12 అక్షరాలుంటాయి .ఇవే’’ కాలరాత్రి’’ మొదలైన ఆగమ ప్రసద
ి ్ధ శక్తు లు .
150-‘’కంఠ స్థా నే షో డ శారం త దూర్ధ ్వం –జీవో దేవః ప్రా ణ శక్త్యా సమేతః
అశ్రేష్వస్య స్యు స్స్వరా స్షో డశర్ణా —స్తా ఏ వైషాం శక్త యశ్చా మృతాద్యాః’’
తా-అనాహతం పైన క౦ఠ స్థా నం లో (గడ్డ ం కింద )16 అంచుల చక్రం ఉంది .దీని అధిదేవత జీవుడు
ప్రా ణశక్తితో ఉంటాడు .అంచులలో ‘’అ ,ఆ,ఇ,ఈ, ఉ, ఋ,ఋాఆలు ,ఆలూ ,ఎ,,ఏ ఐ, ఒ,ఓ,ఔ,అం,అః’’అనే
16 అక్షరాలూ (అచ్చులు )’’అమృతం ‘’మొదలైన శక్తు లుగా ఉంటాయి .
తా-రెండు కను బొ మల మధ్య రెండంచుల ‘’ఆజ్ఞా చక్రం ‘’ఉంటుంది .ఇందులో ఇచ్చయే శక్తి రూపంగా
ఉంటుంది .దీనికి అధికారి పరమాత్మ .రెండు దళాలలో’’ హ ,క్ష’’అనే రెండక్షరాలుండి’’ క్షమావతి
,హంసవతి ‘’అనే శక్తు లను కలిగి ఉంటాయి .
తా-‘’మాడు’’ లో ‘’సహస్రా రం’’ అనే ఉత్త మమైన చక్రం ఉంది .ఇక్కడ’’ గురుమూర్తి’’ అధిస్టించి ఉంటాడు
.అక్షరాలన్నీ తమ శక్తు లతో కలిసి ,ఆయా దేవత లంతా ఈ చక్రం లో ఉంటారు .యోగాభ్యాసకులు ఇక్కడే
నిద్రిస్తా రు .
153-‘’దృశ్యాదృశ్యం చా స్ట మం చక్ర మూర్ధ్వే –మూర్ద ్నః పీఠే స్వాంగుళీ నాం చతుష్కే
తా-సహస్రా రం పైన ఎవరి చేతి వ్రేళ్ళ తో నాలుగు అంగుళాల లెక్కలో బెత్తెడు దూరం లో ‘’పీఠం’అనే చక్రం
ఉంది .సహస్రా రం లో ఉన్న యోగులకు కూడా చూడశక్యం కానిది .ఇక్కడ సర్వ కారణమైన పర బ్రహ్మ
స్వరూపం ఉంటుంది .అది శక్తియో ,శక్తి మంతుడో ఎవరూ చెప్పలేరు .
154-‘’తస్మిన్ దేశే శక్తి మచ్చక్త ్య భేదాత్ –బ్రహ్మై వేదం శక్తి రేవే య మిత్ధ ం
ద్రష్ట్రూ ణాం ద్రు ష్టి ప్రభే ధాన్మతాని –శాక్తే యాదీ న్యానిరాసన్ హితాని ‘’
తా-ఇక్కడ శక్తికి ,శక్తి మంతుడికి అభేదమే .దీనినే ‘’బ్రహ్మం ‘’అనీ ,’’శక్తి ‘’అనీ పిలుస్తా రు .చూసే యోగుల
దృష్టి భేదాన్ని బట్టి శాక్తేయం ,వైష్ణవం శైవం మొదలైన మతాలూ ఏర్పడ్డా యి .
తా-ఈ చక్రం లో శక్తి రూపంగా కని పించే భాగం తల్లి .పురుష రూపంగా కనిపించే భాగం తండ్రి .అగ్నీ
దాని శక్తి ఐన వేడి లాగా చిద్రూ పం, శక్తి రూపం గూఢ మైనవి .శక్తి రూపం’’ మాయ’’ .పురుష రూపం
‘’మాయి ‘’.మాయియే కామేశ్వరుడు .మాయ కామేశ్వరీ దేవి .కామేశ్వరే పార్వతీదేవి .కామేశ్వరుడే
పరమేశ్వరుడు .
సశేషం
https://sarasabharati-vuyyuru.com/2015/10/26/%E0%B0%AE
%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D
%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%83-
%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AC
%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE
%E0%B0%B6-3/
తా-ఆ మాయా దేవియే నేను .ఇప్పుడిక్కడ ఆవిర్భ వించాను అనే ఆనతరంగిక జ్ఞా నం వలన పార్వతి
అయినా ,లోక మాట కావచ్చు ,లక్ష్మీ దేవీ కావచ్చు నారోక రెవరైనా జగజ్జ నని కావచ్చు .ఇలా
సమన్వయము చేసుకొంటే సీతా ,రుక్మిణీ మొదలైన అవతార వ్యక్తు లకు ,లోపాముద్రా ది సిద్ధ స్త్రీ
వ్యక్తు లకు జగన్మాతృత్వం సిద్ధిస్తు ంది .
తా-ఈ ప్రకరణం లో విరాట్ పురుషుని చేత చేయ బడిన సృష్టినే చూస్తు న్నాం .మీ దాంపత్యం స్వయం
సిద్ధమై ఆ రూపంగా పూర్వమే ఉంది .తలఛి నంతనే సంభ వించే పురాతన ఈశ్వర సృష్టి ,హిరణ్య గర్భుడు
చేసిన సూక్ష్మ సృష్టి –రెండిటిలోనూ మీ దాంపత్యమే భాసిస్తో ంది .
తా-ఇలా చేసిన ప్రసంగం అంటా వివాద రహితమైనది .కాళిదాస మహా కవి కూడా పూర్వ సృష్టి ప్రసిద్ధిని
చెబుతూ తండ్రి భార్య తల్లి అనే చెప్పాడు .తల్లికి భర్త తండ్రి అవుతాడు .తండ్రిభార్య తల్లి అవుతుంది .అదే
ఇక్కడ బ్రహ్మా, శక్తి.
160-‘’ఏకా మూర్తిస్సా త్రిదా భేద మాపే –త్యాహ స్మాసౌ కాళిదాస స్త్రి మూర్తీన్
తా-ప్రస్తు తానికి వద్దా ం –మా అమ్మ జగన్మాత చిద్రూ పాన్ని ముందే వివాహమాడి ,తర్వాతే మమ్మల్ని
అందర్నీ కన్నది .ఇది వివాద రహితం .అప్పటి వివాహానికి సాక్షులు లేరు .ఇప్పుడు చూసే
సాక్షులున్నారు .కనుక పార్వతీ పరమేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,మొదలైన వారందరి పెళ్ళిళ్ళు
ఇప్పుడు తెలుస్తు న్నాయి .
మాతా పిత్రో ర్నిత్య కల్యాణ మాసీత్ –అఘ్న్యే కస్మిం స్త చ్చతం వా సహస్రం ‘’
తా- ఆ దంపతులకు ఒక సారి పెళ్లి కాని ఇన్ని సార్లు పెళ్లి ళ్ళా అనే అనుమానం వద్దు .భక్తు ల ఉత్సాహం
తో ప్రతి ఏడాది ,ప్రతి నెలా ,ప్రతి రోజూ ఆ పురాణ పుణ్య దంపతుల కు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భక్తితో
చేస్తు న్నారు .ఒక్కో సారి వందా, వెయ్యి కల్యాణాలను కూడా చేస్తు న్నారు .
తాన్సర్వా న్సమ్యక్సమర్దా భవంతి –తద్ద్రు స్ట్యా ర్యై ర్ముక్త మన్వేతు మర్హా ః’’
తా-ఇలా పురాణ ప్రసిద్ధ కధలు ఎన్నో ఉన్నాయి .ఇవన్నీ యోగ మతం ,సాంఖ్య మతం లను అనుసరించి
,జీవుల మోక్ష ప్రయోజనానికి సర్వవిధాలా చక్కగా సమర్ధ నీయం అవుతున్నాయి .పూజ్యులైన పెద్దలచేత
పురాణాలను అన్వయింప జేసుకోవాలి .ఇదే ఉత్త మ మార్గ ం .
తా-ఈ విధంగా సృష్టికి మొదట్లో ప్రతి జీవి మూలాధార చక్రం లో గణపతిని సర్వజ్ఞు డైన పర మేశ్వరుడు
తన వివాహ సమయం లో పూజించాడు .లోకాలకు అవసరమైనప్పుడు పార్వతీ దేవి అతడిని తన
కుమారుడిగా స్థూ ల దృష్టిలో కనిపింప జేసింది .
తా-కృష్ణ ద్వైపాయన ముని శ్రేస్టా !నా రెండు చేతులతో నీ రెండు పాదాలనంటి నమస్కరిస్తు న్నాను .ఒక
విధంగా నీ పాదాలకు దగ్గ ర భూమిపై పడుకొని కరచరణాది అవయవాలు ఎనిమిది భూమికి తాకేట్లు
నమస్కరిస్తు న్నాను .అనుగ్రహించు మహాను భావా !
తా-ఓ గుగ్గు రూ !పరమమునీ !నీ పురాణ వాగ్దో రణి అనే సముద్రం యొక్క అవతలి ఒడ్డు ను చేరటానికి ఈ
లోకం లో ఒక్కడు కూడా సమర్ధు డు లేడు.నేను నీ పురాణాలమీద సిద్ధా ంతం చెప్ప గలిగే సమర్దు డినా !
పిల్లల వచ్చీ రాని మాటలు వినాలనే వేడుక గల తల్లి ఐన పరాశక్తి ‘’కల ‘’అనే వంక తో నన్ను ఇట్లా
వాగించావు కదూ !
167-‘’మౌనిన్ తే త్రా కారణం త్వే తదర్ధ ం –దో షం త్యక్త్వా భాషితం మే శ్రు ణుష్వ
శ్రు త్వా స్యాయా శ్ష్రా వయా సాదు సాధూ –భీతో మాతుస్త్వాం శరణ్యం భజామి ‘’
తా-మునిముఖ్యా వ్యాసా !ఈ చిన్న విషయానికే నన్ను వీడు నన్ను పిలిచాడా అని తప్పు పట్ట కుండా నే
చెప్పేది విను .మంచి చెడు తేల్చు .తల్లి వలన భయం తో చనువుగా నిన్ను రక్షకుడిగా భావించి వేడు
కొంటున్నాను .
168-‘’వేదే వాదే త్వ త్పరీ వాద బాదే –బో ధ ప్రా యాం శేముషీం మే ప్రదేహి
స్వర్గే మోక్షేవాన్యన్య జన్మ ప్రసంగే –సాధ్వధ్వానంప్రా పయాస్తు ప్రణామః ‘’
తా-వేదం విషయం లో వాదం వచ్చినా ,నీ పురాణాల విషయం లో ఆక్షేపించే వాళ్ళ మాటలు వినాల్సి
బాధ పడేటప్పుడు గాని సత్యమైన అర్ధా న్ని తెలుసుకొనే సద్బుద్ధిని నాకు ఇవ్వు .స్వర్గ మోక్షాల విషయం
లో ,ఉత్త రజన్మ విషయ ప్రసంగాలలో మంచి మార్గ ం లో నన్ను నడిపించు .నేను నీకేమి ఇవ్వగలను ?
ఒక్క నమస్కారం సమర్పించటం తప్ప ?
సశేషం
https://sarasabharati-vuyyuru.com/2015/10/26/%E0%B0%AE
%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D
%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%83-
%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AC
%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE
%E0%B0%B6-4/
తా-ముసి ముసి నవ్వులు నవ్వే తల్లీ !నేను ఇదివరకు నవ్విన నవ్వు అనే కళంకాన్ని వాత్సల్యం తో
తొలగించు .మర్చి పో .వ్యాసస్వామి కూడా నా నవ్వు విషయాన్ని పెద్దగా పట్టించు కోలేదు .దో షమనీ
అనలేదు .
తా-ఉచ్వాస నిశ్వాసాల కు ఆధారమైన’’ హంస’’ భావం తో కాని ,హృదయం మధ్యలో ఉన్న’’ హంస
మండలం నేను’’ అనే ‘’ హార్దో పాసన’’ అనుసరించి కాని ,బయట అందరికి ప్రత్యక్షం గా కనిపించే సూర్య
మండలం లోని ‘’సో హం ‘’భావం తో కాని ,శ్రు తిని అనుసరించికాని ,ఏదో ఒక మతాన్ని అనుసరించికాని
నిన్ను ఉపాసిస్తా ను .దేనికి నేను అర్హు డినో ఆ స్థితి ని నాకు కలిగించు
త్వం చిద్వా చిద్వేతి జానాతి కోవా –యోజానీయా త్సో పితా దృక్త ్వ మేతి’’
తా-అమ్మా !చిద్రూ పాన్ని చేతిలో పెట్టు కొని ,జడం ,అజడం అయిన లోక జాలాన్ని అంతా ఆడిస్తు న్నావు
.ఈ ఆటలో నువ్వు ఏ రూపం లో ఉంటావో తెలుసుకోవటం కష్ట ం .
తా-లోక దృష్టిలో మెలకువ స్థితిలో ప్రమాణ ,ప్రమేయ రూపం గా ప్రసిద్ధమార్గ ం లో ప్రత్యక్షంగా కనిపిస్తూ
కూడా ,చేరటానికి శక్యం కాని దానివై ఉంటావు .కలలో కన్పించిన నిన్ను ,నీ స్వరూపాన్ని వర్ణించటం
ఎవరి సాధ్యం ?అసమర్ధు డైన నన్ను ,సమర్దు రాలవైన నువ్వు అటో ఇటో ఏదో ఒక గమ్య స్థా నానికి చేర్చు
జగన్మాతా !
తా-వేద,శాస్త ్ర ,ఇతిహాస ,పురాణాలలో ప్రసిద్ధమైన మార్గ ం లో ఆర్యజనుల చేత సేవింప బడే ప్రముఖ కాంచీ
పీఠంలో నెలకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిచే ఆదేశింప బడి ,పుణ్య వశం తో
క్షణిక సమాధిలో’’ నేను నేనై’’ ఉంటాను .
తా-నీ బిడ్డ నైన నన్ను చూసుకొనే భారం నీదే .పుణ్య పాపాల చింత నాకు లేదు .నీ అండ ఉంటె సత్య
సముద్రం లో మునిగే సత్య వస్తు వుకు పాపపుణ్యాలుండవు .మాయికానికి ఉంటె ఉండనీ నాకేం ?
తా-తల్లీ దేవ దేవీ ! ఓ మహామౌనీ వ్యాసర్షీ ! అల్పుడనైన నేను ఇంత సేపు మిమ్మల్ని నిలబెట్టటం ,మీ
సాన్నిద్యం లో నానోటికొచ్చి౦దల్లా వాగటం చెసిన౦దుకు ఇద్ద రూ నన్నుముందుగా క్షమించండి .మీకు
నేనేం సమర్పించుకో గలను ?మీ వాత్సల్యం తో నాకు’’ స్వస్వరూపావస్తితబాధిత కాలం’’ సంప్రా ప్త మైంది .
176-‘’ఇత్ధ ం యద్వా నిత్య సాన్నిధ్య యోగాత్ –సత్యం ధర్మం వాచయ౦ తౌ శ్రు తీద్యం
తా-నిత్యం మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించి వాగ్దేవిని నా నాలుకపై ఉంచి ,శ్రు తులచేత కొనియాడ బడే సత్య
,ధర్మాలను నాచేత పలికిస్తూ ఇలాంటి వినోదాన్ని చూస్తూ సంతోషిస్తా రా ?అది నాకు నిర్బీజ సమాదికంటే
ముఖ్యమైనదిగా నేను భావిస్తా ను .
తా-నా విద్యకి ,పుట్టు వుకు మూల భూతుడైన శ్రీ రామ కదామృత గ్రంధ కర్త శ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య
శాస్త్రి అని లోక ప్రఖ్యాతుడైన మహా గురువైన నా తండ్రిని మాటి మాటికి నమస్కరిస్తూ స్మరిస్తూ
కొనియాడుతాను .
తా-దత్త భాగవతం అనే గ్రంధాన్ని రచించి చందో లు నగరం లో’’ లింగోద్భవ స్వామి’’కి అ౦కితమిచ్చాను
.మాయావిక అనే గ్రంధాన్ని రాసి శ్రీ చెన్నకేశవ స్వామికిచ్చాను ‘ఈ రకంగా శివ కేశవులు నాకు అల్లు ళ్ళు
అయ్యారు .
తా- ఆ యమ ధర్మ రాజు మిత్రు ని పుత్రు డు కనుక నా వాడే. ప్రవృత్తి లో ఏ భయం వచ్చినా జగజ్జ నని
నన్ను రక్షిస్తు ంది .కనుక ద్వైత వాద మార్గ ం లో నాకేమీ భయమే లేదు .అద్వైతమార్గా న్ని
అనుసరించేవాడిని నేనొక్కడినే కదా .రెండో వాడు ఉంటేనే కదా భయం .కనుక నేను అభయుడను
,ఆనంద స్వరూపుడను .
181-‘’వృద్ధ క్ష్మౌ భ్రు న్నాగ లింగః ప్రసిద్దో –విద్వానాసీ న్మే గురుః పాణినీయే
తా-ముదిగొండ నాగ లింగ శాస్త్రి అనే ప్రసిద్ధ విద్వాంసుడు నాకు వ్యాకరణ గురువు .ఆయన ద్వైత
విశిష్టా ద్వైత భాష్యాలను విమర్శిస్తూ ప్రతి సూత్రా నికి నాలుగుదారుల భేదాలను శిష్య వాత్సల్యం తో
బో ధించాడు .
తా-మహా తర్క వేదాంత సామ్రా ట్ బిరుదాంకితుడైన శ్రీ మద్దు లపల్లి మాణిక్య శాస్త్రి గారు ,అనుకో కుండా
ఒక సారి మా ఇంటికిశిష్యులతో వచ్చినెల రోజులుండి నేను చదివింది చదవనిది నాకున్న జ్ఞా న లేశాన్ని
మెరుగు పరచి నన్ను తీర్చి దిద్దా రు .
తా-ఇలా ఏయే మహాత్ములు నాకు ఒక్కక్షరమైనా ఇచ్చ్చారో వారందరినీ గౌరవ ప్రపత్తు లతో పూజిస్తా ను
.దేవతలకు మిత్రు లకు ,సహ పాఠకులకు ,పెద్దలకు గురు వరేణ్యు లకు ,సర్వ సమత్వ భావమున్న
ప్రబుద్ధు లకు అందరికి నమస్కరిస్తా ను .ఇంతకంటే నేను చెప్పేది, చేసేది ఏమీ లేదు .పర బ్రహ్మ రూపమైన
‘’ప్రణవం ‘’ను ఉచ్చరిస్తూ ’’ తురీయా తీత దశ’’ను కోరుతున్నాను .
దీన్ని పంచుకోండి: