You are on page 1of 19

ఈ కామకాళిని పూజించే విధానాలు కాళికాపురాణంలో వివరంగా చెప్పబడినవి .

మామూలు షోడశోపచారాది పద్ధతులు అందరికి తెలిసినవే.

నిత్య పూజకు కావాలిసినవి –


1. మనస్సులో ధృడ సంకల్పం
2. పసుపు, కుంకుమ, గంధం
3. పసుపు కలిపిన అక్షతలు
4. పువ్వులు, దొరికితే మామిడి ఆకులు
5. కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు
6. పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
7. అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర
(పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షంలో కలశంలో ఉన్న
నీరు చాలు)
8. అభిషేకం కూడా చేయాలనుకుంటే, దాని కోసం పెద్ద పళ్ళెం, అభిషేకం అయ్యక
నీళ్ళు/పంచామృతాలు పోయడానికి ఒక గిన్నె
9. అగరవత్తు లు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు
వెలిగించాలి)
10. దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తు లు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా
తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
11. నైవేద్యానికి పండ్లు లేక అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థా లు, అవి లభ్యం కాని
పక్షంలో కొంచెం బెల్లం లేదా చక్కెర
12. తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
13. హారతి కర్పూరం, హారతి పళ్ళెం
14. వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
15. ఘంట
16. పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
17. చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
18. కూర్చోవడానికి దర్భాసనంగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ

ఉపచారాలు – వాటి పద్ధతులు

ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం. భావన బలంగా ఉంటే
కేవలం అక్షతలు వేసినా దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులం అని
భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు
ఉంటాయి. వాటిలో

అయిదు ఉపచారాలు పంచోపచారాలలో కూడా వస్తా యి.

పంచోపచారాలు- 1. గంధం, 2. పుష్పం, 3. ధూపం, 4. దీపం, 5. నైవేద్యం

పంచోపచార పూజ చేయాలనుకుంటే సంకల్పం లో “పంచోపచార పూజాం కరిష్యే” అని


చదువుకోవాలి. తర్వాత ధ్యాన శ్లోకాలు చదివి పైన ఇచ్చిన అయిదు ఉపచారాలు చేయాలి.
ఉపచార విధానం ఈ క్రింద ఇవ్వబడింది.

షోడశోపచారాలు 
1. ధ్యానం – దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టు కుని
మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి.
తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

2. ఆవాహనం – ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న


ప్రతిమలోకి వచ్చినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి,
తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

3. ఆసనం – ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థా నంలో


కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి, మన ఎదురుగా దాన్ని
వేసినట్టు , దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఊహించాలి. కుడి చేతిలో
అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల
వద్ద వేయాలి.

4. పాద్యం – సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం
పెట్టి గంగాది సర్వతీర్థా లలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద
పోసినట్టు , తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం
చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లా లి.

5. అర్ఘ్యం – మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిట నిండా నీళ్ళు


తీసుకుని, ఆ దేవతా స్వరూపం యొక్క చేతులలో పోసినట్టు భావన చేయాలి. తర్వాత
శ్లోకం చదువుకుని కలశం లోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి.
6. ఆచమనీయం – పూజ పూర్వాంగం లో మనం ఆచమనం చేసినట్టు , దేవతా
స్వరూపం కూడా ఆచమనం చేస్తు న్నట్టు భావన చేయాలి. కుడి చేతితో కలశం లో నీళ్ళు
ఉద్దరిణతో తీసుకుని, దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి, అరివేణంలో
మూడుసార్లు విడవాలి.

7. అభిషేకం (స్నానం) – అభిషేకం లో మూడుభాగాలు – పంచామృత అభిషేకం,


ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి ఐదు పదార్థా లు కావాలి
– ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపికానీ
విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరినీళ్ళు కానీ పళ్ళరసాలు
గానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్ళు వాడాలి. దేవతా మూర్తిని ఒక పెద్ద పళ్ళెం
లో పెట్టి, ఉన్న పదార్థా లతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం
సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం
కుదరకపోతే, కలశంలోని నీళ్ళను అందులో ఉన్న పువ్వుతోగానీ మామిడాకులతో గానీ
తీసుకుని దేవతా మూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన
దేవతస్వరూపానికి అభిషేకం చేస్తు న్నట్టు భావన చేయాలి.

స్నానం అయ్యాక కలశంలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో


విడవాలి. ఇది “స్నానానంతరం శుద్ధా చమనీయం” అన్నప్పుడు చేయాలి.

అభిషేకం జరిగిన తరువాత దేవతామూర్తిని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో బొట్టు


పెట్టి తిరిగి సింహాసనంలో పెట్టా లి.
యజ్ఞోపవీతం – దేవతా మూర్తికి యజ్ఞోపవీతం వేసినట్టు భావన చేయాలి. కుడి చేతిలో
అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా ప్రతిమ పాదాల
వద్ద వేయాలి.

8. వస్త్ర యుగ్మం – సింహాసనం లో ఉన్న దేవతకి దివ్య వస్త్రా లు సమర్పించినట్టు భావన


చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్ఠమైన పంచె, కండువ ఇచ్చినట్టు , స్త్రీ స్వరూపానికి
నాణ్యమైన చీర, రవిక ఇచ్చినట్టు భావన చేయాలి. ఇక్కడ శ్లోకం చెప్పాలి. కుదిరితే
నిజమైన వస్త్రా లు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రా లు, లేకపోతే అక్షతలు దేవతా మూర్తి
పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రా లను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన
చేయాలి. భావన మాత్రం ఉన్నతంగా ఉండాలి.

9. ఆభరణం – మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్టు భావన


చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి, లేదా కుడి చేతితో అక్షతలు తీసుకుని, శ్లోకం
చదివి, దేవత మూర్తి పాదాల వద్ద వేయాలి.

10. గంధం – దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు
భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం
చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

11. పుష్పం – మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు ,
దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు
భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తు న్నట్టు భావన చేయాలి.
అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు. నోటితో నామాలు చెప్తూ
కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.
(వివిధ దేవతల అష్టోత్తరశతనామావళులు చూడండి.)

12. ధూపం – శ్లోకం చెప్పి అగరవత్తు లు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి,
పక్కన పెట్టా లి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.

13. దీపం – వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే
పెట్టా లి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి
చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

14. నైవేద్యం – నివేదన కోసం తెచ్చిన పదార్థా లను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ
కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను
కానీ కుడి చేతితో పట్టు కుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి
“స్వాహా” అన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు
భావన చేయాలి.

తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, ముఖం (నోరు) కడిగినట్టు భావన చేసి, కలశంలో
నీళ్ళను ఉద్దరిణతో అరివేణంలోకి విడవాలి. తర్వాత ఆచమనీయం అన్నప్పుడు
మూడుసార్లు కలశం లోని నీరు అరివేణంలోకి విడవాలి.

15. తాంబూలం – నివేదన అయ్యక తమలపాకును చుట్టి దేవత స్వరూపనికి ఇచ్చినట్టు ,


అది ఆ దేవత నోటిలో పెట్టు కుని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి, కుడి చేతితో
తాంబూలం ఆకులు, వక్కలు తీసుకుని దేవతా మూర్తికి ఒక ప్రక్కగా ఉంచాలి.
తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షతలు తీసుకుని శ్లోకం చదివి, ఆ దేవతా మూర్తి
పాదాల వద్ద వేయాలి.
16. నీరాజనం – లేచి నిలబడి, హారతి వెలిగించి, ఘంట వాయిస్తూ, దేవతా స్వరూపానికి
పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా మూడుమార్లు తిప్పాలి. హారతి
తిప్పుతున్నప్పుడు ఆ దీప కాంతిలో మీరు అలంకరించిన దేవతా మూర్తిని పరిశీలించి
గుర్తు పెట్టు కోవాలి. తర్వాత హారతిపళ్ళెం పక్కన పెట్టి, దానికి ఒక ప్రక్క కలశంలోని
నీళ్ళను చిలకరించి, హారతిని కళ్ళకు అద్దు కుని, కలశంలో నీళ్ళు ఉద్ధరిణతో తీసుకుని
మూడుసార్లు అరివేణంలో విడవాలి.

మంత్రపుష్పం – అక్షతలు, పువ్వులు చేతిలోకి తీసుకుని, ఇచ్చిన శ్లోకం గానీ


మంత్రపుష్పంగానీ చదివి, దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.

ప్రదక్షిణ – మళ్ళీ అక్షతలు తీసుకుని, శ్లోకం చెప్తూ , మనకు కుడివైపుగా మూడుసార్లు


ప్రదక్షిణగా తిరగాలి. చేతిలోని అక్షతలు దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం
చేయాలి.

పునః పూజ – రాజయోగ్యమైన ఉపచారాలు చేస్తు న్నట్టు భావన చేయాలి. శ్లోకాలు చెప్పి
అక్షతలని కుడి చేతితో తీసుకుని దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

అర్పణ – అక్షతలు కుడి చేతిలోకి తీసుకుని ఉద్ధరిణతో కలశం లోని నీరు తీసుకుని,
శ్లోకం చెప్పి, అరివేణంలోకి విడవాలి.

తీర్థస్వీకరణ – శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ, లేకపోతే కలశం లోని నీటిని
గానీ ఉద్ధరిణతో తీసుకుని, మూడు సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా
తాగాలి.
“ఓం శాంతిః శాంతిః శాంతిః” అన్నప్పుడు దేవతా మూర్తి పాదల వద్ద ఉన్న అక్షతలు
తీసుకుని శిరస్సు మీద వేసుకుని, కళ్ళుమూసుకుని నమస్కారం చేసి మన చుట్టూ
ప్రశాంతత నెలకొన్నట్టు భావన చేయాలి.

ఇది క్లు ప్తంగా ఇవ్వబడిన పూజా విధానం

ఇవి కాక మరి కొన్ని వింత పద్ధతులు కనిపిస్తు న్నవి.

అలంకరించుకొన్న స్త్రీలు ముఖ్యంగా వేశ్యలు ఆడుతూ పాడుతూ వాద్యములు


మృదంగములు మొదలైనవి ఉపయోగిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పూలు, పేలాలు, నీళ్ళు,
బురద చల్లు కొంటూ ఉత్సాహంగా అమ్మవారిని గూర్చి అశ్లీల పదాలు - బూతులు -
వాడుతూ ఆమె యోనిని రతిక్రీడలను వర్ణిస్తూ ఊరేగింపులో అమ్మవారి ఉత్సవవిగ్రహంతో
పాల్గొనాలట. ఆలయంలో పండుగలకు కూడా ఇదే పద్ధతి. భారతదేశంలో వివిధ
ప్రాంతాలలో గ్రామదేవతల జాతరలలో అక్కడక్కడ ఈ ఆచారం కనిపిస్తు న్నది. ఉత్సవంలో
బూతులు మాట్లా డకపోతే అమ్మవారికి కోపం వస్తుందట ! అందువల్ల ఇది తప్పనిసరి అని
కాళికాపురాణం చెపుతున్నది .

శ్లో ॥ భగలింగాభిధానైశ్చ భగలింగ ప్రగీతకైః


భగలింగాదిశబ్జెశ్చ క్రీడయేయురలంజనాః

యోని , లింగము - వీని పర్యాయపదాలు వాడుతూ వీటిపై పాటలు పాడుతూ జనులు


క్రీడలలో పాల్గొనాలి . ఇలా చేస్తే కామాఖ్య కాళి అనుగ్రహిస్తుంది . ఇక సాధకులు -
మంత్రపురశ్చరణ చేసి - ముఖ్యంగా యోని పూజ చేయాలి .
ఆనీయ కామినీం ప్రౌఢాం రమణీయాం రతిప్రియాం
కృత్వా దిగంబరాం తస్యాః సర్వాంగాణి సమర్చయేత్
కాళీ యంత్రంతు సంభావ్య ప్రత్యేకం పూజయేత్ భగం

సురతాసక్తి కలిగిన ప్రౌఢాంగనను తెచ్చి వస్త్రములు తొలగించి నగ్ననుచేసి అంగపూజ -


అనగా సర్వావయములను అర్చించవలెను. ప్రత్యేకముగా యోనియందు
కాళీయంత్రమును చిత్రము గీసి లేదా యోనిక్రింద కాళీయంత్రమును పెట్టి
పూజించవలెను. ధూపదీపములు, మద్యనివేదనము చేసి ఆ ప్రసాదమును స్త్రీ
పురుషులిరువురు స్వీకరించవలెను .

అనంతరం రతిం కుర్యాత్ ఉచ్చైరుచ్చారయన్ మనుం


ఆనందభైరవ ఇతి స్వయం సంభావయన్ నరః
కాంతాతు సురతం కుర్యాత్ స్వయం కాళీతి భావయన్
శిశ్నంచ చూషయేత్ కాంతా పురుషోభగచుంబనం
యోని మేడ్రరసం కించిత్ దేవీయంత్రే విలేపయేత్
విభాగమితరం మద్యే మేళయిత్వా పిబేన్ ముదా
అథవా రసలిప్తా ర్కపుష్పై ర్యంత్రం సమర్చయేత్
కామకాళీ తథా తృప్తా సిద్ధశక్తిం ప్రయచ్ఛతి.

సాధక మార్గంలో పురుషుడు స్త్రీయోనిని , స్త్రీ - పురుషాంగమును పూజించి పిదప ఇద్దరు


రతి చేయవలెను. రతిలో భాగముగా పురుషుడు భగచుంబనాదులను, స్త్రీ
శిశ్నచూషణము ( ముఖరతి) చేయవలెను. ఈ సమయములో మంత్రోచ్చారణము,
అశ్లీల పదభాషణము అవసరము. రతిపూర్తియైన తర్వాత యోని నుండి రతిరసమును
తీసికొంత పూజా యంత్రమునకు పూయవలెను . కొంతభాగము మద్యముతో కలిపి
తీర్థముగా తీసుకోవలెను. మరికొంత భాగములో జిల్లేడుపూలతో అద్ది కాళీ
యంత్రమును మంత్రముతో పూజించవలెను. ఈ ప్రక్రియవల్ల కామాఖ్యకాళి సంతృప్తి
చెంది సిద్ధశక్తు లను ప్రసాదించును.

(సంప్రదాయమునకు , దక్షిణాచార మార్గమునకు విరుద్ధమైన ఈ పద్ధతి తంత్ర విద్య


నశించిపోగూడదన్న ఉద్దేశముతో మాత్రమే ఇయ్యబడినది).

శ్లో ॥ తంత్రాగారే రహసినిహితే కామినీ నగ్న దేహా


పాత్రేమద్యం మరిచ కటుకానీష్టభక్ష్యాణి మధ్యే
కుర్యాత్కాళీ రతిజపవిధిం తాంత్రికస్సిద్ధికామః
ఏతన్మార్గః పరమగహనో యోగినామప్యగమ్యః

ఈ మార్గంలో సాధుకుడు రహస్యంగా ఏర్పరచుకొన్న తంత్రాగారములో కాముకురాలైన


స్త్రీని దిగంబరను చేసి, ఇద్దరూ మద్యము తాగుతూ మధ్య మధ్య ఇష్టమైన భక్ష్యములను
తిని, కాళీ మంత్రమ జపించుచు రతి చేయవలెను. సిద్దికాముకుడైన తాంత్రికుడు చేసే
ఈ ప్రక్రియ మహాయోగులకు కూడా అగమ్యమైనది. కష్టసాధ్యమైనది. అందరికి
అందుబాటై న పథము కాదు.

చీనాదేశంలో ఈ పద్ధతులకు ఒకప్పుడు ప్రాచుర్యం పెరిగి వీటికి చీనము, మహాచీనము,


దివ్యచీనము - అని కొద్దితేడాలతో పేర్లు వచ్చినవి .
వీనిలో కొందరు సాధకులు

1) యోని పూజ - దిగంబర స్త్రీ సర్వావయములను పూజించుట చేస్తా రు.


2) మరికొందరు ఇతరులు చేస్తు న్న రతిక్రీడను దర్శిస్తూ మంత్రజపం చేస్తా రు.
3) ఇంక కొందరు నగ్న స్త్రీ ఒడిలో కూర్చుండి జపం చేస్తా రు.
4) వేరు కొందరు స్వయం స్త్రీతో రతిచేస్తూ జపం చేస్తా రు.

రామకృష్ణపరమహంస పై వానిలో మొదటి మూడింటిని నిర్వికారంగా చేసినట్లు రామకృష్ణ


మిషన్ ప్రచురణలలో ఉన్నది . ఆయన నైవేద్యం పెట్టిన మద్యాన్ని వాసన చూడగానే
పారవశ్య స్థితిపొందినాడట. అంతే కాదు నర కపాలంలో వండిన చేపలను, మనుష్య శవ
మాంసాన్ని కూడా ఏవగింపు లేకుండా తిన్నాడని వారి చరిత్రలో వ్రాయబడి ఉన్నది. భైరవీ
బ్రాహ్మణి సహకారంతో చేయబడిన ఈ సాధనల వివరాలు కొన్ని మాత్రమే గ్రంథాల
కెక్కినవని, కొన్ని రహస్యమైనవి వదిలి వేయబడినవని కొందరు అభిప్రాయపడుతున్నారు .
కామాఖ్య కాళి భర్త - ఆనందభైరవుని గుడి బ్రహ్మ పుత్రానదికి అవతల వైపు కొండమీద

ఉన్న విషయం గమనించవలెను.

ఈశ్వరుని అవతార విశేషము. ("భక్షణాత్‌, రక్షణాత్‌, వమనాత్‌, భైరవః" అని వ్యుత్పత్తి.

అనఁగా సృష్టి స్థితి సంహార కర్తయైన ఈశ్వరుఁడు అని అర్థము.)

భైరవులు
అష్ట-భైరవులు :
(అ.) 1. అసితాంగుడు, 2. సంహారభైరవుడు, 3. రురుడు, 4. కాలుడు, 5. క్రోధభైరవుడు,
6. తామ్రచూడుడు, 7. చంద్రచూడుడు, 8. మహాభైరవుడు.
(ఆ.) 1. రురుడు, 2. చండుడు, 3. కుండుడు, 4. ఉన్మత్తు డు, 5. కపాలి, 6. భీషణుడు,
7. కాలుడు, 8. ఆనందుడు.
అసితాంగభైరవుడు ( ఖడ్గః, కత్తి), రురుభైరవుడు (నల్లచాఱలదుప్పి, నల్లచారలు
తెల్లమచ్చలుఁ గల దుప్పి, కృష్ణమృగః), దండభైరవుడు (దుడ్డు కఱ్ఱ), క్రోధభైరవుడు
(కోపము), ఉన్మతభైరవుడు (ఉమ్మెత్త ), ఉమ్మెత్త భైరవుడు, భీషణబైరవుడు,
సంహారభైరవుడు, ఆకాశభైరవుడు,
"అసితాంగో రురుశ్చండః క్రోధ ఉన్మత్త ఏవ చ, కపాలీ భీషణశ్చైవ సంహార శ్చాష్టభైరవాః"
[శివతత్త్వరత్నాకరము 3-5-11]

కామాఖ్య అని పిలవటానికి కారణం ఇలా చెప్పబడింది .

శ్లో ॥ కామార్థ మాగతాయస్మాన్ మయాసార్థం మహాగిరౌ


కామాఖ్యా ప్రోచ్యతే దేవీ నీలకూటే రహోగతా

నీలకూట పర్వతము మీద కామము కొరకై అవతరించిన దేవతగనుక కామాఖ్య అని


పిలువబడుతున్నది .

కామ + ఆఖ్య ( పేరు ) - అనగా కామదేవత .

దేవి నివసించే నీలపర్వతము కూడా త్రికోణ ఆకారంలోనే ఉంటుంది . పర్వతం మధ్యలో


కొంచెం పల్లం - అందులో ఒక వృత్తా కార ప్రదేశం . దానిలో మనోభవగుహ - మన్మధ గుహ
- | అక్కడ 30 మంది శక్తు లుంటారు . గుహలో 21 అంగుళాల పొడవు ఒక వితస్తి
వెడల్పు ఉన్న శిలాయోని . దానిలో రంధ్రము క్రిందికి పోతున్న కొద్ది ఇరుకవుతుంది .
మన్మధ శిలపై ఉన్న ఈ భగదేవత చుట్టూ - కాముకనామంతో భైరవుడు ,
లలితానామంతో లక్ష్మి , మాతంగీ నామంతో సరస్వతి ఉన్నారు .

ఆమె పరివార కామయోగినులు - 1 ) భగ 2 ) భగజిహ్వ 3 ) భగాస్య 4 ) భగమాలిని 5 )


భగోదరి 6 ) భగారోహ 7 ) అనంగ కుసుమ 8 ) అనంగవేష 9 ) అనంగమదన 10 )
అనంగమదనాంకుర 11 ) అనంగవేష 12 ) అనంగమాలిని 13 ) మదనాతుర 14 )
మదనాంకుశ వీరితో పాటు కొండమీద అసంఖ్యాకదేవతాగణం వేంచేసి ఉన్నది .

బలులు : కామాఖ్యకాళికి - పశువులు , పక్షులు , జలచరములు , మనుష్యులు , అన్నీ

బలిగా సమర్పించవచ్చు . మామూలుగా కోళ్ళు , మేకలు , గొర్రెలు ఇస్తుంటారు .

ఎప్పుడన్నా దున్నపోతులను ఇవ్వటం కూడా ఉన్నది . కానీ కాళికాపురాణంలో చేపలు ,


కప్పలు , మొసళ్ళు మొదలగు జలజంతువులను , పిల్లు లు , పులులు గు జంతువులను

విశేషించి మనుష్యులను బలియివ్వటం గూర్చి చెప్పబడినది . అంతేకాక సాధకుడు తన

శరీరంలోని రక్తమును బలిగా సమర్పిస్తే వేగంగా సిద్ధి కలుగుతుందని చెప్పబడింది .

అయితే జంతు హింస పాపం కదా అంటే వైదిక యజ్ఞాలలో చేసే బలి పాపం కాదని

శాస్త్రములు చెపుతున్నవి . శ్లో ॥ యజ్ఞార్థం పశవస్సృష్టా స్స్వయమేవస్వయంభువా

అతస్త్వాం ఘాతయామ్యద్య తస్మాద్యజ్ఞే వధో వధః బ్రహ్మ పశువులను యజ్ఞముల కొరకు

సృష్టించాడు . కనుక యజ్ఞములో పశువధ - వధ కాదు . ఈ సిద్ధాంతాలు - నిర్వచనాలు

ఎలా ఉన్నా తపస్వులైన ఋషులు పశువధ చేయలేక యజ్ఞాలలో పిష్ట పశువును వాడటం

మొదలు పెట్టా రు . అంటే పిండితో పశువు బొమ్మ చేసి దానిని ఖండించి బలిగా

సమర్పించటం . ఈ సందర్భంగా దేవతలకు ఋషులకు మధ్య జరిగిన వివాదానికి

సంబంధించిన కథ ఒకటి భారతంలో ఉంది . దేవతలు పశుబలి నిజమైనదే కావాలని

పట్టు బట్టా రట ! ఋషులు అంగీకరించలేదు . మధ్యవర్తిగా తీర్పు చెప్పమని

బహుయజ్ఞకర్తయైన వసుమహారాజును రెండు పక్షాలవారు అర్థించారు . ఆయన దేవతల

వైపు అనుకూలంగా తీర్పు చెప్పాడు . ఋషులకు కోపం వచ్చి హింసను సమర్థిస్తా వా అని

పాతాళమున పడిపోదువుగాక అని శపించారు . దేవతలు నారాయణమంత్రాన్ని


ఉపదేశించగా అధఃపతితుడైన వసుమహారాజు ఉద్ధరించబడినాడు . జంతుహింస

స్వయముగా చేయటానికి ఇష్టపడని వారు పశువధశాలలో చంపబడుతున్న జంతువుల

రక్తా న్ని , మాంసాన్ని తెచ్చి నైవేద్యానికి , హోమాలకు ఉపయోగిస్తా రు . ఏదైనా అది

దేవతముందు ఇచ్చిన బలితో సమానం కాదు . పిష్టపశువు కూడా అసలు పశువుతో

సమానం కాదు . ఋషులు చేసిన యజ్ఞాలలో వారి మంత్రశక్తివల్ల వధ సమయంలో

పశువుకు స్పృహ ఉండదని - అనంతరం దానికి మంచి జన్మవస్తుందని చెపుతారు .

ఏమైనా బలులవల్ల తీవ్ర దేవతలు సంతృప్తి చెంది కొన్ని శక్తు లనిస్తా రు . వాని కలవారు ఆ

మార్గాలను అనుసరిస్తా రు . హింసచేసినందువల్ల వచ్చే పాపఫలితాన్ని అనుభవించక

తప్పదు . దేని ఎకౌంటు దానిదే . తన శరీరం నుండి రక్తా న్ని తీసి బలి యివ్వటం వల్ల

పాపమా , కాదా ? అంటే కొందరి దృష్టిలో పాపమే . గాయత్రీ మంత్రాది జపముల చేత

పవిత్రమైన శరీరాన్ని హింసించటం దోషం . చక్రాంకితాలు , శూలములు - వీటిని కూడా

వైదికులు అంగీకరించరు . అయితే జంతువుల ప్రాణం తీయటం కంటే ఇది నయం .

చండీ సప్తశతి నాల్గవకధలో సురధుడనే రాజు , సమాధి అనే వైశ్యుడు మూడు

సంవత్సరాలు రక్త తర్పణం చేసి చండీ సాక్షాత్కారం పొంది అభీష్ట సిద్ధి సాధించినట్లు న్నది

. కనుక ఇది తీవ్రసాధకులకు నిషిద్ధం కాదని కొందరి అభిప్రాయం . = ఇక సౌత్రామణి


యజ్ఞంలో యజమాని యజ్ఞశాలలో మంచె మీద భార్యతో రమించగా క్రిందపడిన వీర్యాన్ని

పాత్రలో ఉంచి దానితో హోమంలో ఆహుతులు వేస్తా రు . దానిలోను హింసలేదు .

మహాకాళ రచిత కర్పూరాది స్తోత్రంలో వీర్యంలో అద్దిన జిల్లేడు పూలతో 1000 సార్లు

మంత్రం చెపుతూ కాళీదేవిని పూజిస్తే మహారాజవుతాడని చెప్పబడింది . ఈ విధంగా

వీర్యపూజ , వీర్య హోమం తంత్ర గ్రంధాలలో అత్యధిక ప్రయోజనదాయకంగా

చెప్పబడినవి . కాళీసాధనలో ప్రధానమైన మరొకటి శ్మశానసాధన . శవములను దహనం

చేసే స్థలమే శ్మశానం . పూడ్చిపెట్టటం కూడా ఉండవచ్చు . చితాభస్మాన్ని ధరించి

పంచకపాలాసనం మీద కూర్చుండి జపధ్యానములు చేస్తే మంత్రసిద్ధి త్వరగా

కలుగుతుంది . శవం మీద కూర్చుండి లేదా సమాధి మీద కూర్చుండి చేసే సాధనవల్ల

చాలా ప్రయోజనం ఉంటుంది . పూడి శవానికి మూడు రోజుల వరకు నీలకాంతివలయం

( ఆరా ) ఉంటుంది . మీద కూర్చున్నందువల్ల సాధకునిలోనికి అది ఆకర్షించబడుతుంది

. ఆ తరువాత ఆ శవం తాలూకు జీవుడు వశం కావచ్చు . లేదా మంత్రదేవతకు

మాధ్యమంగా ( మీడియం ) మారవచ్చు . పంచకపాలాసనం రెండు విధాలు . 4

జంతువుల కపాలాలు , 1- నరకపాలం , లేదా అయిదూ నరకపాలాలు . శ్మశాన సాధనల

వల్లనే త్రైలింగస్వామి , కీనారాం అఘోరీ , రామప్రసాద్ , రామకృష్ణపరమహంస


మొదలైనవారు కాళీమంత్రసిద్ధిని పొందగలిగారు . శ్మశానంలో సాధన చేయటానికి

అవకాశం లేనివారు తమ సాధన గదిలో పంచకపాలాసనం వేసుకొని చితాభస్మమును

ధరించి ఉపాసన చేయవచ్చు . హోమకుండంలో కూడా అడుగున కపాలములను పెట్టి

పైనమట్టి పోసి హోమం చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది . ఆహుతులకు రక్తా న్నము ,

మాంసము , మద్యము మొదలగునవి వినియోగించాలి . ఎంత చేసినా మంత్రసిద్ధి

కానప్పుడు మేరు తంత్రంలో ఒక ప్రక్రియ చెప్పబడింది . నరసంచారం లేని చోట రావి

చెట్టు క్రింద కపాలంలో ఆవ లేక జీడి లేక తీవ్ర తైల మేదైనా పోసి , నెత్తు రులో తడిపి

ఆరబెట్టిన వత్తి వెలిగించి అర్థరాత్రి జపం చేస్తే దేవతా సాక్షాత్కారం తప్పక కలుగుతుందట

! అలానే శవంలో కాళీయంత్రాన్ని పెట్టి కొన్నాళ్ళుంచి తెచ్చుకొని పూజాజపములు చేసినా

వేగంగా సిద్ధి లభిస్తుందట ! ఇటువంటి పద్ధతులు తాంత్రికమార్గంలో చాలా కనిపిస్తవి .

ప్రాచీనమైన రావిచెట్టు , మర్రిచెట్టు మొదలైన వాని క్రింద జపం ప్రశస్తం . ఐదు చెట్లతో

పంచవటి ఏర్పాటు చేసుకొని రామకృష్ణ పరమహంస మొదలైనవారు సాధన చేశారు .

కాళీసాధకుడు నల్లని వస్త్రములు ధరించి గాని , దిగంబరుడై కాని అర్ధరాత్రు లు భయపడక

జ చేయాలి . శ్మశానస్థశ్శవస్థోవా కపాలాసన సంస్థితః చితాభస్మధరో నగ్నః జపేద్రాత్రాతు

నిర్భయః శ్మశానములో గాని , శవము మీద కూర్చుండిగాని , పంచకపాలాసనం మీద


ఉపస్థితుడై గాని చితాభస్మాన్ని ధరించి దిగంబరుడై అర్ధరాత్రు లు భయపడక జపం

చేయాలి . కాళీ మంత్రసిద్ధికి ఇటువంటి విధానాలెన్నో తంత్రగ్రంధాలలో చెప్పబడినవి .

కాళీసాధనలో పంచమకారాలకు ప్రాముఖ్యం ఉన్నది . మద్యం , మత్స్యం , మాంసం ,

మైధునం , ముద్ర ముద్ర అంటే మాంసముతో చేసిన భక్ష్యము . మాంసాహారం ఇష్టం లేని

వారు మద్యం వరకు మాత్రమే ఉపయోగిస్తా రు . ప్రసిద్ధకాళీ భక్తు డు రామప్రసాద్

మద్యపానం చేసి పంచకపాలాసనం మీద కూర్చుండి సాధన చేసి సిద్ధి సాధించాడని

ఆయన చరిత్రను బట్టి తెలుస్తు న్నది . మద్యం వల్ల ఏకాగ్రత రావటమే కాక రాజస తామస

దేవతలకు ఇష్టం గనుక శీఘ్రసిద్ధి కలుగుతుంది . మహిషాసుర వధాఘట్టంలో మహాదేవి

మాటి మాటికి మద్యపానం చేస్తూ అట్టహాసం చేస్తూ యుద్ధం చేసిన సంగతి

గమనించదగినది . కొందరు మద్యం బదులు ' సంవిత్ ' అంటే భంగువాడతారు . దీనివల్ల

దర్శనాలు త్వరగా కలుగుతవని వారి అభిప్రాయం . " సంవిదాసవ యోర్మధ్యే

సంవిదేవగరీయసీ ” భంగు - మద్యము ఈరెండింటిలో సాధనకు భంగు శ్రేష్ఠమైనదని

తంత్ర గ్రంధాలు చెపుతున్నవి . కొందరు గంజాయి పీల్చి ఆ మత్తు లో ధ్యానం చేస్తా రు .

కాశీలో నివసించిన తాంత్రికుడు కీనారాం అఘోరీ భంగు బాగా ఉపయోగించేవాడు .

ఇలా ఒక్కొక్కర ఒక్కొక్కమార్గంలో సాధన చేసి ఉత్తీర్ణులైనారు . అయితే ఇవి చాలా


సందర్భాలలో వ్యసనాలుగా మిగిలిపోయే ప్రమాద ఉన్నది ర్గాలలో ప్రవేశించిన వారు

మనస్సును అదుపులో పెట్టు కోలేకపోతే భ్రష్టు లయ్యే అవకాశాలెక్కువ . కనుక ఎన్నో

జాగ్రత్తలు తీసుకొని ఈసాధనలు చేయాలి . లేదా కాస్త ఆలస్యమైనా దక్షిణాచార మార్గం

శ్రేష్ఠమైనది - దివ్య క్షేత్రాలలో , శక్తిపీఠాలలో తపస్సు చేస్తే తప్పక ఫలిస్తుంది .

You might also like