You are on page 1of 11

రేచుక్క పగటి చుక్క-1

మన జానపద కధలలో నాకు బాగా ఇష్ట మైన కధ.

పూర్వం విజయపురి అనబడే ఒక పెద్ద దేశం ఉండేది. ఆ దేశంలో రేచుక్క అనే పేరుగల ఒక ఘరాన
గజదొ ంగ ఉండేవాడు. రేచుక్క పైకి అందరికి తను ఒక మామూలు వ్యాపారిని అంటూ చలామణి
అయ్యేవాడు కాని అతను ఎన్నొ ఘరానా దొ ంగతనాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు.

కొన్నాళ్ళకి అతని భార్య నిశి గర్భవతి అయ్యింది. రేచుక్క “మనకి పిల్లలు పుట్ట బో తున్నారు. జీవితాంతం
వాళ్ళు సుఖంగా వుండడానికి, రాజుగారి ఖజానా కొల్ల గొట్టా లి. కాబట్టి నేను రాజధానికి వెళ్తా ను” అంటాడు.

"మనకి ఇప్పటికే ఎంతో డబ్బు ఉంది. ఇంకా ఎందుకు? వద్దు లేండి” అన్నది నిశి. కాని భార్యకి నచ్చచెప్పి
రేచుక్క రాజధానికి వెళ్తా డు.

ఆ రాజధానిలో ఒక అందమైన రాజనర్త కి నివసించేది. ఆ నర్త కీ అందాన్ని చూసి ముగ్ధు డైన రేచుక్క తను
వచ్చిన పని మరచి నర్త కి వెంట పడ్డా డు. ఆ నర్త కి ధనం తీసుకుని రేచుక్కకి సకలోపచారాలూ చేసింది.
క్రమంగా రేచుక్క తన గతం పూర్తిగా మరిచాడు.

*** *** ***

నిశి ఒక మగశిశువుకి జన్మ నిచ్చింది. ఆ బిడ్డ కి పగటి చుక్క అని పేరు పెట్టింది. పగటి చుక్క పెరిగి
పెద్దవాడు అయ్యాడు. 20 ఏళ్ళ యువకుడు అయ్యాడు. అతని చిన్నప్పటి నుంచి తల్లి ఏదో బాధపడడం
గమనిస్తూ నే ఉన్నాడు. ఒక రోజు తల్లి ఎందుకు అంతగా మదన పడుతుందో అడిగాడు. ముందు
చెప్పడానికి నిరాకరించినా, చివరికి నిశి రేచుక్క ఖజానా కొల్ల గొట్ట డానికి వెళ్ళాడని, కాని తిరిగి రాలేదని
చెప్పింది.

అదంతా వినగానే పగటి చుక్క “అమ్మా! నాన్న ఎక్కడున్నా సరే తీసుకొని వస్తా ను. నన్ను రాజధానికి
వెళ్ళదానికి అనుమతించు అమ్మా” అన్నాడు.

"లేదు నాయనా! వద్దు ! మీ నాన్న బ్రతికి ఉన్నారో లేదో తెలీదు. ఇప్పటికే భర్త కి దూరమైన నేను, నిన్ను
కూడా వదులుకోలేను. వెళ్ళద్దు !” అంటు ప్రా ధేయపడింది నిశి.

కాని చివరికి పగటి చుక్క నానా తంటాలూ పడి తల్లిని ఒప్పించి, రాజధానికి బయల్దే రాడు.

*** *** ***


రాజధానిలో ఒక సత్రంలోకి దిగి ఊర్లో విశేషాలు తెలుసుకుంటూ తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం
చేయసాగాడు పగటి చుక్క. తల్లి చెప్పిన గుర్తు లను బట్టీ రేచుక్కను గుర్తు పట్టా డు. కానీ రేచుక్క ఎక్కడ
నివసిస్తు న్నాడు? ఎం చేస్తు న్నాడు? లాంటి వివరాల కోసం రేచుక్కని అనుసరించసాగాడు.

ఒకసారి అనుకోకుండా పగటి చుక్కని చూసిన రేచుక్కకి ఏదో ఇబ్బందిగా అనిపించింది కానీ ఎందుకో అర్ధం
కాలేదు. ఏదో లే అనుకోని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు రేచుక్క.

ఒక రోజు రేచుక్క, రాజనర్త కీ అంగళ్ళ వీధిలో నడుచుకూంటూ వెళ్తు న్నారు. ఇంతలో ఒక బట్ట ల
దుకాణంలో చాలా ఖరీదైన చీరను చూసింది నర్త కీ. ఆ చీర చాలా అందంగా రత్నాలు పో దగబడి ఎంతో
అందంగా ఉంది. నర్త కీ ఆ చీర కావాలంది.

"నీ కెందుకు! నిశ్చింతగా ఇంటికి పద. రేపు పో ద్దు న్నే ఆ చీర నీ ఇంట్లో ఉంటుంది” అని చెప్పాడు రేచుక్క.
ఇద్ద రూ ఇంటికి వెళ్ళిపో యారు.

ఆ మాటలు వెన్న పగటి చుక్కకి అర్ధ ం అయ్యింది, ‘అయితే నా తండ్రి ఆ చీర దొ గిలిస్తా డన్నమాట! అతను
నిజంగా నా తండ్రేనా కాదా అన్న విషయం తెలుసు కోవడానికి మంచి అవకాసం దొ రికింది’ అనుకున్నాడు
పగటి చుక్క.

ఆ రాత్రి చీరను దొ ంగిలించి తన ఇంట్లో దాచుకున్నాడు రేచుక్క. రేచుక్క నిద్రపో యాక చప్పుడు
చేయకుండా ఆ ఇంట్లో ప్రవేశించాడు పగటి చుక్క. ఆ చీరను దొ ంగిలించి తన గదిలో ఒక గుంత తవ్వి,
చీరను ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెని గుంతలో పెట్టి దాన్ని మట్టితో కప్పేసి పడుకున్నాడు.

మర్నాడు రేచుక్క తను దొ ంగిలించిన చీర అలమారాలో లేకపో వడం గమనించాడు. ‘అంటే ఎవరో
దొ ంగిలించి ఉండాలి’ అనుకున్నాడు రేచుక్క. ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు
గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే అతనికి తనని అనుసరించిన 20 ఏళ్ళ యువకుడు గుర్తు కువచ్చాడు. ఆ
అబ్బాయిని చూడగానే ఎందుకో తనకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు అని ఆలోచించాడు రేచుక్క.
అప్పుడు అతనికి నిశి గుర్తు కు వచ్చింది ‘ఒక వేళ తనకి పుట్టినది అబ్బాయైతే కచ్చితంగా ఆ అబ్బాయికి
20 ఏళ్ళు ఉంటాయి. ఒక వేళ నన్ను అనుసరించిన అబ్బాయి నా కొడుకేనా?’ ఇలా రకరకాల ఆలోచనలు
రేచుక్క బుర్రలో మెదిలినై, దాంతో ఒక నిర్నయానికి వచ్చాడు. ‘ఒక వేళ ఆ అబ్బాయి నా కొడుకే గనక
అయితే కచ్చితంగా నాకు ఉన్న తెలివితేటలు ఆ అబ్బాయికి కూడా ఉండుండాలి. కనుక అతనిని
పరిక్షిస్తా ను’ అనుకున్నాడు రేచుక్క.
పగటి చుక్క గురించి ఊర్లొ కనుక్కున్నాడు. పగటి చుక్క పేరు, ఎక్కడ ఉంటున్నాడు తెలుసుకోగలిగిన
రేచుక్క ఆ రాత్రికి పగటి చుక్క గదిలోకి చప్పుడు చేయకుండా ప్రవేశించాడు.

పగటి చుక్క ఇది ముందలే ఊహించాడు. అందువల్ల నిజంగా నిద్రపో క పో యినా నిద్ర పో తున్నట్టు
నటిస్తా డు. అతని నటనని గుర్తించినా గుర్తించనట్టు గా రేచుక్క గది అంతా కలియచూసాడు. గదిలో ఒక
మూలన మట్టి ఆ మద్యనే తవ్వి మళ్ళి కప్పిన గుర్తు గా, గదిలో మిగిలిన నేల అలికిన భాగానికీ అక్కడికీ
తేడా తెలుస్తు ంది.(పాత కాలంలో మట్టి నేలలు కాబట్టి నేల అలకడమే కాని బండలు పరచడమంటే చాలా
ఖర్చు కాబట్టి రాజులు మాత్రమే అలా బండలు పరిపించుకునేవారు.) ఆ తేడాను గమనించిన రేచుక్క
అక్కడ త్రవ్వి చీరను తీసుకెళ్ళిపో తాడు.

తండ్రి వెళ్ళిన కాసేపటికి పగతి చుక్క కూడా బయలుదేరుతాడు. ఇది ముందే ఊహించిన రేచుక్క తను
పడుకోబో యే మంచానికి పైన గాలిలో ఒక ఉట్టిని వేలాడతీసి దాని మీద చీరను పెట్టి, దాని మీద ఒక
ముంతను పెట్టి, దాని నిండుగా నీళ్ళు పో స్తా డు. గాలికి ఊగినా సరే మంచం మీద నీళ్ళు పడేటంత నిండుగా
నీళ్ళు పో సి మంచం మీద పడుకొని నిద్ర నటించసాగాడు.

కొంత సేపటి తరవాత అక్కడికి వచ్చిన పగటి చుక్క ఆ అమరికని చూసిన వెంటనే వెళ్ళి ఒక కచ్చిక
(స్పాంజి లాంటిది, నీళ్ళను పీల్చుకుంటుంది.) తెచ్చి ముంతలోని నీళ్ళను పీల్చుకునేట్టు పట్టు కొని,
ముంతలో నీరు తగ్గ గానే ముంతని తీసి పక్కన పెట్టి చీరను తీసుకొని వెళ్ళబో తాడు. కానీ రేచుక్క అతనిని
ఆపి “ఎవరు నువ్వు? ఎందుకు నా దారికి అడ్డు వస్తు న్నావు?" అని అడుగుతాడు.

దానికి జవాబుగా పగటి చుక్క “నా తల్లి పేరు నిశి. నా పేరు పగటి చుక్క. నా తండ్రి పేరు రేచుక్క. అతను
ఎక్కడ ఉన్నాడొ తెలీదు ఆయనని వెతకడానికి ఈ ఊరు వచ్చాను” అని చెప్తా డు పగటి చుక్క.

వెంటనే తను ఎవరో చెప్పి, వెంటనే కొడుకుతో పాటూ నిశి దగ్గ రికి వచ్చి, ఆమెని క్షమాపణాలు
వేడుకుంటాడు. కొన్నాళ్ళు బాగానే గడిచినై. కాని మళ్ళీ రేచుక్కకి రాజుగారి ఖజానా కొల్ల గొట్టా లన్న కోరిక
కలిగింది. కొడుకుని బలవంత పెట్టి చివరికి ఇద్ద రూ ఖజానా కొల్ల గొట్ట డానికి బయలుదేరారు.

కానీ ఖజానా కొల్ల గొట్టి తిరిగి కోట బైటికి వస్తు న్నప్పుడు భటులు పట్టు కుంటారు. ఐతే బైటీకి వచ్చేందుకు
వీళ్ళిద్ద రూ ఒక కన్నం చేసారు. పగటి చుక్క ఆ కన్నం ద్వారా బయటికి ముందే వచ్చాడు. రేచుక్క వస్తూ
ఉండగా భటులు రేచుక్క కాళ్ళను పట్టు కున్నారు.

"కొడకా చిక్కాన్రా !” అంటాడు రేచుక్క. వెంటనే పగటి చుక్క తండ్రి తలను నరికేసి డబ్బుతో సహా అక్కడి
నుండి పారిపో తాడు.
తండ్రి తలను ఎందుకు నరికాడంటే ఒకవేళ రేచుక్కను ఊరూరూ తిప్పించారంటే తన ఊరిలో జనాలు
రేచుక్కను గుర్తు పట్టే ప్రమాదం ఉంది. అప్పుడు తనకీ తన తల్లికీ కచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది.
అందుకని ముందే తల నరికస
ే ాడు. ఈ పధకం వేసుకొనే ఇద్ద రూ బయలుదేరారు.

మర్నాడు రాజు దగ్గ ర జరిగన


ి దంతా చెప్పారు భటులు. రేచుక్క శవాన్ని చూసిన రాజుకు రేచుక్క కొడుకైన
పగటి చుక్కను పట్టు కోడానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే.........
పగటి చుక్కను పట్టు కోడానికి ఒక మార్గ ం దొ రక
ి ింది కదా అన్న ఆనందంతో రాజు ఇలా చెప్పాడు “సరే అయితే! ఒక

పని చేయండి. ఈ తలలేని శవాన్ని, మన దేశం మొత్త ం ఊరేగించండి. అలా దేశం మొత్త ం తిప్పినప్పుడు ఎవరైనా

ఈ మొండెంని చూసి ఏడ్చారంటే వాళ్ళని నా దగ్గ రికి తీసుకురండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ దొ ంగ

కుటుంబం వారే అవుతారు.”

రాజు రేచుక్క శవాన్ని ఎం చేస్తా డో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పగటి చుక్క కూడా మామూలు జనంతో పాటు రాజ

దర్బారుకు వచ్చాడు. ఈ తీర్పువిని, ఇంటికి వెళ్ళగానే, రాజ దర్బారులో జరిగన


ి ది మొత్త ం తల్లికి చెప్పి “అమ్మా!

నాన్నగారి శవం మన ఇంటిదగ్గ రకి వచ్చినప్పుడు నువ్వు ఎట్టి పరిస్తు తుల్లో నూ ఏడవకూడదు” అని చెప్పాడు.

"అది ఎలారా నాయనా? ఆయన నా భర్త . ఆయనతో ఇన్నాళ్ళు కాపురం చేసినదాన్ని. ఆయన శవాన్ని చూసి

కూడా ఏడవకుండా ఉండడం నాకు సాధ్యం కాదురా” అన్నది నిశి.

ఆ మాటతో బాగా ఆలోచించి, పగటి చుక్క ఒక పధకం పన్నాడు. ఆ ప్రకారం చేయమని తల్లికి చెప్పాడు. ఆ వెంటనే

తల్లి కొడుకులు ఇద్ద రూ ఆ వీధిలోంచి వేరే వీధికి వెళ్ళారు. ఎక్కడ ఎవరూ వీళ్ళను గుర్తు పట్ట రో ఆ వీధికి. ఊరేగింపు

ఆ వీధిలోకి వస్తు ండగా, పగటి చుక్క ఆ వీధిలోని ఒక మునగ చెట్టు ఎక్కి క్రిందికి దూకాడు. భర్త శవాన్ని చూడగానే

నిశి ఒకటే ఏడ్చింది. భటులు వచ్చి “అమ్మా! మీరు ఏడవటనికి కారణం ఏమిటి?” అని అడిగారు.

"బాబూ! ఇదిగో వీడు నా కొడుకు పగటి చుక్క. ఈ చెట్టు పై నుండి వీడు క్రింద పడ్డా డు. అందుకని నేను

ఏడుస్తు న్నాను” అని చెప్పింది నిశి.

ఆ ఊరేగింపు ముందుకు సాగిపో యింది. అలా శ్మశానాన్ని చేరుకుంది. అక్కడ పఠిష్టమైన కాపలా పెట్టి, సేనాపతి

రాజుగారి దగ్గ రకు వెళ్ళాడు.

"ఎవ్వరూ ఏడవలేదా?" అని అడిగాడు రాజు.


"లేదు ప్రభు! అందరూ మామూలుగానే చూసారు. ఇతని శవం చూసిన కారణంగా ఎవరూ ఏడవలేదు” అని

చెప్పాడు సేనాపతి.

"మీరు సరిగ్గా గమనించారా! అది అసాధ్యం!” అన్నాడు రాజు.

"లేదు మహారాజా! ఎవ్వరూ ఏడవలేదు. ఒక 40 ఏళ్ళ యువతి మాత్రం ఆమె కొడుకు మునగ చెట్టు మీద నుండి

క్రింద పడ్డా డని ఏడ్చింది తప్ప, ఈ శవాన్ని చూసి ఎవరూ ఏడవలేదు" అన్నాడు సేనాపతి.

అసలు ఏమి జరిగిందో విన్న రాజు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “బుద్దిలేని అడ్డ గాడిదల్లా రా! ఆ 40 ఏళ్ళ యువతి,

దొ ంగ భార్య అయ్యుంటుంది. పగటి చుక్క, దొ ంగ కొడుకు అయ్యింటాడు. ఎందుకంటే ఈ దొ ంగకి 40 నుంచి 45 ఏళ్ళ

వయసు ఉండచ్చు. అలా అన్నప్పుడు వాడికి 40 ఏళ్ళ భార్య, 20 ఏళ్ళ కొడుకు ఉండే అవకాశం ఉంది కదా. ఆ

ఇద్ద రూ కలిసి ఇంత నాటకం ఆడితే నమ్మేసి వస్తా రా, బుద్ది లేదూ! ముందు ఆ వీధికి వెళ్ళి పగటి చుక్క గురించి

కనుక్కోండి”అని చెప్పాడు రాజు. కాని రెండు నిముషాలకే భటులు వైఫల్యంతో తిరిగి వచ్చారు.

రాజు బాగా ఆలోచించి “సరే ఒక పని చేయండి! ఈ రోజు రాత్రికే ఈ శవాన్ని శ్మశానంలో చితి పేర్చి కాల్చండి. తనతో

పాటూ తీసుకెళ్ళిన తలనుకూడా చితిలో భస్మం చేయడానికి పగటి చుక్క వస్తా డు. అది మన సాంప్రదాయం. దాన్ని

ఎవరూ మీరరు కాబట్టి ఖచ్చితంగా వస్తా డు, అతన్ని మీరు పట్టు కోవచ్చు” అన్నాడు రాజు.

ఇదంతా దర్బారులో విన్న పగటి చుక్క ఒక చక్కని పధకం పన్నాడు. ఆ రాత్రికి పగటి చుక్క మొహం తప్పించి

శరీరం మొత్త ం కనిపించకుండా ఉండే నల్ల ని దుస్తు లు వేసుకున్నాడు. మొహానికి నల్ల ని రంగు పూసుకున్నాడు.

కాగడాలు వెలిగించి ఒక చేతిలో, ఒక రెండు కాగడాలు. ఒక చేతిలో, మరో రెండు కాగడాలు. వీపు దగ్గ ర, మరో రెండు

కాగడాలు కట్టు కున్నాడు. ఒక నల్ల ని గుర్రం ఎక్కి, విచిత్రమైన అరుపులు అరుస్తూ శ్మశానంలోకి వచ్చాడు.

పగటి చుక్క అలా రావడం చూడగానే భటులు, అతన్ని కొరివి దయ్యం అనుకొని అక్కడి నుండి పారిపో యారు.

పగటి చుక్క మూడుసార్లు తండ్రి చితి చుట్టూ గుర్రం మీద కుర్చునే ప్రదక్షణలు చేసి, రేచుక్క తల చితిలో పడేసి

అక్కడి నుండి ఆఘమేఘాల మీద వెళ్లి పో యాడు.

మర్నాడు జరిగన
ి దంతా విన్న రాజుకు ఒళ్ళు మండిపో యింది. “తెలివి తక్కువ దద్ద మ్మల్లా రా! ఆ వచ్చినది కొరివి

దయ్యమూ కాదూ, గాడిద గుడ్డూ కాదూ. వచ్చినది పగటి చుక్క! అలా కాకపో తే వచ్చినవాడు, దొ ంగ చితి చుట్టూ

ఎందుకు 3 సార్లు ప్రదక్షణలు చేస్తా డు? మీరు అనవసరంగా భయపడి అతని పని సులభం చేసారు. కాని వాడు

ఎక్కడికి తప్పించుకుంటాడు! ఈ సారి, దొ ంగ బూడిద తీసుకెళ్ళటానికి తప్పకుండా పగటి చుక్క వస్తా డు. సేనాపతీ!
జాగ్రత్తగా కాపలా కాయండి. రాత్రికి గుడారాలు వేసుకునైనా సరే, అక్కడే ఉండు” అన్చెప్పాడు రాజు.

పగటి చుక్క ఇందుకు కూడా ఒక చక్కని పధకం రచించాడు. పధకం ప్రకారం, ఆ రోజు రాత్రి పగటి చుక్క, సేనాపతి

భార్యలాగా వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. భటులు సేనాపతి భార్యే వచ్చింది అనుకుని, పగటి చుక్కని

గుడారం లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళగానే పగటి చుక్క నిద్రపో తున్న సేనాపతి నోట్లో ఒక పెద్ద గుడ్డ ముక్కని

దూర్చేసి, అతనికి ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే, అతని కాళ్ళు చేతులు కట్టేసాడు.

ఆ గుడారంలో ఉన్న తండ్రి బూడిద, అస్థికలు తీసుకుని, భటులకు ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపో యాడు.

తెల్లవారుతుండగా సేనాపతిని గుడారం బైట నుంచి ఎంత పిలిచినా పలకక పో యేటప్పటికి భటులు లోపలికి వెళ్ళి,

సేనాపతి పరిస్థితి చూసిన భటులు, అతని కట్లు విప్పి రాజు దగ్గ రికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు.

రాజుకు అరికాలు మంట నెత్తి కెక్కింది. “సన్నాసుల్లా రా! చవటల్లా ర! వచ్చిన వాడు కాళ్ళూ, చేతులూ కట్టేస్తు ంటే

ఏంచేసావు. కట్టు బాబూ, కట్టు అంటూ కట్టించుకున్నావా” అని ఛడామడా తిట్టా డు రాజు. మళ్ళీ బుర్రకి పదును

పెట్టిన రాజుకు ఇంకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది........

బుర్రకు పదును పెట్టిన రాజుకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. “సరే! ఒక పని చేయండి. దేశంలోని చెరువులు,

నదులు అన్నిటి దగ్గ ర భటులను కాపలా ఉంచండి. నదులో తండ్రి బూడిద కలిపి, పిండం కాకులకు వేయడానికి

పగటి చుక్క రాక తప్పదు. అప్పుడు పట్టు కోండి” అని చెప్పాడు రాజు.

చకచకా పగటి చుక్క తనేం చేయాలో లెక్కలు కట్టా డు. దాని ప్రకారం, ఈ సారి పగటి చుక్క పిచ్చివాడిలాగా,

అడ్డ దిడ్డంగా బట్ట లు వేసుకొని, జుట్టు అంతా చింపిరిగా దువ్వుకొని, శ్మశానం ప్రక్కనున్న నది దగ్గ రక
ి ి వెళ్ళాడు. ఒక

సారి గట్టిగా అరిచి, ఒక సారి ఏడ్చి, ఒక్కసారిగా నవ్వి, అచ్చం పిచ్చివాడిలాగా ప్రవర్తించసాగాడు.

మొదట భటులు చాలా అప్రమత్త ం అయ్యారు, కానీ రెండు నిముషాలకే అతను పిచ్చివాడులే అనుకుని అంతగా

పట్టించుకోలేదు. పగటి చుక్క తండ్రి బూడిద మొత్త ం తీసి ఒంటికి పూసుకుని, తలమీద పొ సుకుని, నీళ్ళలోకి దిగి

ఏవో పిచ్చిపాటలు పాడుతూ తెగ ఈతలు కొట్టా డు. అలా పిచ్చి వాడిలా నటిస్తూ నే కట్టెల పొ య్యి మీద అన్నం

వండాడు. వండిన అన్నాన్ని అన్ని వైపులకి విసిరేసి, పక్షుల కూతలు, జంతువుల అరుపులను అనుకరిస్తూ

అరిచాడు. దాంతో కాకులు వచ్చి అతను చల్లిన అన్నం ముద్ద లను తిన్నాయి. తరవాత పగటి చుక్క అన్నం వండిన

కుండను పగలకొట్టి మళ్ళీ నీళ్ళల్లో స్నానం చేసి, పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ నే అక్కడి నుండి వెళ్ళిపో యాడు.

ఆ రోజంతా చూసిన తరవాత భటులు, జరిగిన దంతా రాజుకు చెప్పారు. జరిగినది విన్న రాజుకు చిర్రెత్తు కొచ్చింది.
“ఛ! ఆపాటి కనిపెట్టలేక పో యారా, వాడు పిచ్చివాడు కాదు, పగటి చుక్క అని? కానీ ఆ పగటి చుక్కని ఎలాగైనా

పట్టు కోవాలి. సరే, దేశం అంతా దండో రా వేయించండి “ఎవరైనా శ్రా ధ్ద ం పెట్టడానికి బ్రా హ్మణులని రమ్మని అడిగితే

వెంటనే వాళ్ళగురించి మాకు తెలియచేయండి” అని. ఖచ్చితంగా శ్రా ధ్ద ం పెట్టి, భోజనాలు చేసి వెళ్ళటానికి ఎవరైనా

బ్రా హ్మణులను అతను ఆహ్వానిస్తా డు” అన్నాడు రాజు.

కానీ వీళ్ళ ఎత్తు లన్నీ చిత్తు చేస్తూ , పై ఎత్తు వేసాడు పగటి చుక్క. ఊరి బైట సత్రం దగ్గ ర మాటువేసి ఉండసాగాడు.

ఒకరోజు కొంతమంది బ్రా హ్మణులు పరదేశం నుండి ఆ దేశానికి వచ్చారు. వెంటనే పగటి చుక్క వాళ్ళని తన తండ్రికి

శ్రా ధ్ద ం పెట్టటానికి రమ్మని పిలిచాడు.

వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి. తన ఇంటికి తీసుకెళ్ళి తండ్రికి శ్రా ధ్ద ం పెట్టించాడు పగటి చుక్క. బ్రా హ్మణుల భోజనాలు

అయిపో యాక వాళ్ళకి చాలా ధనం ఇచ్చి, వాళ్ళ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టి సత్రం దగ్గ ర దింపి వెళ్ళిపో యాడు పగటి

చుక్క.

చాలా ధనం వచ్చేటాప్పటికి వాళ్ళు చాలా ఆనంద పడుతూ ఊరిలోకి వచ్చారు. వాళ్ళ ఆనందం చూసిన భటులకు

ఇక్కడేదో తేడాగా ఉంది, అని వాళ్ళ మనసుకు తోచింది. వెంటనే వాళ్ళు బ్రా హ్మణులను “బ్రా హ్మణోత్త మా! మీ

సంతొషానికి కారణం ఏంటీ?” అని అడిగారు.

బ్రా హ్మణులు జరిగింది చెప్పారు. వాళ్ళు రాజు దగ్గ రకు బ్రా హ్మణులను తీసుకెళ్ళారు. రాజు జరిగింది విని,

"సరే. విప్రో త్త ములారా! ఆ దొ ంగ రూపు రేఖలు చెప్పగలరా?” అని అడిగాడు రాజు.

వెంటనే వాళ్ళు “క్షమించాలి మహారాజా! అతను తన మొహాన్ని ఒక వస్త ం్ర తో కప్పేసుకున్నాడు. కాబట్టి మేము

చూడలేదు” అని చెప్పారు.

రాజు తల పంకించి, "ఈ దొ ంగ చాలా తెలివైన వాడిలాగా ఉన్నాడు. ఇతడిని ఎలాగైనా పట్టు కుని తీరాలి. ఇది

మనకొక సవాల్. కొత్వాల్! నీకీ పని అప్పగిస్తు న్నాను. వాడిని ఎలాగైనా పట్టు కోవాలి, అర్ధమైందా” అని రాజు

చెప్పాడు. కొత్వాల్ కూడా అది తనకొక సవాల్ అనుకున్నాడు.

పగటి చుక్క కూడా అదే అనుకున్నాడు. ‘నన్ను పట్టు కుంటారా, చూస్తా ను. మీ పరువు నిండునా పో యేట్టు చేస్తా ’

అనుకున్నాడు.

ఆ రోజు రాత్రి...........
ఆ రోజు రాత్రి కొత్వాల్, మరికొంత మంది సైనికులూ, ‘పగటి చుక్క కానీ, ఏదైనా దొ ంగతనం చేయటానికి వస్తే

పట్టు కుందాం’ అని గస్తీ తెరుగుతున్నారు. అర్ధరాత్రి దాటాక పగటి చుక్క మారువేషం వేసుకుని, కొత్వాల్ ఉన్న

చోటక
ి ి వచ్చాడు.

కొత్వాల్, ఊరిమధ్యలో ఉన్న గుదిబండ దగ్గ ర నించుని కాపలా కాస్తు న్నాడు. పగటి చుక్కని చూడగానే, మొదట

కొత్వాల్ చాలా అప్రమత్త ం అయ్యాడు. కానీ పగటి చుక్క తన కాళ్ళనూ, చేతులనూ తనే ఆ గుదిబండలోకి దూర్చి

తాళం వేయాలి అని ప్రయత్నించడం చూసి, ‘ఇతను పిచ్చివాడో , లేక అజ్ఞా నో అయిఉండాలి’ అనుకుని, పగటి చుక్క

ప్రయత్నాన్ని మామూలుగా చూస్తూ ఉండిపో యాడు.

పగటి చుక్క గుదిబండలోకి కాళ్ళూ చేతులు దూర్చాలని ప్రయత్నించాడు. కానీ అడ్డ దిడ్డంగా ప్రయత్నంచేసాడు

కాబట్టి, అతని ప్రయత్నం ఫలించలేదు. పగటి చుక్క ప్రయత్నాన్ని గమనించే కొద్దీ, కొత్వాల్లో క్రమంగా ఉత్సుకత

పెరగ
ి ింది. చివరికి చిరాకు కూడా కలిగింది. దాంతో

"అలా కాదు! ఇలాగ” అంటూ తనని తాను అందులో బంధించుకుని చూపించాడు.

వెంటనే పగటి చుక్క కొత్వాల్ ని కర్రతో లాగిపెట్టి ఒక్కటి కొట్టా డు. అంతే కొత్వాల్ స్పృహకోల్పోయాడు. పగటి చుక్క

కొత్వాల్ ఇంటికెళ్ళి

"కొత్వాల్ ని దొ ంగ కొట్టి, గుదిబండలో పెట్టి తాళం వేశాడు. కొత్వాల్ స్పృహకోల్పోయాడు. ఆయన్ని వైద్యుడి దగ్గ రకు

తీసుకెళ్ళండి” అని చెప్పాడు.

వెంటనే ఇంటిల్లి పాదీ హడావుడీగా, లబో దిబో మంటూ కొత్వాల్ దగ్గ రకు వెళ్ళారు. పగటి చుక్క దర్జా గా, కొత్వాల్

ఇంటిలోని విలువైన సామాగ్రి మొత్త ం దో చుకుని, అక్కడ ఇలా సమాచారం రాసాడు.

"మహారాజా! నా పేరు పగటి చుక్క. నేను ఒక దొ ంగను. మీరు నన్ను ఏ రకంగాను పట్టు కోలేరు.”

ఇదంతా తెలుసుకున్న రాజుకు పిచ్చెక్కేంత పని అయ్యింది.

"మంత్రివర్యా! వాడిని మీరే ఎలాగో, ఓలాగ పట్టు కోవాలి” అని చెప్పాడు రాజు.

ఇదంతా విన్న పగటి చుక్క. ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు.

మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో


"చూడూ! పగటి చుక్క ఈ రోజు మన ఇంటికి దొ ంగతనానికి వస్తా డని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని

విలువైన వస్తు వులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దా ం. అలాగే

పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టు కోటానికి. పగటి చుక్క నాలాగా వేషం వేసుకొని వస్తా డట” అని

చెప్పాడు పగటి చుక్క.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తు వులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టా రు వాళ్ళంతా.

వాళ్ళని “దొ ంగ వచ్చినట్టు న్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక

పెద్ద రాయి పడేసి. విలువైన వస్తు వులను పక్కనే ఉన్న గుబురు పొ దలో పడేసాడు పగటి చుక్క.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొ ంగా! వాణ్ణి పట్టు కొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు పగటి చుక్క.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లా డుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు.

ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లా డటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గ ర స్నానం చేసి వస్తా ను” అని చెప్పి, పగటి చుక్క

పొ దలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.

మర్నాడు జరిగిందంతా తెలుసుకున్న రాజుకు ఎం చేయాలో తోచలేదు. ఇంతలో అతిలోక సుందరి అయిన

యువరాణి ఇలా అంది.

మృధు మధురమైన కంఠంతో యువరాణి ఇలా అన్నది.

"నాన్నగారూ! ఈ దొ ంగ చాలా తెలివైన వాడిలా ఉన్నాడు! వీళ్ళంతా అతన్ని పట్టు కోలేరు. మీరు అనుమతిస్తే, నేను

పగటి చుక్కని పట్టు కుంటాను” అన్నది యువరాణి.

"నీ మీద నాకా నమ్మకం ఉందమ్మా! సరే, నీ యిష్ట ం” అన్నాడు రాజు.

పగటి చుక్కకి కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది. రహస్యంగా యువరాణిని అనుసరించసాగాడు పగటి చుక్క.

దర్బారు ముగిసాక యువరాణి చెలికత్తె, "యువరాణీ! ఆ దొ ంగని పట్టు కోవడానికి ప్రయత్నించి ఇంత మంది

విఫలమయ్యారు కదా! మీరు ఎలాగ పట్టు కుంటారు?” అని అడిగింది.

ఆ మాటకి యువరాణి ఒక చక్కని నవ్వు నవ్వి. “అతన్ని పట్టు కోవటానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేసాం. కానీ
పగటి చుక్క తప్పించుకున్నాడు. అంటే ఖచ్చితంగా అతను మన రాజ దర్బారులో జరిగే విషయాలన్నీ ఎప్పటికి

అప్పుడు తెలుసుకుంటున్నాడు అన్నమాట. ఈ రోజు నేను మన రాచతోటలో ఒక్కదాన్నే వేచివుంటాను. అప్పుడు

అతను ఖచ్చితంగా వస్తా డు. అతన్ని నేను ఖచ్చితంగా పట్టు కుంటాను. చూస్తూ ఉండు” అనేసి అక్కడి నుండి

వెళ్ళిపో యింది యువరాణి మణిమేఖల.

ఆ రోజు రాత్రి పౌర్ణమి. మణిమఖ


ే ల ఒక్కత్తే రాచతోటలో విహరిస్తు ంది. ఇంతలో పగటి చుక్క అక్కడికి వచ్చాడు.

మణిమేఖలకి అర్ధం అయ్యింది ఈ వచ్చిన అతనే పగటి చుక్క అని. కానీ ఆమె మనసులో మెదులుతున్న

ఆలోచనలు వేరేవి.

`అబ్బా! ఎంత అందంగా ఉన్నాడీ అబ్బాయి! ఇతనే గనక దొ ంగ కాక పో యుంటే, నేను ఖచ్చితంగా ఇతన్ని పెళ్ళి

చేసుకొని ఉండేదాన్ని’ అనుకుంది మణిమేఖల.

అటు పగటి చుక్క కూడా `ఎంత సౌందర్యవతీ ఈ అమ్మాయి! ఈమే గనక నన్ను పెళ్ళి చేసుకుంటానంటే నా చోర

వృత్తి ని మానేస్తా ను’ అనుకున్నాడు.

"ఓ రూపవతీ! నేను ఒక యాత్రికుణ్ణి. ఈ రాచతోటలో నేను విశ్రా ంతి తీసుకోవచ్చా” అని అడిగాడు పగటి చుక్క.

మణిమేఖల అందుకు సమ్మతించింది. ‘ఈ యాత్రికుడిగా చెప్పుకుంటున్న అతను, పగటి చుక్కేనని నిరూపించాలి

కదా. అందుకని ఏమీ తెలియనట్టు వేచివుంటే, పగటి చుక్క నా దగ్గ ర ఏదో ఒకటి దొ ంగిలించబో తాడు. అప్పుడు

పట్టు కుని భటులకు అప్పగిద్దా ం’ అనుకుంది మణిమఖ


ే ల.

మణిమేఖల “నాకు చాలా నిద్ర వస్తు ంది, మీకు కూడా అలసటగా ఉన్నట్టు ంది. ఆ ఆసనం మీద పడుకుందురుగాని

పదండి” అంటూ అతన్ని తోటలో విశ్రా ంతి తీసుకోడానికి ఉంచిన ఆసనాలని చూపించింది.

ఇద్ద రూ దూరం దూరంగా పడుకున్నారు. పగటి చుక్క అటు తిరిగి పడుకుని ఉండగా, పగటి చుక్క పంచ అంచుని,

తన చీర కొంగుకు కట్టు కొని ‘ఇంక పగటి చుక్క లేచాడంటే చాలు నాకు మెలుకువ వస్తు ంది’ అనుకుని నిశ్చింతగా

నిద్ర పో యింది మణిమఖ


ే ల.

తెల్లవారుతుండగా చెలికత్తె వచ్చి లేపితే కానీ ఆమెకు మెలుకున రాలేదు. చూసుకుంటే ఏముంది! పగటి చుక్క

ఆమె చీరను కూడా, ఆమెకు మెలుకువ రాకుండా ఊడ తీసుకొని పో యాడు. రాజుకు జరిగింది తెలిసింది.

మణిమేఖల తన మనసులోని కోరిక తండ్రికి చెప్పింది. రాజు మాత్రం ఏం చేస్తా డు! ఇలా ప్రకటన ఇచ్చాడు.
"పగటి చుక్కా! నీవు నీ వృత్తి ని గనక వదులుకోడానికి ఇష్ఠ పడేటట్ల యితే. నా కూతురిని నీకిచ్చి పెళ్ళి చేస్తా ను.”

పగటి చుక్క అందుకు ఒప్పుకుని తనెవరో, తన ఇతర వివరాలూ తెలియచేసాడు. పగటి చుక్క పెళ్ళి మణిమేఖలతో

అయిపో యింది. రాజుకు మణిమేఖల ఏకైక సంతానం కావడంతో పగటి చుక్క రాజు అయ్యాడు.

ఆ తరవాత నుంచి పగటి చుక్క తన తెలివితో, దేశంలో ఏ ఇబ్బందులూ రాకుండా దేశాన్ని పరిపాలించాడు.

You might also like