Professional Documents
Culture Documents
కిరాతార్జునీయం
కిరాతార్జునీయం
మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జు నీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి
‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జు నీయ కథ లో లేని
పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబో యే కురు పాండవ
సంగ్రా మానానికి పాండవులను ఎలా సన్నద్ధ ం చేయాలో సంసిద్ధ పరచాలో తెలియ జెప్పి వైరివీరుల
విక్రమపరాక్రమాలను కళ్ళకు గట్టేట్లు చేసి అలాంటి వారిని గెలవటం తేలిక కాదు అన్న భావన మనసులో కలిగించి
,తద్వారా సాధన సామగ్రి సంపూర్ణంగా సమకూర్చుకొని యుద్ధ సన్నద్దు లవటానికి పాండవులకు మహా గొప్ప
అవకాశం కల్పించాడు భారవి .ఆ పాత్ర సృష్టి జరగకుండా ఉంటె కధ బలహీనమై కావ్యం రస హీనమై తేలిపో యేది.
అంతటి దూర దృష్టి ఉన్నవాడు భారవి .ప్రస్తు తం ఇదీ నేపధ్యం ,ఇప్పుడు భారవి ఒక్కో పాత్ర ను ఎలా సృష్టించి
భీష్ముడు
భారత కిరాతార్జు నీయ మూలకధలో ఎక్కడా భీష్ముని ప్రసక్తి చేయలేదు వ్యాసర్షి .అలాంటిది తనకావ్యం లో భీష్మ
పాత్ర సృష్టించాడు భారవి .వ్యాసుడు పాండవులకు ప్రత్యక్షమై రాబో యే కురుక్షేత్ర యుద్ధ ం లోతాము యుద్ధ ం
చేయబో యే భీష్ముడు అజేయ పరాక్రమ సంపద కలవాడని హెచ్చరిస్తూ భీష్ముని విశిష్ట తను సంగ్రహ౦గానే
అయినా సమగ్రంగా తెలిపాడు .ఏ వీరుడి పరాక్రమం అయినా ఆ వీరుని గురువు యొక్క పరాక్రమం తో ముందుగా
గణించి చెప్పటం లోక సంప్రదాయం .వ్యంగ్య వైభవం గా భారవి దీనిని ఉపదేశించటం విశిష్ట మైన విషయం -21 సార్లు
క్షత్రియ రాజులపై దండెత్తి సంహరించిన పరశురాముడు భీష్ముని గురువు అని ముందుగా గుర్తు చేశాడు .అలాంటి
గురువునే ఎదిరించి ,జయించి,తన ధనుర్వేద పాండిత్య ప్రకర్షను గురువుకే ప్రత్యక్షంగా చూపించినవాడు భీష్ముడు
అంటే గురువు పరశురామునే జయించిన అవక్ర పరాక్రమ శాలి భీష్ముడు కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండాలి
.ఆయన్ను జయించే ప్రయత్నాలూ అసామాన్యంగా ఉండాలి అని చెప్పకనే చెప్పాడు .మరో శ్లో కం లో –
అంటే-ప్రా ణులన్నిటినీ సంహరించే సర్వ శక్తి వంతుడైన యముడు కూడా భీష్ముని చేతిలో పరాభవం చెందాడు
.అలాంటి భీష్ముని చేతిలో విల్లు కదులుతూ ఉన్నంత సేపూ ,ఎంతటివాడైనా ఆయన్ను ఎదిరించేప్పుడు భయ
కంపితుడు కావాల్సిందే .భీష్ముడు తండ్రి నుంచి తనకు స్వచ్చంద మరణం వరంగా పొ ందాడు కనుక యముడు తన
ఇష్ట ం వచ్చినప్పుడు భీష్ముడిని చంపటానికి శక్తి మంతుడు కాడు .అందుకని భీష్ముని చేతిలో యముడు కూడా
ఓడినట్లే అని భావం ‘’స భీష్మః ‘అనటం వలన అంతటి విశిష్ట బలపరాక్రమాలు కల భీష్ముడిని జయించటం మీకు
వ్యాస మహా భారతాన్ని ఆపో సన పట్టిన భారవి రెండే రెండు శ్లో కాలలో భీష్మ ప్రతాప గ్రీష్మాన్ని కళ్ళముందు
ద్రో ణుడు
మహాభారత కిరాతార్జు నీయం లో ద్రో ణుడి పాత్రకూడా లేదు .కాని తనకావ్యం లో ద్రో ణ పాత్ర సృష్టి చేసి తాను
చెప్పవలసినదానికి వన్నె చేకూర్చాడు భారవి .ఈ కావ్యం లో వ్యాసుడే స్వయంగా ద్రో ణుని ప్రా శస్త్యాన్ని వివరిచటం
‘’రాబో యే యుద్ధ ం లో పుంఖాను పు౦ఖ౦ గా బాణాలు ప్రయోగిస్తూ ,మండుతున్న ,కదులుతున్న శిఖాగ్రా లు అనే
నాలుకలు గల లోకాలను మ్రింగటానికి సిద్ధమౌతున్న ,ప్రళయాగ్నికి సమానమైన ద్రో ణా చార్యుని మీలో ఎవరు
ద్రో ణుని కి ఆగ్రహో దగ్రమైన ప్రళయాగ్ని సాద్రు శం అనుపమం .పాత్ర తత్వానికి చక్కగా భారవి ప్రయోగించిన శబ్ద
సౌందర్యం ఇది .
కర్ణు డు
కూడా మూల కధలో లేడు. భారవి సృష్టి౦చికావ్యమ్ లోపెట్టా డు .వేణీ సంహార నాటకం లో అర్జు నునిచేత కర్ణు ని
పరాక్రమాన్ని తెలియ జేయించాడు నాటకకర్త భట్ట నారాయణకవి ‘కర్ణు డిని చంపి అర్జు నుదు ముసలి రాజుతో –
‘’సకల రిపు జయాశా యత్ర బద్దా సుతాస్తే-తృణమివ పరి భూతో యస్య వీర్యేణ లోకః ‘’అని కర్ణు ని పరాక్రమ శైలిని
మెచ్చుకుంటాడు .ఇక్కడ కిరాతార్జు నీయ కావ్యం లో భారవి కర్ణ పాత్ర సృష్టి చేసి ,వ్యాసుని తో కర్ణు ని జయించగల
భావం – ఎంతటి మహా వీరుడైనా ఎదిరించే సందర్భం లో అయినా కోపో ద్రేకం చేత వాడి ధైర్యాన్ని సడలింప జేసే
సమర్ధత ఉన్న పరశురాముడిని కర్ణు డు ఆరాధించాడు .కర్ణు ని చూసి మృత్యువే ఇది వరకేప్పుడూ చూడని ,వినని
భయాలను పొ ందుతుంది అని వ్యాసుని మనసు .అంటే పరశురామా రాదన వలన కర్ణు డు మృత్యువును కూడా
వణిక౦
ి చ గలడు అని వ్యాస భావం .ఇలాంటి కర్ణ పరాక్రమ విక్రమాలను ఒకే ఒక్క శ్లో కం లో వ్యాసుని వలన భారవి
ఆధారం –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ వైవాహిక స్వర్ణో త్సవ కానుకగా, జ్ఞా పికగా
రచించి,-9-5-18 న వెలువరించి, ఆత్మీయంగా నాకు పంపగా 17-5-18 శుక్రవారం అందుకున్న ‘’భారవి భారతి
‘’(కిరాతార్జు నీయ కావ్య సమీక్ష )గ్రంథం.ఆచార్య సార్వ భౌమ వారికి కృతజ్ఞ తలతో నమస్సులు .
పాత్ర ‘’వనచరుడు ‘’. కావ్య ప్రా రంభం ఈపాత్రతోనే .ద్వైతవనం లో ఉన్న పాండవులు హస్తినలో దుర్యోధన రాజ్య పాలన ఎలా ఉన్నదో కూపీ
లాగాలన్న ఆలోచన కలిగి ధర్మరాజు వనచరుడు అనే వాడిని రహస్యంగా,మారు వేషం లో వెళ్లి తెలుసుకు రమ్మని పంపిస్తే ,ఆపని చక్కగా
చేసుకుని చక్కా వచ్చాడు. వీడిని భారవి ‘’వర్ణీ లింగీ’’అంటాడు .అంటే బ్రహ్మ చారి అని అర్ధ ం .దీనికి వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాద సూరి
‘’ఇత్యుక్త అష్ట విధ మైదునాభావ రూపా ప్రశస్తిః వర్ణో స్తీతిబ్రహ్మ చారీ’’అని విపులంగా వ్యాఖ్యానించాడు .అంటే అష్టా ంగ మైదునానికి విపరీతమైన
లక్షణం కలవాడు అని భావం .వీడు కావ్యారంభంలోనే తాను చూసిన విశేషాలను ధర్మరాజుకు నివేదిస్తా డు .ఇది చారుని ధర్మం .విధి
నిర్వహణలో తన సుఖ దుఖ అనుభవాలకు వాడికి అవకాశం ఉండదు కనుక నిజం చెప్పటానికి ఏ మాత్రమూ సంకోచించడు .’’నవివ్యధే
తస్య మనః ‘’అంటాడు భారవి వాడిని .ఈ శబ్ద ప్రయోగం లో చారుడు పంపిన వారి మనసుకు ప్రీతికరంగా ఉంటుందని అబద్ధా లు చెప్పరు
అనేభావం కూడా ఉంది .వాడు ‘’మా బో టి చారుల వాక్కులు యదార్దా న్నినివేది౦చ టమే ముఖ్యమైన పని అని చెప్పటం ప్రా రంభిస్తా డు
–‘’నహి ప్రియం వక్తు మిచ్చంతి మృషా హితైషిణః’’.తర్వాత ‘’ప్రవ్రు త్తి సారాః ఖలు మాదృశాం గిరః ‘’అంటాడు .అంటే చూసింది ,విన్నదీ ఉన్నది
ఉన్నట్లు వివరి౦చాను ,ఆ తర్వాత చేయాల్సి౦దేదొ మీరే నిర్ణ యించుకోండి,కర్త వ్య నిర్దేశ్యం చారుల పనికాదు ‘’-‘’విధీయతాం తత్ర విధేయ
ముత్త రం ‘’అని తేల్చి చెప్పాడు. ఈ వనచర పాత్ర ద్వారా చారుని విషయ నివేదన ఎలా ఉండాలో భారవి లోకానికి తెలియ జెప్పాడు .కనుక
కవి లోకజ్ఞ త ఇక్కడ విశదమైంది .దుర్యోధన రాజ్య పాలన విశేషాలు చారుని ముఖతా తెలుసుకొని సుయోధనుని రాజనీతి చాతుర్యం ఎలా
ఉందొ అర్ధ ంచేసుకున్నారు .దీనిని బట్టి తమ భవిష్యత్ ప్రణాళిక నిర్ణ యించుకుని,తమ రాజనీతి ఎలా ఉంటుందో బహిర్గతం చేసుకున్నారు .
పాండవులు .ద్రౌ పది భీముడు చాలా దూకుడుగా మాటాడితే ,యుధిస్టిరుడువాళ్ళను శా౦త పరుస్తూ ,భవిష్యత్తు ఎలా ఉండ బో తోందో
మాటలలో చూపించి తన రాజనీతి కుశలత ఆవిష్కరిస్తా డు .కనుక ఒక్క చారుని పాత్రవలన నలుగురి అంటే దుర్యోధన, భీమ,
ద్రౌ పది,ధర్మరాజుల రాజనీతి ఏమిటో లోకానికి గ్రహించే అవకాశం కల్పించాడు కవి భారవి .
ద్రౌ పది
నిలువెల్లా క్షాత్ర తేజం ఉన్న నారీ శిరోమణి ద్రౌ పది దుర్యోధనునిపై ప్రతీకారానికి అనుక్షణం వేచి చూస్తు న్న అభిమానవతి .వనచర వాక్యాలు
విని ఆమె హృదయం ఆగ్రహం తో ఊగి పో యింది .నీతి శాస్త ్ర విధానం తో యుద్ధా నికి వెంటనే నడుం బిగించమని పతులకు హెచ్చరిక చేసింది
మహా రథ స్సత్య ధనస్య మానసం –దునోతినో కచ్చిదయం వృకోదరః ‘’అంటుంది –అంటే –రాజా !ఒకప్పుడు రక్త చందనం పూతతో విరాజిల్లిన
అతి రథు డైన భీముడు –ఇప్పుడు మాత్రం ధూళి ధూసరం గా పాద చారిలాగా సంచరించటం నీకు బాధ కలిగించటం లేదా ?అని ప్రశ్నించింది
.తర్వాత అర్జు నుని పై దృష్టి సారించి ఆమె –‘’ఇంద్ర సమాన తేజంతో ధనుంజయుడు ఉత్త ర కురు దేశాలను జయించి ,విశేష ధన రాసులు
తెచ్చి నీకుసమర్పించినవాడు , ఇవాళ నార బట్ట లు నీకు తెచ్చిస్తు న్నాడు .అతని దయనీయ స్థితి నీకు క్రో ధాన్నిఎందుకు కలిగించలేక
తర్వాత కవలలు అయిన నకుల సహదేవుల దీనస్థితి వివరిస్తూ ‘’అరణ్యాలతో పాదచారులై తిరుగుతూ ,నేలపై పడుకొంటూ,శరీర కాఠిన్యం
తో చెదరిన జుట్టు తో అడవి ఏనుగుల్లా ఉన్న వీరిని చూస్తూ సంతోషాన్ని ,నియమపాలననూ ఎలా పొ ందగాలుగుతున్నావు రాజా ‘’అంటుంది
సరే ఇవన్నీ వదిలెయ్యి –నీ పరిస్థితి చూడు –‘’ఒకప్పుడు విలువైన శయ్యలపై నిద్రించేవాడివి .స్తు తి పాఠకుల,మంగళ వాద్యాల ,గీతాలతో
నిద్ర లేచేవాడివి .ఇప్పుడు దర్భ శయ్యపై నిద్రిస్తూ నక్కల కూతలతో మేల్కొంటున్నావు .అలాగే పూర్వం బ్రా హ్మణులకు సంతృప్తిగా పెట్టగా
మిగిలిన అన్నం మనోహరంగా భుజించేవాడివి .ఇప్పుడు అడవిలో దొ రికే వాటితో కడుపు ని౦పు కొంటు న్నావు .వీటివలన నీ కీర్తి తోపాటు
శరీరం కూడా కృశించి పో యింది .పూర్వం నీ పాదాలు మణి పీఠంపై రాజుల శిరస్సులతో అలరారుతూ ఉండేవి. నేడు లేళ్ళు
కొరకగా, ,బ్రా హ్మణులు తెంపగా మిగిలిన చివళ్ళు కల దర్భ వనాలలో ఉన్నాయి ‘’అని పలువిధాలుగా భర్త లు పడుతున్న కష్టా లను
ఏకరువు పెట్టింది .భర్త ల౦దరిపై ఆమె కున్న గాఢ మైన పవిత్ర ప్రేమకు ఈ మాటలు నిదర్శనమే కాక, పంచ భర్త్రు కతను ప్రతీయమానం
చేస్తు న్నాయి.
వ్యాస భగవానుని ఆదేశం ప్రకారం అర్జు నుడు తపస్సుకి వెళ్ళే ముందు ద్రౌ పది చేసిన కర్త వ్యోపదేశం చిరస్మరణీయం .ఆమెకున్న అపార
లోకజ్ఞ తకు నిదర్శనం .కర్త వ్య నిస్ట బో ధించటం లో ఆమె కున్న కౌశలం అబ్బురపరచేది .తాత్కాలిక భర్త్రు వియోగం తో ఆమె కళ్ళు
జలపూరితాలయ్యాయి . కానీ కళ్ళు మూసుకోవటానికి ఆమె కు మనసొ ప్పలేదు . కళ్ళు మూస్తే అశ్రు కణాలు నేల రాలుతాయి .అది
ప్రయాణానికి ముందు శుభ సూచకం కాదు .అదో సెంటి మెంట్ .దీన్ని వివరిస్తూ భారవికవి –
‘’తుషార లేఖా కులితోత్పలాభే –పర్య శ్రు ణీ మంగళ భంగ భీరుః
ద్రౌ పది సహజప్రేమ రస నిర్భరమైన మనోభిరామం అయిన చూపు ను పాథేయం గా గ్రహించి అర్జు నుడు తపస్సుకోసం ఇంద్ర కీలాద్రికి
బయల్దే రాడు .ఆదర్శ భారతీయ దాంపత్యం ఎలా ఉంటుందో రుచి చూపించాడు మహాకవి భారవి.వెళ్ళే ముందు అతనికి వియోగం వలన
అతని మనసుధ్యేయం నుండి చెదిరిపో రాదని హెచ్చరించింది .కౌరవుల దురాగతాలను తనకు జరిగిన వస్త్రా పహరణ నూ గుర్తు కు తెచ్చింది .
కౌరవులపై ప్రతీకారేచ్చ రగుల్కొనేట్లు మాట్లా డి అర్జు నునిలో కర్త వ్య దీక్ష పెంచటానికి తోడ్పడింది .అతనిమనసులో ప్రతీకారం తారాస్థా యికి
చేరి తాత్కాలికమైన తమ వియోగం వలన తపస్సు విడిచి పెట్టకుండా భవిష్యత్ దర్శనం చేయించింది.’’కరణేషు మంత్రీ’’అన్నదాన్ని రుజువు
చేసి ,తన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దు కొని ,ఉత్త మ ధర్మ పత్నీ ధర్మానికి సజీవ సాక్షిగా నిలిచింది .పాత్ర మనస్థితిని చిత్రించటం లో భారవి
ప్రతిభ జ్యోతకమౌతుందని ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఉల్లేఖనం .
కిరాతార్జు నీయం లో
అర్జు నుడు -1
కావ్య నాయకుడైన అర్జు న పాత్ర చిత్రణలో భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న
దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌ పది .అందులో అతడు త్వరలో
ఇంద్రు ని అనుగ్రహం పొ ందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం ‘’అనే పదాన్ని సార్ధ కంగా ప్రయోగించి తనకు శబ్డ ంపైగల సాధికారతను
తెలియ జేశా డని ఆచార్య సార్వభౌములంటారు .దీనికి మహావ్యాఖ్యాత మల్లినాద సూరి ‘’కుప్యాదన్య దకుప్యం ,హేమరూపాత్మకం ‘’అని
వివరణ ఇవ్వకపో తే అర్ధ ం ఎవరికీ సులభంగా తెలిసేదికాదని వారన్నారు –
‘’విజిత్య యః ప్రా జ్యమయ చ్చదుత్త రాన్-కురూనకుప్యం వసు వాసవోపమః
స వల్కవాసాంసి తవాధునా హరన్ –కరోతి మన్యుం న కథం ధను౦జయః ‘’
వ్యాసమహర్షి తన మంత్రో పదేశానికి అర్హత కలవాడు ,కఠోరమైన తపస్సు చేయాల్సినవాడు యుద్ధ ం లో పితామహ, ద్రో ణాదులను జయించే
సామర్ధ ్యం కలవాడు అర్జు నుడే అని గుర్తించి ధర్మరాజుతో ఇలా అంటాడు –
‘’యయా సమాసాధిత సాధనేన –సుదుశ్చ రామా చరతా తపస్యాం
ఏతే దురావం సమవాప్య వీర్య –మున్మీలితారః కపి కేతనేన ‘’
ఇక్కడ కపి కేతన శబ్ద ం సాభిప్రా యంగా కవి ప్రయోగించాడు. రామరావణ యుద్ధ ం లో సర్వ రాక్షససంహారకారకుడు హనుమంతుడు .అతడే
‘’జెండాపై కపి రాజు ‘’గా ఇప్పుడు అర్జు నుని జెండా పై ఉండబో తున్నాడని సూచ్యార్ధ ం .కనుక అర్జు నుడికి ఎదురు అనేది ఉండదని భావం
.విద్యను ఉపదేశించేటప్పుడు కూడా ‘’యోగ్య తమాయ తస్మై వితతార ‘అంటాడు మహర్షి .అంటే ఆతడు యోగ్యతముడు అని తేల్చి
చెప్పాడన్నమాట .
సరే వ్యాసర్షి ఉపదేశంతో తపస్సుకు బయల్దే రాడు ధనుంజయుడు .ఏవైనా ఆట౦కా లేర్పడి కర్రా బుర్రా పారేసి చటుక్కున తిరిగొస్తా డేమో
అనే ముందు చూపుతో బయల్దే రటానికి ముందే తాను పూర్వం కౌరవులవలన పొ ందిన పరాభవాలనన్నిటినీ ఏకరువు పెట్టి౦ది
.సహజంగానే సౌమ్యుడైన అతడు ఇప్పుడు భయంకరమైన శరీరం ధరించి బయల్దే రాడని భారవి వర్ణ న .అప్పుడు అతడు ‘’క్రియా రూపం
పొ ందిన అభిచారిక మంత్రం ‘’లాగా భీషణ రూపుడైనాడనివర్ణించాడు –‘’బభార రమ్యోపి వపుస్స భీషణం గతః క్రియాం మంత్ర ఇవాభి చారికీం
‘’అని ప్రత్యక్షం చేస్తా డు .సహజంగా ప్రకృతి ప్రేమికుడైన అతడుఇంద్ర కీలద్రికి వెళ్ళే దారిలో నీటి జాడలలో చేపల గంతులు ,ఆలమందల
గమనం , గోపకుల జీవన విధానం ,పర్వత శోభ దర్శించి పులకించి పో తాడు .
కీలాద్రి చేరి తాను దేనికోసం వచ్చాడో ఆపని అంటే ఘోర తపస్సులో మునిగిపో తాడు .యోగ్యతముడైన అతడు తపో నిస్ట లో ఎలా ఉన్నాడో
వర్ణిస్తా డు భారవి –
‘’శిరసా హరిన్మణినిభః స వహన్ –కృత జన్మ నోభిష వణేన జటాః
ఉపమాం యయా వరుణ దీధతి
ి భిః-పరి మృస్ట మూర్ధ ని తమాలతరౌ ‘’
భావం -
మరకత మణి కాంతి తో సమానమైన కా౦తి కల అర్జు నుడు నిత్యస్నానం వలన అతని శిరోజాలు సంస్కారం లేక జడలు కట్టేసి ఎర్రగా
మారిపో యాయి .శిరస్సుపై యెర్రని కాంతులు వ్యాపించటం వలన అతడు తమాల వృక్షం లాగా భాసిస్తు న్నాడు .యధాప్రకారం ఎవరు
తపస్సు చేస్తు న్నా భంగం కలిగించే ఇంద్రు డు దేవకా౦తలను ప్రయోగించగా వాళ్ళు హావభావ శృంగారాలతో రెచ్చ గొట్టే ప్రయత్నం చేసి అతని
జితే౦ద్రి యత్వ౦ ముందు పరాభవం పొ ందారు .అంతే కాదు చివరికి వాళ్ళే కామోద్రిక్తలైపో యారట .దీనినే భారవి ‘’మదన ముప పదే స ఏవ
తాసాం ‘’అని అత్యద్భుతంగా వర్ణించి చెప్పాడు .అంటే సీన్ రివర్స్ అయిందన్నమాట .కనుక వ్యాసో పదేశం , ద్రౌ పది హెచ్చరిక
సార్ధ కమైనాయని కవి వాక్కు .
కొడుకు తపస్సుకు మెచ్చి ఇంద్రు డే ముసలి ముని వేషం లో దిగివచ్చితపస్సు చాలించమంటాడు .చలించని అతని మనమెరిగి
,పరమేశ్వరారాధనకు ప్రో త్స హిస్తా డు .
చివరి పరీక్ష లో మూకాసురుడు భయంకర వరాహ రూపం అవక్ర పరాక్రమం తో అర్జు నుని చంపటానికి రావటం ,అతడు అనేకరకాలుగా
ఆలోచించి చివరకు ‘’కురు తాత తపా౦స్య మార్గ దాయీ విజయా యేత్యల మన్వశాన్మునిర్మాం ‘’అని స్మరించి బాణం ప్రయోగించి పందిని
చంపటానికి నిశ్చయించాడు .ఆ భీకర భయంకర ధనుంజయ రూపాన్ని కిరాత వేషంలో ఉన్న శివుడు చూసి ఆశ్చర్యపో తాడు .దీన్ని
భారవికవి పరమాద్భుతంగా ఇలా చెప్పాడు –
‘’దదృశే థ సవిస్మయం శివేన –స్థిర పూర్ణా యుత చాప మండలస్థ ః
రచితస్తి సృణా౦ పురాంవిధాతుం –వధ మాత్మేన భయానకః పరేషాం ‘’
నిజానికి శివుడు తనంతటి వాళ్ళతోనే యుద్ధ ం చేస్తా డుకాని అల్పులతో యుద్ధ ం చేయడు .కనుక అర్జు నుడికి త్రిపురాసుర సంహారం నాటి
పరమేశ్వరుడుగా గోచరించాడు .కనుక సరి యోధుల మధ్య యద్ధ ం జరగబో తోంది .అతడి రుద్రత్వం భావి కురుక్షేత్ర సంగ్రా మం లో కూడా
కనిపిస్తు ందని పిండితార్ధ ంగా పండిత ఆచార్య సార్వభౌముల వాక్కు .తరువాత ఏం జరగబో తోందో తర్వాతే తెలుసుకుందాం .
ఆధారం –భారవి భారతి –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
అర్జు నుడు-2(చివరిభాగం )
పందిపై పార్ధు డు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు
వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జ నా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తు ంది .వరాహం
పై వాయునందనుడి తమ్ముడు ప్రయోగించిన ‘’పరమాస్త ం్ర ‘’ ఆ అరణ్యాలలో ఉల్క లాగా ప్రకాశిస్తో ందట .వందలాది పక్షుల అరుపుల
శబ్దా న్ని కలిగిస్తో ంది –‘’ పరమాస్త ్ర పరిగ్రహో రు తేజః స్పుర దుల్కాకృతి విక్షిపన్వేషు’’.ఆబాణ ప్రయోగవేగం ఊహించిన దానికంటే ముందే లక్ష్యా
న్ని చేరుకొనేట్లు గా ఉన్నదట .అతనా బాణ ప్రయోగ వేగం, లక్ష్య సామర్ధ ్యం లను కవి భారవి మంచి శ్లో కం లో నిక్షిప్త ం చేశాడు –
ఈ వరాహ సంహార పరాక్రమం కొద్ది సేపట్లో జరిగే కిరాతార్జు నీయ యుద్ధా నికి నేపధ్యమై౦ద న్నమాట .
కిరాత వేషం లో ఉన్న శివునితో అర్జు నుడు చేసిన యుద్ధ ం ,చూపిన పరాక్రమం శ్రేష్ట తరం ,అనుపమం .శివుడు అనేక మహిమలు
చూపి,హింసించినా అడుగు వెనక్కి వేయకుండా తన పో రాట పటిమ ఆవిష్కరించాడు పార్ధు డు .చివరికి కిరాతుని పాదాలు పట్టు కుని గిరగిరా
తిప్పి విసరి వేసే దాకా సాగింది .ఈ పరాక్రమోన్నతికి పరమ శివుడు పరమాశ్చర్యం పొ ందాడు .ఆయన హర్షా తి రేకంతో ధనుంజయుని
ఆప్యాయంగా కౌగిలించుకొని తన మెప్పును చూపాడు .అప్పడే కిరాత రూప శివుడు మాయం చేసిన అర్జు నుని కవచ ,గాండీవ,
అమ్ములపొ ది మళ్ళీ ఆర్జు నుడిని అలంకరిస్తా యి .విస్మితుడైన ధనుంజయుడు శివస్వామిని పరిపరి విధాలుగా స్తో త్రా లతో స్తు తించి యెనలేని
తన భక్తి ప్రపత్తు లను ప్రదర్శిస్తా డు .ఇక్కడ భారవి రచించిన స్తో త్రం ఎంతో ప్రా చుర్యం పొ ందింది .అది పరమేశ్వర తత్వాన్ని అద్భుతంగా
ఆవిష్కరిస్తు ంది .మనసునిండా అర్జు న పరాక్రమాన్ని మెచ్చుకున్న మహేశ్వరుడు అతనికి పాశుపతాస్త్రా న్ని ,ధనుర్వేదాన్ని అనుగ్రహిస్తా డు
.శివుని ఆజ్ఞ తో దిక్పాలకులూ ఆశీస్సులతోపాటు వివిధాస్త్రా లు ప్రసాదిస్తా రు .ఈవిధంగా లక్ష్య సాధనలో భీభత్సుడు దిగ్విజయం సాధించాడు .
భారవికవి చిత్రించిన అర్జు నుడు తొందర పాటు లేని స్థిర సంకల్పుడు .యుద్ధ ం తక్షణ కర్త వ్యం అని ద్రౌ పది భీముడు ధర్మరాజుపై పరిపరి
విధాల అంతకు ముందే ఒత్తి డి తెచ్చారు .అర్జు నుడు ఒక్కడే సంయమనం పాటించాడు .తన అభిప్రా యం మాత్రం చెప్పడు .అన్న ధర్మన్నపై
అర్జు నుని భక్తివిశ్వాసాలు అపారమైనవి .అన్నగారిఆజ్ఞ ను తూచా పాటిస్తా డు .వృద్ధ ముని వేషం లో వచ్చిన ఇంద్రు నికి అతడు తన
వృత్తా ంతాన్నినివేదించి తాను ‘’ దాయాదులచేరాజ్య భ్రస్టు డై ఉంటున్న జ్యేష్ట భ్రా త శాసనం లో ఉంటున్న వాడినని –‘’స్థితః ప్రా ప్త స్య
దాయాదైః భ్రా తుః జ్యేష్ట స్య శాసనే ‘’అనిపిస్తా డు భారవి .’’నేను లేని వియోగంతో మా అన్న ధర్మరాజు ద్రౌ పదితోను సో దరులతోనూ రాత్రి వేళలో
ఎక్కువ బాధ పడతాడు అంటూ ‘’మయా వినా భ్రు శం అభితవ్య తే’’అంటాడు .
మంచి ఆలోచనా పరుడైన అర్జు నుడు మంచి చెడ్డల విషయం లో గొప్ప వివేకం కలవాడు .దుష్టు లైన కౌరవులతో మైత్రి అంటే ‘నీడకోసం నదీ
తీరాన్ని చేరటం లాంటిది ‘’అని ముని వేషం లో వచ్చిన ఇంద్రు నికి కుండ బద్ద లు కొట్టినట్లు చెప్పాడు .-
‘’ధార్త రాస్ట్రైః సహప్రీతి ర్వైర మస్మా స్వసూయత –అసన్మైత్రీ హి దో షాయ కూల చ్ఛేయేవ సేవితా ‘’
నీడ కోసం నది ఒడ్డు కు చేరితే అది కాసేపట్లో నే కూలి పో యి పెద్ద ప్రమాదమే కలిగిస్తు ందని ,అలాంటిదే కౌరవులతో మైత్రి అనీ అంటాడు
.ఇక్కడే అభిమానవంతుడి స్వభావాన్ని భారవి చాలా శ్లో కాలలో వర్ణిస్తా డు .మూకాసురుడు భయంకరం గా మీదకు విరుచుకు పడుతుంటే
‘’పూర్వ జన్మ లో నాతో శత్రు త్వం ఉన్న దానిలాగా వరాహం వస్తు న్నట్లు ఉంది .నామనసు కల్మషం చేసి నన్ను చంపటానికి వచ్చే శత్రు వై
ఉండాలి .అరణ్యం లోని ఏ జంతువుకూ లేని పౌరుష పరాక్రమాలు దీనిలో కనిపిస్తు న్నాయి .కనుక ఇది వేషం మార్చుకు వచ్చిన దానవుడో
రాక్షసుడో అయి ఉండాలి .కాకపొ తే దుర్యోధనుడికి ప్రీతికల్గి౦చ టానికి ఎవడో ఈ పందిరూపు ధరించి వచ్చి ఉంటాడు .ఒకవేళ ఖాండవ
దహనం వలన ప్రతీకారేచ్చ తో తక్షకుని కొడుకు ఈ రూపం లో వచ్చాడేమో ?కాకపొ తే భీముడి కోపానికి గురైన వాడెవడో ఇలావచ్చాడా ‘’?
అని పరిపరి విధాల వితర్కి౦చు కున్నాడు .ఇవన్నీ అర్జు నుని నిశిత ఆలోచన సరళికి దృష్టా ంతాలు .
‘’కిరాతార్జు నీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తు న్నాను .పెద్దగా సంస్కృత శ్లో కాల జోలికి పో కుండా శ్లో క భావాలను
తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లో కాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తా ను . దీనికి
తెలుగు లో వ్యాఖ్యానం రాసినవారు శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్న శర్మగారు .దీని ఆధారంగానే నేను ఈ ధారావాహిక రాస్తు న్నాను .నేను
రాసిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ 0’’ మొదటి భాగం లో లో భారవికవి గురించిన 17-9-2014 న రాసిన అంతర్జా ల వ్యాసాన్ని ఇక్కడ
ఉండిపో యింది .పద్దెనిమిది సర్గ ల మహా కావ్యం ‘’కిరాతార్జు నీయం ‘’రాసిన మహాకవి భారవి .కిరాత అంటే మారు వేషం లో వచ్చిన
శివుడికి పాండవ సో దరుడు అర్జు నిడికి మధ్య జరిగిన పో రాటం ,మెచ్చిన శివుడు కిరీటికి పాశుపతాస్త ్ర ప్రదానం చేయటం కద.ఈ కద బెజవాడ
ఇంద్ర కీలాద్రిపైన జరిగిందని అందరి నమ్మకం .క్రీ.శ .ఆరవ శతాబ్ద ం వాడు భారవి అని ఎక్కువ మంది చెప్పారు .634 చాళుక్య
‘’ఐహో ళశాసనం ‘’లో భారవి కాళిదాసు ల పేర్లు న్నాయి .పశ్చిమ గంగ వంశ పాలకుడైన దుర్వినీత కిరాతార్జు నీయం లోని పదిహేనవ
అధ్యాయం పై వ్యాఖ్యానం చేసినట్లు తెలుస్తో ంది .ఈ రాజులు నాలుగవ శతాబ్ద ం మధ్య భాగం నుండి పరిపాలన చేశారు .దుర్వినీత మహా రాజు
ఆరవ శతాబ్ది చివరలో రాజ్య పాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది . ఏడవ శతాబ్ది కి చెందిన దండి కవి రచనల్లో భారవి తన ముత్తా త గారి
స్నేహితుడు అని పేర్కొన్నాడు .భారవి యే తన తాతగారికి విష్ణు వర్ధ న మహా రాజు ఆస్థా నం లో చోటుకల్పించాడని చెప్పాడు .ఆ తర్వాతే
తాత గారు పల్ల వ రాజైన దుర్వినీత ,సింహ విష్ణు ల కొలువులో చేరాడట .ఈ విష్ణు వర్ధ నుడు మనం అనుకొనే కుబ్జ విష్ణు వర్ధ నుడు కాదని
యశోధర్మ విష్ణు వర్ధ నుడు అని పరిశోధకులు అంటున్నారు .కనుక భారవి కాలం .530-550 అని అందరూ ఊహించారు .భారవి
భావ ప్రకటన భారవితోనే ప్రా రంభమైనదని విశ్లేషకాభిప్రా యం .’’భారవే రర్ధ గౌరవం ‘’అన్న టాగ్ కలిగి ఉన్నవాడు .కిరాతార్జు నీయ కద
మహా భారతం లోనిదే అయినా దాన్ని సుందర కావ్యం గా తీర్చిదిద్దా డు .కాళిదాసు రాసిన కుమార సంభవ రఘువంశా కావ్యాలు భారవికి
ప్రేరణ గా నిలిచాయి .కాని సర్వ స్వతంత్ర మైన కొత్త శైలికి నాందిపలికి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు .’’అవంతి సుందరి ‘’కద ప్రా కారం
భారవి విష్ణు వర్ధ నుడి ఆస్థా నకవి .వామనుడు‘’కావ్యాలంకార సూత్ర ప్రవ్రు త్తి ‘’లో భారవి శ్లో కాన్ని ఉదాహరించాడు .అసలు పేరు ‘’దామోదరుడు
కిరాతార్జు నీయ కద
జూదం లో ఓడిపో యిన పాండవులు ద్వైత వనం లో ఉంటారు .దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందొ తెలుసుకొని రమ్మని ధర్మ రాజు ఒక
అడవి మనిషిని గూఢ చారిగా పంపిస్తా డు .వాడు తిరిగి వచ్చి సుస్థిర రాజ్య పాలన చేస్తు న్నాడు గాంధారీ తనయుడు అని వివరిస్తా డు
.భీముడు, ద్రౌ పది యుదిస్ష్టిరుడినియుద్దా నికి ప్రేరేపిస్తా రు .చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దానికి ఆయన అంగీకరించడు .వ్యాసమహర్షి అక్కడికి వచ్చి
అర్జు నుడు శక్తి పరాక్రమ వంతుడు కావాలని అందుకోసం ఇంద్ర కీలాద్రి పై ఇంద్రు నికోసం తపస్సు చేయమని ఉపదేశిస్తా డు .ఆ ఆదేశం
ప్రకారం బెజవాడ వచ్చి ఇంద్ర కీలాద్రి పర్వతం పై తీవ్ర తపస్సు చేస్తా డు .తపో భంగం చేయటానికి దేవతా స్త్రీలు ప్రయత్నం చేసి విఫలురౌతారు
.ఇంద్రు డు ప్రత్యక్షమై శివుడి ని గూర్చి తపస్సు చేయమని సలహా ఇస్తా డు .శివుడు అర్జు న తపో దీక్షను పరీక్షించటానికి కిరాత వేషం లో
మాయ రూపం లో ఉండే పందిని అతనిపైకి ఉసి గోల్పుతాడు .స్వీయ రక్షణలో కిరీటి మాయా సూకరాన్ని బాణం తో చంపేస్తా డు ,అదే
సమయం లో మాయా కిరీటి శివుడు వేసిన బాణం దానికి గుచ్చ కుం.టుంది .పందిని కొట్టిన వాడు నేను అంటే నేను అని వారిద్దరిమధ్య
తీవ్ర వాదో పవాదాలు జరుగుతాయి .ఇద్ద రూ ద్వంద్వ యుద్ధా నికి తల పడుతారు .శివుడు అర్జు న బల పరాక్రమాలకు సంతోషించి
పాశుపతాస్త్రా న్ని ప్రదానం చేస్తా డు .కద చిన్నదే కాని భారవి సకల వర్ణ నాత్మకం గా గా పద్దెనిమిది సర్గ ల మహా కావ్యం గా విస్త రింప
జేశాడు
కవితా గీర్వాణం
కాళిదాసు కంటే ఒక అడుగు ముందుకు వేసి జలక్రీడ ,వన విహారాలు మధుపానం ,ప్రయాణం (ట్రా వేలోగ్ )వర్ణ నలు కూడా చేశాడు
.కావ్యం లో ఇవి చోటు దక్కి౦ చు కున్నాయి మొదటి సారిగా ఈ కావ్యం లోనే .వర్ణ నలకు అధిక ప్రా ధాన్యం ఇచ్చిన మొదటికవి భారవి
అనిపిస్తా డు .చాలా ప్రౌ ఢమైన భాషలో కావ్యం రచించాడు .ఉక్తి చమత్కారం ఈ కావ్యానికి భారవి పెట్టిన అదనపు సొ మ్ము .నాలుగు నుంచి
పది సర్గ లు అంటే ఆరు సర్గ లను వర్ణ నలతో గుప్పించేశాడు .భారవి కవిత్వాన్ని వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి దీనికి ‘’ఘంటా పథ‘’
‘’నారికేళఫల సన్నిభం వచో భారవేః సపది తద్విభజ్యతే – స్వాదయంతు రస గర్భ నిర్భరం సామరస్య రసికా యధేప్సితం ‘’అంటే
రసగర్భితమైన పదాలను విడ గొట్టి ఆస్వాదిస్తే పరమ రుచికరం గా ఉంటుంది .ఆ ఓపికే మనకు కావాలి .రుచి మరిగితే కొబ్బరి నమిలి నట్లు
చిత్రకవిత్వమూ రాసి షో కులు తెచ్చాడు .సర్వతో భద్ర ,యమక ,విలోమం మొదలైన చిత్ర కావ్య శై లుల్ని ప్రయోగించాడు .ఇంకో గమ్మత్తైన
విశేషం ఏమిటంటే ‘’ఏకాక్షర శ్లో కం ‘’కూడా రాసి తన ప్రతిభా ప్రదర్శనం చేశాడు .అంటే ఒకే అక్షరం తో శ్లో కం అంతా చెప్పాడన్న మాట .-‘’న
నోనా నున్నో నున్నోనో నానా నాన నాను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న ననున్నాత్ ‘’ –నఅనే ఒకే అక్షరం తో రాసిన శ్లో కం ఇది
.బాగా ప్రచారమైంది కూడా .దీని అర్ధ ం –‘’అనేక ముఖాల వాళ్ళల్లా రా !ఆయన మనిషి కాదు .తనకంటే తక్కువ బల వంతుని చేతిలో
ఓడిపో యాడు .ఆయన బలహీనుడి చేతిలో ఓడిపో యే వాడేమీ కాదు .నిజానికి అతని అధినాయకుడు ఓడిపో లేదు .పైచయి
ే ఆయనంత
మాత్రా న అయిపో లేదు .పీడించే వాడు అదృశ్యమైనాడు .అది పాప కార్యం కాదు .’’ఆ తర్వాత ఇదే ధో రణిలో నారాయణ పండితుడు తన
‘’మధ్వా చార్య చరిత’్ర ’లో’’న ‘’తోనే ప్రయోగం చేశాడు .వడిరాజు ,రూప గోస్వామి ఇదే దారి పట్టి ఏకాక్షర శ్లో కాలకు పట్టా భి షేకం చేశారు
సంస్కృతం లో ..
భారవి ఛందో వైవిధ్యం తో ఎన్నో శ్లో కాలు రాశాడు కాని ఆయను ఇష్ట మైనది ‘’వంశస్థ ’’ అనే ఛందస్సు మాత్రమే .ఈ ఛందస్సు భారవి
‘’వృత్త చత్రస్య సా కాపి ‘’వంశస్థ స్య ‘’ విచిత్రతా –ప్రతిభా భారవేర్యేన సచ్చాయే నాధికీ కృతా’’’’
శక్తి వంతమైన శబ్ద ప్రయోగం చేశాడు భారవి .ఏ పాత్ర ఎలా మాట్లా డాలో అలానే మాట్లా దించటం భారవి గొప్ప తనం .లోకోక్తు లు, నీతులు
సందర్భాన్ననుసరించి వాడాడు .వీరరస కావ్యం కనుక దాన్ని బాగా పో షించాడు .అది భారవి అభిమాన రసం కూడా .అర్ధా ంతర న్యాసాలం
కారాలతో లోక జ్ఞా నాన్ని కలిగిస్తా డు .1050 శ్లో కాలున్న ఈ కావ్యం లో 115 లో అర్దా ంతారా లంకారాలే ఉన్నాయి .
అర్ధ గౌరవం
భారవి అంటే ‘’అర్ధ గౌరవం ‘’అన ముందే చెప్పుకొన్నాం .తక్కువ మాటలలో ఎక్కువ అర్ధా న్ని చెప్పటమే అర్ధ గౌరవం ..ఇంగ్లీష్ లో ‘’బ్రివిటి
‘’అంటారు .దర్శనాలలో ,ధర్మ శాస్త్రా లలో సూత్రా లలో తక్కువ శబ్దా లలో ఎక్కువ భావం ఉండేట్లు చెప్పారు .అదే భారవి పాటించాడు కావ్యం
లో .అంటే కావ్యానికి శాస్త ్ర గౌరవ స్థా యి కల్పించాడు .ఈ లక్షణం మన తిక్కన గారిలో కనిపిస్తు ంది .’’అల్పాక్షరాల్లో అనంతార్ధ ం ‘’అంటే ఇదే
.భారవి ఇలా శబ్దా ర్ధా ల్ని సమతూకం లో వాడటం వలన కావ్య సౌందర్యం హెచ్చింది .శబ్దా నికి ఓజో గుణాన్ని చేర్చాడు .మనుష్యుల కావ్య
‘’స్తు వంతి గుర్వీ మభి దేయ సంపదం విశుద్ధి ముక్తేరపరే విపశ్చితః –ఇతి స్స్థితాయాం ప్రతి పూరుషంరుచౌ సుదుర్ల భాఃసర్వ మనోరమా గిరః
‘’అన్నాడు –అంటే ‘’కొదరికి అర్ధ సంపత్తి ఇష్ట ం .కొందరు శబ్ద సంయోజనం కోరుకొంటారు .ఇలా మనుష్యులు భిన్న రుచులను కోరుతారు
.అందరి మనస్సులనే ఆకర్షించే కవిత్వం రాయటం సులభం కాదు ‘’.ఓజస్సు, ప్రసాద గుణాలతో కవిత్వాన్ని రంజింప జేశాడు ..’’వికట కవి
‘’శబ్ద ం లో ఎటునుంచి అయినా అదే మాట వచ్చినట్లు ఒక తమాషా శ్లో కమే రాశాడు .’’దేవాకాని నికావా దే-వాహికస్వ స్వకా హి వా .-కాకా రే
భాభా రేకాకా –ని స్వభ వ్యవ్య భ స్వ ని ‘’పాదాలను మార్చినా వెనక్కి నడిపించినా అలాగే రావటం గొప్ప ప్రక్రియ .దీని అర్ధ ం –మానవా !
యుద్ధ ం ఎవరికి కావాలి?ఈ యుద్ధ భూమి దేవతలకూ ఉత్సాహమిస్తు ంది .ఇక్కడ పో రాటాలు జరుగుతాయి .త్యాగాలు ఇతరులకోసం
చేసుకొంటారు .ఈ భూమి మదించిన ఏనుగులతో ,జంతువులతో నిండి ఉంది .యుద్ధ ం అంటే ఇష్ట ం ఉన్నా లేకపో యినా ఈ యుద్ధ క్షేత్రం లో
పారాదక తప్పదు .మన తెలుగు కవులూ ఈ ప్రయోగాలు బాగానే చేశారు .మరొక గొప్ప శ్లో కాన్ని గమనిద్దా ం –‘’వికాస మీ యుర్ జగదీశ
మార్గ ణా వికాస మీ యుర్ జగతీశ మార్గ ణః-వికాస మీ యుర్ జగదీశ మార్గ ణా వికాస మీయుర్ జగతీశ మార్గ ణః ‘’-దీని అర్ధా న్ని అవలోకిద్దా ం
–జగదీశుడైన అంటే రాజు అయిన అర్జు నుని బాణాలు విస్త రిస్తు న్నాయి .అలాగే జగతీశ్వరుడైన అంటే లోకేశ్వరుడైన శివుని బాణాలూ
వ్యాపిస్తు న్నాయి .ప్రమాద గణాలు అండ కోలాహలం చేస్తు న్నారు .శివార్జు న యుద్ధా న్ని ఆసక్తిగా తిలకించటానికి ఆకాశం లో దేవతలు
ఇంకొక శ్లో కం లో ‘’స్థ ల నళినుల నుంచి రేగిన పుప్పొడి గాలి చేత ఎగర గొట్ట బడి ఆకాశం లో ఒక వలయాకారం గ వ్యాపించిందిట .అది
బంగారు దారాలతో అల్ల బడిన’’ ఆతపత్రం’’ అంటే గొడుగు లాగా శోభాయ మానం గా ఉందట .పరమ రమణీయ భావన ఇది .దీన్ని మెచ్చిన
కిరాతార్జు నీయం ప్రతి సర్గ లోని చివరి శ్లో కం లో భారవి కవి ‘’లక్ష్మి ‘’శబ్దా న్ని ప్రయోగించాడు అందుకే దీనికి ‘’లక్ష్మంత కావ్యం ‘’అనే
పేరొచ్చింది .ఇలాగే హర్షు డు సర్గ చివరి శ్లో కం లో ,ఆనంద శబ్దా న్ని ప్రయోగించాడు మాఘుడు శిశు పాల వధను ‘’శ్ర్యంత ‘’అంటే శ్రీ అంతం
గా ఉన్న కావ్యం అన్నారు .నైషధాన్ని ‘’ఆనందాంత’’కావ్యమన్నారు .భారవి కిరాతార్జు నీయం లోని కవితా సౌందర్యాన్ని తెలియ జేయటానికి
అనేక మంది ప్రయత్నించారు .మల్లినాధుని వ్యాఖ్యానం తో బాటు 36 వ్యాఖ్యానాలున్నాయి దీనికి. ‘’ప్రకృతి మధురా భారవి గిరిః’’అని ఒకకవి
ప్రశంసించాడు .
ఈ కావ్యం లో రాజనీతి ఎక్కువ. ఇలా ఉన్న కావ్యాలలో ఇదే మొదటిది .రాజాస్థా నం లో మంత్రి గా ఉండబట్టే దీన్ని ఇలా
రాయగాలిగడని ఊహిస్తా రు .ద్రౌ పది తో చెప్పించిన సంభాషణలు చాలా అర్ధ గౌరవం తో కర్త వ్య నిర్దేశకం గా ఉంటాయి. స్త్రీ ఆబల కాదు సబల
అని నిరూపిస్తా డు కవి .సకల సద్గు ణ సమేతుడిగా కదానాయకుడైన ఆర్జు నుడిని భారవి చిత్రీకరించి కావ్య గౌరవాన్ని పెంచాడు .’ భారవి
బాటలో నడిచిన మాఘ మహా కవి శిశుపాల వధ కావ్యం లో ఇంకొంచెం విజ్రు మ్భించి ఇరవై మూడు రకాల ఛందస్సులు వాడాడు .భారవి
శివుడిని ఆరాధిస్తే మాఘుడు విష్ణు ఆరాధకుడు .భారవికావ్యాన్ని జర్మని భాషలోకి మొదట అనువాదం చేసిన వాడు కారల్ కాపెల్లర్ .హార్వర్డ్
ఓరిఎంటల్ సిరీస్ ద్వారా ముద్రింప బడింది .ఆరడజను రకాల ఆంగ్ల అనువాదాలు వచ్చాయి .’శ్రీనాధ మహాకవి కిరాతార్జు నీయ సంస్కృత
కావ్యాన్ని తెలుగులోకి అనువదించి గొప్ప ప్రచారం తెచ్చాడు అందులో ప్రతి పద్యం రస గుళికయే.... జయన్తి తే సుక్రు తినో రస సిద్దా ః
కవీశ్వరా’’.
మొదటి శ్లో కం –‘’శ్రియః కురూణామదిపస్య పాలం –ప్రజాసు వృత్తి ంయమయంక్త ్య వేదితుం
మాయాజూదం లో కౌరవుల చేత ఓడిం ప బడిన ధర్మరాజు ద్వైతవనం నుంచి ,దుర్యోధనుడి పాలనా విధానం ఎలా ఉందొ తెలుసుకొని
రమ్మని ఒక వనచరుడిని పంపగా అతడు బ్రహ్మచారి వేషం లో తిరిగి దుర్యోధన పాలనా విధానం అంతా ఆకళింపు చేసుకొని యుదిస్టిరు నికి
వివరించటానికి వచ్చాడు .
ధర్మరాజుకు నమస్కరించి ‘’ప్రభూ !మీ శత్రు వు దుర్యోధనుడు భూమి అంతా ఆక్రమించి ,ప్రజాను రంజకంగా పాలన చేస్తు న్నాడు
.ప్రజలుకూడా చాలా ఆనందంగా ఉన్నారు .మీ సో దరుల ఊసు కూడా ఎత్త నీయకుండా రాజు వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తు న్నాడు
.కనుక ప్రజలలో దుర్యోధనభక్తి పెరిగిపో యింది .ఇవన్నీ మీకు అప్రియాలే అయినా స్వామి మంచికోరి నేను ఏ మాత్రం సంకోచించకుండా
నివేదించాను .ముఖప్రీతికోసం అసత్యం చెప్పరాదు .అలాచేస్తే కార్య విఘాతం జరుగుతుంది కనుక కింకరులు ప్రభువు సమక్షంలో ఎప్పుడూ
--
కిరాతార్జు నీయం-2
‘’దుర్యోధనుడు భూమినంతా పాలిస్తు న్నా ,సో దరులతో అడవులలో ఉన్న మీ వలన ఎప్పటికైనా యుద్ధ ం వస్తు ందని ,మీకు సకల విధాల
సాయం అంది ,తనకు పరాజయం తప్పదని ఆలోచిస్తూ ,ప్రజలను తనపై గాఢభక్తీ విశ్వాసాలతో సహాయంగా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు
చేస్తు న్నాడు కానీ ‘నాకేం భయం ?‘’అని నిశ్చింతగా మాత్రం లేడు.అంతేకాదు కుటిలమార్గ గామి దుర్యోధనుడు మీవలన పరాభవం
కలుగుతుందని అనుమానిస్తూ నే ,ప్రజల అవసరాలు స్వయంగా తెలుసుకొంటూ ,కోర్కెలు తీరుస్తూ ,వారిలో వారికి కలహాలు వస్తే
శాంతియుతంగా రాజీ చేస్తూ ,గుణ సంపద లతో ధర్మమార్గా న రాజ్య పాలన చేసస్తూ విశేష ఖ్యాతి పొ ందాడు .దుర్జ న సావాసం కంటే తన
ఐశ్వర్యాదులకు నష్ట ం కలిగి౦పని సజ్జ న విరోధం కొంత నయమని పండితులు అంటారు కదా .కనుక దుస్ట దుర్యోధనుడు సజ్జ నాగ్రేసరుడైన
మీతో విరోధం తెచ్చుకొన్నా ,మీకంటే గొప్పవాడి నని పించుకోవటానికి దానధర్మాలు విరివిగా చేస్తూ , సజ్జ నుడు అనిపించుకొంటున్నాడు .
‘’అంతశ్శత్రు వులైన కామక్రో ధాదులను జయించుట చేత దుర్యోధనుడు ,మనువుచేప్పినట్లు ప్రజారంజకం గా పాలన చేయాలనుకొని
అలసత్వం లేకుండా ఎప్పటికేది ప్రస్తు తమో అప్పటికి అది చేస్తూ ,రాజకార్యాలను క్రమం తప్పకుండా చేస్తూ పురుష ప్రయత్నాన్ని
రాజనీత్యుక్త ప్రకారంగా విస్త రిస్తు న్నాడు .గర్వం మొదలైన దుష్ట గుణాలను దూరం చేసుకొని భ్రు త్యులకు విశేషంగా బహుమానాలిస్తూ బంధు
మిత్రు లను అధికంగా సమ్మానిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకొంటున్నాడు .అందుచే సేవకులు రాజే తమ దైవమని భావిస్తూ తమమాన
ప్రా ణాలను సైతం లెక్క చేయకుండా తమపనులను తాము అత్యంత వినయ విధేయతలతో అంకిత భావం తో చేస్తు న్నారు .దుర్యోధనుడు
ధర్మార్ధ కామాలకు భంగం కలుగకుండా కాలవిభజన చేసి ,సమాన ప్రతిపత్తి తోసేవించటం చేత మంత్రివర్గ ం కూడా ఆయన గుణాలకు ఆకర్షితమై
అనురాగం తో పరస్పర మైత్రి తో వృద్ధి పొ ందింది ‘’అంటూ ఇంకా చెప్పసాగాడు .
సశేషం
కిరాతార్జు నీయం -3
వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రో ధంగా చూడటం చేయకుండా విజ్ఞు లకు తెలియ జేసి వారికి నేరవిషయాలు తెలిపి
న్యాయశాస్త ప
్ర రంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తు న్నాడు .దీనితో
ప్రజలకు మరీదగ్గ రై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తు న్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం లో, శత్రు
రాజ్యాలలో సమర్ధు లైన చారులను నియమించి విషయాలను కూపీ లాగిస్తూ ,ఎవ్వర్నీ నమ్మకుండా అందరి వాడు గా కనిపిస్తూ శత్రు వులలో
పరస్పర భేదాలేర్పడేట్లు చేసి ,చారులు అప్పగించిన కార్యం విజయవంతంగా నిర్వహిస్తే ఊహించని రీతిలో బహుమానిస్తూ ,వారికి అపరిమిత
సంతోషం కలిగిస్తూ తన యడల ఇంకా ఎక్కువ విశ్వాసం తో ప్రవర్తి౦చేట్లు చేస్తూ చాలా నిశ్చింతగా ఉన్నాడు .ఒకదానిబదులు మరోటి
చేయకుండా చాలా జాగ్రత్తగా ,సామదానాదులు ప్రయోగిస్తూ ఏ పనీ బీరుపో కు౦డా సఫలమయేట్లు చేయటం వలన కుప్పలు తెప్పలుగా
ధనం వచ్చి చేరుతోంది .ఎక్కడా వివాదాలు లేకపో వటం తో రాజులందరూ అత్యంత భక్తి, విశ్వాస, విధేయతలు చూపిస్తు న్నందున తనకు ఇక
ఎదురు లేదని విజయం ఎప్పుడూ తనదే అని గొప్ప విశ్వాసం లో ఉన్నాడు .అడగకపో యినా రాజులు మదపు టేనుగులు, గుర్రా లను భారీ
సంఖ్యలో కానుకలుగా సమర్పిస్తు న్నారు .ఏనుగుల మద జలస్రా వం తో కొలువు కూటం తడిసిపో యి బురదగామారి ,రాకపో కలకు ఇబ్బంది
అవుతోంది .ఇలా సమస్త రాజన్యసమూహం అతని అడుగులకు మడుగులొత్తు తూ, వీర విధేయత ప్రకటిస్తు ౦డటంతో దుర్యోధనుడు
ఏకచ్చత్రా దిపత్యం గా,నిరాఘాటంగా పాలన సాగిస్తు న్నాడు .
‘’ప్రభూ! దుర్యోధనుడు చెరువులు త్రవ్వించి నదులకు ఆనకట్ట లు కట్టించి కాలువలద్వారా భూములకు నీరు సరఫరా చేయిస్తూ రైతులకు
కూడా ఆనందం పంచి పంటలు ఎక్కువగా పండేట్లు చేయటం తో అనావృస్టి ,దుర్భిక్ష బాధ లేదు .పాడికూడా సమృద్ధిగా వృద్ధి చేసి రైతన్నల
హృదయాలనూ దో చుకొన్నాడు .పాడిపంటలతో కర్షకులు ఎంతో తృప్తి చెంది, రాజుకు మరింత విధేయులుగా ఉన్నారు .
భూత దయతో ,ఈతి బాధలు లేకుండా దేశాన్ని సంరక్షిస్తూ ,అభివృద్ధి చేస్తూ , మహా యశస్సుతో కుబేర సమానంగా అలరారే దుర్యోధనుని
దయా దాక్షిణ్య గుణాలచేత భూమి వాత్సల్యం తో స్వాదీనయై ప్రతి ఏడూ అనంత ధన రాసులనిస్తో ంది .ఈ ధనాన్ని ప్రజోపకార కార్యాలపై
భారీగా ఖర్చు పెడుతున్నా,అతని సంపద తరగటం లేదు .మహదైశ్వర్యం తో పాలించే అతన్ని చూసి ప్రజలు చెప్పిన పనులు చేస్తూ ఇంకా
ఎక్కువ విధేయంగా,దాసాను దాసులుగా ఉంటున్నారు
కిరాతార్జు నీయం-4
ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞ ను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు
ఎక్కు పెట్టటంకాని ,కోపం తో ముఖం చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తు న్నారు .రాజు మనసులో అనుకొన్న పని
అతిశీఘ్రంగా నెరవేరుస్తు న్నారు .
నవయవ్వన గర్వితుడైన తమ్ముడు దుశ్శాసననుడినకి యౌవ రాజ్యపట్టా భి షేకం చేసి , ,రాజకీయాలన్నీ అప్పగించి తనకు ఎలాంటి
తొందరలు లేకుండా పురోహితుని అనుమతితో అగ్నిని, దేవతలను సంతృప్తి పరుస్తూ ,బ్రా హ్మణులకు మృష్టా న్న భోజనం , సమృద్ధిగా
దక్షిణలతో మానసిక సంతృప్తి కలిగిస్తూ ,ఉభయ తారకంగా చాలా క్రతువులు నిర్వహిస్తూ బ్రా హ్మణ, పురోహిత,పండితులనూ తనవైపుకు
త్రిప్పుకొని పూజి౦ప బడుతున్నాడు .’’అని చెప్పి ఇవన్నీ ధర్మరాజు మనసుకు సందేహం కలిగిస్తా యేమోనని భావించి దాన్ని పో గొట్టే
ప్రయత్నంలో మళ్ళీ చెప్పటం ప్రా రంభించాడు –‘’ప్రభూ !హాయిగా రాజ్యం చేస్తు న్నా అనుక్షణం కలవరపడుతూ ,ఎప్పుడు మీరు వచ్చి
మీదపడుతారో అనే భయంతో గుండెమీదచేయ్యేసుకొని నిద్రపో కుండా ఉంటున్నాడు దుర్యోధనుడు .బలవద్విరోధం ఎంతటివాడికైనా దుఃఖ
హేతువే కదా మారాజా !కనుక మీరు ఏమాత్రం సందేహించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయాలి .
సభలో ఉన్నా ఇస్టా గోస్టిలో ఉన్నా మీపేరు వినిపించినా ,మహా పరాక్రమశాలి అర్జు నుని పరాక్రమం గుర్తు కు వచ్చినా ,విష వైద్యుడు గారుడ
మంత్రో చ్చాటనం చేసినప్పుడు నాగుపాము తలవంచి కదలక మెదలక కట్టు బడి ఉన్నట్లు ,పాల్పోయిన ముఖంతో గజగజలాడుతూ
తలవంచుకొని దుఖపడటం ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాను .కనుక మీ ప్రయత్నం మీది .మరో ముఖ్యవిషయం మారాజా !మీవిషయం లో
అనేక దుస్త ంత్రా లు పన్నే కపట డుర్యోధనుడి విషయం లో మీ ప్రతిక్రియ అత్యంత శీఘ్రంగా జరగాలి .జనం నోటిమాటలు విని మీకు
చెప్పటమే మా పని .ప్రతిక్రియతీరు తెన్నులు మీరు ఆలోచించాలి ‘’అని చెప్పగా యుదిస్టిరుడు తగిన పారితోషికమిచ్చి పంపించి ,ఇంటికి చేరి
తనకోసం ఎదురు చూస్తు న్న భీమాదుల పక్షాన వనచరుడు చెప్పిన సమస్త విషయాలు ద్రౌ పదికి వివరించి చెప్పాడు –
ధర్మరాజు చెప్పిన విషయాలు విన్న ద్రౌ పదికి జుట్టు ముడి వేసుకో కుండా ఉండటం మొదలైన విషయాలు జ్ఞ ప్తికి రాగా ,అణచుకోలేక
,ధర్మజుడికి కోపం తెప్పిస్తే కాని శత్రు సంహార కార్యక్రమం మొదలు పెట్టడు అని భావించి,దానికి తగినవిధంగా పలకటం ప్రా రంభించింది .
‘’మీలాంటి పండితులను వినియోగించటానికి స్త్రీలు తగరు.ఒకవేళ వినియోగిస్తే అది తిరస్కరి౦పబడుతుంది. వ్యవహారాలలో స్త్రీలు జోక్యం
చేసుకోవటం ధర్మ విరుద్ధ మే అయినా ,స్త్రీల ఆచారాలను ఉల్ల ంఘింప జేసే దుష్ట మనోవ్యధలు నన్ను ఊరుకోనీ కుండా నాకు తోచినమాటలు
చెప్పమని ప్రేరేపిస్తు న్నాయి .కనుక నే చెప్పేది సావధానంగా వినమని మనవి .దుఃఖంలో ఉన్నవారికి ఉచితానుచితాలు కనిపించవు .కనుక
నేను చెప్పేమాటలు దో షాలైనా శాంతంగా ,సావధాన చిత్త ం తో ఆలకించండి ‘’అని చెప్పటం ప్రా రంభించింది .
కిరాతార్జు నీయం-5
ద్రౌ పది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం
అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ
ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టా లుకలిగాయి .ఈ అనర్దా లన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని రక్షింఛి మీ పూర్వుల
ఔన్నత్యం కాపాడమని మనవి .ఇందులో నా తప్పేముంది అని అనుకొంటున్నావా .మాయావులైన శత్రు వులు మాయోపాయాలు
పన్నుతుంటే ,ప్రతి మాయలు పన్నకుండా రుజుమార్గ ం లో వెళ్ళే అవివేకుల్ని శత్రు వులు పరాభవి౦చరా .కవచం లేకుండా యుద్ధా నికి వెళ్ళే
వీరభటుడికి వాడి బాణాలు తగిలినట్లు ,మాయావులు అమాయకులను చేరి చంపుతున్నారు .కనుక వారికి మాయతోనే సమాధానం
చెప్పాలి .ఉపేక్ష నీ దో షం .అనుకూలుర సాయం ,క్షత్రియత్వాభిమానం ఉన్న మహారాజులలో నువ్వు ఒక్కడివే వంశపారంపర్యంగా వచ్చిన
రాజ్యలక్ష్మిని పవిత్ర వంశం లో పుట్టిన సౌందర్యవతి ఐన భార్యను స్వయంగా శత్రు వులపాలు చేశావు .మాన ధనులకు రాజ్యలక్ష్మి అపహరణ
కళత్ర అపహరణ లాగా అవమానం కనుక ఉపెక్షించక ప్రతిక్రియ ఆలోచించు ..ఇలాంటి ఆపత్కాలం లో కూడా శూరులు పొ గిడే పౌరుషమార్గ ం
వదిలి ,పిరక
ి ి వాళ్ళు ఆశ్రయించే దైన్య పధ్ధ తి పాటిస్తూ క్షాత్రతేజం విస్మరించి దుర్దశ పాలై ,నువ్వుకస్ట పడుతూ ,మమ్మల్నీ కష్టా లపాలు
చేస్తు న్నావు .శత్రు వుల అభి వృద్ధి వినీ ,మా కస్టా లు చూసికూడా నీకు కోపం చెలరేగి ఎండిన జమ్మి చెట్టు ను నాలుగు వైపులనుంచి
అగ్నిజ్వాలలు కమ్మి దహించినట్లు నిన్ను భస్మం చేయాల్సి౦దేకాని ,మా దురదృష్ట ం వలన నీకుకనీసం కోపం కూడా రావటం లేదు .
‘’అవంధ్య కోపస్య నిహంతురాపదాం-భవంతి వశ్యాస్స్వయమేవదేహినః
సఫలమైన కోరికకలిగి నిగ్రహానుగ్రహ సమర్థు డైన పురుషునికి ప్రజలు తామంతట తామే స్వాదీనమౌతారు .కోపం లేని వాడితో స్నేహమైనా
విరోధమైనా ప్రీతికాని భయంకాని కలగదు .అవసరాన్నిబట్టి కోపం, శాంతి ప్రదర్శించటం శూరలక్షణం .శూరోచితమార్గ ంలో మమ్మల్ని
ఉద్ధ రించు .కాని క్రో ధం అంతశ్శత్రు వు కనుక విడువ దగినది అని సందేహించ వద్దు .
నువ్వు రాజ్యం చేస్తు ంటే వీరగంధం పూసుకొని రథాలెక్కి మహాపట్ట ణాలలోసంచారం చేసే భీమసేనుడు ఇప్పుడు పాదచారియై ,ధూళి
ధూసర శరీరం తో పర్వతాలమధ్య దైన్యంతో తిరుగుతున్నాడు .అతన్ని చూసి అయినా పరితాపం కలగటం లేదా ఇంకాసత్యపాలనమేనా
.కనీసం తమ్ముల నైనా రక్షించు .పరాక్రమాదులలోదేవే౦ద్రు నితో సమానుడు ,మనుష్యులు ప్రవేశించలేని ఉత్త ర కురు దేశ౦లొ ప్రవేశించి,
రాజులను జయించి ,సువర్ణ , మణి,ముక్తా దులను కప్పంగా తెచ్చి నీపాదలవద్ద ఉంచి భక్తితో పూజిం చిన అర్జు నుడు ఇవాళ రూప
విహీనుడై అడవులలో తిరుగుతూ ,నీకు నారచీరలు తీసుకొచ్చే దుర్ద శలో ఉన్నాడు .అతన్ని చూస్తు ంటే నాకు కలిగే జాలి, నీకు కలగటం లేదా
.మగాడివైపుట్టి దిక్కులు చూస్తూ ఉన్న నిన్నుఏమనాలో తెలియటం లేదు .హంసతూలికా తల్పాలపై హాయిగా నిద్రించాల్సిన సుకుమార
శరీరులు నకుల సహదేవులు ,అడవులలో నేలమీద పడుకొనటం వలన మార్ద వం పో యి వారి శరీరాలు కఠినమై,మట్టికొట్టు కుపో యి ,శరీర
సంస్కారంలేక అడవిఏనుగుల్లా గా కృశించిపో యారు .వాళ్ళను చూస్తూ కూడా నీ సత్యవాక్పరిపాలన ,సంతోషం నశించకుండా ఎలాఉన్నాయో
నాకు ఆశ్చర్యంగా ఉంది.అహో ఏమి ధైర్యం మహారాజా నీది !నీలాంటి అన్నగారు ఏ కాలంలోనూ ఉండి ఉండరు .
వీళ్ళందర్నీ వదిలేయ్.నీ సంగతి చూడు .ఇలాంటిపరిస్థితి లోనూ నీ బుద్ధిమారటం లేదు .అసలు నీ మనసులో ఏముందో బ్రహ్మ దేవుడికే
తెలియాలి .పో నీ నా బుద్ధితో నీ చిత్త వృత్తి ని ఆలోచిడ్డా ము అంటే ,పరుల బుద్ధు లు అప్రత్యక్షాలుకనుక ,ధీరత్వ అధీరత్వాదులు అనేక
రకాలుగా ఉండటం వలన అనుమాని౦చటానికికూడా శక్యం కాక ఊహించటం దుర్ల భమౌతోంది .శత్రు వుల చే నీకు కలిగిన పరాభవం, ఆపద
లను ఎలాదాటాలి ,శత్రు వుల్ని ఎలా చంపాలి అనిఆలోచించే నాకే తీరని దుఖం కలుగుతుంటే ,నువ్వు యెట్లా ఈబాధల్ని భరిస్తు న్నావో అర్ధ ం
కావటం లేదు .నీది గుండే నా , రాతిబండా అని అనుమానం వస్తో ంది ‘’అని నిర్మొహమాటంగా సూటిగా పాండవులందరి వేదనా బాధా తానే
ధర్మరాజుకు చెప్పి కర్త వ్యమ్ బో ధించింది భావి పాండవ పట్ట మహిషి ద్రౌ పదీదేవి .దీనికి అయ్యగారిసమాధానం ఏమిటో తర్వాత తెల్సుకొందాం
.
కిరాతార్జు నీయం-6
ద్రౌ పది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌ పదీ !
నువ్వు ఇంతగా విచారి౦చటానికి కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధ ంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను
.నువ్వు ఇదివరకు అంతః పురం లో హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు స్తు తి గీతాలు పాడుతూ ,మంగళధ్వనులు
వినిపిస్తు ంటే మహా రాజ ఠీవి తో నిద్ర లేచే నువ్వు ,ఘోరారణ్య౦ లో కటిక నేలలపైనిద్రిస్తూ ,అమంగళకారకాలైన నక్కకూతలే
మేలుకోలుపులుగా నిద్రలేస్తు న్నావు .ఇంతకంటే ఆపద వేరేదైనా ఉందా .ఆలోచించు .’’అనగా ఆమె ‘’పూర్వం వేలాది బ్రా హ్మణులకు
ఇష్ట మృస్టా న్నాలు పెడుతూ దానధర్మాలు చేస్తూ ,నీకంటే నిరతాన్నప్రదాత వేరొకరు లేరన్నఖ్యాతిపొ ందిన నీవు అడవుల్లో ఆకులు అలములు
తింటున్నావు ,పూర్వం బ్రా హ్మణ భుక్త అవశిస్టా న్నం భుజించి శరీరం వన్నెలతో ఉండేది .ఇప్పుడు నీ కీర్తిలాగానే శరీరం శుష్కింఛి పో యింది
.కనుక నీ శరీరం నీ యశస్సులపై అభిమానంతో మళ్ళీ ఆ వైభవం పొ ందే ప్రయత్నం చేయి.లేకపో తే రెండూ క్షీణిస్తా యి .అపకీర్తి మరణం కంటే
ఎక్కువ కాబట్టి కోపం తెచ్చుకొని శత్రు సంహారం చేసి పూర్వపు ఔన్నత్యం పొ ందు .పూర్వం ఎందరో రాజులు అనేక కానుకలు తెచ్చి నీ
అనుగ్రహం పొ ందటానికి పాదాలపై వ్రా లినప్పుడు వారిహారలలోని పుష్పఆపరాగం చేత రంజి౦పబడే నీపాదాలు ఇప్పుడు ఘోరాటవుల్లో
బ్రా హ్మణులు మృగాలు తెంపిన దర్భల కర్కశ చివళ్ళపై ఉంచాల్సి వస్తో ంది .ఇంతకంటే గొప్ప ఆపద ఎవరికైనా వచ్చిందా . మనుషులకు
ఇలా౦టిఆపదలు సహజం .దైవికంగా ఏదో ఆపద వస్తు ంది దానికి బాధ పడకూడదు .ఈ ఆపదలలో శత్రు పరాభవం ఉండడుకనుక
సంతోషంగానే ఉంటాయి. కాని మనకొచ్చిన ఆపద మానభ్నగమై శత్రు వులవలన కలిగాయి .యుద్ధ ం లో ఓడితే వచ్చినవికావు .పౌరుష
ప్రసక్తి లేకుండానే వచ్చాయి కనుక దుస్సహంగా ఉన్నాయి మానహాని దుస్సహం కాని ఆపదలుకాదు .కనుక ఊరుకోకుండా ప్రతిక్రియ
చేయాల్సిందే .నాదా!నువ్వు చెప్పింది నిజమేకాని ఏమి చేయాలో చెబుతావిను .పౌరుషమున్నమహారాజులు శాంతిమార్గ ం వదిలి ,ఉత్తేజకర
మైన క్షాత్ర తేజస్సుతో శత్రు సంహార ప్రయత్నం చేయి. బ్రతిమాలుతున్నాను మా యందు దయతో మా కోరిక నెరవేర్చు .శాంతంగా
సాదిస్తా నంటే కుదరదు మహర్షు ల మోక్షమార్గా నికి శాంతికాని రాజకార్య సాధనకు కాదు .క్షత్రియోచిన పౌరుషంతో ప్రతిక్రియ చేయి .-
‘’క్షత్రియోచిత తేజం మాకు లేదని అనటానికి వీల్లేదు .మీరు మహా తేజ శ్శాలురలో అగ్రేసరులు.యశోధనులైన మీ బో ంట్లు క్షత్రియ పౌరుషం
చూపాలేకాని శాంతంకాదు.శత్రు సంహారం తో సర్వాదిపత్యం సాధించు .ఉదాశీనత వదిలేయి .నేను చెప్పింది ఇష్ట ం లేక నీ శాంతిమార్గ మే
మేలు అనుకొంటే ,రాజచిహ్నాలైన ధనుర్బాణాలు వదిలేసి జటా వల్కల ధారివై ఉదయం సాయంత్రం అగ్నిహో త్రం చేసుకొంటూ
ఉండు.ఉభయభ్రస్టు త్వం ఉపరి సన్యాసం ఎందుకు .12 ఏళ్ళు వనవాసం ఒక ఏడుఅజ్ఞా తవాసమ్ చేస్తా మని ప్రతిజ్ఞ చేశాం ప్రతిజ్ఞా భంగం
అవుతు౦దే మో అనే సందేహం వదిలేయి .ఇప్పటికే మన శత్రు వులు సమయభంగం చేసి అపకారం చేయటానికి పూనుకొన్నారు .కనుక
సమయభంగ భయం అక్కర్లేదు .పౌరుషశాలి, వివేకి ,విజిగీషుడు ఏదైనా ఒకనెపం తో సంధిని భగ్నం చేసి శత్రు వును ఉపెక్షించడు .మా
ఆపదలు పో గొట్టి కీర్తి పొ ందు .
‘’విధి సమయ నియోగా ద్దీప్తి సంహార జిహ్మం –శిధిల వాసు మగాదే మాగన మావత్పయోదౌ-
రిపు తిమిర ముదస్యోదీయ మానం దినాదౌ –దినకృత మివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః ‘’
ఇతి శ్రీ భారవి కృతౌ కిరాతార్జు నీయే మహాకావ్యే లక్ష్మీ పద లాంఛనే ప్రథమ సర్గ ః
కాలవశంలో ఆపదలు కలిగి ప్రతాపం లేక ,ధనం లేక నామరూపాలు లేకున్నా ఉన్నావు .చీకటి అనే శత్రు వును సంహరించి ఉదయాభి
ముఖంగా ,సముద్రం లో అస్త మించి కిరణ ప్రసారం లేకుండా ఉన్న సూర్యుడు ప్రభాత సమయంలో చీకట్ల ను చీల్చుకొని ప్రకాశించే విధంగా
నిన్ను లక్ష్మీ దేవి వరిస్తు ంది .ఇప్పుడు దైవం, కాలం అను కూలమై బలపౌరుష దనాలతో శత్రు వులను చీల్చి చెండాడే బలప్రతాపాలు
చూపించే సమయం వచ్చింది .కనుక శత్రు సంహారంతో దినదినాభి వృద్ధి పొ ంది మా అందరికీ ఆన౦దం, శాంతి, సుఖాలు కలిగించు ధర్మరాజా
“’అని విన్నవించింది ద్రౌ పది .
కిరాతార్జు నీయం-7
ద్వితీయ సర్గ
ద్రౌ పది ధర్మారాజుతో చెప్పినమాటలలో సారం ఉన్నదని గ్రహించి భీముడు అన్నగారితో ‘’ప్రభూ !క్షత్రియ సంజాత ద్రౌ పది మనపై ఉన్న
అభిమానంతో బాగా ఆలోచించి మన అభి వృద్ధి కోరి బృహస్పతి అయినా ఇలా పలకగలడా అన్నట్లు యుక్తి యుక్త ంగా ,సశాస్త్రీయంగా
చెప్పింది.అవి ఆశ్చర్యజనకాలు కనుక ఆమె మాటలు గ్రా హ్యాలు .అగాధమైన దిగటానికి వీలున్న తీర్ధ ము లున్నా దాని సంగతి దిగేదాకా
తెలియదు .దానిలో దిగి స్నానాదులు చేసుకోవచ్చు అని తెలిసినవారు చెప్పాక కష్ట ం ఉండదు.అలాగే రాజనీతి కూడా గాంభీర్యం తో
ప్రకాశిస్తు ౦ది కనుక దాని విశేషాలు తెలుసుకోవటం కష్ట ం గానే ఉంటుంది .విషయాన్ని స్పష్ట ంగా చెప్పే సమర్ధు లైన గురువులద్వారా
తెలుసుకొంటే తేలికగా ఉంటుంది .కాని అలాంటి గురువు దొ రకటం కష్ట ం .ఆమె దేశకాలాలకు అవిరుద్ధ ంగా మాట్లా డినట్ల నిపించినా
అలాపలకటం ఆశ్చర్యమే .మొదట్లో కష్ట ంగా ఉన్నా,విన్నకొద్దీ ఫలం ఖాయం అనిపిస్తు ంది .తేజశ్శాలురకు ఉత్సాహజనకంగా మాట్లా డింది
ద్రౌ పది .క్షీణ శక్తు లకు బాధా కరంగా ఉన్నా ,ఆలోచిస్తే గుణ గరిష్ట వాక్యాలుగా ఉన్నాయి .కించిత్ దో షం కూడా ఆమె పలుకులలో లేదు
కనుక ఆమె మాటలనే అనుసరించటం మంచిదని నా అభిప్రా యం .స్త్రీ బాల వృద్ధు లలో ఎవరు చెప్పినా అందులో మంచి ఉంటె గ్రహించాలి
లేకపో తె వదిలేయాలని పండితవాక్యం .నువ్వు గుణగ్రా హివైన పండితుడవు కనుక వింటే మంచిది ..నువ్వు సదసద్వివేకివి .అన్వీక్షికి ,త్రయి
,,వార్త ,దండనీతి అనే నాలుగిటిలో గొప్ప పాండిత్యమున్నవాడివి .అలాంటి నువ్వు అవివేకివై బురదలో పడి,బయటికి రాలేని ఆడ ఏనుగు
లాగా వ్యర్ధ ంగా పాడై పో తున్నావు .ఇది తగదు నీ పాండిత్యం వివేకం వ్యర్ధమైనాయా .వివేకం తో శత్రు సంహారాన్ని ఆలోచించు . సహాయ
సంపత్తి ,బల పౌరుషాలు లేనివారికి రావాల్సిన దురవస్థ ,ముల్లో కాలను జయించే మహాపరాక్రమవంతులు ,శత్రు సంహారంచేసే బంధుగణం
ఉన్న నీకు నికృష్ట శత్రు వులమూలం గా కలిగింది .అలాంటి శత్రు వులను ఉపేక్షించి ,పౌరుషం చూపాల్సిన సమయంలో శాంతి ప్రవచనాలు
పలుకుతూ చేతులు ముడిచి కూర్చోటం దేవతలు కూడా సహించరు.ఇప్పటికైనా మాంద్యం వదిలి పౌరుషంతో శత్రు సంహార క్రియ ప్రా రంభించి
మమ్మల్ని ఉద్ధ రించు .
బుద్ధిమంతుడు ముందుగా శత్రు వు పెరుగుతున్నాడా తరుగు తున్నాడా అని ఆలోచిస్తా డు .పెరుగుతుంటే తగిన ప్రతిక్రియతో విరగదీస్తా డు
.క్షీణిస్తు ంటే ఏప్రయత్నమూ చేయక తటస్థ ం గా ఉంటాడు .క్షయం నుంచి వృద్ధిలో ఉంటె ,ప్రతిక్రియతో శత్రు సంహారం చేయాలి .క్షయం ఇంకా
పెరుగుతుంటే ఉదాశీనుడై ఉండాలి .అంతేకాని అభివృద్ధి చెండుతున్నాడని ప్రతిక్రియ చేయటం క్షీణిస్తు న్నాడని చేయకపో వటం బుద్ధిమంతుల
లక్షణం కాదు .ఇప్పుడు మన శత్రు వు వృద్ధిలో ఉన్నాడుకనుక తక్షణం ప్రతిక్రియ చేసి సంహారం చేయాలి .ఒకవేళ తానూ, శత్రు వు క్షయం లో
ఉంటె ,విజిగీషువు దాన్ని బేరీజు వేసి ప్రయత్నం చేయాలి .తనపని వెంటనే తగ్గు తూ అవతలివాడి పని ఆలస్యంగా వృద్ధికి అనుకూ లంగా
అవుతుంటే వెంటనే ప్రతిక్రియ చేయాలి .ప్రస్తు తం మనం క్షీణదశలో శత్రు వు వృద్ధిదశలో ఉన్నాం .ఇలాంటి స్థితిలో ఏమీ తెలియని
బాలుడుకూడా ప్రతిక్రియ ఆలోచిస్తా డు .మనం ఇది సమయం కాదని కూర్చుంటే మూర్ఖు లు అంటారు కనుక త్వరగా నిర్ణ యం తీసుకో .
శత్రు వు పెరుగుతున్నా ఉపేక్షిస్తూ ఉంటె వాడి సంపదలు ,లక్ష్మి వాడిని వదిలి ఉత్త ముని చేరుతాయి .కనుక బుద్ధిమంతుడు శత్రు వృద్ధి
సాగనీయక ఔరుషంతో నిర్మూలి౦చాల్సిందే కాని ఉపేక్షించి ఊరుకోరాదు .ప్రస్తు తం క్షీణ దశలో ఉన్నా ,సర్వలోక కల్యాణదాయకమైన శత్రు
సంహారం క్రమ అభి వృద్ధికోసం చేసే రాజు ను పాడ్యమినాటి చంద్రు నిలాగా ప్రజలు నమస్కరిస్తా రు .క్షీణం లో ఉన్నాం కదా ఎలా చేస్తా ం అని
ఆలోచి౦చ రాదు .క్షాత్రము,ఉత్సాహ శక్తి ఉంటె ,పౌరుషం పొ ంగి శత్రు వులు మనవైపు చూడటానికి కూడా భయపడుతారు .అంగబలం
,అర్ధ బలం ,సంపద ,దేశకాల విభాగం,వినిపాత ప్రతీకారం, కార్య సిద్ధి అనే అయిదు అంగాలను బాగా ఆలోచించి మంత్రా ంగం నడిపితే విజయ
సిద్ధి తప్పదు .దీనికి దైవ శక్తి తోడవుతుంది .పౌరుషం తో ఉత్సాహ శక్తి తో ముందుకు నడిస్తే విజయలక్ష్మి తానె వరించి వస్తు ంది .కనుక
మహారాజా నిరుత్సాహం వదిలి ఉత్సాహం తో పౌరుషాన్ని రగుల్కొలిపి కార్యోన్ముఖుడవు కావలసినదని మనవి ‘’అని ఇంకా
చెప్పబో తున్నాడు భీముడు .
కిరాతార్జు నీయం-8
పౌరుషహీనుడికి అనర్ధా లు ఒకదానిపై ఒకటి దాపరిస్తా యి .నిరుద్యోగికి పౌరుషహీనుకి సంపదలు నిలవవు .సమయం కోసం ఎదురు
చూడటం నిరర్ధ కం .కపటబుద్ధి కి రుజుమార్గ ప్రవర్త న ఉండదు .13 ఏళ్ళుగా అనుభవిస్తు న్న ఐశ్వర్యాన్ని వదులుకొనే బుద్ధిహీనుడుకాడు
మనశత్రు వు .యుద్ధ ం చేయకపో తే మన రాజ్యం మనకు ఇవ్వడు ,ఎప్పుడో చేయటం కంటే ఇప్పుడే యుద్ధ ం చేసి మనరాజ్యం
దక్కించుకోవాలి .ఒక వేళ తనే దుర్యోధనుడు మనకు రాజ్యమిస్తే అప్పుడు మహాపరాక్రమవంతులైన నీ సో దరులకు పని ఉండదు .పో నీ
దానికీ ఒప్పుకు౦దా మంటే ,క్షత్రియులు క్షాత్రం చేతనే రాజ్యం సాధించాలి కాని దయా ధర్మ భిక్షతో కాదుకనుక యుద్ధ పయ
్ర ట్నం చేయి
.మృగరాజు స్వయంగా మదపు టేనుగును చంపి తింటు౦ది కాని ,ఇతరజ౦తు వులు చంపిందాన్ని తినదు .అలాగే మహాపురుషుడు
తనపురుశకార్యంతోనే దేనినైనా సాధించి అనుభవించాలి .కాని సామం పనికి రాదు .మనం శూరులం అని మరువ రాదు .యుద్ధ ం లో జయం
మనదేఅని చెప్పలేముకూడా .యుద్ధ ంవలన అనేక నష్టా లు కలుగుతాయి .తేజస్వికి మానరక్షణప్రదానంకాని ,రాజ్య సంపదకాదు .రాజ్యం
రావచ్చు ,పో వచ్చు కాని శత్రు వును బ్రతిమాలితే మానం పో తుంది .లక్ష్మి చంచలం యశస్సు స్థిరం .స్థిరకీర్తికి ప్రా ణాలను కూడా లక్ష్యపెట్ట
రాదు .కనుక యుద్ద ంచేసి మాన సంరక్షణ చేసుకోవాలిమన౦ .కాలని బూడిదను కాలితో తొక్కినట్లు మండే నిప్పును తొక్కలేం ,అలాగే
మానహీనుడిని తేజస్సు లేనివాడిని లోకం గౌరవించదు .ప్రా ణ, మానాలలో మానం ముఖ్యం .కనుక శూరోచితమార్గ ం ఎన్నుకొని
ప్రయత్నించు. ప్రయోజనం ఆశించకూడదు .ప్రయోజనం లేకపో యినా సింహం ఉరిమే మేఘం పై ఉరుకుతుంది .అదిగొప్పవారిస్వభావం
.శత్రు సంహారం పరమ పురుషార్ధ ం. ప్రా కృత మార్గ ం లో నడవటం వివేకి విధానం కాదు ‘’అని ఇంకా చెబుతున్నాడు అపర మనుధర్మ
శాస్త వ
్ర ేత్తలాగా అపర చాణక్యుడిలా భీముడు .
కిరాతార్జు నీయం-9
భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రు వు ఆపదలపాలై ఉండే వాడు
.నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రా లులాగా నీ సో దరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని
ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి ఉండటం వలన నీలో క్రో ధాగ్ని రగిలే ఉంది .దానితో
శత్రు వులను దహించి వారి భార్యలకు వైధవ్యం కలిగింఛి ప్రతిస్ట పొ ందు ‘’అని కోపో ద్రేకాలను ఆపుకోలేక పలికినపలుకులను విని ధర్మరాజు
మదగజాన్ని వశపరచుకొనే మావటీడు లాగా శాంతవచనాలతో శాంతపరచే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నాడు –‘’రాజకీయం అంతా దట్టించి
మంచి ఉపన్యాసమే ఇచ్చావు నీవాక్ ప్రపంచంలో నిర్మలమైన నీ బుద్ధి నిర్మలమైన అద్ద ంలో లాగా ప్రతిఫలిస్తో ంది .ఇంతటి వాక్ వైశద్యం నీకు
ఉందని నాకిప్పటిదాకా తెలీదు .నాకు గర్వ౦ గా కూడా ఉంది నిన్ను చూస్తె .పునరుక్తి లేకుండా మహాబాగా సూటిగా స్పష్ట ంగా చెప్పావు .నీ
వాక్ నైపుణ్యం మెచ్చదగిందే .శాస్త్రా నికి అనుకూలంగా చెప్పేటప్పుడు యుక్తి చూపించటం ,యుక్తికి అనుకూలంగా శాస్త్రా న్ని చూపించటం
దుస్సాధ్యం .అప్పటికప్పుడు శాస్త ం్ర యుక్తిలకు విరోధం లేకుండా మాట్లా డటం చాలాకష్ట ం .మహా క్షాత్రవంతుడవుకనుక నీకే ఇది తగింది
.ఇంతబాగా చెప్పినా నీ మాటలలో సిద్ధా ంతం లేదని పిస్తో ంది .చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచి౦ చేవరకు నీవాదన సమంజసం కాదనే అని
పిస్తో ంది .
ఆలోచించకుండా ఏ పనీ తొందరపడి చేయకూడదు .అలాచేస్తే లాభం లేకపో గా ఆపదలు వస్తా యి .బాగా ఆలోచించి చేస్తే కార్యసాఫాల్యం కలిగి
ధనవ్యయం శరీరాయాసం తగ్గు తాయి .కనుక బాగా ఆలోచించే నిర్ణ యం తీసుకొందాం .(ఈశ్లో కం లోకం లో బాగా వ్యాప్తి చెంది సూక్తిముక్తా
వళి అయింది ).సాహసం తో కార్యం చేస్తే సాఫల్యం కావచ్చు విఫలమవ్వచ్చు .వివేకంతో ఆలోచించి చేయాలి .సకాలం లో చల్లిన విత్త నాలు
మొలకెత్తి ఫలితం ఇస్తా యి .సంప్రదాయ విద్య శరీరానికి శోభనిస్తు ంది .దానికి శాంతం వన్నె తెస్తు ంది .ఎప్పుడూ శాంతంగా ఉంటె లోకం
నిర్ల క్ష్యంగా చూస్తు ంది. సమయం వచ్చినప్పుడే శౌర్యం చూపితే పరాక్రమం శాంతానికి వన్నె తెస్తు ంది .రాజనీతి పాటించి ప్రయత్నం చేస్తే కార్య
సిద్ధి,గౌరవం కలుగుతాయి .సాహసిస్తే పరాజయం, అగౌరవంకూడా కలగవచ్చు .శాస్త ్ర దృష్టితో ఆలోచించి నిర్ణ యాలు చేయాలి .ఇలా చేసినా
ఒకవేళ దైవికంగా అనర్ధ ం వచ్చినా వారి దో షం కాదుకనుక ని౦ది౦చ రాదు .జిగగీ షువులగు రాజులు క్రో ధ వేగాన్ని అణచుకొని ,కార్య
సిద్ధు లను బాగా ఆలోచించి తప్పక తమకు విజయం కలుగుతుంది అని నమ్మినపుడు పౌరుషం చూపాలికాని ,ఫలని శ్చయం కాకుండా
కార్యం చేయకూడదు .ఇక్కడే బుద్ధి సూక్ష్మతకావాలి .రాత్రి చీకట్ల ను పో గొట్టి ఉదయింఛి వృద్ధి పొ ందే సూర్యుడు లాగా పురుషుడు క్రో ధజనిత
అజ్ఞా నాన్ని వివేకంతో తరిమేసి అన్ని పనులు ప్రా రంభించాలి .మహా శూరుడైనా, కోపావేశంతో పని ప్రా రంభిస్తే కృష్ణ పక్ష౦ లోచంద్రకళలు
నశి౦చినట్లు రాజు ఉత్సాహ,శక్తి ,సంపదలు నశిస్తా యి .బలవంతుడను నాకేమి అని క్రో ధావేశం తో పని మొదలు పెట్టరాదు .క్రో ధంతో కనులు
మూసుకుపో యేవాడికి యుక్తా యుక్త విచక్షణ ఉండదు .దీనివలన లోకోత్త ర సామర్ధ ్యం వ్యర్ధ మై ,కార్యం నెరవేరదు .అవసరాన్నిబట్టి కోపం
శాంతం ప్రదర్శించాలి .సంరంభం పనికిరాదు .సంపదలు శరత్కాల మేఘాలలాగా చంచలాలు .ఇంద్రియ వసులకు సంపదలు చిరకాలం నిలిచి
ఉండవు .జితే౦న్ద్రియునికే ఆ అదృష్ట ం దక్కుతుంది .వచ్చినకోపాన్ని అంతా పైకి ప్రదర్శిస్తే కార్యహాని తప్పదు.భీమా !పూర్వపు ఖ్యాతి ,ధైర్యం
పో గొట్టు కొన్నావు .ఇది నీకు తగదు .క్రో ధావేశం వదిలి శాంతంగా ఆలోచించు .సంపదలకు స్వతస్సిద్ధ ంగా చంచలత్వం లేదు కాని ఇంద్రియ
నిగ్రహం లేని రాజుకు సంపదలు నిలవవు.యుక్తా యుక్త ,సమయా సమయ ,కార్యాకార్య జ్ఞా నం దురాగ్రహమున్నవానికి నశిస్తు ంది
.అసమయ కోపం అనర్ధ దాయకం ‘’అంటూ ఇంకా చెబుతున్నాడు ధర్మరాజు భీమసేనుడికి .
కిరాతార్జు నీయం-10
ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా
ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు
మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం ఏదీ ఉండదని
నమ్ము .అంతేకాదు యాదవులు మాతృ ,పితృ బంధువులు మిత్రపక్షం వారు వారిని వదలి వెళ్లరు .సమయం వచ్చేదాకా దుర్యోధనునివైపే
ఉంటూ వారంతా సమయం రాగానే యాదవపక్షం వైపే చేరటంఖాయం –
భీమా !12 ఏళ్ళు అడవుల్లో 1 ఏడు అజ్ఞా తం లో ఉంటామని మనం మాట ఇచ్చాం .ఆగడువుకు ముందే మనం వారిపక
ై ి వెడితే, ప్రతిజ్ఞ ను
విస్మరించిన వారమౌతాం .గడువు పూర్త య్యాక యుద్ధా నికి వెడితే సూర్యోదయం చేత తటాక పద్మాలన్నీ వికశించినట్లు యాదవాది
రాజులంతా దుర్యోధనుడిని వదిలి మనవైపు చేరుతారు .కనుక ఇది మనకు యుద్ధ సమయం కాదు .మిగిలిన రాజులను కూడా వాడు
మనల్ని అవమాని౦చినట్లే అవమానించక మానడు.అప్పుడు వారు పరాభవం భరిస్తూ పరాక్రమ శౌర్యాలను పణంగా పెడుతూ ఊర్కోలేరు
.వారే వచ్చి మనవైపు చేరతారు .ముందుగా యుద్ధా నికి వెళ్ళకపో తే వచ్చే లాభం ఇది.కనుక ఇదియుద్ధ సమయ౦ కాదు మనకు
.దుర్యోదనుడికి సమస్త రాజన్యం వీర విధేయంగా ఉందని మన చారుడు చెప్పాడుకదా నువ్వు ఇలా అంటావేమిటి అని సందేహం నీకు
రావచ్చు .మదహంకారులు ఎప్పుడూ తమపనులను నిశ్శేషంగా చేసుకోలేరు .మదవికారం పెరగ
ి ి ,వాళ్ళను ఇష్టా రాజ్యం గా ఆడిస్తా డు .మదం
పెరిగితే గర్వం పెరగ
ి ి అవమానం చేయటానికి వెనకాడడు.దానితో వారికి అసంతృప్తి ,అసహ్యం కలిగి ,వారంతటికి వారే విడిపో యి మనదగ్గ రకు
వస్తా రు .మదం వలన కలిగే అనర్ధా లను చెబుతా విను .దర్పాహంకారలున్నరాజు ఎప్పుడు ఎవరితో ,దేనిమీద .ఏది చేయకూడదో ఆ జ్ఞా నం
ఆశిస్తు ంది .అప్పుడు మూఢుడై నీతిని వదిలేస్తా డు .అప్పుడు లోకానికి వాడిపై ద్వేషం పుడుతుంది .అది క్రమంగా పెరిగి రాజకార్య వైముఖ్యం
ప్రదర్శిస్తా రు .అప్పుడు ఎంతగొప్పరాజైనా ,పెను గాలి వీస్తు న్నప్పుడు బాగా నేలలోకి ప్రా కిన వ్రేళ్ళుగల వృక్షమైనా కూకటి వ్రేళ్ళతో
కూలిపో యినట్లు కూలిపో కతప్పదు.కనుక మదహంకారాలు వదిలేయాలి .వాడిని ఈ రెండూ పూర్తిగా ఆవహించాయి .కనుక రాజులను
అవమానిస్తా డు .అదే వాడికి అపకారమౌతుంది .మదహంకారాలున్న రాజు చేత అవమాని౦పబడిన మంత్రు లు మొదలైనవారు
దూరమైనంతమాత్రా న ఆ రాజుకు వచ్చే నష్ట ం ఏమిటి అని అను కొంటున్నావా .బాగా బలిసిన చెట్టు కొమ్మలు ఒకదానితో ఒకటి ఘర్షణకు
లోనై అగ్ని పుట్టి ఆ పర్వత భాగమంతా భస్మీపటలం చేసినట్లు ,అమాత్యాదులకు జరిగిన అవమానం వలన కలిగిన ద్వేషం పెరగ
ి ి ,రాజును
సర్వ నాశనం చేస్తు ంది .శత్రు వు దుర్మార్గు డైతే ,బుద్ధిమంతుడు వాడి అభి వృద్ధికి ప్రతి క్రియ చేయకుండా ఉపేక్షి౦చాలి .వాడు ఈ అవమాన
పరంపర కొనసాగిస్తూ తననాశనం తానె తెచ్చుకొంటాడు .అప్పుడు వాడిని జయించటం చాలాతేలిక కనుక ప్రతిక్రియ అక్కర్లేదు .దుర్మార్గు డైన
రాజుకు మిత్రు లే శత్రు వులై వాడి ఆహ౦కారం ,అహంకారం వలన వాళ్ళు ద్వేషం పెంచుకొని రాజును నిర్వీర్యం చేస్తా రు .అప్పుడు విజిగీషువు
నది వేగంతో గట్ల ను చీల్చినట్లు శత్రు వును సునాయాసంగా జయించవచ్చు ‘’అని తన మనసులోని ఆలోచనలన్నీ జిలేబీ
చుట్ట ల్లా గా,ఒక్కొక్కటి బయటపెడుతూ ,తాను నిస్తేజంగా ప్రతిక్రియ ఆలోచించకుండా ఎందుకు ఉంటున్నాడో మహా మేధావి గా యుధిష్టిరుడు
ఇంకా చెబుతున్నాడు .
కిరాతార్జు నీయం-11
ఈ విధంగా శత్రు వులచే పొ ందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత,
రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తు న్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత
తానె వచ్చినట్లు వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత
దృష్టితో విరోధం పో గొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లు తూ ,మహా తపశ్శాలి
,ఆపన్నివారకుడు మూర్తీభవించిన పుణ్యరాశి నయనాన౦ద కారుడు వేదవ్యాసర్షి రాగా ,ధర్మరాజు
ఆశ్చర్యచకితుడయ్యాడు –
మహర్షిని చూడగానే లేచినిలబడి ,మేరుపర్వతం పై సూర్యునిలా ప్రకాశింఛి ,యధో చిత అర్ఘ్య పాద్యాలతో
సత్కరించి ,శా౦తం తో ఉచితాసనం పై కూర్చుండ జేసి నమస్కరించి ,బ్రహ్మ తేజస్సు తో దర్శనమిచ్చిన
ఆ మహర్షికి ,చిరునగవుతో నిర్మల కిరణ భాసమానుడై ,దేవ గురునికి ఎదురుగా ఉన్న సంపూర్ణ
చంద్రు నిలాగా ప్రకాశించాడు .
ఇతి శ్రీ పదవాక్య ప్రమాణ పారీణ శ్రీ మహా మహో పాధ్యాయ కోలాచల మల్లి నాథ సూరి విరచితాయాం
కిరాతార్జు నీయ వ్యాఖ్యాయాం ఘంటా పథ సమాఖ్యాయాం ద్వితీయ సర్గ ః ‘’
తృతీయ సర్గ
శరత్కాల చంద్ర కిరణాలులాగా,మనోహ్లా దకిరణ సమూహంతో ఉన్నత శరీరుడు ,నల్ల ని శరీరం ,పచ్చని
జడలు కలిగి మెరుపులతో ఉన్నమేఘంలాగా ,ప్రసన్నతా సంపదకలిగి ,లోకాతి శయమైన ఆకార
సంపదతో ,తెలియని వారికి కూడా స్నేహభావంకలిగించే వాడు ,పవిత్ర అంతఃకరణుడు అని తన ఆకారం
తో అందరికీ తెలియజేసేవాడు ,అతిమధుర, అత్యంత విశ్వాస మైన చూపులతో మాట్లా డేట్లు కనిపించే
వాడు ,అగ్నిహో త్రం మొదలైన ధర్మ ప్రతిపాదిత మైన పాపనాశాలైన శత్రు వులకు కారణమైనవాడు
,సుఖాశీనుడు ఐన వేదవ్యాసుని,తనరాకకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు ‘’మహర్షీ !మా
పుణ్యఫలం వలన మీ దర్శనభాగ్యమైంది.సకల శుభాలను,సుగుణాలను కలిగిస్తు ంది .మేఘం లేకుండా
వచ్చే ఆకస్మిక వర్షం లాగా మీ దర్శనం కలిగింది .ఏదో శుభం జరగబో తోంది అనిపిస్తో ంది .మీ రాక మాకు
మాన్యత కలిగించింది .మా యజ్ఞా లు సఫలీ కృతమయ్యాయి .నా శ్రేయస్సుకోరి నన్ను ఆదరించే విప్రు ల
ఆశీస్సులు సత్యాలయ్యాయి .బ్రహ్మ దర్శనం తో కొన్ని కోరికలు సిద్ధి౦చినట్లు ,మీ దర్శనం తో మాకు
ఐశ్వర్యం కలిగి దుఖం నశించి ,పురుషార్ధా లు సిద్ధించి ,కీర్తి విస్త రించి సకలమనోరదాలు ఈడేరుతాయి
.అమృతమయుడైన చంద్రు ని చూసినా, సుఖం పొ ందని నా నేత్రా లు ,మీ సన్నిధిలో ఆనందాన్ని
పొ ందుతున్నాయి .బంధు వియోగ దుఖం అనుభవిస్తు న్ననా హృదయం క్లేశం దూరమై మిక్కిలి సుఖంగా
ఉన్నది .మహర్షు లు నిస్ప్రుహులు .మా వంటివారివద్ద కోరదగింది ఏదీ ఉండదు కనుక ఎందుకు వచ్చారు
అని అడగటానికి ఆధారమే లేదు .మీవంటి పెద్దలవచనాలు సకల శ్రేయస్కరాలు కనుక ప్రశ్నించకుండా
ఉండలేకపో తున్నాను మహాత్మా !’’అని ధర్మరాజు వాక్ వైభవంతో మనోహరంగా పలుకగా అతని
వినయాదులకు ప్రీతి చెంది ,అతనికి జయం కలిగించే తలంపుతో మహర్షి సమాధానం చెప్పటం
ప్రా రంభించాడు .
‘’ధర్మ రాజా ! బంధువులమధ్య తీవ్ర విరోధం వస్తే పరిష్కరించి మైత్రి చేకూర్చినవారికి ఇహం లో కీర్తి
,పరం లో సుగతి కలుగుతుంది .నిస్ప్రుహులమై ,అడవులలో తపస్సు చేసుకొనే మా లాంటి ఋషులకు
ఉభయ పక్షాలమీదా సమాన బుద్ధి ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు .ముముక్షువులకు కూడా
సాధుజన పక్షపాతం ఉండటం సహజం .మీ ఉభయులపైనా సమాన ప్రేమ ఉండాల్సి వచ్చినా ,నీ సుగుణ
సంపత్తి కి నా హృదయ౦ స్వాదీన మై ,నీకు జయం కలగాలని కోరుతోంది .నీలా౦టిసాదువుపై ఇలాంటి
పక్షపాతం కలగినా ,నా మధ్యవర్తిత్వానికి ఏమీ భంగం రాదు .మీపెదనాన్న మోహపరవశంతో,సుగుణ
శీలురైన ,సత్ప్రవర్త కులైన మిమ్మల్నిఅకారణంగా కొడుకులు అనే కనికరం కూడా లేకుండా విడిచి
పెట్టేశాడు.అలా౦టి అవివేకి లోకంలో ఉండడు .దుర్జ న సావాసం వలన జయం కలుగకపో గా ,మూల
చ్ఛేదమైన ఆపదలూ వస్తా యి .మీపెదతండ్రి దుష్ట చతుస్ట యమైన కర్ణా దుల మంత్రా ంగం ప్రకారం
నడుస్తు న్నాడు .కార్యసిద్ధి కలగకపో గా ,సమూలనాశక విపత్తు లు సంభవిస్తా యి వారికి .ఇది ముమ్మాటికీ
నిజం .
‘’ ఆనాడు నిండు సభలో ధర్మం వదిలేసి ,ద్రౌ పదీ వస్త్రా పహరణం చేస్తు న్నా ,లోపల పగ రగిలిపో తున్నా
శాంతమూర్తిగా ఎవరినీ దూషించకుండా ధర్మమార్గ గామి వై ,నీ ధర్మం కాపాడుకొన్నావు .నువ్వు
రక్షించిన ధర్మం నిన్ను రక్షిస్తు ంది .కనుక శత్రు వులను జయించి సమస్త భోగాలు పొ ండుతావని నమ్ము
.-
12 missing
కిరాతార్జు నీయం-13
అర్జు నుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయటానికి వెళ్ళబో గా దుఖం భరించలేని ద్రౌ పదీ దేవి కన్నీరు నిండగా ,నల్ల కలవలపై మంచు
బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రా లు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో
మూసుకోలేకపో యింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జు నుడు గ్రహించాడు .అర్జు నుని చేరి గద్గ ద కంఠం తో
‘’అగాధమైన బురదలో కూరుకు పో యిన ధనాన్నిఉద్ధ రి౦చి నట్లు ,శత్రు వుల కపటోపాయాలచేత మునిగి పో యిన మన గౌరవాన్ని
ఉద్ధ రించటానికి తీవ్ర తపస్సు చేయబో తున్నావు .ఫలసిద్ధికలిగే దాకా సంయమనం తో ఉండాలి .తపస్సిద్ధికోసం సో దరులకోసం నాకోసం
కష్టా లను ఓర్చుకొని ,నా వియోగానికి కృంగిపో కుండా తపస్సిద్ధిపొ ంది మా అందరి గౌరవం కాపాడు .సుఖం కీర్తి మహిమలకోసం తపస్సు చేస్తే
బందువియోగం గుర్తు కురాకుండా అంకితభావం తో తపస్సు చేస్తే ,అనురాగవతి ఐన స్త్రీలాగా తపస్సిద్ధి దాన౦తట అదే వస్తు ంది . శత్రు
సంహారం కోసం క్షత్రియులకు బ్రహ్మ ఓజస్సును తీసేశాడు .అపకారాలవలన విజయైక జీవులతేజశ్శాలుర మానం నశి౦ప జేయబడింది
.అపకారాలు ఘోర కృత్యాలవలన ,జుగుప్సిత వృత్తా ంతాలను తలవంచుకొని బంధువులు ఇతరరాజులు నమ్మాల్సి వచ్చింది .ఇలాంటి ఘోరం
జరుగుతుందా అని ఆశ్చర్యపో యారుకూడా .నికారం అంటే అపకారం దిగంతవ్యాప్త యశస్సును కృంగదీసి,పూర్వ పరాక్రమ కార్యాలను
మరిచేట్లు చేసింది .ఆ అపకారం మనసును దహించి వేస్తూ నిద్ర పట్ట కుండాచేస్తో ంది .నువ్వు దంతం కోల్పోయిన ఏనుగు లాగా ,అభిమాన
ధ్వంసం కలిగి ఆనవాలు పట్ట కుండా ఉన్నావు .కీర్తి క్షయం వలన ఎండిపో యిన సముద్రంలా ఉన్నావు .సమర్ధు లైన వీరులైన భర్త లఎదుట
కులస్త్రీ శిరోజాలను శత్రు వు లాగితే నీ బలపరాక్రా మాలు కాల్చానా అని లోకులు ఆడిపో సుకొంటు౦టే పూర్వపు ధను౦జయుయుడవేనా
అనిపించి అలా ఐతే నీకు వైరూప్యం, నాకు పరాభవం జరిగేదికాదు.ఇప్పటికైనా నీ బలపరాక్రమాలు,శత్రు వులు చేసిన పరాభవాలు
స్మరించుకొని ,నీపేరును సార్ధకం చేసుకో .లేకపో తె ఇక్కడ సన్యాసిగా సిగ్గు లేనివాడివిగా భిక్షా వృత్తి తో బతుకు .ఇంతకంటే చెప్పాల్సింది ఏదీ
లేదు . సాదుజనాన్ని రక్షించలేని క్షత్రియుడు ,శత్రు సంహారం చేయలేని ధనుస్సు సార్ధక౦కాదు .కనుక సార్ధక క్షత్రియుడవు కావలసింది
.నీజాతిని నీ ధనుస్సు సార్ధ కం చేయుగాక .మాలాగానే నీ ధనుర్బాణాలు నిష్ప్రభావాలై నామావ శిష్ట ం గా కొన ఊపిరులతో దిక్కులు చూస్తూ
ఉన్నాయి వాటిని ప్రయోగించి సార్ధ కత కలిగించి మమ్మల్ని ఉద్ధ రించు
‘’బలపరాక్రమాలున్నా ప్రజ్ఞను చూపని సింహాన్ని చూసి ఏనుగులు లెక్కచేయకుండా దాని కేసరాలను ఊడ బెరికినట్లు ,నీ తేజస్సు
చూపకపో తే శత్రు వులు నిన్ను లక్ష్యపెట్టరు.నీ ప్రజ్ఞ చూపించే సమయం వచ్చింది .దినలక్ష్మి సూర్యుని పొ ందినట్లు గొప్పకార్యభారం నిన్ను
వరించింది .ఉత్సాహంగా కార్యభారం నెరవేర్చి లోకం లో శ్రేష్ట యోగ్య పురుషుడవు గా కీర్తి పొ ందు .ఇంద్రకీలాద్రికి వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసి
కార్యసిద్ధి సాధించు మేమూ నీకు ఏరకమైన ఇబ్బందులు రాకూడదని దేవేంద్రు ని ఉపాసిస్తా ం .జయలక్ష్మి తో తిరిగిరా .ఏమరు పాటులేకుండా
ఉండు.వేదవ్యాసమహర్షి అనుగ్రహించినట్లు తపస్సిద్ధి పొ ంది విజయుడవై శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోషపెట్టు ‘’అని ద్రౌ పది బహు
నిపుణ౦ గా చెప్పినమాటలు విని అర్జు నుడు గ్రీష్మాదిత్యుని లాగా వెలిగాడు .
కిరాతార్జు నీయం-14
ద్రౌ పది అర్జు నుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొ ంది ,శత్రు సంహారం చేసి
మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు
కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని పలికినమాటలు అర్జు నుని తేజస్సు పెంచాయి .
పాండవ పురోహితుడు ధౌమ్యుడు మంత్రా లతో అభి మంత్రించి ఇచ్చిన ఆయుధాలను ధరించిన గాండీవి .సౌమ్యాకారుడైనా ,అభిచార కర్మ
ప్రయుక్త మంత్రం లాగా ,తనకు ముందు శత్రు వులను చూస్తు న్నట్లు దుర్నిరీక్షుడయ్యాడు.అమోఘమైన ఆకర్షణ కలిగి ,ప్రసిద్ధ గుణ
ధ్వని,బాణ విమోచన కలిగిన ధనువును ధరించి ,శత్రు వులకు కనిపించని ,నిశిత ఖడ్గ యుక్తా లైన పెద్ద అమ్ముల పొ దులను కట్టు కొని
,ఖాండవ దహనం చేసే దేవేంద్రు ని వజ్ర ప్రహారాలకు ఆచ్చాదనకలిగించే కాంతి కలిగి ,దీప్తి వంతమై నభో మధ్యమం లో వెలిగే కవచాన్ని
ధరించి ,కుబేర అనుచరుడైన యక్షుడు చూపించే మార్గా న్ని బట్టి ,ఇంద్రకీలాద్రికి బయల్దే రుతున్న అర్జు నుని చూసి అక్కడి మహర్షు లు అతని
ఎడబాటు తట్టు కోలేక దుఖిస్తు న్నారు .
ఇతి భారవి కృతౌ కిరాతార్జు నీయే మహాకావ్యే లక్ష్మీ పడలాంఛనే తృతీయ సర్గ ః ‘’
ఈ విధంగా దేవ కార్యార్ద మై అర్జు నుడు బయలు దేరి వెళ్ళే సమయం లో దిక్కులలో దివ్య దుందుభులు మ్రో గాయి .ఆకాశం నుంచి
దేవతలు పుష్పవర్షం కురిపించారు .సముద్రు డు ఉప్పొంగి కెరటాలతో ఒడ్డు ను ఒరుస్తూ ‘’అర్జు నుడు కొద్దికాలం లోనే నీ భారాన్ని పో గొడతాడు
‘’అని తనప్రియురాలు భూమితో ఊరడింపుగా చెబుతున్నాడా అన్నట్లు గా గర్జించించాడు.
చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టు డైన అర్జు నుడు పచ్చగా పండి వరి
‘’తతః సకూజత్కలహంస మేఖలాం –సపాక సస్యాహిత పాండుతా గుణం –ఉపాస సాదో ప జనం జనప్రియః –ప్రియామి వాసాధిత
యౌవనాంభువం .
గ్రా మ సమీపంలోని భూములు చూసి సంతోషించాడు .బాగా పండి ఒరిగి న వరికంకులతో అందమైన పొ లాలు ,బురద తేరి నిర్మలమైన
నీటిలో కమాలాలున్న గుంటలు ఆగ్రా మ సీమలు శరదృతువు సంపదనంతా అర్జు నునికి బహుమానంగా ఇస్తు న్నాయా అన్నట్లు న్నాయి
.చూచి ఆనదించాడు ఫల్గు ణుడు .నీటి కుంటలలోని చేపలు గంతు లేయటం మనసును ఆకర్షించింది .చేపలు అటూ ఇటూ తిరుగుతుంటే నీటి
కమలాలే విచ్చుకొన్న కళ్ళతో ఆశ్చర్యంగా ఆర్జు నుడిని చూడాలని ఆత్రం గా ఉన్నాయి .వాటి చేష్టలు ప్రియురాలి చూపులోని విలాస చేష్టలను
నీటి మడుగులలో కమలాలు ,నివ్వరి ధాన్యం అందం బాగా ఆకర్షించాయి .అందు బాటులో ఉండని సుందర దృశ్యం ఎవర్ని ఆకర్షించదు
బాగా ఎత్తు గా ఎగిరే చేపలు పొ ర్ల టం తో కమలాలనిండా ఆవరించిన నురుగు తొలగి పో యింది .కమల కిన్జి ల్కాలు స్పష్ట ంగా కనిపించి మెట్ట
తామరలా అనుకొన్న అతని అనుమానం తీరిపో యింది .నదుల ఇసుకలు చూసి ఆనందించాడు. రోజూ తగ్గిపో తున్న నీటితో ,నీటి వేగం తగ్గి
తీరం లో ఇసుక లో తరంగాల గుర్తు లేర్పడ్డా యి .తెల్లని ఇసుక నదులు కట్టు కొన్న పట్టు వస్త్రా ల్లా గా ఉన్నాయి.వాటిని చూసి సముద్రు ని
భార్యలైన నదులు పట్టు వస్త్రా లు ధరించాయా అనిపించాయని భావం –‘’నిరీక్ష్య రేమే స సముద్ర యోషితాం –తరంగిత క్షౌమ విపాండు
సైకటం ‘’
తర్వాత మూడు శ్లో కాలో పంట పొ లాలు కాపాడే స్త్రీల వర్ణ న ఉన్నది –పంటలను కాపాడే కాంత పువ్వు లోని పరాగం పొ డితో ముఖం
అలంకరించుకొని అందమైన ,కనుబొ మల మధ్య మంకెన పువ్వు అలంకరించు కోవటం తో కింది పెదవి ఎర్రబడి చిగురాకు శోభ లా ఉంది
.ఎత్తైన పాలిండ్ల చుట్టూ లేత ఎండతో ఎరుపు రంగు పొ ందిన ఎర్రతామర పుప్పొడి అలదుకొని పని చేస్తు న్నందున చెమట తో తడిసి మరీ
ఆనందాన్ని కల్గిస్తో ంది .చెవులకు అలంకారంగా పెట్టు కొన్న కలువ ను తన కంటి చూపుతో అలంకరిస్తూ ఉన్న కాపు భార్యను చూసి
అర్జు నుడు శరదృతువు వైభవం సఫలమై౦దను కొన్నాడు .ఈ ఋతు సంపదంతా ఈ గోపికను అల౦క రించిందని భావం –
‘’కపో ల సంశ్లేషి విలోచన త్విషా-విభూష యంతీ మవతంస కోత్పలం –సుతేన పా౦డో హ్కమలస్య గోపికాం –నిరీక్ష్య మేనే శరదః కృతార్ధ తా
రాత్రిఅయి చాలా సేపు అవటం తో త్వరగాకోస్టా లకు వెళ్ళలేక ,దూడల్ని తలుచుకోవటం వలన పాలుకారుతున్న విశాలమైన పొ దుగులున్న
ఆవుల మందలు అర్జు నునికి ఉత్సుకత కలిగించాయి .తనకు ప్రతి కక్షి అయిన మరో బలిసిన ఎద్దు ను జయించి , తనకు ఎరేలేదన్న
విజయ గర్వం తో అమ్భారవం చేస్తూ ఒక వృషభం కొమ్ములతో నదీతీరాన్ని పెకలిస్తో ంది .గర్వం రూపు దాల్చిందా అన్నట్లు శరత్తు లో మంచి
పచ్చికమేసి బలిసిన ఆ ఎద్దు ఆకర్షణం గా ఉందన్న మాట –‘’పరీత ముక్షావ జయేజయశ్రియా –నాదంత ముచ్చై క్షత సింధు రోధసం-
దదర్శ పుష్టిం దధతం సశారదీం -స విగ్రహం దర్ప మివా ధిపం గవాం’’
మంచు కురిసి తెల్లగాశుభ్రం గా ఉన్న ఆలమందలు మెల్లగా తమస్థా వరాలకు వెడుతుంటే ,శరత్కాలపు నదీ తీరం లో ఇసుక తిన్నెలు
మొలనుండి జారిపో తున్నవస్త్రా లున్న పిరుదులు కల శోభగా అనిపించింది –‘’శరన్నదీనాం పులినైహ్ కుతూహలం –గళ ద్దు కూలైర్జఘనై
రివాదధే’’
ఆలకాపరులు పశువులతో తమ సో దర బందుత్వాన్నిచూపిస్తూ ,ఆడవుల్లో నూ, ,ఇళ్ళల్లో ఉండే ప్రేమ భావాన్నే కలిగిస్తు న్నారు. రుజుమార్గ ం
లో ఆవులను అనుకరిస్తు న్నారా అని పిస్తో ంది –‘’గతాన్పశూనాం సహజన్మ బంధుతాం-గృహాశ్రయం ప్రేమ ,వనేషు బిభ్రతః –దర్శ గోపా ను
తర్వాత శ్లో కాలలో గోపాలికల వర్ణ న ఉంది ..గోపికలు కదుల్తు న్న తుమ్మెద వంటి ముంగురులతో ,చిరునవ్వు తో వెలసిన కేసరాల వంటి
దంతాలతో ,కదిలే చెవి కుండలాలకాంతితో ,ఉదయపు ఎండలో వికసించిన పద్మముఖాలతో ఉన్నారు .పెరుగు చిలికే రైతు స్త్రీలు ఊపిరి పీల్చి
వదులుతుంటే రెండు పెదవులు కదులుతూ ,చిగురాకుల తీగల్లా అందంగా ఉన్నారు.కవ్వపు తాడు అటూ ఇటూ లాగుతుంటే పిరుదులు
తమాషాగా కదుల్తు న్నాయి –‘’వ్యపో ధపార్శ్వైరపవర్తి తత్రికా –వికర్షణ్ఐ పాణి విహార హారిభిహ్’’
స్త్రీలు పెరుగు చిలుకుతుంటే ,ఇరుగు కుండలలో మద్దెల మోట వంటి ధ్వని వినిపిస్తో ంది అది విని ఆడ నెమళ్ళుమేఘ గర్జ న అనుకోని
ఉన్మాదం తో నర్తిస్తు న్నాయి –‘’వ్రజా జిరేష్వ౦బు ద నాద శంకినీహ్ –శిఖండినా మున్మదయత్సు యోషితః –ముహుహ్ ప్రణు న్నేషుమధాం
గోపకా౦తల ఉన్నత స్త నాలు ఇటూ అటూ కదులుతూ శ్రమతో కళ్ళు అలసిపో యాయి చిలకటం లో వారు అప్పుడే నాట్యం ఆపిన
వారకాంతల్లా కనిపించారు అర్జు నుడికి .గ్రా మాలు దాటి ముందుకు వెడుతున్నాడు .దారులు వర్షరుతువులోని వంకర టింకరలు పో గొట్టు కొని
,మధ్యమధ్యలో నీరు నిలవటంచేత వంకరగామారి ,ఆరిపో యినచోట చక్కగా ఉన్నాయి. బళ్ళు నడుస్తు న్నాయి కనుక రెండు చక్రా ల దారి
కనిపిస్తో ంది. రాకపో కలెక్కువై బురద ఆరి, నేల గట్టిపడింది .ఇళ్ళముందు చక్కని అలంకారాలతో పూల చెట్ల తో అల్లు కున్న పందిళ్ళలో జనం
కూర్చుని ఉన్నారు .అదవి ముని ఆశ్రమాలులా ఉన్నాయి . పల్లె ప్రజలు కల్లా కపటాలు లేకుండా మునులు లాగా సాధారణ వేషధారణలో
మనసు విప్పి మాట్లా డు కొంటున్నారు .ఇళ్ళల్లో నూ పూలు పండ్ల చెట్లు పెంచుతున్నారు. ఆదరంగా ఇవన్నీ చూస్తూ అర్జు నుడు ముందుకు
వెడుతున్నాడు .
నాల్గ వ సర్గ - 2.
యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జు నుడికి అడగకపో యినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి
కృతర్ధ త లభిస్తు ంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తు ంది అర్జు నా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప
ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు శరత్తు ఎక్కువ కాలం ఉండక పో యినా ఆ ప్రేమను స్థిరం చేస్తు ంది-‘’నవైర్గు ణ్యై సంప్రతి సంస్త వ స్థిరం
‘’వర్షా కాలం లో తెల్లని కొంగల బారులు ,ఇంద్రధనుస్సుతో ఉన్న మేఘాలు ఆకాశానికి అందం కలిగిస్తా యి ..ఇవేవీ లేకపో యినా శరత్తు
నిర్మలాకాశం తో ఆకర్షణీయ శోభ పొ ందుతుంది .అందమైన వస్తు వుకు అల౦ కారసామగ్రి అక్కర్లేదు కదా –‘’తధాపి పుష్ణా తినభః శ్రియం వరాం
‘’ఇప్పుడు దిక్కులన్నీ తెల్లబడ్డా యి .నీరు లేకపో యినా మేఘాలు ఆనందాన్నిస్తు న్నాయి .వర్షర్తు అనే భర్త విరహాన్ని భరించలేక
దిగ్వదువులు పాలిపో యి తెల్లని రంగుల్ని దుర్బలమైన పాలిండ్లు గా ,జారిన మొలత్రా ళ్ళు కృశించినా అందంగానే ఉన్నాయి –‘’’’ఇదం
‘’ప్రజలు శరత్తు లో మాధుర్యం కోల్పోయి ,నెమళ్ళ క్రీ౦ కారాల పై ఆసక్తి లేకుండా ,మదించిన కలహంసల కూజితాల పట్ల ఆదరం
చూపుతున్నారు .గుణం వలన ప్రీతి కలుగు తుందే కానీ ,పరిచయం వలన కాదు ‘’.వరిపొ లాల్లో కంకులు బాగా నిండుగా ఉండి,పంటలు
సమృద్ధిగా పండాయి పసుపురంగు తిరిగి చేలు పంటబరువుకు ఒంగిపో తున్నాయి .పొ లం నీటిలో వికసించిన నల్ల కలువ పూల వాసన
చూడటానికా అన్నట్లు వంగాయి .(నాలుగు శ్లో కాలతో ఒకే విషయాన్ని వర్ణించ టాన్ని’’ కలాపం’’ అంటారు).కొలను నీరు పద్మ పత్రా లతో
ఆకుపచ్చ గా ఉంది .కమలాల ఎరుపు కాంతి శోభగా ఉంది.నివ్వరి దాన్యకేసరాలతో కలిసి అటూ ఇటూ ఊగుతూ ఇంద్ర ధనుస్సులా ఉంది
–‘’మృణాళినీ నామను రంజితం త్విషా—విభిన్న మంభోజ పలాశ శోభయా –పయః స్ఫుర చ్చాలి శిఖాపి శంగితం –ద్రు తం ధనుష్ఖ ండ
మివాహి విద్విషః’’
గాలికి చెట్లు ఊగుతున్నాయి వాటి పుప్పొడి పుష్పం లాగా వ్యాపించింది .పువ్వులతో శోభిస్తు న్న వృక్షాలు ఆ పుప్పొడిని పట్టు
కొంటున్నాయా అని పిస్తు న్నాయి .కాముడు కాముని పైట లాగగా ,ఆయువతి క్రీగంట చూసి ,పైట సరి చేసు కొన్నట్లు గా అందంగా ఉంది
‘’అగ్ని లేకుండానే కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు ,తెల్లని మబ్బు తునకలు వ్యాపించి ఎండను అడ్డు కొన్నట్లు గా ఉంది .కొద్దిగా నీటి
తు౦పుర్లు కురుస్తు ంటే ఆకాశం కమలాల సుగంధం తో వాయువు వ్యాపించింది ..వరిపొ లాల్లో ని నీటిని వనపంక్తి రూప వనితా జనాన్ని
,ఆకాశ మార్గ ం లక్ష్యంగా పరిగెత్తే తెల్లని రెక్కల హంసల కలకూజితాలు మేఘాలతో దిక్కులు పరస్పరం మాట్లా డు కొంటున్నట్లు గా ఉన్నది
–‘’సితచ్చదానామ పదిశ్య దావతాం-రుతైరమీషా గ్రధితాః పతత్రిణా౦ –ప్రకుర్వతే వారిద రోధ నిర్గ తాః-పరస్పరాలాపమివామలా దిశః ‘’
సాయం వేళ మేతను౦డి ఇంటికి తిరిగి వచ్చే ఆవులు ఒకదానినొకటి తప్పించు కొంటూ కొట్టా లు చేరుతుంటే ,తమ దూడలు జ్ఞా పకం
రావటం తో పొ దుడుగులనుంచి అప్రయత్నంగా పాలు కారి పో తున్నాయి .ఆ పొ దుగులు దూడలకు బహుమానంగా ఉన్నాయా అని
పిస్తు న్నాయి .కోస్టా లు చేరి పాలు, పెరుగు ,వెన్నె నెయ్యి, మొదలైన హో మ ద్రవ్యాలతో పవిత్ర మయ్యేజగత్తు కు కారణమైన ఆ ధేనువులు
దూడల్ని కలుసుకొని ఆప్యాయంగా పాలిస్తు న్నాయి .నెమళ్ళ కంటే మధురంగా పాడే గోపికలు పాటలకు అడ లేళ్లు ఆకర్షింప బడి బాగా
ఆకలితో ఉన్నా ,మేత మెయ్యాలనే కోరిక లేకుండా ఉన్నాయి .నివ్వరి ధాన్యం బాగా పండి నేలకు ఒరిగి తలయెత్తి నిలబడ్డ కమలాలు
ఉన్నాయి .పొ లాలలో నీరు ఆరిపో యింది .నివ్వరి ధాన్య నాయకుడు తలవంచి ప్రా ర్ధించినా, మెత్తపడని కమలం అనే నాయిక ,నాయికా
విరహంతో పాలిపో యిన నాయక డి లా ఉన్నారు-‘’ఉపైతి శుష్య న్కలమః సహా౦భసా మనో భువా తప్త ఇవాభి పాండుతాం’’’.కమలాల
పుప్పొడి సుగంధం వ్యాపించగా వర్షపు చినుకుల చల్ల దనం తో వాయువు చేత ఆకర్షింప బడిన తుమ్మెదలకు మరో దారి లేకపో యింది
.రాజ భయంతో ఎలా తప్పించు కోవాలో తెలియని దొ ంగల్లా ,దో షుల్లా ఉన్నాయి తుమ్మెదలు –‘’ఉపాగమే దుశ్చరితా ఇవా పదా౦ –గతిం న
‘’పగడం లాగా ఎర్రగా ఉన్న నోళ్ళతో పసుపు రంగు పండిన నివ్వరి ధాన్యం కంకులను పట్టు కొన్న శిరీష పుష్పం లాంటి పచ్చని
చిలుకలవరుస అనేక రంగులతో ఇంద్ర ధనుస్సులా ఉన్నది –‘’ముఖై రసౌ విద్రు మ భంగ లోహితైహ్-శిఖాఃపిశంగీహ్ కమలస్య విభ్రతీ-
శుకావలి ర్వ్యక్త శిరీష కొమలా –ధనుహ్ శ్రియః గోత్ర భిదో ను గచ్ఛతి’’’’అని యక్షుడు అర్జు నునికి శరత్ శో వర్ణించి చెప్పాడు .ఇంతలో
సూర్యుని కూడా కప్పి వేసేంత ఎత్తు లో హిమాలయ పర్వతం చూశాడు .అది కాంతివంతమైన మేఘ సముదాయంగా ఉంది .అరణ్యాలతో
నల్ల ని రంగు పొ ంది ,ఉన్న ఆ ప్రా ంత భూమి ,పైన తెల్లని మంచు కప్పిన శిఖరాలతో ఉన్న అక్కడికి చేరి అర్జు నుడు మదిర మత్తు వదిలిన
బలరాముడిని స్మరించాడు .ఆయనా తెల్లని వాడే ఆయన ధరించిన వస్త ం్ర మాత్రం నల్ల నిది .కనుక బలరాముడి లా పర్వతం ఉ౦దనే భావన
.’’తమతను వనరాజి శ్యామితో –నగముపరి హిమానీ గౌరమాసాద్య జిష్ణు హ్-వ్యపగత మదరాగస్యాను సస్మార అక్ష్మీ –మసిత మధర వాసో
అయిదవ సర్గ -1 .
హిమాలయం చేరిన అర్జు నుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తు కు
ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ ,మరో వైపు దట్ట మైన చీకటి
ఆవరించి ఉంది .ముందువైపు అట్ట హాసంతో ప్రకాశిస్తూ ,వెనకవైపు గజచర్మ ధారి శివునిలాగా కనిపి౦చి కను విందు చేస్తో ంది . .-‘’తపన
మండల దీపిత మేకతః –సతత నైశతమో వృతత మన్యతః –హసిత భిన్న తమిస్ర చయం పురః –శివ మివానుగత౦ గజ చర్మణా’’
హిమపర్వత౦ లో భూలోక వాసులు ,ఆకాశం లోని వారూ ,స్వర్గ ం లోనివారూ కూడానివాసమున్నారు .కనుక వారికి తన వ్యాపకత్వాన్ని
తెలియ జేయటానికి తన ప్రతినిధిగా దీన్ని శివుడు ఏర్పాటు చేశాడా ?అని పించింది అంటే స్వర్గ మర్త ్య ఆకాశాలను ఆవరించి ఔన్నత్యం
చూపింది –‘’క్షితి నభఃసురలోక నివాసిభిహ్ –కృత నికేతన మదృస్ట పరస్పరైహ్ –ప్రధయితుంవిభుతా మభి నిర్మితం –ప్రతినిదిం జగతామివ
శంభూనా ‘’
హిమవత్పర్వతం శేషుని తో సమానమైన తెలుపు రంగుతో మిన్ను నంటినది .బంగారు రేఖలతో ప్రకాశించే సానువులు ఉండటం తో ఆకాశం
లోని మేఘాలను తిరస్కరిస్తు న్న శిఖరాలతో ఎంతో ఉన్నతం గా ఉంది .-‘’భుజగరాజ సితెన నభః శ్రితా-కనకరాజి విరాజిత సానునా –
హిమాలయానికి మణి కాంతులే వస్త్రా లు .దేవతాస్త్రీలు అనుభవించటానికి తగిన పొ దరిళ్ళున్నాయి .ఎత్తైన బండ రాళ్ళ మధ్య ఉన్న విశాల
ప్రదేశాలే పురద్వారాలుగా ఉన్నాయి .పుష్పవనాలతో అంతటా ఉండటం వలన పర్వత ప్రా ంతమంతా నగరాలు నిండి ఉన్నాయా అని
పించింది .వర్షా కాలం వెళ్లి పో యింది కనుక నీరు లేని మేఘాలు ,ఉరుములు లేకుండా తెల్లగా వేలాడు తున్నాయి .వజ్రా యుధం తో ఇంద్రు డు
నరికిన రెక్కలు మళ్ళీ మొలిచాయా అని పించింది –‘’’’ఉదిత పక్ష మివార తనిహ్ స్వనైహ్ –పృధు నితంబ విలంబి భి రంబుదైహ్’’’’
పర్వతం లోని ఏనుగులు దంతాలతో సానువులను పొ డవగా నీరు వచ్చి ఏర్పడిన చెరువులు గా ఏర్పడ్డా యి .స్నానాదులకు అనుకూలమై
నిండుగా ఉన్న నీటితో నదులు వేగంగా ప్రవహిస్తు న్నాయి .కడిమి చెట్లు పూలతో శోభిస్తు న్నాయి .తమాల వృక్ష వనం దట్ట ంగా ఆవరించింది
.కొంచెం మంచు బిందువులు పడుతున్నాయి .అందమైన ముఖాల మదపు టేనుగులు నిరంతర సంచారం చేస్తు న్నాయి .హిమాలయం లో
రత్నాలు లేని శిఖరాలు ,పొ దరిళ్ళు లేని గుహలు ,అందమైన కమలాలు ఇసుక తిన్నెలు లేని నదులు ,పూలు లేని చెట్లూ లేవు .ఇసుక
తిన్నెలు పిరుదులుగా,కమలాలు ముఖాలుగా నదీ స్త్రీలున్నారు వారి విహారాలకు రత్న శిఖరాలు వెలుగునిస్తే ,గుహల ముందున్న
పొ దరిళ్ళు సేదతీరటానికి ఉపయోగంగా ఉన్నాయి –‘’రహిత రత్న చయా న్న శిలోచ్చయా –నపలత భవనా న దరీ భువః -
హిమాలయం అందమైన మొల త్రా ళ్ళతో ఉన్న దేవతా స్త్రీల పిరుదులతో అడ్డు కో బడి ,నెమ్మదిగా ప్రవహించే నదులతో ,మనోహరాలైన
తీగలు, పొ గడలు ఆకర్షిస్తే చేరిన పాములు అంతటా వ్యాపించి అందంగా ,మరో స్వర్గ ం లా భాసించింది –
‘’పృదిత సింధు మనీ రశనైహ్ శనైహ్-అమరలోక వధూ జఘనై ర్ఘనైహ్-ఫణ భ్రు తా మభితో వితతం తతం –దయిత రమ్య లతా
వకులైహ్కులైహ్’’
అనేక రకాల మణుల కాంతితో శుభ్రమైన మంచు శిఖరాలు ఇంద్ర ధనుస్సు కల్గిన మేఘాల్లా ఉన్నాయి .కాని ఒక్క సారి గర్జించటం తో అవి
శిఖరాలుకావు మేఘాలే అనే నిజం తెలుస్తో ంది .ఎప్పుడూ వికసించే కమలాలతో రాజ హంస లతో నిర్మలజలం ఉన్న మానస సరో వరం
అక్కడ ఉన్నది ఒకప్పుడు ఈర్ష్యతో కోపించిన పార్వతితో కలహించిన ప్రమధ గణ౦ కూడా అవిద్యాది దో ష రహితుడైన శంకరుడు నివాసంగా
ఉన్నాడు –‘’వికచ వారిరుహం దధతంసరః –సకల హంస గణం శుచి మానసం –శివ మగాత్మజయా చ కృతేర్ష్యయా –సకలహం స గణం శుచి
మానసం ‘’
హిమవంతం చంద్ర సూర్యాదుల దేవయానాలను ప్రకాశింప జేస్తూ ,ఓషధుల రాపిడి వలన కలిగిన అగ్నితో దేదీప్యమానంగా ఉంది .శివ
గణాలు ప్రతి రాత్రీ ఆ మంటలను చూసి ఈ శ్వరుడు చేసిన త్రిపుర దాహ వృత్తా ంతాన్ని గుర్తు కు తెస్తో ంది –‘’
‘’గ్రహ విమాన గణాభితో దివం –జ్వలయతౌషధి జేన కృశానునా –ముహురను స్మరయ౦తమను క్షపం –త్రిపుర దాహ ముమాపతి సేవినః ‘’
హిమవత్పర్వత శిఖరాలలో గంగానది ఉంది .ఎత్తైన రాళ్ళు తిప్పలు అడ్డు రాగా వాటిపై నుంచి పారే ప్పుడు తుపుర్లు తు౦పుర్లు గా ఎగసి
పడుతోంది ఆ దృశ్యం గంగానది తెల్లని చామరం వీస్తు న్నట్లు గా ఉంది –‘’దధత మున్నత సాను సముద్ధ తాం-ధృత సిత వ్యజనామివ
జాహ్నవీం ‘’
ఈ పర్వత వైభవం చూసి అర్జు నుడు పొ ంగిపో యి ,యక్షుడితో ఇలా అన్నాడు (.అడగకుండా చెప్పటం వినేవాడు ఉంటే బాగానే ఉంటుంది
యక్షుడు అర్జు నునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తు న్నాయి .అంటే ఈ పర్వతాన్ని
చూసిన వారి పాపాలు తొలగిస్తో ంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా
పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ మాత్రమే దీన్ని వర్ణించ గల సమర్ధు డు –‘’ఇహ దురధిగమైహ్ కించి దావాగమైహ్ –
సతత మసుతరం వర్ణ యంత్యంతరం –అము మపి విపినం వేద దిగ్వ్యాపినం –పురుష మివ పరం పద్మయోనిహ్ పరం ‘’.ఇది భర్త్రు
సంగమం తో తృప్తి చెందినా ,మానవతులైన స్త్రీలు అక్కడి చిగురాకులు ,పూల పూలదరిళ్ళు,సుందర సరోవరాలు ప్రేరేపిస్తే మళ్ళీ భర్త
సమాగమాన్ని కోరుతున్నారు .నీతి గల భాగ్య శాలికి ఇది ఎప్పుడూ సులభమైనదే నవనిదులున్న కుబేరునీ ప్రసన్నం చేస్తు ంది అత్యంత
ధన సంపదలతో ఇది పరిపూర్ణ మైంది .కనుకనే భూ, స్వర్గ పాతాళాలను కూడా అధిగమించి శోభిస్తో ంది –‘’సులభైహ్ సదా నయత వతా
యవతా –నిధి గుహ్య కాధిపరమైహ్ వరమైహ్ –యమునా ధనైహ్ క్షితి భ్రు తాతి భ్రు తా –సమతీత్య భాతి జగతీ జగతీ ‘’.
‘’ముల్లో కాలూ దీనితో సరి తూగలేవు .ప్రజలు గుర్తించని వైభవం గల శివుడే ఇక్కడ సదా ఉంటున్నాడు కనుక ధర్మ క్షేత్రం కూడా ఇది
.’’అధి వసతి సదా యదైనం జనై-రవిదిత విభావో భవానీ పతిహ్’’.పునర్జ న్మ ,ముసలితనం భయాలు లేని బ్రహ్మజ్ఞా నం అంటే ముక్తి పొ ందగోరే
ముముక్షువులకు శాస్త ్ర జ్ఞా నం లాగా హిమాలయం అజ్ఞా నం పో గొట్టి, తత్వజ్ఞా నం కలిగిస్తు ంది .కనుక భోగభూమి మాత్రమె కాదు ఇది
యోగభూమీ ,ముక్తిపద
్ర పుణ్య క్షేత్రం కూడా .-
‘’వీత జన్మ రసం పరం శుచి –బ్రహ్మణః పద ముపైతు మిచ్ఛ తాం-ఆగమాదివ తమోపహాదితః –సంభవ౦తి మతయోభవచ్ఛిదః’’
ఇక్కడ దేవతాస్త్రీల కోసం పూలపాన్పులు వారి వివిధ సురత విధానాలను సూచిస్తు న్నాయి .కాలి లత్తు క రసం అక్కడ ముద్రిత మైంది వాడిన
పూలహారాలు రాలి పడ్డా యి .పొ ర్ల టం తో ఏర్పడ్డ మడతలు వారి కామోద్రేకాన్ని ,ఆశతో జరిపిన సురత క్రియ విశేషాలను తెలియ
జేస్తు న్నాయి .ఈ పర్వతం లోఓషధులు నీతిగల రాజు విషయంలో రాజ్య లక్ష్మి సదా నివసించి నట్లు ,ఈ క్షేత్ర గుణాన్ని పొ ంది ,రాత్రిం బగళ్ళు
వెలుగుతున్నాయి .-‘’నయశాలిని శ్రియ ఇవాధి పతౌ –విరమంతి న జ్వలితు మౌషధయః ‘’.ఇక్కడి గోరువంకలు అరుస్తు న్నాయి .పూల
బరువుతో చెట్లు వంగాయి .సరస్సులు కమలాలతో శోభాయమానంగా ఉన్నాయి .విశాల మైన కొమ్మలతో చెట్లు న్నాయి .వేడిని తగ్గించే
నదులు ఏనుగులకు ప్రీతి కల్గిస్తు న్నాయి .తుమ్మెదలున్న మామిడి పూ గుత్తి గంధం తోసమానమైన మద జలం కారుస్తూ పరిమళం
వెదజల్లు తున్నాయి .దేవతా గజేంద్రా లుతమ కపో లాల దురద పో గొట్టు కోవటానికి మామిడి చెట్లను రాసు కొంటుంటే వసంతం రాకపో యినా
,కాలం కాని కాలం లో కోయిలలు ఆ పరిమళానికి ఆకర్షింప బడి మదాన్ని పొ ందాయి –‘’సదృశ్యం గత మపనిద్ర చూత గంధై -రామోదం
మదజల సేకజం దధానః –ఏతస్మి న్మదయతికోకిలా న కాలే -లీనాలిహ్ సుర కరిణా౦ కపో ల కాషః’’
‘’అప్సరసల కటి ప్రదేశాలతో అందమైనదీ ,కలకలారావం చేసే నదాలతో హిమవంతం ,పాతాళ లోక రక్షకుడైన వాసుకి కి అత్యంత ప్రీతి
పాత్రమైన అమృత౦ చాలాకాలం గా ఉండటం వలన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు .అంటే పాతాళ ,భూలోకాల్లో అమృతం
లేదు,ఇక్కడే ఉంది అని భావం –‘’మతా ఫణవతోవతో రసపరా –పరాంత వ సుధాసుధాధివసతి ‘’.హిమాలయాలలో అందమైన పొ దరిళ్ల
భవనాలు ,ప్రకాశించే ఓషధులే దీపాలు .హరి చందనం అంటే కల్ప వృక్ష చిగురాకులే పడకలు ,సురత శ్రమ పో గొట్టే కమల వనాల
వాయువులు దేవతా స్త్రీలకు స్వర్గా న్ని కూడా గుర్తు చేసుకో నివ్వటం లేదు .అంటే స్వర్గ సుఖాలన్నీ ఇక్కడే లభిస్తు న్నాయి .ఇక్కడే పార్వతి
చాలాకాలం నీళ్ళల్లో ఉండి తపస్సు చేసింది నీటిలో ఎగిరే చేపలను ఆమె చంచల నేత్రా లతో చూసింది .అలాంటి పార్వతిని చెమట బిందువులు
కారుతున్న వేళ్ళున్న చేతులతో శివుడు పట్టు కొన్నాడు .చెమట సాత్విక భావం .ఇక్కడ శివ పార్వతీ కల్యాణం శోభాయమానంగా జరిగింది –
‘’ఈశార్ద మంభసి చిరాయ తపశ్చరంత్యా –యాదో విలంఘన విలోల విలోచనాయాః-ఆలంబతాగ్ర కరమత్ర భవో భవాన్యాః-శ్చోతన్నిదాఘ
దేవ దానవులు అమృతం కోసం ఈ మందరాన్నే కవ్వం గా,వాసుకిని తాడుగా చేసి సముద్రం చిలికారు .మధన సమయం లో నీరు అటూ
ఇటూ నాలుగు వైపులా యెగిరి పడటం తో పాతాళలోకం స్పష్ట ంగా కనిపించింది .అప్పు డేర్పడిన గుర్తు లు మందరానికి ఇప్పుడూ
కనిపిస్తా యి. మందరం ఎత్తైన శిఖారలతో ఆకాశం చీలినట్లు కనిపిస్తు ంది .ఇక్కడి సూర్య కిరణాలతో వ్యాపించి ఇంద్ర నీల మణులు ఉండటం
చేత బాగా ఉత్కర్ష పొ ంది ,హంసలతో పో లిక ఉన్న స్పటిక వెండి గోడలు మధ్యాహ్నం కూడా వెన్నెల భ్రా ంతి కలిగిస్తో ంది .ఈ పర్వతం పై
వ్యాపించిన అనేక రత్నాల కాంతుల వ్యాపనం వలన ప్రా కారాల మధ్య గట్టి గోడలు నిర్మించినట్లు అనిపిస్తు ంది .కానీ వాయు చలనం వలన ఆ
భ్రా ంతి తొలగి పో తోంది .కొత్త గడ్డి ప్రదేశాలు మనోహర కాంతితో ఉన్నాయి నల్ల కలువల వనాలు కొత్త గా శ్యామల వర్ణ ం పొ ందుతున్నాయి
.అనేక రంగుల పుష్పాల వృక్షాలు ఆకులు పండినా రాలటం లేదు .లేళ్ళు కొరకగా మిగిలిన మొదళ్ళతో మొలిచిన లేత పచ్చిక ,సూర్య
కాంతితో మరకత మణుల కాంతులు కలిసి పో యి బాగా ప్రకాశిస్తు న్నాయి .ఆ లే బచ్చిక లేత చిలకల రెక్కల్లా మెత్తగా ఉంది. లేళ్ళు ఆ
కాంతుల్ని లేత పచ్చిక అనుకోని నాకి వదిలేస్తు న్నాయి .మెట్టతామర వనం నుంచి ఆకాశం లోకిసుడి గాలితో ఎగిరి,ఆకాశం లో
‘’ఉత్ఫుల్ల స్థ ల నలినీవ నాద ముష్మా –దుద్ధూ తః సరసిజసంభవః పరాగః –వాత్యాభి ర్వియతి వివర్తితః సమంతా-దాధత్తే కనకమయాత పత్ర
లక్ష్మీం’’’-ఇక్కడి గంగాతీరం లోని పద పంక్తి పార్వతీ పరమేశ్వరుల అర్ధ శరీరాల కలయికను తెలుపుతోంది .ఆ పాద ముద్రలో ఒకటి లత్తు క
ముద్ర కలిగి చిన్నది గా ఉన్నది కనుక .ఉదయ సంధ్య లో ప్రదక్షిణాల వలన పద పంక్తి పరి వర్త నం చెందింది –‘’ఇహ స
నియమయోహ్సురాపగాయా –ముషసి సయావక సవ్య పాద రేఖా –కధయతిశివయోహ్ శరీర యోగం –విషమ పదా పదవీ వివర్త నేషు’’
ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొ ందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తో రగ ప్రతి సరేణ
కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి వ్యాపించగా ,పైనుండి సూర్య సహస్ర కిరణాలు కిందికి ప్రసరించి ,కలిసిపో యి సూర్యుడికి
ఉన్న ‘’సహస్ర రశ్మి ‘’అనే సంఖ్యా పదం దాటి పో యింది .త్రిపురాసుర సంహారం చేసిన శివుని సంతోష పరచటానికి కుబేరుడు ఇక్కడ కైలాస
పర్వతం లో అలకా పురిని ఉన్నత శిఖరాలతో నిర్మించాడు.ఇక్కడికి రాగానే సూర్యుడు ఆకాలం లో అస్త మిస్తు న్నట్లు కనిపిస్తా డు .అంటే
గోపురాలు అంత ఎత్తు గా ఉన్నాయని భావం –‘’స ఏష కైలాస ఉపా౦తసర్పిణః-కరోత్య కాలాస్త మయం వివస్వతః ‘’ .
పర్వత శిఖర వివిధ మణి కాంతులు శరత్తు లో నీరు తగ్గ టం వలన మేఘాలలో అస్పష్ట ంగా ఇంద్ర ధనుస్సును పూరించటానికి సిద్ధంగా
ఉన్నట్లు కనిపించాయి .శంకర శిరసులోని చంద్రు ని కాంతి, కొత్త గా చిగిర్చిన చెట్ల చిగురాకులను తడిపేవి .అమృతం స్రవించే చంద్ర కిరణాలతో
కృష్ణ పక్షం రాత్రు లలో కూడా అరణ్యాన్ని తెల్లగా చేస్తు న్నాయి .కైలాస పర్వతం విశాలమైన దుప్పటి లాగా వనాన్ని బంగారు కాంతి మయం
చేస్తో ంది..బంగారు మయాలైన గుహలు మీ తండ్రి ఇంద్రు నికి చాలా ఇష్ట ం అందుకే ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయి౦దన్నాడు యక్షుడు అర్జు నునితో .—
ఆయ మానేక హిరణ్మయ కందర –స్త వ పితుర్ద యితో జగతీ ధరః ‘’’ఇంద్ర కీలాద్రి నుంచి సూర్యకాంతి రెండింతలై ,దగ్గ రలోని భూ ప్రదేశాలను
కాంతిమంతం చేస్తో ంది అది మెరుపుల కాంతిని అనుక రిస్తో ౦దని పిస్తో ంది .
మదజలం తో తడిసిన చందన వృక్షాలు ఐరావతం వచ్చి వెళ్ళిన జాడ తెలియజేస్తో ంది .దాని రాపిడక
ి ి భయపడి పాములు పారిపో యాయి
.ఇంద్ర నీల మణుల కాంతితో సూర్య కాంతి కలిసిపో యి గుహ కాంతి విహీనమైంది . అది సూర్య కాంతిని చీకటి కప్పేసినట్లు న్నది .ఇంద్ర నీల
పర్వతం పై శాంత స్వభావం ఉన్న వాడైనా ,అప్రమత్రంగా శస్త ం్ర తో సిద్ధంగా ఉండాల్సిందే అని మహర్షి వ్యాసుడు నీకు ఉపదేశించి నట్లు
ఇక్కడ అర్జు నా నువ్వు తపస్సు చేయాలి .మంచి పనులకు విఘ్నాలుఎదురౌతాయి .కనుక సర్వ సన్నద్ధ ంగా తపం చేయి –‘’భవ్యో భవన్నపి
మునేరిహ శాసనేన –క్షాత్రే స్థితః పధి తపస్య హత ప్రమాదః –ప్రా యేణ సత్యపి హితార్ధ కరే విధౌ హి-శ్రేయాంసి లబ్దు మసుఖాని వినా౦త
రాయైహ్’’
అర్జు నా !గుర్రా ల్లా చంచలమైన నీ ఇంద్రియాలు చెడు మార్గ ం లో పో నివ్వకు. తపస్సులో ఉన్న క్లేశాన్ని తొలగించి శంకరుడు నీ ఉత్సాహం
పె౦పొ ౦ది౦చు గాక .లోక పాలకులు నీ సాధన అనుస్టా నాన్నిఅధికంగా ఫలవంతం చేయుగాక –‘’మా భూ న్న పధహ్రు తస్త వే౦ద్రియాశ్వాః-
సంతాపే దిశతు శివాఃశివాం ప్రసక్తీం-రక్షం తస్త పసి బలం చ లోక పాలాః-కళ్యాణీ మదిక ఫలాం క్రియాం క్రియాసు ‘’
‘ఇలా యక్షుడు చెప్పాల్సిన హితోక్తు లన్నీ చెప్పి ,తన స్థా నానికి వెళ్ళిపో యాడు .అర్జు నుడు ఉత్కంఠ పొ ంది ఆలోచనలో పడ్డా డు.ఇస్టు లైన
సత్పురుషుల ఎడబాటు బాగా బాధ కలిగించటం సహజమే కదా –‘’ ‘’ఇత్యుక్త్వా సపది హితం ప్రియం ప్రియార్హే –ధామ స్వం గతవతి రాజరాజ
భ్రు త్యే –సో త్క౦ఠం కిమపి పృదా సుతః ప్రపద్యౌ –సంధత్తే భ్రు శ మరతిం హి సద్వియోగః ‘’
పరిపూర్ణ మైన ఉత్సాహ లక్ష్మీ సమేతుడై అర్జు నుడు ఆ ఇంద్ర కీలాద్రి పర్వతం చేరాడు.దాన్ని ఏ బలం తోనూ అతిక్రమించ లేం.ఇది సత్వర
ఫలితాలనిచ్చేదికూడా .తానూ చాలాకాలం గా దర్శించాలనుకొన్నదీ కూడా ఈ ఇంద్ర కీలాద్రే .అందుకే ఇక్కడ తపస్సుకు ఎన్నుకొన్నాడు
అర్జు నుడు –‘’తమనతిశయనీం సర్వతః సార యోగాత్ –దవిరహిత మనేకానాం కభాజా ఫలేన –అకృశమకృ శ లక్ష్మీ శ్చేత సా శంసితం స –
విష్ణు మూర్తి గరడుని పై అధిరోహించినట్లు అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న
పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ శిఖా –జగతీరుహో వచ్చా కరుహ్ కుసుమైహ్’’.ఇంద్ర
కీలంప సానుకూలంగా గాలులు వీచాయి. తుమ్మెద ఝ౦కార౦ స్వాగతం అనిపించింది. కమలాల పరాగ పరిమళం వెద జల్ల గా, సన్నని
గంగాజల బిందువులు చల్ల దనం కలిగించాయి .మిత్రు లు తమ స్నేహితులురాగా ఎదురేగి కౌగలించి సంతోష పరచినట్లు గాలి వీచింది
–‘’’’అవధూత పంకజ పరాగ కణా –స్త ను జాహ్నవీ సలిల వీచి భిదః-పరి రేఖిరే భి ముఖమేత్య సుఖాః-సుహృదః సఖాయ మివ త౦ మరుతః
‘’
పైనుండి పడే బండరాళ్లు చూర్ణ ం అవుతున్నప్పటి ధ్వని ,కిందికి జారుతూ పారే నీటి గలగలధ్వని అర్జు నునికి శుభ మంగళ వాద్య ధ్వని గా
భాసి౦చాయి..ఎత్తైన దేవదారు వృక్షాలను కూల్చేవేగంగా పారే గంగానది లో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తు న్నట్లు అనిపించాయి
.ప్రవాహ వేగానికి వంగి ఆచేట్లు , వేగం తగ్గ గానే నిటారుగా లేస్తా యి .అవి వినయవంతుల్లా అనిపించాయి .-‘’స దదర్శ వేతసవనా చరితాం-
ప్రణతిం బలీయసి సమృద్ధి కరీం ‘’.గంగానదిలోకమలాల పుప్పొడి తో ఎర్రనైన గంగా నది జాలానికి కలహంస సమూహం నదికి పైట లాగా
అనిపిచింది –‘’సరి దుత్త రీయ మివ సంహతి మ-త్స తరంగరంగి కలహంస కులం ‘’ .ఏనుగులు దంతాలతో పో ట్లా డు కొంటున్నాయి వాటి
మదజలానికి తుమ్మెదలు ఆకాశం లో ఝ౦కార౦ చేస్తు న్నాయి .దీన్ని చూస్తూ అలా ఉండి పో యాడు పార్ధు డు .గొప్పవారి విరోధమూ గొప్ప
ఆనందాన్నే కలిగిస్తు ంది .ఏనుగుల విరోధం తుమ్మెదలకు ,అర్జు నుడికీ వినోదం కలిగించిందని భావం –‘’అధికాం సరోధసి బబంధ ద్యుతిం –
మహాతే రుజన్నపి గుణాయ మహాన్ ‘’.ఆడ చక్రవాకం తన మగ జంట కోసం గంగా నది అలలలో వెతుకుతూ దీనాలాపం చేస్తో ంది. దాని
ప్రేమను అభినందించాడు క్రీడి .గంగా తరంగాలలో మణుల కాంతి ప్రతి ఫలించగా ,నదిలో మణులున్నాయేమోననుకొన్నాడు .ఏనుగును
నదీ తీరం లోనోరు తెరచిన ఒక ముత్యపు చిప్పనవ వధువును మేల్కొల్పి ఆవులిస్తూ ,ఆనందాశ్రు వులు రాలుస్తు న్నట్లు ఉంది .ఇసుక
మేట పడకగా ,చిప్ప తెరచుకోవటం ఆవలింతగా ,ముత్యాల వరుస దంత పంక్తిగా జలబిందువులు ఆనంద బాష్పాలుగా ఉండటం అర్జు నుని
మనసు పరవశం చెందింది .-‘’ప్రతి బో ధ జ్రు ౦భణ విభిన్నముఖీ –పులినే సరోరుహ దృశా దదృశే –పతదచ్ఛ మౌక్తిక మణి ప్రకరా –గలదశ్రు
బిండురివ శుక్తి వధూహ్’’.నదిలోని పగడపు తీగలు కామోద్రేకం కలిగించే దంతకాంతి గల ప్రియురాలి క్రింది పెదవి లా ఉండి ,ఆ అనుభవాన్ని
గుర్తు కు తెస్తో ంది .నదిలో ఈదే గజాల మద గంధాన్ని ఆఘ్రా ణించి ,నీటిపైకి లేచిన ఏనుగులు తమపైకి వచ్చే ఏనుగులేమో అనే భ్రమపడిన
దృశ్యాన్ని చూశాడు .ఆకాశామంతా ఎత్తు కు ఎగిరే జలాన్ని చూసి ఆశ్చర్యపో యాడు .హఠాత్తు గా తనపైకి ఎగిరే బుసలు కొట్టే పాములాగా
శరత్తు లోని మేఘం లాగా తెల్లగా గుండ్రం గా ఉంది .-‘’ప్రహితం దివి ప్రజవిభి శ్వసితైహ్-శరదభ్ర విభ్రమ మపాం పటలం ‘’.తీరం లోని ఇసుక
తిన్నెలు చేపలు నాలుగు వైపులా ఎగరటమే నేత్రా లుగా ,దేవలోక గంగ ను చేరుతున్నాయి. విశాల పిరుదులు,చంచల ఆకర్షణీయనేత్రా లు
ఇంద్రకీల పర్వత మధ్య వనాన్ని పార్ధు డు చేరాడు .పుష్పించిన చెట్లు వంగి ,అలంకారమైన తీగలు చుట్టూ ఉండి,అక్కడి భూమి అత్యంత
పవిత్రంగా ,వనభూమి మనసు ఆకారం పొ ందిందా అన్నట్లు పరమ ప్రశాంతంగా ఉన్నది –‘’మనసః ప్రసత్తి మివ మూర్ధ్ని గిరేహ్-శుచి
మాససాద స వనాంతం ‘’
ఇంద్రకీల పర్వత వనం మధ్యలోకిఅర్జు నుడు ప్రవేశించాడు అది నిర్జ నంగా తపస్సుకు అత్యంత ఆనుకూల్యంగా ఉందని పించి,ఉత్సాహం
కలిగింది .అక్కడ యోగ శాస్త్రా ను సారం అర్జు నుడు బుద్ధిని స్వాధీనం చేసుకొని ,దుష్కర తపస్సు చేయటం మొదలు పెట్టా డు .తపో నియమ
‘’ప్రణిధాయ తత్ర విధినా ధధియం నాథ ధియం –దధతః పురాతన మునేర్ము నితాం-శ్రమ మాదదాధ సుకరం న తపః –కిమివావ సాదకర
మాత్మ వతాం’’.ఇంద్రియ జయమే ముఖ్యసాధనంగా ,పవిత్ర గుణాలతో అజ్ఞా నాన్ని అణచి ప్రతిరోజూ వృద్ధి పొ ందే కళలున్న చంద్రు డిలా
తపస్సు వృద్ధి చేశాడు .వివేకం తో తత్వాన్ని గుర్తించి ,కామక్రో ధాది వికారాలు లేకుండా ,శాంతి సుఖాన్ని అనుభవిస్తూ ,విఘ్నాలు కలిగించే
విషయ వాంఛలను విసర్జించి తీవ్ర తపస్సు చేశాడు –‘’ప్రతి ఘాతినీం విషయ సంగ రతిం –నిరుపప్ల వః శమ సుఖాను భవః ‘’.త్రికరణ శుద్ధిగా
ఇంద్రు ని మెప్పించే తపస్సులో మగ్నమానసుడైన అర్జు నుడు స్వభావ సిద్దా లైన వీర శాంత రసాలకు పుష్టి చేకూర్చే తేజస్సులను ఒకే సారి
ధరించాడు .అంటే వీరోచిత శస్త్రా స్త్రా లు ఉన్నా ,అహింస ,శాంతి మొదలైన తాపస గుణాలను ధరించి ,ఉపాసన చేబట్టా డు .-‘’సహ జేతరౌ జయ
మరకత మణి శరీర ఛాయతో ,నియమ నిష్ట లవలన ఎరుపు రంగు జడలు తలనిండా వ్యాపించి అర్జు నుడు తమాల వృక్షం లాగా
కనిపిస్తు న్నాడు –‘’ఉపమాం యయావరణ దీదితి భిహ్ –పరి మృస్ట మూర్ధ ని తమాల తరౌ ‘’.ఆయుధ ధారి అయినా ,శాంతం తో సామాన్య
మునిజనాన్ని మించి పో యాడు .రజో గుణం లేనందున మృగాలకూ విశ్వాస పాత్రు డైనాడు .దయా దాక్షిణ్యాలు ఎవరినైనా వశం
చేసుకొంటాయి .పరిశుద్ధ ప్రవర్త నే విశ్వాసానికి కారణమౌతుంది –‘’రమయాం చకార విరజాః స మృగాన్-కమి వేశతే రమయితాం న
గుణాః’’.వాయువు మెల్లగా వీచి సుగంధం వెదజల్లు తూ సహకరిస్తూ గ్రీష్మం లోని వేడిని తగ్గించి చల్ల గా స్పర్శనిస్తో ంది తపస్సు చేస్తు న్న
‘’అనుకూల పాతిన మచండ గతిం .కిరతా సుగంధి మభితః పవనం –అవదీరితార్త వ గుణం సుఖతాం –నయతా రుచాం నిచయ మంషు మతః
ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడక
ి ి అన్నీ
ప్రశాంత వాతావరణం కలిపిస్తు న్నాయి .శుభ శకున రూపంగా ఎదురుగా ఉన్న పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడలేదు .జితే౦ద్రియులకు ఫలప్రా ప్తి
రూప అనుభవం కూడా ధైర్యాన్ని సడల నీయదు-‘’స జగామ విస్మయ వశం వశినాం-న నిహ౦తి ధైర్య మనుభావ గుణః ‘’
ప్రా రంభించిన కొద్ది రోజుల్లో నే తపో ఫలం అనుభవిస్తు న్న ఆర్జు నుడిని చూసి అసూయ పడిన దేవతలు ఇంద్ర పదవి కోసం చేస్తు న్నాడేమో అని
భయపడి అమరావతికి వార్త తెలియ జేయటానికి వెళ్ళారు-‘’ఉపతస్ధు రా స్థితవిషాద ధియః –శతయజ్వనో వనచరావసతిమ్’’.
వనదేవతలు వెళ్లి నమస్కరించి తమపనిలో జరిగిన శైదిల్యం గురించి ఇంద్రు నికి చెప్పారు .’’మహేంద్రా !పవిత్ర వల్కలాలతో ఇతరులకు
అసాధ్యమైన తేజస్సుతో ఒక పుణ్య పురుషుడు ఇంద్రకీలం పై తీక్ష్ణ తపస్సు చేస్తు న్నాడు .ఆ తపశ్శక్తికి లోకం తల్ల డిల్లు తోంది .ఏదో గొప్ప
కార్య సాధనకోసమే తపస్సు చేస్తు న్నట్లు తెలుస్తో ంది –‘’మహాతే జయాయ మనఘన్ననఘః –పురుషస్త పస్యతి తపం జగతీం ‘’ .అతడు
భయం గొలిపే సర్పాల వంటి భుజాలతో శత్రు భయంకరమైన ధనుస్సుతో ఉన్నాడు .మహాతపస్సుతో మహామునులనూ అతిశయించాడు .
అతనితపస్సుకు పంచభూతాలు అనుకూలమై భక్తు లా అన్నట్లు న్నాయి. గాలి శుభంకరంగా ,భూమిపచ్చికతో ,ఆకాశం నిర్మలంగా ఉంటూ
,నీటి తుమ్పురులతో ధూళి అణచబడింది –‘’గుణ సంపదాను గుణతాం గమితః –కురుతేస్య భక్తి మివ భూత గణః’’.అ తపస్వికి మృగాలు
కూడా కలహాలు మాని గురువుకు శిష్యుల్లా మెలగు తున్నాయి .పూల చెట్లు వంగి కోసుకోవటానికి వీలు కలిగిస్తు న్నాయి .నీకు ఎలా
స్వాదీనమైందో ఇంద్ర కీలాద్రి, అతనికీ అలానే స్వాధీన మైంది –‘’ఇతరేతరా నభి భవేన మృగా –స్త ముపాసతే గురు మివా౦త సదః –వినమంతి
వైభవానికి భయపడుతున్నారు .-‘’శామినోపి తస్య నవ సంగమనే –విభు తాను షంగి భయమేతి జనః ‘’.అతడు రుషి వంశ సంజాతుడో
దైత్యుడో ,రాజవంశీకుడో మేము చెప్పలేము .,సమర్దు లమూ కాము .నీ వనం లో అతని వాలకం ఏమిటో అర్ధ ం కాలేదు ..అనేక రకాలుగా
ఆలోచించి మీకు చెప్పాలో చెప్పకూడదో తెలీక ,అల్పజ్ఞా నులమైన మేము ,వివేక వంతులైన ఋషులతో పో ల్చుకోలేము కదా –‘’అసధ ప్యదః
మహేంద్రు డు ఆ యక్షులు చెప్పిన మాటలతో తన ప్రియ పుత్రు డు అర్జు నుడే తపస్సు చేస్తు న్నాడని గ్రహించి సంతోషించాడు .కానీ
ఆన౦దాన్ని పైకి తెలియ నీయలేదు .ప్రభువుల ఆలోచనా రీతి నీతి మార్గా ను సారంగా ఉంటుంది .-‘’అధిగమ్య గుహ్యక గణాదితిత-న్మనసః
ప్రియం ప్రియసుతస్య తపః –నిజగోప హర్ష ముదితం మఘవా –నాయవర్త ్మగాః ప్రభవతాం హి ధియః ‘’.సమాధి స్థితిలో అర్జు నుడే అని నిర్ధా రణ
చేసుకొని ,అతని నియమ నిస్ట లను తెలుసుకోవాలని దేవ కన్యలతో ఒక పన్నాగం పన్ని వాళ్ళతో ఇలా అన్నాడు –‘’ఉపలబ్దు మస్య
‘’మర్మాన్ని భేదించే అస్త్రా లు మా దగ్గ ర లేవు .మీలా సుకుమారంగా ఎంతదూరమైనా వెళ్ళగలిగే నిష్ప్రయోజనం కాని ,ప్రతీకారం లేని మన్మధ
విజయాన్ని చేకూర్చే దీ లేదు .’’అంటే అలాంటి గుణాలన్నీ మీవద్ద నే ఉన్నాయని భావం –అవిపక్ష మస్త ్ర మపరం కతమ-ద్విజయాయ
యూయమివ చిత్త భువః ‘’.యోగుల రజో గుణం తొలగించే తత్వజ్ఞా నమే నీరు .అలాంటి యోగులు కూడా మీ ఓర చూపుతో యోగాన్ని
వదిలేస్తు న్నారు .మహా వైరాగ్యులే మీకు గులాములైతే మామూలు మనుషులు లెక్కే లేదు మీకు ‘’-పరిపీడ మానమివ వో సకలై-రవసాద
మేతినయనా౦జలిభిహ్ ‘’.లోకం లోని అందాలన్నీ రాశీభూతం చేసి బ్రహ్మ మిమ్మల్ని సృస్టించాడు .అందుకే మీకోసమే,మీ పొ ందుకోసమే
జనం స్వర్గా నికి వస్తా రు .గాంధర్వం మొదలైన కళలలోనేర్పరులైన మీరు ,గంధర్వాదులతో కలసి వెళ్లి ,అతడి తపస్సు భంగం చేయండి
.మీకు వశం కాని వారెవరూ ఉండరు-‘’హృత వీత రాగ మ’’నసాంనను వహః –సుఖ సంగినః ప్రతి సుఖా వజితః’’ఆ తపస్వి స్త్రీ సుఖం కోసమే
తపస్సు చేస్తు న్నాడు తప్ప సంసార బంధన విముక్తికి కానే కాదు .కారణం ధనుస్సు ధరించి ఉండటమే .ముక్తి హింసతో రాదు కనుక అతడు
ముముక్షువు కాదు.మీపని తేలికే ‘’-అవి మృష్య మేతదఖిల ష్యతి స –ద్విషతాం వధేన విషయాభి రతిం-భవ వీతయే న హి తధాస విధిహ్
–క్వ శరాసనం క్వ చవిముక్తి పధః’’.ఆ తేజస్వి ఇతరమునులు లాగా కోపం తో శపిస్తా డు అనే అనుమానం వద్దు .యశస్సు కాపాడాలను కొనే
వారు స్త్రీల విషయం లో హి౦సా మార్గ ం అవలంబించరు.కనుక భయం వద్దు .-‘’స్వయం శా౦సి విక్రమవతామవతాం –న వధూ ష్వ ఘాని
విమృశంతి ధియః’’
తమను ఎంతగానో ప్రశంసించిన ప్రభువు ఇంద్రు ని ఆజ్ఞ తో ఆనందంగా అప్సరస బృందం అర్జు న తపో భంగానికి సమాయత్త మై బయల్దే రారు –
ప్రభువు ఆదరం పొ ంది నియోగించిన పనిలో నిబద్ధ ంగా ప్రవర్తించే సేవకులు తేజో వృద్ధి పొ ందటం సహజమే –
‘’లేఖే పరాం ద్యుతి మమర్త ్య వధూ సమూహః –సంభావనా హృది కృతస్య తనోతి తేజః ‘’
సప్త మ సర్గ -1
దేవేంద్రు డికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దే రారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం మరింత పెరగ
ి ింది .ఆ
ఇంద్రు ని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో బయల్దే రారు .ఆ ధ్వని విమానాల్లో ంచి
ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా వ్యాపించి వారి ప్రయాణ శోభను చాటింది –‘’శ్రీ మద్భిహ్ సరధ,గజైహ్ సురా౦గ నానాం –గుప్తా నా మధ సచివై
సూర్య మండల౦ పై నుంచి వెడుతున్న అప్సరసలకు గొడుగుల అవసరం లేకపో యింది .సూర్యకిరణాలే సో కనప్పుడు గొడుగు లెందుకు
అని భావం –రామాణాముపరి వివస్వతః స్థితానాం –నా సేదే చరిత గుణత్వమాతపత్రైహ్’’.గాలి ప్రతికూలంగా వీచటం తో వారి కణతలలో
ఎర్రదనం ఏర్పడి ,అది మదిరాపాన వలన ఏర్పడిన ఎరుపుతో సమానంగా ఉంది .ప్రతికూల వాయువు అనటం వలన వారి ప్రయత్నానికి
ప్రతికూల ఫలితమే లభిస్తు ంది అనే సూచన ఉన్నది. ‘దూతానా మభి ముఖ పాతిభిహ్ సమీరై –రాయాసాద విశద లోచానోత్పలానాం –
అనిన్యే మదజనితాం శ్రియం వధూనా-ముష్ణా ౦శుద్యుతి జనితః కపో ల రాగః ‘’.దేవతలప్రభావం తో కిందపడకుండా ఆకాశం లో నిలిచి ,వేగంగా
లాగే గుర్రా ల రధ సమూహం ఆకాశం లో నిరాధారం గా ఉండటం తో చక్ర భ్రమణం లేక విమాన పద్ధ తినే అనుసరించి నట్ల ని పిస్తో ంది
.దేవా౦గనల చమట క్రమంగా స్త న మండలం చేరి అక్కడి గంధపు పూతను కరిగించి పులకా౦కురాలు కలిగించాయి.నుదుటి బొ ట్టు
చెరిగ౦
ి ది. చమట బిందువులు ముత్యాల శోభ కలిగించాయి .అందమైన వారికి వికారం కూడా అందంగా మారుతుంది –‘’సంపేదే శ్రమ
జండాల ఎరుపు కాంతి పొ డుగ్గా సాగదీసినట్లు న్నది .ఆకాశపు మెరుపు కాంతి ఒరిపిడి రాయి వలన కలిగిన బంగారపు పొ డి కాంతి లో ఉంది
.పూలకంటే సుకుమారులైన అప్సరసలు సూర్యకిరణ వేడికి తట్టు కొనగలగటం గంధర్వులకు ఆశ్చర్యం కలిగించి,బ్రహ్మదేవుని సృష్టి వైచిత్రికి
అబ్బుర పడ్డా రు –గంధర్వైరధిగత విస్మయైహ్ ప్రతీయే-కళ్యాణీ విదిషు విచిత్రతా విధాతుహ్ ‘’’’శరీరం లోని సప్త రంధ్రా ల ద్వారా మద జలం
కారుస్తు న్న ఏనుగులు మేఘాల్లా ఉన్నాయి .వాటి ముఖంపై ఉన్న సిందూరం సూర్యకాంతి తో ప్రకాశిస్తో ంది. బంగారు శ్రు ౦ఖల మెరుపులాగా
,మదదార వర్షం లా ఉంది .-‘’సిన్దూ రైహ్ కృత రుచయః సహేమ కక్ష్యాః-స్రో తోభిస్త్రిదశ గజా మదం క్షరంతః –సాదృశ్యం యయురా రుణా౦
దేవా౦గనల సేన పైనుంచి గంగాతీరం చేరి౦ది. గంగా నది దిక్కులనే స్త్రీలు అల్లిన జడ లాగా కనిపించింది –‘’ఆకాశాముప రచితా మివైక
వేణీం –రమ్యోర్మిం త్రిదశ నదీ౦ యయుర్బలాని ‘’.పూ దేన తాగట౦ తో మత్తి ల్లిన తుమ్మెదలు ఒకే చోట చేరటం తో పరాగం తో కలిసిన గాలి
కమలాలను కదిల్చి ,గంగా తరంగ చల్ల దనాన్నీ పొ ంది అప్సరసల శ్రమ తాపాన్ని పో గొట్టింది .-‘’ఆమత్త భ్రమర కులాకులాని దున్వ –
న్నుద్ధూ త గ్రదిత రజాంసి పంకజాని –కా౦తానాం- గగన నదీ తరంగ శీతః –సంతాపం విరమయతి స్మ మాతరిశ్వా’’.నుదుటి తిలకాలను
తడిపి పో గొట్టినా ,వారి అలసట తీరినందున మేఘాలు వాళ్ల కు సన్మాన యోగ్యమయ్యాయి .చిన్నతప్పు పెద్ద మేలును తుడిచేయలేదు కదా
–‘’తత్పూర్వం ప్రతి విదధే సురాపగాయాః-వప్రా ంత స్ఖ లిత వివర్త నం పయోభిహ్’’.సూర్యాది మండలాల ను దాటి రధ చక్రా ల అంచులకు తగిలి
,దేవతలా అరుగులు కూలుస్తూ అప్సరసల రధాలు ముందుకు వెళ్ళాయి.మేఘాలను దాటుతూ అక్కడి నీటిని కలచి వేస్తూ అడ్డు లేకుండా
సాగాయి ..ఏనుగు దంతాల ఒరిపిడి తో నీటి బిందువులు రాలుస్తు న్న మేఘాలు ,ఎండతాకిడి పొ ందిన దేవలోక ఏనుగులకు మంచి
ఆనందాన్నే కలిగిస్తు న్నాయి .సత్పురుషులు తాము బాధ పడుతూ కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు .-‘’యుక్తా నాం ఖలు
మహతాం పరోపకారే-కళ్యాణీ భవతి రుజత్స్వపి ప్రవ్రు త్తి హ్ ‘’.వేగంగా వీస్తు న్న గాలి కాముకుడు లాగా అప్సరసల అందమైన వస్త్రా లు
తొలగిస్తూ ంటే , వారి మణి మేఖలల (మొల త్రా ళ్ళ )కాంతులు ,రెండు తొడలు కనిపించకుండా ఆవరించి ,లో దుస్తు ల్లా (అండర్ వేర్ ) లా
మారాయి .తరంగాల గుర్తు లతో అందమైన ఇసుక ప్రదేశాల లాగా కనిపించే నీరు లేని మేఘాలు చెదిరిన కారణంగా, ఇంద్ర ధనుస్సు సరిగ్గా
కనిపించటం లేదు .కాని వారు ధరించిన మణుల కాంతి ప్రసారం చేత హరివిల్లు కు సంపూర్ణ త్వం సిద్ధించింది ..అక్కడ పనులు ఎలా చేయాలని
మాట్లా డుకొంటూ అప్సరసల సమూహం పక్షులు సంచరించే ఆకాశ మార్గ ం దాటి ఇంద్రకీల సానువు చేరింది .అక్కడ నీరు లేని తెల్లని
మబ్బులు మాత్రమే ఉన్నాయి .ఇంద్రకీలం చేరిన అప్సరసలు ఆకాశ గంగ లాగా ప్రకాశించారు .వారి ముఖాలు విప్పారాయి .వారి మాటలే
మద్దెల మోతగాఉంది .వారు ఆకాశ గంగనే తలపించారు –సాతూర్యధ్వని త గభీర మా పతంతీ-భూ భర్తు హ్ శిరసి నభో నదీవ రేజే ‘’.ఆకాశ
మేఘాలు కప్పులాగా ఉండగా ,కిందికి దిగే రధాల,గుర్రా ల ,కళ్ళాలు లాగి పట్టు కోవటం తో వాటి శరీరము౦దుభాగం కుంచించుకు
పో యినట్లు కనిపించింది. తలలు వంచి అతికష్ట ం మీద గుర్రా లు భూమిపైకి చేరాయి –‘’అనిన్యు ర్నియమిత రశ్మి భుగ్న ఘోణాః- కృచ్ చ్రేణ
క్షితి మవనామి నస్తు రంగా ‘’.ఇంద్రకీలం పై దిగుతున్న దివిజ గజాలు రెండు ప్రక్కలా మేఘాలతో సముద్రం లోని మైనాకం మొదలైన
పర్వతాల్లా కనిపించాయి –‘’మహేంద్రం నగమభితః కరేణు వర్యాః-పర్యంత స్థిత జలదా దివః పత౦తః –సాదృశ్యం నిలయన నిష్ప్రకంప పక్షై-
కిరాతార్జు నీయం-.9
సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తు లు స్పష్ట ంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు
మేఘ గర్జ న భ్రా ంతి తో తలలు పైకెత్తి ఆసక్తిగాచూస్తు న్నాయి –‘’ఉద్గ్రీవై ర్ఘన రవ శంకయా మయోరైహ్ –సో త్కంత ధ్వని రుపశుశ్రు వే ర ధా
నాం ‘’.పైన ఉన్న నీల మణుల నుండి నిరంతరం ప్రసరిస్తు న్న కాంతులతో పైనుండి పడే జలధార బాగా నీలం రంగుపొ ంది ఆకాశం మధ్యలో
పగిలిందా అని అచ్చరలు అచ్చెరువుతో చూశారు .-‘’విచ్ఛిన్నా మివ వనితా నభో౦తరాలే-వప్రా మ్భః స్రు తి మవలోక యాంబభూవుహ్
‘’.దిగ్గజాలు అడవిలోని మదపు టేనుగుల్ని చూసి ,కోపం తో మావటి వాడిని కూడా లెక్క చేయకుండా తమ ఆడ ఏనుగులపై మనసు పడి
ముందుకు సాగాయి .రధ చక్రా ల వలన ఎగసిన యెర్రని ధూళి తో దేవతా స్త్రీల సేన అడవుల్లో వ్యాపించింది .వర్షా కాలం మొదట్లో యెరని
్ర నీరు
గల గంగానదిలా సేన కనిపిచింది .-‘’అతేనే వనగహనానివాహినీ సా –ఘర్మా౦తక్షుభిత జలేవ జహ్ను కన్యా ‘’.
గంగా తీర అందమైన వాస యోగ్యమైన ప్రదేశం లో అందరూ బస చేశారు .మణులకాంతి లాంటి ఇసుకతిన్నెలు ,చెట్ల నుంచి రాలిన పూలతో
నిండిన ,దట్ట మైన పచ్చిక పరచిన ప్రదేశం అది .ఇంద్రకీల౦ పై గ౦ధర్వ సేన ,పూర్వం ఎరుగని శోభ పొ ందారు .మహాత్ముల సంబంధం వలన
సమకూరనిది ఏముంటుంది ?-‘’సమసక్తౌ కిమ సులభం మహో దయానా-ముచ్ఛ్రాయాంనయతి యదృచ్ఛయాపి యోగః ‘’.పరిమళ భరిత
పూల చెట్ల శోభ ,నిర్జ న ప్రదేశం ,కొత్త గాచిగిర్చిన తీగల సంపద ఉన్న ప్రదేశమది .ఆ సౌఖ్యం అప్సరసలుఅనుభవి౦చటం తో అది సాఫల్యం
పొ ందింది .ఇతరులకుపయోగించేదే సంపద .-‘’సాఫల్యం యయు రమరా౦గనొప భుక్తా ః-సా లక్ష్మీ రుపకురుతే యయా పరేషాం’’.అలసిన
ఆస్త్రీలు చందన వృక్షాలున్నా చల్ల దనం పొ ందలేకపో యారు .ఆ చెట్ల కొమ్మల్లో ఉన్న పాముల శ్వాస తో చిగురాకులు కదులుతుండగా
భయపడ్డా రు .చెడ్డ వారిని చేర దీసిన రాజు కూడా దూరంగా ఉంచదగిన వాడే కదా .-‘’క్లా ౦తోపి త్రిదశ వధూ జనః పురస్తా –ల్లీనా హిశ్వసి త
విలోల పల్ల వానాం –సేవ్యానాం హత వినయై రివా వృతానాం-సంపర్కం హత వినయై రివా వృతానాం-సంపర్కం పరి హరతి సమ
చందనానాం ‘’.
మావటి వాళ్ళు ఏనుగులపై ఉన్న ధ్వజ, కవచ, గుడార సామాను నేలపై దించి ,ఏనుగుల్ని సమప్రదేశం లో వదిలారు .ప్రళయ కాలం లో
వీచే గాలి చెట్టు , చేమలను కూల్చగా బో డిగా కనిపించే పర్వతాలలాగా ఆ ఏనుగులు నేలపై పడుకొని కనిపించాయి –‘ ‘’అక్షిప్త ద్రు మ గహనా
యుగాంత వాతైహ్ –పర్యస్తా గిరయః ఇవ ద్విపా విరేజుహ్ ‘’.ఒకగాజరాజు ప్రయాణపు బడలికతో వచ్చే నిద్రను వదిలి ,మదజలం తో బురదగా
మారిన ఆచోటును వదిలేసింది .అప్పుడే మద వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు అక్కడికి చేరాయి .ఆదృశ్యం తొందరలో ఏనుగు
లేచినప్పుడు తెగిన కట్టేసే త్రా డా అన్నట్లు గా తుమ్మెద పంక్తి కనిపించింది .-‘’శయ్యాంతే కులమలినా౦ క్షణం విలీనం –సంరంభ చ్యుత మివ
లేచిన ఏనుగు కు గంగా ప్రవాహం అడ్డు పడింది .అంకుశంతో బలంగా తలపై మావటి పొ డిచినా లెక్క చేయలేదు .గంగ నీరు తాగి,తొండం తో
.మరో ఏనుగు దాహంగా ఉన్నా ,ఏనుగు మద జలం తో కలిసిన ఆ నీటిని తాగటానికి ఇష్ట పడక ,వాసన చూసి కోపం తో రెండవ తీరం వైపు
కళ్ళు తిప్పి చూసి ,అది చల్ల ని నీరే అయినా తాగలేదు .గంగలో జలక్రీడ చేస్తు న్న ఏనుగులు మదజలం తో గంగనీటిని పరిమళ భరితం చేసి
,కమలాల పచ్చని కేసరాలతో గండ స్థ లం పై ఉన్న యెర్రని మద రేఖలను కప్పుకొని ,ఒడ్డు కు చేరాయి –‘’కింజల్క వ్యవహిత తామ్రదాన
లేఖై-రుత్తేరుహ్ సరసిజ గన్ధి భిహ్ కపొ లైహ్ ‘’.సేన ధూళి గంగనీటిపై చేరి ,తరంగాలు తీరాన్నితాకుతూ ,ఏనుగులు తు౦చేసిన తామర పూల
పుప్పొడి పచ్చగా వ్యాపించి నదికి మా౦జిస్ట (Rubia cordifolia Linn)-(ఎరుపు ,పసుపు రంగుల సమ్మేళనరంగు ) రంగు కల వస్త ం్ర
లా శోభ కూర్చింది .మాన్జిస్ట రక్త శుద్ధికీ ఉపయోగపడే వనౌషధ తీగ-‘’మతన్గోన్మధిత సరోజ రేణుపింగం –మాంజి స్ట ం
వసన.మివాంబునిర్బభాసే ‘’
ఇరుగుడు చెట్లకు కట్ట బడిన ఏనుగులు వెనక పాదాలూ భుజాలూ కదిలిస్తూ ముందు వెనుకలకు ఊగుతున్నాయి. మద ధారలు
కారుతున్నాయి .చూడటానికి అవి నీటి ధారలతో తడిసి పర్వత గండ శిలలు జారి పడుతున్నాయా అని పించాయి .-‘’సంప్రా ప్తే నిస్త ృత
అణగిపో యింది .ఆమదజల పరిమళం ఏలకు తీగల వాసన లాగా ఉంది .వాయువు ఈ సుగంధాన్ని అంతటా వ్యాపింప జేస్తో ంది .దిగ్గజాల
ఘీ౦కారాలను విన్న సింహాలు నిద్ర చెదిరి సంక్షోభం పొ ందాయి. చకోరాలు నెమళ్లు మేఘ గర్జ న అని భ్రా ంతి చెందాయి –‘’అకేతను శ్చకిత
చకోర ,నీలకంతాన్-కచ్చాంతా నమర హేభ బృంహి తాని ‘’.దీవ సేన విడిది చేసిన ప్రదేశం చక్కగా అలంకరించ బడి,ఉద్యానవన శోభ
పొ ందింది అప్సరసలు మార్గా యాసం పో గొట్టు కోవటానికి వస్త్రా లు, ఆభరణాలుతీసేసి చెట్ల కొమ్మలకు తగిలించారు .చెట్ల నీడలో సేద తీరుతూ
కిరాతార్జు నీయం-.10
అష్ట మ సర్గ -1
తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దే రారు .ఆనగరం నానా వర్ణా లతో ఇంద్ర ధనుస్సును
తలపిస్తో ంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం
చేస్తు ంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై ప్రసరించి విద్యుత్ కాంతులతో మెరుపు లేమో అనిపించాయి .అప్సరలు
భూమిపై సంచరించటం వలన ఆకాశ గమనం కంటే ఎక్కువ సంతోషం పొ ందారు .నేలపై నడవటం తో ఎత్తైన పాలిండ్ల శ్రమ ,జఘన పరిశమ
్ర
కూడా తొలగి పో యింది .కంకణాది కాలి అందేల ధ్వని కూడా అందం పెరగటానికి కారణమైంది .చెట్లు వంగి వారిపై పుష్ప వృష్టి
కురిపిస్తు న్నాయి .వాళ్ళ శరీర అ౦గ రాగాల పరిమళాలకు ఆకర్షింపబడి తుమ్మెదలు వాళ్ళనే ముసరు తున్నాయి .లత్తు క ఉన్న
అరచేతులు ,చిగురాకులు గా ఉన్న గోళ్ళకాంతులు పూల గుత్తు లేమో అనుకొని తుమ్మెదలు వాళ్ళ మీద వాలుతున్నాయని భావం .అశోక
వృక్ష౦ కొమ్మపై తుమ్మెదలు పూల మకరందం తాగుతుంటే చిగురాకులు అల్లా లాడు తుంటే అప్సరలు ఆనందంగా చూశారు .ఈ దృశ్యం
ప్రియుడు అధరోస్ట ం పానం చేస్తూ కొరికితే చేతులతో దులపరించుకొనే నాయిక లా కనిపించింది .-‘’విదంబ యంతీ దదృశే వధూ జనైహ్ –
రమంద దష్ఠ కరా వధూనాననం ‘’.ఒక అచ్చర మరో అప్సరసతో ‘’చిగురాకుల్లా మనోహరంగా ఉన్న చేతుల్ని అనవసరంగా ఎందుకు
విదిలిస్తా వ్ ?తుమ్మెదల బారు కల్పలత అనే భ్రా ంతితో నీ దగ్గ రకు చేరింది భయం అక్కర్లేదు ‘’అన్నది .ప్రా ణాయా కోపంతో ఉన్న నాయిక చెలి
‘’కోపం వదిలి ప్రియుని చేరు .మనసు చంచలమైనది .తర్వాత పశ్చాత్తా పం పడతావు ‘’అని చెప్పి ప్రసన్ను రాలిని చేసింది .
ఆ వనం లోని నదులు ఎత్తు గా పెరిగిన కాశ గడ్డి అనే వస్త్రా లను చుట్టు కొన్నాయి .ధ్వనిస్తు న్న బెగ్గు రుపక్షుల బారు మొలనూలుగా ఉంది
.ఎత్తైన తీర ప్రా ంత ఇసుకతిన్నెలే పిరుదులు .ఎత్తు నుంచి పడే నీటి బిందువులు ముక్కలుగా చెదరి అన్ని వైపులకు వ్యాపింఛి ముత్యాల్లా
స్వచ్చంగా ,ప్రియుని చల్ల ని ఒడి గా ఉన్నాయి.వనం యొక్క హాసమా అన్నట్లు తెల్లగా ప్రకాశిస్తు న్నాయి –‘’ప్రియాంక శీతాః శుచి మౌక్తిక
త్విషో -వన ప్రహాసా ఇవ వారి బిందవః ‘’నిశ్చలంగా ఉన్న తుమ్మెదలేకాటుకగా ఉన్న పుప్పొడి ,పుష్పాలు అనే నేత్రా లతో తమ ప్రియ
చెలికత్తెలను నమ్రభావంతో చూస్తు న్నాయా అన్నట్లు వంగి ఉన్న తీగలు వనానికి శోభ కూరుస్తు న్నాయి .-‘’స్థిర ద్విరేఫా౦జన శారి తోదరై-
చందన వృక్షాలను మద గజాలు గండ స్థ లాలతో రాసు కొంటుంటే ,అవి శ్యామల వర్ణ ంపొ ంది పర్వత పైభాగాలకు చేర్తు న్నాయా అని
పించాయి .వీటికి అప్సరసలు ఆన౦దించారు .అందుబాటులో పూలున్నా ప్రియ రాళ్ల కోసం గంధర్వులు తామే కోసి సంతోషం కలిగిస్తు న్నారు
.ఒక గంధర్వుడు పూలు కోస్తూ మరో నాయిక పేరు పలకగా నాయిక నీరు నిండిన కళ్ళతో పాదాలు నేలకేసి రాసి,కోపం ప్రకటించింది .ఒక
అప్సరస ప్రియుడితో మాట్లా డుతూ చూపు అతనిపైనే లగ్నం చేసింది .కొకముడి ఊడినా గుర్తి౦చ లేదు .వేరే వస్త మ
్ర ూ కట్టు కోలేదు చేతులు
వృధాగా పూలపై పడటమూ గమనించలేదు .ప్రియునిమాటలు ,రూపాలకు ఆమె మత్తెక్కి పో యి౦దన్నమాట .ప్రియుడు పూలదండకట్టి ఇస్తే
తలలో తురుముకొని ఒకనాయిక అతనికి చనులతో, విశాలమైన పిరుదులతో గట్టి ఆలింగన సౌఖ్యం కలిగించింది .ఒకావిడ లావైన
పిరుదులతో లేవటం తో, కొకముడి వీడి వ్రేలాడింది .పై వస్త ం్ర జారిపో యి స్త నాల అందం బయట పడింది. శరీరం సాగి పొ ట్ట పై ముడతలు
మాయమై నూగారు స్పష్ట ంగా కన్పించింది .పైపొ ట్ట ను చాచ న౦దున తో పొ ట్టిదై౦ది .పూలుకోసే నెపంతో ప్రియుడిని అంగాంగ సౌందర్యం
ప్రదర్శిస్తూ కవ్విస్తో ంది ఒకామె . నాయిక కంట్లో పుప్పొడి పడగా ప్రియుడు తొలగించటానికి నానా హైరానా పడ్డా డు .ఆమె ఎత్తైన లావైన
పాలిండ్ల తో అతడిని కుమ్మేసింది ..అప్సరసలు వనం లోని ఆకులు పూలు అలంకరించుకొనగా వనలక్ష్మి శోభ వారినే వరించింనిపించింది .
ఇప్పటిదాకా మనల్ని చెట్లూ చేమలూ నదులు ఇసుకతిన్నెలచుట్టూ తిప్పి అప్సరసల కామ చేష్టలను విపులంగా వర్ణిస్తూ ,అర్జు నుడు
ఏమయ్యాడో ఆ గోడే పట్టించుకోకుండా అతనిపై చూపాల్సిన ఈ మన్మధ వికారాల్ని ఇక్కడే ఇప్పుడే తమలో తాము చూపుకొంటూ
,చూపుతూ ‘’ట్రయల్ రన్’’ గా చూపిస్తూ , వర్ణ లతో కమ్మేసి ,కుమ్మేశాడు కవి భారవి .తర్వాతైనా కధ ఒక అర౦గుళమైనా కదుల్తు ందేమో
రేపు చూద్దా ం .
కిరాతార్జు నీయం-.11
పరిమళం పొ ందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొ ందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రు ళ్ళి
పడుతున్నారు. ఏనుగు తొండం లా లావైన తొడల వలన నడక లో శ్రమ పడ్డా రు .కొత్త చిగుళ్ళ వంటి పాదాలు నడవ లేక తడ
బడుతున్నాయి ఈ తుళ్ళింత మధుపానం వల్ల నేమో అనిపిస్తో ంది .(బహుశా అర్జు న మౌని ముందు కూడా ఈ తడబాటు జరుగుందేమో
నని సూచన కావచ్చు నని నా ఊహ ).మొలనూలి మణి కాంతులు నితంబాలకాంతిని వెలువరిస్తు న్నాయి .అవి గంగనీటి నుండి అప్పుడే
బయట పడిన ఇసుక మేటల శోభను జయి౦చినట్లు న్నాయి .పాదాల ముద్రలు ఇసుకలో ముద్రింప బడినాయి .నాభి ప్రదేశాలు వికసిత
కమలాల మొగ్గ లఅందాన్ని కలిగి ,కొకముడి దగ్గ ర ఆకట్టు కొనే శోభ పొ ందాయి .పొ ట్ట మధ్య భాగం లో వలి త్రయం అందం గా ఉంది .జఘనం
పై ఉన్నత ,విశాల స్త నాలు బరువు తో పొ ట్ట పైభాగం లోపలి కి వంగింది .కళ్ళకు చెమట ఆవరించటం తో పూర్తిగా కళ్ళు తెరవ
లేకపొ తున్నారు .ఆకళ్ళు మంచు తో స్పష్ట ంగారేకులు కనిపించని కమలాల్లా ఉన్నాయి .ముఖాలు కూడా అలానే ఉన్నాయి –‘’సమాన
కాంతీని తుషార భూష నైహ్-సరోరు హైరస్ఫుట పత్ర ప౦క్తి భిహ్ –చితాని ఘర్మా౦బు కనైహ్ సమంతతో-ముఖాన్యనుత్ఫుల్ల విలోచనాని చ
‘’
నెమ్మదిగా నడుస్తు న్న అప్ససరల అంగాంగ సౌందర్య చేష్టలు చూస్తు న్న గంధర్వులు అదే మొదటి సారిగా చూసిన అనుభూతి పొ ందారు
..పూలు కోశాక, గంగానది ని చూశారు .చేపలతో కదల్చబడి ప్రసన్నంగా ఉన్న పద్మం కలది ,బురద లేని తీరాన్ని తాకుతున్న అలలు అనే
చేతులతో ,రాయంచల కలకలారావాలతో పిలుస్తో ందా అని పించింది .అంటే గంగ అనే స్త్రీ స్నానానికి రమ్మని పిలుస్తు న్న భావన
కలిగించిందని భావం .మందమారుతం వీచింది అది తరంగాలపై వస్తూ తుమ్పురుల చల్ల దనం పద్మాల పరిమళం పొ ంది వేడిని కూడా
తగ్గించి, వారికి ఆలింగన సౌఖ్యం కలిగించింది .విలాసమైన నడకలతోహంస నడకలను ,పిరుదుల వైశాల్యం తో ఇసుక తిన్నెలను ,విశాల
నేత్రా ల ముఖాలతో పద్మాలను సామ్యగుణ౦ తో అప్సరసలు నిరసించారు .వీరికున్న నేత్రా లు పద్మాలకు లేనందున గుణ నిరసన జరిగింది .
గంధర్వులు ముందు నదిలో దిగి దారి చూపారు .తర్వాత దేవా౦గనలు భయభయంగా మొదటి సారి అన్నట్లు గంగలోదిగారు .వారు
నీటిలో దిగగానే తరంగాలు చీలి తీరం దాకా వ్యాపించాయి తీరానున్న నీటి పక్షులు భయంగా పారి పో యాయి .గట్టిగా ఉన్న గంధర్వుల వక్ష
స్త లాలతో విశాల చనుల అప్సరసల తాకిడితో నీటి తరంగాలు ముక్కలై తీరమంతా వ్యాపించి అల్ల కల్లో లమైంది .గంగ వీళ్ళ జలక్రీడలకు
కోపించి క్షోభించినట్లు గా ఉంది –తటాభి నీతేన విభిన్న వీచినా –రుషేవ భేజే కలుషత్వ మంభసా ‘’.తల వెంట్రు కలు చెదిరి ,పూదండలు జారి
,చందనాదులు కరగి పో గా అప్సరసలకు తాము చేసిన అపరాధం వల్ల ఇలా జరిగిందా అని భయపడి నట్లు నీటి తరంగాలు మాటిమాటికీ
వణకు తున్నాయి –‘’అతి ప్రసంగా ద్విహితాగసో ముహుహ్ –ప్రకంప మీయుహ్ సభయా ఇవోర్మయః ‘’
నఖక్షతాలు సవతులకు కనిపించకుండా గంధం వంటివి పూస్తే ,అవి నీటిలో కరిగి బయటపడ్డా యి .ప్రియుల ప్రేమకు చిహ్నాలైన వాటిని
మిగిలిన కుంకుమ తో మధురస్మృతులు పొ ందారు .చెలికత్తెలు రెండు తుమ్మెదలు వాలిన పద్మపత్రా లా లేక తమ నాయకి చంచల నేత్రా లా
,చెలి కేశపాశామా లేక తుమ్మెద సమూహమా అని ఆశ్చర్యపో యారు .చిరు నవ్వు దాచుకోనందున బయట పడిన దంతాలు అనే
కేసరాలున్న ముఖమా ,లేక వికసిత పద్మమా అంటూ పద్మవనం లో దాగిన తమ చెలికత్తెను మిగతా స్త్రీలు చాలా సేపటికి గుర్తించారు
.నాయిక నేత్రా లు తుమ్మెదలు వ్రా లిన పద్మ పత్రా ల్లా ,ముడిచిన జుట్టు తుమ్మెదల బృందం గా ,దంతకా౦తు లే కేసరాలుగా ఉన్న ముఖంగా
ప్రేమకున్న ప్రా ధాన్యం దండకు లేదని భావం .కళ్ళ చుట్టూ ఉన్న ఎర్రదనాన్నికాటుక అడ్డు కొంటో౦ది .నీటిలో కాటుక కరిగిపో యినా ,కనుల
ఎరుపుదనం నేత్రా ల తెలుపు దనాన్ని పో గొట్టిందే కాని కళ్ళ అందాన్ని పో గొట్ట లేదు ఎర్రదనం కళ్ళకు అలంకారంగా మారిందని భావం .పూల
మాలలు గంగానదీ వేగానికి తేలుతూ కొట్టు కుపో యాయి .ధనాది కారాల ఆశతో దుష్టు లు వెళ్ళ గొడితే మంత్రు ల పరిస్థితి లా ఉంది .ఆ
మంత్రు లు కూడా స్థా న భ్రస్టు లై చులకన కావటం లాంటిదే ఈ పూలదండలు నలిగి నీటిలో కొట్టు కొని తేలిపో వటం కూడా –‘’ద్యుతం వహంతో
వనితా వతంసకా –హృతాః ప్రలోభాదివ వేగి భి ర్జ లైహ్ –ఉప ఫ్లు తా స్త త క్షణ న శోచ నీయతాం –చ్యుతాది కారాః సచివా ఇవా యయుహ్ ‘’
శరీరాలకు అల౦కార౦ కోసం పూసుకున్నవన్నీ నీటిలో కరిగే పో యినా ,సహజ సౌందర్యం అలానే ఉంది .అప్సరసలు వస్తు వులకే
అలంకారం తెస్తా రని వారి ప్రియులు భావించారు .నదిలో స్నానించిన సవతుల నఖ క్షతాలుల చూసి సవతులు భగ్గు మన్నారు .అప్సరసల
అలంకారాలన్నీ గంగ నీటిలో ఉండటం చేత వీళ్ళ ఆదిక్యంఏమీ కనిపించలేదు .గంగార్పణం .చేతులతో నీటిని కదలిస్తు ంటే మద్దెల మోతగా
స్త నాలు కదుల్తు న్నాయి .చలితో వణుకుతూ నృత్యం చేస్తు న్నాయా అని పించాయి .—ముహుహ్ స్త నైస్తా ల సమం సమాదదే-మనో రమం
నృత్యమివ ప్రవేపితాం ‘’.వారి ముఖాలు నీటిలో ప్రతిబింబించాయి స్త్రీలకూ సంతోషం కలిగించేట్లు గంగానది అత్యంత స్వచ్చంగా ఉంది .నిర్మల
మనస్కులు పరోపకారులౌతారు –‘’కృతాను కూల్యా సురరాజ యోషితాం-ప్రసాద సాఫల్య మవాప జాహ్నవీ ‘’.
వారి తొడలను చేపలు తాకగా భయపడి,చేతులు అటూఇటూ కదిల్చారు .చేపతాకిన అప్సరస భయంతో ప్రియుడిని వాటేసుకొని
సంతోషం కలిగించింది. కృతక చేస్టలకంటే సహజ ప్రేమ ను ప్రకటించే చేస్టతో స్త్రీలు ప్రియుల మనసు దో చుకొంటారు కదా –‘’అకృత్రిమ ప్రేమ
రసాహి తైర్మనో –హరంతి రామాః కృతకైరపీహితైహ్’’.నీటిలో మునిగి స్నానం చేయటం వలన తలవెంట్రు కలు చెదిరి ముఖాలపై
పడి,తుమ్మెదలు మూగిన పద్మాలనిపించాయి .ఒక అప్సరస నీటిలో మునిగినట్లు నటించి, భయం లేకుండా ప్రవర్తించి, ప్రియుడినిఅల్లు కొని
ఆన౦దించి ,చెలికత్తెలకు మాత్రం భయంతో ఆధారంగా అతడిని పట్టు కొన్న భావన కలిగించింది .ప్రియులు చేతులతో నీటిని ప్రేయసులమీద
చల్లు తుంటే విలాసంగా నవ్వుతూ చేతులు అడ్డు పెట్టు కొన్నారు .దీనితో ఉచ్చ్వాస నిశ్వాసాలు ఎక్కువై స్త నాలు వణుకుతున్నట్లు
కదుల్తు న్నాయి .తియ్యటిమాటలతో ప్రియురాళ్ళను ప్రియులు అనున యిస్తు న్నారు .కనురెప్పలు కిందకు వాల్చి నీటి బి౦దువు లున్న
కనురెప్పలను మూసుకొంటున్నారు .దో సిలి నిండిన నీటితో ప్రేయసి ప్రియుడిపై చల్ల బో తుంటే ,అతడు పట్టు కొని ఆమె పైనే చల్ల గా,ఆమె నీవీ
బంధం ఊడగా, మొలనూలుకాపాడింది .కాటుకలేనికళ్ళు,లాక్షారసం లేనిపెదవుల కంపం ,నుదుటి ముడతలు వారికి అందాన్ని కలిగించాయి
.అర్ధనిమీలిత నేత్రా లతో ఒకామె ప్రియుడిని కవ్వించిన ప్రేయసి కంపం కలిగి స్త నాలు ఊగి ,మన్మధ వికారం అని పించింది .సవతిని నీటితో
సరదాగా తడపటం చూసి ఒక నాయిక సహించలేక పో యింది .ఇలా ఇస్టా పూర్తిగా జలక్రీడ పూర్తి చేసి ,తీరం చేరారు .స్త్రీల విరహం తాళలేక
ముందుకు నది సాగిపో తోందా అని పించింది .ఆప్తు లు దూరమైపో తుంటే కొంత దూరం సాగనంపటం ఆనవాయితీ –‘’ఉత్సర్పి తోర్మియ
లంఘిత తీర దేశ –మౌత్సుక్య నున్నమివ వారి పురః ప్రతస్థే ‘’.వీరు తీరం చేరగానే చక్రవాకాలు వేరే తీరానికి వెళ్ళాయి .కమలశోభ తగ్గింది
.ఆకాశ గంగా జలంతో వాళ్ళ హారాలమాలిన్యం వదిలిపో యి ప్రకాశించాయి.వాళ్ళు నక్షత్రా ల వెన్నెల రాత్రు ల్లా శోభించారు –‘’సంరేజిరే
సురసరిజ్జల దౌత హారా –స్తా రా వితాన తరలా ఇవ యామవత్యః’’.అప్సరసల అంగరాగ చందనం కలిసి గంగాజలం రంగుమారింది తొందరలో
తెగిన హారాల మణుల కాంతి చేరటం తో అనేక రంగుల హ౦గు ,పొ ంగు పొ ందింది .నది దేవకాంతల పుక్కిలి౦పులతో అలలేర్పడ్డా యి
.వీటన్నిటితో నది శయనీయ పడక శోభ పొ ందింది .-‘’సంక్రా ంత చందన రసాహిత వర్ణ భేదం –విచ్చిన్న భూషణ మణి ప్రకరాంశు చిత్రం –
బద్ధో ర్మి నాక వనితా పరి భుక్త ముక్త ం –సింధో ర్బ భార సలిలం శయనీయ లక్ష్మీం ‘’
కిరాతార్జు నీయం-.12
నవమ సర్గ -1
జలక్రీడల తర్వాత ప్రియుల పొ ందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డ ం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన
సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొ రలగ
ముత్యాలహారం కదలికగా కాంతి ఆకర్షింప బడిందని భావన .సూర్యుడు దాహంతో కిరణాలనే చేతులతో పద్మం లోని మధువును అతిగా
తాగగా యెర్రని దేహం తో నేల వాలాడు .అతిగా మద్యం తాగినవాడు మత్తు లో ఎరుపెక్కి నేలకూలినట్లు సూర్యుడున్నాడని భావం –‘’అంశు
పాణి భి రతీవ పిపాసుహ్ –పద్మజం మధ భ్రు శం రస౦ యిత్వా –క్షీబతా మివ గతః క్షితి మేష్య౦ –ల్లో హితం వపురువాహ పతంగః ‘’.ఎర్రబడి
అస్త మిస్తు న్న సూర్యుడు అందరికీ ఆనందం పంచాడు .భూమి వేడి తగ్గింది . ఆవేడి చక్రవాకాల హృదయాలలో ప్రవేశించి౦ది .చక్రవాకాలు
రాత్రి వేళ చూడలేవు. అందుకని తమ సహచరులను చూడ లేక పో తామేమో అనే విరహ బాధ వాటి మనస్సులో చోటు చేసుకొన్నది అని
భావం .సగం అస్త మించిన సూర్యుడి కిరణ తేజస్సు తూర్పు వెళ్ళలేక ,పడమటి సూర్యునీ ఆశ్రయించలేక తేజో విహీనమైంది .సేవించిన
యజమాని మధ్యలో వదిలేస్తే సేవకుని పని రెండిటికీ చెడిన రేవడి లాగా అవుతుంది కదా –‘’ముక్త మాల లఘు రుజ్ఘితపూర్వహ్-పశ్చిమే
నభసి సంభ్రు త సాంద్రహ్ –సామి మజ్జ తి రవౌ న విరేజే –భిన్న జిహ్మ ఇవ రశ్మి సమూహః ‘’.సూర్యకాంతి కుంకుమ లాఎర్రనై మేడలోని
కిటికీల గుండా ప్రసరించగా ,అప్సరసలు ప్రియుడు పంపిన దూతికలు సాయం అలంకారాలకు తొందర పెడుతున్నాయా అన్నట్లు ఆదరంగా
లోకో ,భూమి లోకో వెళ్ళాడు .తర్వాత గమన వేగం పెరగటం తో ఎక్కడికి వెళ్లి ందీ గుర్తించలేక పో యారు .-‘’’’అగ్ర సానుషు నితాంత పిశంగై –
ర్భూరుహా న్మ్రుదుకరైవ లంబ్య-అస్త శైల గహనం ను వివస్వా –నావివేశ జలదిం ను మహీం ను ‘’.ఇళ్ళకు చేరుతూ పక్షులు కిలకిలారావం
చేస్తు న్నాయి. సంధ్యా సమయం దాటటం తో ఎరుపు దనం తగ్గింది .సంధ్య సూర్యోదయాత్పూర్వ పరిస్థితి పొ ందింది .అంటే చీకట్లు క్రమంగా
ఆవరిస్తు న్నాయని భావం .పైన మేఘాల వరుస ,కింద సంధ్యారాగం తో పడమటి ఆకాశం తరంగాలతో అలంకరించబడిన పగడ కాంతులతో
అందంగా ఉన్న సముద్ర శోభ పొ ందింది –‘’ఆస్థితః స్థ గిత వారిద పంక్త్యా-సంధ్యయా గగన పశ్చిమ భాగః –సో ర్మి విద్రు మ వితాన విభాసా –
దో సిలి వొగ్గి ,తలవంచి ఏకాగ్రత తో ఉపాసించే జనాన్ని వదిలి ,వారి ప్రేమను కాదని ,సంధ్య మరో దారిలో పో వటం చాంచల్యం తో దుర్జ న
మైత్రిని అనుకరించింది .సంధ్యా వందనాది క్రియలతో ప్రేమించే జనాన్ని వదిలి ,సంధ్యాసమయం దాటి పో యిందని భావన –‘’ప్రా ంజలా వపి
జనే నతమూర్ధ్ని –సంధ్యయాను విదధే విరమంత్యా –చాపలేన సుజనేతర మైత్రీ ‘’.ఉదయపు ఎండకు ఎక్కడో దాక్కున్న చీకటి ఎండ
లేకపో వటం తో పల్లా ల నుండి క్రమంగా సమతలం చేరి ఆక్రమించింది .-‘’ఔషతాప భయాదప లీనం –వాసరచ్ఛవివిరామ పటీయః –స౦
నిపత్య శనకైరివ నిమ్నా –దంధకార ముద వాప సామాని ‘’.చీకటి బాగా వ్యాపించటం తో అన్నీ ఒక చోటనే చేరినట్లు ంది .అంటే తారతమ్యాలు
తెలీటం లేదు .చీకటి అన్నీ తనలో దాచేసుకొంది అని భావం –‘’ఏకతామివ గతస్య వివేకః –కస్య చిన్న మహతో ప్యుపలేభే –భాస్వతా నిదధిరే
భువనానా –మాత్మనీవ పతికేన విశేషాహ్’’.చక్రవాకాలలో వియోగం పెరిగింది దైవ నిర్ణ యానికి అడ్డు లేదుకదా .రాత్రిళ్ళు కళ్ళు కనిపించవు
కనుక దైవాజ్ఞ గా విరహం అనుభవిస్తు న్నాయి .తన ప్రియు రాలితో మాట్లా డ గలుగుతోందే కాని చూడలేక,తాక లేక పో తోంది ఈ దుర్దశను
చూసి పద్మ నాళంముడుచుకున్న ముఖ పద్మాన్ని కిందికి వాల్చింది .ఇతరుల దుఃఖ వియోగ బాధ చూసి స్త్రీలు ఉదాసీను లౌతారు కదా
–‘’యచ్ఛతిప్రతి ముఖం దయితాయై-వాచమంతిక గతేపి శకుంతౌ-నీయతే స్మ సతి ముజ్గ్హిత హర్షం –పంకజం ముఖ మివా౦బురు హిణ్యా ‘’
చీకటి దట్ట ంగా వ్యాపించి పర్వతాలకు నలుపు రంగు పూసిందా,ఆకాశం భూమిపైకి వంగిందా,నల్ల టి దుప్పటి కప్పిందా,ఎత్తు ,పల్లా ల భూమి
చదునైనదా,దిక్కులే లేకుండా పో యాయా అన్నట్లు చీకటి ముసిరి గుర్తించకుండా చేసింది –‘’రంజితాను వివిధా స్త రు శైలా –నామితం ను
గగనం స్థ గితం ను-పూరితా ను విష మేఘ ధరిత్రీ –సంహతా ను కకుభ స్తిమి రేణ’’.కాంతి పద్మాలను వదిలి నక్షత్రా లతో ప్రకాశించే ఆకాశం
చేరింది .ఆపద లేకుండా ఉండటానికే ప్రతి వాడూ ప్రయత్నిస్తా డు కదా –‘’రాత్రి రాగ మలినాని వికాసం –పంకజాని రహయంతి విహాయః –
తూర్పున చంద్రో యమై దాని కాంతి మొగలి పూ కేసరకాంతి లా ఉంది .కర్పూరపు పొ డి పిడికిటితో చల్లినట్లు అంతటా వ్యాపించింది
–‘’వ్యానశే శశ ధరేణ విముక్త ః –కేతకీ కుసుమ కేసర పాండుహ్-చూర్ణ ముష్టి రివ లంభిత కాంతి –ర్వాసవస్య దిశా మంశు సమూహః
‘’.తూర్పు అనే నాయిక చంద్ర నాయకుడు సమీపించటం తో చీకటి ముఖం దుఖం వదిలేసి నవ్వులాంటి కిరణాలతో ఉజ్వలంగా ప్రకాశించింది
.అంటే చీకటిని దూరం చేస్తూ చంద్రో దయం అయిందని అర్ధ ం .ఉదయగిరి నుంచి చంద్ర కిరణ సమూహం నల్ల కలువ కాంతి గల ఆకాశం లోకి
వ్యాపించింది .ఆకాంతి ఆకాశం లో,సముద్రం లో చేరి తెల్లని గంగానది నీరు మరింత స్వచ్చంగా ప్రకాశించింది .-‘’నీల నీరజ నిభే హిమ గౌరం –
శైల రుద్ధ వపుషః సిత రశ్మేహ్-ఖే రరాజ నిపతత్కరజాలం –వారి ధేహ్ పయసి గా౦గమివామ్భః ‘’.ఆకాశ అంధకారాన్ని చంద్రు డు ఉదయ
కిరణాలతో ముందుకు తోస్తూ ,శివుడు నల్ల ని గజ చర్మాన్ని తీసి ముందుకు తోసినట్లు గా భాసి౦చాడు.చీకటి గజ చర్మం,చంద్రు డు సాక్షాత్తు
శివుడు అనిపించారని భావం –‘’ద్యా౦ నిరుంద దతి నీలఘ నాభం –ధ్వాంత ముద్యత కరేణ పురస్తా త్ –క్షిప్య మాణ మసితేతర భాసా –శంభు
కిరాతార్జు నీయం-.13
నవమ సర్గ -2
చంద్రు డు దగ్గ రకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పో గొట్టు కొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస
పీల్చుకొన్నట్లు న్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః
లో నుంచి పైకితోసినట్లు న్నది .చంద్ర కళ ఆది వరాహం కొమ్ము కోర గా భావించాడు కవి –‘’లేఖయా విమల విద్రు మ భాసా –సంతతం తిమిర
స్త నమండలం లాగా ప్రకాశిస్తూ ,,తూర్పు సముద్రం నుండి చంద్రు డు పైకి వచ్చాడు .బంగారు కలశం లాగా భాసించాడు –‘’హేమకుంభ ఇవ
పూర్వ పయోధే –రున్మమజ్జ శనకై స్తు హాయ్ నా౦శుహ్’’.ఇంకా కొంత చీకటి ఉండి,రాత్రిని ముఖం పై కప్పుకొన్న ముసుగు తొలగించినా
,సిగ్గు తో ముడుచుకొన్న కొత్త పెళ్లి కూతుర్లా లోకం తృప్తి చెందకుండా చూస్తూ నే ఉంది –‘’వ్యంశుక స్పుట ముఖీ మతి జిహ్మాం-వ్రీడయా నవ
వధూ మివ లోకః ‘’.పర్వతాలలో ఇంకా చీకటే ఉంది .దిక్కుల మొదళ్ళలో కాంతి వ్యాపించలేదు అయినా రాత్రిమాత్రం అందంగా ఉన్నది –
దిజ్ముఖేషున చ దామ వికీర్ణం –భూషితైవ రజనీ హిమ భాసా ‘’.నెమ్మదిగా ఆకాశం చేరిన చంద్రు డు విరహ స్త్రీల వేడికన్నీటి చూపులను
సహిస్తూ ,భయపడినట్లు నెమ్మదిగా ప్రయాణిస్తు న్నాడు –‘’మందమంద ముదితః ప్రయయౌ ఖం –భీత భీత ఇవ శీత మయూఖాః’’.కిరణాల
కలిగించింది .మొత్త ం చీకటిని పో గొట్ట్టిన చంద్రు డు క్షీర సముద్రా న్ని మధించినప్పుడు అందులోని పాలు పైకి ఉబికి ఎత్తైన చెట్ల వనాలను
ము౦చినట్లు ంది –‘’క్షీర సింధురివమందరభిన్నః –కాననాన్య విరలోచ్చ తరూణి’’.వృక్షాల కింది భాగం లోఆకుల మధ్య నుండి చంద్ర కిరణాలు
వ్యాపించి నేలపై తెల్లని ముగ్గు లతో అలంకరించిన నివాస గృహాలా అని పించాయి .పగటి ఎండలో భార్యతో కలిసి ఆడిన చక్రవాకం ,రాత్రి చంద్ర
కిరణాలను సహించలేక పో యింది. దుఖం లో ఉంటె ప్రతిదీ సహి౦చరానిదే అవుతుంది.-‘’ఆతపే ధృతి మతాసహా వధ్వా - యామినీ
నీటి తు౦పురులను ,కలువల గంధాన్నీ ,పరాగాన్నీ వెదజల్లు తున్నరాత్రి గాలి సుఖం గా నిద్రిస్తు న్న పక్షులున్న చెట్లను కొద్దిగా
కదిలిస్తో ంది .కాముడు పరిమళ ద్రవ్యాలు పూసుకొన్న చేతి తో ప్రియురాల్ని తనవైపు ఆకర్షించి నట్లు ఉన్నదని భావం .-అదుధావ పరిలీన
విహంగా –యమినీ మరుదపాం వనరాజిహ్ ‘’.రాత్రి అనే రమణి మన్మధుడికి పట్టా భి షేకం చేయటానికి ఎత్తి న వెండి కలశం లాగా చంద్రు డు
పైకొచ్చాడు .ఆ కలశం లో మంచు కిరణాలే నీరు .చంద్రు నిలోని మచ్చ నల్ల కలువ పూవు .-‘’సంవిధాతు మభి షేక ముదాసే –మన్మధస్య
లసదంశు జలౌఘః –యామినీ వనితయా తత చిహ్నః -సో త్పలో రజత కుంభ ఇవేందుహ్’’.ఎంత పరాక్రమం ఉన్నాసాయం చేసే వాడు
లేకపో తె రాణించ లేడు .అందుకే మన్మధుడు చంద్ర కిరణాలే బాణాలుగా సాయం తీసుకొని ధనువు వంచాడు –‘’ఓజసామపి ఖలు
సురత క్రీడకు సమయమైనదని అప్సరసలు ,మళ్ళీ మళ్ళీ అలంకారం చేసుకొంటున్నారు .ప్రియులరాకకోసం దూతికల్ని పంపటం, ఆరా
తీయటం చేస్తు న్నారు .ప్రియ విరహం తో వారి అలంకారాలు,క్రీడా గృహ అలంకారాలు వారికే నచ్చటం లేదు .విరహం సహించలేక తామే
బయల్దే రారు ..ఒకామె ఆ ఇంటికి వెళ్ళకు అక్కడ నీ సవతి ఉంది అని హెచ్చరి౦చినా మద్యం మత్తు లో మాట వినక మనసు శరీరం
దుర్బలం చేసుకొన్నది .అదే సహాయం ,ఆసరా అనుకొన్నది .-‘’మానినీభి రప హస్తి త ధైర్యః –సాదయన్నపి మదో వలల౦బే’’ .ప్రియులు
ప్రియురాళ్ళ ఇళ్ళకు చేరారు దారి మర్చిపో లేదు .మన్మధుని వలన బుద్ధి నశించినా ,ఆ మరుపు మేలే చేస్తు ంది –‘’మన్మధేన పరిలుప్త
మతీనాం –ప్రా యశః స్ఖ లిత మాప్యుపకారీ ‘’.త్వరగా ప్రియుడిని పొ ందాలని తానే వాడి ఇంటికి వెళ్లి ఒక స్త్రీ కణతలపై పులకా౦కురాలు కలిగి
,చెమటతో పత్ర రచన తిలకం చెదరి పో యింది .కాని సహజ సౌందర్యం తో చంద్రు ని జయించింది –‘’నిర్జగాయ ముఖ మిందు మఖండం-ఖండ
పత్ర తిలకా కృతి కాంత్యా ‘’.నాయిక చెలి తో ‘’ఆ దూర్తు ని సంగతి అంతా నాకు చెప్పు .వాడిని అనుమానం లేకుండా నిందించు ‘’అంటే చెలి
‘’భర్త విషయం లో పౌరుషం మాటలు పనికి రావు ‘’అన్నది .నాయిక ‘’ఐతే బతిమాలి ఓదార్చి తీసుకురా ‘’అంటే ‘’అపకారాలు చేసిన వాడిని
బ్రతి మాలడం ఎలా?’’అంది .’’ఒసే అందాలరాసీ ! ప్రియుడి విషయం లో కోపం దేనికే ?’’అంటూండగానే ప్రియుడు వచ్చి,ఆ మాటలు విని
బహురస ధైర్యాన్నిపొ ందారు .అంటే నవ్వు ,దాష్ణీకం ,ప్రేమ ,మనం ఏం చేసినా ఫర్లేదు అనే ధైర్యం కలిగింది భావం . క్రీడా గృహం లో ఏయే
వింతలు విశేషాలు ప్రదర్శిస్తా రో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాలిగా మరి, అంతేగా మరి !
కిరాతార్జు నీయం-.14
అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పో గొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని
ఆపలేక పో యాయి అంటే సరి పో తుంది .ఒక దూతిక ఒక కామునితో తన నాయికచూపు అతని కోసంగుమ్మం లోనే ఉందనీ ,అరచేతుల్లో
కణతలు చేర్చి అతడి గురి౦ చే ఆలొచిస్తో ందనీ ,ఒక్క మాటలో ఆమె జీవితం అతడి పైనే ఆధార పడి ఉందనీ ,కలహాలెందుకు? అన్నది
ఆమెకల హా౦తరిత అన్న మాట .మొదట ఓరగా చూసి ,ప్రియుని గుండెపై పడుకోవటాన్ని అడ్డు కొనగా సిగ్గు అందాన్ని కలిగించింది . ప్రియ
సంగమం లో సిగ్గు పారిపో యింది .ప్రియుడి తప్పు ప్రియురాలికి తెలిసి కోపిస్తే ,ఆ సాకుతో వాడు వెళ్లి పో వాలని ప్రయత్నిస్తే ,వేదనతో కన్నీరు
పెట్టు కొనగా ఆగిపో యాడు .ఈమె అధీర ఖండిత .విశ్వాసం లేని నాయకుడిని గూర్చి నాయిక ఏడుస్తు ంది అయినా వాడిని ప్రేమించినట్లు
,పొ ందుకోరుతున్నట్లు ,పులకాంకిత దేహం తెలుపు తోంది .ఈమె కూడా అధీరా ఖండిత నాయికయే .
చంచల దృష్టి తో చూస్తు న్న ప్రియురాలి ముఖాన్ని అకస్మాత్తు గా ప్రియుడు ముద్దు పెట్టు కొన్నాడు .ఆమె చీరముడి వీడి చీర కూడా సిగ్గు తో
జారిపో యింది .జారిన చీరను మొలనూలు వద్ద ఆగిపో గా ,ప్రియుడు ఆమాత్రం అడ్డ ంఎందుకని పూర్తిగా లాగేశాడు .ఆమె తన స్తూ ల
చనుగవతో వాడిని గుండ్రంగా చుట్టు కొని కంట పడనీయ లేదు .రతిక్రీడలో గట్టి కౌగిలింతలు ,నఖ క్షతాలు ,చుంబనాలు దంత క్షతాలు
జోరుగా సాగాయి .మన్మధుడు తన సౌకర్యం కోసం సంయోగం లోనూ వియోగం లోనూ క్రూ రత్వాన్నే ప్రదర్శిస్తా డు .-‘’సౌకుమార్య గుణ
సంభ్రు త కీర్తి –ర్వాను ఏవ సురతేశ్వరపి కామః ‘’.సంభోగం లో అప్సరసలు డగ్గు త్తి క పొ ంది ,సరిగా మాటలు రావటం లేదు. చేతులు ఆడిస్తూ
,ఛీఛీ అంటూ ,కళ్ళు సగం మూస్తూ ,ఆనంద పారవశ్యం పొ ందారు .ప్రియులైన గంధర్వులు అచ్చరల ఆధార పానం, మద్య పానం కోరి
అనుభవించారు .దీనితో రతి అడ్డూ ఆపూ లేకుండా సాగి కొత్త అనుభూతులనిచ్చింది .కలయిక లలో అలకలు మాయమయ్యాయి .మద్యం
తో వివాదం పో యింది .అలా సంతృప్తి చెందిన జంటలపై కాముడు బాణ ప్రయోగం చేయ లేక పో యాడు –‘’మానినీ జన ఉపాహిత సంధౌ –
సందధే ధనుషి నేషు మన౦గః’’.కోపం తో ఉంటేఅనునయిస్తూ ,సపర్యలతో స్వాధీనం చేసుకొంటూ ,కలిసి మద్యం తాగుతూ హాయిగా
రమించారు .సిగ్గు , బద్ధ కం వదిలి చాతుర్య ప్రదర్శన చేశారు .తాముతాగి ప్రియులకు అందించారు .కలిసి పుచ్చుకొన్నారు .మాటిమాటికీ
సాకుతో ప్రియురాలి పెదవి నొక్కి హాయి పొ ందారు .ప్రియులు ఇచ్చిన మద్యం ప్రియు రాళ్ళకు మరీ మధురం అని పించింది .గుణం ఉన్న
వస్తు వు ఆశ్రయాన్ని బట్టి మరింత గుణాన్ని పొ ందుతుంది కదా –‘’ప్రా ప్యతే గుణ వతాని గుణానాం-వ్యక్త మాశ్రయవశేన విశేషః - ‘’తత్త ధాహి
దయితానన దత్త ం –వ్యానశే మధు రసాతిశ యేన’’ .స్ఫటిక పాన పాత్రలలో ప్రతిబింబించిన దంతక్షతాలను చూసుకొని సంబరపడ్డా రు
.తెగతాగటం వలన పెదవుల లత్తు క కరగి క్షతాలు బాగా కనిపించాయి .అవి గాడ్హా ను రాగానికితీపి గుర్తు లు .అందుకే ‘’ఆన౦దో బ్రహ్మ’’ గా
ఉన్నారు .కళ్ళకు ఎరుపుదనమిచ్చి,పదవుల ఎర్రదనం హరించి ,ముఖాలకు తమ పరిమళాలనిచ్చి ,ముఖగందాన్ని తాము తీసుకొని ఈ
వారుణి ఆ స్త్రీల గుణాలను కావాలనే తీసుకోన్నదా,లేక భ్రమతో ఒకదానికొకటి తీసుకొందాతెలియటంలేదు .ఒక నాయిక కళ్ళలో సమాన
అలంకారంగా ఉన్న కర్నో త్పలం వ్యర్ధమై౦దని,పనికిరాదని గ్రహించి మద్యం వలన వచ్చిన ఎరుపుదనం మిత్రు నిలా తన రంగును
నల్ల కలువపై ప్రసరింప జేసింది .అందుకే కలువ చెవి అల౦కార౦ గానే మిగిలిపో యింది .మందు బాగా కొట్ట టం తో పెదిమల రంగు పో యి
,ప్రియుడి దంతాల నొక్కులు బాగా కనిపిస్తు న్నాయి .అదీఅలంకారంగానే ఉంది .మత్తు కాంతి ఒళ్ళంతా వ్యాపించినా ,ఎరుపు కళ్ళలో ,పగడం
రంగున్న కణతల్లో అద్ద ం లో ప్రతిఫలించినట్లు వ్యాపించింది .కోపపుస్త్రీల వికారం పురుషులకువశీకరణం గా ఉంది .మద్యం ప్రవర్త నలో మార్పు
తెచ్చినా ,అదే మగాళ్ళకు మేలు చేసింది .ఇద్ద రూ ఫుల్ గా మందుకొట్ట టం వలన ఒకే వర్గ ంవారైనారు .మద్యం మత్తు లో రవిక చీర ఊడినా
శారీరక బాహ్య స్పృహే లేదు .సిగ్గు విలవిల లాడింది వారి ప్రవర్త న చూసి ,వదిలి పో లేకపో యింది .మద్యంకిక్కు చెలులు ఉన్నారన్న జ్ఞా నం
కూడా లేకు౦డా చేసింది .మద్యపాన మత్తు అనేక కొత్త రకాల సిగ్గు ను అనుకరించింది .కౌగిలిలో చేష్టలు లేకపో వటం ,సిగ్గు లోనూ ,మద్యం
లోనూ కలిగే సమాన గుణాలు .అందుకే వీటి పో లిక అనుకరణ లాగా అనిపించింది ..అభిమానవతి అయినా ,ప్రియుడి ఒడిలో కూరుకు
పో యింది .చంచలస్వభావ మద్యం గుణ దో షాల విషయం లో రహస్యాలను బయట పెడుతుంది అనేది నిజం ---‘’కారయిత్య నిభ్రు తా గుణ
దో షే –వారుణీ ఖలు రహస్య విభేదం ‘’.మద్యం కిక్కుతో రాతి క్రీడమహా మాధుర్యం పొ ందింది .ఆ ఆన౦దాతి శయం వలన మదనోదయం
మద్యం మత్తు లో ఉంటే ప్రియుడు ఇంకో దానితో ‘’జంప్ జిలానీ’’అవుతాడేమో అనే అనుమానం తో’’ తీర్ధ ం పుచ్చుకోటం’’ తగ్గించారు
.ప్రేమలేకపో తే భయం ,అనుమానం కలగటం సహజమే.-‘’యోషితో న మదిరాం భ్రు శ మీషుహ్-ప్రేమ పశ్యతి భయాన్య పదేపి’’.ఏకాంతం
,మన్మధుడు ,మధుపానం మత్తు ,చంద్రు డు, సంభోగం మరో లోకానికి తీసుకు వెడతాయి .అందుకే ఈఅప్సరసలకు హద్దు అనేదే లేదు-
‘’చిత్త నిర్వృతి విధాయి వివిక్త ం-మన్మధో మధు మదః శశి భాసః –సంగమశ్చ దయితైహ్ స్మనయ౦తి –ప్రేమ కామపి భువం ప్రమదానాం
‘’.పురుషాతనం తో సహా సకల విధ రతి క్రీడలు సిగ్గూ లజ్జా లేకుండా చేసి అనుభవించగా వాడి వత్త లైన పూల దండలు పడక అంతా
పరచుకోగా మన్మదుడికే మత్తెక్కినట్లు అనిపించింది .ఇస్ట మైనవారు చేయలేని పని ఉండదు అనిపించింది –‘’మానినీ రతివిధౌ కుసుమేషు –
స్త్రీలు రతి రసాస్వాదనలో మునిగి పో గా మగాళ్ళు రెచ్చిపో యి వారిస్టంవచ్చినట్లు ప్రవర్తించి ,అన్ని చోట్లా అంటే స్థా నం కాని స్థా నాలలో
కూడా చు౦బన తాడనాలతో విజ్రు ౦భిం చారు .అదీ అందంగానే ఉంది .ఇలా మాంచి ఊపులో ఉండగా వైతాళికుల మంగళ ధ్వానాలు
వినిపించాయి .అర్ధ రాత్రి దాటిందని తెలిసింది .వాళ్ల కు రాత్రి బాగా సంకోచి౦చి౦దని పించింది.మొత్త ం మీద రాత్రంతా ఆగమాగ౦ చేసి ఇక లేవక
తప్పదని తెలిసి ,ఎడబాటుకు కుంగుతూ ,మళ్ళీ’’ ఇన్నింగ్స్’’ప్రా రంభించి,మరింత స౦తృప్తి చెంది లేవటానికి సిద్ధపడ్డా రు .సంభోగ శ్రమతో
అలసిన అర్ధనిమీలిత స్త్రీలకు శరీర మర్ద న ద్వారా సేవ చేయటానికా అన్నట్లు ప్రా తః కాలపు మంద పవనాలు సౌదాల్లో కి ప్రవేశించాయి .అక్కడి
నలిగినపూల పరిమళం , మద్యం వాసన ,చందనాదుల అంగాంగ రాగాల గంధాన్ని ఆ వాయువులు అన్ని చోట్లా వ్యాపింప జేశాయి .ఇంకా
కొద్దిగా మత్తు ఉన్నా అందంగానే ఉన్నారు స్త్రీలు .కళ్ళు కాళ్ళు నిలవటం లేదు .ఆ స్త్రీల విరహ వ్యాకులత పో గొట్ట టానికి రాత్రి సంభోగ
చిహ్నామైన నఖక్షతాది లక్ష్మీ సంపద విడువని చెలికత్తెలాగా వారి శరీరాన్ని అంటుకొనే ఉంది . అ౦గ రాగాలు గోటి నొక్కుల్లో మిగిలాయి
.మద్యపానం, ఆధర పానం వలన పెదవుల ఎరుపు పో యింది .వాటి శోభా లక్ష్మి యే ఆ స్త్రీలను పట్టు కొని ,చెలి కత్తెల్లా గా సాంత్వన
చేకూర్చాయని కవి భావం –‘’గతవతి నఖ లేఖా లక్ష్యతా మంగరాగే –సమద దయిత పీతా తామ్ర బి౦బా ధరాణా౦ –విరహ విదుర మిస్టా
కిరాతార్జు నీయం-.15
అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లు తూ వెళ్ళారు .స్త న ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తు క పాదాలలతో స్త్రీలు
ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి నల్ల ని గడ్డి లాక్షారవం అంటుకొని వర్షా కాలం లో వ్యాపించే యెర్రని కీటకాలు నేలంతా
వ్యాపించాయా అన్నట్లు న్నది .మొలనూలు కాలి గజ్జ ల సందడి ఇద్రకీల గుహలలో ప్రతిధ్వనించింది .హంస, సారసాలు అరవగా మనోహర
ధ్వని వ్యాపించింది .ఫలపుష్పాలతో ఉన్న చెట్లవద్ద క్రూ ర మృగాలైన సి౦హాలతోపాటు ,సాదువులైన లేళ్ళు కూడా కలిసి ఉండటం చూసి
ఆశ్చర్యపో యారు .మనసు ఉద్విగ్నత చెంది,అర్జు నముని స్తా వరం దగ్గ రే ఉందని తెలుసుకొన్నారు .-‘’అభిద దురభితో మునిం వదూభ్యః –
సముదిత సాధ్వస విక్ల బం చచేతః ‘’.రాజర్షి అర్జు నుడున్న చోట అప్సర గంధర్వులకు ధైర్యం సన్నగిల్లి ంది .పరమ ప్రభావంతో ఉన్న
తాపసులకు అసాధ్యం ఉండదు కదా –‘’ఉపహిత పరమ ప్రభావ ధామ్నాం –నహి జయినాం తపసా మలంఘ్య మస్తి ‘’ .ఇసుకలో అర్జు నుని
కాలి గుర్తు లు కనిపింఛి భయపడ్డా రు .ఆ అడుగుల్లో అతిమానుష ధ్వజం ,చక్రం మొదలైన గుర్తు లు కన్పించాయి .
‘’స చకిత మివ విస్మయాకులాభిహ్ –శుచి సికతా స్వతిమానుషాణితాభిహ్ –క్షితిషు దద్రు శిరే పదాని జిష్నో-రుపహిత
కేతురథాంగలా౦నాని’’.అక్కడి ఋతు సమృద్ధికి అర్జు నముని ప్రభావమే కారణమని గ్రహించారు .-‘’రుతురివతారు వీరుధాం సమృధ్యా-
యువతి జనైర్జ గృహేముని ప్రభావః ‘’.అక్కడి అశోకం బాగా ఆదరాన్ని కల్గించింది దానికొమ్మపై నీరు కారున్న ముని వస్త ం్ర ఆరేయటం తో అది
వంగింది .అందుకే రాపిడి వల్ల చిగురాకులు నేల వ్రా లాయి .గొప్పవారి సేవవలన గొప్పతనమే వస్తు ంది..అచ్చరలు కూడా
ప్రభావితులయ్యారని భావం –‘’బహుమతి మదికాం యయావ శోకః –పరిజనతాపి గుణాయ సద్గు ణానాం’’. యమనియమాదు లతో
కృశించినా,బలిష్ట మైన అంగాలు ,ఆయుధాలు ఉన్న ఆర్జు నుడిని చూశారు. అథర్వణ వేదం లో చెప్పిన మంత్రా లలో అభ్యుదయం కోసం
శాంతాన్ని ,అభి చారిక క్రియ కోసం అంటే శత్రు సంహారం కోసం క్రీడి ఆయుధాన్ని ధరించటం వాళ్ళు చూశారు.శాంతమూర్తి అయినా
ఉగ్రత్వమూ తగ్గ లేదని గ్రహించారు –‘’యమనియమ కృశీకృత స్థిరా౦గః –పరి దదృశేవిధృతాయుధః స తాభిః-అనుపమశమ దీప్తితా గరీయాన్
అర్జు నుడు చంద్రు నిలా ఆహ్లా దం కలిగించే కిరణ సముదాయం చుట్టూ కలిగి ఉన్నాడు .ఇంద్రకీల పర్వతం లో ఒక శిఖరాన్ని మాత్రమే
నివాసంగా చేసుకొన్నా ,పర్వతం మొత్త ం ప్రభావితం చేస్తు న్నాడు –‘’శశధర ఇవ లోచనాభి రామై-ర్గ గనవిసారిభి ర౦శుభిః పరీతః –శిఖర
నిచయ మేక సాను సద్మా –సకల మివాపి దధన్మహీధరస్య ‘’.గంగాతీరం లో తపస్సు చేస్తూ యెర్రని జటలతో యజ్ఞ ం లో హవిస్సులు
వ్రేల్చినపుడు పైకి లేస్తు న్న అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తు న్నాడు –‘’సురసరితి పరం తపో ధిగచ్ఛన్-విధృత పిశంగ బృహజ్జ టాకలాపః –హవిరివ
వితతః శిఖాసమూహైః-సమభి లష న్నుపవేది జాత వేదాః’’.శరీరానికి తగిన ప్రయత్నం ,దానికి తగ్గ క్రియ ,అందుకు తగ్గ తపస్సు ,దానికి
విజయమే ఫలంగా శ్రద్ధా అర్జు నుడు చూపిస్తు న్నాడు .’’సదృశ మతను మా కృతేఃప్రయత్నం –తదనుగుణా మపరైఃక్రియ మలంఘ్యా౦ –దధత
లఘు తపః క్రియాను రూపం –వియతీం చ తపః సమాం సమృద్ధిం’’.నియమాలతో క్షీణించినా ,ఇంకా పర్వత బలం తో ఉన్నాడు .శాంతం
ఉన్నా ఇతరులకు లొంగని వాడు .ఏకాంతం లో ఉన్నా మంత్రు లతో కల్సి ఉన్నట్లే ధైర్యంగా ఉన్న అర్జు నుడు,ఇంద్ర సమాన తేజస్సుతో
ప్రకాశిస్తు న్నాడు –‘’చిర నియమ కృశోపిశైల సారః –శమనిరతోపిదురాసదః ప్రకృత్యా-స సచివ ఇవ నిర్జ నే పి తిష్ట -న్మునిరపితుల్య రుచి స్త్రిలోక
భర్తు ః’’.
లోకాలన్నిటి పరాక్రమ తేజస్సులను తిరస్కరించేది ,త్రిలోక రక్షణకు సమర్ధ మైన అర్జు న శరీరాన్ని చూసి అప్సరసలు ,విజయం కోసం
విజయుడు చేసే తపస్సు నిష్ఫలం అనుకొన్నారు అంటే ముల్లో కా విజేతకు ఇంకా తపస్సు ఎందుకు అని భావం .-‘’తను మవజిత లోక
సారధామ్నీం –త్రిభువన గుప్తి సహాంవిలోక యంత్యః –అవయయు రమరస్త్రియోస్య యత్నం –విజయ ఫలే విఫలం తపో ధికారే ‘’ .సాధారణ
తాపసుల్ని ,దానవుల్నీ మాకొంగుల్లో ముడేసుకొన్నాం.ఇప్పుడు ఇంద్రు డు ముల్లో క విజేత అయిన ముని ని వశం చేసుకోమని
నియమించాడు మమ్మల్ని .మా శక్తి చాటుకోవటానికి మ౦చి అవకాశం వచ్చింది అనుకొన్నారు దేవ వేశ్యలు .-‘’ముని దనుతనయాన్
విలోభ్య సద్యః –ప్రతను బలాన్యధి తిష్ట తస్త పా౦సి-అలఘుని బహుమేదిరే చ తాఃస్వం-కులిశ భ్రు శావిహితం పదేనియోగం ‘’
అర్జు నుడి ని ప్రలోభ పెట్టె కృత్రిమ ప్రయత్నం చేస్తు న్న వారిలో వెంటనే మన్మథుడు ఆవేశి౦ చాడు. యవ్వన మాధుర్య శోభ మనసుని
హరిస్తు ంది .వీళ్ళు యువతులు .అతడు మాంచి యవ్వనం లో ఉన్నాడు .అంటే అతన్ని చూడగానే వీళ్ళే మదన కా౦క్షలో పడ్డా రని భావం .
‘’అథ కృతక విలోభనం విధిత్సౌ-యువతి జనే హరి సూను దర్శనేన –ప్రసభ మవతతార జిత్త జన్మా-హరతి మనో మధురా హి యౌవన
శ్రీః’’.మన్మధుడు ఆవేశించాగానే అప్సరలు గంధర్వుల వైపు సాభిప్రా యంగా చూడగా, వాళ్ళు వీణ మృదంగాలతో మనసు హరించే ధ్వనిని
ఆకాశం నిండేట్టు పలికించగా ,అక్కడ ఋతు శోభ ఏర్పడింది .ఆకాశం నీటి మేఘాలతో ఆవృతమైంది. మెరుపులకాంతి వ్యాపించింది
కిరాతార్జు నీయం-.16
పొ ందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్త రాగాలతో గళమెత్తి గానం చేస్తో ంది –పరి భ్రు త
యువతిః స్వనం వితేనే –నవనయోజిత కంఠరాగ రమ్యం ‘’.కడిమి చెట్ల గాలి ,మత్తెక్కే నెమళ్ళ క్రేంకారం సామాన్యులని ఆకర్షించింది
.మహాత్ముల సమాధిని భగ్నం చేయటం అంత తేలికకాదనిపించింది –‘’జన ఇవ న ధృతేశ్చ చాల జిష్ణు –ర్నహి మహతాంసుకరః సమాధి
భంగః ‘’.వధూ వరుల సమాగమం లా వర్షర్తు , శరత్తు లసంధికాలం శోభించింది. బాణం ధరించినందువల్ల క్షత్రియ స్త్రీ ధ్వనించింది .శరత్ స్త్రీ
తామర తూళ్ళు అనే కంకణాలు ధరించింది .కలువ సమూహం వస్త్రా చ్ఛాదన అయింది .నీల ఝ౦టి అనే చెట్టు పూలనే బాణాలుగా ధరించి
రాగా ,వర్షర్తు అనే వరుడు తెల్ల తామర చేతులు చాపి ఆలంబన మిచ్చాడు .-‘’ధృతబిస వలయా వలిర్వహంతీ-కుముద వనైకదుకూల మాత్త
బాణా-శరదమలతరే సరోజ పాణౌ-ఘన సమయేన వధూరివా ల లంబే...నెమళ్ళకేమ్కారాలు ,హంసల మనోహర స్వరాలూ కలిసిపో యాయి
.కలువ పంక్తు లు ,కడిమి పూల వర్షం తో కలిసి శోభ పెంచాయి అధిక గుణాల పదార్ధా లు కలిసి మరింత శోభనివ్వటం సహజమే –‘’సమద శిఖి
ఋతాని హంస నాదైః –కుముద వనాని కదంబ పుష్ప వృష్ట్యా-శ్రియ మతి శయనీం నమేత్య జుగ్ము –ర్గు ణ మహతాం మహాతే గుణాయ
యోగః ‘’.దగ్గ రలో ఉన్న కదంబ పుష్ప, రాలిన మొగలిపూల మకరందం వదిలి తుమ్మెదలు బాగా మకరందమున్న ఇప్ప పూలపై వాలి
వాటిని నల్ల గా చేశాయి తొడిమ మాత్రమే నల్ల గా ఉండే ఇప్పపువ్వు పూర్తి గా నలుపుగా మారిందని భావం .’’ప్రియ మధుర సనాని
షట్పదాలీ-మలినయతి స్మవినీల బంధనాని ‘’.నీటి బిందువులతో ఉన్న పచ్చిక పై ఇంద్ర గోపాల అనే యెరని
్ర పురుగులు ముడుచుకొన్న
దిరిసెన పూల యెర్రని కాంతి పొ ందాయి .-‘’అవిరల వపుషః సురేంద్ర గోపా –వికచ పలశచయ శ్రియం సమీయుః’’.కాలం కాని కాలం లో
వచ్చిన హేమంతం వలన ప్రియంగు వృక్షాలు గుత్తు లు గుత్తు లుగా పూశాయి .వికషిత మల్లెల పరిమళం తో గాలి వీస్తే ,దట్ట ంగా మంచు
బిందువులు కురిశాయి .లవంగ లతలు లొద్దు గపూలు వికసించటంతో వాటి సుగంధం మోస్తు న్న గాలి అందరికీ సంతోషం కలిగిస్తో ంది .కాని
అర్జు నుడి మనసు మాత్రం చలించలేదు .జయమే లక్ష్యం గా ఉన్నవారి మనసు నీతిబాహ్యం కాదు కదా .-‘’వికృతి ముపయయౌ స పాండు
సూను-శ్చలతినయాన్న జిగీషతాం హి చేతః ‘’.హేమంతం చివర శిశిరం ప్రా రంభం సంధికాలం లో మామిడి చెట్లు కొన్ని పూశాయి .కొద్దిగా
మంచు పడుతోంది .వావిలి చెట్లు వికసించాయి .వీటన్నిటి పరిమళం కామునికి సహకారిగా మారింది .
పూల వనాలు చేరాలనుకొన్న వసంత లక్ష్మి చిగురించిన మామిడి కొమ్మను పట్టు కొని తుమ్మెద రొద అందెల రవళికాగా పద్మ వనాలను
వదిలింది .’’క్వణదాలికుల నూపురా నిరాసే – నలిన వనేషు పదం వసంత లక్ష్మీః’’.వికసించిన పూల పెదవి కదలిస్తు న్న గోరంత చెట్లనే
మధువును చూస్తూ ,కొత్త గా చిగిర్చిన అశోక చెట్టు పై బాణం ధరించిన మన్మథుడిని అప్సరసలు చూసినట్లు భావించారు .మెల్లగా వీస్తు న్న
మలయానిలం తో కదల్చబడిన తామర ముఖాలనే పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల అందాన్ని కలిగించాయి .-‘’ముహురనుపతా
విధూయ మానం –విరచిత సంహతి దక్షిణా నిలేన –అలికుల మలకాకృతిం ప్రపేదే -నలిన ముఖాంత విసర్పి పంకజిన్యాః’’.సాల వృక్షం కొమ్మ
అనే వధువు పుష్పమనే ముఖాన్ని ,చిగురు అనే పెదవిని ,మకరందమనే మధువును కలిగి గాలితో కదులుతూ కోపించినట్లు కనిపించింది
.తుమ్మెద అనే ప్రియుడు మాటి మాటికీ దాన్ని సమీపించి కోపం తగ్గించటానికి చేరినట్లు భావన .
జితేంద్రియత్వం ఉన్నంత వరకు అతడిని శత్రు వు జయించలేడు.ముల్లో కాలూ జయించినా వసంతం జితేంద్రియ ఆర్జు నుడిని
జయించలేకపో యింది –‘’ప్రభవతి న తదాపరో విజేతుం –భవతి జితే౦ద్రియతా యదాత్మ రక్షా –అవజిత భువన స్త థా హిలేభే -సిత తురగే
విజయం న పుష్పమాసః ‘’సితతురగుడు అంటే అర్జు నుడు . వసంత ,హేమంతాలలాగే గ్రీష్మఋతువూ నువ్వు కూడా అర్జు నుడి చేత
తిరస్కరింపడినావుకదా . లోకం లో నీ గౌరవం మాత్రం ఏమి ఏడ్చింది లే .మల్లెలు వికసించాయి అని అర్ధ ం .బలమున్నవైనా తమలో
తమకు స్పర్ధ ఉంటె ఆసైన్యం శత్రు వులను జయించలేదు .లోకాలన్నీ జయించిన ఋతువులు ఆర్జు నుడిని క్షణకాలమైనా జయించ
లేకపో యాయి.కానీ అప్సరసలమనసుల్లో కాముని ప్రవేశ పెట్టగాలిగాయి .తమ ఆయుధం శత్రు వులపై కాక తమపైనే ప్రయోగి౦చు కొన్నట్లు
అయిందని భావం ..-‘’అవిహిత హరిసూను విక్రియాణి-త్రిదశ వధూషు మనోభవం వితేనుః’’..గ౦ధర్వ వీణాగానం ,ఋతు విజ్రు ౦భణ కూడా
ఏమీ చేయలేక పో యాయి . అప్సరసల కళ్ళు అర్జు నుని అంగ ప్రత్య౦గాల లోనే నిమగ్నమయ్యాయి .వికసిత మల్లెలు వారికి ఆకర్షణ
కాలేదు .అంటే వారికి కలిగింది చక్షు ప్రీతి మాత్రమే .అందం తో ఆర్జు నుడిని వశం చేసుకోవాలని వచ్చారు .కాని అర్జు నుడే వారిలో మన్మధ
వికారాలు కలిగించి ఉల్టా పల్టా చేశాడు .-‘’ముని మఖి ముఖతాం నివీషవోయాః-సముపయయుః కమనీయతా గుణేన-మదన ముప దధే
కిరాతార్జు నీయం-.17
మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్ల వం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-
సితతురగే న చచాల నర్త కీనాం ‘’.పాదాల లాక్షారసం నేల ముద్రలుగానే మిగిలాయి .వాటిని చూసిన తుమ్మెదలు నవవికసిత కమలం అనే
భ్రా ంతి తో వాటిపై మూగాయి .పాదాలలత్తు కకు కడిమి పూల కేసరాలు అంటుకొని ,అప్సరసల అనురాగ వేడిలో కరిగి మనసులోని ప్రేమ
మూర్తీభవించినదా అని పించింది .అడుగుల గుర్తు ల్లో లాక్షారసం వాళ్ళ మనోగత అనురాగమే అనే ఉత్ప్రేక్ష .ఒక అచ్చర అతడిఎదురుకు
రాగానే ,చెలుల చాటు నుంచి ,తన విపరీత అనురాగాన్ని దాచే ప్రయత్నం చేసింది .దాస్తే కోరికలు పెరుగుతాయని తెలీదేమో !-‘’స్ఫుట
మభిలషితం బభూవ వధ్వా –వదతి హి స౦వృతి రేవ కామితాని ‘’.బాగా వీచే గాలికి మరో ఆమె వస్త ం్ర నడుము నుంచి జారి సిగ్గు లమొగ్గ
అయింది .ఆమె తొడలను చూసి సవతులే ఆశ్చర్యపో యారంటే మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా ?మరో ఆమె మన్మథ తాపం తో
తామరకాడలను కంకణంగా పెట్టు కొని ,చేతుల్లో గంధం పూసుకొన్న ముఖం పెట్టు కొని మద్యం తాగకున్నా ,మత్తెక్కే కళ్ళతో తదేకంగా
అర్జు నమునిని చూస్తో ంది .మరో ఆవిడ తనమనసు మనసులోలేక అన్యమనస్కత అయి ‘’మనః స౦గమం ‘’అనే మన్మథావస్థ ప్రదర్శించింది
.మన్మథ తాపం తో నోరు ఎండి ఏమీ చెప్పలేకపో యింది.మరో స్త్రీ .కళ్ళనుండి జాలువారే కన్నీరు చూసి చెలికత్తెల మనసులు దుఖం తో
బరువెక్కాయి .ఇది మూర్ఛావస్థ .మెత్తని పూలపాన్పు వదిలేసి ,చిగురాకులనేలపై పడుకొంది.విరహం భరించలేక సుఖం చల్ల దనం ఇచ్చే
అతడి ఒడి చేరాలను కొన్నది .ఇది ‘’అరతి జాగరం ‘’అనే మన్మథావస్థ .’’కృశించిన మా నాయిక కోర్కె తీర్చు .ఆమె అన్నీ వదిలి నీ పొ ందే
కోరుతోంది’’అని ఆమె చెలికత్తె మునికి ఫిర్యాదు చేసింది .’’కాఠిన్యం వదిలి మాట్లా డు .మునుల మనసు మెత్తగా ఉంటుంది కదా .!’’అని
విన్నవి౦చు కొన్నది .అదృష్ట హీనులు తమకు చేరిన మంచిని కూడా ఉపయోగించుకోలేరు .ఇవన్నీ విప్రలంభ శృంగార౦ లోని వ్యభి చారీ
భావాన్ని తెలియ జేసేవే –‘’ఉపగత మవ ధీరయ౦త్య భవ్యాః-స నిపుణ మేత్యకయాచి దేవ మూచే ‘’.మరో అప్సర విలాసంగా నడుమాడిస్తూ
,ఒక చేత్తో తలవెంట్రు కలు ముడుచు కొంటూ కటాక్షం అనే మన్మథ బాణం మునిపై ప్రయోగించింది .-‘’సురపతి తనయే పరా నిరాసే-మనసిజ
విశాల స్త నభారం తో కొద్దిగా వంగిన ఒక అప్సర పుష్పించిన మామిడి చెట్టు ను పట్టు కొని విలాసంగా నిలబడింది .సగం వంగిన ఆమె శరీరం
అల్లెత్రా డు లాగిన మన్మథ ధనుస్సులాగా ఉంది.అ౦గా౦గ ప్రదర్శనతో లోబరచుకొనే ప్రయత్నం చేసిందని భావం .మరో అప్సర చీర
ముడిజారిన నీలం రంగు చీర పట్టు కొని , వెళ్ళాలని లేకపో యినా ,సిగ్గు ముంచెత్తి బయల్దే రి ,జారిన మొలనూలు అడ్డు కొన్నట్లు నటించి
ముని ముందు నిలిచిపో యింది .ఒకామె ‘’నీ మనసులోశాంతి నిజంగా ఉంటే ధనుస్సు ఎందుకు ధరించావు .వంచకుడివి .విషయాభిలాష
ఉన్నవాడివి. నీకు కావాల్సింది ముక్తికాదు.నీమనసులో నీ ప్రా ణేశ్వరి దాగి ఉంది.ఇతరులను ఇష్ట పడటానికి ఒప్పుకోవటం లేదు అందుకే
మమ్మల్ని అవహేళన చేస్తు న్నావు ‘’అని దెప్పింది .ఒకామె కింది పెదవి ఈర్ష్యతో కదిల్తే ,కోపంతో అర్జు నమునిని చూస్తూ ,మానమర్యాదలు
సిగ్గూ ఒగ్గేసి ,పెద్దలనే గౌరవం కూడా లేకండా చెవి అలంకారంగా ఉన్న కలువతో అతడి వక్షస్థ లం పై కొట్టింది –‘’ఇతి విషమిత చక్షుషా భి
ధాయ –స్ఫూర దధరోష్ట మసూయయా కయాచిత్ –అగణిత గురు మాన లజ్జ యాసౌ –స్వయమురసి శ్రవణోత్పలేన జఘ్నే’’.ఇంకో అచ్చర
వినయంతో హావభావాలు ఒలకబో స్తూ దగ్గ రకొచ్చి చిరు నగవుతో తన కణతలఅందాన్ని పెంచుతూ ,చెవిదాకా వ్యాపించిన కళ్ళతో తదేకంగా
ఏమీ చేయలేక చేతు లెత్తేసి, తెల్లజండా చూపిస్తు న్నట్లు గా దీనం గా ,సిగ్గు వదిలి ఏడ్చారు .కోపంతో ఉన్న ప్రియుని పొ ందుకు ఇదే చివరి
అస్త ం్ర .అరకన్నులతో చూడటం ,సిగ్గు ,అలసట విరహం, పాలి పో యిన దేహం, దుఖించటం అనే అలంకారాలు ధరించారు. మన్మథుడు
కల్పించిన ఈ అవస్థ లే వారి అందాల్ని పెంచుతున్నాయి .మెల్లని నడక హంస నడకలను మించింది జఘన భారం తో వంపు చూపులు
మాటల్లో స్పష్ట త లేదు .కళ్ళు తెరచి ,కనుబొ మలు ఎగరేస్తూ చూసే చూపులు మనోహరంగానే ఉన్నాయి ‘’అధిక వితత లోచనం వధూనా –
మయుగప దున్నమిత భ్రు వీక్షితం చ ‘’.వారి హావ భావ చేష్టలు మనసు హరి౦చేవే అయినా ,స్థిర సమాధి గతుడైన అర్జు నముని విషయం
లో వ్యర్ధ మయ్యాయి .రౌద్ర -శృంగాలు విరోధి రసాలు .మనస్వికి మనసులో పరిశోధన జ్వలిస్తూ ఉంటుంది .అందుకే సుఖాపేక్ష ఉండదు
.’’రుచికరమపి నార్థ వత్ బభూవ –స్తిమిత సమాధి శుచౌ పృథాతనూజే –జ్వలయతి మహతాం మనా౦స్య మర్షే –న హి లభతేవసరం సుఖాభి
లాషః’’.అర్జు న ముని తీవ్ర తపస్సుతో మహే౦ద్రు ని ఆరాధించి ,శత్రు నాశనం చేసి ,రాజ్య లక్ష్మిని పొ ందాలనే కాంక్షతో ఉండటం చూసి ,తమ
ప్రణయ ప్రా ర్ధ న వ్యర్ధ ం కావటం తో ,ఉద్వేగ మనస్కులై అప్సరసలు గంధర్వులతో కలిసి మళ్ళీ తమ స్వస్థా నానికి వెళ్ళారు .
‘’స్వయం సంరాధ్యైవ౦ శత మఖ మఖండేన తపసా –పరో చ్ఛిత్యా లభ్యామభి లషతి లక్ష్మీం హరి సుతే –మనోభిః సో ద్వేగైః ప్రణయ విహతి
కిరాతార్జు నీయం-.18
వృద్ధ ముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రు ని అర్జు నుడు చూశాడు .తెల్ల వెంట్రు కలు జడలు
కట్టి,అస్త మయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త ఏందు కరైరహ్నః పర్యంత ఇవ సంధ్యయా ‘’.కళ్ళను తెల్లని కనుబొ మలు మూయగా మంచు
కురిస్తే ,వాడిన కమలం లా కనిపిస్తు న్నాయి .అతడు కమలాలున్న కొలనులా ఉన్నాడు .బాగా బరువుగా వంగిన నడుముతో ,పొ ట్ట
కనిపిస్తూ కర్ర తో నడిచే ముసలాడి గా కనిపించాడు .మారు వేషం లో ఉన్నా ,కొద్దిపాటి మేఘాలు కప్పిన సూర్యునిలా ప్రకాశమానం గా
ఉన్నాడు.-‘అ౦శు మానివ తన్వ భ్రపటలచ్ఛన్న విగ్రహః ‘’.ముసలి ఇంద్రు డు ఆశ్రమ శోభను పెంచుతున్నాడు .ఇంద్రు ని చూసి
ఇంద్రతనయుడు ఆదర స్నేహాలతో చాలించాడు .బంధువు విషయం లో బంధుత్వం తెలీక పో యినా ,మనసు మాత్రం బలంగా ఆనందిస్తు ంది
.-‘’అవిజ్ఞా తేపి బన్ధౌ హి బలాత్ప్ర హ్లా దతే మనః ‘’.కొడుకిచ్చిన ఆతిధ్యానికి సంతృప్తి చెంది ,ఆసనంపై కూర్చుని’’ యవ్వనం లో తపస్సు
మొదలుపెట్టి ,మంచి పనే చేస్తు న్నావు .మా లాంటి వృద్ధు లు కూడా విషయసుఖాలకు ఉవ్విళ్ళూరు తుంటాం .నీలాంటి యువకుల సంగతి
ఏం చెప్పాలి .’.నీ సుందర శరీర సంపదకుతపో రూప గుణం కలిసి పో యింది .రూప సంపద చాలాచోట్ల ఉంటుంది కాని గుణ సంపద ఉండటం
దుర్ల భం .యవ్వనం శరత్తు మేఘాలనీడలాగా చంచలమై వెళ్లి పో తుంది .విషయ సుఖం తాత్కాలికమే చివరికి దుఖాన్నే ఇస్తు ంది .ప్రా ణులకు
ఎప్పుడూ ఆపదలే .జనన ,జీవన మరణాలు తప్పు అని తెలుసుకొన్న వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తా డు కనుక నీ పని మంచిదే .నీ
మనసు మంచిది .ఈ శుభ ఆలోచన రావటం విశేషం .కానీ నీ వేష అనుమానంగా ఉంది .-‘’విరుద్ధ ః కేవలం వేషః సందేహ యతిమే మనః ‘’.నీ
వేషం యుద్ధా నికి తయారైన వాడిలా కవచం ఉంది.మునులు సాధారణంగా జింక చర్మం నార బట్ట లు కడతారు –‘’మహే షుధే ధనుర్భీమం
మోక్షాని కోరే నువ్వు రెండు అమ్ములపొ దులతో ధనుస్సు ఎందుకయ్యా ?జంతు హింస నీకు నిషిద్ధం కదా .-ప్రపి త్సోఃకిం చ తేముక్తిం
నిఃస్ప్రుహస్య కలేవరే –మహేషుధీ ధనుర్భీమం భూతానామనభి ద్రు హః ‘’.నీ ఖడ్గ ం చావుకు మరో భుజంగా ,ప్రా ణులకు భయంకలిగించేదిగా
ఉంది .అది తపస్సుకు శాంతి కలిగించదు కదా .-‘భయంకరః ప్రా ణ భ్రు తాంమృత్యోర్భుజ ఇవా పరః –అసిస్తవ తపస్థ స్యన సమర్ధ యతేశమం
‘’.పూజ్యుడవైన నువ్వు శత్రు వుపై జయం కోరుతున్నావు.శాంత పురుషులైన తపో ధనులెక్కడ ? కోపానికి చిహ్నమైన ఆయుధ మెక్కడ ?
కనుక నీ వాలకం పరస్పర విరుద్ధ ంగా ఉంది .-‘’జయమత్ర భవాన్నూన మరాతి ష్వభిలాషుకః –క్రో ధ లక్శ్మక్షమా వంతః క్వాయుధం కవ
తపో ధనాః ‘’.మోక్షానికి ఉప యోగ పడే పనులు హింసకు ఉపయోగించిన వాడు మూర్ఖు డు .అలసటను తొలగించే తేట నీటిని బురదగా
మార్చే వాడితో సమానం –‘’యః కరోతి వధో దర్కానిః శ్రేయస కరీః క్రియాః-గ్లా ని దో ష చ్ఛిదః స్వ చ్ఛాః స మూఢః పంకయత్యపః ‘’.హి౦సాది
దో షాలకు మూలం అర్ధ , కామాలే .వాటికి బలం చేకూర్చద్దు .ఈ రెండూ తత్వజ్ఞా నానికి లొంగేవికావు.-‘’మూలందో షస్య హింసా దే రర్ధ కామౌ
కిరాతార్జు నీయం-19
పదకొండవ సర్గ -2
ఇంద్రు డు అర్జు నుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రా ణుల్ని చంపి చంచలమైన సంపదలు పొ ందేవాడు
నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లు గా ఆపదలకు ఆశ్రయమౌతాడు. ‘’ఉదన్వానివ
సి౦దూనామాపదామేతిపాత్రతాం. ’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తా యి .దాన్ని
రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు , దుఖం
మరొకటి లేదు .ఆపదల భయాలే భేద౦ ,భయం .సాధన సంపత్తి తో ఆపదలు దూరమౌతాయి .-‘’యా
గమ్యాఃసత్సహాయానాం యాసు భేదో భయం యతః –తాసాం కిం యన్న దుఖాయ విపదామివ
సంపదా౦’’.పొ ందరాని విశ్వాసం తో కలిగిన సంతోష రూప సుఖం తో క్రూ రుడైన శత్రు వు ధనాన్ని పాము
పడగలతోసమానమైన దాన్ని పొ ందిన ధనవంతుడికి ఏ కష్టా లైనా దుర్ల భాలు కావు .అంటే భోగ
లాలసలతో మునిగిన ధనవంతుడు సులభంగా ఆపదలు పొ ందుతాడు .విష సర్పం ఎవడి వల్ల నైనా
చావాల్సింది . అలాగే డబ్బాశ ఉన్న వాడుకూడా .-దూర సదా నరీ నుగ్రా న్ ధృతే ర్విశ్వాస జన్మనః –
భోగాన్భోగాని వాహే యాన ధ్యాస్యాపన్న దుర్ల భా ‘’.సంపత్తు కు భేద భావం ఉండదు .దానికి ఇష్ట మైన
వారు అంటూ ఉండరు .మూర్ఖు లు మాత్రం అనురక్తు లు కాని స్త్రీల యందు అనురక్తు లైనట్లు సంపద
కోరుతారు .ప్రా ణులు వామశీలం కలవారవటం సహజం కదా .-‘’నాంత రజ్ఞా ః శ్రియో జాతుప్రియై రాసాం న
భూయతే –ఆసక్తా స్తా స్వమీ మూఢా వామశీలా హి జ౦తవః’’.చెడు స్వభావం ఉన్న వారిని సంపదలు
వదిలేస్తా యి .ఇవి చంచలమైనవి అనటం లో తప్పే లేదు.అర్ధం పురుషార్ధ ం కాదు .- ’సాధు
వృత్తా నపిక్షుద్రా విక్షి పంత్యేవసంపదః ‘’.ప్రా ణుల స్థితి కూడా చంచలమైనదే.ధర్మనాశనం చేయద్దు
.సజ్జ నులు న్యాయాన్నే ఆశ్రయిస్తా రు .అంటే సజ్జ నులు కూడా హత్యలాంటివి చేస్తే లోకం లో సజ్జ నత్వం
ఉండదు .-‘’భావాన్మా స్మవధీ న్న్యాయ్యంన్యాయాదారా హిసాధవః ‘’.యుద్ధ ప్రయత్నం మాను .ముక్తి
నిచ్చేతపస్సును చెరపకు .జనన మరణ బంధాన్ని వదలాలంటే శాంతాన్ని ఆశ్రయించాలి .-అంటే విజయం
పొ ందాలనే కోరిక వదిలెయ్యి అనిభావం –‘’విజహీహి రణో త్సాహం మా తపః సాధునీనశః –ఉచ్ఛేదం
జన్మనః కర్తు మేధి శాంతస్త పో ధనః ‘’.
ముందు అంతఃశత్రు వులను జయించు .వాటిని జయిస్తే లోకాలన్నీ జయించి నట్లే .-‘’జీయంతా౦
దుర్జ యా దేహే రిపవ శ్చక్షురాదయః –జితేషునను లోకోయం తేషు కృత్స్నస్త ్వయా జితః ‘’.జితేంద్రియుడు
కాని వాడు కార్య సాధకుడు కాలేడు.పరాధీనుడు నీచ ప్రవృత్తి కలవాడు సిగ్గు లేని వాడవుతాడు
.పశువులాగా లోకుల్ని అనుసరిస్తా డు .-‘’అవిధే యే౦ద్రియః పుంసాం గౌరి వైతివిధేయతాం’’.ఇవాల్టి సుఖం
రేపు గుర్తు కు తెచ్చుకోనేదే అవుతుంది. దాని అనుభవం పొ ందలేవు .విషయ సుఖాలు స్వప్నాల వంటివి
.దానికి లొంగక పో వటం మంచిది .-‘’ఇతి స్వప్నోపమాన్ మత్వా కామాన్ మా
గాస్త దంగతాం’’.కోరికలువిశ్వాస ఘాతుకాలే కాక వంచిస్తా యి .ప్రేమ చూపినా దుఖాన్నే కల్గిస్తా యి
ఇంద్రియ లోలత్వం వలన స్వయంగా వదిలి పో తాయి .వదిలించుకోవాలన్నా వదలవు .ఇవి పెద్ద కష్టా న్ని
తెచ్చే శత్రు వులు .-‘’సుదుస్త ్యజా స్త ్యజంతో పికామాఃకస్టా హిశత్రవః ‘’.త్వరలోనే నీకు ఇంద్రకీలం ముక్తి
నిస్తు ంది .ఈ ప్రదేశం గంగానది అంతటి పవిత్రం .అయుధాలు మాత్రం వదలాలి .-వివిక్తే స్మిన్నగే భూయః
ప్లా వితే జహ్ను కన్యయా –ప్రత్యా సీదతి ముక్తిస్త్వాం పురా మా భూరుదాయుదః ‘’.ఇలా ఇంద్రు డు
చెప్పగానే ఇంద్ర తనయుడు వినయం తో మధురంగా ఇలా అన్నాడు ‘’మహర్షీ !నీ వాక్యం సరళ సుగమం
.మనోహరం .సమాస లాలిత్యం ఓజో గుణం ఉన్న శబ్దా లు పలికావు .గంభీరార్ధ ం కలమాటలవి
.కొద్దిమాటల్లో అన౦త భావాన్నిచ్చేవి పరస్పరా కాంక్ష కల్గి౦చేవి కూడా.అధ్యాహారాదులు లేకుండా
తాత్పర్యం పూర్తిగా వెలువరించాయి –‘’ప్రసాద రమ్యమోజస్విగరీయో లాఘవాన్వితం –సాకా౦క్ష
మనుపస్కారం విష్వగ్గ తి నిరాకులం ‘’.నీమాటలు యుక్తిసారాలు .ప్రతివాదులు కూడా ఖండించటానికి వీ
ల్లేనివి. అనుమానాదుల తో బాధించనివి .వేద వాక్య సమానాలు.-‘’న్యాయ నిర్ణేత
సారత్వాన్నిరపేక్షమివాగమే –అప్రకంప్యతయా న్యేషామామ్నాయ వచనోపమం ‘’.నీమాటలు ఇతరులు
కాదనటానికి వీల్లేనివి .సాగర మంత లోతైనవి. పరమ పురుషార్ధా లు.మునుల మనసులాగా పరమ
శాంతమైనవి –‘’అల౦ఘ్యత్వా జ్జ నైరన్యైః క్షుబితోదన్వ దూర్జితం-ఔదార్యా దర్ద సంపత్తేః శాంతం
చిత్త మృషేరివ’’.
కిరాతార్జు నీయం-20
‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తు న్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ
ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం మునిభి స్తు ల్య మిచ్ఛసి’’.పూర్వాపరాలు తెలీకుండా చేసే
ఉపదేశం బృహస్పతి చెప్పినా వృధా అవుతుంది .నీతివిరుద్ధ ప్రయత్నం విఫలమైనట్లే ఇదీ నిష్ఫలమౌతుంది –వాచస్పతే రపి -‘’అవిజ్ఞా త
ప్రబంధస్య ‘’వ్రజత్యఫలతామేవ నయద్రు హ ఇవే హితం ‘’ .నక్షత్రా లు ప్రకాశించే ఆకాశానికి పగలు పనికి రానట్లు ,మీ ఉపదేశానికినేను
పాత్రు డిని కాను -.’’శ్రేయసో ప్యస్య తే తాత వచసో నాస్మి భాజనం –నభసః స్ఫుట తారస్య రాత్రే రివవిపర్యయఃనేను పాండు రాజ కుంతీ దేవి
దంపతుల కుమారుడిని .ఆర్జు నుడిని . దాయాది కౌరవులు రాజ్య బహిష్కారం చేయగా అరణ్యవాసం చేస్తు న్నఅన్నగారు ధర్మరాజు ఆజ్ఞ తో
ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చాను .-‘’క్షత్రియస్త నయః పా౦డో రహం పార్థో ధనంజయః –స్థితః.ప్రా ంతస్య దాయాదైర్భ్రాతుర్జ్యేష్టస్య శాసనే
‘’..పూజ్య కృష్ణ ద్వైపాయన మహర్షి ఆజ్ఞా పించగా ఈ రకంగా తపో నిష్ఠ లో ఉన్నాను .ఇంద్రు ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం లో ఉన్నాను
.ఇంద్రు డు క్షత్రియ దేవుడు కనుక సుఖారాధ్యుడు అని భావం .-‘’కృష్ణ ద్వైపాయ నాదేశాత్ విభిర్ని వ్రత మీద్రు శం .-భ్రు శమారాదనే యత్త ః
స్వారాధ్యస్య ‘’.మరుత్వతః.కపట పాచికలతో ఆడి, ధర్మరాజు రాజ్యం,సో దరులు నల్గు రు భార్య ద్రౌ పదిని స్వయంగా పణంగా ఒడ్డి ఓడిపో యాడు
.ఏదో జరగాల్సిందేదో అలా జరిగిపో యింది ‘’భవితవ్యతాఖలు బలవతీ ‘’ సూక్తి నిజమైంది .’’దురక్షాం దీవ్యతా రాజ్ఞా రాజ్యమాత్మావయం
వధూః-నీతాని ణతాం నూను నమీదృశీభావితవ్యయా ‘’.నేను లేకుండా మిగతా సో దరులతో ఉన్న యుధిస్టిరుడుద్రౌ పదీ దీర్ఘ రాత్రు లు
గడపలేక ఇబ్బంది పడ్డా రు .నాకోసం వాళ్ళు, వారికోసం నేను బాధ పడుతుంటే వైరాగ్య భావన కలుగదు కదా –‘’తేనానుజ సహాయేన ద్రౌ పది
వినా –భ్రు శ మా యామి యామాసు యామినీ ష్వభితప్యతే ‘’.కౌరవ సభలో మా ధర్మపత్ని ద్రౌ పది కొంగు లాగి సిగ్గు పడేట్లు చేశారు
.నీచమైన మాటలశూలాలతో మా ననస్సులకు గాయాలు చేశారు –‘’హృతోత్త రీయాం ప్రసభం సభాయామాగత హ్రియః –మర్మచ్ఛిదానో
వచసా నిరతకక్ష న్నరాయతః ‘’.కాలపురుష మృత్యువు భీష్మాదులున్న సభలో ద్రో పదిని ఈడ్చుకురావటం మమ్మల్ని కూడా అలాగే
ఈడ్చాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అర్ధ మైంది .’’వినాశకాలే విపరీత బుద్ధిః’’లోకోక్తికి ఉదాహరణగా నిలిచారు’’ –‘’ఉపాధత్త సపత్నేషు కృష్ణా యా
దుశ్శాసనుడు సభలోకి ఆమెను ఈడ్చుకొని వచ్చినప్పుడు ,సభాజనం క్షణ కాలం చూశారు .తర్వాత తలలు తిప్పుకొన్నారు అది సాయం
వేళసూర్యుని కెదురుగా ఉన్న చెట్టు నీడ క్షణ కాలం ఉన్నట్లు గా అనిపించింది –‘’అభి సాయార్క మా వృత్తా ం.చాయా మివ మహా తరోః.’’ఏ
పనీ చేయలేని నీ భర్త లను చూసి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నట్లు ద్రౌ పది కళ్ళను కన్నీరు కప్పేసింది – ‘’ఆయథార్ధ క్రియా రంభైః
పతిభిఃకిం తవైక్షి తైః-అరుధ్యేతామితీ వాస్యా నయనే బాష్ప వారిణా ‘’.మా దుర్ద శకు మా పెద్దన్న ధర్మరాజు గారే సహించాడు శత్రు నాశనం
ఎప్పుడైనా సులభమే .ఇవాళకాకపో తే రేపైనా తప్పదు..కాని సజ్జ నులమధ్య అపవాదు మంచిది కాదు కదా .ఆది తప్పిన వాడు అనే పేరు
రాకూడదని అన్నగారి ఉపేక్ష .-‘’సో ఢవాన్నో దశా మంత్యాం జ్యాయేనేవ గుణప్రియః –సులభో హి ద్విషాం భంగోదుర్ల భా సత్స్వ్య వాచ్యతా
‘’.సముద్రజలం చెలియలికట్ట దాటరాదు అనే మర్యాద తో అతలాకుతలమౌతుంది అయినా స్వచ్చంగానే ఉంటుంది .అలాగే అభిమాన
వంతుడైన ధర్మరాజు మనస్సు కూడా ప్రతిజ్ఞా భంగం కాకూడదని వ్యాకులమైంది అయినా మనస్సుమాత్రం .స్వచ్చంగా సంయమనం
పాటిస్తో ంది –‘’స్థిత్యతి క్రా ంతి భీరూణిస్వచ్ఛాన్యాకులితాన్యపి-తోయాని తోయరాశీనాం మనాంసి చ మనస్వినాం .ధృత రాష్ట ్ర కుమారులతో మా
మైత్రి మా శత్రు త్వానికి కారణమయింది .నీడ కోసం కూలిపో యే నది గట్టు ను ఆశ్రయిస్తే అదికూలి ప్రా ణం తీసినట్లు ,దుర్జ న స్నేహం అనర్ధ
దాయకమే .మిత్ర ద్రో హమే దీనికి కారణం .—దార్త రాష్ట్రైః సహప్రీతి ర్వైర మస్మాస్వ సూయతః –అసన్మైత్రీ హి దో షాయ కూల చ్ఛాయేవసేవితా
‘’.
లోకనిందకు భయపడని మంచి చెడు విషయం లో తారతమ్యం లేని దురాచార దుష్టు ని మనసు దైవ విదిలాగా ఊహకు అందనిది .వాడి
పనిని బట్టే అది బయట పడుతుంది ..-‘’అపవాద భీతస్య సమస్య గుణ దో షయోః-అసద్వ్రుత్తేరహో వృత్త ం దుర్విభావం విధేరివ’’.శత్రు
అవమానం పొ ందిన నామనస్సు వెంటనే బ్రద్దలయ్యేట్లు ంది.ప్రతీకారం తీర్చుకోవాలన్న నా కోపం దానికి సాయపడి కాపాడింది .బతికి
ఉండటానికి కారణం ప్రతీకారం తీర్చుకోవటానికే –ద్వంసేత హృదయం సద్యః పరి భూతస్య మే పరైః-యద్యమర్షఃప్రతీకారం భుజా లంబం
నలంభయేత్’’.శత్రు వుల అవమానం తో మృగాలుగా గడుపుతున్న మేము ఒకరి కొకరం చూసుకొని సిగ్గు తో తలవంచు కుంటున్నాం
.స్నేహబృందం మాట చెప్పేదేముంది ?-‘’అవదూతాయాభి ర్నీతా హిరణై స్తు ల్య వృత్తి తాం-అన్యోన్యస్యాపి జిహ్రీమః కిం పునః సహవాసినాం
‘’.అభిమానం వదిలితే నమ్రత, దుర్బలత్వం గౌరవహాని కలుగుతాయి అలాటి మానహీండు గడ్డి పో చతో సమానం .ఎన్నికస్టా లొచ్చినా
అభిమానం వదలరాదు కదా ‘’-శక్తి వైకల్య నమ్రస్యనిః సారత్వా ల్ల ఘీ యశసః-జన్మినో మాన హీనస్య తృణస్య చ సమాగతిః’’.పర్వత
శిఖరాలలో దాట శక్యం కాని శిఖరాన్ని చూసి గొప్ప అభిమానం ఏ కారణంగా నూ సతోషం పొ ందదు.అనుల్ల ంఘ నీయత్వమే గొప్పవారికి
ప్రీతి కలిగిస్తు ంది –‘’అనుల్ల ంఘ్యం తత్త దురీక్ష్యయద్య దుచ్చైర్మహీ భ్రు తాం-ప్రియతాం జ్యాయసీ౦ మాగాన్మహతాం కేన తుంగతా ‘.’
కిరాతార్జు నీయం-21
.కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .---తావదాశ్రీ యతే
లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తా వదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’ .దట్ట మైన అడవులున్న బాగా ఎత్తైన పర్వతాలనైనాచేర
వచ్చు కాని పరాక్రమ శీలి ,అభిమానవంతుడు మాత్రం ఎవరికీ సాధ్యమయ్యే వాడు మాత్రం కాదు.-‘’దురాసదన వన జ్యాయాన్
గంయస్తు ౦గోపి భూధరః –నజహాతి మహౌజస్కం మాన ప్రా ంశు మలంఘ్యతా ‘’.వంశానికి ప్రతిష్ట తెచ్చే వారి వల్ల నే భూమికి ‘’వసుంధరా ‘’అనే
పేరు సార్ధ కమైంది వారునిష్కలంక కీర్తితో చంద్రమండలాన్ని సిగ్గు పడేట్లు చేస్తా రు.’’గురూం కుర్వ౦తి తే వంశ్యానన్వర్దా తిర్వసు౦ధరా-యేషాం
యశాంసి శుభ్రా ణి హరిప యంతీ౦దు మండలం .’’ఎండిన కర్రను పిడుగుపడి కాల్చినట్లు ,కోపాన్ని శత్రు సంహారం లో ప్రదర్శించే వారు వారే
అంతటి వారుకావాలని ఆశీర్వచానాలలో ఉదహరిస్తా రు .అంటే మనస్విత వదలకూడదు అని భావం –‘’ఉదాహరణ మాశీః షు ప్రథమే తే
మనస్వినాం శుష్కేఆశని రివా మర్షో యైరారాతి షుపాత్యతే ‘’.నేను చంచల సుఖాలకోసం తపస్సు చేయటం లేదు .ధనసంపాదనకోసం కాదు
.అస్త్రా లకు భయపడి మోక్షం కోరటం లేదు .శత్రు వుల కపటంవలన అంటిన బురద అనే అపకీర్తి ని ,విధవలైన శత్రు స్త్రీల కన్నీటితో కడిగి
సజ్జ నులు నన్ను పరిహాసం చేయచ్చు లేక భ్రా ంతిలో ఉన్నాననవచ్చు .కానీ నువ్వు చేసిన మోక్షరూప ఉపదేశం నిష్ఫలమై౦దని సిగ్గు
పడకు.శత్రు నిర్మూలనం చేసి వంశ పరంగా వస్తు న్న రాజ్య లక్ష్మిని ఉద్ధ రించకుండా వచ్చే మోక్షం కూడా విజయశ్రీకి అడ్డు గానే భావిస్తా ను
.’’వంశ లక్ష్మీ మనుధృత్య సాము చ్ఛేదేనవిద్విషాం-నిర్వాణ మపిమన్యేహమంతరాయ౦ జయశ్రియం ‘’.శత్రు వులు అపహరించిన కీర్తిని బాణం
తో మళ్ళీ సాధించాలి .అలా చేయకపో తే పుటక వ్యర్ధమే .చచ్చినవాడితో సమానం .గడ్డిపో చ విలువకూడా పొ ందలేడు-‘’ఆజన్మా పురుష స్తా వ
శత్రు వుపై తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి .అలా చేయకపో తే దో షమే .ముసలి మునీ !నువ్వే చెప్పు- శత్రు సంహారం లేకుండా మనిషి కోపం
శాంతిస్తు ందా ?శత్రు సంహారం చేయని వాడిని పురుషుడు అనవచ్చా ?’’అని ప్రశ్నించాడు –‘’అనిర్జ యేన ద్విషతాం యస్యామర్షః ప్రశామ్యతి-
పురుషో క్తిః కథం తస్మిన్ బ్రూ హి త్వం హి తపో ధన ‘’.పురష జన్మతో చెప్పబడే పురుష శబ్ద ం తో ఏమీ కాదు .పశు ,పక్ష్యాదుల్లో నూ పురుష
జాతి ఉంది .గుణ గ్రహణపారీణులు ప్రశంసించి ,వెంటనే ఆదర్శం గా తీసుకోబడే వాడే పురుషుడు .-‘’కృతం పురుష శబ్దేన జాతి
మాత్రా వలంబినా –యో౦గీకృత గుణైః శ్లా ఘ్యః సవిస్మ యముదా హృతః ‘’.సభలలో సంభాషణలలో గౌరవంగా తీసుకోనబడే వాడు వినే వాళ్ళ
తేజస్సు ను కూడా మింగేసే వాడూ ,శత్రు వుల చేతకూడాఅభినందింపబడే వాడూ అతడే అభిమాన వంతులలో గణనీయుడైన పురుషుడు
అవుతాడు .-‘’గ్రసమాన మివా౦ జసి సాదసా గౌర వేరిత౦ –నామ యస్యాభి న౦ద౦తి ద్విషో పిస పుమాన్పుమాన్ ‘’.మారాజైన ధర్మ రాజు
మా శత్రు వులపై ప్రతీకారం తీర్చుకోవటానికి నన్నేకోరాడు .దాహం వేసిన వాడు దో సెడు నీళ్ళుకోరినట్లు నన్ను కోరాడు .-‘’యథా
జలా౦జలేః’’.యజమాని ఆపదలో ఉంటె అతడిఆజ్ఞ పాలి౦చని వాడుతన నిర్మల వంశానికి చంద్రు నిలో మచ్చ లాగా కుల ఘాతకు
డౌతాడు.అంటే ధర్మరాజు ఆజ్ఞ నాకు శిరో దార్యం ..-‘’స వంశస్యావ దాత స్య శశాంక స్యేవ లాంఛనం-కృఛ్చ్రేషువ్యర్ధ యా యత్ర భూయతే భర్తు
రాజ్ఞ యా’’.సరేకానీ గృహస్థా శ్రమానికి ముందే ధర్మానికి విరుద్ధ మైన ముని వృత్తి నాకు ఎందుకు ఉప దేశిస్తు న్నావు సామీ ? బ్రహ్మ చర్య
,గృహస్థా శ్రమ, వానప్రస్థ,సన్యాసం కదా వరుస .నేనింకా గృహస్థు డినే అని భావం .శత్రు ప్రతీకార భారం ఇంకా నామీద ఉంది మా అమ్మగారు
కుంతీదేవి కూడా మాదగ్గ రలేదు .అన్న ధర్మరాజు గారే మాకు అన్నిటికీ పెద్ద ఆయన ఆచార నిష్ఠ ఉన్నవాడు .ఈ మూడు కారణాలవలన
నేను స్వతంత్రంగా ఏమీ చేయకూడదు .అందుకే గృహస్థా శ్రమ ధర్మాలు ఎన్నోఆచరించ లేకపో తున్నాను .అభిమానవంతులు తమపని
ధర్మాన్ని తాము చేస్తా రు .దాన్ని ఉల్ల ంఘించరు.శత్రు వుతో అపకారం పొ ందినవాడు యుద్ధ ం నుంచి దూరం కాడు. ప్రతీకారం తీర్చుకోనేదాకా
శ్రమిస్తా డు-‘’స్వధర్మ మను రుంధంతే నాతిక్రమ మరాతిభిః-పలాయంతేకృతద్వంసా నాహవా న్మాన శాలినః ‘’.సుడిగాలితో చెల్లా చెదరైన
మేఘం లాగా ,ఇంద్రకీలాద్రి పై నేనూ విలీనమౌతాను లేదా ఇంద్రు డిని మెప్పించి అపకీర్తి ముల్లు తొలగిస్తా ను .ఇదే నా నిశ్చిభిప్రా యం’’ అని
ఇంద్రతనయుడు అర్జు నుడు ,ముసలి ముని వేషం లో వచ్చిన ఇంద్రు డికి చెప్పాడు –‘’విచ్చిన్నాభ్రవిలాయం వా విలీయే నాగ మూర్ధని –
తన మనో నిశ్చయాన్ని నిర్భయంగా చెప్పిన అర్జు నుడికి ఇంద్రు డు తన నిజరూపం తో ప్రత్యక్షమై ,రెండు చేతులతో గట్టిగా ఆలింగనం
చేసుకొని,అతడి అభీష్ట సిద్దికీ ,సంసారం లో సరిగమలు సరిదిద్దు కోవటానికీ ,పాపాలను తొలగించే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని
ఉపదేశించాడు .-‘’ఇత్యుక్త వంతం పరి రభ్యదో ర్భ్యాం తనూజ మా విష్కృత దివ్య మూర్తిః-అఘోపఘాత౦ మఘవా విభూత్యై భవోద్భావా
రాదన మాది దేశ ‘’.అర్జు నుడి తో ఇంద్రు డు ‘’శివుడు నీ తపస్సుకు ప్రసన్నుడవగానే, లోక పాలకుల౦దరి తో కూడా నేను గొప్ప శక్తిని
ప్రసాదిస్తా ను .దాని ప్రభావం తో నువ్వు శత్రు రాజ్య లక్ష్మిని నీకు అనురాగవతిగా చేసుకోగలవు ‘’అనిచెప్పి , అంతర్ధా నమయ్యాడు.
.
కిరాతార్జు నీయం-.22
పన్నెండవ సర్గ -1
ఇంద్రు డు అంతర్ధా నమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రా రంభించాడు
.సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు
–‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి జగ్మురేక చరణం నిషీదతః .శరీరం
,ఇంద్రియాలను తపి౦ప జేస్తూ ,దుఖాలు సహిస్తూ ,పర్వతం లాగా నిశ్చేష్టు డై స్థిరంగా ఉన్నాడు.గొప్ప వారి ధైర్యం ఊహించనలవి
కానిది-‘’వ్యాప నగపతి రివ స్థిరతాం,మహతాం హి ధైర్య మవిభావ్య వైభవం ‘’.పండి పరిమళాలు వెదజల్లే ఫలాల మీద , చల్ల ని నీటిపై
ఆకర్షితుడు కాలేదు .పుణ్యాత్ములకు తపస్సు అమృతమవుతుంది .-‘’న పపాత సన్నిహిత పక్తిసురభిషు ఫలేషు మానసం –తస్య
శుచిని,శిశిరే చ పయస్యమృతాయతే హి సుతపః సుకర్మణా౦.అంత గొప్ప తపస్సు చేశానని ఆశ్చర్యపో లేదు .ఫలితం ఆలస్యమౌతుందని
విషాదమూ లేదు .అలసటా లేదు .శక్తి తగ్గినా ,రజస్త మో గుణాలు అతని సత్వ గుణాన్ని తగ్గించ లేకపో యాయి .పరాక్రమం ఏ మాత్రం
సడలలేదు .-‘’న విసిస్మియే న విషాద ముహురలసాం న చాదదే -సత్వ మురు ధృతి రజస్త మసీ,నహతః స్మతస్య హత శక్తి పేలవే .’’.శరీరం
కృశించింది.అయినా ముల్లో కాలు జయించాడు .అతని శరీరాన్ని చూసి తత్వజ్ఞు లు కూడా భయపడతారు .మాన ధనులకు సాధ్యం కానిది
లేదు లోకం లో .-‘’త్రా స జననమపి తత్వ విదా౦ కిమి వాస్తి యన్న సుకరం ,మనస్విభిః’’.అర్ధ రాత్రి మండే అగ్నికంటే తేజస్సుగా ,సముద్రం
కంటే గంభీరంగా ,పర్వతం కంటే ఔన్నత్యంగా భాసిం చాడు .-‘’జ్వలతో నలాదను నిశీథ మదిక రుచిర మంభసాంనిధేః -ధైర్య గుణ మవజయ
న్విజయీ దదృశే సమున్నతరః స శైలతః ‘’.ఏకాంతంగా జపిస్తు ంటే ,ముఖం సూర్య మండల ప్రకాశం పొ ందింది . దంతకాంతి చుట్టూ ప్రసరించి
పరి వేషంగా సూర్య శోభ పొ ందింది .కవచం ధరించి ,యజ్ఞో పవీతం ఉన్న భుజం పై ధనుస్సు ఎక్కు పెట్టి ,ఇంద్రతనయుడు ,ఇంద్ర ధనుస్సు
ఆవరించిన మహారణ్యహిమాలయం లా ఉన్నాడు .-కవచ స భిభ్ర దుపవీత పదనిహిత సజయ కార్ముకః –శైల పతిరివ మహేంద్ర ధనుః
పరివీత భీమ గహనో విదిద్యుతే.’’.చిక్కిన శరీరంతో స్నానానికి వెడుతుంటే అతడి ప్రతి అడుగు భారానికీ హిమవత్పర్వతం కుంగి పో తోంది
.శరీరభారం తగ్గినా అర్జు నుని అంతః సారం ప్రా ధాన్యం వహించిందని భావం .
ఊర్ధ ్వబాహుడై ,తపస్సు చేస్తు ంటే విస్త ృతమైన తేజస్సు అతని శిరస్సు చుట్టూ నేకాక ,భూ నభో౦త రాలలో కూడా వ్యాపించి,మునులకు
,దేవతలకు దుర్ధ ర్షమై ఇబ్బంది పెట్టింది –‘’పరికీర్ణ ముద్యుత భుజస్య భువన వివరే దురాసదం –జ్యోతి రుపరి శిరసో వితతం జగృహే
నిజాన్ముని దివౌకసాం పథః’’.తపస్సు తేజస్సుకు కృష్ణ పక్షం లోని రాత్రు లలో కూడా చీకటి లేనేలేదు అందుకని చంద్రకాంతి ఆకాశాన్ని
వదలలేదు –‘’రజనీషు రాజ తనయస్య బహుల సమయే పిదామభిః-భిన్న తిమిర నికరం న జహే శిశిరస్మి సంగమ యూజ నభఃశ్రియా
‘’.శిరస్సు నుంచి వెలువడిన తపస్సు యొక్క తేజో కిరణాలవిపరీత కాంతి వలన ,ఆకాశ సూర్యుడు సిగ్గు తో మ్లా నుడై ప్రకాశించటం లేదు
–‘’మహతా మయూఖా నిచ యేన శమిత రుచి జిష్ణు జన్మనా –హ్రీతమివ నభసి వీత మలే న విరాజతే స్మవపు రంశు మాలినః ‘’
ఎర్రని జటల తేజో కిరణాలు వెలువడ్డా యి .ధనుస్సు ఎక్కు పెట్టా డు .ఇది చూసి అసురనగరాలను కాల్చటానికి సిద్ధపడిన రుద్రు డేమో
అనుకొన్నారు జనం . పరీక్షించి చూసి ,కంటి మంట లేదుకనుక రుద్రు డు కాదను కొన్నారు-‘’తముదీరితా రుణ జటాంశుమధి గుణ శరాసనం
జనాః –రుద్ర మనుదిత లలాట దృశ్యం దదృశుర్మిమ౦థిషు మివా సురీః పురీః’’.అర్జు నుడు సాధారణ మానవుడు కాదు దేవేంద్రు డో ,సూర్యుడో
,మంటల అగ్ని దేవుడో అనుకొన్నారు జనం .ఇంతటి ఘోర తపస్సు మామూలు మనిషి చేయలేడు అని భావించారు .-‘’మారుతం పతిః
స్విదహిమాంశు రుత పృథుశిఖః శిఖీ తపః –తప్తు మసుకర ముపక్ర మతే న జనో య మిత్యవయయే న తాపసైః’’.అర్జు న తపో తేజం అంతటా
వ్యాపించినా ,అగ్నిలాగా చెట్లను కాల్చటం లేదు ,సూర్యునిలా నీటిని ఆవిరి చేయటం లేదు కాని సిద్ధ చారణ గణాల తపస్వులకు సహించటం
కష్ట ం గా ఉంది .అంటే అతడి తపస్సు అలౌకికం అని భావం .ఔదార్యం మొదలైన గుణాలు వినయాన్ని ఆశ్రయించినట్లు ,నీతి
దుర్నీతినితొలగించి వివేకాన్ని ఆశ్రయించినట్లు , నిర్దిష్ట సమయాలు ప్రమాణాన్ని చేరినట్లు ,శరణు లేని మహర్షు లు శివంకరుడైన శివుడిని
శరణు కోరటానికి ఆయన వద్ద కు వెళ్లా రు –‘’వినయం గుణా ఇవ వివేక మపనయభిదం నయా ఇవ –న్యాయ మవదయ ఇవా శరణాఃశరణం
.కాసేపాగి చేరి శివ స్తో త్రా లు చేశారు .అందమైన శరీరం త్రినేత్రా లతో ఉన్న శంకర దర్శనం చేశారు .అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు అని భావం
.మొదటి శ్లో కం లో విశాలమైన నందీశ్వరుని మూపు పై చేతులు ఉంచి ,పార్వతీ దేవి కుఛ సౌభాగ్యాన్ని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తు న్నట్లు
శివుడు ఉన్నాడని వర్ణించారు .-‘’కకుదే వృషస్యకృత బాహు మకృశ పరిణాహ శాలినీ –స్పర్శ సుఖ మనుభవం తముమా కుఛ యుగ్మ
కిరాతార్జు నీయం-.23
ప్రకాశం తో వ్యాపించి నట్లు న్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక
పర్వతాల దాకా ఉన్న విశ్వంలాగా ప్రకాశిస్తు న్నాడు –‘’అనుజాను మధ్య మవసక్త వితత వపుషా మహాహినా –లోకమఖిల మివ భూమి
భ్రు తా రవితేజ సామవధి నాధివేష్టితం’’.మంచులాగా తెల్లగా ,శుభ్రంగా ఉన్న యజ్ఞో పవీతం గా ఉన్న శేషుడిని తన నీల కంఠం రంగుతో
సమానం చేస్తూ ఉన్న శివుడు కనిపించాడు –‘’పరిణాహినా తుహిన రాశి విశద ముపవీత సూత్రతాం –నీత మురగ మనురంజయతా శితినా
గలేన విలసన్మరీచినా ‘’.మలాతీ పుష్ప సమానంగా ఉన్నశుభ్రమైన కపాలం అనే కలువను వికసింప జేసే చంద్ర కిరణాలు అనే యెర్రని
జడలతోవ్యాపి౦ప జేస్తు న్నాడు .నాల్గు దిక్కులా వ్యాపించే ఆ జటాసమూహం గంగాజలం లో మిగులు నీటిని శిరస్సు లో ధరించినట్టు గా
శివుడు భాసి౦ చాడు .-‘’ఫ్లు తమాలతీసిత కపాల కుముద మవరుద్ధ మూర్ధ జం –శేషమివ సుర సరి త్పయసాం శిరసా విసారి శశిధామ
బిభ్రతం ‘’.ఋషులు శంకరునికి ఎదురుగా వెళ్లి ,ఆయన నేత్ర సంజ్ఞ తోనే అర్జు నతపస్సు వలన లోకాలకు కలుగబో యే ఆశుభాన్ని
విన్నవించారు .’’ఓ పురుషో త్త మా శంకరా !భయం కలిగించే శరీర బలం కల వృత్రా సురుడి లా ఉన్న ఒక పురుషుడు తపస్సు చేస్తు న్నాడు
.అతని ప్రకాశం సూర్య ప్రకాశాన్ని మించింది .అతడు రెండు అమ్ములపొ దులు ,ధనుస్సు కవచం ఖడ్గ ం జటావల్కలాలు ధరించి ఉన్నాడు
.ఇవి ముని ధర్మానికి వ్యతిరేక వస్తు వులు అయినా అతనికి మహా శోభ కలిగిస్తు న్నాయి .అదే ఆశ్చర్యంగా ఉంది .అతడు కదిల్తే భూమి
కంపిస్తో ంది. సమాధి గతుడై ఇంద్రియాలను స్త ంభింప జేయటం తో దిక్కులన్నిటా వాయువు ,గ్రహ ,నక్షత్రా లు తో కూడిన ఆకాశమే
స్త ంభించింది –‘’చాలానే వనిశ్చలతి తస్య కరణ నియమే సదిఞ్ముఖం –స్త ంభ మనుభవతి శాంత మరుద్గ హ
్ర తారకా గణయుతం నభ స్థ లం
‘’.అతడు త్వరలోనే విశ్వాన్ని జయిస్తా డు .తపస్సుతో సాధ్యం కానిది లేదుకదా –‘’విశ్వమిదమపి దధాతి పురా కిమి వాస్తి యన్న తపసా
మదుష్కరం ‘’.ముల్లో కాలు ఒకేసారి జయి౦ చాలనో ,సంహరించాలనో లేక మోక్షమే కోరుతున్నాడో అర్ధ ం కావటం లేదు .అతని తేజస్సును
మేము సహించలేక పో తున్నాం –‘’విజిగీషతే యది ,జగంతి,యుగ పదథ సామజి హీర్షతి-ప్రా ప్తు మభవ మభి వా౦ఛతి వా వయమస్య నో
స్వామీ శంకరా !ఇంకా ఎందుకు ఉపేక్ష చేస్తు న్నారు ?కారణం ఏమిటి ?మీకు తెలీనిది ఉండదు .అభయదాతా!మమ్మల్ని రక్షించే
సమర్ధు లు మీరే .మీ రక్షణలో మాకు అవమానం జరుగాకుండు గాక .-‘’త్రా తు మలమ భయదార్హసి నస్త ్వయి మా స్మ శాసతి భవత్పరాభవః
‘’.ఇలా మునులు ప్రా ర్ధించగా అ౦ధకా౦తకు డైన శివుడు నభో౦త రాళం ప్రతిధ్వని౦చేట్లు ,ఉప్పొంగే సముద్ర గర్జ న ధ్వనితో ఇలా అన్నాడు
.’’మహర్షు లారా ! బదరికాశ్రమం లో ఉంటూ లోకసృస్టి,సంహారాలు చేసే విష్ణు వు అంశమే ‘’నరుడు ‘’గా పిలువబడే అర్జు నుడు .సాధారణ
ముని కాదు .సాక్షాత్ నారాయణా౦శ సంభూతుడు –‘’బదరీ తపో వన నివాస నిరత మవగాత మాన్యథా-ధాతు రుదయ నిదనే జగతాం నర
మంశ మాదిపురుషస్య గాం గతం ‘’అతడు లోకాలకు బాధ కలిగించే వారు ,ఇంద్రు ని శక్తిని లెక్కచేయని వారు అయిన శత్రు వులను
జయి౦చాలనే కోరికతో నన్ను ఆరాధిస్తూ తపస్సు చేస్తు న్నాడు .కనుక భయపడాల్సిన పనిలేదు –‘’ద్విషతః పరాసిషురేష సకల భువనాభి
తాపినః-క్రా ంత కులిశ కర వీర్య బలాన్మ దుపాసనం విహిత వాన్మహత్త పః ‘’తపస్సంపన్ను డైన అర్జు ండు , శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మ ప్రా ర్ధిస్తే
,భూమి మీది సకల అసుర సంహారం కోసం మనుషులుగా కృష్ణా ర్జు నులుగా జన్మించారు వారు సాక్షాత్తు నర నారాయణులే.ఈ విషయం
తెలుసుకొన్న మూకాసురుడు అర్జు నుడిని చంపటానికి వెడుతున్నాడు .కనుక మీరుకూడా నాతో రండి అక్కడ ఏం జరుగుతుందో
చూడటానికి. అర్జు న ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలిమనం .క్రూ ర మూకాసురుడు ఏకాంతం లో ఉన్న అర్జు నుడిని ఎదుర్కోవటం
చేతకాక,అనుమానం రాకుండా ఉండటానికి వరాహ రూపం ధరించి ,విజయం సాధించాలని చూస్తు న్నాడు –‘’వివరేపి నైన మనిగూఢ
మభిభవితుమేష పారయన్-పాప నిరతి రవిశంకితయా విజయం వ్యవస్యతి వరాహ మాయయా ‘’.నేను కిరాత రాజు వేషం తో
మూకాసురుడిని చంపగా ,వాడి అయిన బాణాన్ని వదిలిన అర్జు నుడు వేట నియమాలను అనుసరించి నాతొ వివాద౦లొ పడతాడు –‘’నిహతే
విడంబిత కిరాత నృపతివపుషా రిపౌ మయా –ముక్త నిశిత విశిఖః ప్రసభం మృగయా వివాద మయమా చరిష్యతి ‘’అర్జు నుడు తపో
నియమాలతో బాగా చిక్కి పో యాడు .సహాయం కూడా ఎవరూ లేని ఒంటరి వాడు .అయినా ,సహజ సిద్ధ,సాటిలేని పరాక్రమం తో ఉన్న
అతడి భుజపరాక్రమ విక్రమాన్ని చూడండి –‘’తపసా నిపీడిత కృశస్య విరహిత సహాయ సంపదః –సత్వ విహిత మతులం .
భుజయోర్బలమస్య పశ్యత మృధేధికుప్యతః ‘’.ఈవిధంగా మునులకు చెప్పిన పరమేశ్వరుడు నుదుట హరిచందనం అడ్డ దిడ్డంగా
పొ డవైన శిరోజాలున్న జడలలోవికసిత పుష్పాలు ధరింఛి ముడి వేశాడు .నెమలి కన్నుల కమ్మలు పెట్టు కొని కణతలకు శోభ చేకూర్చాడు
. ఎర్రని కళ్ళతో భయ౦ కల్పిస్తు న్నాడు .-‘’వదనేన పుష్పిత లతా౦త ఇయమిత విలంబి మౌలినా –బిభ్రదరుణ నయనేన రుచం శిఖి
పిచ్ఛలా౦చిత కపో ల భిత్తి నా’’. కిరాత సేనాపతి గా మారిన శివుడు మేఘగర్జ న లాగా ధ్వనించే ,బాణం తో ఉన్న ధనుస్సు ధరించి
,అందమైన మేఘంలాగా కనిపించాడు .ప్రమథ గణాలు శూల ,పరశు ,బాణం చాపం మొదలైన ఆయుధాలతో కిరాత సైన్యంగా శివుడికి
సహాయంగా నిలిచారు .ఈశ్వరాజ్ఞ అనుసరించి ,వారంతా ఇంద్ర కీలాద్రి చేరి అక్కడి అడవిలో ఎవరు ఏవైపున ఉండాలో నిర్ణ యించుకొని వేట
నెపం తో నాలుగు వైపులా భయంకర నినాదాలిస్తూ అట్ట హాసంగా బయల్దే రారు .అడవిలోని పక్షులు జంతువులూ భీతితో అరుస్తూ బయటికి
రాగా , ఇంద్రకీలాద్రి గుహలు భయంతో అరుస్తు న్నట్లు అనిపించింది .జాతివైరం ఉన్న మృగాలు పరస్పరం కోపం చూపలేదు .భయం తో
వచ్చిన కస్టా లు సహజ శత్రు త్వాన్ని కూడాతొలగిస్తా యి .-‘’ఘ్న౦తి సహజమపి భూరి భియః సమమాగతాః సపది వైరామాపదః ‘’.వెదురు
పొ దల్లో ని చిక్కిన చమరీ మృగాలు అందమైన తోకలు విడిపించు కోవటం లో శివగణ౦ ఆర్భాటాన్ని కూడా లెక్కచేయకుండా ధైర్యంగా
ఉన్నాయి .మదజలం స్రవిస్తు న్న ఏనుగులు ,జూలు విదిలిస్తు న్న సింహాలు శివ సైనికులను చూసి భయపడలేదు. నదులు భయంతో యెగర
ి ి
పడే చేపలతో నిండాయి .తీరాలు బురదగా మారాయి .ఏనుగుల రాపిడికి విరిగిన యెర్ర చందనం చెట్ల రసంతో నీరు ఎర్రబడింది .చల్ల ని గాలి
అలసట తీర్చింది .దున్నల ఘర్షణ వలన అగురు ,తమాల ,తుంగదుంపల పరిమళం గాలిలో కలిసింది .రాళ్ళలో మొలిచే శిలాజిత్తు చిలక
రంగులో ఉండేపువ్వుల్ని వెద జల్లు తూ అలసట తీరుస్తో ందని భావం .భయంతో పరిగెత్తే సంక్షోభం తో గ్రీష్మం లో లాగా సరస్సులు దుర్ద శ
పొ ందాయి. నీటిని జంతువులు కలచి వేశాయి .తీరం లోని అరటి చెట్లు ,నివ్వరి ధాన్యం నేలకు ఒరిగాయి .తామర తూడులు వాడాయి .ఇలా
శంకరుడు ఇంద్రకీల శిఖరం పై ఉన్న వృక్ష జీవ జాలాన్ని కలచి వేస్తూ ,సంతోషంతో ఆడ లేళ్ళు కొరికిన తీగలున్న అర్జు న ఆశ్రమానికి చేరాడు
.తర్వాత శివుడు అర్జు నునిఎదురుగా ఉన్న మూకాసురుడిని చూశాడు .వాడు మేఘంలాగా నల్ల గా పంది ఆకారం లో ముట్టె తో భూమిని
పెళ్లగిస్తు న్నాడు .-‘’పో త్ర నికషణవిభిన్న భువం దనుజం దధాన మథ సౌకరం వపుః’’.ప్రకాశమాన శివుడు దేవనది మందాకినీ తీరం లో
సైన్యాన్ని నిలిపి ,కొందరు సైనికులతో చెట్లు ,పొ దలు చాటుగా మూకాసురుని అడుగు జాడలను అనుసరించి బయల్దే రాడు –కచ్చా౦తే సుర
సరితో నిధాయ సేనామన్వీతః స కతిపయైః కిరాత వర్యైః-ప్రచ్చన్నస్త రుగహనైసగుల్మ జాలైః లక్ష్మీ వానను పదమస్య సంప్ర తస్థే’’.
కిరాతార్జు నీయం-.24
త్రయోదశ సర్గ -1
అర్జు నుడు దగ్గ రకొస్తు న్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క
బొ డుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తు న్న పందిని అర్జు నుడు చూసి ,అనమాని౦చగా, మనసులో
అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు కూల్చగలదు .భుజాలతో రుద్దు తూ పర్వతాల రాళ్ళను దొ ర్లి౦చ గలదు .ఒంటిగా వస్తూ
నన్ను యుద్ధా నికి పిలుస్తు నావైపుకే వస్తు న్నట్లు ంది .నా తపో ప్రభావంతో క్రూ ర జంతువులు కూడా హి౦సమాని సహజీవనం చేస్తు న్నాయి
.ఇది భిన్నం గా ప్రవర్తిస్తో ంది .ఇది మాయేమో?అని సందేహించాడు .పూర్వ జన్మ లో శత్రు త్వం దానిలో పో యినట్లు లేదు .విరోధి మృగాలు
దగ్గ రగా తిరుగుతున్నా ,వాటిని వదిలేసి ,నావైపే రావటం నా అనుమానాన్ని బలపరుస్తో ంది .ఇది వరాహం కాదు .నా ప్రా ణాలు హరించే
ఎవడో అయి ఉంటాడు .మనిషి ప్రసన్నంగా ఉంటే ,హితైషిగా ,కలుషితమైతే శత్రు వుగా సూచిస్తు ంది .నా మనసు కలుషితం చేసింది కనుక
ఇది నన్ను చంపటానికి వచ్చే శత్రు వు అవటం ఖాయం –‘’న మృగః ఖలు కో ప్యయం జిఘాంసుః-స్థ లతి హ్యత్ర తథా భ్రు శం మనోమే –
విమలం కలుషీ భవచ్చ చేతః –కథ యత్యేవహితైషిణం రిపుం వా ‘’.అయినా నేను మునిని .ఎవరికీ అపకారం చేసే వాడిని కాను
.భయమెందుకు ?అని అభిమానం కలిగి ఉండటం మంచిది కాదు ఇతరుల వృద్ధి ని ఓర్వలేని వారు ఏ ధర్మం, నీతి,పాటిస్తా రు ?కనుక ఇది
శత్రు వుల కుట్ర కావచ్చు .-పర వృద్ధి షుబద్ధ మత్సరాణాం-కిమివ హ్యస్తి దురాత్మనా మనులంఘ్యం ‘’.ఆ పంది దానవుడో రాక్షసుడో అయి
ఉంటుంది.మామూలు అడవి జంతువులకంటే మహా బలిష్ట ంగా ఉంది .ఈ ప్రా ంతాన్ని ఆక్రమించటానికి మాయతో వేట వాతావరణం కల్పిస్తో ంది
.దీనికి అడవి మృగాలు భయం తో పారిపో తున్నాయి .దుర్యోధనుడు చేసిన సత్కారాలు పొ ంది ,వాడికి మేలు చేయాలని ,ఇక్కడి
జంతువుల్ని కలవర పరుస్తూ ,ఈ పంది రూపం పొ ంది ఉండచ్చు –‘’క్షుభితం వన గోచరాభి యోగాత్ –గణమాశిశ్రియ దాకులం తిరశ్చా౦ ‘’.
ఒక వేళ ఖాండవ దహనం లో బంధువులంతా కాలిపో గా తక్షకుని కొడుకు అశ్వ సేనుడనే నాగరాజు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి
వస్తు న్నాడా ?లేక అన్నగారు భీమ సేనుని కోపానికి గురైనవాడెవడైనా వస్తు న్నాడా ?ఏమైనా ఈ బలిసిన పంది నన్ను చంపటానికి వచ్చేదే
అనుమానం లేదు .కనుక దీన్నితప్పక చంపాల్సిందే .జ్ఞా నులు శత్రు సంహారం గొప్ప లాభం అంటారు –‘’పరమం లాభ
మరాతిభంగమాహుః’’.నేను తపస్సు చేసే ఆశ్రమం లో చిద్రా న్వేషకులైన శత్రు వులు ప్రవేశించ కుండా తపస్సు చేయమని ,వ్యాసమహర్షి
బో ధించారు .కనుక ఈ పందిని మట్టు పెట్టా ల్సిందే .దుష్ట శిక్షణ లో హింస దో షం కాదు –‘’కురుతాతతపామ్య మార్గ దాయీ –విజయా యేత్య
ల మన్వశాన్ము నిర్మాం-బాలి నశ్చవధా దృతేస్యశక్యం –వ్రత సంరక్షణ మన్యథా న కర్తు ం..గాండీవం ధరించి శత్రు చేదనం చేయగల వాడి
బాణాన్ని మంత్రి సహాయం లాగా అందుకొన్నాడు ధనుంజయుడు .-‘’సచివః శుద్ధ ఇవా దదే చ బాణః’’.పూజ్యుడు ,సత్పరాయణుడు
,ఔదార్యాది గుణాలున్న మంచి స్నేహితుడు ధనబలం లేని సమయం లో ఎలా అనుకూలంగా నడుచు కొంటాడో ,అట్లా సారవంతం బలం
కలిగిన గాండీవం తపస్సుతో క్షీణించిన క్రీడి అల్లె త్రా డు లాగి బాణం సంధించగా నమ్రభావం పొ ందింది –‘’అనుభావవతా గురు స్థిరత్వా –దవి
సంవాదిధనుర్ధ నంజయేన-స్వబల వ్యసనే పి పీడ్య మానం –గుణవన్మిత్రమివానతింప్రపేదే’’..అర్జు నుడు సంధించిన అల్లెత్రా డుధ్వనికి ఏర్పడిన
భీకర ధ్వని పర్వతగుహల్లో వ్యాపించి ,అతడు పాదం మోపటం తో పర్వతం స్థిరత్వం కోల్పోయింది .అదే సమయం లో శివుడు ధనుస్సు
యొక్క అల్లెత్రా డు లాగిన ధ్వని త్రిపురాలను ధ్వంసం చేసినప్పటి ధ్వనిలా భయంకరాకారం తో అర్జు నుడిని చూశాడు .శత్రు సంహారం కోసం
ఒకే సారి సంధించిన శివార్జు నుల బాణాల మధ్య వరాహం చేరింది .ఈ ఇద్ద రి మధ్యా ఆ పంది చేరటం తో ఈశ్వర పినాక ధనువు నుంచి బాణం
మేఘంతో కూడిన మెరుపు ,పిడుగు లాగా వెలువడి ఏనుగులకు భయం కలిగించింది –‘’అథ దీపిత వారి వాహ వర్త్మా-రవ విత్రా సిత
కిరాతార్జు నీయం-.25
త్రయోదశ సర్గ -2
శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని
మూడో కంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణ పు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు
అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసో ప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్త డిల్లతాభైః-కిరణైర్వ్యోమని మార్గ ణస్యమార్గ ః
‘’.శివబాణ౦ వెడలిన క్షణం లోనే ,శివునికి దగ్గ రున్న ప్రమథ గణం,వరాహానికి దగ్గ రలో ఉన్నఆకాశ సంచారు.లైన సిద్ధ చారణాదులు వరాహం
శరీరం లో ప్రవేశించటం చూశారు .అంటే ప్రయోగించటం ,దానికి తగలటం ఏకకాలం లోనే జరిగిందని భావం –‘’అపయంధనుషః శివాంతికస్థై -
ర్వివరే సద్భి రభిఖ్యయా జిహానః –యుగ పద్ద దృశేవిశన్వరాహం-తదుపో ఢైశ్చనభశ్చరైఃపుషత్కః’’.శివబాణ౦కానుగ లాగా నల్ల గా ఉన్న ఆ
పంది శరీరం లో ప్రవేశించగా ఆకాశ చారులు నీటిని చీల్చుకొని భూమిలోకి ప్రవేశించే జలచరం అనుకొన్నారు –‘’స తమాల నిభే రిపౌ
సురాణా౦-ఘన నీహార ఇవా విషక్త వేగః-భయ విఫ్లు త మీక్షితో నభ స్థై –ర్జగతీంగ్రా హ ఇవాపగాం జగాహే ‘’.
శివుడు బాణం వేసిన సమయం లోనే అర్జు నుడు కూడా ప్రయోగించిన బాణం ప్రా ణులకు పీడకలిగిస్తూ ఆకాశంలో ప్రకాశించి ,దాని చివర
ఉన్న గోరు ఆకారపు లోహపు ములికి కోపించిన యముడిచూపుడు వేలులాగా శోభించింది –‘’సపది ప్రియరూప పర్వ రేఖః –సీతా లోహానగ్ర
నఖా ఖమాస సాద-కుపితా౦తకతర్జ నాంగులిశ్రీ –ర్వ్యథయన్ ప్రా ణ భ్రు తఃకపి ధ్వజేషుః’’.మంత్ర చోదిత అర్జు న బాణం ,తోక చుక్క కాంతితో
,మహా శబ్ద ం తో అడవిని ప్రకాశి౦పజేస్తూ ,పక్షులను చెదరగొట్టింది..అర్జు నుని ధనుస్సు నుంచి బయల్దే రటం ,ప్రయాణించటం ,లక్ష్యాన్ని
భేదించటం అన్నీ ఏకకాలం లో జరిగినట్ల నిపించింది .ఆలోచన ముందా తర్వాతా అనే తేడా తెలీలేదనిపించింది . –‘’అవి భావిత నిష్క్రమ
ప్రయాణః-శమితాయామ ఇవాతిరంహసాసః-సహ పూర్వతరం ను చిత్త వృత్తే-రపతి త్వాను చకార లక్ష్య భేదం ‘’. పందికి రెండవవైపు అంటే
శివబాణ౦ తగిలిన దానికి రెండో వైపు దూసుకుపో యి,మనుష్యప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడయినట్లు గా ఉంది .’’స వృషధ్వజసాయకా
వభిన్నం –జయహెతుఃప్రతికాయ మేష ణీయం-లఘు సా౦ధయితుం శరః ప్రసేసే-విధినేవార్థ ముదీరితంప్రయత్నః’’ .అవివేకం ,వృధా శ్రమ
ధనాన్ని ఎలా పో గొడతాయో,అత్యాశ సంపాదన ఆశ్రయించిన వారి ప్రేమను ఎలా దూరం చేస్తా యో దుర్నీతి అనవదానత ఎలా జయం కోరిన
వారిని చెడ గొడతాయో అలా శివుడు,అర్జు నుడు ప్రయోగించిన బాణాలు వరాహాన్ని నిర్జీవం చేశాయి –‘’అవివేక వృధాశ్రమా వివార్ధ ం –క్షయ
లోభా వివ సంశ్రితానురాగం -విజిగీషు మివా నయ ప్రమాదా –వవసాదంవిశిఖౌ వివిన్యతుస్త ం ‘’.ఆపంది మృత్యు వాత పడుతూ ,వేగం తగ్గి
,నాలుగు వైపులా దొ ర్లు తూ ,,సూర్యుడు నేలమీద పడినట్లు ,భూమి చుట్టూ చెట్లతోనిండి నట్లు భావించి ,చుట్టూ గిరగిరా తిరిగి నేలకు
ఒరిగింది .పంది చావు కళ్ళకు కట్టినట్లు గా చూపించిన భారవి కవి కవిత్వానికి కైమోడ్పు .-‘’అథ దీర్ఘతమ౦ తమః ప్రవేక్ష్యన్ –సహసా రుగ్జ ర
యః’’ స సంభ్ర మేణ-నిపతంత మివో ష్ణ రశ్మి ముర్వ్యాం-వలయీ భూత తరుం ధరాం చ మేనే’’.
నేలమీద పడి వేడి రక్త ం తో తడుపుతూ ,కాలిగిట్ట లతో ,నోటి కోరలతో రాళ్ళను పొ డుస్తూ ఒక్కక్షణం ఆర్జు నుడిని చూసి ,కోపంతో ఘుర్
ఘుర్ మంటూ గర్జిస్తూ ప్రా ణం వదిలింది .’’అసుభిఃక్షణ మీక్షితే౦ద్రసూను –ర్విహతా మర్ష గురు ధ్వని ర్నిరాసే ‘’ .పంది చనిపో యాక
అర్జు నుడు తన బాణం తీసుకోవటానికి దగ్గ ర కొచ్చాడు .అతని దగ్గ ర చాలా బాణాలున్నా ,ఈ బాణమే దాన్ని చంపిందని కృతజ్ఞ తా భావంతో
వచ్చాడు .ఎప్పుడో చేసిన ఉపకారం కన్నా ,తత్కాలం లో చేసిన సహాయాన్ని అభినందిచటం లోక సహజం కదా .-‘’స్ఫుట పౌరుష
మాపపాతపార్థ –స్త మథ ప్రా జ్య శరః జిఘ్రు క్షుః-న తథాకృత వేదినాం కరిష్యన్-ప్రియతా మేతియథా కృతావ ధానః ‘’.నీచునికి చేసిన ఉపకారం
ఇవా సతి ప్రయుక్త ః స్థితి మప్రా ప్య మృగే గతః ప్రణాశం-కృత శక్తిరథో ముఖోగురుత్వాజ్జ నిత వ్రీడఇవాత్మ పౌరుషః’’.ఉజ్వలకా౦తితో ఉన్నా ,తన
బాణం పరాక్రమం గురించి ప్రశ్నిస్తు న్నాడా అన్నట్లు మాటి మాటికీ కళ్ళతో పందిని కావలి౦చు కొంటున్నాడా అన్నట్లు చూశాడు .ఉత్త ములు
తమ పరాక్రమమం చూపితల ఎగరేయరు.-‘’స సముద్ధ రతా విచి౦త్య తేన –స్వరుచిం కీర్తిమివోత్త మాందధానః –అనుయుక్త ఇవ స్వవార్త
ముచ్చైః-పరిరేభే ను భ్రు శంవిలోచనాభ్యాం ‘’ .పందిలో గుచ్చిన తన బాణాన్ని వెతుకుతున్న అర్జు నుడి దగ్గ రకు శివుని సందేశం చెప్పటానికి
వచ్చిన ధనుర్ధా రి అయిన ఒక కిరాతుని చూశాడు.అతడు మర్యాదగా నమస్కారం చేసి ,శాంతంగా యుక్తియుక్త ంగా ఇలా చెప్పాడు –‘’నీ
శాంతం నీహృదయ స్వభావాన్ని,వినయాన్నీ తెలియజేస్తో ంది .గొప్ప తేజస్సుతో చేసిన తపస్సు శుద్ధ శాస్త జ
్ర ్ఞా నాన్ని తెలియ జేస్తో ంది
.దేవతలతో పో ల్చదగిన నీ ఆకారం నీ ఆకృతికి విరుద్ధ మైన వంశాన్ని ప్రకటిస్తో ంది -‘’శాంతతా వినయ యోగి మానసం –భూరి ధామ విమలం
తపః శ్రు తం –ప్రా హ తే ను సదృశీ దివౌకసా –మన్వవాయ మవదాతమాకృతిః’’.ముని వేషం లోనూ మహా ప్రకాశమానం గా ఉన్నావు .నీ
మహత్వం ఇతర రాజులను తక్కువ చేస్తు ంది .ఇంద్రకీలం లో ఉంటూ ,ఇంద్రు ని ద్వారా త్రిలోకాధిపత్యం చేయిస్తు న్నట్లు ంది . తస్విగా
ఉన్నా,సకల సంపన్నుడి లాగానే ఉన్నావు . ఒంటరిగా ఉన్నా ,తేజస్సుతో మంత్రు లతో ఉన్నట్లు గానే భాసిస్తు న్నావు –‘’తాపసో పి
విభూతాముపే యివా –నాస్పదం తవమసి సర్వ సంపదాం-దృశ్యతే హిభవతో వినా జనై-రన్వితస్య సచివైరివ ద్యుతిః..నీకు జయలక్ష్మి
ప్రా ప్తించటం ఆశ్చర్యం కలిగించేది కాదు .ముక్తిని గురించి చి౦తించాల్సిన పనీలేదు .అది నీకు దుర్ల భం ఏమీకాదు .రజస్త మో గుణాలను
జయించిన వారికి సిద్ధించని కోరిక ఉండదు కదా ‘’అన్నాడు భిల్లు డు అర్జు నుడితో .
కిరాతార్జు నీయం-.26
శివుడు పంపిన భిల్లు డు అర్జు నుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి
బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్త మ మార్గా లను బో ధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి
సంగతేమిటి ?ఆత్మజ్ఞా నులైన యతులు జనన మరణాలు జయించి విపత్తు లకు కారణమైన అపమార్గ ం లో ప్రవేశించకుండా సన్మార్గ ం
బో ధిస్తు న్నారు .అంటే నువ్వు సన్మార్గ ం, సచ్చీలం ఎప్పుడూ వదలకూడదని సూచన .తపస్సులో నిరతులైనవారికి వినయం
పుణ్యాన్నిస్తు ంది .సుఖం కోరితే సంపదలిస్తు ంది. యోగులకు ముక్తి నిస్తు ంది .అంటే వినయశీలం చతుర్విధ అర్ధా లను ఇస్తు ందని భావం
–‘’తిష్ట తాం తపసి పుణ్య మానజన్ –సంపదో సుగుణయన్ సుఖైషితాం –యోగినాం పరిణమన్విముక్త యే –కేన నాస్తు వినయః సతాం ప్రియః
.నీబాణం మా యజమాని బాణం లాగానే ఉండి ఉండచ్చు .ఐతే ఇతరులబాణాన్నితీసుకోవటానికి అపసవ్యమార్గ ం లో ప్రయత్నిస్తు న్నావు
.అభిమాని, సజ్జ నుడు అయిన నువ్వు నిస్పృహతో ఈ పని చేయటం తప్పు .ఇతరులు చంపిన మృగాన్ని మళ్ళీ కొట్ట టం కూడా తప్పే
.,సిగ్గు మాలిన పనే –‘’అన్యదీయ విశిఖే న కేవలం –నిస్పృహస్య భవితవ్య మాహృతే –వ్రీడి తవ్యమపి తే సచేతసః ‘’.మా యజమాని
కిరాతపతి నీపని ఉత్కంఠ తో విని సంతోషిస్తా రో ,లజ్జితులౌతారోతెలీదు .ఎవరైనా మాస్వామిని కీర్తిస్తా రు .స్వామి పేరు పరిహాసంగా
చెప్పటానికి సిగ్గు పడతారు అనగా మహాత్ములు తమకీర్తిని గురించి గొప్పగా వినటానికి ఇష్ట పడరు అని భావం .ఆత్మ ప్రశంస నచ్చని మా
స్వామి ఇతరుల దో షాలను గుణాలు అని ఎలాచేప్తా రు ?అయినా అవసరం వచ్చినప్పుడు చెప్పక తప్పదు .ఒకవేళ మా స్వామి పందిని
చంపక పో యి ఉన్నట్ల యితే ,ఏమయ్యేదో అనే భయవార్త చెప్పరాదు .దేవుడు నీకు అలాంటి ఆపద కల్పించరాదు-‘’దుర్వచనం తదథ
మాస్మభూనృగ-స్త య్యసౌ యదకరిస్య దో జసా –నైవ మాశు యది వాహినీ పతిః-ప్రత్యపత్స్వ త శితేన పత్రిణా’’.ఇద్రు ని వజ్రా యుధం లా
బలీయమైన ఈ వరాహాన్ని మాస్వామి కిరాతపతి తప్ప ఎవరూ చంపలేరు-‘’కోన్విమం హరి తురంగ మాయుధ స్థేయసీం దధత మంగ
మా కిరాత ప్రభువు ప్రా ణ సంకటం లో కూడా ఉపకారం చేస్తా డు .అసలు ఆయన నీ మిత్రు డే అన్న సంగతి నీకు తెలుసా ?అతనితో విరోధం
పెట్టు కోవటం సజ్జ నులకు ఆశ్రయమైన కృతజ్ఞ త ను కాదనటమే . కృతఘ్నుడివి కావద్దు –‘’మిత్ర మిష్ట ముపకారి సంశయే –మేదినీ
పతిరయం తథా చతే-త౦ విరోధ్యభవతా నిరాసి మా-సజ్జ నైక పతిః-కృతజ్ఞ తా ‘’.విజయం కోరేవారికి మిత్రలాభం అన్ని సంపదలకంటే గొప్పది
.సంపదలు కష్ట సాధ్యాలు .సాధించినా నిలవవు .మిత్రలాభం ఉపకారం తో తేలికౌతు౦ది.రక్షించటం కష్ట ం కాదు .అది మనల్ని రక్షిస్తు ంది
.చివర్లో సుఖమిస్తు ంది –‘’లభ్య మేక సుకృతేన దుర్ల భా –రక్షితార మను రక్ష్య భూతయః –స్వంతమంత విరసా జిగీషతాం –మిత్ర లాభ మను
లాభ సంపదః ‘’.దన సంపదలు చంచలాలు.నశి౦చేవికూడా .భూమి బలవంతులకే స్వాధీనం .స్థిరమైనవాడు ఐన మాస్వామి స్వయంగా వస్తే
అవమాని౦చ వద్దు .అంతమంచి స్నేహితుడు దొ రకటం నీ అదృష్ట మే –‘’చంచలం వసు నితాన్త మున్నతా –మేదినీ మపి హరంత్యరాతయః –
నువ్వు శత్రు సంహారానికే తపస్సు చేస్తు న్నావు .మోక్షం కోరేవారికి ఆయుధాల అవసరం లేదు కదా .మా కిరాత రాజు స్నేహం చేస్తే ,నీ
తపస్సు ఫలిస్తు ంది .మా రాజు వద్ద గుర్రా లు పుట్టే చోటు ,ఏనుగుల ఉత్పత్తి స్థా నమైన అడవి ,రత్నాల గనులు చాలా ఉన్నాయి .బంగారు
బాణాలు ఎందుకు ?.మా రాజు అవమానం మాత్రం సహి౦చలేడని గ్రహించు –‘’వాజి భూమి ‘’రిభారాజ కాననం -.సంతి రత్న నిచయా శ్చ
భూరిశః –కా౦చనేన కిమివాస్య పత్రిణా-కేవలం న సహతే విలంఘనం ‘’.ఇతరులు గర్వంతో దుమ్ము రేపినా,మా ఏలిక సహించలేడు .ప్రా ర్ధిస్తే
ప్రా ణాలైనా ఇస్తా డు .అతడికి ధనంతో పనేమిటి ?-‘’సావ లేప ముప లిప్సితే పరై-రభ్యుపైతివికృతిం రజస్యపి - ఆర్థితస్తు న మహన్సమీహతే
–జీవితం కిము ధనంధనాయితుం ‘’.కనుక మా రాజు బాణం అయనకిచ్చి,శ్రీరామ సుగ్రీవ మైత్రి లాగా దైవికంగా కలిగిన ఈ అవకాశం
సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం .ఉభయుల మైత్రి మంచిది .-‘’తత్త దీయ విశిఖాతిసర్జ నా-దస్తు వాంగురు యాదృచ్ఛ యాగతం-
రాఘవ ప్ల వగ రాజ యోరివ-ప్రేమ యుక్త మితరేతరాశ్రయం ‘’.నీతో అబద్ధ ం చెప్పటం మాకు ఇష్ట ం లేదు .తపస్వుల బాణాలు తీసుకొనే
కోరికమాకెందుకు ?మా దగ్గ ర ఇలాంటి బాణాలు ఎన్నో ఉన్నాయి .అవివజ్రా యుధం కంటే గొప్పవి .నీ బాణాలంటివి ఆయన కావాలనుకొంటే
కోకొల్ల లు వచ్చి పడతాయి .నీ లాంటి మహానుభావులు మిత్రత్వం తో యాచిస్తే ,ఈ భూమండలాన్నే జయించి ఇవ్వగలడు.-‘’మార్గ ణై రథ
తవ ప్రయోజనం –నాథ సేకిము పతింన భూభ్రు తః-తద్విధం సుహృద మేత్య సో ర్ధినం –కిం న యచ్ఛతివిజిత్య మేదనీ
ి ం ‘’.బ్రా హ్మణ చాపల్యం
తో నువ్వు చంపిన పంది మాస్వామి ఎన్నుకొన్నది .దీన్ని మా రాజు క్షమించడు .ఆలోచన లేకుండా చేసే అపరాధం అజ్ఞా నాన్ని దాచేస్తు ంది
.ఆ౦టే తెలివి లేని వారి తప్పు తప్పు కాదు అనిభావం . బ్రా హ్మణ కులం, కాషాయ వేషం, తపస్సు విరుద్ధ మైనవి. ఇలాంటి తప్పు మళ్ళీ
చేయకు .చెడు దారిలో నడిచే వారి చెడు బుద్ధి ఇహపరాలకు చేటు తెస్తు ంది –‘’జన్మ మేష తపసాం విరోదినీం –మా కృథాఃపూన రమూమ
ఇప్పుడు పితృ దేవతలకు శ్రా ర్ధ ం లేదు. దేవతార్చన కూడా లేదుకదా ఎందుకు ఆపందిని కొట్టా వు ?దాని మానాన దాన్ని పో నిస్తే బాగుండేది
కదా .చూడటానికి సత్పురుషుడు లాగా ఉన్నావు .చాంచల్యం వదిలేయి .నీ అపకారాలు ఎప్పుడూ ఎవరు సహిస్తా రు ?ప్రళయకాల
వాయువులు సముద్రా లకు క్షోభ తెచ్చినట్లు ,ప్రతిసారీ చేయరాని పనులు చేస్తే, ధైర్యవంతులు కూడా క్షోభకు గురౌతారు .మా రాజు
అస్త వి
్ర ద్యలో అసామాన్యుడు .ఏదో కొండల్లో కోనల్లో ఉండేవాడు కదా అని తిరస్కరించకు .ఇంద్రు డు ఈ పర్వతాన్ని రక్షించమని స్వయంగా
కోరటం వలన ఇక్కడ ఉంటున్నాడు మా రాజు .-‘’అస్త ్ర వేదవిదయం మహీ పతిః-పర్వతీయ ఇతి మావా జీ గణః-గోపితుం భువ మిమాం
మరుత్వతా –శైలవాస మను నీయ లంభితః ‘’.ముని విషయం లో తప్పు కాస్తా ను అని మా స్వామి చెప్పాడు .కనుక నువ్వు కూడా ఆ
బాణాన్ని ఇచ్చేసి స్నేహం చేసి, సకల సంపదలు పొ ందు .-‘’తత్తి తిక్షితమిదం మయా మునే –రిత్య వోచత వచశ్చమూ పతిః-బాణ మత్రభవతే
నిజం దిశ-న్నాప్నుహి త్వమపి సర్వ సంపదః ‘’.ఎవరివలన శుభాలు , సద్గు ణాలు,సదాచారం అలవడుతాయో ,ఆపదలు తొలగి పో తాయో
అలాంటి అనేక గుణాలున్న సత్సా౦గత్యాన్ని కల్గించే స్నేహాన్ని ఎవడు వదులు కొంటాడు స్వామీ .వాడియైన అస్త్రా లు ,సర్పాలతో కూడిన
తరంగాలున్న సముద్రం వంటి మా కిరాత రాజు చెలియలి కట్ట ఆపి నట్లు , అదుగో ఆ చెట్ల చాటున సమయం కోసం నిలిచి ఉన్నాడు చూడు
‘’అని రాయబారి తన సేనాపతిని చేతితో చూపాడు –‘’ దృశ్యతామయ మనోకహాన్త రే -తిగ్మహేతిపృతనాభి రన్వితః –సాహి వీచిరివ సింధు
రుద్ధ తో –భూపతిః సమయ సేతు వారితః ‘’.ఓ దీశాలీ !అదుగో మాప్రభువు స్థిరంగా ఇంద్ర ధ్వజ శోభకంటే గొప్పగా ,ఆది శేషునిలాగా స్థూ లంగా
ఉన్న ధనుస్సు ఎక్కు పెట్టి సిద్ధంగా ఉన్నాడు .అతని కోరిక మన్నించి స్నేహం చేస్తే నీకోరికలన్నీ తీరుతాయి ‘’అన్నాడు కిరాత శివ దూత .
కిరాతార్జు నీయం-.28
చతుర్ద శ సర్గ -2
కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య
.గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జ నులకు ఎప్పుడూ శత్రు వులే –‘’సఖా న యుక్త ః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా
సూయతి యస్త పస్యతే –గుణార్జ నోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధ యః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః .మేము వర్ణా శ్రమ ధర్మ సంరక్షుకులమైన
క్షత్రియులం .హీనజాతి హి౦సామార్గ గామి మీ రాజుతో స్నేహం ఎలా చేస్తా ం ?ఏనుగులు నక్కలతో స్నేహం చేస్తా యా ?మీరాజుతో అందుకే
స్నేహం కుదరదు .-‘’వయం కృవర్ణా శ్రమ రక్షణోచితాః-క్వ జాతిహీనా మృగ జీవితచ్ఛిదః-సహాప కృష్టైర్మహతాం న సంగత౦ –భవంతి
గోమాయు సఖా న దంతినః’’ .మూర్ఖు డు సజ్జ నులను అవమాని౦చినంత మాత్రా న వాళ్ళ ధీరత్వానికి లోటు ఏమీరాదు.సమాన పరాక్రమ౦,
వంశం, ,పౌరుషం ఉన్నవారు అతిక్రమిస్తేనే అది అవమానమౌతుంది –‘’పరోవ జానాతి యదజ్ఞ తా జడ-స్త దున్నతాం న విహంతిధీరతాం-
సమాన వీర్యా న్వయ పౌరు షేషు యః-కరోత్యతి క్రా ంతి మాసౌ తిరస్క్రియా’’ .సజ్జ నులు నీచులతో వైరం పెంచుకొంటే వారి కీర్తికే చెడ్డ
పేరొస్తు ంది.వారి తో స్నేహం చేస్తే గుణాలు చెడిపో తాయి .అందుకే నీచులతో సజ్జ నులు ఉపేక్షా భావం తో ఉంటారు .ఈ రెండు కారణాలవలన
మీరాజు పలికిన తిరస్కార వాక్యాలు సహించాను .కాదూ కూడదూ అంటూ ,బాణాన్ని తీసుకోవటానికే ఇక్కడికి వస్తే ,భయంకర సర్పం
పడగపై శిరోమణి గ్రహించటానికి వచ్చిన వాడి గతేపడుతుంది –‘’మయా మృగాన్ హంతు రనేన హేతునా –య విరుద్ధ మాక్షేప వచస్తి తిక్షితం
ఇలా అర్జు నుడు తన అభిప్రా యం చెప్పగా కిరాతుడు సైన్య సమేతంగా ఉన్న శివుడి దగ్గ రకు విషయం చెప్పటానికి వెళ్ళాడు .తర్వాత
కిరాత సేనాపతి ఆజ్ఞ తో సేన భయంకర శబ్దా లు చేస్తూ బయల్దే రింది .ప్రళయం లో సుడిగాలితో సముద్ర తరంగాలు ఎగసి పడుతున్నట్లు గా
ఉంది .అప్పుడే అనుకూలవాయువు వీచింది .సుగంధ తు౦పురులతోసేన పతాకాలు రెపరెప లాడుతూ యుద్ధా నికి తొందర చేస్తు న్నట్లు
ఆగాలి సేనకు ముందే వీచింది .జయజయ ధ్వానాలు అల్ల తాడు ధ్వనులు పర్వత గుహలనుంచి భూమిని కంపింప జేస్తూ దిక్కులన్నిటా
వ్యాపించింది .తీక్ష్ణమైన కిరాతుల శస్త్రా లపై పడిన సూర్య కిరణాలు అధికకా౦తితో అని దిక్కుల్నీ కాల్చి వేస్తు న్నట్లు ప్రకాశించాయి –‘వనే
సదాం హేతిషుభిన్న విగ్రహై –ర్విపు స్పురే రశ్మి మతో మరీచిభిః’’. శివుడు విశాల వక్షస్థ లం తో ఒక వైపు ఆచ్ఛాదించి ,అల్లెత్రా డు లాగి
,ధనుస్సును మండలాకారం గా చేసి భయంకర ధ్వని కల్పిస్తూ ,తన ప్రభావం తో రెండుప్రక్కలా భూమిని వ్యాపించాడు .ప్రమథ
గణాలుమధ్యలో ఉన్నా ,వారందరికీ పైనే ఉన్నట్లు ప్రకాశించాడు –‘’వితత్య పక్షద్వయ మాయత౦ బభౌ –విభుర్గ ణానాముపరీవ మధ్యగః ‘’.
గణాలు సమాన వేగంగా పో టీ పడుతూ ముందుకు సాగుతోంది .వనాలు శ్వాస పీల్చుకోవటానికి కూడా వీలు లేనట్లు
అతలాకుతలమయ్యాయి –‘’గణైరవి చ్చేదనిరుద్ధ మాబభౌ –వనం నిరు చ్ఛ్వాస మివాకులాకులం .సేన పర్వతాలు ఎక్కుతూ దిగుతూ
పో తుంటే ,క్షణం లో ఎత్తు పెరిగి ,మరుక్షణం లో లోతుగా మారినట్లు కనిపించాయి –‘’కిరాత సైన్యే రపిధాయ రేచితా –భువః క్షణం నిమ్నత
యేవ భేజిరే ‘’.సైన్యం పెద్దపెద్ద అ౦గ లేస్తూ వెడుతుంటే తీగలు తొక్కిడికి గురై ,సైన్యవేగంవలన ఏర్పడిన గాలితో మద్ది ,చందన వృక్షాలు అటూ
ఇక్కడ మద జలం కారి చిక్కిపో యిన ఏనుగులా ఘోర తపస్సు తో చిక్కి బక్క అయిన అర్జు నుడు ఉన్నాడు .దిక్కులను కాల్చే అగ్ని
తేజస్సుతో ఉన్నాడు -‘’పరిజ్వలంతం నిధనాయ భూ భ్రు తాం-దహంత మాశాఇవ జాత వేదసం ‘’. ,అనుకూల మిత్రు ని పొ ందే కోరికగా
,జయం పొ ందే కాంక్షగా అమ్ములపొ ది నుంచి అలవోకగా ఒక బాణం తీయటం లో –విఫలమై ,ప్రతీకారం తీర్చుకోవాలనే సముద్రం లాంటి
కిరాత సేన ను నిర్ల క్షంగా చూశాడు .-‘’అనాదరోపాత్త ధృతైక సాయకం –జయేనుకూలే సుహృదీవస స్పృహం-శనై రపూర్ణ పతీ
్ర కార పెలవే-
ఆపదలను దూరం చేసే గా౦డీవాన్ని ధరించి ,సహజ సిద్ధ స్థితి లో కూర్చుని దాటరాని మహా సముద్రంలా భాసి౦చాడు. అర్జు నముని
–‘’నిషణ్ణ మాప త్ప్రతి కారకార ణే-శరాసనే ధైర్య ఇవానపాయినీ –అల౦ఘనీయం ప్రకృతావపి స్థితం –నివాత నిష్కంప మివాపగాపతిం
.’’ఎదురుగా చచ్చి పడిఉన్న పందివధ కారణంగా అర్జు నుడు మృత్యు భయంకర రూపం గా ఉన్నాడు .యజ్ఞ ం లో బ్రా హ్మణ ఆహ్వానం పై
వచ్చిన సాక్షాత్ రుద్రు నిలా తపో రుద్రు డు అర్జు నుడు ఉన్నాడు –‘’ఉపే యుషీం బిభ్రత మంతక ద్యుతిం – వధాదదూరే పతితస్య దంష్ష్ట్రిణః-పురః
సమావేశిత సత్పశుం ద్విజైః-పతిం పశూనా మివ హూతమధ్వరే’’.ధైర్యంతో ఇతరుల గౌరవాన్ని జయి౦చేట్లు గంభీరంగా ఉన్నాడు .నాలుగు
గుణేన భూయసా -వనోదయేన ఘనోరు వీరుధా-సమంధ కారీకృత ముత్త మాచలం ‘’.మహా వృషభ మూపురం వంటి ఎగు బుజాలు ,లావైన
బలమైన మెడ,కోట గోడ లా విశాలమైన వక్షస్థ లం కలిగి ఉన్న అర్జు నుడు మహాభారమైన భూమిని సముద్రం నుంచి ఉద్ధ రించే మహా ఆది
వరాహ మైన విష్ణు మూర్తిలా లా భాసి౦చాడు-‘’మహార్షభస్కంధమనూన కంధరం –బృహచ్ఛిలా వప్ర ఘనేన వక్షసా –సముజ్జి హీర్షు ౦
కిరాతార్జు నీయం-.29
చతుర్ద శ సర్గ -3
అర్జు న శరీరకాంతి మరకత మణి లా పచ్చగా ఉంది .ఉదార ఆకారం అన్నిటినీ తిరస్కరిస్తు ంది నీటి తరంగాలపై ప్రకాశించే సూర్యుడిలా
ఉన్నాడు .బదరీ వన నారాయణ సహచరుడైన నరునిలా ఉన్నాడు –‘’మానుష్య భావే పురుషం పురాతనం –స్థితం జలాదర్శ ఇవా౦శు
మాలినీం ‘’.సుకృత ఫలితం తో విశ్వ విజయ పరాక్రమం తో భాసిస్తు న్నాడు .అలాంటి అర్జు నుడి దగ్గ రకు గ్రీష్మం చివర నీటితో నిండిన
మేఘాలు ఆకాశాన్ని కమ్మేసినట్లు శివ సైన్యం వచ్చింది .’’గణాఃసమాసేదుర నీల వాజిం –తపాత్యయే తోయ ఘనా ఘనా ఇవ ‘’.సేనలో
ప్రతివాడూ ఈ అర్జు నుని జయిస్తా నని ప్రగల్భాలు పలుకుతున్నాడు.కానీ చూడంగానే ప్రతాపం చల్లా రి పో యింది .ఏం చేయాలో తోచలేదు
.మహానుభావత్వం పౌరుషాన్ని నశి౦ప జేయటం సహజమే కదా –‘’యయుఃక్షణాదప్రతిపత్తి మూఢతాం –మహాను భావః ప్రతి హంతి పౌరుషం
‘’.గణాలు పరస్పర సహకారం తో అర్జు నిపై తలపడ్డా రు .పనులసిద్ధికి సహాయ సహకారాలు కావాలికదా గోప్పవారుకూడా సంఘ వృత్తి నే
ఆశ్రయిస్తా రు –‘’మహో దయానామపి సంఘ వృత్తి తాం-సహాయ సాధ్యాః ప్రది శ౦తి సిద్ధయః ‘’ సైన్యం నుంచి ఒకేసారిగా అందరి బాణాలు
ప్రయోగింప బడి అర్జు నునిపై దూసుకొచ్చాయి .వనం నుంచి వేరొక వనానికి వెళ్ళే పక్షుల సముదాయంగా ఉంది ఆ బాణ పరంపర.గుహల
ప్రతిధ్వనితో ధనుష్ఠ ౦కారాలతొ దిక్కులు పిక్కటిల్లే ధ్వని కలిగింది.అడవి చెట్లను కంపి౦ప జేస్తూ భూమి ఆకాశాలను కప్పేస్తూ బాణ వర్షం
కురుస్తో ంది .సుడిగాలితో వర్ష ధారగా ఉంది .అర్జు నుడు సామదాన భేద ఉపాయాలతో సమానమైన బాణాలు వేస్తు న్నాడు .అవి శత్రు వుల
చూపులకు అందటం లేదు. ఎంతైనా దూరం వెళ్లి ఫలితాన్నిచ్చేవి, ప్రతీకారం తీర్చుకొనేవి .అందంగా విశాలం గా ఉన్నవిఆ బాణాలు .
–‘’గతైఃపరేషామ విభావ నీయతాం –నివార యద్భిర్విపదంవిదూరగైః-భ్రు శం బభూవోపచితో బృహత్ఫలైః-శరైరుపాయైరివ పాండు నందనః ‘’..ఆ
బాణాలు ఎక్కడి నుంచి వస్తు న్నాయో, తెలీక కిరాతులు తెల్లమొహాలు వేస్తు న్నారు. ఆకాశం భూమి దిగ్మండలం లను నుంచా అనుకొని
చివరికి అర్జు నుడి శరీరం నుంచే వస్తు న్నాఏమో అనికూడా అనుకొన్నారు .అక్కడ ఎంతమంది సైనికులున్నారో అంతమందినిగురిచూసి
కొట్టిన అర్జు న బాణ సమూహం శంకర సైన్యాన్ని తల వాల్చుకొనేట్లు చేసింది .చంద్ర కిరణాలు సో కగానే పద్మవనం ముడుచుకున్నట్లు గా ఉంది
–‘’సముజ్ఘితా యావదరాతినిర్యతీ –సహైవ చాపాన్ముని బాణ స౦హతిః-ప్రభా హిమాంశోరివ పంకజావలిం –నినాయ సంకోచ ముమాపతే
శ్చమూం ‘’.చంపటం నరకటం పడేయటం మొదలైన వాటికీ వేరువేరు గా వ్యర్ధ ం కాని వేగం కల సూటిగా లక్ష్యాన్ని తాకే బాణ ప్రయోగానికి
కిరాత సైన్యం ప్రతీకారం తీర్చుకోలేక పో యింది .అనేక చోట్ల ఉన్న శివ సైనికులు ఒక్క చోటనే ఉన్న అర్జు న వేడి బాణాలకు అనేక చోట్ల ఉండే
ప్రజలు ఒకే చోటు నుంచి వేడి కిరణ ప్రసారం చేస్తు న్న సూర్యుడిలాగా ఉన్నాడు –‘’శివధ్వజిన్యః ప్రతి యోధ మగ్రతః –స్ఫురంత ముగ్రేషు
మయూఖ మాలినం –తమేక దేశస్థ మానేక దేశగా-నిదధ్యురర్కం యుగవత్ప్రజా ఇవ ‘’.అర్జు న బాణ సేనతో శివసేన సుళ్ళు తిరిగి కూలి
,వేగంగా వీచే సుదడిగాలి తో గ్రీష్మ ధూళి అంటి సుళ్ళు తిరిగినట్లు గా ఉంది .శివ సేన తమలో తాము’’ఈముని తపో బలం తో అదృశ్య శరీరం
పొ ంది ,అన్ని వైపులనుంచి బాణాలు కురిపిస్తు న్నాడా ?లేక మన బాణాలే మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి మనపై ‘’బూమరాంగ్ ‘’అయి
పడుతున్నాయా ?ఏమీ అర్ధ ం కావటం లేదు ‘’అని మైండ్ బ్లా ంక్ అయి నిర్వీర్యం పొ ందారు –‘’తపో బలేనైవ విధాయ భూయసీ –స్త నూర
కిరాతార్జు నీయం-.30
వేస్తు న్నారా ?లేకపో తే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపో తోంది శివ
సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే –స్తిరోహితాః స్విత్ప్రహరంతిదేవతాః –కథంన్వమీ సంతతస్య సాయకా –భవత్యనేకే
జలధేరివోర్మయః ‘’.ఈయన యుద్ధ ం లో జయించి విరమిస్తే ,చరాచర లోకాలకు మేలు జరుగుతుంది ‘’అంటూ బాణం దెబ్బలకు
భయపడుతున్న సేన నీరుకారి అంటోంది .చివరికి చేతు లేత్తేసి నిస్తేజమై బదులు చెప్పలేక శాంతి మార్గ మే మేలు అనే ఆలోచనలోకి
వచ్చారు .పురుషార్ధ ం కూడా బలీయమైన దైవం ముందు వ్యర్ధ మౌతుంది –‘’బలీయసా తద్విధి నేవ పౌరుషం –బలం నిరస్త ం న రరాజ
జిష్ణు నా’’.అర్జు న బాణ క్షత గాత్రు లైన శివ సైనికులు సూర్య కిరణాలతో శోషింప బడిన నీరు మండలాకారం గా తిరిగినట్లు నిశ్చేష్టు లై
మండలాకారం లో గుమి కూడారు .-‘’రవి కర గ్ల పితైరివ వారిభిః-శివ బలైః పరిమ౦డలతా దధే’’.అర్జు న బాణాలు బ్రహ్మాండాన్నికప్పేయగా
,మాటిమాటికీ ధనుస్ఫాలనం చేయటం తో భయపడ్డ విజయ లక్ష్మి అతి కష్ట ంగా శివ సేనపై ఉన్న అనురాగాన్ని వదిలించుకోవటానికి
సిద్ధపడింది .అంటే కిరాత సేన పరాజయాన్ని ఒప్పుకొన్నదని భావం – ‘’’ప్రవితత శరజాల చ్ఛన్న విశ్వాంత రాలే -విధువతి
ధనురావిర్మండలం పాండు సూనౌ –కథమాపి జయ లక్ష్మీ ర్భీత భీతా విహాతుం –విషమనయన సేనా పక్ష పాతం విషేహే’’.
పంచదశ సర్గ -1
వ్యాకులత చెందిన జీవజాలం ఊపిరి పీల్చుకోగా ,శివ సేన ఆయుధాలు అక్కడే పారేసి తలో దిక్కుకూ పారిపో యారు .ప్రమథ గణం శివుడిని
చూడకుండానే పారిపో యింది సంకటసమయం లో మనసు ఏదీ ఆలొచి౦చ లెదు కదా –‘’అపశ్యద్భిరి వేశానం రణన్నివవృతే గణైః -
ముహ్యత్యేవ హాయ్ కృచ్ఛ్రేషుసంభ్రమ జ్వలితం మనః ‘’. జయించే ఆశవదిలి పారిపో తున్న కిరాత సేనపై కపిధ్వజ విజయునికి దయ
కలిగింది .అనేక ప్రయత్న విధానాల్లో శత్రు వును వశం చేసుకొన్న మహాత్ములకు వారి విషయం లో దయకలగటంగొప్ప వారి మాహాత్మ్యాన్ని
చాటుతుంది –‘’వ్యక్తిమాయాతి మహతాంమాహాత్మ్య మను కంపయా ‘’ఖడ్గ బాణ ధనుస్సులు కలిగి వాహనం తో, వాహనం లేకుండానూ శత్రు
నిర్జ నం చేసి స్వర్ణ గజాదులు స్వాధీనం చేసుకొన్నఅందమైన భాగ్యశాలి ,శివ పుత్రు డు, దేవ సేనాని అయిన కుమారస్వామినే యుద్ధ ం లో పరి
గెత్తి ంచ గల ధీశాలి అర్జు నుడు యుద్ధ భూమిలో విచిత్ర శోభ పొ ందాడు .-‘’స సాసిః సాసుసూః సాసో యేయా యేయా యయాయః-లలౌ లీలాం
లలో లోలః శశీ శశి శుశీః శశ౦ ‘’ఇది చిత్ర కవిత్వ శ్లో కం .సాసిః అంటే ఖడ్గ మున్నవాడు,సాసుసూః అంటే ప్రా ణాలు హరించే బాణం ఉన్నవాడు
,సాసః అంటే ధనుస్సున్నవాడు ,యేయ అయేయ అయయ,అయయః అంటే వాహనం తో నూ ,అది లేకున్నా ,శత్రు వును చేరేవారి
వాహనాలు స్వాధీనం చేసుకొనే వాడు ,లలః అంటే అందమైన వాడు ,అలోలః అంటే చాంచల్యం లేనివాడు ,శశి ఈశ ,శిశు శీః అంటే చంద్ర
ధరుని కుమారుడైన దేవసేనానిని పరి గెత్తి ంచిన వాడు ,శశన్ అంటే పిక్కబలం చూపించగలవాడు ,లీలా అంటే శోభను లలౌ అంటే
ధరించాడు అని అర్ధ ం .శబ్ద ం, ఏకాక్షర నిఘంటువు వ్యాకరణాలపై పూర్తి అధికారం ఉన్న కవి మాత్రమే రాయ గలిగిన శ్లో కాలివి .
భయంతో పరిగెత్తే శివ సైన్యాన్ని నెమ్మదిగా అనుసరించి వెళ్ళాడు .బాధలో ఉన్నవారిని మరీ బాధపెట్ట టానికి మహానుభావులు ఇష్ట
పడరు.-‘’నాతిపీడ యితుం భగ్నా నిచ్ఛ౦తి హిమహౌజసః ‘’.పారిపో యి వస్తు న్న తమ సైన్యాన్ని చూసి, వాళ్ల కు ఎదురుగా ముందుభాగాన
ఉండికార్తికేయుడు ఖిన్నులైన కిరాతులతో ఇలా అన్నాడు –‘’అథాగ్రే హసతా సాచి స్థితేన స్థిర కీర్తినా –సేనాన్యేతే జగదిరే కించి దాయస్త
చేతసా ‘’ఈ శ్లో కాన్ని నిర్యోష్ఠ ్యం’’అంటారు.అంటే పెదవులు కలవకుండా పలికే అక్షరాలతో కూర్చింది .ఇదీచిత్రకవిత్వమే .కుమారస్వామి
వాళ్ళతో ‘’యుద్ధ ం ,ఆట మీకు సమానమే .రాక్షసులని జయించి కీర్తిపొ ందారు సామాన్యుల్లా పారిపో తే మీ కీర్తికి మచ్చ .మీలాటి
మహాశూరులకు ఇది తగని పని .-క్షతంక్షుణ్ణా సుర గణై రగణైరివ కిం యశః’’ఈపాదం యమకం తో రాయబడింది .’’సూర్యకిరణాలు సో కి మీ
ఖడ్గా లు మిమ్మల్ని పరిహాసం చేస్తు న్నాయా?అంటే పారిపో యేవారికి కత్తు లతో పనేమిటి అని భావం .ఆడవి మృగాలు తిరిగే చోట
తలదాచుకోవటానికి పరిగెత్తే మీ దుఖం ఎలా శాంతిస్తు ందో అని నా విచారం ‘’అన్నాడు –‘’వనే వనే వన సదా౦ ,మార్గ ం ,మార్గ
ముపేయుషా౦-బాణై ర్బాణైఃసమాసక్త ం శ౦కేశంకే న శామ్యతి ‘’ఈ శ్లో కం లోనూ యమక శోభ ఉన్నది .
కిరాతార్జు నీయం-.31
15 వ సర్గ – 2
కుమార స్వామి శివ సేన పారిపో వటాన్ని చూసి మందలిస్తూ ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపో యి వచ్చారు ?
మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు
.రజోగుణమున్న కేవల మానవ మాత్రు డు.-‘’‘నా సురో యమ న వా నాగో- ధర సంస్థో న రాక్షసః –నా సుఖో యం నవాభాగో –ధరణిస్థో హి
రాజసః ‘’.ఈ శ్లో కం ‘’గోమూత్రికా బంధం ‘’తో ఉంది .16 అరలు ఉండే రేఖలకు పై భాగం లో ముందుభాగం ,కిందిభాగం చివరి భాగం కలిపితే
శ్లో కం పూర్త వుతుంది .’’ఈ ముని దయతో నెమ్మదిగా బాణ వదులుతూ ,మిమ్మల్ని దారితప్పిన పశువుల్ని రైతు కర్రతో అదిలించినట్లు
అదిలిస్తు న్నాడు .అంతే.-‘’ప్రణుదత్యాగ తావజ్ఞ ం జఘనేషు పశూనివ ‘’.నీచులచే పరాజితుడైనవాడు మనిషే కాదు నీచుల్ని ఓడించినవాడూ
మనిషి కాడు.మీరు నీచునిచే ఓడి భయంతో పరిగెత్తు తున్నారు .మిమ్మల్ని ఏమనాలో మరి ?స్వామి పరాజితుడు కాకపొ తే ఆ సైన్యం
పరాజితం కాదు .బాధ పడే వారిని ఇంకా బాధ పెట్టె వాడు నిర్దో షీ కాడు,నీచుడుకూడా –‘’న నోన నున్నో నున్నోనో నానా నా నాననా నను –
నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న నున్ననుత్ ‘’.ఒకే ఒక నకారంతో రాసిన ఏకాక్షర శ్లో కం .అర్ధ ం తెలుసుకొందాం-నానాననా =అనేక
ముఖాలున్న సైనికులారా ,ఊన నున్నః =నీచునితో ఓడిన ,నానా=మనిషికాదు,నున్నోనః నా అనా = నీచుడిని ఓడించినవాడు మనిషికాదు
,న నున్నేనః =న నున్న ఇనః –ఎవరి రాజు పరాజితుడు కాడో ,నున్నః =పరాజితుడు ,అనున్నః =పరాజితుడు కాని వాడు ,నున్న నున్న
మణిజారిపో యిన నగ మంచిదికాదు విలువలేనిదే .అంటే పారిపో వట కంటే,అసలు యుద్ధా నికి వెళ్లకపో వటమే మంచిది అని భావం
–‘’ప్రకృత్యా హ్యామణిః శ్రేయాన్నలంకార శ్చ్యుతోపలః’’.అతడి వద్ద వేగంగా వెళ్ళే రథాలు ,మంచి గుర్రా లు దేవ గజాలు , భయపడని పదాతి
దళాలు లేవు కనుక భయపడాల్సిన పని లేదు .ఇప్పుడు మన శత్రు వు పౌరుషం లేక ,సూర్యుడిచే ఎండించబడిన మడుగులా ఉన్నాడు
.అందులో దాటగల బురద ఉండగా ,మీకు రాకూడని అపకీర్తి వచ్చింది –‘’హ్ర దైరివార్క నిష్పీతైః ప్రా ప్త ః పంకోదురుత్త రః ‘’.వెదురు తుమ్మలు
ముళ్ళచెట్లతో భీకరంగా ఉండే వనాన్ని వదిలేసి,ఏ దిక్కులు విదిక్కులు జయించటానికి మీరు వెడుతున్నారు ?-‘’వేత్ర శాకకుజే శైలే
లేశైజేకుక శాత్రవే –యాత కిం విదితోజేతుం తు౦జేశో దివి కి౦తయా’’ఈ శ్లో కం లో రెండు పాదాలు అనులోమ ,ప్రతిలోమ పద్ద తిగా
రాయబడింది .ముందునుంచి చివరిదాకా ,చివరుంచి ము౦దాకా ఒకటే రకంగా ఉంటుంది .చదివి చూస్తే తెలుస్తు ంది .మనస్వామి శివుడు
నపుంసకత్వం పొ ంది ,శత్రు వుకు వీపు చూపి పారి వచ్చిన మిమ్మల్ని పతివ్రతా ధర్మాన్ని వదిలేసిన భార్య లనులాగా ,తన మహిమతో మీ
తప్పుల్ని కప్పిపుచ్చుతాడు భయం అక్కర్లేదు –‘’అయం వః క్లైబ్య మాపన్నాన్ దృస్ట పృష్టా నరాతినా –ఇచ్ఛతీశశ్చుతాచారాన్ దారానివ
నిగోపితుం’’.భయంకర శత్రు వును భయపెట్టే మీరు సమర్ధు లు శత్రు వు విషయం లో మీరు క్రూ రులు .ప్రభుభక్తి ఉన్న భక్తు లు రక్షకులు
.సదాచారులు .వక్త లూ శరణాగత రక్షకులు మీ పరి శుద్ధి అందరికీ తెలుసు –‘’నను హో మథనా రాఘో,ఘోరా నాథ మహో నున –తయదాత
కిరాతార్జు నీయం-.32
15 వ సర్గ – 3
కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్త మ పరాక్రమ వంతులు
.ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రు వు తీవ్ర ఖడ్గ ంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధ భారం వహించగల దిట్ట
ఎంతటి శత్రు వుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని లేదు –‘’ నిశితా సిరతో భీకో న్యేజతే మరణా రుచా –సారతో న విరోధీ నః
స్వభాసో భరవానుత’’. -పరాక్రమం ఉత్త మకవచ ధారీ అయినా అధీరుడు .అతని బాణ శబ్ద ం విని సమస్త జీవరాశి ప్రా ణం వదిలేస్తా యి –‘’
తనువా రభసో భాస్వాన ధీరో వినతోరసా –చారుణా రమతే జన్యే కో భీతో రసితా శిని’’ఈ శ్లో కమూ ప్రతిలోమానులోమంగా రాసిందే .అతడి
బాణాలకు చచ్చిన ఏనుగుల నుంచి కారిన రక్త ం పర్వతజలపాతం లా ఉంది .మద ధారలున్నఏనుగులున్నవాడు ,శత్రు వుల్ని ‘’కాకా ‘’అని
కాకుల్ని పిలచినట్లు పిల్చేవాడు ,ఉత్సాహవంతులని నిరుత్సాహ పరిచేవాడు అతడు –‘’దేవకానిని కావాదే వాహికా స్వస్వ కాహివా –కాకారే
భభరే కాకా నిస్వభవ్యవ్యభస్వని ‘’ఇది సర్వతో భద్ర కవిత్వంగా రాసింది .’’భయపడిన గుర్రా లు రౌతుల్నే కిందపడేశాయి .ఖడ్గా లు లేని వొరలు
గాలి చేరి ఆధ్వని రౌతుల చెవుల్లో దూరి భయంతో చచ్చారు .యుద్ధ ం లో వీరులలో ఉత్సాహం పెరిగితే ,భయపడే వారి కోపాన్ని
నశింపజేస్తు ంది .శత్రు వులు యుద్ధ కౌశలాన్ని చూసి ఆన౦దిస్తా రు .ఈ శ్లో కం లో అర్ద భమ
్ర క బంధం ఉంది..దేవతలతో మీరు భయంకర
యుద్ధ ం చేశారు నిజమే .కాని ఇప్పుడు పౌరుష నష్ట ం పొ ందారు ‘’అని సైన్యాన్ని కుమారుడు అనునయిస్తు ండగా శివుడు చిరు నవ్వుతో
అక్కడ ప్రత్యక్షమయ్యాడు .
అర్జు న బాణాగ్ని బాధ పడిన గణాలతో శివుడు ‘’పరిగెత్తకండి ‘’’అనే చల్ల ని మాటతోసంతోషం కలిగించాడు .ప్రమద గణ౦ బలహీనమై
’నిశ్శబ్ద ంగా ఉన్నప్పుడు శంకరుని సాంత్వన వాక్యం నచ్చి ఆయన అభిప్రా యం తెలుసుకొన్నారు –‘’దూనాస్తే రిబలా దూనా -నిరేభా బహు
మేనిరే -–భీతాఃసహిత శరా భీతాః-శంకరం తత్ర శంకం ‘’ శ్లో కం మొదటిపాదం లో మొదటిపాదం అ౦దులొ చివరి పదంగా కూడా ఉండటం
ఇక్కడి ప్రత్యేకత .అంటే దూనా –దూనా ,భీతాః- భీతాః,శంకరం –శంకరం .దాటటానికి వీల్లేని శత్రు బాణ సముద్రం లో ఉన్న సేన ఈశ్వర
రూపమైన తీరాన్ని చూసి ఊరట చెందింది .ఓడిన సేనను ముందుపెట్టు కొని ,సూర్యుని నుంచి తొలగిన నీడను మహా వృక్షం ధరించినట్లు
సేనకు బాసట అయ్యాడు .అంటే శివుడు సేనను వదలలేదు చెట్టు తన నీడను వదలనట్లు ..
శంకరుడు అర్జు నునిపై బాణం సంధించగా ఆ ధనుష్ట ంకారానికి ఇంద్రకీల పర్వతం బద్ద లవు తోందా అన్నట్లు దిక్కులు పిక్కటిల్లా యి
.-‘’ముంచ తీశే శరాజ్ఞిష్టౌ పినాకస్వన పూరితః –దధ్వాన ధ్వనయన్నాశాః స్ఫుట న్నివధరాధరః ‘’.శివార్జు న యుద్ధా న్ని నిశ్చేష్టు లై చిత్రం లోని
బొ మ్మల్లా గా కదలకుండా ఆశ్చర్యంగా చూశారు .నైపుణ్యంతో అర్జు నుడు వేసే బాణాలను శివుడు అంతే నైపుణ్యంగా నేలకూల్చాడు
-.అర్జు నుడూ శివుని బాణాలను అలాగే కూల్చేశాడు –‘’అవద్యన్పత్రిణః శంభోః సాయకైరవ సాయకైః-పాణ్డ వః పరి చక్రా మ శిక్షయా రణ శిక్షయా
‘’.ఈ శ్లో కం లో ఆద్యంత యమకం ఉంది .వల్కల శోభతో అందగాడైన అర్జు నుడు మనోహర తీరులతో యుద్ధ ం చేశాడు –‘’చార చుంచు శ్చిరా
రేచీచంచ చ్చీరుచా రుచః –చచార రుచిర శ్చారు చారైరాచార చంచురః ‘’ఈ శ్లో కం లో చ ,ర అనే రెండు అక్షరాలనే ఉపయోగించి మెస్మరిజం
చేశాడు కవి భారవి .గా౦డీవానికి అల్లెత్రా డు బిగించి పిడుగుల్లా ంటి నిప్పులు సూర్యునిలా వెదజల్లా డు భీభత్సుడు .అర్జు నబాణాలు
శివబాణాలను మేఘాలు సూర్యుని కప్పినట్లు కప్పేశాయి-‘’పార్థ బాణాః పశుపతేరావ వ్రర్విశిఖా వలీం –పయోముచ ఇవా రంధ్రా ః సావిత్రీ
మంశు సంహతిం ‘’
కిరాతార్జు నీయం-.33
తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తా యి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జు న ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది
శృ౦ఖలా యమక శ్లో కం .శివ బాణాలు స్వర్గ ,అంతరిక్షాలలో సంచరి౦చ గలిగేవి .చెవులు చిల్లు లు పడే శబ్ద ం చేయగలవి .విద్యుత్ సమూహం
తో సమానమైనవి .-‘’దయు వియద్గా మినీ -తార సంరావ విహత శ్రు తిః-హైమీషు మాల శుశుభే -విద్యుతా మివ సంహతిః’’.నాలుగవ పాదం
లోని విద్యుతామివ సంహతి ‘’అనే అక్షరాలూ మొదటి ,రెండుపాదాల్లో కూర్చబడ్డా యి దీన్ని గూఢ చతుర్ధ పాదశ్లో కం అంటారు .శివబాణ
ప్రయోగానికి అర్జు నుడు ఏమాత్రమూ చలించలేదు .తర్వాత శ్లో కం కు మూడు అర్ధా లున్నాయి ఆవైభోగం చూద్దా ం -. ‘’జగతీ శరణో యుక్తో
మొదటి భావం-అర్జు నుడు హిమవంతుని శోభతో .ఉన్నాడు శివుడితో యుద్ధ ం చేయగల తత్పరుడు .ప్రజాపాలన సక్రమంగా చేసేవాడు
.నల్ల ని వాడు .దాత .యుద్ధ విజయం కోరుతున్నాడు .భూపాలనకోసం బ్రహ్మ సృష్టించిన వాడు. నివాస ,స్థా నాలు ఇవ్వటం తో సింహాలకు
ప్రియమైనవాడు .హిమవంతుడు .మంచు ఆవరించి తెల్లగా ఉన్నాడు. దానవ రుషి మన్మథులచే కీర్తింప బడినవాడు .
రెండవ భావం –భూమికి శరణ్య మైనవాడు .ఇంద్రు నికిష్టు డు ,అమృతం లాగా శీల స్వచ్చత ఉన్నవాడు. దానాన్ని జలరూపం లో ఇచ్చేవాడు
.భూమిని బాధపెట్టే రాక్షసులతో పో ట్లా డే వాడు ..అంటే ఇంద్రు ని ఐరావతం తో పో లిక .
మూడవ భావం-ఆది శేషుని తో పో లిక –భూ రక్షణ కోసం విధాత ఏర్పాటు చేశాడు .కృష్ణు డికి ఇస్ట మైనవాడు.అమృత స్వచ్చ శరీరి .దానవ
శివుడు బాణాలతో అర్జు న పరాక్రమం తగ్గించ లేకపో యాడు .అర్జు న ఇంద్రియాలనుంచి కోపకారణంగా అగ్ని బయల్దే రింది . పిశంగవర్ణ
తేజస్సుతో అర్జు నుడు తన తేజస్సును విస్త రించాడు .అడవి చెట్ల వలన పుట్టే దావాగ్నిలా చెలరేగాడు .తన అమోఘ పరాక్రమం చూపిస్తూ
శివుడు అర్జు నుని పై గాయ పరిచి ప్రా ణం తీయని బాణం వేశాడు .దాన్ని అర్జు నుడు నివారించి ,తనబాణాల నీడలో భూమిని కప్పేశాడు
.శంకరబాణ౦ సూర్యకిరణమే .ఆబాణం.మహా వేగంగా వచ్చి ,అసంఖ్యాక అర్జు న బాణాలను ఖండించింది .అన్నిటినీ చీలుస్తూ ,అర్జు నుని
బాణం లోకి కూడా ప్రవేశించింది .శివుని బాణాలను కూలుస్తూ ,అనేక విధాలుగా కదుల్తూ ,అన్ని చోట్లా అర్జు నుడే ఉన్నట్లు గా మహర్షు లకు
కనిపించాడు .క్షణం తీరికలేక అంతా తానే అయి పో రాడాడు .అర్జు న బాణ విజ్రు ౦భణ పెరిగి ,శంకర బాణాలు భంగపడుతున్నాయి .దేవ రుషి
గణం ఆకాశం లో ఈ మహా యుద్ధ ం చూడటానికి చేరారు .శంకర బాణ విస్త ృతి ,విజయలక్ష్మీ సమేతుడైన విజయుని పరాక్రమం చూసి
తత్వజ్ఞు లైన మునుల ఒళ్ళు గగుర్పొడిచింది .తత్వజ్ఞు లు అన్నమాటవలన అర్జు నుడు నారాయణ అంశ ఉన్నవాడు అని తెలుసుకొన్నారు
అని భావం లక్ష్మీ వతః అనే మాట కూడా దీన్నే తెలియ జేస్తు ంది .-‘’సంశ్యతామివ శివేన వితాయమానం –లక్ష్మీ వతఃక్షితి పతేస్తనయస్య
కిరాతార్జు నీయం-.34
16 వ సర్గ -1
కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జు నుడికి కోపం వచ్చి,తాను యుద్ధ ం లో గెలవక పో వటానికి కారణాలు
ఊహించటం మొదలు పెట్టా డు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధ ంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్ట ం తెలిసిన ఏనుగులు
కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా రంగులుగా మార్చే గంభీర ధ్వని ఉన్న రథ సమూహాలు లేవు
.ప్రా సకుంతం వంటి యుద్ధ ఆయుధాల అలల్లా గా చామరాలు అనే నురగ వంటివి అయిన అశ్వరాశి సముద్ర జలరాశి లా మర్యాద దాటి
చెలియలికట్ట ను కప్పివేయటం లేదు .,’’చంపండి నరకండి ‘’అంటూ భీకరంగా అరచే యోధులు శత్రు వులపై వదిలే శస్త్రా స్త్రా లు
సూర్యకిరణాలతో కలిసి ప్రతిఫలించి మెరుపుల్లా ఆకాశం లో వదలటం లేదు .వీరుల్ని చంపటానికి వచ్చే యముడి ఎడతెగని పొ గ లాగా
,అంతటా వ్యాపించిన కాంతి సమూహంతో ధూళి గుర్రా ల ,రథాలవేగం తో యెగిరి ఆకాశం లో చేరటం లేదు .గాడిద రంగు భూ ధూళి కంటి
చూపును అడ్డు కోగా ,పరాక్రమ వీరుల్ని వరి౦చాలనే ఉత్సాహమున్న దేవాగనలకు పగలే రేయి అనే భ్రా ంతి కలగటం లేదు .రథ చక్ర
ఘురఘుర ధ్వని ,గుర్రా ల సకిలింపులు ,మదగజ ఘీంకారం , ధ్వని చేస్తు న్నభయంకరంగా లేదు .భేరీ వాద్యాల ధ్వని కూడా ప్రతిధ్వని
ఇవ్వటం లేదు .యుద్ధ ం లో కీర్తి ,పౌరుష లోభమున్నవారు శత్రు వులచే ఛాతీపై గాయపడిన వారికి యుద్ధ విఘ్నం కలుగ కుండా వర్ష
ధారల్లా ంటి చల్ల దనాన్ని ఏనుగులు తొండం తో చిమ్మే తుపుర్లు పో గొట్ట టం లేదు .అంటే అవి మాటికీ చిమ్మటం వలన వారికి స్వస్థ త
కలిగిందని భావం .రక్త పుటేరులు పారుతూ సేన మార్గా నికి ఇబ్బంది కలిగిస్తు న్నాయి .కొన్ని ఎండిన బురద గుంటల్లా గారక్త ప్రవాహం పైకి
పంకైరివాశ్యానఘనైస్తటాని’’.ఏనుగు దంతాలతో గాయపడిన సాహస వీరులకు ప్రియురాలి ఒడిలాగా చల్ల గా ,ఉండే ఆకాశం నుంచి వక్షస్థ లం
లో పడిన మందార మాల శాంతి కలిగించటం లేదు –నేహ ప్రమోహం ప్రియ సాహసానాం –మందార మాలా విరలీ కరోతి’’ఏనుగు
తొండాలనుంచి పడిన నీటి తుంపర్లు మావటి వాళ్ళ కవచాలలోని మణికాంతులతో కలిసి ఇంద్ర ధనుస్సు ఏర్పడటం లేదు –‘’అర్క ద్విషో
రెక్కలున్న మైనాక పర్వతం లాగా శత్రు వుల ఏనుగు మధ్యలో ప్రవేశిస్తే ,అటూ ఇటూ పారిపో యే సేన ,సముద్రం తో సమానంగా తరంగాలుగా
విడిపో యి కోలాహలం కలిగించటం లేదు .గజ సైన్యం పైకి వేగం గా దూసుకొస్తు న్న రథికుల మార్గా న్ని సమూలంగా నరకబడిన ఏనుగుల
తొండాలు అడ్డు పెట్టటం లేదు –‘’అమూల లూనై రతి మన్యు నేవ –మాతంగ హస్తైర్వియతే న పంథాః.’’.తోమర వాద్యానికి కట్టిన నెమలి ఈకల
కట్ట ,పద్మ మాలాలంకారమైన ప్రియురాలి కేశాలంకారంగా ఉండి,మావటి వాళ్ళ వక్షస్థ లాన్ని కప్పేయటం లేదు .ప్రళయం లో లెక్కలేని
వీరులు చనిపో తే ,నాలుక ఆడిస్తూ ముల్లో కాలను కబళించే మృత్యు దేవత నోరు తెరవటం లేదు –‘’’’ఉజ్ఘ త్సుసంహార ఇవాస్త సంఖ్య-
మహ్నాయ తేజస్విషు జీవితాని –లోక త్రయాస్వాదన లోల జిహ్వాం – న వ్యాద దాత్యాననమత్ర మృత్యుః’’.’’నా శక్తి ఎంతటి పరాక్రమ వంతుడి
నైనా ధ్వస్త ం చేసేది .మరి హీనకిరాత యుద్ధ ం లో చంద్రు ని కాంతి లో సూర్య ప్రభ లాగా ఎందుకు క్షీణించింది ?’’-శక్తిర్మమా వస్యతి హీన
యుద్ధే –సౌరీవ తారా దిపధామ్నిదీప్తిః’’.’’లేకపో తే ఇదేమైనా మాయా ?నా భ్రమా ?నా పరాక్రమం నశించిందా ?నేను నేనేనా ?గాండీవ
ముక్తా హియథా పురా మే పరాక్రమంతే న శరాః కిరాతే’’.’’ఈ కిరాతుడు ధనుష్ఠ ంకారం తో ఆకాశాన్ని రెండుగా చీలుస్తు న్నాడు
.ఇతడుకిరాతుడు అయి ఉండడు.వేషభాషలు మాత్రం అలానే ఉన్నాయి చేష్ట మనిషి రూపం దాల్చినవాడిదిగా ఉంది .’’నూనం తథా నైష
అతడి ధనువు తో రోషం ధ్వనించింది .అల్లెత్రా డు ఒక్కసారి మాత్రమే లాగి నట్లు ంది అమ్ములపో దిలోంచి బాణం తీయటం, సంధించటం
ఏకకాలం లో జరిగినట్లు ది .పిడికిలి పట్టి ప్రయోగించినట్లు కూడా లేదే ?-‘’ధనుః ప్రబంధ ధ్వనితం రుషేవ-సకృద్వికృష్టా వితతేవ మౌర్వీ –
సంధాన ముత్కర్షమివ వ్యుదస్య –ముష్టేరసంభేద ఇవాప వర్గే ‘’.అతడి భుజాలు కిందికి వంగినా మెడ ఏమాత్రం కదలటం లేదు, ప్రయాస
లేదు .ముఖ వికారాలు లేకుండా చంద్రకాంతి లా ఉన్నాడు –‘’అమ్సావ వష్ట బ్ధ నతౌ సమాధిః -శిరోధరాయా రహిత ప్రయాసః –ధృతా వికారా
స్త ్యజతా ముఖేన –ప్రసాద లక్ష్మీఃశ్శ లాంఛ నస్య ‘’.యుద్ధ ం లో కాళ్ళు అటూ ఇటూ మార్చినా శరీరం చలనం పొ ందటం లేదు .చలనమున్నా
లేకపో యినా బాణాల లక్ష్యం ఒకే రకంగా ఉంది .శత్రు వు లోటుపాట్లు తెలుసుకోవటం ,తన లొసుగులు గుర్తించి వెంటనే సరి దిద్దు కోవటం అనే
రెండు గొప్ప గుణాలు భీష్మ పితామహునిలో ,గురు ద్రో ణాచార్యునిలో కూడా లేవే !అలాంటప్పుడు ఒక కిరాతుని విషయం లో ఎలా
సంభవించింది ?’’-‘’పరస్య భూయాన్వివరే భియోగః –ప్రసహ్య సంకర్షణ మాత్మ రంధ్రే-భీష్మేప్యసంభావ్య మిదం గురౌ వా –న సంభవత్యేవ వనే
చరేషు ‘’.ఈ రకంగా అసాధారణ పరాక్రమ శీలి ,యుద్ధ మదో న్మత్తు డుఅయిన కిరాతుని పరాక్రమాన్ని దివ్యాస్త స
్ర ంధానంతోనే నివారించాలి
.చిన్న శత్రు వైనా ,రోగం లాగా అపకారమే కలుగుతుంది .ఇతడు గొప్ప శత్రు వు కనుక ఉపేక్ష పనికి రాదు అని భావం .అర్జు నుడికి మైండ్
బ్లా ంక్ అయి ఇన్ని రకాలుగా ఆలోచించాడు . తర్వాత ఎలాంటి ప్రత్యేక అస్త ం్ర ప్రయోగించాడో పార్ధు డు రేపు తెలుసుకొందాం .-‘’ అప్రా కృత
స్యాహవ దుర్మదస్య –నివార్య మస్యాస్త ్ర బలేన వీర్యం-అల్పీయసో ప్యామయ తుల్య వృత్తే-ర్మహాపకారాయ రిపో ర్వి వృద్ధిః. ‘’
కిరాతార్జు నీయం-.35
16 వ సర్గ -2
అర్జు నుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పో గొట్టే ‘’ప్రస్వాపనాస్త ం్ర ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త ం్ర
ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్ట ంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్
సగణస్యశత్రో ః-‘’.ప్రస్వాపనాస్త ం్ర ద్రు తమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ .దావానలం పొ గలాగా ,ధూసర వర్ణ ం సూర్యకాంతిని
కప్పేసినట్లు శివ గణాలను ఆవరించింది .అది దట్ట మైన చీకటి అడవుల్ని ఆవరించి నట్లు గా ఉంది .దీనికి ప్రమథ గణాలకు నిద్ర ఆవహించింది
.సభలో ప్రగల్భాలు పలికేవాడు ,పండితుడు ప్రవేశించగానే కిక్కురు మనకుండా ఉన్నట్లు అయింది –‘’సభేవ భీమా విదధే గణానాం-నిద్రా
నిరాసం ప్రతిభా గుణస్య’’.బలాఢ్యులైన కొందరు ధనువులసాయం తో నిలబడిపో యారు .ఆపదలో మంచి మిత్రు ల సాయం పొ ందినట్లు ంది
వారిపని –‘’కేచిత్సమాశ్రిత్య గుణాన్వితాని –సుహృత్కులా నీవ ధనూ౦షి తస్థు ః’’.అర్జు న ప్రస్వాపనాస్త ం్ర ముందు దైవ ప్రతికూలంగా శత్రు
అస్త్రా లు నేలపడి పో యాయి .దైవానుకూల్యంలేకపో తే వ్యవసాయ ఫలం నస్ట మైనట్లు గా ఉంది –‘’అతర్కితం పాణి తలాన్నిపేతుః-క్రియా
ఫలానీవ తదాయుధాని ‘’.ఈ విషమ సమయం లోనూ కొందరు ధైర్యం తో చెట్ల మొదళ్ల ను ఆనుకొని మదం తో కళ్ళు మూతపడుతున్న
ఏనుగులు తొండాలను జార విడిచి నేలపై కూర్చున్నట్లు కూర్చున్నారు –‘’మాదేన మీలన్నయనాః సలీలం –నాగా ఇవ స్రస్తకరా నిషేదుః’’.
కిరాత శంకరుని నుదుటి నుంచి పిశంగవర్ణ -ఎరుపు ,తెలుపు ,పసుపు రంగు మిశ్రమ రంగు . ప్రకాశం చంద్రా స్త మయం తర్వాతసుమేరు
పర్వత శిఖరం నుంచి ఋషులు ప్రణామ౦ చేసే సూర్య బి౦బంలా ఉదయించింది – ‘’తిరోహితేందో శంభు మూర్ధ ్నః-ప్రణమ్యమానం తపసాం
నివాసైః-సుమేరు శృంగాదివ బి౦బమార్కం-పిశంగ మచ్చైరుదియాయ తేజః ‘’ .శివుని నుదుటి ఆ కాంతి ,గణాల నిద్ర పో గొట్టి
చూపునిచ్చి౦ది.తత్వజ్ఞా నం అజ్ఞా నాన్ని తొలగించి నట్లు గా శివ తేజస్సు గణాలను తెప్పరిల్లేట్లు చేసిందని భావం .-‘’యయౌ వికాసం ద్యుతి
రిందు మౌలే –రాలోక మభ్యాది శతీ గణేభ్యః ‘’ఆ ప్రకాశం నాలుగు వైపులా విస్త రించి మేఘమండలాన్ని ఎర్రగా మారుస్తూ ఉదయ సంధ్యలాగా
వ్యాపించి ప్రమథ గణముఖపద్మాలను వికసింప జేసింది –‘’నినాయ తేషాం ద్రు తముల్ల సంతీ-వినిద్రతాం లోచన పంకజాని ‘’.ప్రస్వాపనాస్త ్ర
ప్రభావం తగ్గా క తెలివిలోకి వచ్చిన శివ సేన ,మేఘాలుపో యి ,దిక్కులు నక్షత్రా లతో ప్రకాశించినట్లు వివిధ శస్త్రా లు ధరించారు .-‘’ముక్తా
రాత్రి పో యి ,అంతరిక్షం పైకి లేచినట్లు గా ఉంది .దిక్కులు ప్రసన్నాలై ,సూర్య కిరణాలు స్పష్ట త పొ ంది విస్త రించగా ,పగటి శోభ రోజును
ఆశ్రయించింది .మహాదుర్గ ం లాంటి ప్రస్వాపనాస్త్రా న్ని శత్రు వైన శివుడు వ్యర్ధ ం చేయగా ,వెంటనే సైనికులను బంధించే సర్పరూప పాశాలు
వదిలాడు పార్ధు డు –‘’భుజంగ పాశాన్ భుజ వీర్య శాలీ –ప్రబంధ నాయ ప్రజిఘాయ జిష్ణు ః’’.మెరుపులతో సమానమైన విషాగ్ని కల వందలాది
నాలుకలను ఎప్పుడూ ఆడించే సర్పరాజుల సేన తమ భయంతో ఆకాశంలో తిరిగే సిద్ధ చారణాది దేవమార్గా న్ని ఆవరించి అడ్డు కొన్నాయి
–‘’జిహ్వా శతా న్యుల్ల స యంత్య జస్ర౦ –లసత్త డి ల్లో ల విషానలాని –త్రా సాన్నిరస్తా భుజగేంద్ర సేనా –నభశ్చ రైస్తత్పదవీం వివవ్రే ‘’.దిగ్గజాల
తొండాలవంటి ,ఇంద్ర నీల మణుల లాంటి శరీరాలతో ఆపాముల వరుస ఆకాశం అనే సముద్రం లోని తరంగమాలిక లాగా ప్రకాశించింది
–‘’దిజ్నాగ హస్తా కృతిమూడవ హద్భిః-భోగైః ప్రశాస్తా సితరత్న నీలైః-రారాజ సర్పావలి రుల్ల సంతీ-తరంగ మాలేవ నభోర్ణ వస్య ‘’.పడగెత్తి న
సర్పాల ఫూత్కారాల్లో ని పొ గ, సూర్య కిరణాలను కప్పి వేయగా, చూసే వాళ్ల కు యోగ్యమైన శరీరాన్ని సూర్యుడు ధరించాడు –‘’నిఃశ్వాస
ధూమైః స్థ గితాంశుజాలం-ఫణావతాముత్ఫణ మండలానాం –గచ్ఛన్నివాస్త ం వపురభ్యువాహ-విలోచనానాం సుఖ ముష్ణ రశ్మిః’’.విష దృష్టి
ఉన్న సర్పాల కళ్ళల్లో నుంచి కాసిన బంగారు ప్రకాశం తో ,దిక్కుల్ని పసుపురంగుగామారుస్తు న్నమంటలు పెద్ద తోక చుక్కల్లా గా బయటికి
వచ్చాయి .-‘’ప్రతప్త చామీకర భాసు రేణ-దిశః ప్రకాశేన పిశంగ యంత్యః –నిశ్చక్రముః ప్రా ణ హరేక్షణానాం-జ్వాలామహో ల్క ఇవ లోచనేభ్యః ‘’
కిరాతార్జు నీయం-.36
పొ గతో నిండిపో యాయి .శత్రు వులు ముట్ట డించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా ౦-పరోపరుద్ధ స్య పురస్య
భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రా న్నిసర్పాల బాధ ను ,న్యాయ రీతిగా శత్రు వ్యూహం విఫలం చేసినట్లు ప్రయోగించాడు ‘’నేతా నయనేవ
పరోపజాతం –నివారయామాస పతిః పశూనాం ‘’.అనిమేషులైన స్వర్గ లోక వాసుల నేత్రా లకు కల్గిన అవరోధాన్ని గారుడ పక్షుల సమూహం
మెరుపు వేగం తో ప్రకాశం కలిగించి౦ది.-‘’ప్రతిఘ్న తీభిఃక్రు తమీలితాని –ద్యులోక భాజామపి లోచనాని –గరుత్మతాం సంహతి భిర్వి హాయః –
క్షణ ప్రకాశాభి రివావతేన ‘’ .గరుడ పక్షుల రెక్కల విచిత్ర కదలిక తో గాలి ,అడవి చెట్ల ఆకులు రాలుస్తూ ,వాటిని ఆకాశం లో అల౦క
రించటానికా అన్నట్లు మోసుకెళ్ళింది.మనః శిలల ముక్కలకాంతి తో వెనకాల విశాల వక్షస్థ లం తో అడ్డు కాబడిన ఆకాశ మండలం గరుడ
పక్షుల ముందు పరిగెత్తు తున్నట్లు గా ఉంది .వేడిగా వీస్తు న్న గాలులవలన కదులుతున్న శిఖరాల హిమవత్పర్వతం ,మదిర లాగా ఎర్రగా
ప్రకాశిస్తు న్న గరుడ పక్షి రెక్కల కాంతిని, గుహాముఖాలతో తాగి ,మత్తు గా కదలింది –‘’దరీ ముఖారాసవ రాగ తామ్రం-వికాసి
రుక్మచ్ఛదధామ పీత్వా –జ్వనలా ఘూర్జిత సాను జాలో –హిమాచలః క్షీణ ఇవాచ కంపే ‘’ .రాత్రి,పగలు కలిసిన సంధ్యాకాలం లాగా ప్రకాశిస్తూ
భూమ్యాకాశాలను పసుపు రంగుగా మారుస్తూ ,,సూర్యుని కప్పేసే ఆ గరుడ పక్షులు ,నాలుగు వైపులా అడవులలోని నీడను లేకుండా
చేశాయి . .-‘’ప్రవృత్త నక్త ం దివా సంధి దీప్తై-ర్నభస్థ లం గాం చ పిశంగ యద్భిః-అంతర్హితార్కైఃపరితః ,పతద్భి-చ్ఛాయాఃసమాచి ,క్షిపిరే
వనానా౦’’.సర్ప సమూహం గరుడ సమూహం తో,మహా యజ్ఞ ం లో కర్మలోపం జరిగినప్పుడు ప్రా యశ్చిత్త ం తో శాంతించినట్లు శాంతించింది
సర్పాస్త ం్ర సమాప్తికాగా అర్జు నుడు ఇంధనం లేకుండా ప్రజ్వలించే ఆగ్నేయాస్త ం్ర సంధించాడు –‘’అనిన్ధ నస్య ప్రసభం సమన్యుః-సమాదేస్తం్ర
జ్వలనస్య జిష్ణు ః’’.అన్నివైపులకు వ్యాపిస్తూ ,మంటలతో మేఘాలను దాటి,వేట కోసం సింహం దూకినట్లు ప్రా ణ సంహార కాంక్షతో అగ్నిపైకి
ఎగసింది –‘’ఆయస్త సింహాకృతి రుత్పపాత- ప్రా ణ్యంత మిచ్ఛన్నివ జాత వేదాః’’.తన తేజస్సుతో సూర్యకాంతిని ఛేదిస్తూ ,నిప్పురవ్వలు
రాలుస్తూ బండరాళ్ళు బద్ద లయ్యే ధ్వనితో అగ్ని మండింది .అగ్నికి గాలి తోడై బంగారు ప్రా కారాల్లా , ఎత్తైన శిఖరాల పర్వతాల్లా గా
,సువర్నమయమైన పురంవెల, మోదుగు చెట్లు వనాల్లా అన్ని చోట్లా వ్యాపించింది .కాటుక లాంటి నల్ల మేఘాలు కదిలే చిగురాకులు లాగా
యెర్రని అగ్ని మంటలలో మాడి,ముత్యాల్లా శుభ్రంగా కనిపిస్తు న్నాయి .ప్రళయాగ్ని లా లోకాన్ని మింగటానికి చాచిన నాలుకలలాగా,కదిలే
అగ్ని సమూహాన్ని చూసి ,మేఘాలను పిలిచినట్లు శివుడు వారుణాస్త ం్ర వేశాడు –పినాకినా హుత మహా౦బు వాహ మస్త ం్ర పునః పాశ భ్రు తః
ప్రణిన్యే’’.వారుణాస్త ం్ర పెద్దపర్వతాకార౦ తో ,మెరుపులతో ఉన్న మేఘాలు నేలకు జారే ఆకాశ గంగలాగా ఎడతెరిపి లేని ధారలు కురిపించాయి
జల వృష్టి తో అగ్ని జ్వాలలు చల్ల బడి ,ప్రచండ తేజస్సు నశి౦చగా అగ్ని శరీరం పై ,జలధారలు వేడి చేసిన ఇనుము పై పడి ధ్వని చేసినట్లు
ధ్వనించాయి –‘’కృతాస్పదా స్త ప్త ఇవా యసి ధ్వనిం –పయోనిపాతాః ప్రథమే వితేనిరే’’.త్వరలోనే ఆ జలధారలు పాకం పొ ంది నురగలై
,తడికట్టె మండి,పొ గ వ్యాపించినట్లు వ్యాపించాయి –‘’వ్రజద్భిరార్ద్రే౦ధన వత్పరిక్షయం జలై ర్వితేనేదివి ధూమ స౦తతిః’’.ఎరుపు నీలం తెలుపు
రంగులు కలిగిన తమ జెండాలతో ,ఇంద్ర ధనుస్సు కాంతిని మించిన అగ్ని కాంతులు కలిసి విచిత్రమైన అస్థిరమైన పట్టు బట్ట అందాన్ని
పొ ందాయి –‘’ స్వకేతుభిః పాండు రనీల పాటలైః-సమాగతాః శక్ర ధనుః ప్రభా భిదః-అసః స్థితా మాదధిరే విభావసో –ర్విచిత్ర చీనా౦శుక
చారుతాం త్విషః’’.మండుతున్న అగ్ని వర్ష ధారలకు మరంత గంభీర ధ్వని చేస్తో ంది .మెరుపులతో కలిసి కాంతి పెరగ
ి ింది .అంటే శాంతిస్తు న్న
సముద్ర అలల్లా ంటి జలరాశులతో చీలి ,అగ్ని కణాలు సాయంసంధ్యాకాంతిపొ ందిన మేఘ శకలలలాగా కనిపించాయి –‘’ఉపాత్త
సంధ్యారుచిభిః సరూపతాం –పయోద విచ్ఛేదలవైః కృశానవః ‘’.గొప్ప పరాక్రమ వంతుడైనా ,సమూలంగా నష్ట పో తే మళ్ళీ కోలుకోవటం జరిగే
పని కాదు. అగ్ని కూడా ఆ నీటితో అలాగే కుప్పకూలిందని భావం –ఉపైత్యనంత ద్యుతిరప్య సంశయం –విభిన్న మూలో నుదయాయ
సంక్షయం –తథా హి తోయౌఘ విభిన్న సంహతిః-న హవ్య వాహః ప్రయయౌ పరాభవం’’.ఆకాశం లో నల్ల ని కాంతి సమూహంకలమేఘాలు
విడిపో గా అగ్ని దహనం చెందిన ఆకాశం వికసించిన నల్ల కలువ కాంతి తో శోభించింది –‘’వికసడమల ధామ్నాంప్రా పు నీలోత్పలానాం-శ్రియ
అనేక ఉపాయాలతో అర్జు నుడు కిరాత శివుని ఓడించాలని వేసిన అన్ని రకాల అస్త్రా లను శివుడు నీతి నిష్టు డైన వాడి పరాక్రమానికి
ప్రతికూల దైవం నష్ట ం కలిగించినట్లు నస్ట పరచాడు.-‘’ఇతి వివిధ ముదాసే సవ్య సాచీ యదస్త ం్ర –బహు సమయ రనయజ్ఞ ః
సాదయిష్యన్నరాతిం –విధిరివ విపరీతః పౌరుషం న్యాయ వృత్తేః-సపది తదుపనిన్యేరిక్తతాం నీల కంఠః’’.శివుడి చేత తన అస్త్రా లన్నీ
నిరుపయోగం కాగా ,శక్తి తగ్గినా మళ్ళీ బలం పుంజుకొని అర్జు నుడు ,అధిక వర్షం కురవటంకోసం,నదీ తటాకాలలోని నీటిని సూర్యుడు
గ్రహించినప్పుడు జనం నీటికోసం బావులు చలమలు త్రవ్వి సహాయం తీసుకొన్నట్లు అర్జు నుడు తన భుజ బలాన్నే సహాయంగా
భావించాడు –‘’వీత ప్రభావ తనురప్య తను ప్రభావః –ప్రత్యాచ కాంక్ష జయినీం భుజ వీర్య లక్ష్మీం –అస్త్రేషు భూతపతి నాప హృతేషు జిష్ణు ః-
17 వ సర్గ -1
ప్రయోగించిన అస్త్రా లన్నీ వ్యర్ధ ం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జు నుడిపౌరుషం బాగా అతిశయించింది –‘’ధృతం
గురు శ్రీర్గు రుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను యుద్ధ ం చేస్తు న్నందుకు సంతోషించాడు కాని శత్రు వు
వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొ గ బాగా వ్యాపించి ఉండటం తో కిరాత శివుని రూపం స్పస్టా స్పస్ట ంగా
కనిపించింది .-‘’స్పస్టో ప్యవి స్పష్ట వపుః ప్రకాశః –సర్పన్మహాదూమ ఇవాద్రి వహ్నిః’’.శత్రు వులచే తిరస్కరి౦పబడని తన ధైర్యాన్నే అర్జు నుడు
కరావలంబనమే చేసుకొన్నాడు .’’అసాదయన్న స్ఖ లిత స్వభావం –భీమే భు జాలంబ మివారి దుర్గే ‘’.కులశీలాదులచేత తనయందు
అనురాగ వతి అభిమాన వతి అయిన కారణంగా ప్రా ణాలకంటే ఎక్కువైన కీర్తి తన యెదుటనే శత్రు వు అపహరించాలి అనుకొన్నప్పుడు
అర్జు నుడు అలాంటి గుణాలే కలిగిన కాంత ను గురించి బాధ వంటి బాధ అనుభవించాడు –‘’వంశోచిత త్వాదభిమాన వత్యా-సంప్రా ప్త యా
సంప్రియతా మనుభ్యః –సమక్షమాది త్సితయా పరేణ-వధ్వేన కీర్త్యా పరితప్య మానః ‘’.హిమాలయాన్ని బద్ద లు కొట్టే వేగంతో వచ్చే
గంగానదిని శివుడు పూర్వం నిగ్రహించినట్లు ,ఇప్పుడు అర్జు న పరాక్రమాన్ని నిష్ఫలం చేశాడు –‘’పతిం నగానామివ బద్ధ మూల –
మున్మూలయిష్య౦ స్త రసా విపక్షం –లఘు ప్రయత్నం నిగృహీత వీర్య –స్త్రిమార్గ గా వేగ ఇవేశ్వ రేణ’’.విజయం కోసం మళ్ళీ తన శరాలనే
ఆశ్రయించాడు విజయుడు .శరప్రయోగం లో అభ్యాసమూ ,దానికి సంబంధిన అనేక గుణాలు ఉన్నందున హృదయాన్ని ఆనందింప జేసే
శబ్దా లలాగా ఆనందించాడు –‘’జయం యదార్దేషు శరేషు పార్ద ః –శబ్దేషు భావార్ధ మివా శశంసే’’.కోపంగా ఉన్న విషసర్పం కళ్ళనుంచి విషాన్ని
చిమ్మి నట్లు అర్జు నుడు యుద్ధ ం లోనే శత్రు వుకు సమాధానం చెప్పాలని ,మొదటి సారి ఓటమి వలన కలిగిన బాధతో క్రో ధో ద్రిక్తు డై ,కన్నీరు
కార్చాడు అధిక సంతోషం లోనూ కోపం లోను ,కన్నీరు కారటం సహజమే .-‘’భూయః సమాధాన వివృద్ధ తేజా-నైనం పురా యుద్ధ మితి
వ్యథావాన్-స నిర్వ వామాస్ర మమర్షనున్నం –విషం మహా నాగ ఇవేక్షణాభ్యాం’’.యుద్దా యాసం లో క్రీడి జడలు విడిపో యాయి .కళ్ళు
రాగిలాగా ఎర్రబడ్డా యి క్రో ధం వలనముఖం పై చెమట ,వేడిని చల్లా రుస్తు న్నట్లు కమ్మి౦ది.-‘’నిర్వాప యిష్యన్నివ రోష తప్త ం –
ప్రస్నాపయామాస ముఖం నిదాఘః .’’మేఘ మండలం లో చిక్కుకున్న మూడు సూర్యుని ఊర్ధ ్వ కాంతి రేఖలు వర్షా నికి సూచన అయినట్లు
,అర్జు నుడు కనుబొ మలు చిట్లించిన ముఖం లో మూడు రేఖలు పైకి వ్యాపించాయి –‘’క్రో ధాంధ కారాంతరితో రణాయ – భ్రూ భేద రేఖాః స
బభార తిస్రః –ఘనోప రుద్ధ ః ప్రభావాయ వృష్టే -రూర్ధ్వా౦శు రాజీరివ తిగ్మ రశ్మిః.’’దిగ్గజం తొండం తో పర్వత శిఖరాన్ని చరచి ధ్వనింప జేసినట్లు
,అర్జు నుడు మేఘం లాగా ధ్వని చేసే ధనువు ను చేతితో లాగి ,శంకర కి౦కరులపై బాణాలు ప్రయోగించాడు .
అర్జు న బాణాలు శాస్త ్ర నిష్ఠ గల బుద్ధి విషయం లో హితోప దేశం లాగా,వైరాగ్యం ఉన్నవాడిలో గుణాలు ,వాజ్మానస అగోచరమైన బ్రహ్మ
విషయం లో వేద వాక్కు వ్యర్ధమైనట్లు , శివుని శరీరం లో కలిసిపో యాయి.అంటే శివుడిని ఏమీ చేయ లేకపో యాయని భావం
–‘’సద్వాదివాతేభిని విష్ట బుద్ధౌ –గుణాభ్యసూయేవ విపక్ష పాతే-అగోచరే వాగివ చోప రేమే –శక్తిఃశరాణాం శితికంఠకాయే ‘’.అర్జు నబాణాలు
ఆయన్నమీ బాధించలేదు .హేమంతం లో సూర్య కిరణాలు హిమవంత ప్రదేశాన్ని తాకనట్లే ఆబాణాలు శివుడిని బాధించలేదు –‘’అభ్యుత్థిత
స్యాద్రి పతేర్నితంబ –మర్కస్య పాదా ఇవ హైమనస్య ‘’.అర్జు న పరాక్రమాన్ని శివుడు దిగ్గజం పో ట్ల ను హిమవత్పర్వతం సహి౦ఛినట్లు
ఆనందిస్తూ నే, సహించాడు.’’విషాణ భేదం హిమవాన సహ్యం – వప్రా నతస్యేవ సురద్విపస్య .బ్రహ్మాడులకే కారణ భూతుడైన శివుడు శివుడు
తన పరాభవాన్ని చాలాకాలం సహించాడు.-‘’చిరంవిషేహే భిభ వస్త దానీం –సకారణానా మపి కారణేన’’.శత్రు వుతో ఓడినా ,ఏ వ్యక్తి ఉత్సాహం
తో తనకంటే పరాక్రమ వంతునితో పో రాడుతాడో వాని కీర్తి సూర్యకాంతి లా ప్రకాశిస్తు ంది –‘’తేజా౦సి భానోరివ నిష్పతంతి-యశా౦సి
వీర్యజ్వలితాని తస్య ‘’.ఒక వ్యక్తి మహత్కార్యం ప్రత్యక్షంగా చూసి ,అతడి శత్రు వర్గ ం భయ పడుతుంది .భయపడితే తేజస్సు నశిస్తు ంది
తేజస్సు లేని వాడిని ఉత్సాహం వదిలేస్తు ంది .అది ఆరిన దీపం లాగా ప్రకాశ హీనమౌతుంది –‘’దృష్టా వదానాత్ వ్యథతే రిలోకః-ప్రధ్వంస మేతి
వ్యథితాచ్చ తేజః –తేజో విహీనం విజహాతి దర్పః –శాంతార్చిషం దీపమివ ప్రకాశః ‘’.ఉత్సాహం మదం ఆత్మాభిమానం దెబ్బతిన్న వాడు తనను
జయించిన వాడిని ఓడించటానికే ప్రయత్నిస్తా డు .తనకిష్ట మైన ఏనుగు ,మదవాసనలతో ఆకర్షింప బడిన ఏనుగు తనకు ఎదురుగా వచ్చే
ఏనుగుల సమూహాన్ని ఎదుర్కొని ఓడించినట్లు ,శత్రు పరాజయం కోసమే యత్నిస్తా డు .-‘’తతః ప్రయాత్యస్త మదావలేపః –స జయ్య తాయాః
పదవీం జిగిషో ః-గంధేన జేతుః ప్రముఖాగతస్-ప్రతి ద్విపస్యేవ మతంగా జౌఘః ‘’శివుడు తలలోని చంద్ర రేఖలాగా గొప్ప కీర్తి అర్జు నుడికి
ఇవ్వాలనుకొని జయాపజయాలు పర్యాయంగా కలిగే యుద్ధ ం ప్రా రంభించాడు .ప్రా ణులు జన్మతః వచ్చే స్వభావాలను వదులుకోలేక వాటికి
వశులౌతారో అదే విధంగా ప్రమథ గణం అర్జు న విచిత్ర బాణాలకు వశమైంది –‘’సహాత్మ లాభేన సముత్ప తద్భి-ర్జా తిస్వభా వైరివ జీవ లోకః
.’’.భయంతో వణుకుతున్న శివ సేన అర్జు న బాణవర్ష౦ తో ఏర్పడిన చీకటి బాణ ధ్వనినీ ,విన్నారు రాత్రికురిసే వర్షంలోని మేఘగర్జ నలా ఉంది
.శబ్దా న్ని మాత్రమే విన్నారు .అంటే చూడటం కానీ ఏమీ చేయటం చేయ లేకపో యారు అని భావం .
కిరాతార్జు నీయం-.38
17 వ సర్గ -2
అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జు నుడు ప్రమథులకు ,కంటి దో షమున్నవారికి ఒకే చంద్రు డు అనేక
బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దో షావృతలోచనానం –విభిద్యమానః ప్రు థ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి
శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు - శివుడి పరిస్థితీ అలానే అయింది
–‘’తరంగ కంపేన మహా హ్ర దానాం –ఛాయా మయస్యేవ దినస్య కర్తు ః’’.అర్జు నుడిపై నిర్వికార పరమాత్మ కనుక శివుడికి ఆగ్రహం రాలేదు
.కానీ ఆకారం లో వికారం చూపాడు మహాత్ముల చేష్టలు ఎవరూ తెలుసుకోలేనివి –‘’ప్రసే దివామ్సం న తమాప కోపః –కుతః పరస్మిన్పురుషే
వికారః అకార వైషమ్యమిదం చ భేజే –దుర్ల క్ష్య చిహ్నా మహతాం హి వృత్తి ః.’’తర్వాత శివుడు రెండు భుజాలతో అల్లెత్రా డు లాగగా ,అది
కదులుతూ రెండు గా కనిపించింది .అది తక్షకుని నాలుకేమో అనుకొన్నారు చూసే వాళ్ళు .’’’విస్ఫార్య మాణస్య తతో భుజాభ్యాం –భూతాని
భర్త్రా ధను రంతకస్య –భిన్నా కృతిం జ్యా౦ దదృశుః స్ఫురంతీం- కృద్ధ స్యజిహ్వామివ తక్షకస్య ‘’.అర్జు నుడు సవ్యాపసవ్యం గా ధనువును
ధ్వని౦ప జేస్తూ కిరాతపతిని చూసి ‘’ఎప్పుడూ కుడి ఎడమల చెవులను ఒకటి తర్వాత ఒకటి కదిలిస్తూ ధ్వని చేసే ఏనుగుపై మావటి వాడు
ఉన్మత్త ంగా అనుమానిఛినట్లు చూశాడు .శివుని బాణాలు సముద్రం లో తిమింగలాదులు నదులద్వారా వచ్చే చిన్న జలచరాలను
మింగినట్లు గా.అర్జు న బాణాలను వ్యర్ధ ం చేశాయి-‘’ఊర్జ స్విభిః సింధు ముఖాగతాని యాదాంసి యాదో భిరివా౦బు రాశేః ‘’.. శంకర బాణాలు
కనిపించకుండానే, మధ్యలోనే తు౦చేయటం ,అడ్డు కోవటం ,ధ్వంసం చేయటం అనే మూడు విధాల అర్జు నుడు-జయాభిలాష ఉన్నవాడు
శత్రు వు ఏ ఉపాయాలు ఉపయోగిస్తా డో అవే ఉపాయాల ప్రయోగంతో నిర్వీర్యం చేశాడు ,శివుడు వేసే వాటికి రెట్టింపు బాణాలు ప్రయోగించి
అర్జు నుడు శివ సేనను భయపెట్టి సాఫల్యం సాధించాడు .ఐతే ద్రో ణాది గురువులద్వారా అస్త ్ర విద్య నేర్చి ఆ లాఘవం ప్రయోగించిన అర్జు నుడికి
శివుని బాణాలతో భంగపాటు కలగటం ధైర్యాన్ని కుంగదీసి రుజుమార్గ ం లో ధర్మ శాస్త్రా దులు నేర్చిన నిర్దేశించిన ఆచార వ్యవహారాలను
అనుష్టించే వారికీ సైతం ఆపదల లో ధైర్యం తగ్గినట్లు తగ్గింది –‘’సతామివాప ర్వణిమార్గ ణానాం-భంగః స జిష్ణొ ర్ధ్రు తిమున్ము మాద’’.అర్జు న
బాణాలను ఖండించిన శివ బాణాలు నేలకొరిగి అర్జు నునికి వెంటనే ప్రతిఫలం దక్కింది .
హస్త లాఘవం తో అర్జు నుడు ఆశ్చర్య౦గా శివ బాణాలను ఖండించేబాణాలను శివసేన గుండెల్లో సూటిగా నాటాడు .అర్జు న పరాక్రమం చూసి
శివుడు ,ఎండాకాలపు మేఘం నీటిని కురిపించినట్లు ,అతి తీవ్ర బాణ వృష్టి కురిపించాడు.అంటే ఎండాకాల వర్షం చాలా ఎక్కువ అని భావం
..అర్జు ను డికి మేలు చేకూర్చే శివ బాణాలు మర్మ స్థా నాలు తాకకుండా ,మిత్రు లు చెప్పే పరిహాసపు మాటల్లా గా అర్జు నుడికి ఆనందాన్ని
కలిగించాయి –‘’’’అనామృశంతః క్వచి దేవ మర్మ-ప్రియైషిణా ను ప్రహితాః శివేన –సు హృత్పయుక్తా ఇవ నర్మ వాదాః-షరా మునేః ప్రీతికరా
బభూవః ‘’.ఒకసారి తన బాణాలతో సమానంగా, మరోసారి చాలా హెచ్చుగా ప్రయోగించే అర్జు న బాణ శక్తి చూసి వివశం నిందా పొ ందే సేనతో
కలిసి శివుడుమళ్ళీ తన తడాఖా చూపించాలను కొన్నాడు .-‘’విషాద వక్త వ్య బలహ ప్రమాథీ-స్వమాల లంబే బలమిందు మౌలిః’’.
తర్వాత శివుడు శక్తి పరాక్రమాలతోసూర్యుడు నీటిని ఇంకింప జేసినట్లు అర్జు న తీవ్ర బాణాలను నాశనం చేసి ప్రతాపం చూపాడు –‘’మహేషు
జాలా న్యఖిలాని జిష్ణో -రర్కః పయం సీవ సమాచచామ’’.అర్జు నుడు మరో బాణం తీయటానికి బాణాలు లేని అమ్ముల పొ దిలో చేయి పెట్టా డు
.పర్వతంలో మరో ఏనుగు చెలమలోని నీరంతా తాగి ఖాళీ చేయగా, ఆ ఏనుగు దాహంతో అలమటించి తొండం సాచినట్లు అయింది
.-‘’అన్యద్విపా పీత జలేసతర్షం-మత౦గ జస్యేవ నాగా శ్మరంధ్రే’’ ‘’.ధనం లేని స్నేహితుడిని తాను పూర్వం చేసిన ఉపకారాల జ్ఞా పకం తో
కృతజ్ఞ త చెప్పటానికా అన్నట్లు అర్జు న చెయ్యి అమ్ములపొ ది చేరింది –.-‘’తాత్కాల మోఘ ప్రణయః ప్రపేదే –నిర్వాచ్యతా కామ ఇవాభి
ముఖ్యం ‘’.కర్త వ్యం లో ఉత్సాహం, జయేచ్ఛ ఉన్న నాయకుడి బుద్ధి ఏవిధంగా ,నీతి-ఉపాయం అనే రెండిటిని సహాయంగా చేసుకొంటాడో
అలాగే అర్జు నుడి చెయ్యి రెండు అమ్ముల పొ దుల లోకి పో యింది .ఖాళీ గా ఉన్న అమ్ములలపొ దులను ప్రళయం లో నీరు లేని పూర్వా పర
సముద్రా లను లోకం భరించినట్లు భరించాడు –‘’యుగాంత సంశుష్క జలౌ విజిహ్మః –పూర్వా పరౌ లోక ఇవా౦బు రాశీ ‘’.అమ్ములపొ ది
శూన్యం అయినందుకు బాధ పడినంతగా బాణాలు వ్యర్ద మైనందుకు అర్జు నుడు బాధ పడలేదు .ఆపదలలో ఉన్న సత్పురుషులు ,తమకు
ఉపకారం చేసిన వారి దుఖాన్ని గురించే ఎక్కువ తపిస్తా రు .–‘’ తేనా నిమిత్తేన తథా వ పార్థ -స్త యోర్యథా రిక్తతయా నుతెపే –
స్వామాపదంప్రో జ్ఘ ్య విపత్తి మగ్నం –శోచంతి సంతో హ్యుపకారి పక్షం ‘’.
కిరాతార్జు నీయం-.39
తర్వాత గో పుచ్ఛాకారం లో పొ డవైన గుండ్రటి భుజాలున్న అర్జు నుడు ,శరీరం రక్త ం తో తడిసిపో తున్నా ,పాదాలు నేలకేసి కొడుతూ
,గంభీరంగా అరుస్తూ ,శంకరుని వైపుకు పరిగెత్తా డు .ఇంద్రు ని వజ్రా యుధం లాంటి ,చంద్ర రేఖలాగా తెల్లనైన ధనుస్సుతో,ఏనుగు దంతం తో
స్త ంభాన్ని కూల్చినట్లు , శంకరుడిని కొట్టి పడెయ్యాలనుకొన్నాడు .-‘’మహా వేగంగా పడుతున్న ఆ వింటి బద్ద ను శివుడు తనలోనే వేగంగా
దూసుకొస్తు న్న గంగానదిని జహ్ను మహర్షి తనలో ఇముడ్చుకున్నట్లు కలుపుకొన్నాడు -‘’రయేణ సా స౦ నిదధతే పతంతీ-
భావోద్భవేనాత్మని చాప యష్టిః-సముద్ధ తా సింధు రనేక మార్గా -పరే స్థితే నౌజాసి జహ్నునేన ‘’.చేతిలోచాపం లేని కిరీటి దానం చేయని వాడి
సత్కారం లా ,యుద్ధ ం చేయలేక పో యాడు .శంకర కిరాతకుడు బాగా తగిలే బాణాలతో క్రీడిని దూరంగా నెట్టేశాడు –‘’ విచిక్షిపే శూల
భ్రు తాసలీలం –స పత్రిభిర్దూ ర మాదూర పాతైః’’.అస్త ల
్ర ాభం మొదలైన శుభాలు కనపడే తపస్వి అర్జు నుడు తపసు ఉపవాసం మొదలైన
నియమాలు పాటించి నట్లు గా యుద్ధ ం అనే ఆశ్రమ ధర్మాలను ధైర్యం తో పాటిస్తూ ,శివ బాణ బాధ సహించాడు –‘’ఉపో ఢ కల్యాణ ఫలోభిరక్షన్
–వీర వ్రతం పుణ్య రణాశ్రమస్థ ః-జపో పవాసై రివసంయతాత్మా –తేపే మునిస్తైరిషుభిః శివస్య ‘’.ఆపదలో రక్షణ స్థ లాన్ని వెదుక్కున్నట్లు
,ప్రతాపానికి ఆశ్రయమైన ఖడ్గా న్ని యుద్ధా నికి రూపు దాల్చిన ఆహ౦కార౦ గా వాడాడు .ఖడ్గ ం తో శివ బాణాలు ముక్కలు చేస్తూ సూర్య
కిరణాలతో ఉద్దీప్త తరంగాలు కల సముద్రం లాగా భాసి౦చాడు – ‘’హస్తేన నిస్త్రింశ భ్రు తా సదీప్తః –సార్కా౦శునా వారిధి రూర్మి
ణేవ’’.సూర్యుడు తన మార్గ ం లో ఉంటూనే నీటిలో ప్రతి బింబ రూపంగా కనిపించినట్లు ,అర్జు నుడు ఖడ్గ యుద్ధ గతి భేదాలతో ఆకాశం లో,
నేలపైనా ప్రకాశించాడు –‘’తథా నభస్యాశు రణస్థ లీషు –స్పష్ట ద్విమూర్తి ర్ద దృశే స భూతైః’’.శివబాణ౦ తో తెగిపడ్డ అర్జు న ఖడ్గ ం మేఘం నుంచి
జారిన మెరుపు యొక్క అగ్నిలా ప్రకాశించింది –‘’జ్వలన్నసి స్త స్య పపాత పాణే-ర్ఘనస్య వప్రా దివ వైద్యుతోగ్నిః’’.కవచం ధనువు బాణాలు
ఖడ్గ ం కూడా విరిగి పో వటం తో అవమానం పొ ందిన అర్జు నుడు ఉద్యానవనం లో చెట్లు నరికేస్తే శూన్యం అయినట్లు న్నాడు –‘’రిక్తః ప్రకాశ
శ్చబభూవ భూమే –రుత్సాది తోద్యాన ఇవ ప్రదేశః ‘’
వెనకడుగువేయని ఫల్గు ణుడు తన భుజమే సహాయంగా చేసుకొని వడగళ్ళ వాన కురిసినట్లు రాళ్ళ వర్షం కురిపించాడు
స్థా ణుడిపై.శివుడు తన బాణాలతో వాటికి బదులు చెప్పాడు .క్రీడి చెట్లు విరిచి భూనభో౦తరాలు నిండేట్లు విసిరాడు .శివుడు వాటిని ముక్కలు
ముక్కలు చేసేశాడు .భయపడని భీభత్సుడు బంగారు శిల వంటి శివుని వక్షస్థ లాన్నితన భుజాలతో గట్టిగా దెబ్బ కొట్టా డు –‘’గాండీవి కనక
శిలానిభం భుజాభ్యా –మాజఘ్నే విషమ విలోచనస్య వక్షః ‘’.కీర్తికి ,లక్ష్మి కి సాధనమైనదీ శత్రు సేనకు పొ ందరాని పరాక్ర౦ కోర్తు న్న
అర్జు నుడిని,తన తొడమీద కూర్చున్న శిశువు మంచి వస్తు వు కావాలని మారాం చేస్తే ఎలా సహిస్తా డో శివుడు అలా సహించాడు –‘’
అభిలషత ఉపాయం విక్రమం కీర్తి లక్ష్యో-రసుగమమరి సైన్యైర౦క మభ్యాగతస్య –జనక ఇవ శిశుత్వేసుప్రియస్త్యిక సూనో –రవినయనమపి
సేహే పాండవస్య స్మరారిః’’ .
18 వ చివరి సర్గ -1
తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జు నుడిని శివుడు ముద్గ రం అనే ఇనుప ఆయుధం వంటి పిడికిలితో పొ డిచాడు
–‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జు నులు ముష్టి యుద్ధ ం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టు కొ౦టే
కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో ప్రతిధ్వనించింది –‘’స్ఫుట దనల్ప శిలారవ దారుణః-ప్రతి నినాద దరీషు దారీ భ్రు తః’’.శ౦కర
ముష్టిఘాతాలు,కి౦కరునికి చమ్మగానే ఉన్నాయి .పరాక్రమ శీలురు తేజస్వంతుల అనుకరణలో కూడా విశిష్ట ంగా నే ఉంటారు. అర్జు న
మనస్వి ఆవేశం తో రౌద్రం పొ ందినా ,సుఖ దుఖాల భేదం గుర్తించలేదు అని భావం –‘’క ఇవ నామ బృహన్మనసాం భవే -దను కృతే రపి
సత్వవతాం క్షమః ‘’.శంకర వక్షస్థ లం పర్వత తట ప్రా ంతం లా విశాలమైనది .అర్జు నుడి దెబ్బలతో గాయమై రక్త ం కారుతూ సంధ్యాకాల ఎరుపు
రంగు మేఘం లా ఉన్నాడు ‘’ –‘’అభిన వౌష సరాగభ్రు తా బభౌ –జలధరేణ సమాన ముమాపతిః ’ఉరసి శూల భ్రు తఃప్రహితా ముహుః-
ప్రతిహతం’’
అర్జు న ముష్టి ఘాతాలు సహ్యపర్వత తీరాన్ని సముద్ర కెరటాలు మాటి మాటికీ కొట్టు కొంటు న్నట్లు గా ఉంది .పర్వతాన్ని కెరటాలేమీ
చేయలేనట్లే అర్జు నుని పిడి గుద్దు లు స్థా ణశివుడిని ఏమీ చేయలేకపో యాయి –‘’ఉరసి శూల భ్రు తఃప్రహితా ముహుః-ప్రతిహతం యయు
రర్జు న ముష్ట యః –భ్రు శరయా ఇవ సహ్య మహీ భ్రు తః –పృథుని రోథసి సింధు మహో ర్మయః’’
శివుడు రెండు చేతులతో పిడికిలి బిగించి అర్జు న భుజాలపై కొట్ట గా ,కళ్ళు తిరిగి తడబడి తూలి పడ్డా డు –‘’త్రి చతురేషు పదేషు కిరీటినా –
లులిత దృష్టిమదాదివ చస్థ లే’’.అవమాన కోపాలతో మండిపడి దగ్గ రకెళ్ళి శివుడి రెండు భుజాలు వేరు చేసి గట్టిగా పట్టు కొన్నాడు పార్ధు డు
–‘’భుజ యుగేన విభజ్య సమాదదే –శశి కళా భరణస్య భుజ ద్వయం ‘’.కిరాతార్జు న మల్ల యుద్ధ ం హిమాలయాన్ని కంపింప జేసింది .తమ
భుజబలాన్ని వారిద్దరూ గర్వంగా భావించారు .ఒకరి భుజాలు మరొకరు పట్టు కొని శృ౦ఖలాలు కూర్చినట్లు పో రాడారు –‘’కరణ శృ౦ఖల
సంకలనాగురు –ర్గు రు భుజాయుధ గర్విత యోస్త యోః’’.ముష్టి యుద్ధ లో ఇద్ద రూ కిందపడ్డా రు .ఎవరు కిందపడ్డా రు, ఎవరు పైన ఉన్నారో
తెలియక తికమక పడ్డా రు ప్రమథులు .శివార్జు నుల బరువును సహించలేని ఇంద్రకీల పర్వతం వారితో పాటు కదులుతూ ,వాళ్ళు
కదలకుండా ఉంటే స్థిరంగా ఉంటూ ,వంగినపుడు వంగి నుల్చుంటే నిటారుగా నిలబడి ,ఎక్కడ తాను నశి౦చి పో తానో అనే భయం పొ ందింది
–‘’ప్రచాలితే చలితం స్థిత మాస్థితే-వినమితే నతమున్నత మున్నతౌ –వృష కపిధ్వజయో రస హిష్ణు నా –ముహురభావ భయాదివ భూ
భ్రు తే’’
కళ్ళు చేతుల కలయిక ఆపేసి జబ్బలు చరవటం మొదలెట్టా రిద్దరూ .ఆ ధ్వనికి పర్వత నదులు ఎల్ల లుదాటి ప్రవహించాయి –‘’చరణపాత
నిపాతిత రోధనః –ప్రససృపుఃసరితః పరితః స్థ లీః’’.ఆకాశం లోకి వేగం గా ఎగిరిన శివపాదాలు అర్జు నుడు యెగిరి లాఘవంగా పట్టు కొన్నాడు
–‘’చరణయోశ్చరణానమితక్షితి –రనిజ గృహేతిస్రు ణాం జయినం పురాం’’.తను కళ్ళు పట్టి నేలకేసి కొట్ట దలచిన అర్జు న పరాక్రమానికిశివుడు
ఆశ్చర్యపో యి ,తన వక్షస్థ లం తో గట్టిగా ఆలింగనం చేసి నలిపేశాడు –‘’’’విస్మితః సపది తేన కర్మణా –కర్మణాంక్షయకరః పురః పుమాన్ –
క్లేప్తు కామ మవనౌ తమక్ల మం –నిష్పిపేష పరిరభ్య వక్షసా ‘’.అర్జు నుడి పరాక్రమానికి సంతోషించినంతగా అతడి తపస్సుకు సంతోషించ లేదు
శివుడు. సత్పురుషుల కు తపస్సు మొదలైన గుణాలకు మించి ,సహజ పరాక్రమమే ఉపకారమై వన్నె తెస్తు ంది –‘’’’గుణ స౦హతేః
సమతిరిక్త మహో –నిజ మేవ సత్వముపకారి సతాం ‘’
శంకరుడు తెల్లని భస్మంతోఅల౦కారుడై చంద్ర రేఖ తో మనసును ఆకర్షించే రూపం తో ప్రత్యక్షం కాగా అర్జు నుడు వెంటనే నమస్కరించాడు
–‘’అథహిమ శుచి భస్మ భూషితం –శిరశి విరాజమిత మిందు లేఖయా – స్వవపురతిమనోహరం హరం –దదత ముదీక్ష్య ననామ పాణ్డ వః
‘’.అనుకుకుండా బాణాలు అమ్ములపొ దులు గాండీవం ఖడ్గ ం కవచం తో ప్రకాశిస్తు న్న తన శరీరం చూసుకొని అర్జు నుడు ఆశ్చర్య పో యాడు
–‘’సహా శరధి నిజం తథా కార్ముకం –వపురతను సంవర్మితం –నిహిత మపి తథైవ పస్యన్నసిం -వృషభగతి రూపాయ యౌవిస్మయం
‘’.అప్పుడు మేఘాలు తు౦పురులతో నేలను తడిపి చల్ల బరిచాయి. చిత్రంగా మందార పుష్ప పరిమళం వ్యాపించి ,స్వచ్ఛకాంతి ఆకాశాన్ని
ఆవరించి భేరీ వాదన లేకుండానే ధ్వనించింది .-‘’విమల రుచి భ్రు శంనభో దు౦దుభే-ర్ధ ్వని రఖిల మనాహత స్యానతే ‘’.ఇంద్రు నితో సహా
దేవతలంతా విమానాలలో వచ్చి ఆకాశాన్ని ఆవరించారు .ఆ విమానాల కాంతులతో ఆకాశం లో నక్షత్రా లు పొ డమినట్లు తోచింది
.-‘’రోచిష్ణు రత్నావలిభిర్వి మానైః-ద్యౌరా చితా తారకితేవ రేజే ‘’.దేవ విమానాలు మోసే హంసలు మెడలలోధ్వనించే గంటలతో ,ఎగురుతూ
రెక్కలు నాడించి ఆకాశాన్ని కౌగలించు కునేట్లు చేరాయి .మేఘం లాంటి వృషభం పై కూర్చున్న మహేశ్వరునికి వాయుదేవుడు
,తుమ్మెదలు మందార మాలలను పైన వెన్నెల లాగా వ్యాపింప జేసి ఆహ్లా దం కలిగించాయి –‘’ముదిత మధులిహో వితానీ కృతాః-స్రజ ఉపరి
వితత్య సంతానికీః-జలద ఇవ నిషేది వా౦స౦ వృషే-మరుదుప సుఖయాం బ భూవేశ్వరం ‘’
‘’నీ మాయను జయించి పుణ్య పాపాలతో బంధింప బడి ,ఇతరులు చేధించటానికి వీల్లేని భయంకర నరక యాతనను దూరం
చేయటానికి అద్భుత లీలా రూపం ధరించావు – ‘’స౦ నిబద్ద మపహర్తు మహార్యం –భూరి దుర్గ తి భయం భువనానాం –అద్భుతా
కృతిమిమా మతిమాయ –స్త ్వంభిభర్షి కరుణామయ మాయాం’’.నీ చిత్త ం విరాగ మైనదే .నీశరీరం లో అర్ధ భాగం లో స్త్రీ ఉన్నా,మన్మథవికారం
లేని వాడివి .ఉదయ సంధ్యలో బ్రహ్మను ఆరాదిస్తా వు .నీ చేష్టలు జటిలమైనవి ,అర్ధ ం కానివి –‘’న రాగి చేతః పరమా విలాసితా –వధూః శరీరే
స్తినచాస్తి మన్మథః-నమస్క్రియా చోషసి ధాతు రిత్యహో –నిసర్గ దుర్బోధ మిదం తవేహితం ‘’.వెంట్రు కలతో ఉన్న గజ చర్మాన్ని
కప్పుకొన్నావు.మణితో ఉన్న సర్పం నీ మొలతాడు .కపాలమాల అలంకార దండ .చితా భస్మం చందనం అయినా ఈ అలంకారాలు శిరసుపై
ఉన్న చంద్ర రేఖతో సమానంగా ప్రకాశిస్తు న్నాయి –‘’తవోత్త రీయం కరి చర్మ సా౦గజం –జ్వలన్మణిః సారసనం మహానహిః-స్రగాస్య పంక్తిఃశవ
భస్మ చందనం –కలాహిమాంశోశ్చసమం చకాసతి ‘’.నువ్వు ఆశరీరుడివ.ే అసాధారణ అర్ధ నారీశ్వర రూపం నీకే ఉంది .విరుద్ధ వేష
,అలకారాలున్నా ,మహా అందంగా ఉంది .లోకం లో ఇంకెవరికీ ఇలా లేనేలేదు .నీ మహిమ అవర్ణ ్యం.-‘’అవిగ్రహస్యాప్యతులేన హేతునా –
సమేత భిన్నద్వయ మూర్తి తిష్ట తః –తవైవ నాన్యస్య జగత్సు దృశ్యతే –విరుద్ధ వేషాభరణ్య కా౦తతా ‘’.జనన మరణ రహితుడవు నీకు
ఉపమానమే లేదు ఉపమేయమూ లేదు.అంటే వర్ణించలేము –‘’ఆత్మ లాభ పరిణామ నిరోధై-ర్భూత సంఘ ఇవ న త్వముపేతః –తేన సర్వ
భువనాతిగలోకే –నోపమానమసి నాప్యుపమేయః ‘’
‘’చరా చర ప్రపంచ సంహారకుడివి. నీవల్ల నే విశ్వం సృష్టింపబడి ,జీవిస్తు ంది .యోగులకే కర్మ ఫలాన్నిస్తా వు .సమస్త జగత్తు కారణానికే కారణం
నువ్వే –‘’త్వమంతకః –స్థా వర జంగమానాం –త్వయా జగత్ప్రాణి దేవ విశ్వం –త్వం యోగినాం హేతు ఫలే రుణత్సి-త్వం కారణం కారణ
కారణానాం ‘’..ఈ సంసారం లో రాక్షసులు ,దేవ ,మనుష్యులు,దైత్యులు ఏయే సామ్రా జ్యాలు పొ ందారో ,వాటన్నిటికీ శరణాగతుల దుఖాన్ని
పో గొట్టే నీకు చేసిన నమస్కార మహిమే కారణం ‘’-‘’రక్షోభిః సురమనుజైర్దితేః సుతైర్వా-యల్లో కే ష్వవికల మాప్త మాధిపత్యం –
పావిన్యాఃశరణాగతార్తి హారిణే త-న్మాహాత్మ్య౦ భవ భవతేనమస్క్రియాయాః’’.శంకరుని అష్ట మూర్తు ల్లో వాయు మూర్తి ఒకటి .దాన్నిఅర్జు నుడు
‘’ వాయు బలం తో లోకాన్ని ప్రా ణవంతం చేస్తు ంది .వాయువు ప్రేరణ తో అక్షరరూప బ్రహ్మ పలుక బడుతుంది .అదే అన్ని పాపాలు పో గొట్టి
శుద్ధిచేస్తు ంది .అలాంటి వాయు రూప శివా !’’అని స్తో త్రం చేశాడు –‘’తరసా భువనాని యో భిభర్తి –ధ్వనతి బ్రహ్మ యతః పరం పవిత్రం –పరితో
దురాని యః పునీతే –శవ తస్మైపవనాత్మనే నమస్తే ‘’
తర్వాత అగ్నిరూప శివ స్తో త్రం చేశాడు పార్ధు డు –యోగ సాధన కోసం యోగాసనం లో కూర్చుని నిన్ను స్మరించే యోగుల సంసార
దుఖాలకు కారణమైన కర్మలను దహిస్తు ంది .అనేక జ్వాలలతో ప్రకాశించే నీ అగ్ని మూర్తికి నమస్కారం –‘’భవతః స్మరతా౦సదాసనే –జయిని
బ్రహ్మ మయే నిషేదుషాం –దహతే భవ బీజ సంతతిం –శిఖినే నేక శిఖాయ తే నమః ‘’.జలమూర్తి శివ స్తో త్రం –సంసార బీజానికి కారణమైన
శివా !ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక ,ఆది భౌతిక రూప తాపత్రయాలలు మరణం మొదలైన వాటి వలన కలిగే భయరూప మంటలను
ఉన్న సంసారాగ్ని లో చాలాకాలంగా బాధ పడే వారు నిన్నాశ్రయిస్తే చాలు వారికి జీవదానం చేయగల జలమూర్తి వైన నీకు నమస్కారం
–‘’అబాధా మరణ భయార్చిషా చిరాయ –ప్లు ష్టేభ్యోభవ మహతా భవానలేన-నిర్వాణం సముపగమేన యచ్ఛతే తే-బీజానాం ప్రభవ నమోస్తు
జీవనాయ ‘’నభో మూర్తి శివ స్తో త్రం –భవా! విభువు ,సంపూర్ణ జగత్తూ ఆవరించిన వాడూ ,ఎవరి చేతా ఆచ్చాదనం లేనివాడు ,ఆది అంతం
లేని వాడు ,ఇంద్రియాతీతుడు తెలియబడని నీ ఆకాశ మూర్తికి నమస్కారం –‘’యః సర్వేషా మావరీతా వరీయాన్ –సర్వైర్భావైర్నావృతోనాది
నిష్ట ః-మార్గా తీతా ఏంద్రియాయాణా౦ నమస్తే –విజ్ఞేయాయ వ్యోమ రూపాయ తస్మై ‘’.దేవా !సూక్ష్మాతి రూపం తో విశ్వాన్ని ధరిస్తూ
,అంతర్యామిగా అందరికీదగ్గ రౌతావు .మాట మనసుకూ అతీతుడవైనా వాటికి అధిపతి వైన నీకు నమస్కారం ‘’.-అణీయసేవిశ్వ విధారిణేనమో
–నమో౦తిక స్థా య నమో దవీయసే –అతీత్య వాచాం మనసాం చ గోచర౦ –స్థితాయ తే తత్పతయే నమో నమః ‘’అన్ని విద్యలకు స్వామివి
.అజ్ఞా నంగా శస్త ్ర సంధాన దుశ్చర్యకు పాల్పడిన నన్ను క్షమించు .అజ్ఞా నం తో విరోధించి ,మళ్ళీ నిన్ను చేరిన దుర్మార్గు డికి కూడా నువ్వే
శరణ మయ్యావు ‘’-అసం విదానస్య మమేశ సంవిదాం –తితిక్షితుం దుశ్చరితం త్వమర్హసి –విరోధ్య మొహాత్పునరభ్యుపేయుషాం-
గతిర్భవానేవ దురాత్మనాపి ‘’.
స్తో త్రా లన్నీ చేసి చివరకు అర్జు ండు శివుడిని వర౦ కోరుతున్నాడు-‘’ధర్మపాలకా !ఆస్తి బుద్ధితో వైదక
ి ధర్మాన్ని ఆచరిస్తు న్న మా అన్న
ధర్మరాజు గారికి .అపకారులైన శత్రు వులపై మేము ఏ విధంగా శస్త్రా స్త ్ర సమృద్ధిగా విజయం పొ ందుతామో దాన్ని మాకు ప్రసాదించు –ఇదే నా
ప్రా ర్ధ న –‘’ఆస్తిక్య శుద్ధ మవతః ప్రియ మార్గ ధర్మం –ధర్మాత్మజస్య విహితాగసి శత్రు వర్గే –సంప్రా ప్నుయా౦ విజయ మీశ యయా సమృధ్యా –
తాం భూతనాథ విభుతాంవితరాహవేషు ‘’అని కోరి శివుని పాదాలపై పడిన ఆర్జు నుడిని శంకరుడు ఓదార్పు మాటలు పలికి
అగ్నిజ్వాలావృతమై, రుద్రదేవకాత్మమైన పాశుపతాస్త్రా న్ని,దానికి సంబంధించిన ధనుర్వేదాన్నీ అనుగ్రహించాడు –‘’ఇతి నిగదిత వంతం
సూను ముచ్చైర్మ ఘోనః –ప్రణత శిర సమీశః సాదరం సాంత్వ యిత్వా –జ్వలదనల పరీతం రౌద్ర మస్త ం్ర దధానం –ధనురుప పద
మస్మైవేదమఖ్యాదిదేశ’’.
ఆధనుర్వేదం శివుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తూ ,దేవతలు స్తో త్రా లు చేస్తు ండగా అర్జు నుడి ఎదుటకు వచ్చింది .ఎర్రని నేత్రా లతో
అందం గా ఉంది సర్వ లోక పూజనీయం ప్రకాశమైన ధనుస్సుభయంకర శరీరం ధరించింది .మూడు శిఖల త్రిశూలంతో సంబంధం కలిగి
ఉన్నది పచ్చని రంగుతో సూర్యుడు మేఘాన్ని చేరినట్లు ఆర్జు నుడిని చేరింది –‘’స పి౦గాక్షః శ్రీమాన్ భువన మహనీయేన మహసా – తను౦
భీమాం భిభ్ర త్రిగుణ పరివార ప్రహరణః-పరీత్యేశానం త్రిః స్తు తిభి రూప గీతః సుర గణైః-సుతం పాండో ర్వీరం జలదమివ భాస్వాన భియయౌ
‘’.తర్వాత ఇంద్రా ది దేవతలు ఈశ్వరుని అనుమతి పొ ంది పూర్ణ కాముడైన అర్జు నుడికి ఫలదాయకాలైన ఆశీస్సులు పలికారు .విజయ
ప్రదాలైన అనేక అస్త్రా లు అర్జు నుడికి ప్రదానం చేశారు –‘’అథశశధర మౌలే రభ్యనుజ్ఞా మవాప్య –త్రిదశ పతి పురోగాఃపూర్ణ కామాయ తస్మై –
అవిథతఫలమాశీర్వాదమారోపయంతో-విజయి వివిధ మస్త ం్ర లోక పాలా వితేరుః-‘’
జయశీలుడైన అర్జు నుడు పాశుపతాస్త ్ర లాభం తో అభ్యుదయం పొ ంది దురాత్ముల వినాశానానికీ ,లోక రక్షణకు తపస్సు వలన కలిగిన శోభతో
ప్రత్యేక తేజస్సుతో అద్వితీయ సూర్య ప్రకాశంగా ప్రకాశించాడు .దేవతలు అర్జు న యశోగానం చేసి ఉత్సాహ పరచారు –‘’అసంహార్యోత్సాహం
జాయిన ముదయంప్రా ప్య తరసా –దురం గుర్వీ౦ వోఢుం స్థితమనవ సాదాయ జగతః –స్వధామ్నా లోకానాం తముపరి కృతస్థా నమమరా –
స్త పో లక్ష్మ్యా దీప్తం దిన కృతమివో చ్చైరుప జగుః’’
శివ భగవానుడు అర్జు ను డితో’’వెళ్ళు శత్రు వులను జయించు ‘’అని ఆజ్ఞ ఇవ్వగా పాదాలకు నమస్కరించి బయల్దే రాడు పార్ధు డు .దేవతలు
కొని యాడగా విజయలక్ష్మితో ఇంటికి చేరి ,ప్రేమాదరాలతో ఎదురు చూసున్న అన్న ధర్మరాజుకు నమస్కరించాడు –‘’వ్రజ జయ రిపులోకం
పాద పద్మానతః సన్-గదిత ఇతిశివేన శ్లా ఘి తో దేవా సంఘైః-నిజ గృహమథగత్వా సాదరం పాండు పుత్రో –ధృతగురు జయలక్ష్మీ
ర్ధర్మసూనుం ననామ ‘’.
ఆధారం –భారవి మహా కవి కిరాతార్జు నీయం సంస్కృత కావ్యానికి శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్ఞ గారు రాసిన తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా
అంతర్జా లం లో కిరాతార్జు నీయాన్నిమాఘమాసం 25-1-20 న ప్రా రంభించి ,7-2-20 నాటికి14 ఎపిసో డ్ లతో 3 సర్గ లు వారి వ్యాఖ్యానం
మూడు సర్గ లకే ఉండటం వలన అంతవరకే రాసి ,ఆపేశాను .తర్వాత సర్గ ల వ్యాఖ్యానం కోసం ఈలోపు గాలించి ,గాలించి మా అబ్బాయి శర్మ
ఎమెస్కో వారు ప్రచురించిన డా. సుందరాచార్య సంపూర్ణ కిరాతార్జు న వ్యాఖ్యానం కొని పంపించగా దసరాలలో సరిగ్గా సరస్వతీ పూజ రోజున
నాకు 21-10-20 న అందింది . .మళ్ళీ కార్తీకమాసం 16-11-20 న 4 వ సర్గ నుంచీ డా .కె.వి.సుందరాచార్యులు వారి సుందర తెలుగు
వ్యాఖ్యానం ఆధారంగా ప్రా రంభించి ఈరోజు మార్గ శిర బహుళ పాడ్యమి 30-12-20 నాటికి 41 ఎపిసో డ్ లతో సుమారు నెలన్నర కాలం లో
,18 వ సర్గ వరకు మొత్త ం కావ్యాన్ని పూర్తి చేయగలిగాను .మొత్త ం 55 ఎపిసో డ్ లు గా ,కిరాతార్జు నీయ౦ పూర్త యింది.ఇది నాకు సంతృప్తినీ
ఆనందాన్నీ కల్గి౦చికావ్యం .నాజన్మ చరితార్ధ ం –
బక దాల్భ్యుడు
ఎవరీ దాల్భ్యుడు?
పౌరాణిక మహా భక్త శిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి తరించమని మనవారు ఒక శ్లో కం చెప్పారు .
ఈశ్లో కం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తా ం .నిన్న ఎందుకో పై శ్లో కం నాకు స్పురణకు వచ్చింది .చటుక్కున ఇందులో
అందరు మహానుభావులూ, తెలిసినవారే మరి దాల్భ్యుడు గురించిన చరిత్ర తెలియ లేదే అనే ప్రశ్న బయల్దే రింది .నాకే కాదు చాలామందికి
తెలిసి ఉండక పో వచ్చు అని పించి ,ఆయనకోసం దుర్భిణీ వేసి వెదకటం ప్రా రంభిస్తే ఎడారిలో ఒయాసీస్ లాగా కొద్ది సమాచారం లభించింది
.దీనినే అందరికీ పంచుదాం అని పించి తెలియ జేస్తు న్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఉంటే తెలియ జేసి సమగ్రం చేయండి .
చాలాకాలం క్రితం నైమిశారణ్య మహర్షు లు ఒక హో మం నిర్వ హించటానికి పూనుకొని ధృతరాష్ట్ర మహా రాజు దగ్గ రకు వెళ్లి కొంత ధనం కోరారు
.ఈ మహర్షు లకు నాయకుడు దాల్భ్యుడుఅనే మహా తపస్సంపన్నుడైన మహర్షి .ఈయననే ‘’బక ‘’అంటారు .ఈయనే రాజును డబ్బు అడిగింది
.రాజు డబ్బు ఇవ్వకపో వటమే కాదు ,ఆయన్ను అవమానించాడు కూడా .ఈ పరాభవాన్ని సహించలేక దాల్భ్యమహర్షి ప్రతీకారం చేయాలని
భావించి హో మం తలపెట్టి చేసి అందులో హవిస్సుగా ధృత రాష్ట్ర సామ్రా జ్యాన్ని అగ్నికి సమర్పించాడు .ఈ యాగాన్ని ‘’పృధూదక’’లో ‘’అవికీర్ణ
మహా తీర్ధ ం ‘’లో చేశాడు .దీనితో ధృత రాష్ట్ర సామ్రా జ్యం పతనం చెందటం ప్రా రంభించింది .మంత్రి ,పురోహిత,కార్తా ంతిక ముఖ్యులను
సంప్రదించి ఇలా జరగటానికి కారణం విచారించాడు .వారందరూ దీనికి కారణం దాల్భ్యుని హో మం అని ముక్త కంఠంగా చెప్పారు .కంగారు పడ్డ
మహారాజు అంతులేని ధనరాసులతో పరివార సమేతంగా దాల్భ్యుడు హో మం చేసిన ‘’అవకీర్ణ మహా తీర్థా నికి ‘’వెళ్ళాడు.తాను తెచ్చిన సంపద
అంతా దాల్భ్యమహర్షి పాదాల చెంత ఉంచి, తప్పు మన్నించమని వేడుకొన్నాడు .ఉదార హృదయం తో రాజు తప్పు మన్నించి, దాల్భ్యుడు
మళ్ళీ హో మం నిర్వహించి అందులో హవిస్సుగా పాలు ,తేన,ె సమర్పించగా ,సామ్రా జ్యంలో చనిపో యినవారంతా పునరుజ్జీ వితులయ్యారు అని
వామన పురాణ 0 లోని 39 వ అధ్యాయం లో ఉంది .అంతటి శక్తి సంపన్నుడు దాల్భ్యమహర్షి .
మహా భారతం లో సభాపర్వం 4 వ అధ్యాయం ,11 వ శ్లో కం లో యుధిస్టిరుని కొలువులో దాల్భ్యమహర్షి ఉన్నట్లు తెలుస్తో ంది .మరొక చోట
సత్యవంతుని తండ్రి ద్యుమత్సేనుని దాల్భ్యుడు సందర్శించి సత్యవంతుడు చిరాయువు కలిగి ఉంటాడని ఆశీర్వ దించినట్లు వనపర్వం
298 అధ్యాయం 17 వ శ్లో కం లో ఉన్నది.
దల్భుని కుమారుడు దాల్భ్యుడు .దార్భ్య అనీ అంటారు .దండ్రి నుంచి వచ్చిన పేరు .పంచ వింశ బ్రా హ్మణం లో కేశి అనీ ,ఛాందో గ్య
ఉపనిషత్,జైమినీయ ఉపనిషత్ బ్రా హ్మణంలో చైకితాయన అనీ ,ఛాందో గ్య కథక సంహితలో ‘’వాక లేక బక ‘’గా పిలువబడినాడు .
దాల్భ్య మహర్షి 160 శ్లో కాల ‘’శ్రీ విష్ణు రపామార్జ న స్తో త్రం ‘’రాశాడు.అపామార్జ న అంటే శుద్ధి చేయటం ,పాపాలు తొలగించటం అని అర్ధ ం
. .ఇందులో దాల్భ్య ,పులస్య సంవాదం ఉంటుంది –మొదటిశ్లో కం -
‘’భగవన్ప్రాణినః సర్వేవిషరోగాద్యుపద్రవైః –దుస్ట గ్రహో ప ఘాతశ్చసర్వకాల ముప ద్రు తాః’’
చివరి శ్లో కం –
‘’ధన్యో యశస్వీ శత్రు ఘ్నః స్త వోయం ముని సత్త మ –పఠతాం,శృణుతాం చైవ దదాతి పరమాం గతిం’’
‘’ఇతి శ్రీ విష్ణు ధర్మోత్త రే ,విష్ణు రహస్యే ,పులస్త ్య దాల్భ్య సంవాదే –శ్రీ విష్ణో రపామార్జ న స్తో త్రం సంపూర్ణ ం ‘
‘’ భక్త మాల’’ గ్రంథం లో విప్ర వరుడైన దాల్భ్యుడు దత్తా త్రేయ మహర్షి ఉపదేశం తో సీతారాముల భజన స్తో త్రం అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆర్తిగా
చేశాడు .ప్రీతి చెందిన శ్రీరామ ప్రభువు దర్శనం అనుగ్రహించాడు .శ్రీహరి ఆశీస్సులు పొ ంది దైహిక ,దైవిక ,భౌతిక తాపాలు తొలగించుకొని
,సర్వ కార్య సిద్ధు డు అయ్యాడు .బహుశా ఈ మహాభక్త దాల్భ్యుడే మన భక్త శిఖామణుల శ్లో కం లో స్థా నం సంపాదించి ఉంటాడు.
‘’ వ్రతర్ద నుడు అనే రాజు యజ్ఞ విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రా హ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల
రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్ద రు క్షత్రియులతో వాదం చేసినట్లు
ఛాందో గ్యం చెబుతోంది .దాల్భ్యుని సో దరులు ‘’బక దాల్భ్యుడు’’ జైమినీయ బ్రా హ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రా హ్మణం
లోను కనిపిస్తా రు.ఈ ముగ్గు రి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే కౌరవ రాజు సో దరి .తండ్రి శతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రా హ్మణం లో
ఉన్నది .
ద్రు పద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు
‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తో ంది .ద్రౌ పదికి యాజ్ఞ సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్ఞు లే ,కేశి
దాల్భ్యుని సమకాలికులే.’’
ఇంతటి అద్భుత విషయ చరిత్ర ఉన్న దాల్భ్య మహర్షిని మనం పట్టించు కోకపో వటం మన తప్పిదమేకాదా –
1962 లో Petteri Koskikallio ఫిన్ లాండ్ దేశం ‘’ హెల్సెంకి ‘’లో పుట్టా డు .1971 లో మొదటి సారి ఇండియా వచ్చాడు .2013 జులై
13 నుంచి 18 వరకు హేల్సెంకిలో జరిగిన 12 వ ‘’ప్రపంచ సంస్కృత సమ్మేళనం’’ కు కార్యదర్శిగా పని చేశాడు .తాను రాసిన పుస్త కాలు
రిసర్చ్
ె పేపర్లూ అన్నీ ప్రచురించాడు .1979 లో ASKO PORPOLA తో కలిసి కేరళ ,తమిళనాడు ,కర్నాటక లోని గ్రా మాలను సందర్శించి
కావాల్సిన సమాచారం అంతా సంపాదించుకొన్నాడు .భారతీయ పురాణాలపై తన అభిప్రా యాన్ని’’ From Classical to Postclassical:
బక దాల్భ్యుడు -1
వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లు న్నాయి కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తా డు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’
,ధృత రాష్ట ్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తా డు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి
ఎపిక్ గ్రంథం ధృత రాస్ట్రు ని గురించి చెప్పింది కనుక .దీన్ని ఆల్బర్ట్ వెబర్ చాలా కాలం క్రితమే గుర్తించాడు .ఈ కథ మహాభారతం లో ఆ
పై సంహిత ప్రకారం వక దాల్భ్యుడు నైమిశీయ బృందానికి చెందిన వాడు నైమిశారణ్యం లో యజ్ఞ యాగాలు చేసే మహర్షి .ఒక సారి
సత్రయాగం చేశాక ,తన వద్ద దక్షణ గా కురు పాంచాలురు ఇచ్చిన 27 యువ వృషభాలను తన బృందం వారికి వారిలో వారిని
పంచుకోమని చెప్పి ,ఆ బృందాన్ని వదిలి ,ధృత రాష్ట ్ర ,విచిత్ర వీర్యుల వద్ద కు అమిత ఆశతో వెళ్ళాడు .రాజు ఏమీ దక్షణ ఇవ్వకుండా, రుద్ర
పశుపతి చేత జబ్బు పొ ందిన ఆవులను ఇచ్చి వెళ్లి పొ మ్మన్నాడు .పిచ్చి బాపనయ్య ఆవులు కోల్పోయానే అని బాధపడుతాడు
అనుకొన్నాడు రాజు .కాని ‘’వక’’ ఆ పశువులను వండి,అమర్యాదగా ప్రవర్తించిన రాజుకు వ్యతిరేకంగా హో మంలో ఆహుతిచ్చాడు .మర్నాడు
ధృత రాష్ట ్ర సామ్రా జ్య వైభవం అంతా నశించింది .రాజపురోహిత మంత్రి గూఢచారులు దానికి కారణం వక చేసిన యాగమే అని రాజుకు
చెప్పారు .ఆ మర్నాడే అత్యంత ధనరాసులతో వక మునిని సందర్శించి సమర్పించగా .’’నైమిశీయ వక’’, రాజు కోసం మళ్ళీ యాగం చేసి ఒక
రెండవ ప్రా చీన గ్రంథాలు ‘’జైమినీయ ఉపనిషత్ బ్రా హ్మణం ‘’లోఛాందో గ్య ఉపనిషత్ లో బక దాల్భ్య ప్రస్తా వన కనిపిస్తు ంది .రెండిటిలోనూ
రెండుసార్లు ప్రస్తా వన ఉంటుంది .జాబాలి బ్రా హ్మణం4-6-1 లో’’ రాజాకామ ప్రేణ యజ్ఞేనయక్ష్యమానసా ‘’ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరధుడు
తనకోరిక తీరటానికి యాగం చేశాడు.యాగ సమయంలో కురు,పా౦చాల బ్రా హ్మణులకు కర్మకాండ గురించి నాలుగు ప్రశ్నలు సంధించాడు
.అందులో మహా వేదవేత్త బక దాల్భ్యుడు కూడా ఉన్నాడు -4-7-2.-‘’కురు పాన్చాలన౦ బకో దాల్భ్యో ఔచణస ‘’ వాటికి అవలీలగా ఆయన
సమాధానాలు చెప్పాడు .సంతృప్తి చెందిన భగీరధుడు బక దాల్భ్యుడినే తన యాగానికి నిర్వాహకుడు గా ఎంచుకొని ప్రకటించాడు ,బకుడు
ఉద్గీత ను గాయత్ర ఉద్గీత ఆధారం గా గానం చేయగా ,రాజు స్వర్గ ం చేరాడు -4-8-5’’స హైకరాద్ ఏవ భూత్వా స్వర్గ ం లోకం ఇయాయ
‘’. బక దాల్భ్యుడు మూడవసారి జాబాలిఉపనిషత్ బ్రా హ్మణం మొదటి పుస్త కం1-3-9 లో వస్తా డు .ఒకేసారి రెండు సో మయాగాలు
చేసే సందర్బం అది ,బకుడు ఇంద్రు ని బలవంతంగా విరోధి ఐన ఆజకేశినుల నుంచి నెట్టేసి ,తానె ప్రణవం ఉచ్చరించాడు .దీనితో బకా
ఛాందో గ్య ఉపనిషత్ లో 1-12 లో కూడా బక దాల్భ్యుడు సామ వేద ఉద్గా త గా కనిపిస్తా డు .ఉద్గా త శునకాల వ్యంగ్య ప్రదర్శనలోనూ
ఉన్నాడు .ఒకప్పుడు ఈయన వేద విద్యార్ధిగా ఉంటూ సంచారం చేస్తు ంటే కుక్కల బృందాన్ని చూశాడు .అక్కడ ఒక తెల్లకుక్క వద్ద కు
మిగిలిన కుక్కలుపరిగెత్తు కు రావటం చూశాడు .ఆకుక్కలు తెల్లకుక్కను ఆహారం కోసం పాడమని అడిగాయి -1-12-2-‘’అన్నం నో భగవాన్
ఆగాయతు’’.అప్పుడా తెల్ల శునకం వాటిని మర్నాడు ఉదయం రమ్మని చెప్పింది .బక అక్కడే ఆ రాత్రి అంతా నిరీక్షిస్తూ తెల్లా రే వరకు
కూర్చుని ఉన్నాడు .మర్నాటి ఉదయం ఆ కుక్కలు వరుసగా వచ్చిఒకదాని తోక ఒకటి పట్టు కొని బ్రా హ్మణులు ‘’బాహిస్పవామన సూత్రం
‘’ఉచ్చరిస్తు న్నట్లు గా ఉన్నాయి -1-12-4-‘’తే హ యథై వేదం బహిస్ప వామనేన స్తో స్య మానః సంరబ్ధా ః సర్పంతిత్యే ఏవంఆసస్పృహ’’
ఆకుక్కలు కూర్చుని’’ హిం ‘’అనే శబ్ద ం చేస్తూ అన్నం,నీళ్ళ కోసం ప్రా ర్ధ న గీతం పాడాయి .ఇక్కడే బక దాల్భ్యుని ‘’గ్ల వ మైత్రేయ ‘’గా కూడా
బక దాల్భ్యుడు -2
బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధో రణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తు ంది .పంచ వింశ బ్రా హ్మణం-25-15-,3,షడ్వింశ బ్రా హ్మణం –1-4-
6,గోపథ బ్రా హ్మణం -1-1-31 లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తు ంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లా వుడు(గాలవుడు ?) ఉద్గా తకు
సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు లోకేషుప్రత్య తిస్ట న్’’.వాటికి మృతువు
తప్పి, రహస్యంగా పుట్ట ల్లో దాక్కొనే బాధా తప్పి,స్వేచ్చగా ప్రా కుతున్నాయి -25-15-4-‘’ఏతేన వై సర్పాఅపమృత్యుం జయంతి-తే హిత్వా
జీర్ణ ం త్వచం అతి సర్పంతి అపహితే మృత్యుం అజయన్ ‘’ఈ సందర్భంలో అనేక పాములపేర్లు వస్తా యి .మహాభారతం లో పాములపై
ద్వేషమున్న జనమేజయుడు సర్ప సత్రం చేసినట్లు న్నది .ఈ యాగానికి ఇద్ద రు ఆధ్వర్యులున్నట్లు న్నది .ధృత రాష్ట ్ర ఐరావత అనే
బ్రా హ్మణుడు కూడా సర్పయాగం చేసినట్లు న్నది .ధృతరాష్ట ్ర విచిత్ర వీర్య 10-6.
షడ్వింశ బ్రా హ్మణం 1-4-6 లో గ్లా వ మైత్రేయ సో మగానం ముందు రోజు ఉదయం జ్యోతిస్టో మం మొదలైన కర్మకాండ చేసినట్లు న్నది
.గ్లా వుడు సదస్సులో విశ్వ రూప మంత్రా లు చదివినట్లు ,యాగానికి ముందురోజు రాత్రి ,యాగం రోజు ఉదయాన ఛందస్సులో మంచి చెడు
గోపథ బ్రా హ్మణం 1.1.31-38 లో మైత్రేయుడికి,సామవేద అనుయాయి గ్లా వ మైత్రేయుడికి మధ్య పండిత చర్చ జరిగినట్లు చెప్పింది
.ఇందులో గ్లా వుడు ఓడిపో యాడు కారణం సావిత్రి ,గాయత్రి ఛందస్సుల ఆధారం చెప్పలేకపో వటమే ,వాటికి స్వర్గ ం సమానమైనవాటిని
ఇప్పడు మనం చెప్పుకున్నవాటన్నిటిలో బక దాల్భ్యుని ఆసక్తికర సమాచారం ఎమీలేదుకాని .కురుపా౦చాల ,నైమిశ సత్ర కూటమిలో
ఉన్నాడని సామవేద నిష్ణా తుడు అనీ తెలుస్తో ంది .ఛాందో గ్య ఉపనిషత్ 1-2-13 ప్రకారం బక దాల్భ్యునికి ఉద్గా త సామర్ధ ్యం పుష్కలం గా
ఉండి,నైమిశారణ్యంలో ముఖ్య కర్మకాండ మంత్రం గాయకుడుగా ఉండేవాడు –‘’సహా నైమిశీయనాం ఉద్గా త బభూవ ‘’.తర్వాత మంత్రం
1.2.14 లో ఓంఅక్షర ప్రా ముఖ్యం ,ఉద్గీత ను పరిపుష్ట ం చేయటం లో దాని పాత్ర వివరణ ఉన్నది .
వేద గ్రంథాలలో ఇతర దాల్భ్యుల పేర్లు కూడా కనిపిస్తా యి .అందులో కేశి దాల్భ్యుడు ఒకడు .ఈయనపాత్రా కురు పా౦చాల నేపధ్యం ఉన్నదే
.కేశి దాల్భ్యుడు పా౦చాలుడు ,బ్రా హ్మణుడు కాదు యాగ యజమాని,క్షత్రియుడు .ఒక్కో సారి రాజుగా కనిపిస్తా డు .ఈయనకు సంబంధించిన
గాథలు వేద మంత్రఉచ్చారణ ,శాపాలు గురించే .కర్మకాండలో యదార్ధ కర్మకాండ గురించిన చర్చలలో ఈయన ఉంటాడు .అందులోని
జైమినేయ బ్రా హ్మణం 3.312 లో కేశి దాల్భ్యుడు తనకు 12 రోజుల కర్మకాండ నేర్పిన కబంధ ఆధర్వణుడి మధ్య చర్చ ఛందస్సు మార్పు పై
జరిగింది –‘’వ్యూఢ ఛందసం ద్వాదశాహం ప్రవాచ ‘’.ఈ విజ్ఞా న పరీక్షలో పాంచాలురకే విజయం దక్కింది .వారు బీదవారైనా ,వారి జీవన
విధానం మిగిలినవారికి బాగా నచ్చింది –తస్మద్ అనాధ్యయామపి ,సారం పాంచాలనాం అభ్యేఏవాన్యేజీవితం ధన్యంతి ‘’.
కబంధ అథర్వణ౦ కేశి ని కర్మకాండ విషయగ్రా హిగా,దాల్భ్యుని అధర్వ వేదం అనుయాయిగా కలిపింది . అథర్వ వేదం లోని మూడు
మంత్రా లు 6.75-77 కబంధుని పేర ఉన్నాయి.అంతేకాక ఉపనిషత్ ద్రష్ట గా బృహదారణ్య ఉపనిషత్ చెప్పింది-3.7.1 ప్రకారం కబంధ
ఏవిధంగా పాంచాల ఆరుణి భార్యను స్వంత౦ చేసుకోన్నాడో చెప్పింది. గ౦ధర్వ రూపంలో ఆమెద్వారా శ్రో తలకు కర్మజ్ఞా న బో ధ చేసినట్లు న్నది
.దీనివలన గంధర్వులకు శక్తివంతమైన కర్మకాండ రహస్యాలు తెలుసు అని అర్ధ మౌతుంది .ఇందులో ముఖ్యవిషయం రెండు ప్రపంచాలను
వాటిలోని సకల జీవరాసులను సూత్రం చేత ఒకదానితో ఒకటి బంధించటం ఉన్నది .నిర్దేశికుడైన అంతర్యామి ఈ మూడు సత్తా మాత్రా లను
గోపథ బ్రా హ్మణం లో కబంధుని కొడుకు విచారి పేరు రెండు సార్లు వస్తు ంది .మొదటి అధ్యాయం 1.2.10 లో కొడుకుఆకలి గొన్నవాడిగా
చెప్పింది .రెండవ చోట 1.2.18 విచారిని కర్మకాండ నిష్ణా తుడిగా ,మదించి పొ గరుతో ఉన్న పెంకె గుర్రా న్నిశాంత్యుదక పవిత్ర జలం తో
సాధువుగా మార్చినవాడి గా చెప్పింది –.ఆ గుర్రమే అగ్నాధ్యేయం కు అవసరమైనది .ఈ గుర్రా న్నే భయంకర జలంనుంచి వాక్ ద్వారా
సృష్టించారు .ఇందులో బక దాల్భ్య కథకు జైమినేయ అశ్వమేధ కథకు దూరపు సంబంధం కనిపిస్తు ంది .ఒక అహంకార బ్రా హ్మణుడు
పాండవులకు అలవికాని యాగాశ్వాలను శాంతిపరచటం ,పో యిన ఆ యాగాశ్వాలు తిరిగిలభించటం సమానమైన కథలు .
బక దాల్భ్యుడు -3
కేశి దాల్భ్యుని విషయం లో ఇద్ద రు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ సామాన్యంగా కనిపిస్తు ంది .ఈ కథలలో కేశి
ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తా రు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తా యి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని
వృత్తా ంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే వ్రా త్యలేక సత్ర బృందాలతో కనిపిస్తా యి .
మైత్రేయని సంహిత లో కేశి దాల్భ్యుని కి అతని ప్రత్యర్దిఖాన్డిక ఔధారి కిమధ్య జరిగిన విషయం ఉన్నది -1.4.12 .. ఈ
ఇద్ద ర్నియజమానులుగా పేర్కొన్నది .ఒక రోజు గంధర్వులు అప్సరసలు కేశి దాల్భ్యుని యజ్ఞ ం చేసేవాడు అతని ప్రత్యర్ధి స్థా యి పొ ందటం
ఎలాగో తెలుసా అని అడిగారు .అది సర్వం తనకు తెలుసు అన్నాడు .అయినా వారికి సంతృప్తి కలగలేదు కారణం ఆ సత్తా తమకు మాత్రమె
ఉన్నదికనుక .చివరికి వారు ఒకయాగం చేసి కేశికి సమర్పించగా ఖా౦డికుడిని ఓడించాడు .ఈ విషయంలో కేసి ప్రత్యర్ధిని ఓడించినా ,గ౦ధర్వ
మరో చోట అంటే బో ధాయన శ్రౌ త సూత్రం -17.54 లో కూడా వీరిద్దరి మధ్య వైరంకనిపిస్తు ంది .అది అధర్వవేద విషయం లో .అభిచార అనే
కేశి యజ్ఞ ం లో అంటే భూత ఆవాహన తో కేశి ఖాండికుని మంత్రం ముగ్దు డిని చేశాడు –‘’కేశి హా యత్ర ఖాన్డి కం అభిచాచర ‘’.శతపథ
బ్రా హ్మణం ఈ ప్రత్యర్దు లమధ్య మరో వేరే కథ చెప్పింది 11.8.4.ఇక్కడ కేశి ఒక సత్రయాగం లో గ్రహపతిగా చెప్పింది.సత్రయాగాలు కర్మకాండ
తెల్సిన రెండు బృందాల మధ్య జరుగుతాయి కానీ ఇక్కడ కేశి ని క్షత్రియుడుగా పరిచయం చేశారు .కేశి బృందం యొక్క సామ్రా జ గోవు ను
పెద్దపులి చంపితే దానికి వారు ప్రా యశ్చిత్త ం చేసుకోవాల్సి వచ్చింది .ఇది తెలిసినవాడు ప్రత్యర్ధి బృంద నాయకుడు ఖాన్దిక ఔద్భారి ఒక్కడు
మాత్రమె .కేశి ఆయన్నుకలిసి ప్రా యశ్చిత్త ం జరిపించమని కోరాడు .ఖాన్డి కుడు ధర్మ సంకటం లో పడి పో యాడు .ఆ రహస్యం చెబితే కేశి
బృందం ఈ లోక విజేత అవుతాడు తాను మరోలోక విజేత ఔతాడు .చెప్పకపో యినా అంతే.చివరికి ఆ ప్రపంచమే కావాలనుకొని ఖాన్డికుడు
కేశి కి ప్రా యశ్చిత్త కార్యం మంత్రా లతో నిర్వహించాడు .11.8.4.6.దీనితో కేశి తనయాగాన్ని కాపాడుకోగలిగాడు.ఈకథ ద్వారా కేశినులు ఇంకా
వీరిద్దరి వైరం జైమినేయ బ్రా హ్మణం లో రెండు సార్లు వస్తు ంది .కేశి దాల్భ్య లేక దార్భ్య మరియు ఖండిక ఔద్భారి లమధ్య పాంచాల భూమి
యాజమాన్యం పై తగాదా వచ్చింది -2.122 మరియు 2.279.-‘’పాంచాలేషు పస్ప్రధాతే’’.2.279-,280 ప్రకారం వీరిద్దరిలో ఖాన్దికుడు
బలీయుడు ,శక్తివంతుడు –‘’సహా ఖాన్డికా కేశినం అభి బభూవ ‘’అయినా కేశి వెంటనే మేనమామ కౌరవ ఉచ్చ్రైశవ
్ర సు ఆశ్రయం
పొ ందాడు.ఇక్కడా వీరిద్దరికీ ఈలోకం పరలోకం పై అధికారం పైనే స్పర్ధ .మేనల్లు డిని దేనిపై పెత్తనం కావాలని అడిగితె ,ఈలోకంపైనే అని
చెప్పాడు కేశి .కనుక మూడు రోజుల అంతర్వసు అనే సో మయాగాన్ని మేనల్లు డు కేశితో చేయించి శక్తిమాన్ ను చేసి ఖా౦డికుని బయటికి
పంపించేశాడు .
ఇలాంటిదే మరో స్పర్ధ వీరిద్దరి మధ్య జరిగినట్లు జైమినేయ బ్రా హ్మణం 2.122-124 తెలిపింది .ఖాన్దికుడు తాను
‘’సద్యాహ్క్రి’’నిర్వహించబో తున్నట్లు ప్రకటించాడు -‘’సహా ఖాన్డికః కేశినం అభి ప్రజిఘాయ-సద్యహ్క్రియయా వై స్యో యక్షతా ఇతి ‘’.కేసి కి
ఈసారి బ్రా హ్మణ బృందం సలహా ఇవ్వగా వెంటనే ‘’పరిక్రీ ‘’అనే సో మయాగం చేశాడు .దీనితో మళ్ళీ కేశి విజయం సాధించి ఖాన్డి కునికి
పుట్ట గతులు లేకుండా చేశాడు .కేశి దాల్భ్యుని పక్షాననిలబడిన నలుగురు బ్రా హ్మణులు- కేశి సత్యకామి ,ఆహీనస్ ఆశ్వత్తి ,గాన్గి నా
ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు
.లుసాకపి ఖార్గ లి ఏవిధంగా కేశి ‘’వంశ వ్రశ్చన’’పాంచాలుర ను మూడు రెట్లు పెంపు చేసింది వివరించాడు.పంచ వింశ బ్రా హ్మణం -17.4 లో
కూడా లుసాకపి పేరు వ్రా త్యఖండం లో వస్తు ంది .ఇందులో అతడు జ్యేష్ట వ్రా త్య నిపుణ బృందాన్ని శపించినట్లు న్నది . కేశి సత్యకామి పేరు
కేశిదాల్భ్య విషయంలో తరచుగా వస్తు ంది .తైత్తి రీయసంహిత 2.6.2.3 ప్రకారం కేశి దాల్భ్యుని యాగానికి సత్యకామి ముఖ్య
నిర్వాహకుడు .ఇతడు కేశి దాల్భ్యుని వ్యతిరేకులను జయించటానికి 7 పాదాల ప్రత్యేక ‘’శక్వారి ‘’మంత్రా లు చదువుతానని వాగ్దా నం
చేశాడు .మైతయ
్రే సంహిత -1.6.5.ప్రకారం అగ్ని హో త్రం, అగ్జ్న్యా ధ్యేయం విషయం లో మళ్ళీ ఈ ఇద్ద రూ కనిపిస్తా రు.కాని
వారిపాత్రలు నిర్దు ష్ట ంగా లేవు.కాని సత్యకామి ,కేశి తో తామిద్ద రూ కలిసి ఒకప్పుడు అగ్ని హో త్రు ని భోజన శక్తిని అగ్న్యా ధ్యేయం
ఈ ఇద్ద రితో పాటు ఆశ్వత్తి పేరుకూడా వస్తు ంది .జైమిని బ్రా హ్మణం -1.285 ఆశ్చర్యంగా ఇద్ద రు కేశి ల పాత్రలు మారుతాయి .కేశి ,ఆహీనస్
ఆశ్వత్తి లు క్షత్రియ సత్యకామతో పో టీపడతారు .వీరిలో కేశి చిన్నవాడు ,ఆశ్వత్తి పెద్దవాడు .ఇద్ద రూ బ్రా హ్మణులే .ఆహీనసుడు సత్యకామికి
పురోహితుడు .అయినా అనుష్టు ప్ ఛందస్సులో తనకున్న పరిజ్ఞా నం బట్టి కేశి దాల్భ్యుడు క్షత్రియ హృదయం ఆకర్షించి ఆహీనసుడి నుండి
లాగేసుకొన్నాడు .పాత్రలు మారినా కేశి చిన్నవాడైనా మొదట్లో విజయం సాధించాడు -3.312.కర్మకాండ పరిజ్ఞా నమే విజయ నిర్ణ యం కనుక
బృహత్ సార సంహిత 18.26 లో పాంచాలుర యాగానికి కురు బ్రా హ్మణ కుమారులు వ్రా త్య దాడి గా వెళ్ళారు .పెద్దలకు అగ్నిస్టో మం
,చిన్నవారికి ‘’ఉఖ్త్యా ‘’చెప్పబడినాయి .కథ ప్రా రంభానికి ముందు దేవతలు, దేవ వ్రా త్యులు రెండు యాగాలకు పేర్కొనబడ్డా రు. కురు బృందం
తమ స్త పతి ‘’ఔపో దితి గౌపాలాయన ‘వైయాఘ్ర పద్య కేశి దాల్భ్యుని ఉపవసత అగ్ని వద్ద కు ఎలా వచ్చాడో భూ వ్రా త్యుడు వివరించాడు
.మర్నాడు వారు పాంచాలురు అప్పటికే చేస్తు న్న యాగం లో జోక్యం కలిగించుకొని ‘’బహిస్పవమాన ‘’తో పవిత్రు లమౌదామనుకొన్నారు
.చివరికి వ్రా త్య చెప్పిన దానికి ఆధార విషయం చెప్పలేక కురు బృందం ఓడిపో యింది .ఈ ప్రశ్న సంధించిన వాడు పా౦చాల బ్రా హ్మణ
కుమారుడు .దీనితో ఈ యాగ నిష్ణా తుడు’’ గంధర్వాయన వాలేయ అగ్ని వేస్య’’ కురు బృందాన్ని శపించి ,వారి దండయాత్రకు
అనుమతించిన పెద్దలను హెచ్చరించాడు .వీళ్ళు ఊరుకొంటారా వీళ్ళూ గంధర్వాయన ను శపించారు .ఈ వృత్తా ంతం లో కేశి పాత్ర
ముఖ్యమైనదికాదు.కాని వ్రా త్యబృందం కార్యకలాపాలు మళ్ళీ పాంచాలురు,ఒకరిపై ఒకరు పో టీగా చేసిన యాగాలలో తెలుస్తా యి .ఏతా వాతా
ఇవేకాక కేశి విషయం లో అనేక ఆసక్తికర విషయాలున్నాయి .కేశిదాల్భ్యుని ఎక్కడా బకదాల్భ్యునిలాగా సామవేద నిష్ణా తుడు అని
ప్రత్యేకించి చెప్పలేదు .కొన్ని సందర్భాలలో వేదగానం పో టీ పడటానికే కాక ప్రత్యేకత కూడా ఉన్నది .పంచ వింశ బ్రా హ్మణం 10.8.లో ‘’వార
వంత్య సామం ‘’సో మ పురుష రూపంతో కేశి దాల్భ్యునికి దర్శనమిచ్చింది .కాని మంత్రో చ్చారణ లో నిర్దు స్ట త లోపించింది అని చెప్పగా కేశి
తనప్రక్కనే హవిర్ధా న బండిలో ఉన్న’’ఆలమ్మ పరిజ్ఞా త’’ ను ‘’వార వంత్య’’సామ గానానికి తన ఉద్గా త గా ఎంచుకొన్నాడు –‘’అలమ్మ
మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి ,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లు డి విచారం
పో గొట్టి అదృశ్య మంత్ర శక్తిని బో ధించి దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సో మయాగం చేసి మంచి ఉద్గా తను ఎంచుకోమన్నాడు
.అలాగే 12 రోజుల యాగం మొదలుపెట్టి ‘’వ్యూధ ఛందస్’’మంత్రా లు ఉచ్చరించటానికి తగిన వాడికోసం తిరిగి స్మశానం లో పడిఉన్న
‘’ప్రా త్రదభాల్ల ‘’ ను చూశాడు –‘’స్మశానే వా వనే వావృతి శయనం ఉపాధవయాం చకార .’’అతడు అదృశ్యమంత్రో చ్చారణ నిర్దు ష్ట ంగా
చేయగలడని అతడినే తనయాగానికి ఉద్గా తగా ఎంచుకొన్నాడు కేశి దాల్భ్యుడు .ఈ కొత్త వాడిని కురుపాన్చాల బ్రా హ్మణులు అంగీకరించక
‘’కస్మా ఆయం ఆలం ‘’అంటే ఎవరి మంచికోసం అని ప్రశ్నించారు .కేశి అతడినే ఎంచుకొని ‘’తగినట్లు మంత్రో చ్చారణ చేయగలవాడు ‘’అనే అర్ధ ం
వచ్చేట్లు ‘’ఆలమ్యైలా జ్యోద్గా త ‘’అని పేరుపెట్టా డు .ఆలం మహ్యం - అలమ్మ అయింది –ఆలం ను వై మహ్యం ఇతి తద్ అలమ్మస్యాల మత్వం
‘’.
ఈ కొత్త వాడిని కురుపాన్చాల బ్రా హ్మణులు ఒప్పుకోలేదు .కనుక ఇప్పుడు కర్మకాండ నిష్ణా తులమధ్య పో టీ యే కానిఇక్కడ
యజమానులమధ్యకాదు అని తెలుస్తో ంది .ఈకథలలో ముఖ్య విషయం అలాంటి నిష్ణా తుడు స్మశానం ,సుదూర సముద్ర దీవి లలో సో మ
రధం ప్రక్కన ఉన్న గొడ్డ లి దగ్గ ర కనపడటం సామాన్య విషయం . వీళ్ళు అచేతన స్థితిలో కనపడటం కూడా గుర్తించదగిన విషయం .బకుడు
కేశి దాల్భ్యుని వృత్తా ంతం బంగారు పక్షి కథలో కూడా వస్తు ంది .కౌశీతకి బ్రా హ్మణం 7.4 జైమిని బ్రా హ్మణం 2.53-54,వాధూలస 37 లో
కూడా ఉన్నది .కౌశికతమ్ లో ‘’హిరణ్మయ శకునం ‘’అంటే బంగారుపక్షి ఎగురుకొంటూ కేశి దాల్భ్యుని దగ్గ రకు వచ్చి తనకు
పవిత్రీకరించుకోవటం ఎలాగో తెలియదు అని చెప్పింది –‘’అదీక్షితో వా అసి ‘’.తనకు ఆ రహస్యం తెలుసుకాని ఆహూతులను పాడైపో కుండా
ఉంచటం ఎలాగో తెలీదన్నది .అప్పుడు ఇద్ద రూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞా నం మరొకరికి తెలుపుకొన్నారు .ఈ రహస్యాన్ని తాను
శిఖండియజ్ఞా సేన రుషి నుంచి గ్రహించానని స్వర్ణ పక్షి చెప్పింది .కౌశిక బ్రా హ్మణం 7.4.1.దీక్షలోఉన్న సాంకేతికత ,తర్వాత ఇచ్చిన
ఆహూతులు పాడుకాకుండా కాపాడుకోవటం చెప్పింది -‘’సక్రదిస్టస్యా క్షితిః’’.జైమినేయం లో ‘’ఇస్టా పూర్త స్యాక్షితిం’’అని ఉన్నది.
ఇదే కథవేరొక చోట మరో రక౦గా ఉంది .జే.బీ .2.53 లో కేశి దాల్భ్యుడికి ప్రతిష్ట జ్ఞా నం తెలీక దర్బలు ,ఆకులు మధ్య కూర్చుని దీక్ష చేశాడు
–‘’కేశిహా దాల్భ్యో దర్భ పర్ణ యోర్ దిదీక్షే’.అప్పుడు పక్షి వచ్చి తాను పూర్వ పా౦చాలరాజు కేశికి ముందు ,ఇప్పటిరాజు సుత యజ్ఞ సేన
అని చెప్పింది –‘’అహం ఏతస్యై విషస్త ్వత్పూర్వో రాజాసం ;.ఆపక్షి మొదలుపెడుతూనే కేశిని ‘’శూని ‘’అంటే వ్యభిచారి,తిరుగుబో తు గా
సంబో ధించగా మండి తాను పూర్వం పంచాలరాజు నని ,వయసులో పెద్దవాడినని ,దీక్షలో ఉన్నాననిచెప్పాడు తర్వాత విషయం అంతా ఇది
వరకుకథల్లో లాగానే .
వాధూలస 37 లో సుత్వ యజ్ఞ సేన తాను పూర్వ శ్రంజ రాజు నని,దీక్ష విధానం తెలుసునని ,నాశనం కాకుండా ఉండే విధానం తెలియదని
చెప్పి బంగారు పక్షిగా మారి ఆహూతులను తినటానికి కేశి దగ్గ రకు వచ్చి పాన్చాలయువరాజా –‘’కేశి పాన్చాలరాజో యువతారా ‘’అని
పిలిచి,ఇద్ద రూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞా నం మరొకరికి అందజేసుకొన్నారు .ఇప్పటిదాకా చెప్పుకొన్న కేశి దాల్భ్యుడు క్షత్రియరాజు అని
అర్ధ మౌతోంది .
బకదాల్భ్యుడు మాత్రం- యాగ నిష్ణా తుడైన బ్రా హ్మణుడు .మరొక చోట బకుని వ్యతిరేకులు అజకేశినుల బృందం .ఇక్కడ జరిగిన క్విజ్ లో
బకలేక గాలవ గ్లా వ్యమైత్రేయ ఓడిపో తాడు .వేదకాలం తర్వాత బక,కేశి లపేర్లు రాక్షసుల లో కనిపిస్తా యి .
బక దాల్భ్యుడు -6
కేశి అంటే పొ డవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధా లున్నాయి .దీర్ఘ కేశాలు పట్ట రాని శక్తికి,బ్రహ్మచారికి సంకేతం .యాగ
బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం
చేయలేదు .జైమినేయ బ్రా హ్మణం లో కేశి కి మరోపేరుగా ‘’శీర్ష్యాన్యః ‘’అని ఉన్నది అంటే తలపైన ఉండేవి .కనుక తలకాయకు కేశికి
అవినాభావసంబంధం ఉందనితెలుస్తో ంది .శతపధ బ్రా హ్మణం లో కేశి శబ్ద ం కేశి దాల్భ్య వంశీకులుగా చెప్పింది .కాని కథక సంహిత మాత్రం
ఒక్కడే కేశిగా పేర్కొని సో మయాగం లో శత్రు వులను ‘’ఆషాఢ కైశి ‘’సాయంతో ఓడించినట్లు ఉంది .ఇందులో కేశి బృందం అంటే పాంచాల కేశి
బృందం ఓడిపో యింది .వీరు నైరుతిభాగపు కౌంతేయులవలనఓడారు .అప్పుడు యాగం చేసినవాడు’’ శ్యాపర్ణ సాయకాయనుడు’’ తతః
ఋగ్వేదం 10.136 మంత్రం దీర్ఘ కేశి ఐన కేశికి అంకితం .భగవత్ ప్రేరణపొ ందిన మునీశ్వరులు గాలిలో ఎగురుతున్నట్లు చెప్పబడింది
10.136-2-‘’మునయోహ్వాతరాశానాః వాత శ్యాను ద్రా జీం యంతి’’.ఋగ్వేదం 10.136-6 లో కేశి ప్రజల మానసిక విషయాలు
తెలుసుకోవటానికి అప్సరస, గ౦ధర్వ మార్గ ం లో సంచరి౦చాడని,ఉన్నది –‘’అప్సరసాం గంధర్వానాం మార్గా నం చారణేచరన్ –కేశి కేతస్య
విద్వాన్ ‘’.ఋగ్వేదం లో కూడా కేశి కి ఆకాశ చారణం ఉన్నట్లు చెప్పబడింది .మానవ జ్ఞా నం కంటే విశేష విజ్ఞా నం ఉన్నవాడు .అప్సరస
గంధర్వుల యాగ రహస్యాలు గ్రహించి తనకు తెలిసినవి వారికి చెప్పాడు .వీరితోనేకాక వన్య మృగాలతో నూ దో స్తీ ఉండేది .మరికొన్ని
బక దాల్భ్యుడు -7
ఋగ్వేదం 10.136.1 లో కేశిని అగ్ని వాహకుడిగా ,విషవాహకుడుగా ,రెండులోకాల వాహకుడుగా చెప్పింది-‘’కేశిన్ ఆగ్నిం కేశి విషం ,కేశి
భిభర్తి రోదశి’’.వ్రా త్యులను విష బక్షకులుగా పేర్కొన్నారు చాలాచోట్ల .పిబి 17.1.9’’గరగిరో వా –‘’.ఇదేమంత్రం లో కేశి విషాన్ని రుద్రు నితోపాటు
అదే పాత్రతో తాగాడు -10.136.7.’’కేశి విషస్య పాత్రేన యద్ రుద్రేనా పిబత్ సహా ‘’.మరోచోట భూమి ,స్వర్గ ం కేశి పై ఆధారపడి ఉన్నాయి
.ఈభావమే బ్రా హ్మణం లో కర్మకాండ విషయాలలో వచ్చిన సందిగ్ధం గా చెప్పి కేశిని ముఖ్యపాత్రగా చూపింది .ఈలోకం ,పరలోకం భవిష్యత్
ఇతర దాల్భ్యులు –బక,కేశి దాల్భ్యులతోపాటు ఇతరవైదిక పాత్రలు దాల్భ్య /దార్భ్య ఉన్నాయి .వీరే రథ వీతి,రధ ప్రో త ,చైకితాయన లేక
బ్రహ్మదత్త చైకితాయన మరియు నాగారి . వీరికి ఒక్కో కథ మాత్రమె ఉన్నది .ఈ పేర్ల వెనుక వీరివ్యక్తిత్వానికి సంబంధించిన విషయం
ఉండటమే కాక ఇతర దాల్భ్యులతో సమానమైన కొన్ని విషయాలుంటాయి .రథవీతి దార్భ్యుడు రుగ్వేదమూలాలున్నవాడు .ఇతనిపేరు
5.61.17-19 లో ఉన్నది .ఈమంత్రా లకు వ్యాఖ్యానాలున్నాయి .బృహద్దేవత –రథ వీతికధను ‘’శ్యావాశ్వ ‘’ఉపాఖ్యానం లో చెప్పాడు .ఋగ్వేద
కథనం ప్రకారం అవి మరుత్తు లకు అంకితంగా చెప్పబడిన ఇతిహాసమంత్రా లు.ఇందులో మొదటిది శ్యావాశ్వ రాత్రి దేవతను ఉద్దేశించి చేసిన
స్తు తి .ఇది గిరో రథి అయిన దార్భ్యుని చేరాలని కోరుతాడు .మిగిలిన రెండుపాదాలు దార్భ్యుడిని తన పో షకుడు,గోమతి నది వద్ద ఉన్న
పర్వతాలలో ఉండే సో మయాజి రథవీతి గా చెప్పాయి .ఋగ్వేదం లో మనం చెప్పుకొన్న పై మంత్రం ప్రకారం రథ వీతి దార్భుని రాజర్షిగా
చెప్పింది .యితడు యాగం చేయగోరి అత్రి మహర్షిని దర్శించిఆయనకుమారుడు అర్చానస ఋషిని నేతృత్వం వహించమని కోరాడు
.అర్చానసుడు తనకుమారుడు అంతగా నిష్ణా తుడుకాని శ్యావశ్వ తో వెళ్లి ,యాగం జరిపిస్తూ , రథ వీతి కూతురిని చూసి ,తండ్రీకొడుకు
ఇద్ద రూ ఆమెను పెళ్ళాడాలనుకొన్నారు .ఈ పెళ్ళి కి రాజు అంగీకరించినా రాణి అడ్డు చెప్పింది-కారణ౦ శ్యావశ్య అసలైన రుషికాడు అని
.యాగ౦ యిపో యాక పెళ్ళికి తిరస్కరింపబడిన తండ్రీకొడుకులు ఇంటికి బయల్దే రారు .దారిలో వారికి విడదశ్వ రుషి పుత్రు లైన ఇద్ద రు
రాకుమారులు కనిపించారు .ఇందులో ఒకరికి రాణి ఉన్నది . చివరికి శ్యావశ్వ ఋషియై మంత్ర వేత్తకావాలను కొన్నాడు .మొదట
మరుత్తు లను స్తో త్రంతో ప్రసన్నులను చేసుకొని బంగారం కవచాలు పొ ందాడు .చివరికి రాత్రిదేవత దగ్గ రకు వెళ్లి స్తో త్రా లతో మెప్పించి ,ఆమె
రధప్రో త దార్భ్యుడు పేరుతొ మరో దార్భ్యుడు మైత్రా యణి సంహిత లోకనిపిస్తా డు . దుర్వాసనకొట్టే ఒకమనిషికి అది పో గొట్టేవిషయం లో
వస్తా డు .దీనికి విరుగుడు అగ్ని సురభిమతి కి 8 భాగాల హవిస్సు సమర్పించాలి. ఈ యాగ౦ రథప్రో త దాల్బ్యుడు కోసమే .ద్వంద్వ
కౌలాకవతి చెప్పినదాన్నిబట్టి ఇద్ద రు నిర్వాహకులను ఏర్పాటు చేశారు .ఇదేకాకుండా మరో రథప్రో తుడు వాజసనేయ సంహిత 15.17
పశ్చిమ దిక్కు దేవతగా చెప్పబడ్డా డు .15.15.19 మంత్రా లలో దిశాధిపతులు, వారి రక్షకులు,ఇద్ద రు అప్సరసలు చెప్పబడ్డా రు
బక దాల్భ్యుడు -8
చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తు లు ,లేక బ్రా హ్మణాలలో వినిపిస్తు ంది.వారు ఒకరుకాదు ఇద్ద రు
అనిపిస్తు ంది .ఛాందో గ్య ఉపనిషత్ -1.8-9 లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య పేరు వస్తు ంది .కనుక
బ్రహ్మదత్తు డు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గా త విషయ చర్చలొ ఈపేరు వచ్చింది.ఈచర్చ ముగ్గు రు సామవేద
నిపుణులు –చేకితాన దాల్భ్య ,శీలక సాల్వావత్య ,ప్రవాధన జైవాలి మధ్య జరిగింది .మొదట శిలాక -చైకితాన్యుని సామవేది మరోలోకానికి
వెళ్ళటానికి ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తా డు . స్వర్గ ం సామవేద మాధుర్యానికి నిలయం కాదని శిలాకుని భావం .మరోలోకం వెళ్ళినవాడు
మళ్ళీ ఈలోకానికే రావాలి అనీ అంటాడు .ఈ రెండిటిని త్రో సిరాజని రాజు ప్రవాహనుడు ఉపనిషత్ ను౦చి ఉదాహరణ ఇస్తా డు .అంతేకాక ఈ
లోకం ఆధారభూతం కాదనీ ,చివర ఆధారం ఆకాశం లో ఉందని ,అదే అంతరిక్షంలో ఉండే బ్రహ్మం అనీ వివరిస్తా డు
బక దాల్భ్యుడు -9
ఇక్కడ చేకితానుడు ఉద్గా త విషయం లో అపరిపక్వ దశలో ఉన్నట్లు తెలుస్తు ంది .బ్రహ్మదత్త చైకితాన్య కు కొన్ని ప్రత్యేక సామాలు
పలకటం లో సరైన సామర్ధ ్యం లేదని తెలుస్తో ంది .కురు దేశీయులు కూడా బ్రహ్మదత్త సామర్ధ్యాన్ని మెచ్చలేదు .పై అధ్యాయం లోనే రాజు
జైవాలి మరొక గాలూనస అర్క శాక్యాయన అనే సాలావాత్యతో కలిసి చర్చించాడు .జె .యు. బి.1.59 లో చైకితాన్యుడిని బ్రహ్మదత్త గా
ఉద్గా తగా చెప్పబడింది .బ్రహ్మదత్తు డు కురు యాగనిపుణుడు అభిప్రతారిన కాక్ష్యసేనిని కలిసినట్లు ,శౌనక పౌరోహిత్యాన్ని’’మధుపర్క కాండ’’
లో కాదన్నట్లు ఉన్నది .అవమానపడిన శౌనకుడు సామవేద జ్ఞా నంపై ప్రశ్నలు సంధిస్తే ,బ్రహ్మదత్తు డు ప్రతిదానికీ అద్భుతమైన
సమాధానాలు చెప్పాడు .ఇక్కడకూడా ప్రత్యర్ధు లు కురు దేశం వారే .కనుక బ్రహ్మదత్త చైకితాన్యుడు పా౦చాలుడు అని అర్ధ మౌతోంది.
బృహదారణ్యక ఉపనిషత్ 1.3.24,జెబి1.337-38 లలోకూడా ఉదంతాలున్నాయి మొదటి దానిలో దాల్భ్యుని పేరు లేదు .అక్కడ యాగ
వేదాంతం,ఉద్గా త స్వభావం లపైనే చర్చ .ఇందులోనే 1.3.24 లో బ్రహ్మదత్తు ని సామవేత్తగా సో మరసం త్రా గినవాడిగా చెప్పింది .ఇక్కడా
ఉచ్చారణ విషయ చర్చమాత్రమే .బ్రహ్మదత్త స్వావాస్య మాధుర్యం తో చేసిన గానం పై ,గాలూనులు అభ్యంతరం చెప్పగా ,అతడు దానికి
మూలం వివరించాడు .ఇక్కడకూడా శ్వావాశ్వుడు అర్కానసుడికొడుకుగానే చెప్పబడి,సమిధలకోసం బయటకు వెడితే ,అతని స్పర్ధ దారులు
సత్రయాగం చేసి స్వర్గ ం చేరారు –ప్రా తిసత్రా నః ‘’.అక్కడినుంచే స్తో భగానం చేస్తూ ,అతడినీ రమ్మని పిలిచారు .వీటన్నిటిలో ఒకే దాల్భ్యుడు
అనేక సందర్భాలలో కనిపిస్తా డు .బ్రహ్మదత్త సత్రయాగ బృందం లో ఉన్నాడని చైకితాన్యుడు సామవేదగాన నిపుణుడు అనీ ,సత్రయాగంలో
స్తో భ గానం చేసేవాడని తెలుస్తో ంది .శ్వావశ్వకూడా ఈయాగం చేసేవాడే .ఒక శ్యావశ్వ రహవీతిదార్భ్య అనే పేరున్న యాగ యజమానికూడా
.
బక దాల్భ్యుడు -10
ద్వైతవన౦ లో బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రా హ్మణుల ప్రా ముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా
బ్రా హ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట ్ర విషయం లో బ్రా హ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది
.జైమినేయ అశ్వమేధ౦ లో అతడు ఉత్త ర సముద్ర మధ్య లోని దీవిలో, వేదకాలానంతరం సరస్వతీ నదీతీరం లోనూ ,అరణ్యమధ్య౦ లో
ఉన్న ద్వైతవనం లోనూ కనిపించాడు ,.భారతం అరణ్య పర్వం 193 అధ్యాయం లో మార్కండేయ మహర్షిని బకరుషి దీర్ఘ కాల వయసు
బకదాల్భ్యుడు మార్కండేయునితో తాను చూసిన 20 మంది ప్రముఖ బ్రా హ్మణులలో ఒకడుగా వారంతా చనిపో యినట్లు గా చెప్పాడు .
మార్కండేయ సమావేశం లో ధర్మరాజు ఆయన్ను బక విషయం పై చాలాసార్లు అడిగాడు . అధ్యాయం 4 వ శ్లో కం లో ఋషిని తాను
‘’బక,దాల్భ్యులు మహా విద్యావేత్తలని,చాలాకాలం జీవించారని విన్నాను’’అని చెప్పాడు –బకదాల్భ్యా మహాత్మానౌ శ్రు యేతే చిరజీవనౌ
దేవరాజస్యాతావ్ రుషి లోక సమ్మతౌ’’.ఇక్కడ ఇద్ద రూ వేరు వేరు గా చెప్పబడ్డా రు కాని ఇది పొ రబాటు ఒక్కరే బకదాల్భ్యుడు.
ఒకసారి ఇంద్రు డు అసురులతో యుద్ధ ం చేసి అలసి కిందకు చూస్తె అద్భుతమైన జల వనరులున్న రుషికుటీరం కనిపిస్తే కిందికి దిగి అది
బకదాల్భ్యుని ఆశ్రమ౦ గా తెలుసుకొన్నాడు .అది తూర్పు సముద్ర తీరాన ఉన్నది –‘’పూర్వస్యాం దిశి రమ్యాయాం సముద్రా భ్యషతో’’ –
భారతం -3193.13.ఇంద్రు నిరాకకు సంతోషించి ఎంతోకాలానికి ‘’కృష్ణ ’’ సందర్శనం కలిగిందని సంతోషించాడు జైమినేయ అశ్వమేధం -
60.12-13.ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు .అనంతరం ఇంద్రు డు ఆయనను దీర్హకాలం జీవించటం లో ఉన్న కస్ట సుఖాలేమిటి అని అడిగాడు
3.193.15,17-27.బకుడు దీనికి సమాధానం దాటేసి ఆధ్యాత్మిక నీతి విషయాలు చెప్పాడు .స్వతంత్ర జీవనంలో సౌఖ్యం చెప్పి బ్రా హ్మణ
అతిధులకు అన్నం పెట్టటం లో ఆనందం ఉందన్నాడు .ఇక్కడ మళ్ళీ మనకు ధర్మశాస్త ్ర విలువలకు కట్టు బడే బ్రా హ్మణాభిమాని
బకుడుకనిపిస్తా డు . ఇవన్నీ చూస్తే,బకుడు మార్కండేయునికి ప్రత్యర్ధి అనిపిస్తా డు .చాలాకాలం జీవించి మార్కండేయ చిరంజీవి స్థా నాన్ని
బకదాల్భ్యుడు కైవశం చేసుకొన్నాడు .మరో విషయం పరిమిత జ్ఞా నం ఉన్న బక దాల్భ్యుడు లాంటి వారికి మార్కండేయుడు’’ మోడల్ ఫిగర్’’
జైమినేశ అశ్వమేధం లో బకదాల్భ్యుడు వటపత్ర శాయి ని కూడా చూసినట్లు ఉన్నది .బకుడు నదీ తీరం లోకాక సముద్ర మధ్యమం లో
తపస్సు చేశాడు .ఒక ఉభయ చరం సహాయం తో అక్కడ తలపైఒక ఆకు పెట్టు కొన్న ఒక ఋషిని చూశాడు ఇది మార్కండేయం తో
సరిపో తోంది .మార్కండేయం లో ఆదిమ సముద్రం లో వటపత్రంపై శయనించిన ఒక బాలునిఅంటే విష్ణు మూర్తి ని ఒక రుషి చూశాడు అని
పద్మ పురాణ౦ ఉత్త ర ఖండం ధృత రాష్ట ్ర ఉదంతంలో 44 అధ్యాయం లో ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’లో త్రేతాయుగ కథ చెబుతూ రాముడు
సముద్రా న్ని దాటటానికి అనేక ప్రయత్నాలు చేసి లక్ష్మణుడిని సలహా అడిగితె దగ్గ రలోనేలంకకు భూమికి మధ్య బకదాల్భ్యముని ఉన్నాడు
,ఆయన కారణ జన్ముడు ,అనేకమంది మహర్షు లతో అక్కడ ఉంటున్నాడు ఆయన్ను దర్శిస్తే ఉపాయంచెబుతాడు అని చెప్పాడు –
మహాముని కేనాపి కారణేనైవ ప్రవిస్టో మానుషిం తనూం’’. రాముడు ఆయన్ను సందర్శించాగానే ఆయన ‘’ఆదిదేవ పురాణ పురుషో త్త మ
‘’దర్శనం లభించినందుకు ఆనందించి’’ ఫాల్గు ణ బహుళ ఏకాదశినాడు ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’చేయమని చెప్పాడు .ఆ వ్రత విధానం
వివరించాడు 21-35.కాయగూరలను నైవేద్యం ,ఆవునేయి దీపారాధనలు ,బంగారు నారాయణవిగ్రహం,బ్రా హ్మణులకు దక్షిణ తాంబూలాలు
వగైరా లన్నీ ఉన్నాయి .సూక్ష్మంలో మోక్షం లాగా బకుడు చెప్పిన ఈ వ్రత ఫలం ‘’వాజపేయయాగం ‘’చేసినంత ఫలం .ప.పు -ఉ. ఖ.-
44.39.దీన్ని బట్టి మనకు బకదాల్భ్యుడు వేదకాలంలో వేదవిహిత యజ్ఞ యాగాలు చేయటమేకాక వేదానంతర కాలం లోనూ బ్రా హ్మణులతో
మహర్షు లతో కలసి సంచరిస్తూ కర్మకాండలు చేస్తూ స్థిరమైన ఆశ్రమ౦ స్థా పించుకొని జీవించాడు .అయినా ఆయనను నైమిశేయునిగ భారతం
చెప్పింది .బకుడు కనిపించిన ప్రతిచోటులోనూ నీరు ఉండటం మరో విశేషం .ఇంకో విశేషం చిరంజీవి మార్కండేయ మహర్షికంటే వృద్ధు డు
.బకదాల్భ్యుడు శ్రీరామ ,శ్రీ కృష్ణు లను చూశాడు .ఈకలయికలలో అనేక ఆధ్యాత్మక విషయాలతో పాటు బ్రా హ్మణులఎడ చూపవలసిన
ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్త గా పొ ందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణు నిపై ప్రేమ
ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను ప్రశ్నించే ముందు నమస్కారం చేయటం
మర్చిపో వటమే .మత్చ్యపురాణం 70.25,పద్మపురాణం శ్రీ కృష్ణ ఖండం -23.100.- ‘’నారద శాపేన కేశవాయచ ‘’.దాల్భ్యుడు దీనికి
పరిష్కారంగా వేశ్యలు ముక్తిపొ ందటానికి ‘’అనంగ దానవ్రతం ‘’చేయమని సలహా ఇచ్చాడు .ఈవ్రతంలో విష్ణు మూర్తిని’’ కామ దేవుని’’గా
ఆరాధించటం ఉంటుంది ..ఈ సందర్భంలో దాల్భ్యుడు వ్రతాలు చేయించటం లో దిట్టగా పరిచయం చేయబడ్డా డు .కేశవుని చేత ముందే
దాల్భ్యుడు ఆదేశి౦చ బడ్డా డు అని వారికి తెలుసు .మత్చ్య -70.18,పద్మ -23.92—ఆదిస్టో సి పురాబ్రా హ్మణ కేశవేనచ ధీమతా’’.దీన్నిబట్టి
దాల్భ్యుడు మహిమగలమహర్షి ,సమాజానికి అతీతుడు,కృష్ణ భక్తు లకు మార్గ నిర్దేశనం చేయగల సమర్ధు డు .దాల్భ్యుడుఅప్సరసలతో
మాట్లా డటం, తర్వాత భవిష్యత్తు లో యాదవ వంశం అంతా క్షయమయ్యాక గోపికలతో సంభాషించటం చూస్తె ఆయన కాలాతీతుడు అని
తెలుస్తో ంది .గోపికలుకూడా దాసులుగా చాలా జన్మలు పొ ందారు .అన్ని జన్మలలో అంటే అప్సరస జన్మలనుంచీ గోపికా జన్మలదాకా-దాస
పతనం చెందిన అప్సరసలు అనే గోపికలపేర్లు వేదం ఆర్యుల శత్రు వుల పేర్లు గా’దస్యులుగా రెండు సార్లు వచ్చాయి .పుట్టు కే లేని వీరిని
దాసులు అన్నారు .పద్మపురాణం లో దాస బదులు దాసాలేక జాలరి లేక నావికుడు అన్నారు .వీరినే సరదాకి దొ ంగలు అన్నారు .బ్రహ్మకు
శివుడు గోపికల భవిష్యత్తు చెబుతూ దాల్భ్య ప్రసక్తి తెచ్చాడు.వారి దాస్య విముక్తి సముద్రంనుంచి పుట్టిన రుషివల్ల నే సాధ్యం అన్నాడు .ఆ
పద్మపురాణం దాల్భ్యుని’’ విముక్తిదాత ‘’ఉద్ధ ర్త్రు దాసానాం ఆశ్రిత ఉత్త ర ‘’అని చెప్పింది .ఇక్కడ దాల్భ్యునికి ఉత్త ర దాసులతో పరిచయం
కొంత ఆశ్చర్యం కలిగిస్తు ంది .దేవ వేశ్యల కు విముక్తి ఎందుకు కలిగించాడో తెలియటం లేదు .దాసులు సముద్ర తీరాలలో ఉంటారుఅని
.తెలుస్తో ంది .మత్చ్యపురాణం ప్రకారం దాసులు-యాదవుల అపజయం తర్వాత కృష్ణు ని భార్యలను అపహరించి సముద్ర తీరంలో ఉంచారు
బకదాల్భ్యుడు –కొంగ
అతడికి కొంగ అంటే బక పేరు ఎందుకొచ్చింది ?పాశ్చాత్య పరిశీలకుడు పాల్ ధీం సంస్కృతంలో ఉన్న పక్షుల నామాలపై రిసెర్చ్ చేసి
అనేకరకాల కొంగల గురించి సుభాషితరత్నావలి లో ఉన్న విషయాలూ సేకరించాడు .వీటన్నిటి బట్టి బకఅంటే బూడిదరంగు బాతు- గ్రే
హెరాన్—ఆర్డియా సినేరియా -అని నిర్ణ యించాడు .కనుక మనం సాధారణంగా చెప్పే క్రేన్ అంటే కొంగ కు బక హస్తి మశకాంతర భేదం
ఉన్నదన్నమాట. బక ను మామూలు కొంగ అనటం తప్పు .ఇండో –యూరోపియన్ ఎటిమాలజి ప్రకారం బక అంటే బ్+ఆక అంటే నీటికి
నమ్మరాని కొంగ –హిందూ ధర్మ శాస్త్రా లలో ,కథా సాహిత్యంలో కొంగ ను నమ్మరానిదిగా చిత్రి౦చారు .నమ్మకద్రో హి గా పైకి మంచిగా ఉంటూ
కుత్సితం చేసేదిగా అనేకకథలు ఉన్నాయి.మానవ ధర్మశాస్త ం్ర 4.196 ప్రకారం One who hangs his head,
who is bent upon injuring others and upon his own gain,
dishonest, and falsely modest,
such a twice-bom is said to act like
ఈ బుద్ధిని బకత్వం అని బకవ్రతం కొంగజపం అనీ అంటారు .పంచతంత్ర ,హితోపదేశాలలో ‘’మోసపూరిత బక మహాత్మ్య ‘’కథలెన్నో ఉన్నాయి
.అన్నీ మనకు తెలుసుకూడా .కొంగల ఆహారం చేపలు .ముసలితనం లో వంచన చేసి వాటిని భక్షించటం దాని నైజం .రాజుఅర్ధ సంపాదనలో
‘’బక నైజం’’కలిగిఉండాలనే హితోపదేశం కూడా ఉంది – ‘’బకవత్ చింత ఏత్ అర్ధా న్’’.అంటే మౌని బకం అంటే కొంగ జపం చేస్తూ అకస్మాత్తు గా
బ్రా హ్మణుడికి బకనైజంపనికి రాదు .గరుడ పురాణం లాంటి వాటిలో హేయంగా చెప్పారు అలాంటివారికి గౌరవమర్యాదలు చూపవద్ద ని
విష్ణు పురాణం చెప్పింది అలా౦టిబ్రా హ్మడికి మంచి నీరుకూడా ఇవ్వద్ద న్నది మను ధర్మశాస్త ం్ర .వీరిని’’ బైడాలవ్రతులు ‘’అంటే పిల్లు లు లాంటి
వాళ్ళు అన్నది .దీనికీ దానికీ తేడా ఏమిటి అంటే కొంగ తలవంచి ఉంటుంది ధ్యానం చేస్తు న్నట్లు .పిల్లి దొ ంగ చూపులు చూస్తు ంది మనిషి
చాటు కావటానికి ,బకవ్రతులు మార్జా ల లింగినులు ‘’అంధ తమిశ్రం ‘’లో పడతారునరకం లో అంటే పూర్తి చీకటికోట్లో .. తర్వాత జన్మలన్నీ
నికృష్ట జన్మలే పొ ందుతారు .అగ్నిని దొ ంగిలించినా ,పాలు దొ ంగిలించినా వచ్చేది కొంగజన్మే అని మను, గరుడ ,మహాభారతాలు
చెప్పాయి.నరకం లో మిగతా జంతువులతో కొంగ జీవులను చీలుస్తు ంది ,యముడి మంత్రు లలో ఒకడు కొంగ మొహంతో ఉంటాడు
అనివిష్ణు పురాణం ఉవాచ-43.37.కనుక బకనైజం ఉన్న వారితో జాగ్రతోం జాగ్రతగా మనం మసలాలి .
బుద్ధి మంతుడు బకంలాగా ఉంటూ ఇంద్రియ నిగ్రహం కలిగి ,సమయానికి తగినట్లు ప్రవర్తించాలి అని కూడా బకంమనకు పాఠం చెబుతుంది
.బకం అంటే ధ్యాన సంపన్నమైనదిగా చెప్పబడింది –‘’బకో ధ్యానవాన్ ‘’.పక్షులకున్న సుందర మనోహర లక్షణాలు కొంగకు లేవు .కాని
వాటికి లేని వ్రతం కొంగకున్నది .ఈ లక్షణమే పాడే, కూసే పక్షులకంటే, అంటే అతిగా మాట్లా డే, గోల చేసే వాటికంటే ఇది ప్రత్యేకంగా
కనిపిస్తు ంది-అంటే ముఖ దో షం వాటికుంటే దీనికి లేదు .విష్ణు ,గరుడ పురాణాలు మను ధర్మశాస్త ం్ర కొ౦గలను చంపటం నేరమని
ఘోషించాయి .
.కార్తీకమాసంలో అయిదు రోజులు మాంసాహారం తినరాదు .అదే ‘’బకపంచాక’’ గా స్మృతులలో చెప్పబడింది .ఎందుకు ఈ పేరొచ్చింది ?
కొంగలు కూడా ఆ అయిదు రోజులూ మాంసం తినవు –కాణేపండితుడు -1974-335.ఒక వేళ ఈ అయిదు రోజుల్లో ఎవరైనా మాంసం తింటే ,
కొంగ చేసిన పాపాపలన్నీ భరించాల్సి వస్తు ంది .ఒక జాతక కథలో కొంగ ఉపవాసం గురించి ఉన్నది-జాతక 300. ఆ కథపేరు –వ(బ)కజాతక
.గంగానది ప్రక్కనున్న రాతిపై ఉండే కొంగ వానాకాలం లో నీరు బండ చుట్టూ చేరితే ,ఒంటరిదై,ఆకలి తో అలమటిస్తూ ఉపవాసం ఉండాలను
కొంటుంది –‘’ఉపో శథా కమ్మ ‘’.ఆసమయం లో బో ధిసత్వుడు స్వర్గ ంలో ‘’సక్క’’ అనే రాజుగా ఉన్నాడు .ఈ బక ఉపవాస మర్మమేమిటో
పరీక్షించాలనుకొని ,మేక రూపం దాల్చి ఆ కొంగ సమీపానికి వచ్చాడు .దాన్ని చూడంగానే నోరూరి తినాలనిపించి ఉపవాసం మర్నాటికి
వాయిదా వేసుకున్నది .ఆ మేక అందినట్లే అంది దూరం పో తోంది అప్పుడు అది ‘’నా ఉపవాస వ్రతం ‘’చెడగొట్టు కో కూడదు అనుకొన్నది .ఈ
బకకథ చూస్తె నీటితో సంబంధమున్న బకదాల్భ్య /మార్కండేయ కథ గుర్తు కొస్తు ంది కదా .వీటికి గొప్ప లింకులున్నాయి .జాతక కధలలో
రెండు వ్రా త ప్రతులలో తప్ప మిగిలిన వాటిలో ‘’వక ‘’అనే ఉన్నది .ఈరెండిటిలో’’ బక’’ ఉన్నది .పాళీ భాషలో ‘’వక’’ అంటే తోడేలు (వృకం
)అని అర్ధ ం కూడా ఉన్నది .ఇక్కడి కథలో అది ఎగరలేదు కనుక ,అది తోడేలు అయి ఉంటుంది .ఇక్కడ మనకు కొంగ,
ముసలి పక్షి –బకదాల్భ్యుని విషయంలో ఆయన వయసు కూడా చర్చించాం .ఇంద్ర ద్యుమ్న రాజు కథలో ఒక కొంగ ‘’నాడీ జ౦ఘుడు’’అంటే
పొ డవైన కాళ్ళున్నవాడు గా పరిచయమయ్యాడు .ఇందులో మార్కండేయమహర్షి ది ముఖ్యపాత్ర .ఈకథ భారతం అరణ్యపర్వం 3.191 లో
ఉన్నది .ఇదే ఇంకా వివరంగా స్కందపురాణం ఉమామహేశ్వర ఖండం 2.7.13 లో ఉన్నది .భారతం లో మార్కండేయులు పాండవులకు
సంక్షిప్త ంగా చెప్పాడు .స్వర్గ ం లో ఉన్న ఇంద్ర ద్యుమ్నుడు పుణ్యం ఖాతా కీర్తి అయిపో గానే భూమిపై పడతాడు .భూలోకపు కీర్తి స్వర్గ ంలో
చాలాకాలం ఉన్నందున హరించి పో గా తన గతకాల విషయాలు చెప్పగలవారేవరైనా ఉన్నారేమో అని అడిగితె ఆయన ఎవరికీ గుర్తు లేడని
అందరూ చెప్పారు.మార్కండేయుని కలిస్తే ఆయన’’ ప్రా కార కర్ణ ’’ అనే తనకంటే పెద్దవాడైన గుడ్ల గూబ ను అడగమంటే, అడిగితె
ఇంద్రద్యుమ్నుడు గుర్తు లేడు అని ,ఇంద్రద్యుమ్న సరోవరం లో ఉన్న ‘’బక నాడీజన్ఘు డు’’ తనకంటే వయసులో పెద్ద అని చెప్పగా ,ఆఇద్ద రితో
కలిసి వెళ్లి చూస్తె, ముసలి దానిలాకనిపించలేదు .అందరూ కలిసి అదే సరస్సులో ఉన్న ‘’ఆకూపార ‘’అనే తాబేలు ను అడిగితె ,అది రాజును
చూసి కన్నీరు కార్చింది .దీని వీపు మీదే పూర్వం ఇంద్రద్యుమ్నుడు అగ్నిహో త్రం చేశాడు .ఆయన యజ్ఞ దక్షిణగా ఇచ్చిన పశువుల
నడకవల్ల నే ఇంద్రద్యుమ్న సరోవరం ఏర్పడింది .తాబేలు చెప్పిన ఈ విషయాలవలన రాజు నిర్వహించిన ధర్మం, పొ ందిన కీర్తిభూమిపై
నిలిచాయి .చివరికి స్వర్గ ం నుంచి దివ్య రథం వచ్చి ఇంద్రద్యుమ్నుని మళ్ళీస్వర్గా నికి దేవతలుతీసుకు వెడతారు .ఇక్కడ మనం తెలుసుకొన్న
ముఖ్యవిషయం మార్కండేయ రుషి కంటే బకం ఎక్కువ కాలం జీవించింది .స్కంద పురాణంలో మరింత ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నకథ
తర్వాత తెలుసుకొందాం .
వంద కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గ ం లో ఉండే ట్లు అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు
‘’మంధరక’’ మానస సరోవరం లో ఉంటోంది .అందులోని పాత్రలు ఒక్కొక్కరు ఎంతకాలం జీవి౦చాయో లెక్క కూడా ఉన్నది
.మార్కండేయుడు -7 కల్పాలు ,బకం-14 కల్పాలు ,గుడ్ల గూబ -28,తోడేలు -56 కల్పాలు,తాబేలు -112 కల్పాలు బ్రతికారు .ఈ
పురాణంలోని మహేశ్వర ఖండం అంతా శివుని గురించే .మహీ నది సముద్రంతో కలిసే ఒక తీర్ధ ం వివరాలున్నాయి .అక్కడి శివుడు
ఇంద్రద్యుమ్నేశ్వర లింగం .మార్కండేయుడు ,పైన చెప్పబడిన జంతువులూ శాపగ్రస్తు లైన రుద్ర గణాలు .ఇంద్రద్యుమ్నుడు తాత్కాలికంగా
భూమి మీద ఉండాలని అనుకోకుండా బకంతో సహా పై జంతువులతో కలిసి ఇక్కడ తపస్సు ధ్యానాదులను శివునితో సారూప్య ముక్తికోసం
చేశాడు -2.13.205-08.
మార్కండేయుడు మాత్రం జీవన్ముక్తు డయ్యాడు.శివుడు ‘’లోమాంశ’’ రుషినీ అలాగే చేశాడు. ఈయన వయసు ఇంద్ర ద్యుమ్న ,తాబేలు
లకంటే చాలా ఎక్కువ .కల్పానికి ఒక్క శిరోజం ఊడిపో తుందనీ ,అన్నీ శిరోజాలూ ఊడిపో యే దాకా తాను బ్రతుకు తాననీ ఆయనే
చెప్పుకొన్నాడు .కల్పాలు లయమైన కాలం లోకూడా లోమా౦శుడు జీవించే ఉంటాడు .కనుక యితడు వేదకాలానంతరం వాడుగా లోమాంశ
లేక రోమాంశ అంటే పొ డవైన జుట్టు న్నవాడు గా కేశి అంటే దీర్ఘ కేశాలున్నవాడుగా అంటే బక దాల్భ్యుడుగా భావించవచ్చు .లోమామ్శుడు
ఉత్త ర ప్రా ంతం వాడు అనీ ఉన్నది-మణి-1975-458.కనుక బకనాడీ జంఘ ,ఇతర పేర్కొనబడిన దీర్ఘ జీవితం ఉన్న పై ముసలి జంతువులూ
తనకు దీర్ఘ జీవితం ప్రసాది౦చి౦ది శివుడే అని నాడీ జన్ఘు డు చెప్పాడు .యితడు పూర్వం ‘’అనార్త ‘’మహారాజు .విశ్వ రూప పారాశర్యుని
బ్రా హ్మణ కుమారుడు.చిలిపి వాడు .ఒకరోజుతండ్రి పూజించే మరకత శివలింగాన్ని దొ ంగిలించి ఒక మకర సంక్రా ంతి నాడు నేతి ఘటం లో
దాచాడు .శివుడు ఈ రకమైన కొత్త అభిషేకానికి మహా ప్రీతి చెంది దీనికి ‘’ఘ్రు త కంబాల పూజ ‘’అనిపేరు పెట్టా డు .ఈ పుణ్య ఫలితం గా ఆ
బ్రా హ్మణ యువకుడు అనార్త మహారాజుగా పుట్టా డు .అతనికి గతజన్మవిషయాలు గుర్తు న్నాయి .అప్పటినుంచి శివలింగాన్ని నేతితోనే
అభిషేకించాడు .శివ దర్శనం కలిగి వరం కోరుకోమంటే కోరిక తీర్చి కైలాస గణ నాయకుని చేయగా ‘’ ప్రతీపపాలక ‘’నామం పొ ందాడు .
పదవి పతనానికీ దారి తీసింది .ఇష్ట మొచ్చినట్లు తిరిగాడు నాడీ.ఈ తిరుగుళ్ళలో గాలవ రుషి పరిచయమై ,ఆయన భార్యపై మోజుతో
శిష్యుడిగా చేరాడు .ఒకసారి ఆమెను బలాత్కారించబో గా ఆమె అరుపులు విని రుషివచ్చి తీవ్ర పదజాలంతో స్త బ్దు డవై దీరక
్ఘ ాలం కొంగవై
పొ మ్మని శపించాడు .అప్పటినుంచి కొంగ నైజం వచ్చింది –స్కందం –మా ఖండం -2.7.94.కశ్యప వంశంలో బకునిగా పుట్టా డు .ఇంద్ర
నాడీ జన్ఘు ని బకనైజం అన్ని రూపాలలో కనిపిస్తు ంది .విశ్వరూపుడు తనకొడుకును ‘’బక’’అని పిలిచేవాడు .గాలవ కథలలో చాలా సార్లు ఈ
నైజం చూపాడు .ఆయన శిష్యుడివి ఎలా అయ్యావు అని అడిగితె పూర్వ బకజన్మ వల్ల నే అని చెప్పాడు .వీడు గురు భార్యను ఎత్తు కు
పో దామని ప్రయత్నిస్తు ంటే ఆమె వాడిని ‘’బకవృత్తి ‘’గాడు అనిఅంటే ధర్మం ముసుగులో ఉండే కపటి అని తిట్టింది .గాలవ శాపంతో వాడు
కదలలేడు అంటే చిత్రంలో బొ మ్మలా ఉండిపో యాడు .వృద్ధ బకుడు ,అత్తి చెట్టు తో కలిసి కనిపిస్తా డు .ముని శపించగానే అశ్వత్ధ మొక్క
బక సంబంధమైన అన్ని కథలలో బకాదాల్భ్యుని నైజం కొంగ బుద్దిగానే కనిపిస్తు ంది .నాడీ జంఘ వృత్తా ంతం లో మూర్తీభవించిన బకత్వమే
మనం చూశాం .నమ్మశక్యం కాని ,పనికిమాలిన యోగ్యతలేని అసమర్ధ ,కపట ముని వృత్తి కల స్త బ్దు డైన ,వ్యభిచార ముసలి వాడుగా అతడు
బక దాల్భ్యుడు -14
బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తు ంది .అతడు విశ్వామిత్రు ని కొడుకు .ఒకసారి విశ్వామిత్రు డు
చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పో షించటానికి విశ్వామిత్రు డి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన
వారిని పో షించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది అమ్మటానికి తీసుకు వెడుతుంటే దారిలో
సత్యవ్రత మహారాజు(తర్వాత త్రిశంకు అయ్యాడు ) కనిపించి ఆకుటుంబాన్ని తాను ఆదుకొంటానని చెప్పిఆకుర్రా డి గళానికి ఉన్న
దర్భతాడు తీసేయ్యమని చెప్పాడు .అప్పటినుంచి అతడు’’ గాలవుడు ‘’గా పిలువబడ్డా డు. అప్పటిదాకా అతని అసలు పేరు ఎవరికీ
తెలియదు.మరో రకంగా కూడా దర్భ తాడు మెడకు ఉన్నవాడు కనుక దార్భ్యుడు లేక దాల్భ్యుడు అయి ఉండచ్చు .చివరగా వేదాలలో
చెప్పబడిన గ్ల వ లేక గాలవ కు పురాణాలలోని దాల్భ్యునికి మధ్య ఒక సన్నని తాడు లంకెగా ఉన్నట్లు అనిపిస్తు ంది .
భగవదవతారం
మహాభారత ,పురాణ విషయాలవలన మార్కండేయ ,మహా వృద్ధ జంతుపువులు శివగణాలు అని తెలిసింది .శివ ,మార్కండేయులమధ్య
మళ్ళీ ఒక కొంగ వచ్చి దూరిన విషయం తెలుసుకొందాం .స్కాందపురాణం ‘’ఆవత్య ఖండం ‘’3.8.లో బకకల్పం లయమయ్యే సందర్భంలో
శివుడు ఒక కొంగ రూపం దాల్చాడు -3.8.53-‘’బకే పురాకల్పే’’.కల్పాల మధ్య చిరంజీవి మార్కండేయుడు తపస్సు చేస్తూ అనంత
జలరాశిలో మునిగిపో యాడు .బయటపడటానికి ఈదుకొంటూ వస్తు ంటే కంఠాభరణం లాగా తళతళ మెరిస ే తెల్లని కొంగ ఒకటి ఆయనవైపు
ఈదుకొంటూ రావటం చూశాడు .ఆకొంగ తానె శివుడు విష్ణు బ్రహ్మ అనీ తానె ఈప్రళయం సృష్టించానని చెప్పింది 3.8.7.ఆ మహాబకం
మహర్షిని తనవీపుపై కూర్చోమని చెప్పి ,కూర్చోగానే ఆకాశం లోకి యెగిరి వెడుతుంటే ,నీటి అంచున పదిమంది స్త్రీలు కనిపించారు -3.8.14-
16 .క్రమంగా అంతరిక్ష౦ లోకి ఎగురుతూ స్పష్ట ంగా స్వర్గ నగరాలను దర్శించాడు .అనేక వర్ణా ల శివలింగాన్ని అవగతం చేసుకొన్నాడు -
3.8.24-26.ఇప్పుడు మళ్ళీ ఆపదిమంది స్త్రీలు శివలింగాన్ని పూజించటం గమనించాడు ఆ స్త్రీలు నదుల మానవ రూపాలు .అందులో కల్ప
వాహిని నర్మద అతడు చూసినవాటి అంతరార్ధ ం వివరించింది .3.8.39-47.మార్కండేయుడు ఆ స్త్రీలు నదీమతల్లు లని ,ఆలింగం
,బకం,శివుని వేర్వేరు స్వరూపాలని అర్ధ ం చేసుకొన్నాడు-3-8.43 –‘’మహాదేవో లింగ మూర్తిర్’’.3.8.49-‘’దేవేశో బకరూపో మహేశ్వరః
‘’.నర్మదానది వృత్తా ంతం తర్వాత ఆ దృశ్యం క్రమంగా అదృశ్యమైంది .వెంటనే మొదట్లో మార్కండేయుడు నదిలో స్నానం చేసి శివుని
అభిషేకిస్తు న్నట్లు అనిపించి కాసేపటికి అదీ అదృశ్యమై ఆయన స్థిరంగా భూమి మీదనే ఉన్నట్లు అనిపించింది .
బక దాల్భ్యుడు -15
మాయారూప మరో దేవుడు –
బక ,మార్కండేయు లిద్ద రూ అధిక గర్వం తో పతనం చెందారు .బౌద్ధ జాతక కథలూ ఇదే చెప్పాయి.బకబ్రహ్మజాతకం అనే 405 జాతక
కథలో బకుడు స్వర్గ లోక దేవుడైన బ్రహ్మ .ఆయన భూమిపై చేసిన తపస్సు ఫలితంగా అనేక కల్పాలు వేర్వేరు బ్రహ్మలోకాల లో
ఉన్నాడు.అభస్సార బ్రహ్మలోకం లో ఉండగా,అంతకంటే ఉత్కృష్ట స్థితి లేదు అని పొ రబాటుగా భావించాడు.ఈ బ్రహ్మలోకానికి బుద్ధు డు
వచ్చినపుడు బకుడు ఆయనకు తాను మనసులో అనుకొన్నది చెప్పాడు .అతడి గత జన్మల విషయాలు చెప్పి అతడి అభిప్రా యం తప్పు
అని తెలియ జేయాగా తప్పు తెలుసుకొన్నాడు .బుద్ధు డు పది వేల బ్రా హ్మల మనసులకు విముక్తి కలిగించాడు.అంటే బుద్ధు డు బకుడిని
బకుడు ఒక జన్మలో ముసలి తపస్వి కేశవుడు గా ఉండగా ,బుద్ధు డు ఆయనకు యువ కు డైన కప్పా అనే శిష్యుడు .ఇదే కేశవ జాతక -
346.ఒకసారి వారణాసి రాజు బకుని అతని శిష్యులను హిమాలయాలకు పంపి ,ఆయన్ను తన రాజభవనం లో ముసలితనం గడపమని
కోరాడు .అక్కడ ఉండగా జబ్బు పడి ,ముఖ్యశిష్యుడు కప్పా ను కలుసుకున్నతర్వాతనే జబ్బు తగ్గింది .జైమినీయ అశ్వ మేధం లో బక,
కృష్ణు ల కలయిక ,జాతకకథలలో బ్రహ్మలోక బుద్ధు ల కలయిక ఒకే మాదిరిగా ఉన్నాయి .కేశవ అంటే కేశి దాల్భ్యుడు .జాతక కథలప్రకారం
ఒకే బకుడు ఒక జన్మలో కేశి దాల్భ్యుడుగా ,మరో జన్మలో బకదాల్భ్యుడుగా పుట్టా డన్నమాట .. పక్షిరాజు
కొన్ని ఆఖ్యానాలలో బకుడు రాజుగా చెప్పబడ్డా డు ఆ రాచ పక్షి పూర్వజన్మలో పక్షిగాలేక పక్షిరాజుగా చెప్పబడ్డా డు .ఆరాజ బకుడు దైవాంశ
సంభూతుడు అయిఉండాలి .పక్షిరాజు కు విశేషమైన విషయం ఉండి ఉండాలి .కునాల జాతకం-536 ప్రకారం రాజరిక బకుడు వారణాసి
ప్రభువు .ఇందులో రాజకునాల ఆటే బుద్ధు డి పూర్వ జన్మ .ఆ కునాలపక్షికి ఎప్పుడూ 3500 కోడి పక్షులు కాపలాగా వాహకులుగా
ఉంటాయి . ఆ ఆడ పక్షులు గమ్యం లేకుండా గాలి ఎటు వీస్తే అటు ఆయన్ను మోసుకుపో వటం తో విసుగుపుట్టి ,వాటి
కౌవెల్(1895-1907) సేకరించిన బౌద్ధ జాతక కథలలో v-236-240 ప్రకారం మంచి ఉపజ్ఞ ఉన్నమానవ రాజు బకుడు బీద అత్యంత
అందవికార యువతి ‘’పంచపాప’’ ను ప్రేమించాడు .అందవికారి అయినా ఆమె చేతి మెత్తని స్పర్శతో మగవారిని ఆకర్షించేది .అనేక
సందర్భాల పరిచయంతో ఆమెను దేవేరిగా చేసుకొన్నాడు .తర్వాత ఆమెను నది అవతలి తీరాన ఉన్న పారవీయ రాజుతో పంచుకొన్నాడు
.కనుక పంచపాప నది అవతలికి వెళ్లి అతనితో కొన్ని రోజులు గడిపి వస్తూ ండేది .ఇలా ఆ ఇద్ద రినీ నావ నడిపే ముసలి బట్ట తలకుంటి వాడి
మరొక రాజరిక బకుడు భారతం శాంతి పర్వం12.162-28 లో కనిపిస్తా డు .బకరాజ బకాధిపతి బకేంద్ర మొదలైన పేర్లతో ద్వేషపూరిత
కొంగలరాజు ,దుర్మార్గ బ్రా హ్మణుడు గౌతముని తో కనిపిస్తా డు .ఉత్త ర మ్లేచ్చులమధ్య ఈ కథ జరుగుతుంది .మధ్యదేశంలో సద్బ్రాహ్మణ
కులం లో పుట్టిన గౌతముడు ఉత్త రాన స్థిరరపడ్డా డు .దస్యుల గ్రా మంలో శూద్ర భార్యతో బో యవాడుగా జీవిస్తు న్నాడు -12.162.28-
37.ఒకరోజు పక్షులవేటకోసం సముద్రం వైపుకు వెడుతూ మధ్యలో ఒక అడవిలో దారి తప్పాడు .అక్కడ ఒక మెరిసే పక్షి కనిపించింది .అది
బకరాజు .అతడు దక్ష ప్రజాపతికూతురుదేవకన్య కు ,కశ్యప మహర్షికి జన్మించినవాడు .ఆ పక్షిపేరు రాజధర్మ .అప్పుడే అతడు నాడీ జంఘ
పేరుతో బ్రహ్మలోకం లో ఉంటూ ఇప్పుడు తన ఇంటికి తిరిగి వస్తు న్నాడు -12.163.17-20.గౌతముడికి రాజధర్మ గొప్ప ఆతిధ్యమిచ్చాడు
.తాను పక్షుల వేటకు సముద్ర తీరానికి వెడుతున్నానని గౌతముడు చెప్పగా రాజధర్మ అతడిని తనప్రియమిత్రు డు రాక్షసరాజు విరూపాక్షుని
దగ్గ రకు వెళ్ళమని ,అతడు ఆషాఢ,మాఘ ,కార్తీక పౌర్ణ ములనాడు బ్రా హ్మణులకు భూరి దక్షిణ కానుకలు ఇస్తా డని చెప్పాడు .అలాగే వెళ్లి
రాక్షసరాజు ఇచ్చిన అపార స్వర్ణ ం మోసుకుంటూ మళ్ళీ రాజధర్మ ఇంటికి వచ్చి దారిలో ఏమీ తినకపో వటం తో ఆకలి ఎక్కువై
విశ్వాసఘాతుకంగా ఆపక్షిరాజు నే చంపి తినేశాడు .ఇది తెలిసి విరూపాక్షుడు తన సైన్యాన్ని గౌతముడిని చంపమనిపంపితే వాళ్ళు అతడిని
ముక్కలు ముక్కలుగా నరకగా రాక్షసులు ,దస్యులు కూడా అలాంటి కృతఘ్నుడి మాంసం తినటానికి నిరాకరించారు .చివరికి సురభి దేవత
బకుడిని పునరుద్ధ రించింది .ఆశ్చర్యంగా ఆ పక్షిరాజు ఆమెను గౌతముడిని కూడాబ్రతికించమని కోరింది .అలాగే చేసింది సురభి .బకుడు
రాజరిక బకానికి బ్రా హ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణ-ి 1.325-335 లో కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న
రాజున్నాడు .క్రూ రుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -
1.331-35.అప్పుడు భట్ట యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి మోహ పరవశత్వంతో రాజును
ఒక పెద్ద యాగం పాల్గొ నటానికి –యాగోత్సవ మహాత్మ్యం ప్రలోభపెట్టింది.దేవి చక్రమాతృ చక్రం లో కూర్చోపెట్టింది .దీనితో భట్టా కు అద్భుత
శక్తు లేర్పడి ,ఒక్కసారి ఆకాశానికి ఎగిరింది .
ఈ బకరాజు ‘’బకేశ్వర దేవాలయం ‘’,బకావతి కాలువ నిర్మించాడు .ఈ రెండు బకశ్వభ్ర లో ఉన్నాయి -1.329.కథా సరిత్సాగరం -
6.76,6.166 లో నర్మదానదీ తీరంలో ‘’బక కచ్ఛ ప తీర్ధ ం’’ ఉన్నట్లు చెప్పబడింది .స్కందపురాణ౦ అవంత్యఖండం -3.230.103 లోనూ
బకేశ్వర తీర్ధ ం ఉన్నది .నారద పంచరాత్రం 2.2.82 లో బకద్వీప వర్ణ న ఉన్నది ఏడు ద్వీపాలలో ఇది అయిదవది .క్రౌ ంచద్వీపం పేరు
మహాభారతం ,అనేకపురాణాలలో 6.12.3,6.13.7,17.20 ఉంది.అక్కడ ప్రసిద్ధ క్రౌ ంచ పర్వతం ఉంటుంది .
కొందరిపర
ే ్ల లో బక శబ్ద ం ఉన్నది –విశ్వామిత్రకొడుకు బకనాఖుడు –భారతం -13.40.57.సిద్ధా ంత కౌముది 11.46.ఇలారాజుల స్థ లాల
పేర్లలోనే కాకుండా కొన్ని జాతులపేర్లలోనూ వస్తు ంది .మార్కండేయం-55.42 లో’’క్రౌ ంచ కురు బకాస్ చైవ ‘’అని ఉంది .కనుక బకాలకు
క్రౌ న్చాలకు ఏదో విడదీయరాని సంభంధం ఉన్నది .భీష్మ పర్వం లో ‘’బక కొకరాకాః అని ఉంది .కొన్ని ఎడిషన్స్ లో ‘’వ్యూకాస్ కోక బకాస్
‘’అనీ ,త్రయన్గా ః కోక రాకాః’’అనీ ఉన్నది.పక్షిరాక్షసి గా కూడాఉంది ఆ వివరాలు తర్వాత .
బక దాల్భ్యుడు -17
పక్షిరాక్షసి
ఇప్పటి దాకా మనకు తెలిసిన అనేక వృత్తా ంతాలప్రకారం బక పేరుతొ ఉన్న అనేక పాత్రలు కృతఘ్నత అపనమ్మకం ,కపటం ,మాయ లకు
ఆనవాలు గా ఉన్నాయి .దీనితోపాటు దైవీభూతమైన కొన్నిపాత్రలు రాక్షస అసురులులాగా భయంకర బకాలుగా కూడా ఉన్నాయి .అందులో
చివరిది రాక్షస తత్త ్వం .కొంగముఖం లో ఉండే యముడి మంత్రి గురించి చిత్రరూప కొంగల గురించీ తెలుసుకొన్నాం .వీటన్నిటి వలన మనం
నేర్వదగిన సత్యం నీతి ఒకటి ఉన్నది .ఇలాంటి మనస్త త్వమున్నవాళ్ళు పతనం చెందుతారు .వైష్ణవ ఉపనిషత్ లో బకాసురుడు పొ గరు
బో తు. గర్వానికిపతి
్ర ఇది –కృష్ణ –ఉపనిషత్ 14-‘’గర్వోరాక్షసః గర్వో బకః’’.కొన్నిపురాణాలలో బక కు బహు వచనాలూ ఉన్నాయి .బ్రహ్మాండ
పురాణం క్రూ ర భయంకర రాక్షససమూహాన్ని ‘’బకులు ‘’అన్నది.వీళ్ళు వృత్రా సురుని కొడుకులే కాని తర్వాత ఇంద్రు డికి సేవకులయ్యారు
.బక,యక్షరాజు కుబేరుడికీ సంబంధమున్నది .వాయు పురాణం యక్ష మణివర కొడుకుల్లో బకపేరున్నవాడు న్నాడు -69.160.మణి వరుని
కొడుకులను గుహ్యకులనీ వీరు కైలాసంలో రాజాస్థా నంలో ముఖ్యులని కూడా చెప్పింది .బక రాక్షసుడిని భీమ, కృష్ణు లు సంహరించారు
కుంతీ దేవితో సహా సంచారం చేస్తూ గంగానదీ తీర ఏక చక్రపురం లో బ్రా హ్మణ వేష ధారణతో గడిపారు . అది ద్రు పద రాజు పాలనలో ఉన్న
‘’వేతక
్ర ీయాగ్రహారం ‘’.ఒకరోజు నలుగురు సో దరులు భిక్షకువెడితే ఇంట్లో కుంతీ ,భీముడు ఉన్నారు .తమకు స్థా నం ఆతిధ్యం ఇస్తు న్న బ్రా హ్మణ
కుటుంబం లో రోదనలు వినిపించాయి .కారణం అడిగితే యజమాని వివరించాడు -1.148-152.’’పురుషాదక’ మనుషులను తినే
బకాసురరాక్షస రాజు సంరక్షణలో లో తమప్రా ంతం ఉందనీ వాడు గొప్పరాక్షస గణంతో దగ్గ రున్న అరణ్యంలో ఉంటాడని ,రక్షణకోసం వాడికి
రోజూ ఒక మనిషి, దున్నపో తులబ౦డీతో బండెడు అన్నం పంపాలనీ ఆరోజు తమ గృహం వంతు వచ్చిందని ,వాడికిఆహారం సమర్పించటం
తమకు అసాధ్యమనీ చెప్పాడు .అప్పుడు కుంతి వారిని ఓదార్చి తనకొడుకు భీముడు అత్యంత బలసంపన్నుడు తెలివి తేటలున్నవాడు
కనుక తాను అన్నం బండీతో అతడిని బకాసురుని దగ్గ రకు పంపిస్తా ననీ అభయమిచ్చి౦ది -149.14.’’వీర్యవాన్ మంత్రసిద్ధా స్ చ తేజస్వి
‘’.భీముడు మాంచి హుషారుగా వెళ్లి వాడిని పేరుపెట్టి బిగ్గ రగా పిలిచాడు .అప్పటికే బండీలో ఉన్న అన్నమంతా భీముడు తినేశాడు .వాడు
వచ్చి చూసి గర్జించి భీముడితో తలపడ్డా డు .వాడిని సునాయాసంగా రెండుగా చీల్చేశాడు భీమ .వాడు చావగానే వాడి అనుచరులంతా
భీముడికి స్నేహితులయ్యారు .వాడి శరీరాన్నీ ఈడ్చుకు వచ్చి ఏక చక్రపురసి౦హద్వారం వద్ద పడేసి,ఇక వాడి వలన ప్రమాదం తప్పిందని
చాటాడు .బకవధ వృత్తా ంతం పై మేడలిన్ బియార్డో ,వ్యాఖ్యాత్రి ఆల్ఫ్ హిల్టే బీ లిటిల్ ల రచనలను బట్టి భారతీయ కొంగల మైధాలజి అర్ధ ం
చేసుకోవటం తేలికయినది .కాని రాక్షస బకులకు ,సాధారణ కొంగలకు మధ్యున్న లింక్ తెలియాలి .
హిటల్
ె బీటెల్ అంచనాప్రకారం ‘’వేటక
్ర ీయాగ్రహారం ‘’బ్రా హ్మణ సంస్కృతికి విరుద్ధ ౦గా ఉండే చిత్త డి భూమి .బకరాక్షాస నివాసం ఇదే .బక
అనే కొంగపచ్చి మాంసం ,చచ్చిన చేపలు తింటుంది .బకాసురుడు బ్రహ్మరాక్షసజాతి వాడు అంటే బ్రా హ్మణుడు శాపవశాన రాక్షసుడైన వాడు
.బలహీన రాజు వలన వాడి ఆటలు సాగాయి .బకుడు సంక్షోభ కారకుడు .ఐతే బకుడు రాక్షసుడు అవటంలో ప్రతీక ఏమిటి ?కొంగలకు
చేపలకు సంబంధమేమిటి?
బకుడి లాంటి వారి నైతికత వారి సామాజిక నేపధ్యంపై ఆధార పడి ఉంటుంది .బ్రా హ్మణుడుగా బకుడు ని౦ద్యుడే కాని క్షత్రియుడుగా
వందనీయుడే .బ్రహ్మ రాక్షస గుణం అతడి లోనిక్షత్రియ బక సంజాతమే ,కాని బ్రా హ్మణులకు భీకరమైనది .అణచబడిన బ్రా హ్మణుల
తీవ్రస్వభావానికి ప్రతీక .బక రాక్షసుడు భారతం లో బ్రహ్మరాక్షసుల ప్రతినిధి .రామాయణం లో రావణాసురుడు లాగా .పులస్య బ్రహ్మ
సంజాతులు కనుక రాక్షసులంతా బ్రా హ్మణులే .ఇప్పుడు పులస్య రాక్షసుల మధ్యలింకేమితో తెలుసుకోవాలి .పద్మ పురాణం లో పులస్త్యుడు
దాల్భ్యుడికి వైష్ణవం బో ధించాడు .కనుక పులస్యుడికి బకుడికి ఈరక మైన గురు శిష్య సంబంధం అంటే పులస్త ్య రాక్షసులకు కూడా
ఉన్నట్లేకదా .కనుక పద్మపురాణ దాల్భ్యుడు అంటే బక దాల్భ్యుడే .అంతేకాక పులస్త్యుడు రాక్షస వంశ మూల పురుషుడు కూడా . కనుక
అనుమానాస్పద వ్రా త్య లేక అసుర లక్షణం అంతర్గ తంగా పితృపరంగా దాల్భ్యుడికి అనువంశికంగా చేరిందన్నమాట .
ఒకరు అదృశ్యమవగా చివరకు ధర్మరాజు వచ్చి,ఆకాశం నుంచి వినిపించే యక్షుని మాట లెక్క చేయ కుండా ఉంటె యక్షుడు తానె ఆయన
సో దరులను దాచానని తనపేరు బకుడు అనీ తాను జలం లో ఉండే చేపలు,మొక్కలు తింటానని చెప్పాడు -3.297-11-‘’అహం బకాః శైవల
మత్స్య భక్షషో ’’..చివరికి యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పగా ఆయన సో దరులను అప్పగించాడు .యక్షలో
య బదులు ర పెడితే రాక్షసుడు అవుతాడు .ఒకరితరువాత మరొకరిని తినటం బకలక్షణం అని మనం మర్చిపో రాదు .
బాలకృష్ణు డు బకాసుర వధ చేశాడు .భాగవతం 10.11.46-53 లో నంద గోపుడు బృందావనానికి తన పరివారం తో మారాడు .గోపాలురతో
కృష్ణ బలరాములు గోవులను కాస్తూ ఒక సరస్సు దగ్గ రకు వచ్చారు .అక్కడ అకస్మాత్తు గా బకాసురుడు భీకర శరీరం కొంగరూపం లో
కనిపించాడు -10.11.48’’బకో నామ మహాన్ అసురో బకరూపా ధృక్’’.ఆ బకం ఒక్కసారిగా బాలకృష్ణు ని మింగేసి ,గొంతులో విపరీతమైన
అగ్ని మంట ఉన్నట్లు బాధపడి వెంటనే కక్కేసింది .కృష్ణు డు బయట పడగానే తనపెద్ద ముక్కుతో దాడి చేసింది .దాని ముక్కు పట్టు కొని
పద్మ పురాణ ఉత్త ర ఖండం -245.95-100 లో కృష్ణు డు బకాసురుడిని దాని రెక్కలపై మట్టి ముద్ద లు వేసి చంపాడని ఉన్నది –‘’లోస్ట ం
ఉద్యమ్నలీలయా తదాయామాస పక్షంతే’’.దీన్ని బట్టి తేలింది బృందావన అరణ్యం అసుర నిలయం .యక్ష ప్రశ్నలలో పాండవ సో దరులను
మింగిన బకం భీముడు తన వంశంవాడైన బకాసురుడిని చీల్చి చంపటానికి తీర్చుకొన ప్రతీకారం అనిపిస్తు ంది .రాక్షస అసుర యక్షులు లకు
భీకర బకాలతో సంబంధం ఉన్నవాళ్ళు .ఒక బకుడి పేరు దైత్య అనీ పురాణకథనం .కృష్ణు డు బకాసుర ఇతర రాక్షసుల వధ చేశాక
దేవతలను అసురులను జయించిన దైత్యులను తొలగించేశాడు భాగవతం 10.46.26-దైత్యాః సురాసుర జితో హతా యేన’’.స్కాందపురాణ
ప్రభాస ఖండ 4.20 లో అనేకమంది దైత్యులు కృష్ణ బలరాములచేత వారి చక్రహలాయుదాలతో చంపబడినారని ఉంది-4.20.50-‘’సంకర్షణో
జనార్ద నౌచక్రా లా౦గల ఘటేన జఘ్నతుర్ దానవోత్త మాన్ ‘’.అందులో బకుడు కూడా ఒకడు 25-‘’బకాస్ చదైత్యో బహుసైన్య సమన్వితః
కొంగ లాంటిది కామరూపం లో ఆకాశ సంచారం చేసింది .ఇదిపూతన లక్షణం .హరివంశం -50.20 లో పూతన పక్షి గా చెప్పబడింది కూడా
.ఈ ఆడ రాక్షసి మాయోపాయంగా అటూ ఇటూ ఎగురుతూ ఒక్కసారి అకస్మాత్తు గా దాడి చేస్తు ంది .ఇది అగ్నిశిఖా అనే రాక్షసి లక్షణం .ఇది
కొంగ రూపి.దీన్ని వేదంలో చెప్పబడిన కేశి దాల్భ్యుడు అనిపిస్తు ంది .పురాణ ఇతిహాసాలలో అసుర రాక్షసులకు కుటు౦బాలున్నట్లు ,వీరికి
అన్నిరూపాలు దాల్చే శక్తి ఉన్నట్లు ,జంతు పక్షి రూపాలూ పొ ందినట్లు ఉన్నది .ముఖ్యంగా బక రూపం అందులో ఒకటి .రామాయణం లో
రావణుడు చనిపో యాక సహస్ర స్కంద రావణుడు ,మహిరావణుడు గురించి వస్తు ంది .వీళ్ళు రావణుని బంధువులే .బకాసురుడు బ్రహ్మ
రాక్షసుడు కనుక తన శత్రు వులను చంపటానికి బహువేషాలు ధరించాడు .బకుని అన్నలు కిమ్మీరుడు, అల౦బ ఆలాయుదులు
.హిడి౦బుడిని బకుని దగ్గ ర బంధువుగా చెప్పలేదు .కాని బకుని జంటగా చాలాసార్లు వస్తా డు .బకుని ముఖ్యానుయాయి ‘’ఆది’’.
కిమ్మీరలేక కిర్మీర అంటే రంగులు మార్చేవాడు .భారత అరణ్య పర్వ 12 వ అధ్యాయం ‘’కిమ్మీర వధ ‘’3.12.6-9 లో పెద్ద కోరలు భయంకర
శబ్ద ం చేస్తూ నిలబడ్డ జుట్టు తో –‘’ఊర్ధ ్వ శిరోరుహా ‘’మహారాక్షసుడురుతుపవనంలాగా ఉన్నాడనిచేప్పింది –సబాలకం ఇవ అంబుదం’’అంటే
బకుని సో దరుడు .కిర్మీరుడు తన శక్తు లతో పాండవులను ఎర వేద్దా మని ప్రయత్నిస్తే ధౌమ్యుడు శక్తిగల రాక్షస సంహార మంత్రా లను
ఉచ్చరించిమాయలు పారకుండా చేశాడు . –‘’రక్షోఘ్నైర్ వివిధైర్ మంత్రైర్’’.తన తమ్ముడు బకాసురుడిని,-‘’అహం బకాస్య వై భ్రా తా
‘’స్నేహితుడు హిడి౦బా సురుడిని-32 భీముడు చంపినపగ తీర్చుకోవటానికి కిర్మీరుడు భీముడితో మల్ల యుద్ధ ం చేశాడు-32.చివరికి
మిగిలిన సో దరులైన అలంబుస అలాయుధ కౌరవ సైన్యంలో చేరిన రాక్షససో దరులు .ఇద్ద రూ అనేక మాయలతో భీముడితో యుద్ధ ం చేస్తే,
భీముడికొడుకు ఘటోత్కచుడు కూడా రాక్షసాంశ ఉన్నవాడుకనుక అవే కిటుకులు ప్రయోగించి వారిద్దర్నీ చంపాడు .అల౦బుసుడి మొదటి
శత్రు వు ఆర్ష్య శృంగి-7.83.,13.84 ,40.అల౦బు పక్షిరూపం పొ ందలేదుకాని పన్నగ రూపం పొ ందాడు-‘’పన్నగా ‘’ .అర్జు నునికొడుకుసగం
నాగు పాము రూపంలో ఉన్న ఐరావణు డితోఆలంబ పో రాడుతూ ,తాను గరుత్మంతుడు రూపం పొ ందినట్లు భ్రమకల్పింఛి చంపాడు -
6.86.68-69.
అలాయుధుడు భారతం-7 .151-153 ప్రకారం బక భ్రా త్రు డే-బక భ్రా త్రు ర్’’బకజ్ఞా తి -153.33.భీముడితో యుద్ధా నికి దిగి ,చివరకి
ఘటోత్కచునితో మాయయుద్ధ ం చేసినపుడు వాలిసుగ్రీవుల్లా ఉన్నారని పో ల్చారు -7.153.37.అలమ్బుస అలాయుదులు కూడా బహు
రూపదారులైన , మాయావులైన రాక్షస సో దరులు అని తెలుస్తో ంది .మరోకేరక్టర్ ఆది గురించి తరువాత తెలుసుకొందాం .
బక దాల్భ్యుడు -19
ఆది
మార్కండేయ పురాణం -9 లో ,దేవీ భాగవతం -6.12-13 లో ‘’ఆదిబక ‘’ప్రస్తా వన ఉన్నది .రాజా హరిశ్చంద్రు డు తన పురోహితుడు వసిష్ట
మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రు డు వచ్చి విఘ్నం చేయబో తే వసిష్టు డు ‘’బకం’’గా పుట్ట మని శాపమిస్తే ఆయన
ఈయన్ను ‘’ఆది’’గా పుట్ట మని శపించాడు .వీరిద్దరూ మహా బకాలుగా మారి మహాభయంకరంగా ఆకాశయుద్ధ ం చేస్తే ,బ్రహ్మవచ్చి
శాంతపరచితే ,అప్పటినుంచి ఇద్ద రు ఋషులు మిత్రు లయ్యారు .భాగవతంలో ఆదిబకవృత్తా ంతంలో వశిష్టు డు బ్రా హ్మణుడు అయితే
,విశ్వామిత్రు డు క్షత్రియుడు బక రూపం పొ ందాడు .కేశి దాల్భ్యుడు ఇక్కడ గుర్తు కొస్తా డు .మార్కండేయపురాణ౦ లో వసిస్ట మహర్షి
విశ్వామిత్రు ని నీచదుర్మార్గ బ్రా హ్మణుడిగా సంబో ధిస్తా డు-9.9-‘’దురాత్మా బ్రహ్మద్విస్’’.దేవీ భాగవతం లో విశ్వామిత్రు డు ఎందుకు బకం గా
మారాడో వివరంగా ఉన్నది -6.1332-.హరిశ్చద్ర మహారాజుదగ్గ రకు ముసలి బ్రా హ్మణ వేషంలో వెడితే ‘’వృద్ధ బ్రా హ్మణ వేషేణ’’.వశిష్టు డు
గుర్తించి ,ఆయన ప్రవర్త న బకధర్మం లాగా ఉందని ’’బకధర్మా బకాద్యాన పరా ‘’ అని తిట్టి శపించాడు .
విశ్వామిత్ర బకుడికి ఆజన్మవిరోది ఆది అనే వసిస్టబకం.వసిస్టు డు బ్రా హ్మణుడే అయినా సద్బ్రాహ్మణుడు కాదు అని దేవీభాగవతం 6.12.25
లో ఉంది .గంగాతీరంలో ఉన్నంతమాత్రా న రుషులలో దివ్యత్వం పొ ందటంలో అసూయా ద్వేషాలు పో లేదని అన్నది .
,బక అని జాన్ స్ట న్ అన్నాడు .బకుడు అతడి రాక్షసగణ౦ జానపద కథల్లో కీ ఎక్కారు .తమిళ కథలలోబకుడు లేక పకాచురన్ కు 200
తలల వారసులున్నారు .వారిలో ఆచలమ్మాన్ ,రోచకన్,మలై యుకాచురన్ లున్నారు .అల౦బుసుడి పేరు మాత్రంబకుని చిన్నతమ్ముడిగా
కేశి
వేదకాలం తర్వాత మనం బకదాల్భ్య, దాల్భ్య,బక విషయాలు వివరంగా తెలుసుకొన్నాం .ఇప్పుడు కేశి గురించి ఒకసారి ఆలోచిద్దా ం
.బకునిలాగా కేశికూడా అసురబృందంతో కనిపిస్తా డు .వేదకాలం తర్వాత కేశి దాల్భ్యుడి పాత్ర కనిపించదు .అధర్వ వేదం లో గర్భిణీ స్త్రీల
రక్షణకోసం చేసే స్తో త్రం లో నల్ల గా ,పొ డవైన కేశాలున్న పిలకతో ,కోలముఖ పురుషాంగం ఉన్న అసురుడు గర్భిణీ స్త్రీల పిరుదులు ,యోని
లను వేధిస్తా డు 8.6.5.-‘’యః కృష్ణా కేశ్యాసుర స్త ంబజా ఉత తుందికాః’’.పొ డవైన జుట్టు ఉంటె గుర్రం, సింహం కూడా కావచ్చు.కానీ వేదకాలం
తర్వాత సాహిత్యం లో యాదవ వంశంలో జన్మించినవారిజాబితాలో వసుదేవ కౌసల్యల కొడుకు కేశి పేరు ఉన్నది .9.24.48 .కేశిని పేరు
భాగవతం లో బాలకృష్ణు డు ఆశ్వాకార అసురుడు కేశిని చంపాడు .మళ్ళీ ఇంకెక్కేడా కేశిపేరు రాలేదు .భారతంలో చాలా చోట్ల వస్తు ంది
.కశ్యపమహర్షి కి దనువుకు పుత్రు లైన దానవులలో వీడి పేరుంది -1.59.22.కాని వాడు కృష్ణు డి శత్రు వు .కృష్ణు డు మధురలో
మామకంసుని, కేశిని సంహరించాడు-14.69. 23,16.7.9.ఇదే విషయం అశ్వ ఘోషుడి’’సౌందర నందం ‘’లోనూ ఉన్నది .కేశి
సంహారకుడుగా కృష్ణు డినామాలలో తరచుగావస్తు ంది .కృష్ణు డిని కేశవా అనీ అంటారు –‘’కేశవః కేశి సూదనః ‘’-2.30.11 ,9.62.69.’’కేశవం
భారతం 3.213.9-13 లోకృష్ణు డి శత్రవు కేశికాదు ఇంద్రు డు .దేవ దానవ యుద్ధా లకాలం లో ,ఇంద్రు డి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు మానస
పర్వతానికి కొత్త సేనానికోసం వెడతాడు .(స్కందుడిని ఒప్పించి ఆహ్వానిస్తా డు ).అక్కడ ఒక అమ్మాయి ఆర్త నాదం విని ఆమె ప్రజాపతి
కూతురు దేవసేన(దేవతల సేనాని )ను కేశి బలాత్కరించబో తుండగా చూసి ,అప్పటికే వాడు ఆమె సో దరి దైత్య సేన(దైత్యుల సేనాని )ను
వశపరచుకొనగా ఆమె అంగీకరించగా ,దేవ సేనను కాపాడే ప్రయత్నం ఇంద్రు డు చేయగా వాడు ‘’యెర్ర ఖనిజ పర్వతం ‘’లాగా కిరీటం ,గదతో
కనిపించాడు 3.213.9-‘’కిరీటం గద పాణిం ధాతుమంతం ఇవాచలం ‘’.వాడితో యుద్ధ ం చేశాడు .వాడు వేసిన గదను పర్వత శిఖరాన్నీ
వజ్రా యుధంతో రెండుముక్కలు చేయగా అందులో ఒకముక్క కేశి రాక్షసుడిపైనే పడి,గిలగిల తన్నుకొని లేచి ,ఆబాలిక జోలికి పో కుండా
ఎత్తు కు పో తుంటే ,ఇంద్రు ని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధ ం చేస్తే వాడు ఓడిపో యి వాయవ్యాస్త ్రంతో
పారిపో యాడు –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రు నికి అప్పగించి అభిమానం సంపాదించగా 12.69 ఇంద్రు డు ఊర్వశిని
పురూరవుడికి ఇచ్చేశాడు .చిత్రలేఖ గతి ఏమైందో మాత్రం చెప్పలేదు .కంసుడి రాక్షసముఠా లో కేశి కూడా ఉన్నాడు .కంసుడు వీడిన
కృష్ణ బలరాములను చంపటానికి అశ్వరూపంలో పంపితే వాడు నోరు తెరిచి మీదపడబో తే బెదరని కన్నయ్య బృందావనం లో వాడి నోట్లో
ఎడమ చెయ్యి పెట్టి ,వాడి దంతాలు పగలకొట్టి లోపలి దూరి చీల్చగా వాడు ఏమీ చేయలేక చెమటలు కక్కుకొని ,చొంగ కార్చి ,కక్కుకొని
,ఉచ్చపో సుకొని ఊపిరాడక ఉంటె చేతులు మరీ పెంచి బాలకృష్ణు డు వాడిని చంపాడు .భాగవతం లో కేశి అనిమాత్రమే ఉంటె ,బ్రహ్మ
పురాణంలో వాజీ ,దైత్యవాజీ,దుస్ట వాజి అనీ ,హరివంశం లో దైత్య ,కేశి తురగ దానవ ,దుస్టో స్వో వనగోచరః ,హయాధమః ,కేశి తురగ
సత్త మ అని ఉన్నది .హరివంశ కేశి దుస్ట రాక్షసుడు, మానవ మాంసాహారి,కోపమొస్తే యుద్ధా నికి పెద్దపెద్ద చెట్లు పీకేస్తా డు .చివరికి ఓడిపో యి
నేలపైబడి రెండుగా చీల్చబడి ప్రా ణాలు పో గొట్టు కొంటాడు .భాగవతంలో వాడిని రెండుగాచీల్చినట్లు లేదు .
రాక్షసంహారంలో సాధారణంగా రెండుగా చీల్చటం ఒక క్రీడ.భీముడు బకాసురవధలో ,,కృష్ణు డు బకాసుర సంహారంలో రెండుగా చీల్చే
చంపారు .దాల్భ్యాసుర ,బక,కేశి ఉదంతాలు సమా౦తరాలు .కృష్ణు డు బకుడిని తురగాసురుడిని చంపినపుడు వాళ్ళిద్ద రూ నోళ్ళు పెద్దగా
తెరచి ,శరీరం రెండు సగాలై చచ్చారు .ఊర్వశి చిత్రలేఖ కేశి ఉదంతంలో ఊర్వశి మంచి వైపుకు అంటే దేవతలా వైపుకు ,,చిత్రలేఖ చెడు అంటే
కేశి దైత్యుని వైపుకు మొగ్గా రు .ఇంద్రు డు కేశి అసురుడువేసిన గదను ,పర్వతశిఖరాన్నీ రెండుగా చీల్చాడు .కాని కేశి చావలేదు
విష్ణు పురాణం లో ఖా౦డిక్య, కేశిధ్వజ రాజ సో దరుల వృత్తా ంతం ఉన్నది .ఖా౦డిక్యుడు కర్మ మార్గా వలంబి .కేశి అడవికి వెళ్లి
జ్ఞా నసముపార్జ న చేసి మృత్యు సముద్రం దాటాలనుకొని యాగం చేస్తు ంటే ఒకపులివచ్చి యాగ ధేనువును చంపేసింది .దీనికి ప్రా యశ్చిత్త ం
ఎవరికీ తోచక ,కసేరునుతర్వాత సునకుని కలిస్తే దీనిగురించి చెప్పగలిగేవాడు ఖా౦డిక్యుడు మాత్రమె అంటే గుర్రమెక్కి అతన్ని కలవాలని
వెడితే అతడుతనపైకి దాడికి వస్తు న్నాడేమో అనుకొనగా ,కాదని నచ్చచెప్పగా అతడు తన మంత్రు ల అభిప్రా యం అడిగితె వాళ్ళు
అతడిసో దరుని చంపి రాజ్యభాగం పొ ందమని సలహా ఇచ్చారు .అతడికి ఈలోకం జయించాలా పరలోకాన్నా అనే సందిగ్ధం ఏర్పడి ,ఉత్త మలోక
ప్రా ప్తినే కోరుకొని సో దరుడికి ప్రా యశ్చిత్త విధానం సాకల్యంగా తెలియజేసి ,యాగం పూర్తి చేయించాడు .కేశికి పరలోక ప్రా ప్తి పో యి ఇహలోక
మరో సారి మళ్ళీ వీళ్ళిద్ద రూ కలిశారు .తనయాగం నిర్విఘ్నంగా కొనసాగేట్లు చేసిన సో దరుడికి కేశి గురు దక్షిణ ఇవ్వాలని భావించి
ఏమివ్వమంటావు అనిఅడిగితే ,రాజ్యంకోరకుండా ఖా౦డిక్యుడు’’క్లేశం నుంచి విముక్తి చెందే మార్గ ం ‘’బో ధించమనికోరాడు –‘’క్లేశప్రషామయాలం
యత్ కర్మా ‘’ .రాజ్యం కోరనందుకు అమితాశ్చర్యం పొ ంది,ఖాండి ‘’అవిద్య స్వరూపం ‘’బో ధించాడు –‘’అవిద్యాః స్వరూపం ‘’. ‘’ఖాన్డిక్య
కేశిధ్వజ సంవాదం ‘’పేరుతోకృష్ణ దేవరాయలు’’ ఆమక్త మాల్యద ‘’ప్రబంధంలో అద్భుతంగా చిత్రించాడు .మిగిలినవిషయాలు తర్వాత .
బక దాల్భ్యుడు -21(చివరిభాగం )
కర్మ జ్ఞా నాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా కనిపిస్తా డు .ఇక్కడ ఈ విషయంకాక
మూడో మార్గ ం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బో ధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గా లనూ
అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే సాధ్యం అని మనకు
తెలుస్తో ంది .
ముగింపు
వేదసాహిత్యం ,వేదానంతర సాహిత్యాలలో సామాన్య వ్యక్తు లకు కూడా లబ్ధ ప్రతిష్టు లైనవారితో సమాన ప్రా తినిధ్యం ఇచ్చినట్లు కనిపిస్తో ంది
.ఋగ్వేదంలోని ఆకాశ గమన కేశిగా ,సత్రయాగిగా ,వ్రా త్యకర్మయోగిగా ,పవిత్ర సన్యాసిగా ,పేరుపొ ందిన పక్షిగా ,తీవ్రస్వభావి అయిన దైవాంశ
సంభూతుడుగా ,భయంకర పక్షి రాక్షసుడుగా ,పురాణకాలం లో తీర్దా లు సందర్శించి వాటి ప్రభావాలు వివరించే వాడుగా ,బ్రా హణులలో
వేదకర్మకాండ గ్రంథాలలో పితృ వంశ నామధేయుడిగా దాల్భ్యుడు కనిపిస్తా డు .అయినా వేదదాల్భ్యుడు (బక,కేశి ,చైకితాన్య )మిడిమిడి
జ్ఞా నంతో ,కర్మకాండ తెలిసిన వాడుగా ప్రత్యర్ధితో వైరంతో శాపాలిచ్చేవాడుగా ,అందులో కురు పాంచాలుర మధ్య పో టీదారుగా
కనిపిస్తా డు.బకాదాల్భ్యలేక గ్ల వ మైత్రేయ ,చైకితానేయ లేక చైకితాన్య దాల్భ్యుడు సామవేద ఉద్గా తలలో కనిపిస్తా డు .కానీ కేశి దాల్భ్యుడు
యాగలేక యజ్ఞ యజమాని ఐన క్షత్రియుడుగా కనిపిస్తా డు అనేక దాల్భ్య వృత్తా ంతాలలో తరచుగా కర్మిస్టి గా సత్రయాగ లేక వ్రా త్య
బృందాలలో కనిపిస్తా డు .వేదసాహిత్యంలో కేశి దాల్భ్యుడికి ప్రత్యేక పాత్ర ఉన్నది.వేదానంతర సాహిత్యంలో ఇలాంటి ప్రా ముఖ్యత ఆయనకు
ఎక్కడా లేదు .అయినా ఆయనకు బకాదాల్భ్య వంటి విడదీయరాని సంక్లిష్ట నేపధ్యం ఉన్నట్లు కనిపిస్తు ంది .అసురకేశి చావు రెండుగా
ఋగ్వేదంలోని ఎగిరే కేశి ,దాల్భ్యుడు ,వ్రా త్యకర్మలతో లింకున్న వేదానంతర పాత్ర.జైమినేయ అశ్వమేధం లోని బకదాల్భ్యుడు ,ఋగ్వేద
కేశిమూలాలున్నవాడు అనిపిస్తా డు .ఆకాశగమన దాల్భ్యుడు ఋగ్వేదంలోని కర్మకాండ రహస్యాలు తెలిసిన గ౦ధర్వ ,అప్సరసలతో
సంబంధమున్నవాడు .జాతక కథలలో రోషావేశమున్న దైవాంశ కల బకుడుగా అనేక పక్షిజాతుల నాయకుడుగా జైమినేయ అశ్వమేధ౦లొని
బకదాల్భ్యుడుగా కన్పిస్తా డు.దాల్భ్యుడి అతీత శక్తు లకు నేపధ్యం బక,కేశి లు రాక్షసగణాలుగా, అసురులుగా మారటమే .ఈపతనం అంతా
భయంకరాకారం కల బెగ్గు రు పక్షుల అంటే బకలేక కారిక ద్వారా వచ్చిందే .ఇక్కడే బకుడికీ, యమ అవతారానికి సంబంధం కలిగింది .కేశి
పదం లో అంతరార్ధ ం దీర్ఘ కేశాలున్నవాడే అనికాకుండా ,కర్మిస్టి భూత పిశాచ భేతాళ రూపలున్నవాడు అనికూడా .ఇతిహాస ,పురాణాలలో
రాక్షస బకునికి సో దరులు ,బంధుగణం ఉన్నట్లు చెప్పబడింది .బక గణం అనేది ప్రపంచం చుట్టూ తిరిగే దుస్టా త్మలకు,సమూహంగా జీవించే
సామాన్య పక్షిజాలానికి మధ్య సమీకరణం వంటిది .బాగా సమీక్షిస్తే బకం అనే భావన , వేదం కాలానంతర బకదాల్భ్యుడు- వేద
బకదాల్భ్యుని చక్రభమ
్ర ణమే(రీ సైక్లింగ్) .వేదానంతర బక దాల్భ్యుడు అనేక కొంగ లక్షణాలకలగా పులగమైన (కాన్ గ్లొ మేరేషన్)ఉన్న ఎగిరే
శక్తికల పితృవంశ పేరున్న దాల్భ్యుడే ఇదికాక కొంగకున్న అవలక్షణాలైన విశ్వాస ఘాతుకం కపటం ,దొ ంగజపం ముసలి తనం ఉన్నవాడే
.ఒక్కోసారి పక్షిరూపం లో రూక్ష దైవీ భూత శక్తితో సర్వజ్ఞు డైన పక్షిరాజుగా ,ఎగిరే శక్తిఉన్న శివుని అవతార అంశగాకనిపిస్తా డు .కర్మిస్టు లైన
వ్రా త్యులయెడ, వేద బ్రా హ్మణుల వైఖరికి ధ్యానబకం ప్రతీక .బక అంటే బ్రా హ్మణుల వ్యంగ్య చిత్రం (కారి కేచర్ ).బకం అంటే అణచబడిన
బ్రా హ్మణుల భయం ,కోపం ,దూకుడు శత్రు త్వాల ప్రతిబింబమే సామూహికంగా ,వ్యక్తిగతంగా .
ఈ 21 ఎపిసో డ్ ల ధారావాహికం ‘’బకాదాల్భ్యుడు ‘’కు ఆధారం – SOCIATES ORIENTALIS FENNICA –HELSINKI-1999 లో ప్రచురించిన
’STUDIA ORENTALIA’’-85 VOLUME .లో ‘’ BAKA DÄLBHYA: A COMPLEX CHARACTER
IN VEDIC RITUAL TEXTS, EPICS AND PURÄlyAs
రచయిత -Petteri Koskikallio
బకాదాల్భ్యుని గురించి అతని ఓపిక శ్రమ అన్వేషణ ,తపన కు జేజేలు .ఇతని ఇతర పుస్త కాలు –వేదిక్ ఇన్వెస్టి గేషన్స్,లాజిక్ ఇన్ ఎర్లియర్
క్లా సికల్ ఇండియా,ఆరిజిన్ అండ్ గ్రో త్ ఆఫ్ దిపురానిక్ టెక్స్ట్ కార్పస్ ,స్క్రిప్ట్ అండ్ ఇమేజ్ ,జైనా స్ట డస్
ీ .-మొదలైనవి .
మహాభక్తు ల పైశ్లో కం జ్ఞా పకం వచ్చి అందులో దాల్భ్య పేరు చూసి ఆయనెవరో తెలుసుకోవాలని అన్వేషించిన నాకు కొంత సమాచారం దొ రక
ి ి
‘’ఎవరీ దాల్భ్యుడు ?’’వ్యాసం రాశాను .మా అబ్బాయి శర్మ నా తపన గ్రహించి పై పుస్త కాన్ని లింక్ ద్వారా పంపాడు .మొదలు పెట్టి
చదువుతుంటే ఎన్నో ఆసక్తికర విశేషాలు గోచరించి వెంటనే ‘’బక దాల్భ్యుడు’శీర్షికతో 27-5-20 న ప్రా ర౦భించి ఇవాళ 19-6-20 న చివరి
ఎపిసో డ్ 21 తో ముగిస్తు న్నాను .ఏ దేశం కన్న బిడ్డో ఆ రచయిత మన వేద ఉపనిషత్ ఇతిహాస పురానణాలపై సాదికారాధ్యయనం చేసి
అమూల్య విషయాలు అందించాడు .అతడు ఏ దేశంవాడో నెట్ లో వెతికితే నాకు దొ రకలా .దొ రక
ి ాక అతిని గురించి రాసి ఋణం
సమాప్తి
బాలకవి శ్రీ చెరువు వారి ''లింగోద్భవ సర్వస్వం ''రాసి బాలకవిని బ్రహ్మకవిని చేశారు అలాగే వారూ పెద్ద చెరువు
వారయి తమ సాహిత్య సర్వస్వాన్ని,శేముషీ వైభవాన్నీ ప్రదర్శించి సాహితీ ప్రియుల్ని చకితులను చేశారు .
''చిన్న చెరువు'' ను ''మహా సాహిత్య సంద్రం''గా ఆవిష్కరించిన మీ విద్వత్తు కు నమోవాకాలు . నేను ముందే
మీకు రాసినట్లు ఇది బాలకవికి ప్రతిభకు సాహిత్య పతంజలి చేసిన సవ్యాఖ్యానం . సాహిత్య చరితల
్ర ో
చిరస్మరణీయమై నిలుస్తు ంది .రాసిన బాలకవికి ,దానికి సర్వస్వం రాసిన మీకు, మీకు ప్రేరణ కల్పించిన రావి వారికి
,,లింగోద్భవ కావ్యాన్ని మొదటిసారిగా నాకు పంపి చదివింప జేసి,నాద్వారా రావి వారికి అంద జేయించిన శ్రీ
తూములూరు వారికి సాహితీ లోకం సదా కృతజ్ఞ త చూపుతుంది మరొక్క మారు మిమ్మల్ని మనసారా
అభినందిస్తూ ,పూర్తిగా చదివే దీన్ని రాశానని మనవి చేస్తూ -సెలవ్- దుర్గా ప్రసాద్
1-7 missing
లింగోద్భవ వృత్త మాలికా స్తు తిః- -2
7-గంగా మూర్ధ జ కామనీయక నిధే ,కళ్యాణ సంపత్ప్రద—ప్రా వారీకృత సి౦ధురాజిన దయా సిందో సుబన్ధో
మమ
దేవస్త వ్య మహానుభావ మృడహే శ్రీ కంఠ,విద్యేశ్వర –స్మారం స్మారమహం నమామి పదయో
స్తేమామవా నారతం
8-శూలిన్నీశ శివాద్రి మందిర హరీ షో దేవ దేవ ప్రభో –సర్వజ్ఞా ౦తక శాత్రవాన్ద క రిపో –భూతీధ్యభూతేశ్వర
మేరు క్ష్మాధర కార్ముకాత్త కర,పారావార తూణీరక.-స్మారం స్మార మహం నమామి పదయో స్తేమా
మవానారతం.
22-ఉన్మత్త పుష్ప సుహితాయ ,హితాయ తుభ్య –మున్మత్త మన్మధ హరాయ ,హరాయ నౌమి
ఆయుః ప్రయచ్చపరమం పరి పాల యాస్మాన్ –సర్వత్ర దేహి విజయం వినయం చ విద్యాం .
23-కంఠే కాలం వపుషి ధవళం లోహితం కేశ పాశే –భూషాస్థా నే భుజగ భరితం చంద్ర సాంద్రం కిరీటే
దారార్ధా ంగం భవహర మజం సర్వ దేశ ప్రభుత్వాం-శాంతం దాంతం శరణ మగమం పాహిమాం దేవ
దేవ.
హర మమర పతిం త్వాంవందనీయం నమామి –త్వమ పృధుక మేనం సత్యనారాయణం మాం .
29-సింహ వాహా పతే స్వర్గ గేహ ప్రభు –స్తు త్య మాం సర్వదా సత్యనారాయణం
త్వత్పాదాంభోజ యుగ్మ ద్విరేఫాయితం –భక్తి యుక్తిం విదేయం విధేహి ప్రభో .
32-శాంతం దాంతం పాపదూరం సుభీమం –భర్గ ం దేవం భక్త హృ త్సౌ హ్రు దస్త ం
34-హర ,భవ దేవ భీమ పరమేశ్వర హే –భవ హర శూల హస్త సురవర్గ పతే
వహ్ని ద్రు క్త దపి చాశ్రయంత్యహో –జ్ఞా న రత్న నిధి రిత్య మీ జనాః.
సత్య నారాయణేనయ
ే ం –కృతి నా కృతి రర్పితా.
,నిస్శ్వాసం వంటిది .''అస్య మహతో భూతస్య విశ్వ సిత మే వితత్ రుగ్వేదో ,యజుర్వేదః ,సామ
వేదః అధర్వణ వేదః ''.శ్వాస మానవు తో కూడా పుట్టింది .దానికి కర్త కాదు .అంటే భగ
వంతుడు కూడా .ఆయన అనాది కనుక శ్వాస అయిన వేదమూ ఆనాడే .భగ వంతుడు
నిత్యం కనుక వేదం కూడా నిత్యమే .వేదమే శ్రు తిఅంటే ''విన బడి నది ''.బ్రహ్మ కు విని పిస్తే
మహర్షు లకు ఆయన చెబితే ,అలా పరం పర గా వ్యాపించింది .కనుకనే వేదం అపౌరుషేయం
అంటారు . .
-- ఉప+ని+శదుల్ అనేది ధాతువు .శదుల్ అంటే విశరణ ,గతి ,ఆవ సాదన అనే
అర్ధా లున్నాయి .కార్య రూప సంసారాన్ని ,శరణం అంటే ,శిధిలం చేసి ,అజ్ఞా నాన్ని ,ఆవ
సాదనం (నశింప )జేసి ,బ్రహ్మ ను గతి గా పొ ందించేది -ఉపనిషత్ .''విశాన్న మాస్యం ఆత్మ
తత్త ్వం ఇతి ఉపనిషత్ ''ఆత్మ తత్త ్వం దేనిలో పూర్తిగా నిండి ఉన్నదో ,అది ఉపనిషత్ .గురువు
సమీ పం లో కూర్చుని నేర్చు కొనే విద్య అనే అర్ధమూ వుంది .మోక్షాన్ని చ్చె విద్యే ఉపనిషద్
విద్య .బ్రహ్మ విద్య ను ప్రధానం గా ఇవి బో ధిస్తా యి .దాన్ని నేర్చు కొనే విధానాన్ని తెలియ
జేస్తా యి .మనకు ఉన్న దశోపనిషత్ లలో వున్న సారాన్ని గురించి తెలుసు కొందాము .
''ఈశా వాస్యం ''అనే మాట తో ప్రా రంభ మైంది కనుక ఆ పేరు వచ్చింది .శుక్ల
యజుర్వేదానికి చెందింది .18 మంత్రా లున్నాయి .దీని శాంతి మంత్రం ''పూర్ణ మదః పూర్ణ
మిదం ,పూర్ణా త్ పూర్ణ ముదచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవా వశిష్యతే ''ఇదే
అద్వైతం .త్రా డును చూసి పాము అనుకుంటాం .వెలుగు లో తాడు లానే కన్పిస్తు ంది .దానిలో
మార్పు లేదు .అట్లా గే బ్రహ్మ వస్తు వే ప్రపంచం గా కని పిస్తు ంది .అయితె బ్రహ్మత్వం లో
మార్పు లేదు .అట్లా గే ,సత్య మైన బ్రహ్మమే పూర్ణ వస్తు వు .వస్తు త్వం లేని ప్రపంచం మిధ్య .
మొదటి మంత్రం లో ''ఈశా వాస్య మిదం సర్వం యత్కించ జగత్యా జగత్ ''అంటే
కన బడేది జగత్తు .అంతా బ్రహ్మమే .అంటే జగత్తు బ్రహ్మము భిన్నం కావు .కనబడే జగత్తు
అనే భావాన్ని వదిలి దాని ఆధార మైన బ్రహ్మకై అన్వేషించాలి .ఎవరి ధనాన్ని ఆశించ రాదు
.ముముక్షు మార్గా న్ని పొ ందాలి .మూడు నుంచి ఎనిమిది మంత్రా లలో ఆత్మ సర్వ వ్యాపక
మైనదని ,సర్వాత్మ భావన వల్ల శోక మొహాలు లేని నిత్య ,శుద్ధ ,బుద్ధ ,ముక్తి స్వభావం గల
బ్రహ్మమే తాను గా మారి మోక్షాన్ని పొ ందుతాడు అని చెప్పారు ..రెండవ మంత్రం లో జ్ఞా న
మార్గ ం తెలియని వారికి భక్తీ ఏ శరణ్య మని నిష్కామ కర్మ రహశ్యాన్ని చెప్పారు .తొమ్మిది
నుంచి పద్నాలుగు మంత్రా లలో ,కర్మ ను విడిచి ఉపాసన కాని ,ఉపాసన లేని కర్మ కాని
15 నుంచి 18 వరకు ఉన్న మంత్రా లలో దీని వల్ల లభించే క్రమ మైన ముక్తి తెలప బడింది
.ఉపాసకుడు సూర్య గోళం ద్వారా ,బ్రహ్మ లోకం చేరి ముక్తు డౌతాడు .అయితే క్రమ ముక్త్రి
మార్గ ం అను సరించని పుణ్య కర్మ ఏ ధూమాది మార్గ ం ద్వారా చంద్ర లోకం చేరి ,సుఖాను
భావం పొ ంది ,మళ్ళీ భూలోకం చేరతారు. కనుక ఆ మార్గ ం కాకుండా ,''అగ్నే నయ సుపదా
''అనే 18 వ మంత్రం లో అగ్ని ద్వారా పునరా వ్రు త్తి రహిత మైన ముక్తి ని పొ ందాలని సారాంశం
.
కేన ఉపనిషత్
సామ వేదానికి చెందినదీ ఉపనిషత్ .''కేన ''అనే మంత్రం తో ప్రా రంభ మైంది
.నాలుగు ఖండాలు ,34 మంత్రా లు .ఒకటి నుంచి ఎనిమిది మంత్రా లలో ఆత్మ తత్వ నిరూపణ
,తొమ్మిది నుంచి పన్నెండు ,పద్నాలుగు నుంచి ముప్ఫై ఒకటి మంత్రా లలో ''ఆత్మా
దుర్విజ్నేయ బో ధ '',32 -34 లలో ''ఆత్మా జ్ఞా న సాధన ,13 లో మనుష్య జన్మ ఉత్క్రుష్ట త
చెప్ప బడింది .ఇది గురు శిష్య సంవాదం గా ఉంటుంది .జడాలైన దేహం ,ఇంద్రియాలు ,అంతః
కరణాలు ,ప్రా ణాలు ఎవరి ప్రేరణ చేత ప్రవర్తిస్తు న్నాయి అనే ప్రశ్న ను శిష్యుడు వేస్తా డు
.వీటన్నిటిని పరమాత్మయే ప్రవర్తింప జేస్తా డని సమాధానం .ఆ పరమాత్మ జ్ఞా నమే మోక్షం
.ఇంద్రియాలు ,మనస్సు ఆయన్ను తెలియ లేవు .ఏ వస్తు వుని వాక్కు తో చెప్ప లేమో ,ఏది
వాగింద్రియాలను ప్రవర్తింప జేస్తు ందో ,దేని వల్ల మనసు కు మనన శక్తి కలుగు తుందో ,ఏ
వస్తు వును మనసు చింతింప జాలదో ,దేని వల్ల ప్రా ణానికి చలన శక్తి కలుగు తుందో ,అదియే
పరమాత్మ ,బ్రహ్మ వస్తు వు .''ద్వితీయాద్వై భయం భవతి ''తానె కదా అని ,తెలియ బడేది
కాదు .అంటే ఆత్మా జ్ఞా న స్వరూపం .అంటే ''తెలివియే ఆత్మా ''ద్రస్త్రు దృశ్య భావ విరహిత కేవల
ఆత్మకు పుట్టు క లేదు కనుక జాతి మొదలైనవి లేవు .శబ్ద ములు దాన్ని చెప్ప
లేవు .ఆత్మ నిష్క్రియం కనుక క్రియా శబ్దా లు చెప్ప లేవు .రెండో వస్తు వు లేదు కనుక
సంబంధం లేదు .ఏకం ,అద్వితీయం ,సర్వ వ్యాపకం ,అనంతం కనుక శబ్దా దులు ఆత్మ ను
వివ రించ లేవు .''ఆత్మ దుర్విజ్నేయం ''.ఆత్మను తెలుసు కొన్నాను అని తెలిపే వాడు నిజం
గా తెలిసి కో లేదని అర్ధం .ఆత్మ తెలియ బడ లేదని భావించే వాడు నిజం గా ఆత్మ తత్త ్వం
తెలిసి కొన్న వాడు .తెలిసిన వస్తు జ్ఞా నం నుంచి ,''నేతి ,నేతి ''ద్వారా తీసేస్తూ పో తే మిగిలిన
ఏక రూప జ్ఞా నమే ఆత్మ .ఆత్మ జ్ఞా నంపొ ంది తే అమృతత్వం అంటే మోక్షం వస్తు ంది .
విర్ర వీగుతూ ఉత్సవం చేసుకొంటున్నారు .బ్రహ్మం -యక్ష రూపం లో వాళ్ళని పరీక్షిస్తు ంది
.వారి లోని ఆ శక్తిని తెసి వేస్తె వారు ఏ పనీ చేయ లేక పో తారు .పర బ్రహ్మ సహాయ సంపత్తి
వల్ల నే క్రియ జరుగు తోందని అనుగ్రహ శక్తి తీసేస్తే నిర్వీర్యత మిగుల్తు ందని సారాంశం .ఆ
బ్రహ్మమే'' ఉమ ''గా దేవేంద్రు నికి సాక్షాత్కరించి నిజ బో ధ చేసి కళ్ళు తేరి పించింది .ఆత్మ
జ్ఞా నం ఎలా సాధించాలని శిష్యుడు అడుగు తాడు .వేద వేదంగా అధ్యయనం ,నిష్కామ
కర్మాను ష్టా నం ,సత్య వ్రతం ,శమ దమాదుల వల్ల నే సాధ్యం అని గురువు సమాధానం
.మానవ జన్మ ను సార్ధకం చేసుకొని మోక్షం సాధించాలి .అదే మాన వ గమ్యం .అని
కేనోపనిషత్ సారాంశం .
ఇది కృష్ణ యజుర్వేదానికి చెందింది .ఇందు లో ఆరు భాగాలు .వాటికి వల్లి అని పేరు
.నచి కేతునికి యమ ధర్మ రాజు బ్రహ్మ విద్య ను బో ధించటం దీని లోని విషయం .మొదటి
వల్లి లో బ్రహ్మ విద్యను అధికారిత్వం వున్న వాడికే నేర్పాలి .యమ ధర్మ రాజు నచి కేతున్ని
పరీక్షించి ,నేర్ప టానికి అంగీక రించాడు .అన్నదాన కీర్తి పొ ందాలని ,''వాజస్ర వసుడు ''అనే
బ్రా హ్మణుడు ''సర్వ స్వ దక్షినాక యాగం ''చేశాడు .యాగ సమయం లో యజ మాని తన
సర్వస్వాన్ని దానం చేయాలి .ఆయన ,పనికి రాని గోవుల్ని దానం చేశాడు .కొడుకు నచి
కేతుడు చూసి తండ్రికి నరకం వస్తు ందేమో నని భయ పడ్డా డు .అతనికి గొప్ప ''శ్రద్ధ
''ఆవహించింది .తండ్రి తో ''నన్ను ఎవరికి దానం ఇస్తా వు ?''అని అడిగాడు .కోపం తో ఊగి
పో యిన తండ్రి ''యముడికి ''అన్నాడు .అన్న మాట ప్రకారం కొడుకు యమ పురికి చేరాడు
.అప్పుడు యముడు అక్కడ లేడు .మూడు రోజులు పడి గాపులు కాశాడు .ఆహారం కూడా
లేదు .యముడు వచ్చి విషయం గ్రహించాడు .యజ మాని పుణ్యమంతా నశిస్తు ంది అన్న
విషయం తెలిసి ,క్షమా పణ కోరాడు యముడు .మూడు వరాలిస్తా నన్నాడు .తండ్రికి తన మీద
కోపం లేకుండా చేయమని ,అగ్ని విద్య ను నేర్పమని కోరాడు .యముడు అలాగే నేర్పి
''నచికేత చయనం ''అని పేరు పెట్టా డు .మూడవ వరం గా ''ఆత్మ విద్య ''ను బో ధించ మని
కోరాడు .''ఇహ లోకానికి చెందిన ''పితృ సౌమనశ్యం '',పర లోకానికి చెందిన అగ్ని విద్య
,పునరావృత్తి రహితా మైన మోక్ష విద్య కోరు కొన్నందుకు యముడు సంతో షించాడు
.మూడవ దాని నుంచి దృష్టి మరల్చ టానికి లోభ పెట్టా డు .కాని బాలుడు లొంగ లేదు .బ్రహ్మ
విద్య ను తెలుసు కోవ టానికి కావలసిన వైరాగ్యం ,ముముక్షుత్వం మొద లైన సాధన సంపత్తి
నచి కేతుని లో ఉన్నాయని తెలుసు కోని నేర్ప టానికి యముడు సిద్ధ పడ్డా డు .
రెండవ వల్లి లో మానవుడు కోరదగినవి ప్రేయస్సు ,శ్రేయస్సు .అన్న వివరణ చేశారు
.ప్రేయో మార్గ ం ఇహం లో సుఖం ,పరం లో స్వర్గ ం ఇస్తు ంది .శ్రేయో మార్గ ం మొక్షాన్నిస్తు ంది
.బాలు డైనా శ్రేయో మార్గా న్నే కోరు కొన్నాడు నచి కేతుడు .''బ్రహ్మ విద్య వినే వాళ్ళే అరుదు
.విని ,తెలిసి కొనే వారు మరీ అరుదు .తెలిసి సాధన చేసే వారు ఇంకా అరుదు .శ్రవణ ,మనన
,అది ధ్యాస చేసిన వారు అప రోక్ష సాక్షాత్కారం పొ ందు తారు .ముక్తు లౌతారు ''అని
వివరించాడు .పంచ కోశాలకు అతీత మైన ఆత్మ సాక్షాత్కారమే మోక్షం .హృదయమే ఉప లబ్ది
స్థా నం .బ్రహ్మం ''హృదయ గుహ అనే చిదా కాశం లో వ్యక్త మౌతాడు .ఓంకారం వల్ల బ్రహ్మ
సాక్షాత్కారం కలుగు తుంది దీని ఉపాసన వల్లే సగుణ ,నిర్గు ణ బ్రహ్మ ప్రా ప్తి కలుగు తుంది
.వారే జీవన్ముక్తు లు .జీవన్ముక్తు ని దూషించే వారికి అతని పాపాలేమైనా ఉంటె సంక్ర మిస్తా యి
.స్తు తించే వారికి పుణ్యంకలుగు తుంది .ప్రతి వాడు జీవన్ముక్తి సాధించాలి .
మూడవ వల్లి లో దేహ ,ఇంద్రియ ,మనో ,బుద్ధి మొదలైన వాటిలో వ్యక్త ం గా ఆత్మ
కర్త గా ,భోక్త గా ,జ్ఞా త గా కని పిస్తా డు .ఈశ్వ రార్పణ బుద్ధి తో నిష్కామ కర్మ చేసిన వారి
మనస్సు శుద్ధ ం గా ఉంటుంది .వాళ్ల కు ఆత్మ జ్ఞా నం తేలిగ్గా కల్గు తుంది .శరీరమే రధం
.జీవుడు రధికుడు .సారధి -బుద్ధి .గుర్రా లు ఇంద్రియాలు .కళ్ళెం మనస్సు .ఈ రధం తోనే
మోక్షం పొ ందాలి .ఇంద్రియాల కంటే శబ్దా దులు ,వాటికంటే మనస్సు సూక్షమైనవి .మనసు
కంటే బుద్ధి ,దాని కంటే మహత్వం ,దానికంటే అవ్యక్త ం ,దాని కంటే పురుషుడు సూక్షం .శరీరం
లో ఉన్నాడు కనుక పురుషుడు .శబ్డా డు లను ఇంద్రియాల్లో ,ఇంద్రియాలను మనసు లో
,మనసును బుద్ధి లో .బుద్ధిని మహత్వం లో ,దాన్ని అవ్యక్త ం లో ,దానిని పురుషుని లో
లయింప జేస్తే ఆత్మ సాక్షాత్కారమై మోక్షం లభిస్తు ంది .గురు సేవ తో దీన్ని సాధించాలి
.ఇదంతా విన్న వారికి బ్రహ్మ లోక ప్రా ప్తి లభిస్తు ంది .కతోపనిశాత్ పారాయణం అనంత ఫలం
అని యముడు నచి కేతునికి బో ధించాడు .
నాల్గ వ వల్లి లో బ్రహ్మ శ్రు స్తి చేసే టప్పుడు ఇంద్రియాలను ''బహిర్ముఖ ప్రవ్రు త్తి కల
వాణిని ''గా శ్రు స్తించాడు .అందుకే శబ్ద ం మొద లైన వాటి పై వాటికి ఆకర్ద్షణ ఎక్కువ
.అంతర్ముఖం కాలేవు .వీటికి అతీతం గా ఉన్న వాడు మోక్షం పొ ందుతాడు .మనసు శుద్ధ ం
కాక పొ తే ప్రపంచమే నిజం అని నమ్ముతాడు .సు సంస్కృత మైన ఆత్మ సజాతీయ
,విజాతీయ ,స్వ ,పర ,భేద శూన్యమై న పర మాత్మే అవుతుంది .
అయిదవ వల్లి లో దేహం లో 11 ద్వారాలున్నాయని ,శరీరం అద్దె ఇల్లు
అనుకోవాలని ,అన్నిటా పర మాత్మ వ్యాపించి ఉన్నాడని ,ఆత్మకు ఆకారం లేదని ,ఏ
ఆకారమూ లేని పరమాత్మ ,అన్ని ఆకారాలు పొ ందుతాడని చెప్పారు .సూర్య ప్రకాశం అన్ని
వస్తు వు లపై పడినా ,దానికి దో షం లేనట్లే పరమాత్మకు కూడా ప్రపంచం లోని గుణ ,దో షాలు
అంటవు .
ఆరవ వల్లి లో సంసార వృక్షానికి మూలం -పైనా ,శాఖలు కిందా వున్నాయి .అంటే
లోకం అంతా పర మాత్మ యందు ఆధార పడి ఉంది .ఇంద్రియాదులు పర మాత్మ కంటే
వేరైనవి అని ,పరమాత్మ తన స్వరూపమే నని తెలిసిన వాడే ముక్తు డు .కనపడ లేదు కనుక
లేడు అన రాదు .మనసు ,ఇంద్రియ నిగ్రహమే యోగం .యోగి మొక్షార్హు డు .సాగునా రాదన
తో ప్రా ర్సంభించి ,నిర్గు ణ పర బ్రహ్మ ను చేరాలి .కోరిక నశిస్తే హృదయ గ్రంధులు వివ్వ్హిన్న
మౌతాయి .అదే ముక్తి .హృదయం లో 101 నాడుల్లో ''సుషుమ్న ''ముఖ్య మైంది .అది బ్రహ్మ
రంధ్రం వరకు వ్యాపించి వుంటుంది .దాని ద్వారా ,ప్రా ణం ఉత్క్రమాణం చెందితే ముక్తి
.హృదయాకాశం లో ''అంగుష్ఠ మాత్రం ''గా ఆత్మ ప్రకాశిస్తు ంది .అన్న ,ప్రా ణ ,మన ,విజ్ఞా న
,ఆనంద మయ మైన పంచ కోశాలను వేరు పరచి ఆత్మ సాక్షాత్కారం పొ ందాలి .
4--ప్రశ్నోపనిషత్
ఇది అధర్వణ వేదానికి చెందింది .ప్రశ్నే జవాబుగా ఉండటం చేత ,ఆ పేరు వచ్చింది
.ముండకోపనిషత్ లోని విషయాలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి .వేద విదు లైన
సుకేషుడు ,సత్య కాముడు ,సౌర్యాయని ,కౌశల్యుడు ,కాత్యాయనుడు ,భార్గ వ వై దర్భి అనే
ఆరుగురు మహర్షు లు పిప్పలాదుని ఆచార్యుని గా స్వీ కరించి ప్రశ్నలు అడిగితె ఆయన
చెప్పిన సమాధానమే ఈ ఉపనిషత్ .
కాత్యాయనుడు ''దేని వల్ల ప్రజలు పుదు తున్నారు ""?అని అడిగాడు
.పిప్పల మహర్షి ''హిరణ్య గర్భుడు అనే ప్రజా పతి తపస్సు చేసి ''రయి ''(ధనం )శబ్ద బో ధితుడై
న చంద్రు ని ,ప్రా ణ శబ్ద బో ధితుడైన సూర్యుని ,సృజించారు .వీరిద్దరూ కలిసి సకల ప్రపంచాన్ని
సృష్టించారు .సూర్యా చంద్రు ల స్వరూపమే సంవత్సరం .దక్షణా యన ,ఉత్త రాయనాలు .చంద్ర
లోకం చేరి మళ్ళీ భూమికి చేరే వారి మార్గ ం దక్షిణాయనం .జితేంద్రియత్వం బ్రహ్మ చర్యం
,ఆస్తిక్యం ,జ్ఞా నం కల వారు సూర్య లోకానికి ఉత్త రాయణ మార్గ ం ద్వారా పో తారు .ఇక్కడ
బ్రహ్మ తో పాటు మోక్షం పొ ందు తారు .దక్షిణాయన మార్గ ం వారికి పునర్జన్మ ఉంటుంది
. .సూర్య సంచారం వల్ల అహో రాత్రా లు ,చంద్రు ని వల్ల తిధులు యేర్పడ తాయి .ఋతువులు
,మాసాలు సూర్యుని వల్ల నే కనుక ''ప్రజా పతి ''అయాడు .అన్నం వల్ల ప్రజలు పుడు
తున్నారు కనుక ''అన్నమూ ''ప్రజా పతి స్వరూపమే .ఋతు కాలమ్ లో స్వ భార్య తో సంగ
మించాటమే ప్రా జా పత్యం .
భార్గ వ మహర్షి ''ఎందరు దేవతలు ఈ దేహాన్ని ధరిస్తు న్నారు -ఎవరు ఇందులో
గొప్ప వారు ?''అని ప్రశ్నించాడు .దానికి సమాధానం గా పిప్పల మహర్షి చెప్పిన సమాధానం
తెలుసు కొందాం .''పంచ భూతాల మ్కర్మెంద్రియ,జ్ఞా నేంద్రియాల మనో బుద్ధు ల అభిమాన
దేవస్థ లంతా దేహాన్ని ధరిస్తా రు .వీరిలో ఎవరికి వారే గొప్ప గా భావించారు .అయితె ప్రా ణం
లేక పొ తే శరీరం లేదు కనుక ప్రా ణమే అన్నిటి కంటే గొప్పదని తీర్మానించారు .దేవతలంతా
ప్రా ణాన్ని ''నీవే అగ్నివి ,సూర్య ,మేఘ ,పృధివీ చంద్రు డివి .అమృత రూపుడివి ,సమస్త ం నీ లో
ఉన్నాయి .నీవే ప్రజా పతివి .భోగ్య భోక్త లు నీవే .దేవతలకు హవిస్సు లందించేది
,పితృదేవతలకు ''స్వద ''అందించేది నీవే .సత్యం ,రుద్రం జ్యోతి నీవే .ప్రధమ శరీరివి నీవే .తల్లి
,తండ్రి నీవే .సర్వ సంపదలకు కారణం నువ్వే .ప్రజ్ఞా ను మాకు ప్రసాదించు ''అని ప్రా ర్ధించారు .
కౌశల్యుడు -''ప్రా నోత్పత్తి ఎలా జరుగు తుంది ?''అని అడిగాడు .పిప్పలుని
సమాధానం --''ఆత్మ వల్ల ప్రా ణం కల్గు తుంది .చాయ లాగ ఆత్మకు ప్రా ణం అంటే వుంటుంది
.ప్రా ణం ఆత్మ లోనే లయమవుతుంది .నాసిక ద్వారా ప్రవర్తిస్తు ంది .మల మూత్రా లకు అపాన
వాయువు లా ఉంది .తిన్నస ఆహారం నాభి లో పచనమై సమానంగా వ్యాపించ టానికి
''సమాన వాయువు ''గా ,హృదయం లో ఆత్మ తో కలిసి ఉంది .నాడులలో ''వ్యాన వాయువు
''ఉంది .ఉదాన వాయువు ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి దారి .సూర్యుడు ముఖ్య ప్రా ణాన్ని ''నేతం్ర
''లో ఉంచాడు .దాని వల్ల రూపం తెలుస్తు ంది .శరీరం పడి పో కుండా అపాన వాయువు
కాపాడుతుంది .శరీరాంతర్గ త మైంది సమాన వాయివు .వ్యాన వాయువు శరీరం అంతా
వ్యాపించి ఉంటుంది .ఉదాన వాయువు ''ప్రా ణ ఉత్క్రమనకు ''కారణం అవుతుంది .మిగతా
నాలుగు శరీరం నిలవ టానికి కారణం .ప్రా ణాన్ని తెలిసి కోని ప్రా ణో పాసన చేస్తే పుత్ర పౌత్రా ది
సంతానం నశించదు .అమరత్వం చెందు తాడు .
నాల్గ వ ప్రశ్నను సౌర్యాయన రుషి వేశాడు .''ఏ ఇంద్రియాలు నిద్రా స్థితి లో
స్వప్నాలను చూడ లేక ,స్వ స్వరూప మైన సుఖాన్ని నిద్ర లో అనుభ విస్తా డు .సర్వం
పరమాత్మను ఆశ్రయించే ఉంటుంది .అంటే ఆత్మాశ్రయమే .ఆత్మ చూసేది వినేది ,తెలిపేది
,తెలుసుకొనేది .కర్త ,జ్ఞా నం కూడా ఆత్మే .ధర్మా లన్ని ఆత్మ లోనే ఉన్నాయి .ఈ ధర్మా లన్ని
అవిద్య చే ఆత్మ లో ఆలోచించ బడుతాయి .ఇదే ఆత్మ జీవిత్వ దశ .ఉపాధి తొలగి ,పో గానే
,జీవత్వం పయి ,స్వస్వరూపం మిగుల్తు ంది .జలం లోని ప్రతి బింబం ,,జలం ఎలా ఎండి పొ తే
బింబం తో కలిసి పో యి నట్లు ,జీవుడు పరమాత్మ లో ఐక్యం అవుతాడు .ఎవరు నామ ,రూప
కల్పిత మైన ఉపాధి లేని వాడు ,రాజసాది గుణాలు లేని వాడు శుద్ధు డు .అక్షరుడు అయిన
పరమాత్మను తెలుసు కొంతాడో ,అతడే సర్వజ్ఞు డు .సర్వ స్వరూపుడు .సర్వాత్మ భావుడు
.అంటే పరమాత్మ స్వరూపుడు అవుతాడు .ఈ విధం గా స్వప్నం సుషుప్తి ,విచారణ తో
జీవాత్మ .పర మాత్మ ల అనన్యత్వం నిరుపించ్బడింది .
అయిదవ ప్రశ్న ను సత్య కామ రుషి వేశాడు /''ఓంకారం జపిస్తే ఫల మేమిటి
ముండక ఉపనిషత్
ఇది అధర్వణ వేదానికి చెందింది .మూడు అధ్యాయాలు ,రెండేసి ఖండాలున్నాయి
.బ్రహ్మ విద్యను గురించి చెప్పినది .ముందకం అంటే శిరస్సు .శబ్ద ,శైలీ ,ఛందస్సు విషయ
గాంభీర్యం వల్ల ఇది శిరో భూషణ మైంది .అందుకే ఆ పేరు .చివరి మంత్రం లో ''శిరో వ్రతం
''చెప్ప బడటం తో అన్వార్ధ మైంది .''సంపూర్ణం గా క్షుర కర్మ చేసిన శిరస్సు మీద అగ్ని ధరించి
వ్రతం ఆచా రించే వారికే ఈ ఉపనిషత్ లోని బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తా రు ''కానుకను
మున్ద కోపనిశాతయింది .ఇందు లోని కొన్ని భాగాలు ''బ్రహ్మ సూత్రా లు ''లో విని యోగింప
బడినవే .
సృష్టి కర్త అయిన హిరణ్య గర్భుడు దేవతలలో ప్రధముడై ,అభివ్యక్తి ని పొ ంది
,బ్రహ్మ విద్య ను నేర్చి ,తన పుత్రు డైన ''అధర్వుని ''కి ఉప దేశించాడు .ఇందు పరాపర విద్య
బో ధింప బడింది .నిర్గు ణ బ్రహ్మాన్ని బో ధించేది పర విద్య .సగుణ బ్రహ్మాన్ని తెలిపేది అపర విద్య
.ధర్మా ధర్మాలు ,సాధనా,ఫలాలు ,ను చెప్పేది అపారం .ఇది పర విద్యకు మార్గ ం చూపిస్తు ంది
.శౌనకుడు అనే మహర్షి అంగీరసుడు అనే గురువు వద్ద కు కానుక ను తీసుకొని వెళ్లి ''ఏ
వస్తు వు ను గురించి తెలుసు కొంటె ,సర్వం తెలియ బడు తుందో దాన్ని నేర్పండి ''అని
అడిగాడు .అందుకే దీన్ని ''ఏక విజ్ఞా నేన సర్వ విజ్ఞా న ప్రసంగం ''అంటారు .తత్వాలు మూడు
.జగత్తు ,జీవుడు ,ఈశ్వరుడు .దీనిలో దేని తత్వాన్ని తెలుసు కోన్నా మిగిలిన రెండు
తెలుస్తా యి .నాలుగు వేదాలు ,శాస్త్రా లు ,మొదలైన వన్నీ అపర విద్యలు .దేనితో పర
బ్రహ్మాన్ని పొ ంద గలమో దాన్ని చెప్పేది పర విద్య . అక్షర బ్రహ్మాన్ని చెప్పేది ఉపనిషత్ .ఇవీ
అపర విద్యలే .దీని వల్ల పర బ్రహ్మ ప్రా ప్తి లభిస్తు ంది కనుక ఆ విజ్ఞా నం పర విద్యే .పర విద్య
అదృశ్యం ,అగ్రా హ్యం .అగోత్రం ,అవర్నం ,నిత్యం ,విభువు ,సర్వత్వం ,సూక్ష్మం ,సర్వ వ్యాపకం
,అవ్యయం ,సర్వ భూత కారణం .సాలె పురుగు తన లో నుంచే దారాన్ని తీసి గూడు కట్టి నట్లు
,ఓషధులు తమంత తాము జన్మించి నట్లు ,మానవుని కేశాలు ,రోమాలు సహజ మైనట్లు
అక్షర పర బ్రహ్మం నుంచి సృష్టి ఏర్పడుతుంది .
సాలె పురుగు ఉదాహరణం వల్ల బ్రహ్మం ,జగత్తు కు నిమిత్త ఉపాదాన కారణం
.ఒశాధులకు పృథ్వి ఆధార భూతం .మూడవ దాని వల పురుష ప్రయత్నం లేకుండా నే జగత్
సృష్టి జరిగింది .చైతన్యం తో పాటు ,జడమైన కేశాలు ,గోళ్ళు సహజం గా ఏర్పడుతున్నాయి
.అలాగే బ్రహ్మ ప్రయత్నం లేకుండా ఆయన లక్షానికి విలక్షణ మైన జడ స్వరూపం గాను సృష్టి
జరుగు తోంది .అన్ని కార్యాలకు కారణం ఎలా అవసరమో ,కార్య మైన జగత్తు కు కారణం
ఉండాలి .అదే సర్వజన మైన బ్రహ్మం .బ్రహ్మం ప్రయత్నం లేకుండా సృష్టి జరుగు తోంది కనుక
,జగత్తు ను సృష్టించిన మరో శక్తి బ్రహ్మం లోనే ఉంది .బ్రహ్మం వివర్త రూపం లో వృద్ధి చెందగా
,ఆయన లోని శక్తి (మాయా శక్తి )ఇచ్చా శక్తి,హిరణ్య గర్భుడు ,మనస్సు ,భూతాలు ,ప్రా ణులు
,కర్మలు ,ఫలాలు కల్గు తున్నాయి .కర్మ ఫలమే అమృతం .అక్షర పరమాత్మ సర్వజ్ఞు డు ,సర్వ
వేత్త ,జ్ఞా న తపస్సు కల వాడు ..జీవుల అనుభవాలు విచిత్రం గా ఉండ టానికి కారణాలు
పూర్వ కర్మ ఫలమే .అంటే కాని పరమేశ్వర పక్ష పాఠం కాదు .
ద్వితీయ ఖండం
అగ్ని హో త్రా ది కర్మలు విద్యుక్త ం గా చేయక పొ తే వచ్చే దో షాలు ,చేస్తే వచ్చే ఫలితాలు మొదటి
ఆరు మంత్రా లలో చెప్పారు .కర్మ ఫలం అనిత్యం కనుక వైరాగ్యం అవసరం .యజ్ఞా ది కర్మలు
వాటి పడవల వంటివి .సంసార సాగరాన్ని దాటింప లేవు .వీటి లో తిరిగే వారు గుడ్డి వారే
.యజ్న ఫలం గా స్వర్గా న్ని పొ ంది మళ్ళీ జన్మిస్తా రు .వైరాగ్యం ఒండితే మళ్ళీ బ్రహ్మను
చేరతాడు .
ద్వితీయోధ్యాయం -ప్రధమ ఖండం
ప్రజ్వ లించే అగ్ని నుంచి సమాన రూపాలైన అగ్ని కణాలు పుట్టి నట్లు ,సత్య పర
బ్రహ్మం నుంచి వివిధ జీవులు పుదు తున్నాయ్ .అందులోనే లయమవుతున్నాయి .అగ్నికి
,అగ్ని కణానికి ఎలా భేదం లేదో జీవునికి ,బ్రహ్మానికి భేదం లేదు .కర్మ వాసన చేత సృష్టి
జరుగు తోంది .శరీర ఉపాధులు నశిస్తే ,ఘటా కాశం ,మహా కాశం లో కలిసి నట్లు బ్రహ్మం లో
జీవులు ఐక్యమౌతారు .ఇదే విరాట్ పురుషుని వల్ల శకలం సృష్టింప బడు తోంది .ఆతనికి
కూడా బ్రహ్మమే కారణం .అది తెలిసి న వాడు జీవన్ముక్తి పొ ందు తాడు .
ద్వితీయ ఖండం
మనసు ద్వారా బ్రహ్మాన్ని తెలియాలి .ఓంకారమనే ధనుస్సు తో ,చిత్త ఏకాగ్రత అనే లక్ష్యాన్ని
,జీవుడు అనే బాణం తో బ్రహ్మ మనే లక్ష్యాన్ని కొట్టా లి .ఓంకారం తో ఏకాగ్రత ను సాధించాలి
.ఆత్మేతర ప్రసంగాలు మానె యాలి .అంతటా బ్రహ్మమే .హృదయాకాశం లోనే ఆత్మ
సాక్షాత్కరిస్తు ంది .''సర్వం ఖల్విదం బ్రహ్మ ''
తృతీయ ముండకం -ప్రధమ భాగం
ఒకే మోస్త రు గా ఉన్న విడదీయ లేని జంట పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి
.అందులో ఒకటి కమ్మని ఫలాలు తింటోంది .రెండవది ఏదీ పట్ట నట్టు ఉంది .ఇవేజీవ
,ఈశ్వరులు .మొదటిది కర్మ ఫలం అనుభ విస్తు ంటే ,రెండవ దానికి సర్వజ్ఞ త్వం వల్ల ఆ ఫలం
లేదు .శరీరమే వృక్షం .జీవేశ్వారులు నిజం గా ఒక్కరే .ఉపాధి భేదం వల్ల ఇద్ద రు గా కని
పిస్తు న్నారు .అజ్ఞా నం చేత జీవుడు దుఖితుడు .జ్ఞా నం తో శోక రహితుడు -ఈశ్వరుడు .జ్ఞా నం
వల్ల నే జీవుడు ఈశ్వరుదౌతాడు .ప్కరమాత్మ స్వరూపం తెలిసిన వాడు ''ముని ''యై ,ఆత్మ
లోనే క్రీడించి ,రామిస్తా డు .అతడు బ్రహ్మ వేత్త లలో శ్రేష్టు డు .ఆహ్య సాధనా పేక్ష ఏ క్రీడా .నిర
పెక్షయే ''రతి ''
సత్యం తో ,ఏకాగ్ర తపస్సు తో యాత్మ జ్ఞా నం తో ,ఆత్మ సాక్షాత్కారం పొ ందాలి
యతీశ్వరులు హృదయా కాశం లో ఆత్మ సాక్షాత్కారం పొ ందుతారు ''.సత్యమే జయం
''.ఆత్మకు రూపం లేదు కనుక కంటికి కన్పించదు .వాక్ చెప్ప లేదు .ఇంద్రియ గొచరం కాదు
.ఆత్మ జ్ఞా నికి భోగేచ్చ లేదు .
ద్వితీయ ఖండం
పరబ్రహ్మాన్ని తెలిసిన పురుషుని సేవించిన వారికి కూడా బ్రహ్మో పాసన ఫలం
కలుగు తుంది .బ్రహ్మ వేత్త సాక్షాత్తు బ్రహ్మమే .అలాంటి పురుషుని ఉపాసన బ్రహ్మో పాసనే
.ప్రా పంచిక విషయాలను కోరే వారు జన్మ పరం పర లో పడి మోక్షాన్ని పొ ంద లేరు .కామ
త్యాగం వల్ల ఆత్మ కాముడు ఆప్త కాము డౌతాడు .ఆత్మ జ్ఞా నం తోవిషయ ,కామాలు
నశిస్తా యి .సర్వ కామాల సంపూర్ణ త్యాగమే మోక్ష సాధనం .బహు వేదాధ్యయనం చేత మేధా
,అన్య శాస్త ్ర ప్రా వీణ్యం చేత లభ్యం .ఆత్మేచ్చ కల వారికి పర మాత్మ తన పార మార్ధిక
స్వరూపాన్ని ప్రకాశింప జేస్తా డు సన్యాస పూర్వక జ్ఞా నమే బ్రహ్మ లోకా వాప్తి .బ్రహ్మ లోకం
అంటే బ్రహ్మమే లోకం .బ్రహ్మ జ్ఞా నికి బ్రహ్మ విదుడే జన్మిస్తా డు
''.అను మానాదులచే తెలియ బడని వాడు .అచిన్త్యుడు .శివ స్వరూపుడు .ఓంకారానికి ,ఆత్మ
కు భేదం లేదు .తురీయాత్మ ఓంకారమే .ఆత్మకు నాలుగు పాదాలే .ఓంకారానికీ నాలుగు
అక్షరాలే (మాత్రలే )విశ్వ ,తైజస ,ప్రా జ్న లనే మూడు పాదాలే అ+ఉ+మ్ కారాలు .ఓంకారం
తురీయ మాత్రమైన ఆత్మయే.ఓంకారం ఉపశమనాన్ని స్తు ంది .పరమానందాన్నిస్తు ంది .ద్వైత
రహిత మైనది .ఓంకారం తెలిస్తే ఆత్మ స్వరూపం తెలిసి నట్లే .ఇదీ మాండుక్య ఉపనిషత్ లోని
సారం .
,మూడు లో సంహితో పాసన .వుంది .మోక్షానికి పూర్వం చిత్త ఏకాగ్రత ,సత్ ప్రవర్త న ,అవసరం
.దానికి ఉపాసనలు తెలిపారు .అక్ష రాలు కూడి అంటే కలిసి వేద రూపం పొ ందటం సంహిత
.ఇవి అయిదు .లోకాలు ,జ్యోతిస్వరుపం ,విద్య ,సంతానం ,దేహం .
ఇకారం లో పృథ్వి ,శే కారం లో ద్యులోక ద్రు ష్టి ,,ఆకాశ సంధి ,వాయువు అను
సంధానం గా ఉపాశించాలి .మొదటి అక్షరం అగ్ని .రెండవది సూర్య స్వరూపం .ఉదకం సంధి
,మెరుపు అనుసంధానం .గురువు మొదటి అక్షరం .శిష్యుడు రెండ వ అక్షరం .విద్య సంధి
విధానమే సంధానం ..తండ్రిమొదటి అక్షరం ,తల్లి రెండవ అక్షరం .సంతానం సంధి .సంసార
ప్రవ్రు త్తి సంధానం .కింది దవడ మొదటి అక్షరం పైది రెండవ అక్షరం .వాక్ సంధి జిహ్వ
సంధానం .ఈ అయిదు రకాల ఉపాసనా ప్రక్రియలకు ''మహా సంహిత ''అని పేరు .ఇది చేస్తే
ప్రజాభి వృద్ధి ,పశు వృద్ధి ,బ్రహ్మ వర్చస్సు ,స్వర్గ ప్రా ప్తి కల్గు తుంది .
నాలుగవ అనువాకం లో బ్రహ్మ ,వేదాన్ని విమర్శించి వేద సార మైన
ఓంకారాన్ని గ్రహించాడు .అది శరీ రాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది .పరమాత్మ ఉప లబ్ధి కి
స్తా నం .మనన ,శ్రవణాలతో అనుభవం లోకి తెచ్చుకోవాలి .మేధా సంపత్తి ,దాని తరువాత
సంపద కలుగు తాయి .అయిదవ అనువాకం ''వ్యాహృత్ ఉపాసన ''-bhooh ,భువః,సువః ,తో
పాటు మహః అనేది నాల్గ వ వ్యావ్రు త్తి .bhooh అంటే భూలోకం .భువః అంటే అంత రిక్షం .సువః
అంటే స్వర్గ ం .మహః -సూర్యుడు .సూర్యుడే బ్రహ్మ .bhooh అంటే అగ్ని .భువః అంటే
వాయువు సువః అంటే సూర్యుడు .మహః -చంద్రు డు .జ్యోతి స్వరుపాలన్ని చంద్రు ని అమృత
కళలను పొ ందుతాయి .bhooh అంటే ఋగ్వేదం ,భువః సామం ,సువః యజుర్వేదం మహః పర
బ్రహ్మ .bhooh -రానం ,భువః-అపానం ,సువః -వ్యానం ,మహః-అన్నం ,అన్నం వల్ల అన్నీ
అభివృద్ధి చెందు తాయి కనుక అన్నం పర బ్రహ్మ .ఇలా వ్యాహృతులను 16 రకాలుగా
ఉపాశించిన వారికి బ్రహ్మ జ్ఞా నం లభిస్తు ంది .చక్ర వర్తి కి లోబడిన సామంత రాజుల్లా గా
ఇంద్రియాలన్నీ అతని స్వాధీనం లో ఉంటాయి .
ఆరవ అను వాకం లో ''వ్యాహృత్ ఉపాసనా ఫలం ''చెప్పారు .హృదయం లో
చిదాకాశం ఉంది .సుషుమ్న మార్గ ం లో ''వ్రు త్తి ''పవహించి కొండ నాలుక ద్వారా ,బ్రహ్మ
రంధ్రా న్ని చేర్తు ంది .శిరస్సు ,కపాలం కలిసే చోటే ''బ్రహ్మ రంధ్రం ''.చని పో యేటప్పుడు భోహ్
వలన అగ్ని లోకం ,భువః వల్ల వాయులోకం ,సువః వల్ల సూర్య లోకం ,మహః వల్ల బ్రహ్మత్వం
ఒండుతాడు .ఇవి బ్రహ్మ రంధ్రం ద్వారా నిష్కర మిస్తే బ్రహ్మ లోకా వాప్తి మాత్రమే కాక
,స్వస్వరూపానుభావం ,సర్వ మానవ నియంతృత్వం ,దూర శ్రవణం ,దూర దర్శనం ,సమస్త
బుద్ధి వ్రు త్తి నియంతృత్వం ,పర బ్రహ్మ భావన ,సర్వ వ్యాప కత్వం ,మనశ్శాంతి పొ ంది చిన్మాత్ర
లో విశ్రా ంతి పొ ందు తాడు .
ఏడవ అనువాకం లో ''పాన్క్తో పాసన ''వుంది .పాన్క్తం అయిదు పాదాలది
ఓంకార పురస్సరం గా నే జరుగు తాయి .బ్రహ్మ ఓంకారం తోనే ఆమోదిస్తా డు .మంత్రా లన్నీ
ఓంకార పురస్సరాలే .వేదాధ్యయనం ,ముగింపు ఓంకారం తోటే .ఓంకారమే ప్రణవం .దాని
ఉపాసనే బ్రహ్మత్వం .
తొమ్మిదవ అను వాకం లో ''స్వాధ్యాయ ప్రవచన విశిష్ట త ''వుంది .మానసిక
సత్యం తోనే వేదాధ్యయనం చేయాలి .తపస్సు ,దమం ,శమం కలిగి స్వాధ్యాయ ప్రవచనం
చేయాలి .సత్యమే గొప్పదని ,''రాదేతరుడు ''తపస్సే అని'' ,పౌరుశిస్టి ''స్వాధ్యాయనమే అని
మౌద్గ ల్యుడు చెప్పాడు .త్రేతాగ్ని ఉపాసన ,అతిధి పూజ ,సంసారం అన్ని ,స్వాధ్యాయ
ప్రవచనం తోనే చేయాలి .వేదం కూడా వీటికే ప్రా ధాన్యత నిచ్చింది .సత్య ,తపస్సు ఫలాలు
స్వాధ్యాయ ప్రవచనం లోనే ఉన్నాయి .
పదవ అనువాకం లో బ్రహ్మ విద్య విశిష్ట త చెప్పారు .అహంకార వృక్షానికి
మూలాధారం పర మాత్మే .బ్రహ్మ విద్యా సంపన్నుల కీర్తి అన్ని లోకాలకు వ్యాపిస్తు ంది అని
''త్రిశంకు ''చెప్పాడు .పదకొండవ అను వాకం లో ''హితోప దేశాలు ఉన్నాయి .సత్య ,ధర్మాల
నుండి ప్రమాదం రాకూడదు .తన ,ఇతర ,సర్వ భూత క్షేమం ,తో ప్రవర్తించాలి .తల్లి ,తండ్రి
,గురువు ,అతిధులను దేవతలు గా పూజించాలి .శ్రద్ధ తో దానం చేయాలి .భయం తో చేయాలి
.యోగ్యత ,పాండిత్యం ,తెలిసి దానం చేయాలి .సంశయాలు తీర్చు కోవాలి .రాగ ద్వేషాలతో
ప్రవర్తించ రాదు .ఇదే వేద ఉపదేశం .,ఆదేశం శాసనం కూడా .
ఈ ఉపనిషత్ లోని ''ఆనంద వల్లి ''ని గురించి తరువాత తెలియ జేస్తా ను .
మహా భారతం కధలో నల కధ ఒక ఉపాఖ్యానం .అరణ్య పర్వం లో ధర్మ రాజు ''బృహదశ్వ మహర్షి
''ని సందర్శించి ,''మా లాగానే ,రాజ్యం ,సంపదా పో గొట్టు కోని ,కస్టా లు పడ్డ వాళ్ళెవ రైనా వున్నారా "?
అని ప్రశ్నించాడు .దానికి మహర్షి ''నువ్వు పరివారం తో సహా అరణ్య వాసం చేస్తు న్నావు .వన వాసం
అన్న మాటే కాని ,రాజ్యం లో ఉన్నట్లే అన్నీ అనుభావిస్తు న్నావు .నీ కష్ట ం ఒక లెక్కా ?నల మహా రాజు
కస్తా ల ముందు నీ కస్టా లు ఎంత '' ?అన్నాడు .ఆ కధ చెప్పమంటే ,మహర్షి వివరించాడు
నలుడి కధ లోనే భారత కధ బీజం లో మర్రి చెట్టు లాగా వుంది .పాండవులు ,నలుడు చంద్ర వంశ
పు రాజులే .పాండవుల లక్షణాలన్నీ నలుడి లోను వున్నాయి .ధర్మ బుద్ధి తో పాటు జ్యూద వ్యసనం
కూడా .బాహుబలం లో నలుడు భీముడే ,వంట వండే వందే నేర్పు తో సహా .అందుకే నల బ్భీమ పాకం
అనే పేరు వచ్చింది .పరాక్రమం లో అర్జు నుడే .బృహన్నల -రూప భేదం తో బాహుకుడు .నకులుడి లోని
అందం ,అశ్వ హృదయ వేదిత్వం సహదేవుడి లోని వివేకము వున్నవాడు నల మహా రాజు .
ద్రౌ పదిది స్వయం వరం కాదు .మత్స్య యంత్రం కొట్టే షరతు .దమయంతిది సాక్షాతూ స్వయం
వరమే .స్వయం వరం తోనే నలుడి కస్టా లు ప్రా రంభం అయాయి .ఇంద్రా దులకు ఈర్ష్య కలుగ లేదు
.పైపెచ్చు నలుని దౌత్యానికి సంతోషించి వరాలు ఇచ్చారు .ఇక్కడ దుర్యోధనుడు కలి అంశ తో పుట్టా డు
.నల కధ లో కలి ప్రధాన పాత్ర పో షించాడు .''ఆచారం నుండే ధర్మం పుదు తుంది -ఏమరు పాటు వల్ల
ఆచారం చెడితే ,సందు చేసుకొని ,కలి మనసు లో ప్రవేశిస్తు ంది'' .అలానే ధర్మ మూర్తి అయిన నలుని లో
కలి ప్రవశి
ే ంచాడు .ద్వాప యుగాన్ని 'పాచికలలో ''ప్రవేశించ మని అంటాడు .
కలి పట్ట్టిన నలుడు రాహుగ్రస్త చంద్రబింబం లాంటి వాడు .కురు పాండవులకు, నలునికి,
జ్ఞా తివైరమే దెబ్బ కొట్టింది .పుష్కరుడు నలుడి పిన తండ్రి కొడుకు .మొదటి సారి జూదం లో ద్వాపరం
ప్రవేశించటం వల్ల ,నలుడు ఓడిపో యాడు .మహా భారత కధ లో ద్రౌ పది centre of activity అవుతుంది
.రాజ్యం కంటే ,ద్రౌ పదీ పరాభవమే కురుక్షేత్రా యుద్ధా నికి కారణం అయింది .దమయంతికి పరాభవ ప్రశ్న
లేదు .నల కధ లో దమయంతి centre of activity .రెండు సార్లు నలుడిని గుర్తించింది దమయంతి
.ద్రౌ పది కంటే దమయంతి విదుషీ మణి .మహిమ కలది కూడా .అడవిలో ద్రౌ పది చూపులతోనే
కిరాతకున్ని భస్మం చేసంి ది .భారత కధ లో ద్రౌ పదికి జరిగిన పరాభ వ్కానికి భీముడు ప్రతీకారం చేయాల్సి
వచ్చింది .
రెండు కధల్లో నూ ,వనవాసం ,అజ్ఞా త వాసం వున్నాయి .నల కధ లో వీటికి కాల పరి మితి లేదు
.నలుడు ఋతు పర్నుని కొలువు లో ఆశ్వాధ్యక్షుడు గా వున్నాడు .దమయంతి ,తన పిన తల్లి వద్దే చేది
రాజ అంతఃపురం లో వుంది ..పాపం సైరంధ్రి ది అజ్ఞా త వాసం .ఊర్వశి శాపం అర్జు నుడికి అజ్ఞా త వాసం లో
ఉపయోగ పడింది .అలాగే ,కార్చిచ్చు లో చిక్కు కున్న కర్కోట కుడు అనే సర్పాన్ని నలుడు కాపాడి
రక్షిస్తే ,ఆ పామే కాటు వేసింది .పాముకు పాలు పో సి చేటుతెచ్చుకున్నట్ల యింది నలుడి పని .నలుడి
రూపమే విక్క్రుతం గా మారి పో యింది .అందాల నలమహా రాజు నల్ల ని బొ గ్గు రూపం లో భయంకరం గా
మారి పో యాడు .బాహుకుడి లా మారి ,అజ్ఞా తం గా జీవించాడు .
ఋతు పర్ణు డు విరాట రాజు లాంటి వాడు .మంచి వాడే కాని దూర ద్రు ష్టి ,వివేకం లేవు .అజ్ఞా త
వాసానికి అటు వంటి వాడే బాగా ఉపయోగ పడు తాడు .దమయంతి ద్వితీయ స్వయం వారానికి వెళ్లి
భంగ పడ్డా డు .ఉత్త ర కుమారుడే, గోగ్రహణ సమయం లో కౌరవులను గెలిచాడని విరాట మహా రాజు
భావించాడు .ఆ మాట నమ్మి ,అది నిజం కాదు అని చెప్పిన కంకుభట్టు (ధర్మ రాజు )ను ,జూదపు పలక
తో కొట్టి ,దయనీయ మైన స్తితి తెచ్చుకొన్న అజ్ఞా ని విరాటుడు .
నలుని కధా మళ్ళీ జూదం తోనే ముగుస్తు ంది .ధర్మ రాజు లాగా ,నలుడూ భార్యను జూదం లో పణం
గా ఒడ్డా డు .నలుడు గెల్చాడు .ధర్మ రాజు ఓడాడు .అందుకని భారత కధలో రక్త ం యేరు లై ప్రవహించింది
.నలుడి కధ లో రక్త ం బిందువు కూడా చింద లేదు .
కష్టా ల్లో ఉన్న వాళ్ల కు ,తన కంటే ,ఎక్కువ కస్టా లు అనుభవించిన వారిని గురించి ,చెప్తే ఊరట
కలుగు తుంది ,అందుకే ''బృహదశ్వ మహర్షి ''నలుని కధ సవివరం గా తెలియ జేశాడు .అంతే కాదు
బారత కదాంశాలన్నీ ,నలుడి కధ లోనే వుండటం మరీ విచిత్రం .ఆలోచనలను రేకెత్తి ంచేది కూడా
.చివరిగా కలి దో షాన్ని పో గొట్టే కధ నలుడిది .నలుడు పుణ్య శ్లో కుడు .పాండవు లందరి సమాహార
స్వరూపమే నలుడు .నలుని అనుభవం అనే సముద్రం లో ,పాండవులు బిందువులు .నల కధ కృత
యుగం నాటిది .భారతం ద్వాపర యుగాన్తా నికి చెందినది .భారత యుద్ధ ం అంటే ద్వాపర యుగాంత
ప్రళయమే నన్న మాట .
కాలం అనంతం .చక్ర భ్రమణం .పూర్వం జరిగినవే ,మరో యుగం లో ,కొంచెం మార్పులతో మళ్ళీ
జరుగు తాయి .ఇదే సృష్టి రహశ్యం .అందుకే సృష్టి రహశ్యానికి ,నిదర్శనం గా ,భారత కదా లో నల కధను
,నిబంధించాడు మహర్షి వేద వ్యాసులు వారు . ఇదే తెలుగు లో ''నన్నయ గారి ప్రసన్న కదా కలితార్ధ
యుక్తి ''.నల కధ తర్వాత శ్రీ రామావ తార కధను వివ రిస్తా డు ధర్మ రాజుకు బృహదశ్వ మహర్షి .రామ
కధ త్రేతాయుగానికి చెందినది . ఆయన కస్టా లు వర్ణ నా తీతమే కదా .ఇందరి కస్టా లు విన్న ధర్మ రాజు
హృదయం కొంచెం శాంతించింది .తన కంటే కష్టా ల కడలి లో మునిగి తేలిన వారు ఎందరో వున్నారు అనే
ఎరుక కలిగింది .స్థిత ప్రజ్ఞతఏర్పడింది . .ఆ తర్వాత వచ్చే కదాంశమే ''యక్ష ప్రశ్నలు .''.ఇందులో
యుదిస్తిరుని వివేకం ,లోక జ్ఞా నం అనుభవం ,ఆదిభౌతికత ,ఆధ్యాత్మిక వైభవం వైభవం ,అతీంద్రియ
జ్ఞా నం ,విశ్వ రూపం గా కని పిస్తా యి .
ఈ విషయాలన్నీ నేను సాహితీ మండలి లో 19 -03 -2002 లో ప్రసంగించినవి .వీటి నన్నిటిని
అప్పుడు నేనెక్కడో చదివి రాసు కొన్నవీ దాచు కొన్నవీ . .ఆ రచయిత పేరు నాకు జ్ఞా పకం రావటం లేదు
.మహత్త ర మైన వ్యాసం చదివాను అనే ఆనందం లో ఆ ప్రసంగం చేశాను .ఆ అజ్ఞా త రచయితకు శిరసు
వంచి పాదాభి వందనాలు చేస్తు న్నాను .చాలా గొప్ప స్పూర్తిని కల్గించిన వ్యాసం అది ఇది వారికే అంకితం
.
యక్ష ప్రశ్నలకు ‘’సమాధానాలు
పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని
ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జు న భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పో యేసరికి
అనుమానించి తానె స్వయంగా బయల్దే రాడు .అక్కడ విగత జీవులుగా కనిపిస్తు న్న సో దరుల్ని చూసి
అంతటి యుదిస్తిరుడు దుఖం ఆపుకోలేక పో యాడు .కొలను చేరి దో సిలితో నీళ్ళు త్రా గాబో యాడు
అప్పుడు ఒక కొంగ తానూ చేపల్ని తినేదాన్నని తన సో దారుల్ని యమలోకానికి పంపింది కూడా
తానేనని చెప్పి తానూ సంధించే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీరు త్రా గా మన్నది .సూక్ష్మ బుధి
గల ధర్మ రాజు ‘’అయ్యా !నువ్వేవరవో చాలా గొప్పవాడివి తప్ప కొంగవు కావు .ఇంతటి సాహసం ఒక పక్షి
చేయలేదు .నా సో దరులు నలుగురు హిమాలయ ,పారియాత్ర ,వింధ్య ,మలయా పర్వతాల వంటి వారు
.వాళ్ల కు ఈ గతిపట్టించటం సామాన్యులకు సాధ్యం కాదు .నువ్వెవరివో ముందు చెప్పు ‘’అన్నాడు
.అప్పుడా కొక్కెర ‘’యుదిస్టిరా !నువ్వు చాలా బుద్ధిమంతుడివి .నేను కొంగనుకాను .యక్షుడిని .నీ
సో దరులు నా మాట వినకుండా అపాయం కొని తెచ్చుకొన్నారు .నేనే వారిని చంపాను ‘’అన్నాడు ధర్మ
రాజు హృదయం విల విలలాడింది కర్త వ్యమ్ తోచలేదు .యక్షుడిని సమీపించి అతని భీకర ఉన్నత
ఆకారం చూసి మహిమగలవాడని గ్రహించి ‘’యక్ష ప్రశ్నలకు ‘’సమాధానాలు చెప్పటానికి సిద్ధ పడి ‘’యక్షా
!నీ అధికారాన్ని ప్రశ్నించటం లేదుకాని నీ ప్రశ్నలేమితో వినాలని మహా కుతూహలంగా ఉంది .ప్రశ్నించు
.నా బుద్ధిబలాన్ని ఉపయోగించి సమాదానమిస్తా ను ‘’అన్నాడు అతి వినయం గా సుస్థిర చిత్త ం తో సిద్ధ
పడ్డా డు .
1-రాజా !సూర్యుడు ఉదయిన్చాతానికి కారణం ఏది ?ఆయన చుట్టూ ఎవరు తిరుగుతారు ?సూర్యుడు
దేనివలన అస్త మిస్తా డు ?ఆయన దేనిలో ప్రతిష్టింపబడి ఉంటాడు ?’’అని తేజస్సుకు సంబంధించిన
నాలుగు ప్రశ్నలను ఒకే సారి అదిగాదూ యక్షుడు .
ధర్మ రాజు ‘’మహానుభావా !బ్రహ్మ వలన సూర్యుడు ఉదయిస్తా డు .దేవతలు ఆయన చుట్టూ
పరిభమి
్ర స్తా రు .ధర్మమే సూర్య అస్త మయానికి కారణం .సూర్య భగవానుడు సత్యం లో సుస్థిరంగా
ప్రతిస్టింప బడి ఉంటాడు ‘’అని తడుముకోకుండా యుదిస్తిరుడు సమాధానాలు ఇచ్చాడు .
2-లోపల సంతోషిస్తు న్నా దాన్ని ప్రకతనం కానీకుండా యక్షుడు శ్రో త్రియత్వం గురించి ప్రశ్నలను
సంధించాడు .’’రాజా ! మనిషి ఏ రకంగా శ్రో త్రియుడు కాగలుగుతాడు ?దేని వలన పరమపదాన్ని
పొ ందుతాడు ?దేని వలన సహాయ భూతుడు కాగలడు?దేనివలన మానవుడు సంపూర్ణ బుద్ధి మంతుడు
అవుతాడో చెప్పు ?’’
పాండవాగ్రేసరుడు ‘’మహాత్మా !వేదార్ధా న్ని తెలుసుకొన్నవాడు శ్రో త్రియుడు అవుతాడు .తపస్సు చేస్తే
వచ్చే జ్ఞా నంతో మహిమాన్విత పదవి పొ ందగలడు శ్రో త్రియుడికి సహాయం గా నిలిచేది ధీరత్వమే
.ధర్మార్ధా లు త్లి సిన పెద్దల సేవ వలన సంపూర్ణ జ్ఞా ని అవుతాడు మానవుడు ‘’అనిసుసంగతమైన జవాబు
చెప్పాడు .
3-తర్వాత -బ్రా హ్మణ సదాచారం గురించిన ప్రశ్నలను యక్షుడు అడుగుతున్నాడు –‘’బ్రా హ్మణులకు
దైవత్వం గా దీన్ని భావించాలి ?మానవత్వంగా దేన్నీ భావించాలి ?బ్రా హ్మణా సత్పురుషుల ధర్మం ఏమిటి
?అసత్పురుషులు ఎలా ప్రవర్తిస్తా రు ?’’అని ప్రశ్నించాడు .
యక్షుడా !స్వాధ్యాయం లో ఏమరు పాటు లేకుండా ఉండటమే బ్రా హ్మణులకు దైవత్వాన్ని సిద్ధింప
జేస్తు ంది .మరణం అనేది వారికి సహజ మానుషత్వం .బ్రా హ్మణ సత్పురుషులు తపస్సు చేయటమే
ధర్మం .పరనింద అసత్పురుష మార్గ ం ‘’అంటూ సద్బ్రాహ్మనత్వాన్ని ధర్మ రాజు ఆవిష్కరించి నిష్కర్షగా
తెలియ జేశాడు .
4-ఇప్పుడుక్షత్రియ ధర్మం గురించి ప్రశ్నా సంధానం చేస్తు న్నాడు యక్షుడు .’’ధర్మ రాజా !క్షత్రియులకు
దైవత్వాన్ని కల్గించేది ఏది ?వాళ్ల కు మానుషత్వం ఏది ?క్షత్రియ సత్పురుష ధర్మమేమిటి ?వారిలో
అసత్పురుషుల మార్గ మేమిటి ?
‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను
పో షించుకోలేని వాడే ,ఊపిరి పీలుస్తు న్నా ,నిర్జీవుడు ‘’అన్నాడు ధర్మ రాజు .మళ్ళీ యక్షుడు –
6-‘’భూమికన్నా పెద్దది ,ఆకాశం కంటే ఎత్తైనది ,గాలికంటే వేగమైనది ,గడ్డి కంటే దట్ట మైనది ఏది ?’’
పాండవ ప్రధముడి సమాధానం –‘’భూమికన్నా భారమైంది తల్లి .ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి
.గాలికంటే వేగ వంతమైనది మనసు .గడ్డికంటే దట్ట మైంది చింత ‘’చెప్పాడు ధర్మ రాజు .
7-‘’నిద్రిస్తూ కూడా కళ్ళు మూయనిది ,పుట్టినప్పటి నుండి చలనం లేనిది ,ఏది ?హృదయం లేని
వాడెవడు?వేగం వలన వృద్ధి పొ ందేది ఏది ?
‘’నీటి లోని చేప నిదిస్తు న్నా కళ్ళు మూసుకోదు .తల్లి పొ ట్ట లోంచి బయట పడినా గుడ్డు కదలదు
.హృదయం లేనిది రాయి .వేగం వల్ల నది వృద్ధిపొ ందుతుంది ‘’అని తెలివైన సమాధానాలు చెప్పాడు .
‘’’’నకులుడిని బ్రతికించండి ‘’అన్నాడు వెంటనే ఏమీ ఆలోచి౦చకుండా .ఆశ్చర్య పడ్డ యక్షుడు ‘’నీ కోరిక
విడ్డూ రంగా ఉంది .భీముడు అంటే నీకు ప్రేమ అర్జు నుడు అంటే నీకు అండా దండా కదా .వీల్లిద్ద ర్ని
బతికించమని కోరుకోకుండా సవతి తల్లి కొడుకు ను బతికి౦చ మనటం లో నీ ఆంతర్య మేమిటి
?’’సూటిగా అడిగాడు.
యుధిష్టిరుడు’’-‘’మహాత్మా !నీకు తెలియని ధర్మం లేదు .ధర్మాన్ని చంపితే అదిమనల్ని వదిస్తు ంది
.ధర్మ రక్షణ చేస్తే అదిమనల్ని రక్షిస్తు ంది .ధర్మ౦ దెబ్బతిని మనల్ని అది తిరిగి దెబ్బ తియ్య రాదు
–‘’ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః –తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వదీత్
‘’అన్నాడు .’’కరుణ పరమ ధర్మ మైనది.అందుకే సమ ద్రు ష్టి తో ఆలోచించాను నా తండ్రికి కుంతీ ,మాద్రి
ఇద్ద రు భార్యలు .ఇద్ద రి బిడ్డ లూ బ్రతికి ఉండటం సమన్యాయం ‘’అని యుధిష్టిరుడు సుస్థిరంగా జవాబు
చెప్పాడు .
అప్పుడు యక్షుడు ‘’ధర్మ రాజా ! నేను ధర్మ దేవతను .నిన్ను చూడాలనే వచ్చాను.కీర్తి ,సత్యం ,శ్రమం
,దమం ,శౌచం ,రుజు వర్త నం ,దానం ,తపస్సు,బ్రహ్మ చర్యం వంటి మహనీయ ధర్మా లన్నీనా రూపాలే
.అహింస ,సమతా ,కరుణ ,మత్సరం లేక పో వటం మొదలైన పవిత్ర మార్గా లే నన్ను చేరుకొనే దారులు.
శమ ,దమ ఉపరతి,తితిక్ష ,సమాధానం అనే అయిదూ నీలో సుస్థిరంగా ఉన్నాయి .,ఆకలి ,దప్పులు ,శోక
మోహాలు ,జర,మృత్యువు అనే ఆరింటిని నువ్వు పూర్తిగా జయించావు .నా భక్తు లకు దుర్గ తి ఏ నాడూ
కలుగదు .నీకో వరం ఇస్తా కోరుకో ‘’అడిగాడు .ధర్మ రాజు ధర్మ దేవతను ‘’బ్రా హ్మణుడిఆరణి మంధన
కాస్టా లుఇప్పించండి ‘’అని కోరాడు .’’అవి నీకు ఇవ్వటానికే నిన్ను ఇక్కడికి రప్పించాను ‘’అని చెప్పి
వాటిని అప్పగించి ‘’నీకు ఇష్ట మైన కోరిక ఏదైనా కోరుకో ‘’అన్నాడు .ధర్మ రాజు ‘’మహాత్మా !మా అజ్ఞా త
వాసం ఏ విఘ్నం జరుగ కుండా పూర్తీ అయ్యేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .ధర్మ దేవత ‘’మీ అజ్ఞా త
వాసాన్ని భగ్నం చేయ గల వారెవరూ లేరు .ముగిసే దాకా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు .విరాట నగరం
లో అజ్ఞా తవాస కాలం గడపండి. మీకు అక్కడ అన్నీ కలిసి వస్తా యి ‘’అన్నాడు .వినమ్రంగా రాజు
నమస్కరించాడు ‘’మరో వరం కోరుకో ‘’అన్నాడు ధర్మ దేవత .ధర్మరాజు ‘’నా మనస్సు దానం ,తపస్సు
,సత్యం అనే ఉత్త మ విషయాల మీద సదా నిలిచి ఉండేట్లు అనుగ్రహించండి ‘’అని ప్రా ర్ధించాడు .’’తధాస్తు
‘’అంటూ ఆశీర్వదించి ధర్ముడు అంతర్ధా నమయ్యాడు .తమ్ములతో ఆశ్రమానికి తిరిగి వచ్చిన ధర్మ రాజు
బ్రా హ్మణుడికి ఆరణి,మంధన కాస్టా లను అంద జేసి ఆశీస్సులు పొ ందాడు .
ఈ యక్ష ప్రశ్నలు మార్మికత తో ఉన్న ధార్మిక ప్రశ్నలు .ధర్మ రాజు శోకమోహాలను ప్రక్కన పెట్టి స్థిర
చిత్త ం తో 100 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ,తన సమచిత్త తను ,తిక్కన మహా కవి చెప్పినట్లు వశీకృత
చిత్త్తాన్ని ప్రదర్శించాడు .ధర్మ దేవత కూడా రాబో యే అజ్ఞా త వాసానికి ,కురుక్షేత్ర మహా సంగ్రా మానికి
పాండవులను సిద్ధం చేసే ప్రయత్నమే ఇది అని దీనిపై చక్కని సమీక్ష చేశారు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం
గారు
ధర్మ రాజు –ప్రా ణమే యజ్ఞా నికి సంబంధించిన ఒకే ఒక్క సామం .
‘’విత్త నం ‘’
‘’గోవు ‘’
‘’పుత్రు డే సర్వశ్రేస్టం.’’
19-గృహస్తు కు మిత్రు డు ?
ఇప్పుడుధర్మ రాజుకు పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞా న౦పై ప్రశ్నలను యక్షుడు అడుగ బో తున్నాడు .
‘’అగ్ని ‘’
‘’దానం .
‘’సత్యం ‘’
‘’శీలం ‘’
ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు
.దక్షత అంటే నిర్వహణ సామర్ధ ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధ క మవుతుందని
వివరణ .ధర్మ౦ ధర్మ శాస్త్రా లలో ఉండదు జీవిత ఆచరణ లో కనిపిస్తు ంది .అలాగే దానం చేయాల్సింది
స్వయం గా సంపాదించిన కష్టా ర్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను
,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గ ం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా
తధంగా దర్శించటం అని అర్ధ ం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక
పరమైనది .ఉత్త మ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్త ంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర
పరిజ్ఞా నం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు
సమాధానాలు చెప్పేవాడూ ఇద్ద రూ ఇద్ద రే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్
ఉంది .ప్రతి దాన్ని మూల తత్త ్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే
కాదు అభి రుచి కూడా .
యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞ త ధార్మికత -4
యక్షుడు గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా ఘాటుగా లోతైన
సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దా ం –
‘’భార్య ‘’
‘’మేఘం ‘’
‘’దానం ‘’
‘’పాండిత్యం ‘’
‘’ఆరోగ్యం ‘’
‘’సంతృప్తి ‘’
ధర్మ రాజు చెప్పిన దానిలో దక్షత అంటే పని చేయటం లో నేర్పు మాత్రమె కాదు ,ధర్మాన్ని ఆచరించటం
లో సామర్ధ ్యం .అజ్ఞా తవాసం లో పాండవులను వారి పాండిత్యమే కాపాడింది .రాజ్య లాభం కంటే ఆరోగ్యమే
చాలా ఉత్త మం అన్నాడు .స్వకీయానుభావం తోదీనికి సమాధానం చెప్పాడు హస్తినకు రాజైనా విచిత్ర
వీర్యుడు అనారోగ్యం తో చనిపో యాడు .భీష్ముడు,విదురుడి కి రావాల్సిన వాటాలో ధనం ఇస్తా నని
చెప్పినా ,వద్ద ని చెప్పి విదురుడు సంతృప్తిగా జీవించాడు కదా .
‘’వేద ధర్మం ‘’
‘’క్రో ధాన్ని ‘’
‘’కామాన్ని ‘’
‘’లోభాన్ని ‘’
త్యాగ బుద్ధితో జీవించమని సనాతన ధర్మం బో ధించింది .త్యాగం అంటే బంధనం లో చిక్కుకొని విడుపు
అని అర్ధ ం .త్యాగం చేయాల్సిన వాటిలో మొదటిది మానం .అంటే ఆత్మాభిమానం రోషం ,పౌరుషం .ఆత్మ
అంటే తాను .ఆత్మీయం అంటే తనకి చెందింది .అభిమానం అంటే ఆత్మ గౌరవం .రూపం దానం ,విద్యా
వల్ల కలిగే దర్పాన్ని కూడా అభిమానం అనే అంటారు. అహంకారం అనే అర్ధ మూ ఉంది .కనుక మానం
అంటే స్వీయ గౌరవానికి సంబంధించినది .ఇది స్వీయ కేంద్ర ప్రవృత్తి కి సంబంధించింది .దుర్యోధనుడు
దీనికి గొప్ప ఉదాహరణ .సుయోధనుడు తన కేంద్రం లోకి కొందర్నే తీసుకొన్నాడు .కొందర్ని దూరంగా
ఉంచాడు .తమ్ముడే అయినా వికర్ణు డిని దూరంగా ఉంచాడు .లక్క ఇల్లు కాల్చిన పరమ కిరాతకుడు
పురోచనుడు ఆ లక్క ఇంట్లో నే కాలి బూడిద అయితే దుఖం తట్టు కోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు
దుర్యోధనుడు .అతని కోటరీ లోకి కర్ణు డు, శకుని ,దుశ్శాసనుడు లకు మాత్రమే ప్రవేశం .వీళ్ళనే దుస్ట
చతుస్ట యం అన్నారు .మనదే అయిన వ్యక్తిత్వాన్ని స్వభావం అంటారు .దీన్ని దాటటం కష్ట ం
.స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఈర్ష్య ద్వేషం వంటివి ప్రకోపించి మనసును మండింప
జేస్తా యి..ఇవే రోషం ,పౌరుషం .ఇవి విజ్రు ౦భి స్తే వాడు సర్వనాశనమౌతాడు .ఎదుటివాడి నాశనానికి సర్వ
ప్రయత్నాలు చేస్తా డు .
కాని దీనికి విరుద్ధ ంగా ప్రేమ అనేది అందరిలోనూ విస్త రిస్తు ంది .మానం భయస్తు డి లక్షణం అయితే ప్రేమ
ధీర లక్షణం .మనకు భయమే ఎక్కువ కాబట్టి మానవంతులంగా మిగిలి రోష పడుతూ ఉంటాం
.సుయోధనుడు అభిమాన ధనుడై ధార్మిక జీవితం లో నిర్ధ నుడయ్యాడు .భీమసేనుడికీ ఈ లక్షణం బాగానే
ఉంది .కనుకనే యుదిష్టిరుడు భావావేశాలకు ఉద్వేగాలకు ,ఉద్రేకాలకు మానమే కుదురు కనుక
మానాన్ని త్యాగం చేయాలని జవాబు చెప్పాడు .మానానికి దెబ్బ తగలటమే అవమానం .మానావ
మానాలను త్యాగం చేస్తే మనస్సు నిర్మల మవుతుంది .ఆకాశమంత విస్త రిస్తు ంది అని ధర్మ రాజు భావం .
మానం అంటే స్త్రీ మర్మావయవం అని అనుకోవటం మూర్ఖం .మానభంగం అంటే స్వీయ గౌరవానికి
దెబ్బతగలటం అని అర్ధం .కానిలోకం లో లై౦గి కమైన అర్ధం లోనే దీన్ని వాడుతున్నాం .వెకిలి చేష్టలతో
స్త్రీని తాకటం ,అగౌరవ పరచటం మాన భంగమే .వెకిలి మాటలు, వెకిలి చూపులూ కూడా దీనికి చెందినవే.
తన అనుమతి ,భాగస్వామ్యం లేకుండా తన శరీరం నుంచి ఆనందం పొ ందటం స్త్రీ తీవ్ర అగౌరవంగా
భావిస్తు ంది .మాన భంగం వ్యక్తిత్వ గౌరవానికి ,స్వేచ్చకు సంబంధించిన విషయ౦ .మాన భంగం లో
శరీరం కంటే మనసు పొ ందే వేదన తీవ్ర తరమైనది .సుయోద నుడి కొలువులో జ్యూత సమయం లో
ద్రౌ పది దుఖాన్ని చూసి కర్ణు డు ,దుర్యోధనుడు రాక్షసానందం పొ ందుతారు .ఆమె శరీరం పై కాముక
నేత్రా లతో విక్రు తానందం పొ ందిన వారు సైంధవుడు ,కీచకుడు .ఇతరుల మానానికి బాధ కలిగించి ,వాళ్ళు
బాధ, దుఖం లో ఉంటె ఆనందం పొ ందటం దుర్యోధనుడు వంటి మానవంతుల ఆనందం .మానిని అంటే
ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అని అర్ధ ం .దీన్ని అర్ధం చేసుకోకుండా కీచకాదులు మట్టిలో కలిసిపో యారు
.సత్యభామలో ఈ అంశం కొంచెం ఎక్కువై ,వివేకం తగ్గి ఇక్కట్లు పడింది .మానిని అంటే దృఢ సంకల్పం
ఉన్న స్త్రీ అనే అర్ధ ం ఉంది .కనుక లోకం లో మానిని అనే పదానికి ఏకైక ఉదాహరణగా ద్రౌ పదీ దేవి
మాత్రమె నిలిచింది .మానం లోతుపాతులు తరచినవాడుకనుక యుదిష్టిరుడు దాన్ని దూరం చేసుకొని
లోకులకు ప్రీతి పాత్రు డయ్యాడు .అని శ్రీ సుబ్రహ్మణ్యంగారి విశేష విశ్లేషణ .ఇదంతా తెలుసుకోక పొ తే యక్ష
ప్రశ్నలలో ఉన్న మర్మం తెలియదు .
కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు
భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రా నికి హేతువులు .కోరిక ఆగిపో తే మిగిలేది సంపన్నత ,అదీ
ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై ప్రశ్నిస్తు న్నాడు యక్షుడు .
‘’కీర్తికోసం ‘’
‘’భయం వలన ‘’
‘’అజ్ఞా నం ‘’
‘’లోభం వలన ‘’
‘’విషయాసక్తి వలన ‘’
మృతం అంటే ప్రా ణం లేక పో వటమేకాదు.నిష్ప్రయోజనం అని కూడా అర్ధ ం .రాష్ట ం్ర అంటే రాజ్యం అని అర్ధ ం
.ధృత రాస్ట్రు డు అంటే రాజ దండాన్ని ధరించి రాజ్యం లో ప్రజలకు రక్షణ కల్పించేవాడని అర్ధ ం ఈ ధర్మాన్ని
పాటించక పొ తే రాజ్యం మృతమే అవుతుందని యుదిస్ష్టిరుని విశ్వాసం .రాజదండం ధార్మిక ప్రయోజనాన్ని
కోల్పోతే రాజ్యం మృతమే అవుతుంది .కనుక రాజు బాధ్యత గొప్పది .ధర్మ రాజుకు రాజధర్మం విస్పష్ట ంగా
తెలుసు .ఇప్పుడు అవీఇవీ ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు .
‘’గోవు ‘’
64-‘’విషం ఏది ‘’?
‘’ కోరిక ‘’
ప్రజలు ఆపత్సమయం లో సజ్జ నులనే ఆశ్రయిస్తా రు .సజ్జ నుడే పాలన చేయాలని అభిలషిస్తా రు .ఆకాశమే
జలం అనటం లో లోతైన భావన ఉంది .ఆకాశమే జలాన్ని ధరించి భూమికి దానం చేస్స్తుంది .కనుక
ఆకాశానికి జలానికి భేదమే లేదు .ఆవు అన్నం అనటానికి కారణం –ఆవుపాలు సిద్ధా న్నం కావటమే .గో
సంపద ధన సంపదను సృష్టించి అన్నాన్ని సృష్టిస్తు ందని భావం .కోరికలో మృత్యు లక్షణం ఉంది
.తీరనికోరిక దుఖాన్నే ఇస్తు ంది .దుఖమే మృత్యువు .
67-‘’దమం అంటే’’ ?
70-‘’జ్ఞా నం ఏది “?
‘’పరతత్వ జ్ఞా నం ‘’
73-‘’ఏది రుజుత్వం””?
‘’ సమ చిత్త త ‘’
‘’క్రో ధమే ‘’
77-‘’అసాధువు “?
‘’ఆత్మాభిమానమే మహాత్మా “’
వీటిపై శ్రీ జి వి ఎస్ గారి వివరణ చూద్దా ం –ధర్మాన్ని ఆచరించటానికి దక్షత కావాలి .దృఢ మైన దీక్ష లేక
పో వటం అలసత్వం .అలసత్వం ఆలస్యానికి కారణమవుతుంది .బ్రా హ్మణ ఆచారాన్ని పాటించటం అంటేనే
తపస్సు .ధర్మ శాస్త ం్ర ప్రతి ఒక్కరికీ వాళ్ళ కార్య క్షేత్రా న్ని నిర్దేశించింది .ఆ క్షేత్రం లో ఏమరుపాటు ,నిర్ల క్ష్యం
లేకుండాజీవించటమే స్వధర్మాచరణం .సమాజం లో అలసులు ఎక్కువైతే పతనం చెందుతుంది .అజ్ఞా నం
అంటే శాస్త ్ర పాండిత్యం లేక పో వటం ఒక్కటే కాదు ,సత్యాసత్య పరిజ్ఞా నం లేక పో వటం .తత్వ దర్శనమైతే
శోకం నశించి ,సమచిత్త త కలుగుతుంది .
‘’ఇంద్రియ నిగ్రహాన్ని ‘’
84-‘’ఉత్త మ స్నానమేది “”?
ధర్మ రాజు ఇంద్రియ నిగ్రహాన్నే ధైర్యం అని జవాబు చెప్పాడు .యుద్ధ వీరుల ధైర్యం కంటే ఇదే
శ్రేష్టమైనది అని భావం –‘’బలవాన్ ఇంద్రియ గ్రా మో విద్వాంస మపి కర్షతి’’-అంటే ఇంద్రియ సమూహ
బలం అసాధారణ మైనది .విద్వా౦సు డినైనా అది లాగి పారేస్తు ందని అర్ధ ం .కనుక ఇంద్రియ నిగ్రహమే
ధైర్యం .త్రిషవణ స్నానాలు ,తీర్ధ స్నానాలకంటే మనసును నిర్మలంగా ఉంచుకోవటమే ఉత్త మోత్త మ
స్నానం .ఇదే అంతరంగాన్ని పరిశుద్ధి చేస్తు ంది మామూలు స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే చేయవచ్చు కాని
మనో మాలినాన్ని కడిగి పార వేయ లేదు మనసు పరిశుద్ధ ం కాకపొ తే మనిషి ఉత్త మ గతి సాధించలేడు
.సర్వ భూత రక్షణ మే ధర్మ దానం –దీనినే బుద్ధ భగవానుడూ చెప ్పాడు .యక్ష ప్రశ్నలు, ధర్ముడి
సమాధానాలు ధర్మ సూక్ష్మాలు .ధర్మ మర్మాలను తెలియ జేసవి
ే .తల స్పర్శ కాదు లోతుగా అధ్యయనం
చేయాల్సినవి అంటారు శ్రీ జీ వి ఎస్ .
87-‘’నాస్తికుడెవడు ‘’?
‘’సంసార హేతువు ‘’
89-‘’మత్సరం ‘’?
91-‘’దంభమంటే ‘’?
‘’’’ధర్మాత్ముడిగా ప్రకటించుకోవటం ‘’
92-‘’పరదైవమెవరు ‘’?
‘’దానఫలం ‘’
93-‘’పిశునత్వమంటే “”?
‘’పరదూషణం ‘’.
ఇక్కడ కొంత వివరణ నిచ్చారు శ్రీ జి వి ఎస్ .-అహంకారమంటే నేను ,నాది అనే స్వీయ కేంద్ర ప్రవ్రు త్తి
అని ,దీనికి మూలం అవిద్య ,అజ్ఞా నమని ,తీవ్రమైన అజ్ఞా నమే అహంకారమని ధర్మ రాజు నిర్వచనం
.ధర్మాత్ముడుగా ఉండటానికి ప్రకటన అక్కర్లేదు .జీవించే విధానమే ధర్మాత్ముడిని చేస్తు ంది. దానం ఎలా
ప్రకటించుకో రాదో ధర్మాన్నీ అలానే ప్రకటించుకోరాదని అర్ధ ం .దైవాలకే దైవం –పర దైవం అని చెప్పకుండా
యుధిష్టిరుడు-దానఫలాన్ని పరదైవంగా నిర్వచించి చెప్పాడు .ధర్ముడి సమాధానాలన్నీ చాలా
విస్త్రు తార్ధ ం లోనూ మూలార్ధ ం లోను ఉండి అతని వివేక సంపత్తి ని ఆవిష్కరిస్తా యి .ఇప్పుడు మరిన్ని
సంక్లిష్ట ప్రశ్నలను సంధిస్తు న్నాడు యక్షుడు –
94-‘’ధర్మ రాజా !ధర్మార్ధ కామాలు పరస్పరం విరోధించేవి గా కనిపిస్తా యి కదా ,మరి అవి ఎక్కడ
కలుస్తా యి ?’’
‘’ధర్మం –భార్య పరస్పరం విరోది౦చ కుండా మానవుడికి వశమైనప్పుడు ధర్మార్ధ కామాలు ఒకే చోట
కలుస్తా యి ,నిలుస్తా యి ‘’
‘’పరమ దరిద్రు డైన యాచక బ్రా హ్మణుడిని ,ఆహ్వానించి ,లేదు పొ మ్మనే వాడు నరకం లోనే
శాశ్వతంగా ఉండి పో తాడు ‘’
96-‘’కులం ,నడవడి స్వాధ్యాయన,పా0 డిత్యాలలో దేనివల్ల బ్రా హ్మణత్వం సిద్ధిస్తు ంది ‘?
‘’మహాత్మా !కులం ,స్వాధ్యయనం ,పా౦డిత్యాలు బ్రా హ్మణత్వానికి కారణాలు కావు .ఉత్త మమైన
నడవడి మాత్రమే బ్రా హ్మణత్వానికి ప్రధానకారణం .బ్రా హ్మణుడు సదాచారం పాటిస్తూ బ్రా హ్మణత్వాన్ని
కాపాడుకోవాలి .చతుర్వేదాలు చదివినా ,సదాచార పరాయణుడు కాని వాడు శూద్రు ని కంటే హీనాతి
హీనుడు .ఇంద్రియ విజయాన్ని సాధించిన వాడెవడైనా బ్రా హ్మణుడే .’’నిర్మొహమాటంగా ధర్మ రాజు
సమాధానం చెప్పాడు .శీలమే బ్రా హ్మణత్వానికి ముఖ్య కారణం అని స్పష్ట ం గా చెప్పాడు .బుద్ధు డు కూడా
‘’ఉత్త మ శీలాన్ని సాధించిన అర్హతులను బ్రా హ్మణుడు’’అన్నాడు .
‘’సద్గ తి ‘’
‘’అయిదు రోజులకొక సారి కూర వండుకొన్నా ,,అప్పులేని వాడు ,పర దేశం లో లేని వాడు
ఆన౦దిస్తా డు ‘’
104-‘’ఏది వార్త ?
‘’’’ఈ బ్రహ్మాండ భాండం మోహ మయం .దీనిలో సూర్యుడిని అగ్నిగా నిలిపి ,రాత్రి ,పగలు ఇంధనంగా
చేసి ,ఋతువులు ,మాసాలను గరిటలుగా చేసి కాలం ప్రా ణుల్ని పక్వం చేస్తు ంది ‘’అన్నదే వార్త
మహానుభావా !
105-‘’పురుషుడెవరు””?
‘’ఎవడి పుణ్య కార్యాలను ప్రజలు పొ గుడుతున్న ధ్వని స్వర్గా న్నీ ,భూమినీ తాకుతూ ఉంటుందో
వాడు పురుషుడు అనబడతాడు ‘’
‘’ప్రియాప్రియాలను సమానంగా స్వీకరించేవాడూ ,భూత భవిష్యత్తు లను సమానంగా భావించే వాడూ
సర్వ శ్రేష్ట ధనవంతుడు మహాత్మా !’’