Professional Documents
Culture Documents
కవికొండల చంద్రధరం
పట్ట స్వామి కనకరాజు
i
చాళుక్యసింహాసనం
Chalukya Simhasanam
(Historical Novel of 9th Century)
C : K.Chandradharam.
Price : Rs.320/-
Copies : 500
Published By : .
K.Chandradharam
Plot. No.29, Chandragiry-II
Trimulgherry, secunderabad-500015
Telangana State, India.
P.No.9959333132
e-mail dharamkavikondala@gmail.com
vijayasree.kavikondala@yahoo.com
Copies Availeble at :
Navodaya Books House, Koti, Hyderabad.
and at Publisher.
Printed at:
Deepthi Printers,
Gandhi Nagar, Hyd-80
9949703224,7075203882
ii
నరేంద్రేశ్వరాలయం పెదపులిపఱ్ఱు
iii
ఒకరికి అక్క బావ, మరొకరికి అమ్మానాన్న
కీర్తిశేషులు పట్టస్వామి మధుసూదనరావు,
(కవికొండల) భారతీదేవి దంపతులకు
ఈ అక్షరమాల అంకితం
కవికొండల చంద్రధరం
పట్టస్వామి కనకరాజు
iv
ఈ రచనపై అభిప్రాయసేకరణ
పఠాని పాపయ్యరాజు.
v
వున్నాయి. తామరమొగ్గలకంత ఐశ్వర్యమెక్కడిదీ. నీ జఘనం ఈ ధరాతలాన్ని ఏలేవాడిని
కూడా లొంగదీసుకునేటట్లు వుంది.”
ఈ నవలలో మణిభూషితాదేవి స్త్రీ జాతికే విభూష. మనం పాత సినిమాలలో
చూస్తాం. మొగుడు ఆవేశంలో చెంపదెబ్బ కొడితే నీవు మనిషివా పశువువా అని ఒక మాట
అనేసి పెట్టె సద్దుకొని పుట్టింటికి వెళ్లి పోయేది.
vi
ఆదుర్తి బాల (రచయిత్రి)
vii
చాళుక్యసింహాసనము చారిత్రాత్మక నవల ఒక పరిశీలన
KANAKARAJU, PATTASWAMY
Associate Project Director
SPP Augmentation Project-SPAG
Satish Dhawan Space centre
Indian Space Research Organisation
Sriharikota, Andhra pradesh, India 524124
LANDLINE: 08623 225853 (O)
CELL: +91 9490271201, +91 9490086608
EMAIL kpattaswamy@gmail.com
pkraju@shar.gov.in (official)
శ్రీగురుభ్యోన్నమః
viii
విష్ణువర్ధనుడు ఈ కథకు నాయకుడు. ధర్మశీలి. మహర్షి ప్రచలితమైన గురుకులంలో
సామాజిక, ఆర్ధిక న్యాయ, యుద్ధ, రాజనీతి శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు.
వ్యూహనిర్మాణంలో పంచమాంగదళ నిర్వహణలో బందిపోటుతరహా ( నేటి gorilla
యుద్ధం ) యుద్ధవిధానాలలో ప్రత్యేకించి శిక్షణ పొందినవాడు. తమ రాజ్యానికి శత్రువైన
భీమసలుఖిని గెలవాలంటే అతనికి లభిస్తున్నరాష్ట్రకూట వల్లభుడైన ఇంద్రవల్లభుని ఆశిస్సులు
పలచనచేయాలి.
ix
చారిత్రాత్మక రచనలో కథావైశాల్యం ఎంతగా విస్తృతమౌతుందో చూడండి.
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు వివిధ విన్యాసాలు, యుద్ధవర్ణనలు, ఒకవైపు మతము
ప్రజాజీవనవిధానము, సాంఘికపరిస్ధితులు, రాజకీయాలపై వాటిప్రభావం వివరించే తీరు,
మరోవైపు అనేక స్త్రీపురుష పాత్రల సృష్టి, వాటిద్వారా మానవీయ దృక్పధాలు,
అంతరంగచిత్రణ, శృంగార వీర కరుణారస సృష్టీ, ఇంకోవైపు రచయిత కథాకథన
కౌశలాన్ని అనేకంగా అనేకవిధంగా అనన్యంగా చేయగలుగుతుంది. కథపుటెన్నికలోని
ఎత్తుగడ యిది.
నాన్రుషిః కురుతేకావ్యం.
xii
చాళుక్య సింహాసనం రచయితల మాట
తపస్వాధ్యాయ నిరతుడైన వాల్మీకి మహర్షికి, విష్ణువే తానయిన వ్యాసమహర్షికి
గురువందనం. ముందుగా గుంటూరు జిల్లా వెల్లటూరు మండలం పెదపులివఱ్ఱులోని
మాన్యకేతేశ్వరుడికి మొక్కి మామాట చెబుతాము.
xiv
ఈనవలలో అనేక శాస్త్రాలను శ్లోకాలను ఉదహరిండం వలన అవి ఎక్కడినుంచి
తీసుకోబడినవో చెప్పడం సమంజసమేకాని సాధ్యంకాలేదు. కానీ ఈ రచనను ప్రభావితం
చేసిన గ్రంధాలు కొన్నిటిలో దాశరథీ రంగాచార్య చతుర్వేదభాష్యము, మీదుమిక్కిలి
యజుర్వేదం అధర్వణవేదం, శ్రీ వేదానందసరస్వతి వారి దయానందసరస్వతి శుక్లయజుర్వేద
(మాధ్యందిన సంహిత) భాష్యం (తెలుగులో), వాల్మీకి రామాయణము, మొల్ల
రామాయణము, పోతన భాగవతము, భగవద్గీత, ఆదిశంకరుల రచనలు, మనుస్మ్రుతి,
విజ్ఞానేశ్వరుడు సంకలనము చేసిన యాజ్ఞవల్క్యస్మ్రుతి, శుక్రనీతి, కౌటిల్యుడి అర్ధశాస్త్రము,
అల్లాడివైదేహి సాహిత్యవ్యాసము, రసగంగాథరము, కాశీమజిలి కధలు, శ్రీనాథుడు
సంకలనము చేసిన పల్నాటివీరచరిత్ర, నటరాజరామకృష్ణ నాట్యశాస్త్ర పరిచయము,
శ్రీవరదగురు ప్రణీతంబైన ప్రతిష్ఠాప్రయోగము, అడవిబాపిరాజు హిమబిందు, తెన్నేటిసూరి
ఛంగిజ్ ఖాన్ మొదలైనవి.
కవికొండల చంద్రధరం.
xv
తూర్పుచాళుక్యులు
అచ్చమైనతెలుగు రాజులు అని చెప్పతగిన రాజవంశం ఈ తూర్పుచాళుక్యులు. ఎందు
కంటే కృష్ణా ఉభయగోదావరి జిల్లాలను నాలుగు వందల ఏభయి సంవత్సరాలు పరి పాలించిన
వారు. ఈ తూర్పుచాళుక్య రాజవంశం బాదామి రాజధానిగా ఏలిన చాళుక్యవంశానికి శాఖ.
నన్నయభట్టును నారాయణభట్టును పోషించి వ్యాసమహాభారతం ఆంధ్రీ కరణకు ఆద్యుడైన
రాజరాజనరేంద్రుడు తూర్పు చాళుక్య వంశంలో కడపటివాడు. కానీ శత్రువుల తాకిడి నుంచి
తప్పించుకోడానికి రాజధానిని వేంగి నుండి రాజమహేంద్ర వరానికి మార్చాడు. తూర్పు చాళుక్య
రాజ్యానికి ఎల్లలు చెప్పడం కష్టం. రాజులకాలంలో తరచూ యుద్ధాలు దండయాత్రలు జరుగుచుండేవి.
అందుచేత దేశాల ఎల్లలు స్ధిరంగా ఉండేవి కాదు. చరిత్ర పుస్తకాలలో కూడా కొంతకొంత బేధం
ఉంటుంది. ముఖ్యంగా తూర్పు పశ్ఛిమ గోదావరి, కృష్ణాజిల్లాలు ఈ రాజ్యంలో ఉండేవి. ఐనా
ఆంధ్రదేశం అంటే ఏమిటనేదానికి మన కొక శ్లోకం ఉంది.
శ్రీశైలీర్వలయీకృతాంథ్రవిషయమ్ శ్రీరాజరాజస్వయం.
తూర్పుచాళుక్య రాజవంశం
రాష్ట్రకూటులు
xvi
నూలుపుంజము కాని సంజము కాని లాటూరు కాని కావచ్చు. తరువాత మాన్యకేతం నుంచే రాష్ట్రకూట
వైభవం సంతరించుకుంది.
xviii
మాన్యకేత దుర్గంలో బురుజు
ఈలపురములొ జలపాతస్నానం
xix
ఈజిప్టు సంస్క్రతిలో అర్ధనారీశ్వరి
xx
పెదపులిపఱ్ఱు దేవాలయంలో వ్యాఘ్రపాద మహర్షి ప్రతిష్ఠించిన
కుమారస్వామి
xxi
xxii
అంకములు
1 శ్రీముఖం 1
2 వేట 7
3 మాన్యకేతనగరం 15
4 విడిది కావాలి 18
5 శివాలయం 21
6 శబ్దభేది 23
7 చిత్రపురం 27
8 తండ్రీ కొడుకులు 32
9 ఆత్మకమలం 38
10 బహుభాషి 43
11 రసతరంగిణి విలాసవనం 48
12 రణరంగం. 56
13 స్వదేశయాత్ర 73
14 కుటిలుడు 82
15 అస్త్ర సన్యాసం 85
16 మలయవనం. 88
17 పేదరాశి పెద్దమ్మ. 94
18 ధర్మసూక్ష్మం 100
19 సంచార శ్రేణి 112
20 అడవిదొంగలు. 123
21 శ్రీగిరి 128
22 సారధి శతావరి 135
23 మృదువదన 140
24 కన్యగర్భం 146
25 బేలనురా దేవా 150
26 ఋషులు 159
27 పెళ్ళిసంబంధం 169
28 కమలహితాదేవి 174
29 భ్రూణము 178
30 రాక్షస వివాహం 183
31 ఐదవనెల. 190
32 విమానాలున్నాయా 193
33 నాగదీక్ష 200
xxiii
34 ఇంతి అంతిమ నిర్ణయం. 205
35 మహామంత్రి తొలగింపు 220
36 వాస్తుమార్తాండుడు. 227
37 రాజమాత 234
38 క్రొత్తమంత్రి 239
39 కాలాముఖులు 242
40 దేవతార్చన 245
41 వేంగిలో పండిత సభ 249
42 ఆర్యభట్టీయం 260
43 హత్య 267
44 కూష్మాండయోగి 273
45 మాయాలోకం 276
46 రాధామాధవం 286
47 చిత్రరథస్వామి ఆలయం 294
48 కల్లుపాట 303
49 స.భ.ర.న.మ.య.వ 307
50 కల్లు అమ్మను 311
51 నవావరణ నృత్యం. 315
52 స్త్రీ ఏవ విభూషణం 319
53 కోటకు కన్నం 323
54 రణదుందుభి 325
55 ముట్టడి 327
56 రాకుమారి అంతఃపురం ముట్టడి 333
57 వరాహకేతనం 336
58 విష్ణుయుద్ధం 337
59 విజయానంతరం. 344
60 సంధి 353
61 పెళ్ళిచూపులు 358
62 భయం 370
63 పట్టాభిషేకం 375
64 అడవిపువ్వు 379
65 ప్రతిష్ట 389
xxiv
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
1 శ్రీముఖం
2
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
3
చాళుక్యసింహాసనం
4
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“అంటే?”
“నీవు వేంగీ నగరానికి వెళ్ళగానే నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తారు. అక్క డందరూ
యుద్ధాల గొడవలో పడిపోయి వున్నారు. నీ పెళ్ళి విషయం ఎవరూ పట్టించు కోరు. నీకు తగిన
యువరాణిని వెతకడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. అప్పటిదాకా నీ చేతికందే
అందమైన నర్తకీమణులూ పరిచారికలు ఉంటారనుకో! కానీ వారికి ఒక్కొక్క పరిష్వంగానికి
ఒక్కొక్క రత్నహారం ఇవ్వాల్సివస్తుంది.”
5
చాళుక్యసింహాసనం
విష్ణువర్ధనుడు కూడా ఖడ్గం దూశాడు. కొంచం సేపు ఇద్దరి మధ్యా యుద్ధం సాగింది.
విష్ణువర్ధనుడి దెబ్బకు మృదువదన ఖడ్గం వెళ్ళి వాగులో పడింది. మృదువదన బుద్ధిగా
రాకుమారుడి ముందు మోకరిల్లి తల వంచింది మెడకాయ నరకమన్నట్లు.
6
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
2 వేట
అది పదిరోజులక్రితం మాట.
7
చాళుక్యసింహాసనం
9
చాళుక్యసింహాసనం
నల్లజింక అడవితీగలు కాలికి తగలగా జారిపడింది. మళ్ళీ లేచి పరుగు తీసింది. కానీ
పులిచేతికి అందింది. పులి తన హస్తంతో జింకను కొట్టింది. గోళ్ళు దిగబడలేదు కానీ
కృష్ణహరిణం మూడు గింగిరాలు తిరిగి క్రింద పడింది. విజయం సాధించిన పులి జింక
మెడను కొరకడానికి భయంకరంగా నోరు తెరిచింది. విష్ణువర్ధనుడు సంధించిన బాణం
సరిగ్గా పులి అంగిటిలో నాటుకుంది. బాణంవెంట బాణం ఐదుబాణాలు సంధించాడు విష్ణు
వర్ధనుడు. పులి తెరిచిన నోరు మూయలేక పోయింది.
10
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
రెండు చేతులతో రెండు వైపులనుండీ పులి నోటి అంగిళ్ళు పట్టు కుని కాళ్ళతో దాని నడుమును
పెనవేసుకున్నాడు. అందుచేత పులి నోరు మూయ లేక పోయింది. ఇంకొక పులి విష్ణువర్ధనుని
పాదం పట్టుకు లాగింది. పాదరక్ష మాత్రం ఊడి దాని నోటిలోకి వచ్చింది. మృదువదన
ఖడ్గంఎత్తి దాని మూతిపైన కొట్టింది. పైదవడ తెగి పోవడంతో ఆ పులి పారిపోయింది.
మొదటిపులి విష్ణువర్ధనుని విడిపించుకోవడానికి పొర్లి గింతలు పెట్టింది. అదే నరమాంసం
మరిగిన పులి. మిగతా సహ వీరులు కేకలు పెడుతు న్నారే కానీ ఒక్కళ్ళూ పులిని ఎదుర్కో
వడానికి దగ్గరికి రాలేదు.
“నీకు కొంచం కూడా కృతజ్ఞత లేదా? నేనివాళ నిన్ను కాపాడకపోతే పులి నిన్ను భోం
చేసేది!”
“ఎందుకూ?”
11
చాళుక్యసింహాసనం
“నాకు గురువుగారి ఆజ్ఞ లేదు! గుడారానికి ఒక్కరి చొప్పునైనా తీసుకు వెళ్ళు” అన్నాడు
రాజకుమారుడు.
12
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
13
చాళుక్యసింహాసనం
పిల్లలు దూరంగా వున్న అటవిక గూడాలకు వెళ్ళి బేరాలు చేశారు. ఒప్పుకున్న వనితలతో
స్వర్గసుఖాలు చూశారు. వాళ్ళలో ముఖ్యుడు విశాఖదత్తుడు. కొంటెకుఱ్ఱాళ్ళు అడవిలో
తామేమి రుచి చూసిందీ చేసిందీ మృదువదనకు వచ్చిచెప్పారు.
ఆటవిడుపు నాటి రాత్రి అడవిలో పెద్ద నెగడి వేశారు. అందరూ చుట్టూ చేరి
ఆటపాటలతో గడపాలనుకున్నారు. విశాఖదత్తుడు మృదువదనను దూరంగా తీసుకు
వెళ్ళాడు.” మృదూ! విద్యాభ్యాసం తరువాత నీ గమ్యం ఏమిటీ?” అడిగాడు విశాఖదత్తుడు.
3 మాన్యకేతనగరం
మాన్యకేత మహానగరం అత్యద్భుతంగా అలంకరించబడింది.పౌరులందరు తమతమ
గృహాలకు రంగురంగులుగా వెల్లవేయించుకున్నారు. వీధులన్నీ కళకళలాడుతున్నాయి.
వీధులలో నడుస్తుంటే గృహాలలోనుంచి వచ్చే ధూపపరిమళాలు పుష్పవనాలను
తలపిస్తున్నాయి. ఎక్కడ చూచినా ఉత్సవ శోభ!కోట వెలుపల రథ్యలన్నీ దేశదేశాల కచ్చడాలు
రథాల ఘట్టనతో పిండిపిండి అయిపోయాయి. మాన్యకేత దుర్గప్రాకారం బురుజులూ
ముఖద్వారం ఖగరాజపతాక విరాజితమైవున్నాయి. కోటగుమ్మానికి బంగారు కలువపూల
తోరణాలు కట్టారు. కోటముందు సుగంధ జలంతో కళాపి చల్లి రంగవల్లికలు తీర్చారు.
గెలలతో అరటి బోదెలు పోకగెలలు నిలకట్టారు. మొగలిపూల సువాసనలు సర్వదా
వ్యాపించాయి.
15
చాళుక్యసింహాసనం
16
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
17
చాళుక్యసింహాసనం
కొంచెం సేపటికి కొందరు స్త్రీలు గుఱ్ఱాలూ ఏనుగులూ వేసిన లద్ధెలను ఎత్తివేసి మార్గం
శుభ్రం చేశారు. ఇంకొందరు పరిచారికలు వీధుల్ని నూలు కుంచలతో సున్నితంగా ఊడుస్తూ
సాగారు. ఏ వాహనమూ లేకుండా రాజమాత పాదచారియై కదలివస్తోంది. ఆమె చుట్టూ
గుంపుగా యువతులు దిగంబరంగా నడుస్తున్నారు. వారంతా ఎంతో అందంగా పాలరాతి
బొమ్మల్లా ఉన్నారు. చనుకట్టూ పిరుదులూ చాలా ఉన్నతంగా ఉన్నాయి. వారి కురులే వారికి
ఆచ్ఛాదన!ఆ యువతుల మధ్య రాజమాత అయ్యణమహాదేవి తెల్లని రాజహంసలా అడుగులు
వేస్తూ నడుస్తోంది. ఆమె కూడా దిగంబరే!
“వీళ్ళంతా ఎక్కడికెళుతున్నారూ?” అన్నాడు అమాయకంగా గోపన్న.
“పార్శ్వనాధసామి ఆలయానికి” అన్నాడు భటుడు.
“ఇప్పుడు వెళ్ళవచ్చా?”అన్నాడు గోపన్న.
“కాస్త ఆగు. కచ్చడాలు కోటలోపలికి వెళ్ళాలి. ఆ తరువాత వెళుదువు” అన్నాడతడు.
4 విడిది కావాలి
“అయ్యా మాకొక విడిది కావాలి.” గోపన్న స్థానాపతి ముందు నిలబడి అడిగాడు.
18
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“లీశోత్తరదీక్షితుడెవరూ? పురోహితుడా?”
19
చాళుక్యసింహాసనం
5 శివాలయం
రాష్ట్రకూటులు మాన్యకేతనగరం నిర్మించినపుడే శివాలయం నిర్మించారు. ఈశ్వరుడిని
మాన్యకేతేశ్వరుడు అనే పేరుతో ప్రతిష్ఠచేశారు.
“సెట్టీ! ఇవాళ నన్ను మాట్లాడించకు. ఇవాళ నేనేమీ చెప్పను. నా నోటినుంచీ ఏది వస్తే
అది నిజమౌతుంది. ఈ విద్యాప్రదర్శనలు అంతా శాంతంగా జరగాలనే ఈశ్వరుడిని
ప్రార్ధిస్తున్నాను. కానీ అలా జరగదు” అన్నాడు బిందుఋషి.
“అలా జరగదంటే మీ అభిప్రాయం?”
“శాంతంగా జరగదు.”
గోమఠేశ్వరయ్య మహర్షి వద్ద శలవు తీసుకుని వెళ్లిపోయాడు.
6 శబ్దభేది
అది మాన్యకేత నగరం కోటబయట ప్రమదోద్యానం. రాజకుమారి శిరీష తన
చెలికత్తెలతో కూడి ఆతోటలో విలువిద్యాభ్యాసం చేస్తోంది. ఆంధ్రశ్రేష్టి గోమఠేశ్వరయ్యగారి
కుమార్తె వసు మిత్ర. వసుమిత్ర రాకుమారికి ప్రాణమిత్రురాలు. తాను కూడా రాకుమారితో
పాటే ఉద్యాన వనానికి వచ్చింది. శిరీషకు ఎనమండుగురు చెలికత్తెలు. వారంతా రాకుమారికి
అనేక విధాల తోడ్పడుతున్నారు.
24
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“అంతేమీ లేదులేండి! ఏదో అభ్యాసం చేశాను ఇవాళ సిద్ధించింది. కానీ మీకుకాని తగి
లుంటే ఎంత ప్రమాదం జరిగుండేదో!”
25
చాళుక్యసింహాసనం
“ఏమీలేని పులిస్తరాకు ఎగిరెగిరి పడిందనీ ఈవిడ తండ్రికే అక్కడ రాజ్యం లేదు. ఈవిడ
మాత్రం మహారాణీలాగా ఇక్కడ పొంకం చూపిస్తుంది. వాళ్ళ దేశంలో దిక్కులేక మీ రాజ్యంలో
చూరు పట్టుకు వ్రేలాడుతున్నారు! ఒకసారి ఆసంగతి గుర్తుచేయి.” అన్నది భీమరధిని
ఈసడించుకుంటూ వసుమిత్ర.
7 చిత్రపురం
సప్తమినాడు వసుమిత్ర శిరీష వద్దకు వచ్చింది. అప్పటికి అంతః పురంలో రాజకుమారి
చీర కుచ్చెళ్ళు దోపుకుంటోంది. ఒక అలంకారిక ఏడుపాయల జడ వేస్తోంది. మరోక చెలికత్తె
గుబ్బలపై కర్పూర పరాగం అద్ది స్ధనవల్కలం బిగిస్తోంది. “అప్పుడే వచ్చేశావా వసుమిత్రా!”
అన్నది రాజకుమారి.
27
చాళుక్యసింహాసనం
వారు అంతకన్నా ఎక్కువ మంది వున్నారు. అక్కడ ఒకప్రక్క రకరకాల జాతుల ఏనుగుల్ని
విక్రయిస్తున్నారు.
అరణి కూర్చున్న పల్లకి జనం తోపిడికి ప్రక్కకు పడే పరిస్తితి వచ్చింది. ఆంధోళిక ఒక
ప్రక్క ఒరిగిపోయింది. అందులోని అరణి దొర్లి గుమ్మడిపండులా క్రింద పడేదే. ఎవడో
బలాఢ్యుడు అరణి చేయి పట్టుకుని ఆపాడు. ఆమెను లోపలకు తోసి ముందువైపు ఆందోళిక
దూలాన్ని బుజానికెత్తుకుని పోటీకఱ్ఱతో జనాన్ని పడదోసుకుంటూ క్రిందపడ్డవారిని
కర్కశంగా నలగదొక్కుకుంటూ జనసమర్ధానికి దూరంగా తీసుకుపోయాడు. వెనకాలి
29
చాళుక్యసింహాసనం
30
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
31
చాళుక్యసింహాసనం
8 తండ్రీ కొడుకులు
మాన్యకేతదుర్గంలో అది చక్రవర్తి సౌధం. రాష్ట్రకూటుల ఐశ్వర్యం చూడాలంటే
ఆసౌధాన్నే చూడాలి.
32
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
34
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
35
చాళుక్యసింహాసనం
“గండయ సాహిణి!”
“ఆయనా! ఆయనొక పిరికి మనిషి. నోరు మెదిపి ఎలా యుద్ధం చేయాలో చెప్పడం
చేతకాదుకానీ ఊరికే నిరుత్సాహపరుస్తాడు.”
36
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
37
చాళుక్యసింహాసనం
9 ఆత్మకమలం
అది రసతరంగిణి ప్రాసాదం. అదొక విలాస వనం. కళాప్రియులకు కళాశాల.
జీవితంలో సమస్యలతో విసిగిపోయినవారికి విశ్రాంతిశాల. జూదరులకు అక్షశాల.
తాగుబోతులకు పానశాల. విటులకు గణికశాల. ఆ ప్రాసాదం దారితప్పిన యువతులకు ఒక
ఘటిక, ఒక ఆస్ధానం!
38
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఓరిబాబో!రెండువందలెందుకు?”
39
చాళుక్యసింహాసనం
“లోకో భిన్నరుచిః నీకర్ధం కాదు! కానీ తరంగా!మీ నాన్న గుటికావిద్య నీకు తెలుసా
నాకు నేర్పగలవా? కమలహిత రాజవంశపు స్త్రీ. మాన్యకేతదుర్గంలో ఉంటుంది. నాతో
ఎలాగో పరిచయం పెంచుకుంది. నాకు ఆమెను చేరాలంటే అసాధ్యంగా వుంది.”
రసతరంగిణి.
“ఏదీ ప్రదర్సించితేనా!”
రాష్ట్రకూట మహాసైన్యాధిపతి లీశోత్తరదీక్షితుడు ఆశాలలో తెల్లటి గద్దెపై కాళ్లుజాపుకుని
ఉపధానాలకు ఆనుకుని కూర్చున్నాడు. ఒక తోయ్యలి పాదాలొత్తుతుంటే ఒక జవ్వని ప్రక్కన
కూర్చుని తన అధరామృతంతో పవిత్రం చేసిన మధువును తాగిస్తోంది. కాపిశాయనం
కొంచం కొంచంగా సేవిస్తున్నాడు. ఇంకొక పూబోడి హరిచందనం వడలు పులకరిచేటట్లు
ఛాతిపైన అలదుతోంది.
గానానికి ముందుగా వాద్యాలు మేళం చేసుకున్నారు. రసతరంగిణి పాడగా ఒక నటి
అభినయిస్తోంది.
చెలువము తరిగిన చూడరుజనులు
చెలుల సొగసులూ వడిలేపూలు
వాడనిదొకటే ఆత్మకమలము
అంతర్యామిలో అదిఒకకణము
చెలువము తరిగిన చూడరుజనులు
“తరంగా” ఇదేమి పాటా?” అన్నాడు దీక్షితుడు.
“ఒక్కొక్క నర్తకికీ వంద సువర్నాలు వేసుకున్నా నేను చెప్పిన లెక్క తక్కువే! మీగతా
ఏర్పాట్లూ అలంకరణలు వాటికెంతవుతుందో ముందుగా చెప్పలేము కదా!”
42
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
10 బహుభాషి
రాజకుమారి శిరీష వసుమిత్ర చెలికత్తెలతో కలసి ఒక దుకాణంలోకి ప్రవేశించారు.
అక్కడ పాటకజనం కొనే వస్తువులేమీ లేవు.అక్కడ పురాతన నాణాలు వివిధ దేశాలవి
అమ్ముతున్నారు. అంతేకాక అతి పురాతనమైన రాణుల నగలు కూడ విక్రయానికి ఉన్నాయి.
43
చాళుక్యసింహాసనం
ముద్రించేవారు.
45
చాళుక్యసింహాసనం
46
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“నాకు కోపమేమీ లేదు. నేనేమీ చాళుక్యుల ఆస్ధాన పండితుడిని కాదు. కాకపోతే ఇక్కడ
నాలుగు రూకలు దొరుకుతాయని పొట్టకోసం వచ్చాను.”
47
చాళుక్యసింహాసనం
11 రసతరంగిణి విలాసవనం
రసతరంగిణి తూలికా తల్పానికి ఆనుకునికూర్చుని రాష్ట్రకూట మహాసైన్యాధిపతి
లీశోత్తరదీక్షితునితో ముచ్చటిస్తోంది. సఖియలు ఆమె పాదాలకు గోరింటాకుపెడుతున్నారు.
పరిచారికలు లీశోత్తరదీక్షితునికి పాదాలొత్తుతున్నారు.
48
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
నన్ను రసవని అనే ఆమె పెంచింది. ఆమె నాకు రసతరంగిణి అని పేరుకూడ పెట్టింది.
మేమప్పుడు ధారానగరంలో ఉండేవాళ్ళం. కానీ మాతండ్రి నన్ను తరుచూ ఉజ్జయిని
నగరానికి దగ్గరలోనున్న తాంత్రిక గ్రామానికి తీసుకు వెళుతుండేవాడు. అక్కడ చాలా మంది
ఉపాసకులు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు మూడేళ్ళు వచ్చినప్పటినుంచి నన్ను కూర్చోపెట్టి ఏవో
శక్తిపూజలు చేసేవాళ్ళు. నాకు పన్నెండేళ్ళ వయసులో మాతండ్రి నన్ను వామాచారులకు
అమ్మివేశాడు.”
“ఆయ్!అసలు నాకు తిండి సహించక కంటికి నిద్ర రాక ఎండి వరుగునై పోతుంటే
మీరేమో లావైపోతున్నా వంటున్నారు. ఇదేమి న్యాయం! ఇంతకూ మా భీమరథీకుమారి
పెళ్ళి.....”
“ఏమిటీ? నిశ్ఛయమైందా?”
51
చాళుక్యసింహాసనం
జరిగాయి.”
“ఆ! యుద్ధాలు చేశారు. కాని పాముని కొట్టీ కొట్టనట్లు కొడితే ఛస్తుందా? ఊరికే
తాటాకు చప్పుళ్ళు చేస్తే ఏంలాభం? ఎప్ఫటికైనా ఆ నరేంద్రమృగరాజును చంపకుండ
యుద్ధం ముగుస్తుందా? వాడిని వేసేయండి. అప్పుడు చూడండి నాతఢాకా. అప్పుడు నా పరి
పాలన ఏమిటో చూపిస్తాను!” అన్నాడు భీమసలుఖి.
“ఇది మరీ వింతగా వుంది! ఈ పోటీలలో ఎవరి శక్తికొద్దీ వారు పతకాలు గెలుస్తారు.”
53
చాళుక్యసింహాసనం
54
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
55
చాళుక్యసింహాసనం
12 రణరంగం.
తూరుపు దిక్కున ప్రొద్దుతిరుగుడు పూవులా సూర్యుడు ఉదయించాడు. వీరోత్సవాలలో
అది బహుమతి ప్రధానోత్సవ శుభదినం.సందర్శకులకోసం రాష్ట్రకూటులు గొప్ప ప్రాంగణం
ఏర్పాటు చేశారు. రాష్ట్రకూట సామ్రాజ్య వైభవాన్ని చాటేడట్లు ఘనంగా అలంకరించారు.
పౌరులు పామరజనులు తండోపతండాలుగా ముందరేవచ్చి అంచలంచలుగా నిర్మించిన
మంచెలపైన కూర్చున్నారు. విదేశీ వ్యాపారులకు రాయబారులకు ఒక వంక ఉచితా సనాలు
ఏర్పాటు చేశారు.నగర ప్రముఖులంతా మరొకవంక కూర్చున్నారు. రాజకుమారి శిరీష ఆమె
సఖియలు మిత్రురాలు వసుమిత్ర చాళుక్య భీమసలుఖి మహారాజు కుమార్తె భీమరధీ
మొదలైన కొమదలకు ప్రత్యేక ఉటజం ఏర్పాటు చేయబడింది. వీరపురుషల పైకి విసరడానికి
ఆడపిల్లలు విరిమాలలు పూబంతులు బుట్టలతో తెచ్చుకున్నారు. వసుమిత్ర తీపితీపి
మోదకాలు మిఠాయిలు గంపలకొద్దీ తెప్పించి పెట్టుకుంది, తను మెచ్చిన వీరుడు గెలుస్తే
అందరికీ పంచిపెట్టడానికి. పురంధ్రీ మణులకు అంతఃపుర వనితలు వేరే పందిరి క్రింద
కూర్చున్నారు.
అంతలో పెద్ద భేరి మోగించబడింది. అందరూ మాటలు కట్టిపెట్టి నిశ్శబ్దంగా లేచి నిల
బడ్డారు. శంఖాలు పూరిస్తూ బాలచక్రవర్తి అమోఘవర్షరాజేంద్రుని ఆగమనం సూచింప
బడింది. చక్రవర్తి అంగరక్షకులు ఒక్కసారి పరిసరాలను సింహావలోకనం చేశారు. మంగళ
తూర్యారవాలు మ్రోగుతుండగాభట్రాజులు వందిమాగధులు రాష్ట్రకూట వైభవాన్ని చాటుతూ
బరాబరులు చేస్తుండగా బాలచక్రవర్తి సింహకిశోరంలా వేదికపైకి వచ్చాడు. అతడి వెనకనే
ఇంద్రవల్లభుడు వున్నాడు. జనులందరూ చక్రవర్తికి జయజయధ్వానాలు చేశారు. చక్రవర్తి
సింహతలాటాలు చెక్కిన బంగారు సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. అందరినీ
కూర్చోమన్నట్లు చేయివూపి సంజ్ఞచేశాడు. చక్రవర్తి ప్రక్కనే ఇంద్రవల్లభుడు ఆసీనుడ య్యాడు.
57
చాళుక్యసింహాసనం
59
చాళుక్యసింహాసనం
60
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
61
చాళుక్యసింహాసనం
63
చాళుక్యసింహాసనం
64
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
65
చాళుక్యసింహాసనం
66
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
68
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
69
చాళుక్యసింహాసనం
70
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
71
చాళుక్యసింహాసనం
కుటిలుడు రెండవ సారి భస్త్రిక అనే బాణం తీసి ఎక్కుపెట్టాడు. అది చాల చిన్నదైనా
శత్రువు శరీరంలోకి దిగి మెలి తిరుగుతుంది. కుటిలుడి రెండవబాణం గురితప్పదని శిరీషకు
తెలుసు. తనూ ఆకర్ణాంతమూ సంధించిన బాణంతో సిద్ధంగా ఉంది. కుటిలుడు బాణం
విడిచాడు. శిరీష బాణం విడిచింది. కుటిలుడి బాణం విష్ణువర్ధన రాకుమారుడిని తాకే
సమయంలో శీరీష బాణం ఆ బాణాన్ని మధ్యలో తుంచివేసింది. ఆ విషయం ఎవరూ
గమనించలేదు. ఆ వేగం అందరికీ అవగతం కాదుకూడ. కేవలం ఒక తృటిలో జరిగి
పోయింది.
72
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
13 స్వదేశయాత్ర
వీరోత్సవాలనుండీ మరలిన విష్ణువర్ధనుని రథం రథ్యనుదాటి మైదానాలను పంట
పొలాలను దున్నుకుంటు వెళ్ళిపోతోంది. ముళ్ళు తుప్పలు పొదలు వాగులు వంకలు
లెక్కచేయకుండా వెళ్లి పోతోంది. కానీ వాళ్ళు వెళ్ళే దోవలో అనేకమైన కందకాలు వున్నాయి.
నాపరాళ్ళకోసం తవ్వి వదిలేసిన గనులు అవి. విష్ణువర్ధనుడు అమోఘమైన సారధి అవడం
73
చాళుక్యసింహాసనం
రథం పైనుండీ దిగి పైలుడు మల్లప్ప శరాచి చేతులు కట్టుకుని రాకుమారుడి ఆజ్ఞకై
నిలబడివున్నారు.
75
చాళుక్యసింహాసనం
76
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“లేకేమీ. కానీ మాన్యకేత నగరమంతా నీళ్ళ ఎద్దడి. ఎండాకాలం నీళ్లు దొరకవు. కాగ్నా
నది చాల చిన్నది. వేయి ఏనుగులు ఒక్క గుక్కలో పీల్చేయగలవు. అందుకే వీళ్ళు సైన్యం
అంతా ఒక్కచోట వుంచకుండా అక్కడక్కడా కృష్ణానదీతీరానా భీమానదీ తీరానా ఉంచి
పోషిస్తున్నారు.
78
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఏమో!”
“బిత్తల వనితలనెందరినో చూసాడు. నేనూ కూడా చూశాను.”
“అసలే నీ కన్నుమంచిదికాదు. అలా చూడడం తప్పురా మిత్రమా!”
“మరి హనుమంతుడు చూడలేదా?”
“నువు కోతివైనంతమాత్రాన నీకూ హనుమంతుడికి పోలికా? ఐనా ఆయన జితేంద్రి
యుడు!”
“అదికాదు సంగతి! ఆయన వానరం, ఒక శాఖామృగం!”
“హనుమంతుడు శాఖామృగమనే మాట రామాయణంలోనే వుంది.”
“జంతువులేవీ బట్టలు కట్టుకోవు. మనం వాటిల్నిచూస్తుంటాం. అలాగే మనని
జంతువులు నగ్నంగా చూడవచ్చు!”
“కానీ నీవనుకున్నట్లు కాదు. రామాయణంలో వానరులు నాగరికులు. వస్త్రాలు
ఆభరణాలు కిరీటాలు ధరించేవారు. హనుమంతుడు ద్విజుడులా యజ్ఞోపవీతం
ధరించేవాడు!”
“విష్ణూ! రామాయణంలోనే ఒకపెద్ద వింతవుంది తెలుసా?”
“ఏమిటదీ?”
80
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఎందుచేత?”
81
చాళుక్యసింహాసనం
14 కుటిలుడు
కోటలో అది ఇంద్రవల్లభుని అంతరంగిక మందిరం. ఇంద్రవల్లభుడు జగదేకవీర
ప్రదానోత్సవం నుంచీ వచ్చినప్పటినుంచీ దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్నాడు. పచ్చిగంగ
కూడా ముట్టలేదు. చాళుక్య రాకుమారుడు విష్ణువర్ధనుడు తప్పించుకున్న తీరు ఆయనను
చాలా కలవర పెడుతోంది. ‘మూర్ఘులు! గజ కంకణం మొత్తం భ్రష్టం చేశారు. వచ్చినవాడి
శౌర్యం అంచనా వేయలేక సింహనాదాలు చేస్తారా? ఎంత తెలివి తక్కువా! వీళ్ళీ పిచ్చిచేష్ట
చేయకుంటే ఆ యువకుడు ఈపాటికి చెరసాలలో వుండేవాడు. రాష్ట్రకూటుల పరువు మొత్తం
పోయింది. దేశ విదేశాలవాళ్ళందరూ మన వైఫల్యాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు.
దీనికి బాధ్యులైన వారినందరినీ శిక్షించాలి!’
82
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
83
చాళుక్యసింహాసనం
“అయినా గురితప్పిందంటావా?”
“కాదుదొరవారూ! ఎవరో నా బాణాన్ని బాణంతో తుంచారు.”
“బాణాన్ని బాణంతో తుంచడమా? అదేమిటీ?”
“గాలిలో పోతున్న నాబాణాన్ని గాలిలోనే విరిచివేశారు.”
“ఏమిరా! నా వద్ద నాటకాలాడుతున్నావా? బాణాన్ని బాణంతో కొట్టడానికి ఇదేమైనా
ద్వాపరయుగమా?”
“దొరవారి బానిసను. నామాట తప్పయితే నా నాలుక కోయించండి. నేను చెప్పేది
నిజం!”
“బాణాన్ని బాణంతో కొట్టడం సాధ్యమా?”
“చాలచాల కష్టం.”
“మనదేశంలో అలాంటి విలుకాళ్ళు ఎవరున్నారు?”
“తెలియదు దేవరా! అలాంటివాళ్ళే లేరు.”
“మరి ఆ బాణం ఎవరు వేసుంటారూ? విదేశీయులా? ఆ బాణం ఎటునుండీ వచ్చిం
దిరా?”
“ఆడంగుల అంతిపురం! రాజకుమారి పందిరినుంచే వచ్చింది.”
“నిజం చెబుతున్నావా?”
“మా అమ్మతోడు.”
“కుటిలా! నీవింకా వెళ్ళవచ్చు.”
కుటిలుడు మరొకసారి సాగిలపడి మొక్కి నెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంద్రవల్లభుడు కంచు ఘంటమీద మళ్ళీ గట్టిగా కొట్టాడు. ప్రధాన ద్వారపాలిక
ప్రవేశించింది.
84
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
15 అస్త్ర సన్యాసం
ఇంద్రవల్లభుల అసహనం మరీ పెరిగింది. ‘ఎవరు తప్పు చేశారు? బాణాన్ని బాణంతో
ఎవరు కొట్టుంటారు? అంతః పురం ఉటజాలలో అంతటి నేర్పరు లెవరుంటారు. శిరీష స్నేహి
తులు ఎవరైనా అతిధులుగా వచ్చారా? ఆడవాళ్ళలో అంతటి మొనగాళ్ళుండరు. పరదేశం
గూఢచారులెవరైనా మారువేషాలలో చేరారా.కుమార్తెతో మగవాడెవరైనా ఆడ వేషంలోవచ్చి
స్నేహం చేయటం లేదుకదా! వయసు వచ్చిన పిల్లలు. కామోద్రేకం సహజం. చెలికత్తెలను
పిలిచి విచారించాలి. తల్లిలేని పిల్ల. ఉన్నా దాదుల పెంపకమే కదా. ఏ రాణి పిల్లల్ని పాలిచ్చి
పెంచుతోందీ?’
85
చాళుక్యసింహాసనం
86
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
16 మలయవనం.
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారి కుమార్తె వసుమిత్ర. సర్వాలంకార భూషితయై మెరిసి
పోతూ శరీష వద్దకు వచ్చింది ఆ సాయంత్రం. వస్తూనే....
వసుమిత్ర శిరీష చేతిని ప్రక్కకు తోస్తూ “నన్ను వర్నిం చనీవే! వట్టిమాటలు నావి.
అనుభవించేది నీవు. అతడితో మొదటి అధర చుంబనం అనుభవించేనాడు నాపేరు గుర్తు
పెట్టుకో.
89
చాళుక్యసింహాసనం
“ఎవరే దొంగ?”
90
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“చాలా పెద్ద ఉపమానం చెప్పారు. నిజానికతడి వడి చూస్తే కవ్వడి లాగే వున్నాడు.
అతడే నిజమైన జగదేకవీరుడు. క్షణికావేశంలో మా రాజమకుటాన్ని అవహేళన చేయడం
తో రోషంతో అతడితో తలపడి భంగపడవలసి వచ్చింది!”
91
చాళుక్యసింహాసనం
92
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఏమే వసూ! మా అన్నయ్య అంటే మగవాడు! నీవింత రాత్రి పున్నమి నాగులు తిరిగే
వేళ ఎక్కడికివెళ్ళావే ఒంటరిగా నన్నొదిలేసి! నేను ఇంత తడవు నిరీక్షించలేక వెళ్ళి పోదామను
కుంటున్నాను”అన్నది శిరీష విసుగ్గా.
93
చాళుక్యసింహాసనం
“ఓసీ నీకు మిన్నాగుల భయం లేదా? చూడక ఏసర్పం పైనైనా కాలువేస్తే కరవక మాను
తుందా?” అన్నది శిరీష.
17 పేదరాశి పెద్దమ్మ.
విశాఖదత్తుడు గుఱ్ఱందిగి జీర్ణకుటీరం ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. “అమ్మా! ఎవరు
లోపలా?”అన్నాడు.
94
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
95
చాళుక్యసింహాసనం
96
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
98
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“నీపేరేమిటో చెప్పలేదు!”
18 ధర్మసూక్ష్మం
పూటకూళ్ళమ్మ ఇంట్లో భోంచేసిన తరువాత మిత్రులిద్దరూ చెరొక నులకమంచంపైనా
నిద్రాగ్రస్తులై యున్నారు. ముసలమ్మ చమురు కాలుతోందని దీపం ఆర్పేసింది. పూర్ణిమ
కావడంతో వెన్నెల మాత్రం కాంతివంతంగా వుంది. ఆ రాత్రివేళ ఎవడో అగంతకుడు
100
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
అవ్వ వాడి బాధ పడలేక అటుకులు మజ్జిగలో వేసి ఇచ్చింది. “గిన్నెలు తోమి బోర్లించు
కున్నానురా అబ్బీ!” అని ఎన్నో సార్లు చెప్పింది. వాడసలు ఆకలితో రాలేదు. మాటిమాటికీ ఆ
గుఱ్ఱాలపై వచ్చిన సాములెవరని అడుగుతున్నాడు.
“అనుకున్నా!”
101
చాళుక్యసింహాసనం
102
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
103
చాళుక్యసింహాసనం
“సరే ఇప్పటికి పడుకో! నీబతుకు తెల్లారనీ! అప్పుడు నీకో పని చెబుతా.” అన్నాడు
విశాఖదత్తుడు.
105
చాళుక్యసింహాసనం
కూర్చున్నారు మిత్రులిద్దరూ.
గ్రామం మధ్యలో పెద్ద మద్దిచెట్టు వుంది. అక్కడి అరుగు మీద సభాసదులు కూర్చు
న్నారు. గ్రామస్తులందరూ నేలమీద కూర్చున్నారు. విష్ణువర్ధన విశాఖదత్తులకు ప్రత్యేకంగా
నులకమంచం వేసి దానిపై దుప్పటి పరిచారు. సింగయ్య గ్రామ సభముందు చేతులు కట్టుకు
నిలబడ్డాడు. తరువోజ చాటున నిలబడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది.
“మరి నీవెలాతప్పించుకున్నావు?”
108
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఇరవై నాలుగేళ్ళు.”
“ధర్మాసనానికి నివేదించమంటాను!”
109
చాళుక్యసింహాసనం
ఏ స్త్రీ తనభర్త మరణించిన తరువాత కానీ జీవించి వుండగా కానీ మరొకని పొందదో
ఆ స్త్రీ లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతుంది అంటుంది శాస్త్రం. అంటే లోకంలో పునర్వివాహాలు
జరుగుతుంటాయి. కాకపోతే వాళ్ళు గొప్ప పతివ్రతలు కాకపోవచ్చు!
110
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“దొరా! నేను గూఢచారిని కాదు. వార్తలు పంపేవాడిని మాత్రమే. వాళ్ళు నాకు మడులు
మాన్యాలు ఏమీ ఇవ్వలేదు. నాపొట్ట గడవడం కూడా కష్టమే. నా పెళ్ళాం పిల్లల్ని పోషించు
కోవడం కూడ కష్ఠమే. నీ కాళ్ళదగ్గర బానిసగా పడివుంటాను.”
19 సంచార శ్రేణి
మిత్రులిద్దరూ ప్రయాణం చేస్తూ శ్రీశైలం వెళ్ళే దోవలో ఆత్మకూరు దాటారు. ఆ తరువా
తంతా భయంకరమైన నల్లమలారణ్యం. బాట చాలా ఇరుగ్గా ఉంది. పెరిగిన వెదురు పొదలూ
ముళ్ళమొక్కలూ దోవను మూసేస్తున్నాయి. వర్షం పడడం వలన కొండవాగులు
పొర్లుతున్నాయి. చెట్లకొమ్మలనుండీ పాములు వ్రేలాడుతూ కనిపించాయి. అడివంతా ఏదో
మూలికల వాసనగా ఉంది. అది కొంచం మత్తు కూడ కలిగిస్తోంది.
112
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
113
చాళుక్యసింహాసనం
రణ్యంలో పులుల బాధ చాలా ఉంటుందని రాత్రికి మజిలీ చేయాలని సంకల్పించాం! తమరు
ఆశ్రయమిస్తే సరి! మేమయితే ఏ చెట్టు తొఱ్ఱలోనో తెల్లవారే వరకూ తలదాచుకుంటాం. కానీ
మా గుఱ్ఱాలను దాచలేముకదా! పోనీయండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు! విధి ఎలావుంటే
అలా జరుగుతుంది” అన్నడు విష్ణువర్ధనుడు.
“ఆర్యా. మావలన మీకు మేలు జరగక పోవచ్చు! కానీ కీడూ నష్టమూ జరగదు. మా
స్వయంపాకం మాకుంది. మేమే వంట చేసుకుంటాం!”అన్నడు విష్ణువర్ధనుడు.
114
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
115
చాళుక్యసింహాసనం
116
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“శ్రేషిగారూ.మధ్యలో రాజోద్యోగులేంచేశారు?”
“పన్ను పెంచినకొద్దీ రాజోద్యోగులకు పండగ! వీరింట పీనుగెళ్ళా, పరిదానాలు బాగా
గిడతాయి.”
“పరిదానం అంటే లంచమా!”
“అంతేకదా! సానిది ముందు ఇస్తేకానీ మంచమెక్కదు! వీళ్ళింట పీనుగెళ్ళ వీళ్ళూ
అంతే.”
“ఇవ్వడం మీతప్పు కదా?”
“ఇంతింత పన్ను కడితే మా వ్యాపారాలు దివాలా తీయాల్సిందే! అందుకే వీరింట
పీనుగెళ్ళా, అంతోయింతో యిచ్చి కొంతపన్ను ఎగ్గొడతాము.”
“అంటే మీ స్వార్ధం ఉందన మాట!”
118
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
అట్లడుగగా ఆ కమలనాభుడు,
119
చాళుక్యసింహాసనం
120
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
కామధేనువు పుట్టె కల్పవృక్షము పుట్టె ఉదధి. తా బుట్టె ఉచ్చైశ్శ్రవంబు. వెల్ల ఏనుగు పుట్టె
జాబిల్లి పుట్టె. వారుణీయను వువిద వారాసి బుట్టే ఆమెతో పుట్టిరీ అప్సరోగణము.
అంతట క్షీరాభ్దిలో శ్రీదేవి పుట్టే.
కమలే కమలాక్షీ కల్లోలినీ సంభవే
కుముదే కుముదవాసినీ కోమలీ
ధనదే ధనదా ధనధాన్య ప్రసాదినీ
వరదా వారిజా వైకుంఠవాసినీ
121
చాళుక్యసింహాసనం
చిత్రాణి పళ్ళెం అక్కడ పెట్టి శ్రీ మహావిష్ణువు మోహినీ రూపం ధరించి అమృతం
పంచడం బహు సుందరంగా ప్రదర్శించింది. మంగళం పాడింది. వచ్చి విష్ణువర్ధనుడి
ముందు పళ్ళెంతో నిలబడింది. ఆమెను ఏడిపించడానికి అతడు రెండు మూడు క్షణాలు
ఉలకలేదు పలకలేదు. తరువాత విశాఖదత్తుడికేసి క్రీగంట చూశాడు. విశాఖదత్తుడు ఆ
పళ్ళెంలో ఏబది నాలుగు సువర్ణ వరాహమాడలు ఉంచాడు.
122
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
20 అడవిదొంగలు.
అర్ధరాత్రయింది. లోకమనే బిడ్డను నిశిఅనే తల్లి నిద్ర పుచ్చింది. బిడారం పైన మంట
అంటించిన బాణాలు ఆకాశం నుంచి ఉల్కలు పడినట్లు వచ్చి పడుతున్నాయి. అవి అన్ని
వైపులనుంచి వస్తున్నాయి. నిద్రలేచిన బేహారులు కంగారు పడిపోయారు. భయపడి పోతూనే
ధనం సంచులూ విలువైన వస్తువులూ గడ్డిలోను బండ్లక్రింద ముందే తవ్వి వుంచుకున్న
గుంతల్లో దాచివేస్తున్నారు. వృషభశకటాలు ఆ చదును ప్రదేశం చుట్టూ అర్ధ చంద్రాకారంలో
విడిసివున్నాయి. ఎద్దులు గంటలు గలగలలాడ మేత మేస్తున్నాయి. రాత్రి పూట బిడారాన్ని
కాపలా కాసేందుకు ఎనమండుగురు భటులున్నారు. అందులో నలుగురు బోయలు
నలుగురు చెంచులు. వారిలో నాయకుడు భరతుడు.
భటులు ఎనమండుగురూ “ఏయ్ ఎవరదీ” అని హటం చేస్తూ పెద్దగా కేకలు పెడు
తున్నారు. బిడారంలోకి కొందరు దుండగులు ప్రవేశించారు. కొందరి చేతుల్లో విల్లంబులు
న్నాయి. కొందరి చేతుల్లో కత్తులున్నాయి. వారి నాయకుడొకడున్నాడు. అతడు గుఱ్ఱంపైన
వచ్చాడు. అతని చేతులొ కొరడా వుంది. వాళ్లు ఎడంచేత్తో కాగడాలు పట్టుకుని వచ్చారు.
వస్తూనే దొంగలనాయకుడు దొరికిన వారందరినీ కొరడాతో మోదసాగాడు. దొంగలు చాలా
మంది ఉన్నారు. శ్రేణి భటుల్ని కొరడాలతో బాది పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టారు.
123
చాళుక్యసింహాసనం
124
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
125
చాళుక్యసింహాసనం
“అలాగే! మరొక విషయమేమిటంటే నేను నీతో వేంగి దాకా రాను. నేను నాకు తగిన
సైన్యాన్ని నియమించుకుని రాష్ట్రకూటం పంపిస్తుంటాను. వాళ్ళక్కడ అజ్ఞాతంగా ప్రజల్లో
కలిసిపోయి జీవిస్తారు. అవసరం వచ్చినపుడే ఆయుధాలు పట్టి బయటికి వస్తారు. ఈ
రత్తంచెట్టి ఆయుధాలు జేరవేయడానికి పనికివస్తాడు. పూటకూళ్ళమ్మ క్రొత్తగా వచ్చిన వాళ్ళకి
కూడు వండిపెడుతుంది. అక్కడ మన వేగుకు కూడలి ఏర్పడుతుంది. వేగుశాఖకు ఎవరేనా
సమర్ధుల్ని నియమించుకోవాలి.” అన్నాడు విశాఖదత్తుడు.
21 శ్రీగిరి
విష్ణువర్ధనుడు విశాఖదత్తుడు తమ గుఱ్ఱాలను శ్రీశైలం వైపు ఉరికించారు. శ్రీశైలం
వెళ్ళడం అదే మొదటిసారి. ఆత్మకూరును దాటి వెళ్ళిపోయారు. తినుబండారాలుగానీ ఇతర
వస్తువులు కానీ ఆత్మకూరు నుంచే తీసుకు వెళ్ళాలి. ఆ ముందు ఊర్లున్నాయి కానీ ఏమీ
దొరకవు. ఆ విషయము మిత్రులిద్దరికీ తెలియదు.
అక్కడ కొందరు సుంకరులు వాళ్ళగుఱ్ఱాలను ఆపారు. దోవకు అడ్డంగా తీగలతో పేనిన
వల కట్టివుంది.
“ఎక్కడికి వెళుతున్నారూ?” అని అడిగాడు సుంకరి.
“శ్రీశైలం.”
“కొండపైకి వెళ్ళాలంటే ముందే ఇక్కడ పన్ను చెల్లించాలి!”
“శ్రీగిరి మల్లికార్జున దర్శనానికి పన్నా?” అడిగాడు విశాఖదత్తుడు.
“ఏ పన్నూలేకపోతే ఈ కొండదోవ ఎవడు శుభ్రం చేయిస్తాడు మన తాతా?” అన్నాడు
సుంకరి కోపంగా.
“తాతదాకా ఎందుకులే! ఎంతచెల్లించాలీ?” ప్రశ్నించాడు విశాఖదత్తుడు.
“మనిషి తల ఒక్కింటికి ఏడు డబ్బులు. గుఱ్ఱానికి ఐదు డబ్బులు. అభిషేకం
128
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
129
చాళుక్యసింహాసనం
130
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
132
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
133
చాళుక్యసింహాసనం
“విష్ణూ! నేను నిన్ను బెజవాడ దాటించేంత వరకూ అనుసరిస్తాను. అక్కడ ఆగి పోతాను.
వేంగిలో నన్ను గుర్తుపట్టే వాళ్ళెవళ్ళూ ఉండకూడదు. మనసైన్యాలలో విశాఖ దత్తుడనే
సేనాపతి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియకూడదు. నేను మాన్యకేత దుర్గాన్ని పట్టుకునే
ప్రయత్నంలో ఉంటాను. మనవెంట ఈ భారవాహకుల్ని కూడా తీసుకు వెళదాము. నీవు
రాకుమారుడివి. ఒంటరిగా నగరప్రవేశం చేయకూడదు. ఎక్కడైనా విడిది చేసి రాజధానికి
వార్త పంపు. మంత్రి పురోహితులు ప్రజలూ అతివలు మేళతాళాలతో నీకు ఎదురు వచ్చి
పూర్ణకుంభాలతో ఆహ్వానించి నీరాజనాలిచ్చి కోలాహలంగా నగరంలోకి తీసుకు వెళ్ళాలి. ఈ
వేడుక చూసే అవకాశం నాకు వుండదనుకో!
134
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
22 సారధి శతావరి
విష్ణువర్ధనుని రథం బహుమతి ప్రదానోత్సవం నుంచి నిష్క్రమించగానే ఇంద్రవల్లభుడు
సేనాధిపతులందరినీ నానా తిట్లు తిట్టి హతశేషాన్ని లెక్కించడానికీ తక్కిన పరిశోధనా బాధ్యత
జాదబ దండనాయకుడికి ఒప్పగించాడు. తాను కోటలోకి వెళ్ళిపోయాడు.
135
చాళుక్యసింహాసనం
136
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
137
చాళుక్యసింహాసనం
“సిగ్గు వలన అందరూ లేవనే చెబుతారు. నీ నాడి చూస్తే తెలిసింది. నీ శరీరంలో చెప్ప
లేని గుప్తవ్యాధి వుంది. ఈ గరళం వలన ఇప్పుడు అది సంపూర్నంగా తొలగి పోయింది.
నీవెలా తిరిగినా ఇకముందు నీ దరికి రాదు. ఈ పాము ఎందుకో నీకు మేలే చేసింది.
కొంతకాలం తరువాత నాగదేవతలకు తృప్తి కలిగించు” అన్నాడు శతావరి.
138
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
139
చాళుక్యసింహాసనం
23 మృదువదన
విష్ణువర్ధనుడిని బెజవాడలో విడిచిపుచ్చిన విశాఖదత్తుడు చెమరీ గురుకులానికి
వెళ్ళాడు. అతడి మనసంతా మాన్యకేతదుర్గాన్ని జయించడానికి ఎవరెవరిని నియమించు
కోవాలా అనే ఆలోచనపైనే వుంది. గురుకులంలో అందరూ విష్ణువర్ధన రాకుమారుని
విజయాన్ని గురించి జగదేకవీర బిరుదాన్ని గురించీ కథలు కథలుగా చెప్పుకుంటు న్నారు.
కానీ ఎవరికీ విశాఖదత్తుడు కూడా మాన్యకేతం వెళ్ళినట్లు తెలీదు.
140
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
*****
మల్లప్ప అనే సంగీత విద్వాసుడు పాడగా కనకాంబరి నీలాంబరి అనే ఆస్ధాన నర్తకీ
మణులు నాట్యం చేశారు.మహారాజు దేశంలో ఐదురోజులు ఉత్సవాలు ప్రకటించారు.
విప్రులకూ దేవాలయాలకూ భూరిదానాలు ప్రకటించారు.
142
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
*****
143
చాళుక్యసింహాసనం
కోటలోకి వెళ్ళాలంటే శిముకుడు అనే అధికారి ఆజ్ఞ కావాలి. ఆ నెపం పెట్టుకుని అతడు
తనతో సరసాలాడేవాడు. ఎక్కడేనా ఆయుధాలు దాచావా అని తడిమి చూసే వాడు. అతడి
ఆగడాలు మితిమీరుతుండేవి. ఆ విషయం విశాఖ దత్తుడికి చెబుతే ఇంత చిన్నసమస్యను
144
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
శిలాజం అతడు ఇంకా తననేమీ చేయలేడని తెలిసి నేలమీద చతికిలపడి కాస్త ఊపిరి
పీల్చుకుంది. ఆసమయంలో అతడు పొర్లుతూ దూరంగా జరిగి ఎడమచేత్తో నోటిలో కుక్కిన
145
చాళుక్యసింహాసనం
24 కన్యగర్భం
“హళా శిరీషా!” అన్నది వస్తూనే వసుమిత్ర.
“హళా వసూ! ఏమిటే బంగారమైపోయావ్” అన్నది శిరీష.
“అందరూ నల్లపూస అంటారు. నీవు బంగారం అంటావేమిటీ! ఔను. నేను రావాలేకానీ
నీవైతే రావుకదా! సార్వభౌముల పిల్లవాయె! రాజసం ఎక్కడికి పోతుందీ!”
“ఉంటేకదా పోయేందుకు! అలాంటి రాజసం ఏమీలేదులే! నేను రాకూడదని ఎక్క
డుందీ? కాకపోతే నిత్యకృత్యాలు అలా సాగిపోతోంది.” శిరీష వసుమిత్రని కొంచం పరికించి
చూచింది.
“నీకు నిత్యకృత్యాల బాధలేమిటే? వండుతున్నావా వారుస్తున్నావా! హాయిగా ఎనిమిది
మంది చెలికత్తెలమధ్య అష్టదళపద్మంలా వున్నావు.” అన్నది వసుమిత్ర.
“బాగుంది పీతకష్టాలు పీతకుండవా! ఇంతకూ ఏమిటే విసేషాలు? కొంచం ఎందుకో
నీలో మార్పు కనిపిస్తోంది.”
146
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“అదేంలేదే!”
కుమారు లుంటారు!”
“ఒకసారి కో అనుచూద్దాం?”
“మా నాన్నగారు స్వయంవరం ప్రకటించినపుడు కో అంటాను!”
25 బేలనురా దేవా
భీమసలుఖి మహారాజు వేంగీనగరంలో తనదంటూ ఒక గూఢచార సంస్ధను ఏర్పాటు
చేసుకున్నాడు. ఆ విషయం లీశోత్తరదీక్షితునికి మాత్రమే తెలుసు. తనమనుషుల ద్వారా
వేంగిలో పావులు కదుపుతున్నాడు. వేంగి మహామాత్యుడు గంగాతీర్ధుడు తనమనిషి. కానీ
అతడి చుట్టూవున్న రాజభక్తుల వలన అతడేమీ సహాయం చేయలేకపోతున్నాడు. అందుకే
కూష్మాండయోగిని గండువర్మని తన ప్రధాన వేగుగా నియమించుకున్నాడు.
150
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
151
చాళుక్యసింహాసనం
152
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
154
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
158
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
26 ఋషులు
రాష్ట్ర్రకూటరాజకుమారి శిరీష నిర్వేదంతో సౌధోపరిభాగం పైన కూర్చుంది. విలువిద్య
త్యాగం చేసినప్పటినపంచి మనసు దేనిమీదాలగ్నం కావటంలేదు. ఏదో కోల్పోయున భావన.
159
చాళుక్యసింహాసనం
160
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
161
చాళుక్యసింహాసనం
వలన నల్లబడినా కాకి నలుపు కాదు. కాయకష్టం చేయడంతో దండలు కండలు తిరిగిన
యువకుడు.
సరోవరం ఒడ్డున తాడుతో కట్టివేసిన చిన్న నావ ఉంది. అంగారకుడు నావ కట్టుతాడు
విప్పి రోహిణిని వస్తావా అన్నాడు. రోహిణి తల పంకించింది. నావలో ఎక్కికూర్చుంది. అతడు
తామర తంపర మధ్యనుండి నావను సరస్సు మధ్యలోకి నడిపి ఆపాడు. చుట్టూ చూస్తే విరిసిన
తామరలు. అరవిచ్చిన మొగ్గలు. సరస్సు చుట్టూ మంచు తెరకప్పినటు వుంది.
163
చాళుక్యసింహాసనం
164
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
165
చాళుక్యసింహాసనం
తీసి ఆడుతుంటే జారి దొర్లుకుంటూ ఎండుటాకుల కుప్పలోకి వెళ్ళి ది. ఆ కుప్పలో ఒక ఋషి
తపస్సు చేసుకుంటున్నాడు. శిరీష తెలీకనే తన కంకణం కోసం ఆ ఆకులపొదలో చేయి
పెట్టడంతో ఆమె చేయి ఋషి ఎడమ పాదానికి తగిలింది. అంతటితో ఆయనకు స్పృహ
వచ్చింది.
167
చాళుక్యసింహాసనం
అందుకు ఋషి “నీవు చాలా గొప్ప ప్రశ్న వేశావు. వేయి వరహాల ప్రశ్న!” అన్నాడు.
“కానీ నేనొక జడదారిని! నన్నడుగుతే శరీరాన్ని ఉతికి ఎండవేయమని చెబుతాను. అది నీకు
తగినది కాదు. నీవు ఒక దేశానికి మహారాణివై సమస్త రాజభోగాలు అనుభవించ వలసిన
దానివి. నీకు ముని వృత్తి తగదు. అసలు స్త్రీ సమస్యలకు పురుషుడు సమాధానం చెప్పడమే
తప్పు. నేను పురుషుడను. నీవు స్త్రీవి. నీ ప్రశ్నకు నీవు సరైన పతివ్రత నుండీ సమాధానం
168
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
27 పెళ్ళిసంబంధం
ఆంధ్రశ్రేష్ఠిగోమఠేశ్వరయ్య తన కులపెద్దల్ని ఇద్దరిని వెంట పెట్టుకుని బయలుదేరాడు
పెళ్ళి సంబంధం మాట్లాడడానికి. అందులో ఒకరు వప్పయ్యశ్రేష్ఠి. ఈయన మహారాజు ఇంద్ర
వల్లభునికి చాలా ఆప్తుడు. ఇతడిమాట ఇంద్రవల్లభుడు కాదనడని నమ్మకం. రెండవ ఆయన
మరకత శ్రేష్ఠి. ఈయన చాల పెద్దమనిషి. మాన్యకేత వణిజసంఘాలకు అధ్యక్షుడు. ముగ్గురూ
ముందస్తు సమయం తీసుకుని ఇంద్రవల్లభుని వద్దకు రాయబారం వెళ్ళారు.
169
చాళుక్యసింహాసనం
170
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
171
చాళుక్యసింహాసనం
172
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“కానీ అదొప్పుకోవద్దూ?”
173
చాళుక్యసింహాసనం
28 కమలహితాదేవి
పురోహితులు మాన్యకేతేశ్వరాలయంలో అందరికీ జపాలు హోమాలు జరిపిస్తుంటారు.
గోమఠేశ్వరయ్య శివ దర్శనానికి వెళ్ళాడు. అర్చనాదికాలు ముగిసిన తరువాత ప్రధాన
అర్చకుడు బిందుఋషి గోమఠేశ్వరయ్యను దూరంగా తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఆలయ
ప్రాకార మంఢపంలో ఓప్రక్కన కూర్చున్నారు.
174
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
*****
176
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
177
చాళుక్యసింహాసనం
“నీవు మహా పతివ్రతవు కదా! భర్త మాట జవదాటవు. నీవేమీ భయపడకు. జగతీంద్ర
వర్మని కొంతకాలం దండయాత్రలకు పంపిస్తాను.” అన్నాడు లీశోత్తరదీక్షితుడు.
29 భ్రూణము
గోమఠేశ్వరయ్య కూతురు విషయం ఏమీ పాలుపోక శతావరి ఆశ్రమానికి వెళ్ళాడు.
అప్పటికి ఆచార్యుడు ఏదో వైద్యం కోసం హోమకార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. శిష్యులు
178
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
పరదేశమేమిటీ? నేను వీరికి పక్కలో బల్లెం కాబోతున్నాను. ఇక్కడ నా అవసరం చాలా ఉంది!
మొన్ననే ముఖ్యమైన అంతఃపురస్త్రీకి పాముకరుస్తే వైద్యం చేశాను. చచ్చిపోవల సింది
బ్రతికింది.”
శతావరి గోమఠేశ్వరయ్య వద్ద క్షమార్పణ అడిగి ఆ స్త్రీ వచ్చిన చోటికి వెళ్ళాడు. ఆ నిండు
గర్భిణి ప్రసవించలేక రెండు రోజులనుండీ అవస్ధ పడుతోందిట! నెప్పులు భరించలేక గావు
కేకలు పెడుతోంది. బాగా నీరసించిపోయివుంది.
180
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
181
చాళుక్యసింహాసనం
30 రాక్షస వివాహం
మాన్యకేతనగరంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. నాటకం దగ్గరనుంచీ
చూడాలని సందర్శకులు ముందే వచ్చి కూర్చున్నారు. దూరంగా కూచుంటే వాచకం సరిగా
వినిపించదని!రాతి సోపానాలతో రంగస్తలం వలయాకారంగా నిర్మించబడింది. స్త్రీలు
పురుషులు వేరువేరుగా వారికేర్పరచిన మెట్లపైన కూర్చుని ముచ్చటించుకుంటున్నారు.
అందువలన గొప్ప గందరగోళం ఏర్పడింది.
కమలహిత అందకత్తేకాక ఆమె వయసు అస్సలు పైకి కనిపించదు. ఆమె మేని సొగసు
చూసినవాళ్ళంతా పరవశించి మన్మధావస్థలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆమె హొయలు
ఒలికించడంలో గొప్ప జాణ. .
183
చాళుక్యసింహాసనం
185
చాళుక్యసింహాసనం
186
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
అన్నాడు శంకంభట్టు.
189
చాళుక్యసింహాసనం
31 ఐదవనెల.
వసుమిత్రను చేసుకోవడానికి అంగీకరించిన తరణిగుప్తుడు మాన్యకేత నగరంలో మేన
మామ ఇంట్లో దిగాడు. వసుమిత్రకు భయంభయంగా వుంది. ఆమె మనసులో కర్క వల్లభుని
ముద్ర పడిపోయివుంది. కర్కవల్లభ రాకుమారుడికి తను గర్భవతిననే విషయం తెలుసునో
లేదో! అతడు తనను గుర్తుపెట్టుకున్నాడో లేదో! ఇంద్రవల్లభుడు ఈ సంబంధ విషయం
రాకుమారుడికి తెలియజేశాడో తనే తిరస్కరించాడో! అన్నీ సందేహాలే! ఒక్కసార యినా
తాను కర్కవల్లభునికి ఎదురుపడే అవకాశం రాలేదు. ఎదురు పడితే? మనసులో ఏ మూలో
ఆశవుంది.
“వసూ! మనసు గాలిపటం లాంటిది. గాలి ఎటువీస్తే అటు ఎగురుతుంది. గాలి దిశ
మారుస్తుంది కూడ!”
“నా మనసు మాత్రం మారదు. అది దిశ మార్చదు.”
“పోనీ నీకేంకావాలో కోరుకో! నీకానందమైనదేదో నేను కలిగిస్తాను.”
“నా ఆనందం కర్కవల్లభ ముఖారవింద దర్శనం!”
“నేను ఏర్పాటు చేయగలను. కానీ అతడు నిన్ను కాదంటే నన్ను చేసుకుంటావా?”
“మాట ఇవ్వలేను.”
191
చాళుక్యసింహాసనం
“అది ఒక ఉద్రేకం!”
“కాదు. స్త్రీ పురుష సహజం! చరాచర జగత్తులో అన్ని జంటలు ఆనందిస్తాయి. ఒక్క
మానవుడే అందుకు కొన్ని కొన్ని అభిజాత్యాలు పెట్టుకున్నాడు.”
“నన్నిప్పుడేమి చేయమంటావు?”
“నన్ను భార్యగా స్వీకరించమంటాను.”
“అది కుదిరే పని కాదు.”
“నేను చేసిన పాపమేమిటీ?”
“పాపం నేను చేయలేదు. ఊరికే అలా ఆనందంగా కలుసుకున్నాము.”
“ఆనందం వెనక బాధ్యత కూడా వుంటుంది.”
192
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
32 విమానాలున్నాయా
కొద్ది కాలంలోనే కమలహితాదేవి మాన్యకేత దుర్గం నుంచీ తన నివాసం వాడీపురానికి
మార్చింది. వాడీపురం మాన్యకేతానికి అట్టే దూరం లేదు. అక్కడయితే మాన్యకేతపు రద్దీ
వుండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు.
“ఉహూ! రామాయణంలో పిడకల వేట్లాట ఆపి నేను చెప్పేది వినండి. మాది అవంతీ
దేశం. ఒకప్పుడు నాభర్త ఇంటికి ఒక పురోహితుడు వచ్చాడు. అతడిది మనదేశం కాదు మన
భాష కాదు మన మతంకూడా కాదు. ఈజిప్టు దేశం నుంచి వచ్చాడు. అతడు అక్కడి
దేవాలయంలో అర్చకుడు. పేరు పూజారిస్. భారతావని పర్యటనకు వచ్చాడు.”
194
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
ఏదో బొమ్మలభాషలో వ్రాయబడి ఉంది. కానీ అది చదవటం సాధ్యం కావటం లేదు. అందులో
పక్షులు ఏవో చిహ్నాలు వింత జంతువులు ముఖ్యంగా పాములు చిత్రించబడి వున్నాయి.
అందులో విమానాల వంటివి కూడా వున్నాయి. మావారు ఈజిప్టు దేశం వెళ్ళిన తరువాతకూడా
పూజారిస్ మాఇంటికి వచ్చి నాతో కొంతకాలం గడిపారు. అప్పుడు నాకు చాలా విషయాలు
చెప్పారు. అక్కడ దేవాలయాలలో దేవతలను ఆనందింప చేయ డానికి స్త్రీ పురుషులు
సమాగమం కూడా చేసేవారట!”
“కూతురవుతుంది!”
198
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
సంప్రదాయం ఉండేది.
199
చాళుక్యసింహాసనం
33 నాగదీక్ష
శిరీష చెలికత్తెలతో కలిసి మళ్ళీ ఈలపురం వచ్చింది. వచ్చినప్పటినుంచీ అక్కడి
గుహలు తొలచడానికి సహాయపడేది నాగ జాతి వారా కాదా అనే సందేహం మనసులో
మెదులుతోంది. చెలికత్తె లందరూ అదేదో తేల్చుకోవాలసిందే నన్నారు. రాత్రిపూట కదా
నాగులు వచ్చేది. ఐతే రాత్రిపూటే ఆ గుహలకు వెళ్ళాలి. అందరూ గుఱ్ఱాలపై బయలుదేరారు.
ఎందుకైనా మంచిదని పురుష వేషాలు ధరించారు. కరవాలాలు కూడ మరువలేదు. గుఱ్ఱాలను
లోయలోకి దింపి చెట్లకు కట్టి వేశారు.
పాముల్లో చాలా వరకూ ఒక్క తల పాములే. పరికించి చూస్తే మూడు తలలు ఐదు
తలలు ఏడుతలలు పాములున్నాయి. ఒక పాముకు లెక్కిస్తే తొమ్మిది తలలున్నాయి. అతడు
అందరిలోకీ పెద్ద కావచ్చు. పాములలో తెల్లటి పాములు నల్లటి పాములు పసుపు రంగు
పాములు ఎరుపు రంగు పాములు అనేకమైన రంగులు కలపోసిన కలనేత పాములు
పాకుతున్నాయి. చూస్తే ఆడవాళ్ళ చీరలకు సీతాకోక చిలుకలకు కూడా అన్నిరంగుల హంగు
లుండవేమో. కొన్ని పొట్టిపాములు కొన్ని అతి పొడుగు పాములు ఉన్నాయి. పాముల్లో ఆడ
మగ గుర్తించడం తేలిక కాదు.
విడిదికి వెళ్ళి స్నానాల కొట్టులోకి వెళితే అప్పటిదాకా అక్కడొక పాము పడుకుని ఉంది.
చెలికత్తె కెవ్వున కేకవేసింది. పాము తప్పుకు పోయింది. అప్పటినుంచీ ఎక్కడో అక్కడ పాము
కనపడుతునే వుంది. పాల ఉట్టిపై పాము. మంచము కోడుకు చుట్టుకుని పాము. పూలు
కోయబోతే పాము. పడకగదిలో పాము. అందరికీ అడుగు వేయాలంటే పాము భయం.
పడుకుని కంటినిండా నిద్రపోవాలంటే పాముభయం. ఇంటి చూరు నుంచీ వ్రేలా డుతూ
పాము. ఏదో పాము పగబట్టి వచ్చిందేమోనంటే ఒకే పాము కాదు, వేరువేరు పాములు.
201
చాళుక్యసింహాసనం
“అదే చాపల్యం. సాధన లేకుండా తాంత్రిక ప్రయోగాలలో అడుగు పెడితే ఇలాగే అవు
తుంది. ఈ నాగులుమీరనుకున్నట్లు అందరికీ కనిపించరు. వీరు చరణాద్రి పర్వతాల
అడుగున నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నారు”అన్నాడు మహర్షి.
202
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
కంటిముందు ఏవో దృశ్యాలు. స్ప్ర్రుహ కలిగిన తరువాత అది కలో నిజమో వారికి తెలీ
లేదు. అది గాఢనిద్రా కాదు. అలా అని జాగృతము కాదు. కలలో లాగా స్వయం చలనం లేదు.
చైతన్యము లేదు. కేవలం కనిపిస్తున్న దృశ్యానికి ద్రష్టలు మాత్రమే.
204
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
కలకాని ఆ దృశ్యం చూసివచ్చిన శిరీష ఆమె చెలికత్తెలు విడిదికి వెళ్ళి రెండు రోజుల
దాకా మైకంగా నిద్రపోయారు. కొండమానుఋషి ఇంకెప్పుడూ కనిపించలేదు.
నేను నిన్ను చంపటంలేదు. చంపలేను. నాహం హంతి. నిన్నే ఖడ్గం నరకలేదు. అగ్నీ
దహింపలేదు. నీరు తడపలేదు. గాలి ఎగరకొట్టలేదు. నీవు ఎల్లప్పుడూ ఉండేవాడవు. విశ్వం
అంతా ఏ రశ్మివలన ప్రకాశిస్తోందో అందులో నీవొకకిరణం. తత్- త్వం- అసి.
కావాలంటే ఇంకెవరైనా చల్లని తల్లి కడుపున పుట్టు. ఐనా ఏముందీ లోకంలో! పునరపి
జననం పునరపి మరణం పునరపి మాతా జఠరే శయనం. భజగోవిందం భజగోవిందం
భజగోవిందం భజ.....
205
చాళుక్యసింహాసనం
206
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
207
చాళుక్యసింహాసనం
బిందుఋషికి వీరు పెద్ద వారు వాళ్ళు చిన్నవాళ్ళు అని వుండదు. అందరినీ సమానంగా
ఆదరిస్తాడు. గోమఠే శ్వరయ్యకు ఒక జనపనార పట్టా చూపించి దానిపైన కూర్చోమన్నాడు.
అలా చెబుతూ బంటుతో “ఒకక్షణం ఆగరా!” అని బిందుఋషి “ఏమిటి సెట్టీ! ఇలా
వచ్చావ్?” అన్నాడు.
పాడ్యమి నాడు ఒక్క పిండం అన్నం మాత్రం తిని ఉపవాసముండాలి. విదియనాడు రెండు
తదియనాడు మూడు పిండాలు ఇలా పెంచుతూ పూర్ణిమ నాడు పదిహేను పిండాలు
భక్షించాలి. అలాగే బహుళ పాడ్యమి నాడు పధ్నాలుగు విదియనాడు పడమూడు అలా తగ్గిస్తూ
అమ్మావాస్య నాడు నిరాహారంగా ఉపవాసం చేయాలి. ఈ అన్న పిండానికి కూడా ఒక
ప్రమాణం ఉంది. నెమలి గుడ్డు ప్రమాణం ఉండాలి. దీన్ని యవమధ్యం అంటారు.
నాకు వెరే దక్షిణ ఏమీ అవసరం లేదు. ప్రభువులిచ్చిన మాన్యం చాలు. కాకపోతే ఈ
నెలరోజులూ మాన్యకేతేశ్వరాలయంలో భాగవత పురాణం చెబుతాను శ్రద్ధగా విను.”
అన్నాడు బిందుఋషి.
210
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
211
చాళుక్యసింహాసనం
212
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
213
చాళుక్యసింహాసనం
214
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“మరి ఏంచేద్దామంటావ్?”
“సప్తమ గర్భాన్ని నాకు వదిలి అష్టమగర్భాన్ని తీసుకోమని మాఅన్న కాళ్ళు పట్టు కుని
ప్రార్ధిస్తాను.”
215
చాళుక్యసింహాసనం
216
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“రాదు. ఈ దేవ మానవ కళ్యాణాన్ని నెరపిన నిన్ను జనులు దుర్గ, భద్రకాళి, విజయ,
వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద,
అంబిక అనే పేర్లతో కొలుస్తారు. ఆరాధిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి గాబు
చెల్లించుకుంటారు. అంతేకాదు. దేవకీదేవి అష్టమ గర్భాన నేను జన్మిస్తాను. నీవు నందుడి
భార్య యశోదకు యోగమాయవై జన్మించు. నేను నీవు అక్కడివారం ఇక్కడా ఇక్కడివారం
అక్కడా మారదాం!”
217
చాళుక్యసింహాసనం
“ఏంచేద్దామంటావ్?”
218
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“నాథా! భర్త చెరసాలలో వుండగా నేనిక్కడ గర్భం ధరిస్తే లోకం ఏమంటుందీ? నేనా
అవమానం భరించలేను. గర్భం ధరించలేను.” రోహిణి ఏడుపు పైకి రాకుండా నోటికి చీర
కొంగు అడ్డం పెట్టుకుంది.
219
చాళుక్యసింహాసనం
“నాథా! నేనీ పని చేయలేను. లోకం దృష్టిలో నేనొక నీచురాలిగా మిగలలేను. నాభర్త
మధురా నగరంలో చెరసాలలో ఉండగా నేనిక్కడ గర్భం ధరిస్తే నన్ను లోకం కులట
అంటుంది.”
35 మహామంత్రి తొలగింపు
చాళుక్య ఆస్ధాన రాజనర్తకీమణులలో బింబాధరి ఒకతె. ఆమె క్రొత్తగా కత్తుల నాట్యం
నేర్చుకుని వచ్చింది. మహారాజు మహారాణీల వినోదం కోసం ఆ సాయంత్రం నాట్యం
ఏర్పాటు చేయబడింది. రంగాలంకరణ చాలా గొప్పగా చేశారు. కుడ్యస్ధంభాలకు
కూరగాయలు వ్రేలాడకట్టారు. రంగస్ధలం మధ్యలో నడుమెత్తు స్ధంభంపైన పళ్ళెరంలో
రకరకాల పిడిబాకులు చురకత్తులూ అమర్చివున్నాయి. కరండాలలో వెలిగే దీపాలతో
ప్రాంగణం పట్టపగలు లాగేవుంది.
221
చాళుక్యసింహాసనం
222
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
223
చాళుక్యసింహాసనం
225
చాళుక్యసింహాసనం
“ఎంత దుర్మార్గురాలూ?”
“మా ఇద్దరికీ ఒకటి రెండుసార్లు సమాగమం జరిగిన మాట నిజమే! కానీ అది ఎప్పటి
మాటో!”
“మరి మహారాణివారికెలా తెలిసిందీ!”
పాట పూర్తి కాగానే యువరాజు “ఈ పాట ఇలా ఎందుకు పాడారు ఎందుకు వ్రాశారు?”
అన్నాడు.
226
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
మహామాత్యుడు తల వంచుకున్నాడు.
36 వాస్తుమార్తాండుడు.
ఒకనాడు గోమఠేశ్వరయ్య ఇంటికి ఒక వాస్తు మార్తాండుడు వచ్చాడు. అతడు
భోజదేశం నుంచీ వచ్చాడు. అతడు వాస్తుశాస్త్రంలో అనేక పూర్వ గ్రంధాలు పఠించాడట.
వరాహమిహిరుడి బృహత్సంహిత, విశ్వకర్మ, మయుడు మొదలైన వారి గ్రంధాలు,
కాళిదాసు ఉత్తర పూర్వ కాలామృతాలు ఔపోశన పట్టాడట. శ్రేష్టి ఆయనకు తన నివాసగృహం
వ్యాపార ప్రదేశాలు గిడ్డంగులూ అన్నీ చూపించాలని తీసుకువచ్చాడు. శ్రేష్ఠి వెంబడే గొల్లనయ్య
కూడా వున్నాడు. గొల్లనయ్య శ్రేష్టి పశువుల శాల చూసు కునేవాడు.
227
చాళుక్యసింహాసనం
“నమస్కారమమ్మా!”
“అంతా ఈయన ప్రతాపం ఏమీ కాదులేండి. వీళ్ళ వంశం వాళ్ళంతా ముందే గడించి
పెట్టారు. ఈయన కాలంలో కాస్త విస్తరించింది.”
“విడివిడిగానే లెక్కించాలి!”
228
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
ఉంటాయిట కదా?”
“ఉంటాయి. మీరేమైనా వాస్తు గ్రంధాలు చదివారా?”
“ఈ ఇల్లు లాభం లేదు. ఇది నగరం మధ్యలో ఉంది. వచ్చిపోయే కచ్చడాలకు ఇరుగ్గా
ఉంటుంది. అదీకాక ప్రభుత్వోద్యోగుల కన్ను కూడా ఉంటుంది.”
“అయితే ఏంచేయమంటారు?”
“ఊరికి బయట తూర్పు నుంచీ వచ్చే రహదారికి దగ్గరలో గొప్ప ప్రాకారంతో గృహం
కట్టడం అవసరం. ఇక్కడ అంతమంది యోధుల్ని దాచలేము.”
230
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“మనశత్రువు శత్రువు మనకు మిత్రుడు. ఇది రాజనీతే! కానీ మేము ఎంచుకున్నది అతి
రహస్యమైన వ్యూహం. ఇది పది నోళ్ళలో పడితే ఎక్కడో ఒకచోట వీధిన పడుతుంది. మా
విజయాన్ని మేము సాధించగలము. మామీద నమ్మకం ఉంచండి. శివమారుడిని విడుదల
చేస్తాము. ఆయనను తీసుకు వెళ్ళడానికి వేయి మంది సైన్యాన్ని సన్నద్ధం చేసుకోమనండి”
అన్నాడు విశాఖదత్తుడు.
231
చాళుక్యసింహాసనం
“నగరంలో మీరు చాలా పెద్ద వ్యాపారులని తెలిసి వచ్చాము. కనీసం వేయి రత్నాలు
తీసుకోవాలి! మీమీద చాలా ఆశలు పెట్టుకున్నాము.”
“అయ్యా! ఇంత పెద్ద వ్యాపారం అంటే నాకు చాలా భయంగావుంది. ఇన్ని రత్నాలు
నేను భద్రపరచగలనా?”
“మీకలాంటి భయమేమీ లేదు. మీకూ రత్నాలకు రక్షణ బాధ్యత మాది. మీరు మాత్రం
232
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
233
చాళుక్యసింహాసనం
37 రాజమాత
మహారాజ ఇంద్రవల్లభుడు అయ్యణ మహాదేవి దర్శనం కోరి ఆమె అంతఃపురానికి
వచ్చాడు. పరిచారికలు చూపించిన ఉచితాసనం పైన కూర్చుని వేచివున్నాడు. ఆమె
అంతఃపురం అన్ని భవనాలకన్నా శుభ్రంగా వుంది. పాలరాళ్ళు పరిచిన ఆ మందిరం తెల్లటి
ఉచితాసనాలతో తెల్లటి ఉపధానాలతో తెల్లటి తెరలతో మంచుపర్వతంలా వుంది. మందిరం
అంతా రుద్రజడ మాలలతో అలంకరింపబడి వుంది.
పాలు పెరుగు వెన్న నేయి రాజమాత సేవించదు. ఆవుపాలు దూడ చేపగానే దూడను
తాగనీయకుండా దూరంగా గుంజకు బంధించి పాలుపితుకుతారు. అమాయకమైన గోవు
తనదూడ ముఖం చూసి పాలు చేపుతుంది. ఇదీ ఒకరకం హింసే. తేనెటీగలు తమ పిల్లల
కోసం పూవుపూవు తిరిగి మధువు సేకరించి గూళ్ళలో నిల్వచేసుకుంటాయి. మానవులు
ఈగలకు పొగపెట్టి వెళ్ళకొట్టి తేనె కొల్లకొట్టుకు వస్తారు. తేనె ఒకరి నోటిముందు కూడు
లాంటిది. అందుకని నిషిద్ధము.
235
చాళుక్యసింహాసనం
237
చాళుక్యసింహాసనం
“ఇంద్రా! నీవేదో కోపంలో ఉన్నావు. లేకపోతే ఇలా మాట్లాడవు. నీకు కలిగిన కష్టం
ఏమిటో చెప్పు.”
“ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య!”
238
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“నీ పరిపాలన నీది! నేను కూడా సల్లేఖన వ్రతం ద్వారా శరీరాన్ని విడవాలనుకుంటు
న్నాను!”
“కమలహితాదేవి వ్యవహారం!”
38 క్రొత్తమంత్రి
చాళుక్యదేశంలో మహామాత్యునిగా సోమసూత్రం శివకేశవయ్య నియమితుడయ్యాడు.
ముప్పది తిధులు గడిచాయి. దేశంలో అర్ధాంతరంగా మహామంత్రిని మార్చినందుకు మహా
కల్లోలంగావుంది. గంగాతీర్ధుడు అంతర్గతంగా విప్లవం తీసుకురావాలని అనేకవిధాల
ప్రయత్నిస్తున్నాడు. నూతన మహామాత్యుడు నరేంద్రమృగ రాజుతో సమావేశమయ్యాడు.
239
చాళుక్యసింహాసనం
“ఇది సాధ్యమే మహారాజా!ఖగము అంటే ఆకాశం. ఖేచరీ విద్య అంటే గాలిలో ఎగిరి
రావడం. ఆదిశంకరుడు కూడా అవసర సమయంలోఈ విద్యను ప్రదర్శించాడు.
హనుమంతుడు కూడా ఈ విద్యనే ఉపయోగించి సముద్రాన్ని దాటివుంటాడు! ఎలాగూ
ఈయుద్ధాలు ముగియడానికి ఇంకా చాలాకాలం పడుతుందికదా?”
39 కాలాముఖులు
గండువర్మ పూర్వపు మహామాత్యుడు గంగాతీర్థునితో సమావేశమయ్యాడు.
“అతడెలా చనిపోయాడు?”
243
చాళుక్యసింహాసనం
తరువాతా?”
“మా అందరికీ చాలా భయంగావుంది.”
40 దేవతార్చన
మాన్యకేతనగరంలో ఇంకా తెల్లవారలేదు. భీమసలుఖి మహారాజు తెల్లవారక ముందే
లేచి లీశోత్తరదీక్షితుని కలవడానికి రసతరంగిణి కోటీరానికి బయలుదేరాడు. ఆయనను
కలవాలంటే అదే సరైన ప్రదేశం.
245
చాళుక్యసింహాసనం
247
చాళుక్యసింహాసనం
“ఈ ముండేంచేస్తుందీ అక్కడా?”
41 వేంగిలో పండిత సభ
వేంగీ నగరంలో కవి పండిత సమావేశం జరుగుతోంది. నరేంద్రమృగజాజు ఆస్ధానం
అది. ఆ సమావేశానికి వేములవాడ చాళుక్యుల ఆస్ధానకవి సోమదేవసూరి వచ్చాడు. ఆయన
యశశ్తిలక అనే చంపూకావ్యాన్ని రచించాడు. దానితోపాటు నీతివాక్యామృతము అనే
ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు. ఇది కౌటిల్యుడి అర్ధశాస్త్రాన్ని క్రోడీకరించి ఒక ధర్మో
పదేశంగా రచించినది. ఆ సభకు ఉగ్రమూర్తి అనే పేరుగల యాదాద్రి పండితుడు కూడా
వచ్చాడు. అందరితోపాటు త్రామ్రలిప్తి నుండి తిట్టుకవి మల్లయ్యగారు కూడా వచ్చాడు.
249
చాళుక్యసింహాసనం
250
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
251
చాళుక్యసింహాసనం
“ఇరవైఒకటా? ఏమిటవీ?”
“గౌః, గ్మా,జ్మా,క్ష్మా,క్షా, క్షమా, క్షోణః, క్షితిః, అవని, ఉర్వీ, పృథ్వీ, మహీ, రిపః, అదితిః,
ఇళా, నిఋతిః, భూః, భూమిః, పూషా, గాతుః, గోత్రా .”
252
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
253
చాళుక్యసింహాసనం
“ఉన్నది శివము శక్తి! శివమే శంకరుడు శక్తి పార్వతి. ఈ కలయిక వలననే సుందర
మైన ఈజగత్తు విలసిల్లుతోంది. వీరే ప్రకృతి పురుషులు. లక్ష్మీనారాయణులు వాణీ
హిరణ్యగర్భులు. శక్తి కూడ శివునికి పరమైనది కాదు. పరమేశ్వరుడి సంకల్పమే శక్తి!”
“ప్రకృతి పురుషులు మాట నేను కూడ అంగీకరిస్తాను. ఆ పేరుతో మీరు చేసే ఈ వికృత
చర్యలేమిటీ?”
254
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
257
చాళుక్యసింహాసనం
258
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
న్యాయమా?”
“అలాంటివారిని బహిరంగంగా శిక్షించవచ్చుకదా?”
“చెప్పాలంటే అది సాధ్యంకాకే ఇలా చేస్తున్నాము.”
“ఎవరిపైనా కుహనా కాపాలికుల్ని కాలాముఖుల్నీ పాశుపతుల్నీ ప్రయోగించవద్దని
కోరుతున్నాను. మీ చర్య వలన తాంత్రికులపట్ల అసహ్యము అపహాస్యము శివాపరాధము
కూడా జరుగుతోంది.”
“నీవడిగిన వరం ఇస్తున్నాను. మేము ఎందుకు వీరిని ప్రవేశపెట్టామో ఆ అవసరం
తీరిపోయింది. ఇప్పుడింకా కుహనా కాపాలికులుండరు.”
“ఇంకొక ప్రశ్న అడగవచ్చా?”
“అడుగు!”
“చిత్రాణి మీకేమవుతుందీ?”
“ఆడదానివనిపించుకున్నావు! మా రాజ్యంలో నేను నీదగ్గరకు మారువేషంలో ఎందుకు
వచ్చానో తెలుసా?”
“యువరాజు శీలాన్ని గురించి అందరకూ తెలియకూడదని!”
“మనిద్దరినీ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారూ? ఆమెను నన్నూగురించి అందరూ
అదే అనుకుంటారు!”
“అంటే, అది నిజమాకాదా?”
“ఏమీ అంత కుతూహలంగా ఉందా?”
42 ఆర్యభట్టీయం
నాడు మాన్యకేతేశ్వరాలయంలో ఒక ప్రవచనం జరుగుతోంది. భాస్కరభట్టు అనే
పండితుడు ఆర్యభట్టీయం అనే గ్రంధం మీద ప్రసంగం చేయడానికి వచ్చాడు. ఇంద్రవల్లభ
మహారాజు సభను ప్రారంభించాడు. ఆసభకు పట్టుమని ముప్పదిమంది శ్రోతలు కూడా
రాలేదు.
260
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
ఆర్యా! నేటి సభలో ఆమె ఎవరో నా ఉపన్యాసాన్ని ఆద్యంతము విన్నది. నేను చెప్పే
ఖగోళశాస్త్రం ఆమెకేదో అర్ధమయినట్లే వుంది. నన్ను తన ఇంటికి భోజనానికి కూడా
ఆహ్వానించింది. ఎవరామె?” అన్నాడు భాస్కరభట్టు.
261
చాళుక్యసింహాసనం
“ఋషీ! మీరు చాలాచాలా గొప్ప ప్రశ్న వేశారు. దీనికి నాదగ్గర ఖచ్చితమైన సమాధానం
ఏదీలేదు. సూర్యమానం బార్హస్పత్యమానం చంద్రమానం ఈ గుణించే సిద్ధాంతాలమధ్య
వ్యత్యాసం కావచ్చు.”
*****
263
చాళుక్యసింహాసనం
264
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“దేవీ! నేను నీతో వాదించలేను. నిజానికి నేను మాగధి వాడిని. మామతాన్ని ఇంద్ర
కుబేర మతం అనికూడా అంటారు.”అన్నాడు భాస్కరభట్టు.
“మీ మతాన్ని గురించి నాకు తెలీదు. కానీ అతిధిని సత్కరించడం నావిథిగా భావిస్తాను.
అతిథి దేముడేకదా. అతిధిని మనసిచ్చి మంచిమాటలతోను తనువుతోను సేవలతోనూ నేను
సేవిస్తాను. ఇది పాపమో పుణ్యమో నాకు తెలీదు.”అన్నది కమలహితాదేవి.
“అతిథి అంటే ఎవరూ?” అన్నాడు భట్టు.
“నాకోసం ఇంటికి వచ్చినవాడు.”
“నీయింటికి పాలుపోసేవాడూ ఇత్యాదులు వస్తారుకదా? వాళ్ళుకూడా అతిథులేనా?”
అన్నట్లు అడిగాడు భట్టు.
“వాళ్ళు అతిథులు కాదు. ఏదో వ్యాపారనిమిత్తం వచ్చినవాళ్ళు!”
“అంటే అతిథి నీకు నచ్చాలి!”
“ఔను.”
“అంటే ఇచ్ఛకలిగినవారితో కులకడం అతిథి సత్కారం అనిపించుకుంటుందా?”
“పోనీ ఇంటికొచ్చిన గౌరవనీయులు అతిథి. శాస్త్రం అతిథిదేవో భవ అన్నదికదా. నా
ఇంటికి వచ్చిన అతిథి నాకు దేముడు. పవళింపు సేవతో సహా అన్ని సేవలూ చేస్తాను. మీరు
కూడా నాకు అతిథే!”
265
చాళుక్యసింహాసనం
“ఒక సేవకు ధనం రూపంలోకాని వస్తురూపంలో కానీ నగలు చీరలు రూపంలో కానీ
ప్రతిఫలం తీసుకుంటే ఆమె వేశ్య!”
.“ఏముందీ?”
266
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
43 హత్య
మహాసైన్యాద్యక్షుడు లీశోత్తరదీక్షితుని ఆజ్ఞపై జగతీంద్రవర్మ వేంగిపై దండయాత్రకు
వెళ్ళి నట్లే వెళ్ళాడు. సైన్యాలు కృష్ణా మూసి సంగమస్ధానమైన వాడపల్లి వద్ద నిలిపాడు. వేంగి
ముట్టడికి ఇంక మూడునాలుగు నెలలు పడుతుంది. సైన్యాలను ఇతర సైన్యాధిపతులకు
ఒప్పగించి తాను అజ్ఞాతంగా మాన్యకేతం తిరిగి వచ్చాడు.
267
చాళుక్యసింహాసనం
268
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
270
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
272
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
44 కూష్మాండయోగి
వేంగీనగరం ప్రముఖులలో గండువర్మ ఒకడు. నూతన మహామంత్రిని కలిసిన రెండు
రోజుల తరువాత ఒక రాత్రి పూర్వ మహామాత్యుడు గంగాతీర్ధుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన
పదవీచ్యుతి తరువాత విజయవాటికలో ఉంటున్నాడు. ఆయన ఇల్లు పున్నమ్మ వనానికి
దగ్గరగా ఉంది. వారిద్దరూ అతి రహస్యంగా మారువేషాలలో మహారాజపురం కొండ వద్దకు
వెళ్ళారు. అప్పటికే అక్కడ కూష్మాండయోగి వీరి రాకకై ఎదురు చూస్తున్నాడు. ముగ్గురూ
కొండ కొంతవరకు ఎక్కి ఒక చీకటి గుహలోసమా వేశమయ్యారు. కూష్మాండ యోగి
శిష్యుడైన చీమయ్య బయట కాపున్నాడు.
273
చాళుక్యసింహాసనం
“నేను వేంగీ ప్రజల కోరికపైన వేంగీ నగరానికి వస్తాను. అక్కడ జనాన్ని ఆకట్టుకుం
టాను. తరువాత కోటలో పాగా వేస్తాను!”అన్నాడు కూష్మాండయోగి.
45 మాయాలోకం
గంగాతీర్ధుడు గండువర్మ వేంగీ నగరంలో రహస్యంగా ఒకచోట చేరారు. గండువర్మ
ఏ సాంప్రదాయాన్నీ నమ్మడు. అసలు దేవుడున్నాడో లేదో అతడికి అనుమానమే. అతడి
ఇల్లాలు మాత్రం పరమ పావని. ఆమె ఆచరించని వ్రతాలు లేవు. చేయని దానాలు లేవు. వేంగీ
నగరంలో చిత్రరథస్వామి ఆలయానికి ప్రాకారం కట్టించింది. అర్చకులకు వసతులు
నిర్మించింది. ఆమె స్వయంగా కవయిత్రి. గండువర్మకు ఇవేవీ నచ్చవు. తాను సంపాదిం
చినదంతా తగలపెడుతోందనుకుంటాడు. కానీ భార్యంటే భయం. ఆమె ఏ వ్రతం చేస్తున్నా
ప్రక్కన కూర్చుని ముక్కు పట్టుకుని మమ అంటాడు. అంతవరకే అతడి భక్తి.
“మనం చేయటంలేదా పాపాలు! ఐనా పాపాలు చేసి గుళ్ళు కట్టిస్తే పోతుందా? అసలు
మన మరణానంతరం ఏమీ ఉండదు. న స్వర్గం న నరకం. పూర్వం బాదామీ చాళుక్యులు
కూడ అలాగే చేశారు. దేవాలయాల పేరుతో కొండలన్నీ తవ్విపోశారు. సామంతుల దగ్గర
కప్పాలు దండుకోవడం సరసాలకు శిల్పాలకు తగలేయడం!”
దక్షిణ మానస తీర్ధాలలో శ్రాద్ధం, పంచతీర్ధంలో శ్రాద్ధం, ఇవికాక బ్రహ్మసరస్సు వద్ద శ్రాద్ధం,
విష్ణుపాదం వద్దా, అష్టాదశపాదం వద్దా పిండప్రదానాలు. అక్షయవటశ్రాద్ధం. ఇన్ని రకాల
శ్రాద్ధాలు న్నాయి. ఇవన్నీ ఆచరించేటప్పటికీ తీర్ధయాత్రికులకు చివరకు గోచీకూడా మిగలదు.
గయావళీలు లాగేసుకుంటారు. అందుకే నా శ్రాద్ధం అనే తిట్టు వచ్చిందయ్యా! నాకీ
శ్రాద్ధాలమీద విసుకు పుట్టే మా తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టడం మానేశాను.”అన్నాడు గుక్క
తిప్పుకోకుండా గంగాతీర్ధుడు.
మహా జనులారా చింతించకండి. కళ్ళులేవా అంటే జ్ఞాననేత్రాలు లేవా అని అర్ధం. నేను
అపరాధం అపరాధం అంటూ చెంపలు వేసుకున్నాను. అంతట సమాధిస్ధితిలోంచీ ఇహ
లోకంలోకి వచ్చాను.
అంతట శంభులింగం ‘నీ పూనకం కూడా దొంగదే! నీవు ఆయన మనిషివే!’ అని
279
చాళుక్యసింహాసనం
అరిచాడు. అంతలో అమ్మవారికి కోపం వచ్చింది. ‘ఓరీ చెనటీ! నేను నీ పేరు చెప్పినా నీకు
నమ్మకం లేదురా? కాళీమాతనై నీ నాలుకలు కోస్తా, దుర్గా మాతనై నీ మెడకాయి కోస్తా!’ నని
బెదిరించింది.
280
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
281
చాళుక్యసింహాసనం
“చంపుతాడా?”
282
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
283
చాళుక్యసింహాసనం
మత్తుగా తాగించాడు.
284
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
చీమయ్య యువరాజ విష్ణువర్ధనునికి రహస్య వేగు పంపాడు ఏదో కొత్త కుట్ర జరుగు
తోందని.
285
చాళుక్యసింహాసనం
46 రాధామాధవం
విజ్జేశ్వరంలో కతిశర్మను బంధించి హింసించారనే అనుమానంతో ఐదుగురు
వ్యక్తులను చాళుక్యులు ఎట్టకేలకు బంధించారు. మహారాజుపై దాడిచేసినవారందరూ
286
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
కతిశర్మ మనశ్శాంతికోసం దేశాటనం చేస్తూ తిరిగి తిరిగి మువ్వ గ్రామానికి జేరి అక్కడి
గోపాలదేవుడిని సేవించుతు అక్కడే ఉండిపోయాడు.
287
చాళుక్యసింహాసనం
సమాధ్యావస్తలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపు చూసి భక్తులు అతడిని గట్టిగా తట్టి లేపుతే కానీ
స్పృహలోకి రాలేదు.
తేరుకున్న కతిశర్మ విష్ణువర్ధనుని గుర్తుపట్టాడు. “యువరాజా ఏమిటీరాక! ఎంత
సేపయింది నీవు వచ్చీ?”అన్నాడు లేచి కూచుంటూ.
గోపీచందనము తులసీమణి ధరించిన భక్తులందరూ కతిశర్మకు వందనం చేసి వెళ్ళి
పోయారు.
“మహారాజుకు క్షేమమేకదా! మహారాణీవారు ఆరోగ్యంగా వున్నారా?”అన్నాడు
కతిశర్మ.
“అందరూ కుశలమే! మా నాన్నగారికి నీవు చేసిన సహాయం నిరుపమానం. ఆయన
ప్రాణాలు కాపాడావు. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను.”
“అంతా ఆ రాధే కరుణ! ఎవరిని రక్షించాలో ఎవరిని శిక్షించాలో ఆ మాధవుడే చూచు
కుంటాడు” అన్నాడు కతిశర్మ ఆకాశం కేసి చూస్తూ చేతులు జోడించి.
“అంతా బాగుందికానీ నీ ఈ ఆడవేషమేమిటీ?” అన్నాడు విష్ణువర్ధనుడు.
“అదంతా ఒక కధలే!” అన్నాడు కతిశర్మ. “ముందు నీవు భోజనం చేయి. వేళయింది”
అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. “నీ పరివారం ఏదీ?” అన్నాడు కతిశర్మ ఆనాటి
మహారాజుపై దాడి గుర్తుకు వచ్చి.
“నా కరవాలమే నా పరివారం! అందరినీ ఊరిబయట విడిది చేయించి వచ్చానులే!
భయపడకు!” అన్నాడు విష్ణువర్ధనుడు.
ఇద్దరూ గోపీకృష్ణులకు నివేదించిన పదార్ధాలే భుజించారు. కతిశర్మ విష్మువర్ధనునికి
కర్పూర తాంబూలం ఇచ్చాడు తన తాంబూలం నోటిలోకి నొక్కుకుంటూ.
“మిత్రమా! ఇవాళ ఏకాదశి. వైష్ణవులు ఉపవాసం ఉండాల్సిందిపోయి తాంబూల
సేవనమా!” అడిగాడు విష్ణువర్ధనుడు.
“తాంబూల సేవనం మా గోపీకృష్ణ సాంప్రదాయంలే! మనం ఆరగించినవి కూడా
సింగాడీల పిండితో వండినవి. ఏకాదశినాడు తినవచ్చు!”
“శర్మా! నీ నాట్యం చాలా అద్భుతంగా వుంది. కానీ ఈ ఆడవేషమేమిటీ? ఏదైనా
నాటకంలో నటించ బోతున్నావా?” అన్నాడు యువరాజు.
288
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“నిజమే!”
290
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
293
చాళుక్యసింహాసనం
47 చిత్రరథస్వామి ఆలయం
వేంగీనగరంలో చిత్రరథస్వామి ఆలయం ఘంటలు మ్రోగుతున్నాయి. ఆది ఏకచక్ర
రథం అధిరోహించి గగనతలంలో ప్రయాణించే వంటరి బాటసారికి భూతలం పైన
నిర్మింపబడిన ఆలయం. సూర్యుడు ఆకాశానికే మణి. చంద్రుడలా కాదు. చంద్రుడు గొప్ప
రసికుడు. తారా మణుల మనసులు దోచి వెంటేసుకు తిరిగే రసిఖశిఖామణి. రాత్రికో రమణి.
294
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
295
చాళుక్యసింహాసనం
296
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
సైన్యం వెనకగా రూకలు నాణాలు నింపిన సందుగా పెట్టెలు భోషాణాలు మోసే వృషభ
శకటాలు నిలిచాయి. సైన్యంతో పాటు అంగడులు తెరిచే బేహారులు సుఖపెట్టే వారాంగనలు
వినోదాన్నిచ్చే నట్టువరాళ్ళు కూడా ఎద్దుబండ్లలో సిద్ధమైనారు. దండయాత్ర కొన్ని నెలలో
సంవత్సరాలో సాగే లక్షణాలు కనిపిస్తున్నాయి.
297
చాళుక్యసింహాసనం
వారలా నెలదినాలు పయనించి ఆలేరు ఒడ్డున కొలెను పాకలో విడిది చేశారు. అందులో
సగం సైన్యం ముందుకు వెళ్ళి మానుకోట సమీపంలోని పూసపల్లి సరోవరం వద్ద
స్కంధావారాన్ని ఏర్పాటుచేశారు.
అందుకు పట్టవర్ధని “ఎవరి బలం ఎంతో నాకు బాగా తెలుసు. యుద్ధంలో ప్రాణానికి
తెగించి పోరాడిన వారెవరూ ఎక్కువ యుద్ధాలు చూడలేరు!” అన్నది.
298
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
299
చాళుక్యసింహాసనం
300
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
301
చాళుక్యసింహాసనం
302
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
48 కల్లుపాట
ఆనాడు త్రయోదశి. బహుళ త్రయోదశి. మాన్యకేత నగరంలో మధువిక్రయానికి ప్రతి
సంవత్సరం వైశాఖబహుళ త్రయోదశినాడు వేలాం పాట జరుగుతుంది. అందులో ఎక్కువ
సుంకానికి పాడినవారికి ఒకసంవత్సరంపాటు కల్లు మద్యము విక్రయించడానికి అనుమతి
లభిస్తుంది.
303
చాళుక్యసింహాసనం
సురలో జేర్చినవి బెల్లం నుంచీ తయారుచేసే గౌడి, బియ్యం నుండి తయారయ్యే పైష్టి,
పనసపండు నుంచీ చేసే పానసం, ద్రాక్షపండ్లనుండీ చేసే సారాయం, తేనె నుండీ చేసే
మధూకం, ఖర్జూర సుర, తాటికల్లు, అన్నిరకాల అరిష్టలు ఆసవాలు, ఆరెపువ్వు నుంచీ చేసే
మైరేయం, కొబ్బరి చెట్లనుండీ తీసే నారికేళం, మైక్షవం, ఇప్పపువ్వు నుండీ తీసే మధూత్ధం
మొదలైనవన్ని అమ్ముకోడానికి అనుమతి లభిస్తుంది.
304
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
305
చాళుక్యసింహాసనం
“ఏమిటదీ?”
“అదిచెప్పతగిందికాదు.”
“ఎవరూ చెప్పకపోతే నా తప్పు నాకెలా తెలుస్తుందీ?”
306
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“చెబుతేకూడ బాగుండదు.”
“మీరు చెప్పకపోతే నాకెప్పటికీ తెలీదు.”
“మీరు తరుచూ రాజమాత నగ్నసౌందర్యాన్ని చూడడానికే కోటలోకి వెళ్తున్నారని.”
49 స.భ.ర.న.మ.య.వ
విశాఖదత్తుడు యువరాజు విష్ణువర్ధనుడు మాన్యకేత నగరంలో రహస్యంగా సమావేశ
మయ్యారు. వేంగి చాళుక్య రాకుమారుడు సార్ధవాహులతో కలిసి అజ్ఞాతంగా మాన్యకేత
నగరం జేరాడు.
307
చాళుక్యసింహాసనం
308
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
ఇదిగో ఇదికోట మధ్యలో ఉన్న బురుజు స్ధంభం. ఇక్కడకు ఎక్కి చూస్తే నగరం మొత్తం
కనపడుతుంది. దీనిపైన రాష్ట్రకూటుల గరుడపతాకం ఎగురుతుంటుంది. మన దళంలో
ఒకడు ఇక్కడకు జేరి వాళ్ళపతాకాన్ని దించి మన వరాహకేతనం ఎగురవేయాలి. ఇది
చూసినవారందరికీ దుర్గం చాళుక్యుల వశమయిందని తెలుస్తుంది. ఈ పని ఎంత త్వరగా
జరుగుతే రాష్ట్రకూట సైన్యం అంత త్వరగా చప్పబడి పోతుంది.
309
చాళుక్యసింహాసనం
“విశా కోటలోకి చాల క్లిష్టమైన మార్గం ఎంచుకున్నావు. ఇది నాపరాళ్ల కోట! తూముని
పగలకొడితే పైరాళ్ళు కూలిపోతే ఏంచేస్తావూ?”
“నీ కష్టం నాకు తెలుసు. అసలు చాలామందికి అందరూ తెలీదు. తెలీకూడదనే అలా
ఏర్పాటు చేశాను. నీ సైన్యంలో పాకనాటి పటాలం, కమ్మనాటి దళం, మున్నూరు దళం,
వెలనాటి పటాలం, వేగినాటి దండు, పల్నాటి జోదులు, రేనాటి పోటరులు, కొండపడమటి
గుంపు, కమ్మరదళం, కంచరదళం, తెలకుల దళం, వడ్డెరముఠా, రజకుల దండు, కుంభ
కారుల దళం, సాలిదళం, వల్మీకపటాలం, బోయదళం చంకుకారుల దండు, వధకుల దళం,
పసకరుల పటాలం, దేవాంగ జోదులు ఉన్నారు.
50 కల్లు అమ్మను
మర్నాడు చతుర్దశి. కల్లుపాట చూడడానికి బచ్చులందరూ వచ్చారు. అంతంత సుంకం
ప్రభుత్వానికి పోవడం వణిజులెవరికీ ఇష్టంలేదు. ఇద్దరికీ మధ్య సంధిచేయాలని నిశ్ఛయిం
చుకుని వచ్చారు.
311
చాళుక్యసింహాసనం
314
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
తాగుతే వీడికి వేదాంతం బాగా తలకెక్కినట్లుందని శిరః ప్రధాని రథం దిగివెళ్లి కొరడాతో
అతడిని చావమోదాడు. అంగరక్షకులు ఆతడిని ఈడ్చి అవతల పడవేశారు. రథం కోటలోకి
సాగిపోయింది.
51 నవావరణ నృత్యం.
అమ్మావాస్య చీకటి ఆకాశమంతా అలుముకుంది. నిశాధిపతి లేని రాత్రి మిణుగురు
పురుగుల లాంటి నక్షత్రాలదే ఆధిపత్యం. ఆ రాత్రి విశాఖదత్తుని నాయకత్వంలో ఎనిమిది
మంది కర్మచారులు ముప్పదిమంది సైనికులు కాగ్ననది తీరానికి వెళ్ళారు. నదిలోనుంచి
కోటలోకి నీరువచ్చే నాళికను మనిషి దూరేటట్లు పెద్దది చేయాలి. అది కర్మచారులపని. వాళ్ళు
పనిచేస్తున్న సమయంలో ఎవరైనా తమని గమనించే అవకాశముంది. సైనికులు అలాంటి
వారిని మట్టుపెట్టాలి.
316
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
నాట్యం చేస్తూ చేస్తూ నర్తకి మూడవ పొర వస్త్రం విప్పేసింది. మదన వివసులకు పై
వస్త్రాలు జారిపోయాయి.
317
చాళుక్యసింహాసనం
52 స్త్రీ ఏవ విభూషణం
ఇంటికి చేరిన శిరః ప్రధాని స్నానానికి వెళుతూ ముఖ్యమైన అధికారులందరిని ఆరాత్రి
తన దర్శనం చేసుకోమని ఆజ్ఞలు పంపాడు. వింత ఏమిటంటే తనఇంటివద్ద పరివారంలో
కూడ అందరూ అంతో ఇంతో మధువు సేవించివున్నారు. మధువు గ్రోలనిది తన అంగ
రక్షకాధికారి నీలవర్ణుడు, వేదాయి మాత్రమే.
319
చాళుక్యసింహాసనం
321
చాళుక్యసింహాసనం
322
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఇదేదో తిట్టేమోనండి!”
“మరి ఒకడిని తిడితే వాడు తిరిగి తిట్టడా?”
“ఔనండి. ఎందుకు తిట్టడండీ! తిరిగి అదేతిట్టు తిడుతున్నాడు.”
శిరః ప్రధాని ఆవేదన మరీ ఎక్కువయింది.కుశలుడు శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
53 కోటకు కన్నం
విశాఖదత్తుని దళాళాలు కోటవెలుపల కాగ్నానది జలనాళిక వద్దకు చేరారు. కర్మ
చారులు తమ పని ఆరంభించారు. కాగ్నానది నుండీ కోటగోడ వద్దకు ఒక కాలువ తవ్వబడి
వుంది. నదిలో నీరు కోటగోడ వద్దకు జేరడానికి ఆ కాలువ. అక్కడ కోటగోడ పునాదిలో
కుమ్మర తూము వుంది. ఆ తూముద్వారా నదీజలం కోటలోని దిగుడుబావి లోకి చేరుతుంది.
దాన్నే మానికల బావి అంటారు. అక్కడి నీటిరాట్నం ఆ నీరు తోడి జలనాళికలో పోస్తుంది.
324
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
54 రణదుందుభి
శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు వేదాయిని పిలిచి శాంతి మంత్ర పఠనం చేయమన్నాడు.
వేదాయి శిరఃప్రధాని ఇంట్లో నిత్యపురోహితుడు. శిరః ప్రధాని పౌండరీకం అనే యజ్ఞం చేసి
325
చాళుక్యసింహాసనం
326
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
55 ముట్టడి
చిత్రాణి నృత్యం ముగిసే సమయానికి యువరాజ విష్ణువర్ధనుని సేనలు మాన్యకేత
దుర్గద్వారం వద్ద సమీకరింపబడుతున్నాయి. విశాఖదత్తుడు అజ్ఞాతంగా దాచిన యోధులంతా
నిర్భయంగా శస్త్రపాణులై కోటగుమ్మంవైపు గుంపులు గుంపులుగా తరలి వచ్చారు.
ముందుగా కోటద్వారం వెలుపల కాపుకాసే భటుల పీకలు నొక్కేశారు, మాటు వేసి గొంతులు
కోసేసారు. పదహారు మంది అంగకక్షకులమధ్య విష్ణువర్ధనుడు అశ్వం అధిరోహించి
వచ్చాడు. ఖడ్గాలు గదలు కుంతాలు భిండివాలాలు పరశువులు విల్లంబులు మొదలైన
ఆయుధాలు నింపిన వృషభ శకటాలు కదిలివచ్చాయి. ఇంత గొడవ జరుగు తున్నా నగరంలో
సంచలనం లేదు. మగవాళ్ళంతా చిత్తుగా తాగేశారు. ఆడవాళ్ళుకూడ భర్త కౌగిళ్ళలో నలిగి
నిద్ర పోయారు లేదా మగవారిరాకకై ఎదురుచూచి కన్నులు కాయలు కాచి గడపమీదే
తలపెట్టుకుని పడుకున్నారు.
327
చాళుక్యసింహాసనం
328
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
329
చాళుక్యసింహాసనం
330
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
కునికి పాట్లు పడుతున్నాడు. చాకచక్యంగా అతడి నోరునొక్కి పీక కోసేశాడు. సోపానాల మీది
నుంచి పైకి వెళ్ళారు ఇద్దరూ. ఆ బురుజుపైన రాష్ట్రకూట గరుడపతాక విరాజితమై వుంది. పైన
రణఢక్క మోదేవాడొకడు శూలం పట్టుకున్న సైనికుడొకడు ఉన్నారు. మెట్లవైపు ఏదో అలికిడి
కావడంతో వారు అప్రమత్తమై పొంచివున్నారు. మాచానాయకుడి అనుచరుడు
పైకిజేరుతుండగానే వాళ్ళు శూలంతో గిరిపెట్టి గుండెల్లో పొడిచివేశారు. మాచానాయకుడు
ఒక్కడే వాళ్ళతో తలపడ్డాడు. ఒక్కసారిగా ఇద్దరి నెదిరించడం కష్టమే అయింది. వడలంతా
లోతైన గాయాలయ్యాయి. రక్తం కారిపోతోంది.ఇంక ఎక్కువ సేపు పోరాటం ఉండదు. రక్త
స్రావం వలన ఎవరైనా డస్సిపోవలసిందే. ముగ్గురిలో ఓర్పు ఎక్కువ కలవాడే చివరకు
మిగిలేది. మాచానాయకుడు రణఢక్క మోగించేవాడికి ముందరే పెద్ద గాయం చేయగలి
గాడు. కానీ వాడు ఒంటిచేత్తోనే ఢంకామీద నాలుగు దెబ్బలు వేశాడు. ఐదోదెబ్బ పడకుండా
మాచానాయకుడు అతడి చేయి నరికివేశాడు. ఆసమయంలో రెండవ యోధుడు తనను కూడ
చాలా గాయపరచాడు. కానీ మాచానాయకుడి దెబ్బతో అతడి తల తెగి బురుజుక్రింద పడింది.
ఆలస్యం చేయకుండ మాచానాయకుడు ఓపిక కూడదీసుకుని తాను నడుముకు కట్టుకున్న
చాళుక్య పతాకం విప్పి రాష్ట్రకూటుల గరుడపతాకం దింపి ఆ స్ధానంలో తమపతాకం
ఆవిష్కరించగలిడాడు. తమ వరాహధ్వజానికి నమస్కరిస్తూ ఒరిగిపోయాడు.
332
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
334
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
పూర్వచిత్తి.
“వాళ్ళకు స్త్రీలుండరా?”
“ఉంటారు ఇంట్లో నాలుగు గోడలమధ్యా! వీళ్ళు సంవత్సరాల తరబడి దండయాత్రలకు
వెళుతుంటారు. ఇళ్ళకూ పెళ్ళాలకు దూరంగా వుంటారు” అన్నది సమంత.
“అలా జరగకూడదు.”
“పూర్వం కూడా వేలాదిమంది స్త్రీలను చెరపట్టేవాళ్ళు. వాళ్ళకు పుట్టే సంతానంతో వాళ్ళ
జాతిని పెంచుకుని సైన్యాన్ని నింపుకునే వాళ్ళు.” చరిత్ర తెలిసునట్లు అన్నది షడ్పద.
“ఇది వాదోపవాదాలకు సమయమా రాకుమారీ? పారిపోదామా ఎదిరిద్దామా? నీ ఆజ్ఞ
కోసం నిరీక్షిస్తున్నాం” అన్నది అరణి సహనం నశించగా.
335
చాళుక్యసింహాసనం
57 వరాహకేతనం
ఐదుగురు చాళుక్య యోధులు పైలుడి ఆధ్వర్యంలో రాజకుమారి అంతఃపురం ముట్టడిం
చడానికి వెళ్ళారు. దారువుతో చెక్కిన ద్వారబంధం ఘనంగా ఉంది. ఇరువంకలా ఇద్దరు
మహల్లులు శూలపాణులైయున్నారు. పైలుడి యోధులు వారిని మట్టుపెట్టారు. వారు పెద్దగా
పోరాడలేకపోయినా అందరూ మేల్కొనేటట్లు పెద్దగా బొబ్బలు పెడుతూ పడి పోయారు.
పైలుడు చుట్టూ చూసి ఒక అరుగుకున్న బండరాయిని పెకలించుకు వచ్చి ద్వారాన్ని
గుద్దించాడు. తలుపులు తెరుచుకోకపోగా నాపరాయి పొరలు పొరలుగా చిట్లి నేల రాలింది.
కానీ బందులు ఉతకలు వదులయ్యాయి. మొలకు కట్టుకుని వచ్చిన ఉలితో బందులున్న
ప్రాంతంలో కొయ్యను తెగనరికారు. అందువలన ఒక్కసారిగా తంతే తలుపులు
తెరుచుకున్నాయి. చకచకా ఇద్దరు సాయుధపాణులు లోపలకు ప్రవేశించారు. రాగులపై
కాలువేసి తలకాయ పగిలేటట్లు జారిపడ్డారు. జలనాళిక లోంచి ప్రవేశించిన యోధులకు
మొలకు కట్టుకున్న కాశ, తోలు పట్టీ తప్పుతే వర్మాలు శిరస్త్రాణాలు లేవు. అదేసమయంలో
శర పరంపర దూసుకువచ్చి వాళ్ళ శరీరాల్ని తూట్లు పొడిచింది.
అందుకు బదులుగా పైలుడు “అమ్మా! మేము చాళుక్య సైన్యం. మాకు కోట వశమైంది.
మీరు లోంగిపోయినట్లు ఒప్పుకుంటే మాకు శస్త్ర ప్రయోగం చేయవలసిన అవసరం లేదు.
మీరు అంతఃపురం బయటికి మాత్రం రాకూడదు.”అన్నాడు.
336
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
58 విష్ణుయుద్ధం
కోటద్వారం బిగిసిపోవడం తెలిసింది విష్ణువర్ధనుడికి. ఇప్పుడు వేరే ప్రయత్నం చేయాలి.
తను ఆజ్ఞాపించకుముందే తమ సైన్యంలోని మాష్టీలు జట్టీలు జట్లుగా విడిపోయారు. ఒకరిపై
ఒకరు ఎక్కి కోటగోడ ఎత్తు మంచలా నిలబడ్డారు. వారినాధారం చేసుకుని సైని కులు వేగంగా
బురుజులపైకెక్కసాగారు. కొందరు మాస్టీలు వేరు వేరు ప్రాంతాలనుండీ ఉడుముల
సహాయంతో పగ్గం వేసుకుని లగ్గలకెక్కారు.
337
చాళుక్యసింహాసనం
338
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
339
చాళుక్యసింహాసనం
340
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
341
చాళుక్యసింహాసనం
342
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
343
చాళుక్యసింహాసనం
59 విజయానంతరం.
ఉదయం పొద్దెక్కక ముందే మాన్యకేత దుర్గంలో యుద్ధం ముగిసింది. అందరికీ
కనిపించే టట్లు బురుజు స్తంభంపై చాళుక్య వరహకేతనం ఎగురుతోంది. సింహద్వారం వద్ద
ఇంద్ర వల్లభ మహారాజును బంధించిన దృశ్యం కనపడుతోంది. రాష్ట్రకూటుల గరుడపతాకం
నేల రాలింది. రాష్ట్రకూట యోధులందరూ ఆయుధాలు క్రిందపెట్టి మోకాళ్ళపై కూర్చుని మోక
రిల్లారు.
344
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
346
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
స్త్రీల జోలికీ ధనం జోలికి రాదు. ప్రభుత్వమే ప్రతినిత్యం అందరికీ ఆహార ధాన్యాలు
పంచిపెడుతుంది. చాళుక్య శాసనాన్ని ధిక్కరించినవారికి పౌర హక్కులు ఉండవు.
“దొంగ ఏమిటే? మర్యాద లేకుండా!” అన్నది అభ్యంతరం లోంచి ఆమాట విన్న శిరీష.
348
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“విశా! తక్కువ రకం స్త్రీలన్నావు. ఇది తప్పుమాట. ఎవరి మాన ప్రాణాలు వారికి
ముఖ్యం కాదా? పేదరికానికీ శీలానికి ఏవిధమైన సంబంధం లేదు. అదీకాక మనం జయించిన
దెవరినీ? ఇక్కడి ప్రజలనా? ఇక్కడి సైన్యాన్ని ఇక్కడి ప్రభుత్వాన్ని జయించాం! అంతే! ప్రభువు
యొక్క అధికారం ప్రజలపై ఎంతవరకూ? సుంకం దండుకునేంతవరకే! ప్రత్యామ్నాయంగా
వారికి భద్రత కలిపించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల ధనమాన ప్రాణాల బాధ్యత
వహించని ప్రభుత్వం మరొకరకం దోపిడీ దొంగ.
349
చాళుక్యసింహాసనం
“మన సైన్యం చాలా అల్పమనే మాట నిజమే విశా! నేను మన విజయం వార్త మా
నాన్నగారికి పంపాను. అక్కడినుండి ఆజ్ఞలు రావడానికి కొంతకాలం పడుతుంది.”
“ఏంచేద్దాం? పోషిద్దాం!”
“వాళ్ళ పక్షానా?”
350
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఇది వింతగావుందే!”
351
చాళుక్యసింహాసనం
“రేవాదాస దీక్షుతుడెవరూ?”
“అతడా! నాతో చాలాసేపు యుద్ధం చేసినవాడు. ఆయన కవచం కేడెం శిరస్త్రాణం ఏదీ
ధరించకుండా నిర్భయంగా పోరాడాడు. అతడే సేనాపతో నాకు అర్ధం కాలేదు. అతడి సైన్యం
మొత్తం వీరోచితంగా పోరాడి మరణించింది. ఆయన తలకాయి ఒక్క దెబ్బలో నరికివేద్దా
మనుకున్నాను. కానీ ఎందుకో అలా చేయబుద్ధి కాలేదు. ఆయన కేశపాశాలు పెరిగినగడ్డం
నుదిటన బంగారు కాసంత బొట్టూ చూస్తే ఈ పండితుడు యుద్దానికి ఎందుకు వచ్చాడు
అనిపించింది. ఖడ్గం వెనక్క తిప్పి భ్రుకుటీమధ్యంలో పొడిచాను. ఇప్పుడాయన ఎలా
వున్నాడూ?”
60 సంధి
విశాఖదత్తుడు పైలుడి విషయం తెలుసుకోవడానికి నేరుగా రాజకుమారి అంతః
పురానికి వెళ్ళాడు. లోనికి వార్తాహరుడిని పంపాడు తన రాక తెలియజేయడానికి.
అరణి అడుగులో అడుగు వేసుకుంటూ అటూ ఇటూ చూసి దగ్గరకు వచ్చింది. విశాఖ
దత్తుడు ఆ బాలను గాఢంగా కౌగలించుకుని చిగిరుటధరాలపై మొరటుగా ముద్దుపెట్టాడు.
“మాపైలుడేడీ?”
355
చాళుక్యసింహాసనం
357
చాళుక్యసింహాసనం
61 పెళ్ళిచూపులు
అది శిరీష అంతఃపురం. రాకుమారి శిరీషను చెలికత్తెలు తీర్చి దిద్దాలనుకున్నారు.
సంపంగి నూనెతో తలంటాకు. సురభిచందనం నలుగు పెట్టారు. బంగారు కలశాలతో
పన్నీటి అభ్యంగనం చేయించారు. కురులార్చి అగరు ధూమం వేశారు. కురులు దువ్వి
బంగారు మొగలిరేకుల జడ వేశారు. పరిమళభరితమౌ పులచెండ్లు తురిమారు. పాపట
పిందిరీ అమర్చారు. పాపట కిరువంకలా మణిమయమైన సూర్యచంద్రుల ఆభరణాలు
అలంకరించారు. కంటికి కాటుక తీర్చారు. మరుని వింటి తునలలాంటి కనుబొమలమధ్య
సువాసనల తిలకం తీర్చారు. కర్ణద్వయానికి నవరత్నాలు కూర్చిన పంజరాలవంటి జూకాలు
అలంకరించారు. వాటి భారానికి చెవితమ్మి సాగకుండా పట్టీలు కొప్పు గొలుసులు
అమర్చారు. కంఠాభరణాలతోపాటు మకరికారేఖలు దిద్దారు. చనుగవకు కస్తూరి పచ్చ
కర్పూరము కలిపిన చందనం రాశి పైన ముత్యాలు బంగారు పూలు కుట్టిన కంచుకం తొడిగి
వెన్నువైపు దూముడి వేశారు. శంఖంలాంటి మెడచుట్టూ ఆణిముత్యాల పట్టెడ
అలంకరించారు. చేతులకు మణిమయాంగదాలు బాహు పురులూ ముంచేతులకు
మణికింకిణులు అంగుళీయకాలు అలంకరించారు, బంగారంచుల పరికిణీపై సరిగంచు
వల్లెవేశారు. పారదర్శకమైన ఆ వలిపం శాస్త్రానికి మాత్రమే. పాలీండ్ల బిగువును దృశ్యా
దృశ్యంగా చూపుతోంది. పాదాలకు పారాణితోపాటు బంగారు మువ్వల పట్టీలు పెట్టారు.
పలుచటి అవకుంఠనం సిగపై నుండి కప్పారు. అప్పటికీ వారికీ తృప్తి కలుగలేదు. అవతల
వేంగి యువరాజు వేచివున్నాడని అంతటితో అలంకరణలు ఆపుచేశారు.
358
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
359
చాళుక్యసింహాసనం
360
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
361
చాళుక్యసింహాసనం
363
చాళుక్యసింహాసనం
లేఖ తయారయింది. చక్కటి దంతపు బరిణలో పెట్టారు. కానీ ఎలా పంపించాలో అర్ధం
కాలేదు. భూసురుడి ద్వారా పంపిస్తే బాగుంటుందేమో! కానీ ఎవరు దొరుకుతారూ? బయటికి
వెళ్ళడానికి లేదు. యమకింకరుల్లాంటి భటులు కాపున్నారు.
365
చాళుక్యసింహాసనం
366
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
367
చాళుక్యసింహాసనం
369
చాళుక్యసింహాసనం
62 భయం
రాజకుమారి శిరీష వివాహం జరిగిన ఐదవరోజున నగరంలో నూతన వధూరుల ఊరే
గింపు జరపాలనుకున్నారు. కానీ విశాఖదత్తుడు దుర్గాద్యక్షుడిగా అనుమతీ నీయలేదు.
చక్రవర్తి పునఃప్రతిష్ఠ జరిగేంతవరకూ మాన్యకేతనగరంలో తాను దుర్గాద్యక్షపదవి నుండి
తప్పుకునేది లేదని తేల్చిచెప్పాడు.
370
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
“ఎవరెవరు ఉన్నారూ?”
“ఇప్పుడు ఇంద్రవల్లభుడు కోరలు తీసిన పాము. ఆయనే ఒక బందీ. నిషేధం నీవే ఎత్తి
వేయాల్సింది!”
371
చాళుక్యసింహాసనం
అన్నాడు యువరాజు.
ఇప్పుడు చెప్పు యువరాజా వీళ్ళవద్ద నాకు కూడా తెలియని నేలమాళిగలు ఎన్ని వుండి
వుంటాయో!”
374
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
63 పట్టాభిషేకం
మాన్యకేత మహానగరంలో శిరీష వివాహోత్సవాలలోనే పట్టాభిషేక ముహూర్తం కూడ
దొరికింది.శాలివాహన శకాబ్ది 738 దుర్ముఖీనామ సంవత్సరం వైశాఖశుద్ధ సప్తమి గురు
వారం పుష్యమీ నక్షత్రంలో పట్టాభిషేకం. ఉత్సవాలలో ఉత్సవం. పెళ్ళికి వచ్చినవారందరూ
అమోఘవర్షచక్రవర్తి పట్టాభిషేక మహోత్సవానికి ఉండిపోయారు. ఇరుదేశాల మధ్య సంధికి
చిహ్నంగా చాళుక్య నరేంద్రమృగరాజు అమోఘవర్ష రాజేంద్రుని శిరస్సుపై రాజమకుటాన్ని
ప్రతిష్ఠించాడు.
375
చాళుక్యసింహాసనం
376
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
నేను ఇంకా ఎక్కువ కాలం ఉండను. నేను పరిపూర్ణుడనైతే పోయేనాడు మాడు పగిలి
బ్రహ్మరంధ్రం నుంచీ జీవుడు బయటికి పోతాడు. ఆ స్ధితికి జేరుకున్నవాళ్ళకు అది సాధ్యమే!
స్త్రీలైనా పురుషులైనా! వితంతువులను గుండు గీయించి ఇంట్లో కూచోపెడతారు. దాని అర్ధం
అన్నీ వదిలిపెట్టి గృహతపస్యులు కమ్మని! అలా అయినవాళ్ళున్నారు. వారికి ప్రత్యేకంగా దీక్ష
సన్యాసము అవసరం లేదు. వారికి కూడా తలపండుతే ప్రాణం బ్రహ్మరంధ్రం నుంచే
పోతుంది. అది సాధన ద్వారా సాధ్యమే.”అన్నాడు బిందుసరస్వతీస్వామి.
చేయని వాడే వచ్చేజన్మలో ముష్టివానిపాత్ర వేస్తాడు. ఇది మొత్తం భగవంతుడు రచించి వదిలి
వేసిన ప్రణాలిక! వచ్చేజన్మకు మన తలరాత మనమే రాసుకుంటాం! వేరేఎవరో రాయరు.”
అన్నాడు బిందుసరస్వతి.
64 అడవిపువ్వు
మాన్యకేతనగరంలో మనుగుడుపుల పెళ్ళికుమారుడైన విష్ణువర్ధనుని శిరీష దూరంగా
వుంచడంతో యువరాజు వేరే మందిరంలో విశ్రమిస్తున్నాడు. మృదువదన కార్యము నాటి
పెళ్ళికూతురులా లోపలకు వెళదామా వద్దా అన్నట్లు బయట తచ్ఛాడుతోంది. సిగ్గు వద్దం
టోంది. కోరిక లోపలకు వెళ్ళమంటోంది.ఆమె యువరాజుకు అంగరక్షక సేనాపతి
కావడంతో అడ్డగించే ద్వారపాలకులు లేరు.
“ఓ!”
“యువరాజా! క్షత్రియులకు బహుభార్యత్వం తప్పుకాదనిపించింది.”
“పోనీలే ఇద్దరుండడం మంచిదే. ఆడవాళ్ళకు అలక సహజం! ఆవిడ అలిగినపుడు
నీవు, నీవలిగినపుడు ఆమె!”
“ఇద్దరం అలుగుతే?”
“మంచం వీధిలోవేసుకు పడుకుంటాను!”
“అయ్యవారిసేవలో అలక ఒక పులకరింత!”
“అలాగా మాకు తెలీదులే!”
“అవును. వరవర్ణిని మేనిలో పాదం చిటికన వ్రేలినుంచీ శిరోపర్యంతం శ్రద్ధ, ప్రీతి, రతి,
ధృతి, కీర్తి,మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని,
వశకరి, రంజని అనే పదిహేను మదనస్ధానాలుంటాయి. మర్మం ఎరిగి అక్కడ మీటితే విపంచి
ఆ నవరాగం పలుకుతుంది.”
383
చాళుక్యసింహాసనం
384
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
385
చాళుక్యసింహాసనం
386
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
388
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
66 ప్రతిష్ట
తూర్పుచాళుక్యదేశం ప్రజలంతా మాన్యకేత విజయంతో ఆనందోత్సవాలలో మునిగి
తేలుతున్నారు.
అన్నాడు మహారాజు
“అంజనమా?”
391
చాళుక్యసింహాసనం
393
చాళుక్యసింహాసనం
395
చాళుక్యసింహాసనం
అప్పుడు పైట సవరించుకుంది శిరీష. చేటిక మాటకు సిగ్గుపడుతూ ఆమె చెంప మీద
కొట్టింది సుతారంగా శిరీష.
397
చాళుక్యసింహాసనం
398
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)
ఓజోఅసి సహూఅసి బలమసి భ్రాజో అసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయు
రభిభూః
నీవే ఓజస్సువు సాహసము నీవే. బలము నీవే తేజస్సువూ నీవే. దేవతల స్వర్గ ధామము
నీవే. సమస్త విశ్వమూ నీవే. ఓ పరమాత్మా విశ్వముకు ఊపిరీ నీవే.
ఓం సామవేద మవధారయా
అభిప్ర గోపతిం గిరేన్ద్రమర్చ యధావిదే
సూనుం సత్యస్య సత్పతిం
ఇంద్రుడు సత్యపుత్రుడు సజ్జన పాలకుడు గోవులకు ప్రభువు. అతడిని యధావిధిగా
అర్చించండి కీర్తించండి.
ఓం అధర్వ వేద మవధారయా
399
చాళుక్యసింహాసనం
సప్త ఋషులూ సప్త గ్రహములు సప్త మరుత్తులూ సప్త లోకములూ సప్త ఛందస్సులూ
దేహానికి ఆధారభూతమైన పన్నెండు నెలలూ ఐదుఋతువులూ మూడు లోకములూ
సూర్యుడూ, పంచభూతములూ పంచ ప్రాణములూ పంచ జ్ఞానేంద్రియములూ పంచ కర్మేం
ద్రియములూ అంతఃకరణము తో కూడుకున్న బలమును ఓ వాచస్పతీదేవీ మాయందు ప్రవేశ
పెట్టుము.
ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః
పృధివ్యై నమ ఓషధేభ్యః నమో వాచే వాచస్పతయే
నమో విష్ణవేబృహతే కరోమి
ఓం శాన్తి శాన్తి శాన్తిః
400