You are on page 1of 5

సౌందర్యశాస్త ్ర గ్రంథం ‘హరమేఖలా’

తిరుమల రామచంద్రగారి అనువాద ప్రతిభ

డా||జి. వి. పూర్ణచందు,B.A.M.S.,

అందంగా ఆకర్షణీయంగా ఉండాలనే తపన. మనిషికే ఉంటుంది. జంతువులకు ఉండదు. మనిషికీ


జంతువుకూ మౌలికమైన తేడాలలో ఇది ముఖ్యమైంది. ఏ కుక్కా, ఏ కోతీ, ఏ గేదే, ఏ ఆవూ, తాను
అందంగా అలంకరించుకుని తిరగాలనుకోవు.

సౌందర్య పిపాస మనిషి ప్రా థమిక లక్షణం. ఈరోజున సౌందర్య శాస్త ం్ర (cosmetology) అనేది పెద్ద
శాస్త ం్ర గా రూపొ ందింది. సౌందర్య సాధనాలను తెలుసుకొని వాటిని నైపుణ్యతతో వాడుకోవటం నేర్పేది
సౌందర్య శాస్త ం్ర . modification of beauty అనేది దీని లక్ష్యం. కానీ, ఈ శాస్త్రా నికి మూలాలు
భారతదేశంలోనే ఉన్నాయి. మూలాలు మాత్రమే కాదు, ఆధునిక కాస్మటాలజీలో లేని అనేక విశేషాంశాలు
కూడా మన శాస్త్రా లలో ఉన్నాయి.

వేదాలతో మొదలుపెట్టి, మన ప్రతీ సాహిత్య గ్రంథాలన్నీ ‘సౌందర్యపరివర్త నం’ గురించి అంతో ఇంతో
ప్రస్తా వించాయి. ఆయుర్వేద శాస్త ం్ర ఈ విద్యకొక ప్రతిష్ట ను కల్పించింది. అంజనాలు, గంథాలు, లేపనాలు,
కల్కాలు, కషాయాలెన్నో ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తా యి.

కస్తూ రి తిలకం, కౌస్తు భ హారాలు, ముత్యాల ముక్కుపుడకలతో, కంగనాలతో, హరిచందన


చర్చితాలతో దేవతల్ని అలంకరించి, ఆరాధిస్తూ , తమ సౌందర్యపిపాసను భారతీయులు చాటుకున్నారు.
నీలాంజన సమాభాసం అని శని దేవతని, గుడాకేశి అని శివుణ్ణి ఇలా సౌందర్యపరమైన ఉపమానాలతో
కొలుచుకున్నారు.

ఆధునిక సౌందర్యశాస్త ం్ర   అందంగా కనిపింపచేయటానికి మాత్రమే ప్రా ధాన్యత


నిస్తా యి. hairstyling, skin care, cosmetics, manicures/pedicures, రోమాలను
తొలగించేందుకు  waxing, threading vagairaa విధానాలే ప్రధానంగా కనిపిస్తా యి. కానీ పెదాలు ఎర్రగా
కనిపిస్తే చాలదు, నోటి దుర్వాసన లేకుండా ఉండాలి. శరీరం పసిడి రంగులో మిసమిసలాడితే
సరిపో దు, చెమట దుర్గ ంధం లేకుండా ఉండాలి. శారీరక, మానసిక స్వాస్థ్యాలను కూడా దృష్టిలో పెట్టు కుని
మన సౌందర్య శాస్త్రా లు రూపొ ందాయి.
వేద యుగంలో చ్యవనుడు తన యవ్వనాన్ని తిరిగిపొ ంది సుకన్యనను పెళ్ళాడిన కథ ఉంది.
యవ్వనాన్ని తిరిగి ఇచ్చిన ఆ ఔషధాన్ని చ్యవనుడి పేరుతో చ్యవనప్రా శ అంటారు. దీనిని రసాయన
చికిత్స అంటారు. ఇది సౌందర్య శాస్త ం్ర లో భాగమే!  వేదయుగాలలో మధువిద్య అనేది ఒకటి ఉండేది.
రసాయన చికిత్సలు ఈ విద్యలోంచే అభివృద్ధి చెందాయని చెప్తా రు.

ప్లా ష్టిక్ సర్జ రీ చేసిన తొలి వైద్యుడు సుశ్రు తుడు. రైనోప్లా ష్టీ అంటే తెగిన ముక్కును సరిచేసే చికిత్స
చేశాడాయన. ఆలేపం, పరిషేకం, ఉత్సాదనం, పాండుకర్మ, రోమ సంజననం లాంటి చికిత్సావిధానాలను
ఆయుర్వేద శాస్త ం్ర అందించింది. సంహితా యుగాల తరువాత కౌటిలీయ అర్థ శాస్త ం్ర , వాత్స్యాయన
కామశాస్త ం్ర , అనంగ రంగ, కొక్కోకం లాంటి గ్రంథాల్లో సౌందర్య శాస్త్రా పరమైన అంశాలు ఎన్నో కనిపిస్తా యి.

మహాభారతంలో ద్రౌ పది ‘సైరంధ్రి’ పేరుతో అఙ్ఞా తవాసంలో లేడీ బ్యూటీషియన్ పాత్ర పో షించింది.

మైలసంతలో బహిరంగంగా స్త్రీలు ‘సుసరభిత్తి ’ అనే ఒక ఔషధాన్ని అమ్మినట్టు వల్ల భరాయుడి


క్రీడాభిరామంలో ఉంది. సుసర అనే పువ్వు ‘ఆస్ట్రేలియన్ పుష్పం’గా ప్రసద
ి ్ధి, రెడ్డి రాజుల కాలంలో
అవచితిప్పయ్యశెట్టిగారు తెచ్చిన విదేశీ ద్రవ్యాలలో అది కూడా ఉన్నదేమో తెలీదు. అమితమైన
చల్ల దనాన్నిస్తు ంది. దాని నిర్యాసాన్ని స్త్రీల మర్మావయవం పైన లేపనం చేస్తే యోనిదో షాలు పో తాయని
దాన్ని వాడేవారు. ఇలా తెలుగువారి సౌందర్య, శృంగార ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలను
సాహిత్యాధారాలు అనేకం మనకు అందిస్తు న్నాయి.  

సౌందర్యశాస్త ్ర పరమైన అంశాలన్నింటినీ ఒక చోట గుదిగుచ్చి పాఠ్యగంథంగా వెలువరించిన గ్రంథం


హరమేఖల. శివుడి మాల అని దీని భావం. క్రీశ. 9 వ శతాబ్ది లో  ప్రా కృత భాషలో ఈ గ్రంథరచన జరిగింది.
ధరణీవరాహ రాజ్యం తనదని, మాధవుడు తన తండ్రి అనీ ఈ గ్రంథంలో మాహుకుడు చెప్పుకున్నాడు.
హరమేఖల అనే పేరుని బట్టి రచయిత మాహుకుడు శివయోగి అని అర్థ ం అవుతోంది. ఇందులో ప్రా కృత
శ్లో కాలను ‘ఛాయ’ లంటారు. వీటికి సంస్కృతంలో టీకలు దొ రుకుతున్నాయి.

మొదట దీని ప్రతిని కొట్టా యంలోని నారాయణభట్ట తిరి సంపాదించారు. 1938 లో ట్రా వెంకోర్
మహరాజా సహకారంతో కె. సాంబశివ శాస్త్రిగారు పరిష్కరించగా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబర
్ర ీ వారు
4 వ అధ్యాయం వరకూ మొదటి భాగంగానూ, 5 వ అధ్యాయాన్ని రెండవ భాగంగానూ ప్రచురించారు.

వేటూరి శంకర శాస్త్రిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి సో దరుడౌతారు. ప్రసిద్ధ ఆయుర్వేద


వైద్యుడు, చరితక
్ర ారుడు కూడా! ముక్త్యాల రాజావారి ఆస్థా న వైద్యుడాయన.  వైద్యకళ మాసపత్రిక
నడుపుతుండేవారు. ఆయన ఈ గ్రంథాన్ని సంపాదించి తెలుగులోకి అనువదించే విషయమై శ్రీ తిరుమల
రామచంద్రగారితో సంప్రదంి చారు. ప్రా కృత శ్లో కాలకు, సంస్కృత టీకకు కొన్ని చోట్ల పొ ంతన కుదరటం లేదని
ప్రా కృతం సంస్కృతం సమానంగా తెలిసిన రామచంద్ర గారి సహాయం అర్థించారాయన. ఆ ఇద్ద రూ కలిసి
చేసిన అనువాదమే తెలుగు ‘హరమేఖల’.

ధర్మార్థ కామమోక్షాల ఙ్ఞా నం కలిగిన వారిని విదగ్ధు లు అంటారు. అలాంటి వారికోసమే ఈ


విదగ్ధా నురాగ కృతిని ప్రయోగమాలగా వెలువరిస్తు న్నట్టు మాహుకుడు పేర్కొన్నాడు. పుత్త లిక పేరుతో
చేతబడుల మంత్రా లు, వశీకరణ, విఘటన, తాంత్రిక యోగాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని నేటి
కాలమానపరిస్థితులకు అసాధ్యమైన యోగాలు, అంశాలు కూడా ఉండటంతో వాటిని పరిహరించి,
సాధ్యమైనంత అందుబాటులో ఉన్న యోగాలను మాత్రమే ఈ గ్రంథంలో చేర్చటం జరిగింది. మొదటి
అధ్యాయం అంతా వేశ్యలకు సంబంధించిన విషయాలు కావటంతో దాన్ని వదిలేసి, రెండవ అధ్యాయం
నుండే తెలుగు హరమేఖలను మొదలు పెట్టా రు. గ్రంథాంతంలో కొన్ని ద్రవ్యాల అకారాది పట్టికని
‘హరమేఖల నిఘంటువు’ పేరుతో అనుబంధంగా ఇచ్చారు.

ఈ గ్రంథంలో ఇప్పటి తరంవారు గృహవైద్యంగా చేసుకోదగిన కొన్ని యోగాలకు తిరుమల


రామచంద్రగారు శ్రమించి చేసిన అనువాదాలను కొంత  పరిచయం చేస్తా ను.

బాగా పండిన మారేడు గుజ్జు ను తలకు పట్టించి బెల్లంపాకంతో తలంటితే అట్ట లు కట్టిన కేశాలు
మెత్తబడి చిక్కు విడతాయి.

మామిడి టేంకలోని జీడిని త్రిఫలా చూర్ణా న్ని, తామరకొలను దగ్గ రి నల్ల బురదని, మెత్తగా ఉండే
ఇనుపరజనుని కలిపి గుంటకలగరాకు రసంతో నూరి, సమానంగా బియ్యపు గంజిని కలిపి తలకు పట్టిస్తే
నెరిసిన వెంట్రు కలు తుమ్మెద గుంపులా నల్ల బడతాయి.

జాజికాయ, జాపత్రి దాల్చినచెక్క, మరువం ఈ నాల్గింటిని మెత్తగా దంచి, కుంకుడు గింజంత


మాత్రలు కట్టి ఆరబెడితే గట్టి పడతాయి. ఒక్కమాత్రని బుగ్గ నపెట్టు కుని చప్పరిస్తు ంటే నోటి దుర్వాసన
పో తుంది.

ఏలకులు, అగరు అనే సుగంథ ద్రవ్యం, గంధం,బిరియానీ ఆకు, కలువ పూరేకులు వీటిని దంచిన
పొ డిని పావుచెంఛా మోతాదులో గ్లా సునీళ్ల లో కలిపి కొంతసేపు నాననిచ్చి తాగితే శరీరంలోంచి పరిమళం
బయటకు వస్తు ంది. 

సున్నం ఎక్కువై తాంబూలం వలన నోరు పొ క్కితే నువ్వుల నూనె గానీ, చల్ల ని గంజిగానీ  నోట్లో
పో సుకుని పుక్కిలిస్తే పొ క్కడం, నోటిపూత తగ్గు తాయి.
రేగు గింజల్ని మెత్తగా దంచి బెల్లం, తేనె, వెన్న కలిపి ముఖానికి లేపనం చేస్తే మంగు లేదా శోభి
మచ్చలు పో తాయి.

నేలతాటిగడ్డ ల చూర్ణా న్ని గేదె వెన్నతో కలిపి ఒక పాత్రలో ఉంచి, ధాన్యపు రాశిలో వారం
రోజులపాటు మాగనిచ్చి, దాన్ని చెవులకు పట్టిస్తే చెవి తమ్మలు పెరుగుతాయి. స్త నాలకు పట్టిస్తే స్త న
పరిమాణం పెరుగుతుంది.

దానిమ్మకాయల బెరడుని నీళ్ల లో వేసి బాగా నూరి వడగట్టి, ఆ నీటికి సమానంగా తెల్లా వాల
నూనె కలిపి నీరంతా ఇగిరప
ి ో యే దాకా మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవులు, స్త నాలు,
పురుషాంగాలమీద  మర్దిస్తే అవి గట్టిపడి జారిపో కుండా ఉంటాయి.

జిల్లేడాకుల్ని సైంధవలవణంతో నూరి పుటం పెట్టి చేసిన భస్మాన్ని నీళ్ల లో కలిపి తాగితే
అసాధ్యమైన లివర్ జబ్బులు తగ్గు తాయి.  

అరిటాకుల్ని నూరి పుటపాకం పద్ధ తిలో భస్మం చేసి ఒక చెంచాపొ డిని నీళ్ల లో కలిపి తాగితే లివర్
స్ప్లీన్ వ్యాధులు తగ్గు తాయి.

పసుపుకొమ్ములు మెత్తగా దంచిన పొ డిని తేనెతో తీసుకుని ఉసిరికాయల రసంతో రోజూ తాగితే
షుగరు వ్యాధి, ఇతర మూత్ర వ్యాధులు తగ్గు తాయి.

అరచెంచా పిప్పళ్ల పొ డిని నెయ్యి, తేనె చేర్చి, గ్లా సుపాలలో కలిపి తాగితే కరోనాలంటి
విషజ్వరాలను ఎదుర్కొనేశక్తి శరీరానికి వస్తు ంది. “పిప్పలీ చూర్ణ ం ఘృత మధు మిశ్రితం,క్వథిత దుగ్ధ
సంయుక్త మ్ పీతమ్ విషమజ్వర కాస  హృద్రో గాన్ వినాశయతి” అంటూ మాహుకుడు చెప్పిన ఈ చిన్న
ఔషధం నిజమైన ఇమ్యూనిటీ బూష్ట ర్‘గా ఈ కరోనా సమయంలో పనిచేస్తు ంది.

పిప్పళ్ళపొ డికి సమానంగా త్రిఫలా చూర్ణ ం కలిపిన పొ డిని ఒక చెంచా మోతాదులో తీసుకుని తేనె
కలిపి తిని ఆతరువాత భోజనం చేస్తే జీర్ణ శక్తి వృద్ధి అవుతుంది, కఫం దరి చేరదు. కరోనా వ్యాధి నివారణకు
ఇది కూడా మంచి ఉపాయం.

బార్లీ గింజల్ని నువ్వుల నూనెలో నల్ల గా మాడేలా మూడుసార్లు వేయించి దంచిన మసిని
వెన్నపూస కలిపి లేపనం చేస్తే కాలిన పుండ్లు , గాయాలు అసాధ్య వ్రణాలు త్వరగా తగ్గు తాయి.
పసుపు కొమ్ముల్ని చింతాకుని కలిపి నూరి, ఒక చెంచామోతాదులో కాసిని నీళ్ల లో కలిపి తాగితే
ఆటలమ్మ వ్యాధి, పొ ంగు లాంటి వైరస్ వ్యాధులు తగ్గు తాయి.

ఒక భాగం నల్ల నువ్వులు, రెండుభాగాలు బావంచాలను (psoraline seeds) కలిపి మెత్తగా దంచి
తేనెతో కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని 1-2 మాత్రలు రోజూ ఉద్యాన్నే తీసుకుంటూ ఉంటే బొ ల్లి
వ్యాధి త్వరగా తగ్గు తుంది.

 బావంచాలను చిక్కటి పాలలో వేసి తోడు పెట్టి, ఆ పెరుగుని బాగా చిలికి తీసిన వెన్నని తేనె
కలిపి తింటే బొ ల్లి తగ్గు తుంది. 1-2 చెంచాల మోతాదులో తీసుకోవచ్చు.

ఈ గ్రంథంలో 5 వ అధ్యాయంలో ఎక్కువగా సౌందర్య సాధనాల విషయలు కనిపిస్తా యి.


కచ్చూరాలు, జటామాంసి, దాల్చిన చెక్క, ప్రియాంగువు వీటిని మెత్తగా దంచిన పొ డిని నీళ్ళలో వేసి కాస్తే
ఆ నీరు పన్నీరులా సుగంధభరితంగా ఉంటుంది. దానితో స్నానం చేస్తే శరీర పరిమళం పెరుగుతుంది. ఈ
పొ డికి సమానంగా పెసర పిండి లేదా శనగపిండి కలిపి నలుగు పెట్టు కుని ఈ స్నానం చేస్తే మంచిది.

ఈ విధంగా వందలాది యోగాలను మాహుకుడు 1100 సంవత్సరాల క్రితం మానవాళి


వినియోగార్థ ం హరమేఖలా గ్రంథంలో అందించాడు. చరక సుశ్రు త, వాగ్భాటాలకు 10 వశతాబ్ది తరువాత
వ్యాఖ్యానాలు వ్రా సిన రచయితలు మాహుకుణ్ణి చాల సందర్భాలలో ఉటంకించారు.

ఈ గ్రంథాన్ని తెలుగు చేయటంలో సంస్కృతానువాదాల లోపాలను మూల ప్రా కృత ఛాయలతో


సరి చూసుకుంటూ వ్రా యటానికి రామచంద్రగారు చాలా శ్రమపడవలసి వచ్చింది. సంస్కృత
పండితులైనంత మాత్రా న ఆయుర్వేద సంస్కృత శ్లో కాలు అంత తేలికగా పట్టు బడవు. అందుకు
ఆయుర్వేదానుభవం కావాలి. వేటూరి శంకరశాస్త్రిగారు ఆ లోపం లేకుండా సహకరించటంతో
ప్రా మాణికమైన అనువాద గ్రంథంగా హరమేఖల రూపొ ందింది.

You might also like