Professional Documents
Culture Documents
3. ‘విశతి’ - అంటే ‘ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ‘విశ్వం’. కనుక
‘విశ్వం’ అన్నమాటే ‘నారాయణుడు ఇందులో ఉన్నాడు’ అని ఎరుక పరుస్తోంది.
“తత్ సృష్ట్యా తదేవానుప్రావిశత్” - “దీనిని సృష్టించి, తానే దీనియందు ప్రవేశించాడు” అని తైత్తిరీయ
ఉపనిషద్వాక్యం.
“మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ” అని శ్రీకృష్ణ పరమాత్మ ‘నాకంటె భిన్నమైనది. ఏ ఒక్కటీలేదు’
అన్నాడు. కనుక విశ్వమంతా భగవంతుడే. ఈ ఒక్క నామాన్ని తెలిస్తే చాలు. భగవానుడు ఎక్కడోలేడు.
కనిపించేదంతా ఆయనే. కనిపించని అనంతమూ ఆయనే - అనే స్పృహ కలుగుతుంది.
5. జగములో తాను ప్రవేశించడమే కాదు - చివరకు జగము కూడా తనలోనే ప్రవేశిస్తు న్నది.
“యత్ప్ర యన్త్యభిసంవిశన్తి” అని వేదవచనం. ఎవరిలో ఈ జగము ప్రవేశిస్తు న్నదో అతడు ‘విశ్వం.
విశనాద్విశ్వమిత్యాహుః లోకానాం కాశి సత్తమ
లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప
సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఉండడం చేత భగవంతుని ‘విశ్వం’ అని వ్యవహరించుతున్నాం. ఈ శబ్దం
నపుంసక లింగ శబ్దం. అంటే ఇది నిర్గుణ పరబ్రహ్మవాచకం. ఓంకారంతో మంత్రం ప్రారంభమైనట్లే, ఈ ‘విశ్వం’
నామంతో విష్ణునామ మంత్రాలు ప్రారంభమయ్యాయి.
పంచాక్షరి, అష్టా క్షరి, ద్వాదశాక్షరి - ఇలా వైదికదేవతా మంత్రాలన్నీ ‘ఓం’తో ప్రారంభమౌతాయి. మంత్రాలు
మారుతున్నా ‘ఓం’కారం మారదు, మారనిది ‘ఓం’. మారినవి ‘మంత్రాలు’. పైగా మంత్రంలో ఒక స్పష్టమైన అర్థం
కనిపిస్తుంది. ఉదా నమశ్శివాయ - శివునకు నమస్కారం. నమో నారాయణాయ - నారాయణునకు నమస్కారం.
కానీ ‘ఓం’ కారానికి ఇలాంటి స్పష్టమైన అర్థం లేదు.
సర్వమూలమైన నిర్గుణతత్త్వం ‘ఓం’కారం. ఆ ప్రణవంలోని శక్తియే పంచాక్షరిగా, అష్టా క్షరిగా, వివిధ
మంత్రాలుగా వచ్చినదని గ్రహించడానికే - నిర్గుణతత్త్వమే వివిధ నామరూపాలతో సగుణమైందని తెలుసుకోడానికే
ఈ విధంగా మంత్రాలను జపిస్తాం. ప్రణవమే అన్ని మంత్రాలకు సమన్వయం. అలాగే ‘విశ్వం’ సర్వమయమైన
పరతత్త్వానికి సంకేతం. అదే తరువాతి నామాలలో విస్తరించింది. వృక్షానికి మూలం వలె వెయ్యి నామాలకు మూల
నామమిది.
1. విశ్వమ్
శంకర భాష్యమ్.
1. విశ్వస్య జగతః - కారణత్వేన ‘విశ్వ’మిత్యుచ్యతే బ్రహ్మ
2. పరస్మాత్ పురుషాన్నభిన్నమిదం విశ్వం పరమార్థతః తేన విశ్వమిత్యభిధీయతే బ్రహ్మ
3. విశతీతి విశ్వం బ్రహ్మ
4. విశంతి విశ్వాని భూతాని అస్మిన్నితి విశ్వం బ్రహ్మ
5. విశ్వశబ్దేన ‘ఓం’కారోఽభిధీయతే। వాచ్యవాచకయోరత్యన్తభేదాభావాద్విశ్వమిత్యోంకార ఏవ బ్రహ్మేత్యర్థః
6. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలావితి శాంత ఉపాసీత(ఛాం. ఉ. 3-14-9)
వచ. కార్యకారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంతం సన్నిధానంబు గలిగిన లోహంబు
చందంబున వర్తించు. నందు సర్వేశ్వరుండు నిమిత్త మాత్రంబుగా బరిభ్రమించు, నట్టి యీశ్వరుని
మాయాగుణ వ్యతికరంబున నారబ్ధంబులైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన
యోషిత్పురుషాది రూపసంభూతియగు, నవ్విధంబునఁ దత్సర్గంబు దత్సంస్థా నంబు, దల్లయంబు
నగుచునుండు, నిట్లు దుర్విభావ్యంబైన కాలశక్తింజేసి గుణ క్షోభంబున విభజ్యమాన వీర్యుండు
ననంతుండు ననాదియునైన జనంబులచేత జనంబులం బుట్టించు చుండుటం జేసి యాదికరుండును,
మృత్యుహేతువున, జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటంజేసి
యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుండు. (భాగ.4-355)
అయస్కాంత సన్నిధిలో లోహము భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన
ప్రపంచం భ్రమిస్తుంటుంది. సర్వేశ్వరుడు నిమిత్త మాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ
సంబంధం వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయికచేత స్త్రీ పురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ
విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి వల్ల జనముల నుండి
జనముల పుట్టించటం వల్ల ఆద్యుడు, నశింపజేయటంవల్ల అంతకుడు, అనాది కావటంవల్ల అవ్యయుడు అయి
భగవంతుడు జగత్తు కు కారణమగును.
వచ. విశ్వంబు నీవ, గుణాత్మకంబైన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూత గుణ యుక్తుండవై
రక్షక సంహారాది నానారూపంబుల నుండుదువు. (భాగ.7 స్కం.360)
అని ప్రహ్లా దుఁడు నరసింహమూర్తిని స్తు తించెను.
6. విశ్వమునకు సృష్టి స్థితి సంహార కర్త విష్ణువే కనుక విశ్వమునే విష్ణువుగా భావించవలెను.
“సర్వం ఖల్విదం బ్రహ్మ- - తజ్జలావితి శాంత ఉపాసీత” (ఛాందో 3-14-1) అని శ్రు తి.
తజ్జం అనగా అతని నుండి పుట్టినది. తల్లం అనగా అతనియందు లయమగునది. కావున వికార
జాతమగు విశ్వము బ్రహ్మరూపమే యగుచున్నది.
శ్రీకృష్ణుని పొట్టకు కట్టిన త్రాటిని లాగగా ఆ త్రాటికి కట్టిన రోలు రెండు మద్దిచెట్ల మధ్య నుండి లాగబడగా ఆ
రెండు చెట్లూ నేలకూలినవి. ఆ చెట్లనుండి ఇద్దరు యక్షులు బయల్వెడలి ఇట్లు ప్రార్ధించిరి.