గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ : స్వయం సహాయక సంఘ అక్క చెల్లమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను “ప్రజా సంకల్పయాత్ర ” లో చూసిచలించి పోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఉజ్యల భవిష్యత్ కోసం “వై.యస్.ఆర్ ఆసరా” పథకాన్ని ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమమైన “నవరత్నాల” లో చేర్చడం జరిగినది.
పథకం ముఖ్యమైన ఉద్దేశం:
ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుయి, గ్రామీణ మరియు
పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ఈ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా అక్క చెల్లమ్మలు ఆర్థికంగా అభివృధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాలానే ఉద్దేశం తో ఈ పథకంను తీసుకొనిరావడం జరిగినది. ఈ పథకం క్రింద ఎవరు అర్హులు :
వాణిజ్య మరియు సహకార బ్యాంకులలో ఋణం తీసుకొని తేది
11.04.2019 నాటికిఅప్పు నిల్వ ఉన్న అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం లో అర్హులు.
తేది 11.04.2019 నాటికి అక్క చెల్లమ్మలకు ఉన్న పొదుపు
సంఘాల బ్యాంకు రుణాల అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి సంఘం పొదపు ఖాతా లకు జమ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వివిధ కార్పొరేషన్ల్ ద్వారా (యస్.సి,యస్.టి,బిసి,ఈబిసి,కాప ు,మైనారిటీ,క్రిస్టియన్) ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం క్రింద అందించు మొత్తం :
ఈ పథకం కింద రాష్ట్రంలోని 7,91,257 పొదుపు సంఘాల్లో ఉన్న 78,27,693 మంది అక్కచెల్లెమ్మలకు తేది 11.04.2019 నాటికి వారి సంఘాలలో ఉన్న అప్పు నిల్వ మొత్తం ర ూ.25,383.49 కోట్ల నేరుగా నాలుగేళ్లలో అక్కచెల్లమ్మల సంఘం పొదుపు ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది.
మొదటి విడతగా రూ.6,345.87 కోట్ల రూపాయలను నేరుగా
సెప్టెంబర్ 11 వ తేది న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. జగన్ మోహన్ రెడ్డి గారు అక్కచెల్లమ్మల సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేసే రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు.....