Professional Documents
Culture Documents
జులై 2008
రచన: జెజ్జా ల కృష్ణ మోహన రావు
పరిచయము
అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వే చ్ఛా నివేదనపత్రము ప్రపంచ చరిత్రలో ఒక మహత్తరమైన సంఘటన.
అందులో మొదటి వాక్య ము ప్రజల ఉనికికి ప్రాధాన్య త నిస్తూ “ప్రజలమైన మేము (We the people)”
అనే పదాలతో ఆరంభమవుతుంది. అధ్య క్షుడు లింకన్ మహాశయుడు “ప్రజల ప్రభుత్వం, ప్రజలచే
ప్రభుత్వం, ప్రజలకోసం ప్రభుత్వం ఈ భూమిపై అజరామరము (government of the people, by the
people, for the people shall not perish from the earth)” అన్నా రు. లింకన్యొక్క పై వాక్యంలో
ప్రభుత్వా నికి బదులు భాష, సాహిత్యం, కవిత్వం అనే పదాలు కూడా ఎంతో సమంజసంగానే
ఉంటాయి. కవిత్వ పు పరమావధి అది ప్రజల హృదయాలలో నాలుగు కాలాలపాటు హత్తుకొని
పోవడమే.
కదిలించేది, కరిగించేది, మారేది, మార్పించేది కవిత్వ మన్నా రు శ్రీశ్రీ. ప్రతి పదపు అర్థా నికి నిఘంటువు
పుటలు తిరగవేయాలంటే ఆ కవిత్వం ఎంత గొప్ప దైనా సామాన్య మానవుని రసానుభూతికి
దూరమవుతుంది. తెలుగు సాహిత్యా న్ని బహుళప్రజానీకానికి అర్థమయ్యే లా రాయాలనే ఉద్య మం
సుమారు వంద సంవత్స రాలకు ముందు పుట్టింది. వాడుకలో నున్న వ్యా వహారిక భాషను పాఠ్య
పుస్తకాలలో, పత్రికలలో, నాటకాలలో ఉపయోగించాలని తాపత్రయపడ్డవారిలో ప్రముఖులు గిడుగు
రామమూర్తి పంతులుగారు. జగమెరిగిన బ్రాహ్మ డికి జందెమేల యన్న ట్లు ఈ రంగంలో వీరి
వీరవిజయాలు అందరికీ తెలిసినవే. వీరు ఒకప్పు డు ఇలా అన్నా రు – “వ్యా వహారికమంటే ముందు
మనం విజ్ఞా నవ్యా ప్తికోసం కృషి చెయ్య వలసిన అవసరం ఉంది. కవిత్వం కాదు. ఎందులోనన్నా
రాసుకో. నాకభ్యంతరం లేదు. చదివినవాళ్లు చదువుతారు. లేకపోతే లేదు. ఇతర సాధనాలకు మాత్రం
వ్యా వహారికం తప్ప దు. సాహిత్యంలో కథలకి, నాటకాలకి వ్యా వహారికమే ఉండాలని నా ఆశయం.”
కవిత్వా న్ని కూడా వాడుక భాషలో రాసే ఉద్య మానికి నడుము కట్టిన వారు గురజాడ అప్పా రావుగారు. ఈ
మహానుభావుల నిద్దరిని నవయుగ వైతాళికులని చెప్ప వచ్చు .
ఈ వ్యా సపు ముఖ్యా శయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి
వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యా సం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు
పాఠకుల ఆసక్తిని ఎక్కు వ చేస్తా యని నా నమ్మ కం. ఈ వ్యా సంలో ఆధునిక కవిత్వ పు వైవిధ్యా న్ని ,
అందులోని తీరు తెన్ను లను వివరించ దలచుకోలేదు. కాల్ప నికవాదం, వాస్తవికత,
అభ్యు దయవాదం, హేతువాదం, అధివాస్తవికాన్వే షణ, అస్తిత్వ వాదం, అనుభూతివాదం, చైతన్య
స్రవంతి, విప్లవవాదం, సంప్రదాయవాదం, రూపవాదం, జనామోదవాదం మున్న గు
విషయాలనుగురించి ఇంకెక్క డైనా చదువుకోవాలి.
అందుకే నన్నె చోడుడు “జానుతెనుగులో” కుమారసంభవాన్ని రాస్తున్నా నని చెప్పా రు. అందుకే
పాల్కు రికి సోమనాథుడు బసవపురాణము రాసేటప్పు డు తాను దేశి తెలుగు ఛందస్సై న ద్వి పదలో
రాస్తా నని చెప్పా రు.
అందుకే మొల్ల కూడా “తేనెసోక నోరు తీయన యగు” విధంగా రామాయణాన్ని తెలుగులో
రాస్తున్నా నని చెప్పా రు.
అందుకే పోతన భాగవతాన్ని అందరూ అర్థం చేసుకొనేలా రాశారు. ప్రజాకవి వేమన కూడా తన
సూక్తు లను జనులు వాడే భాషలో దేశి ఛందస్సై న ఆటవెలదిలో రాశారు. వాగ్గేయకారుడైన
అన్న మయ్య కూడా తన పాటలను వ్యా వహారిక భాషలో ప్రజల కర్థమయ్యే టట్లు రాశారు. రామదాసు,
త్యా గయ్య వంటి మిగిలిన సంగీతకారులు కూడ ఇతనిలాగే వాడుక భాషలో పాటలను రాశారు.
సంధి యుగం
పందొమ్మి దవ శతాబ్దాంతం, ఇరవైయవ శతాబ్దపు ఆరంభం తెలుగు దేశంలో మాత్రమే కాదు,
భారతావనిలో ఒక సంధి యుగం. ముద్రించబడిన గ్రంథాలు జనులను కొని చదవమని ఆహ్వా నించేవి.
అంటే రాయసగాళ్లు తాటాకులపై రాసుకోవలసిన అవసరం లేదు. పెద్ద ఊళ్లలో విద్యు చ్ఛ క్తి కూడా
ఉండేది. కాబట్టి కష్టం లేక చదువుకోవచ్చు . నాటకాలను సమాజాలు ప్రదర్శించేవారు. అప్పు డే
గ్రామఫోన్ రికార్డులు వచ్చా యి. ఇంకొక మూడు దశాబ్దా లకు మాట్లా డే సినిమా కూడా వస్తుంది.
వీటితోబాటు రాజకీయాలలో కూడా ఒక కొత్త గాలి వీచింది. స్వా తంత్ర్యే చ్ఛ , స్వ రాజ్య వాంఛ అనే
విత్తనాలు ప్రజల హృదయాలలో మొలకెత్తి పెరగడానికి అవకాశం కలిగింది. పనుల కోసం పాశ్చా త్య
విద్యా విధానం తప్ప నిసరి అయింది. ఇలా నాలుగు దిక్కు లనుండి వ్యా వహారిక భాష అనే
పెనుతుఫానుకు అనుకూల పరిస్థితులు ఏర్ప డ్డా యి.
ఆధునిక కవిత్వంలో వాడుక తెలుగును మొదట ఎక్కు వగా ఉపయోగించిన ఘనత గురజాడ
అప్పా రావుగారికి దక్కు తుంది. ఈ విషయంలో వీరు యుగపురుషులు. వీరు దీనికై ఒక కొత్త
ఛందస్సు ను ఉపయోగించారు. అదే ముత్యా లసరం. ముత్యా లసరము పదే పదే వచ్చే మూడు,
నాలుగు మాత్రల మిశ్రగతిలో నడుస్తుంది. ఇట్టి గతి ఉండే వృషభగతి రగడలాటి ఛందస్సు లు
తెలుగులో ఉన్నా కూడా, ఇందులో విరివిగా కవితలను రాయడమనేది తెలుగు భాషకు కొత్త. ఆ ఘనత
గురజాడవారికి చేరిందే. ముత్యా లసరానికి కన్న డములోని భామినీషట్ప దికి తేడా లేదు. కన్న డములో
షట్ప దులలో మహాకావ్యా లనే రాశారు. కానీ గురజాడవారు ఈ ఛందస్సు ను పారసీక భాషనుండి
గ్రహించినట్లు భావన. తెలుగులో కూడా ముత్యా లసరము ఛందస్సు లో గురజాడ కంటె నాలుగు
నెలలకు ముందుగా కింది పద్యం ప్రచురింపబడింది. కవి ఎవరో తెలియదు.
మేలుకొనుమీ భరతపుత్రుడ
మేలుకొనుమీ సుజనపుత్రుడ
మేలుకొనుమీ సచ్చ రిత్రుడ
మేలుకొనవయ్యా , వత్సా , మేలుకో
వేడుకను జాతీయతయను
వేగుచుక్క పొడిచె నదుగో
కూడి వందేమాతరమ్మ ని
కుక్కు టము లరచెన్, వత్సా , మేలుకో
ఇందులో వత్సా , మేలుకో అనే పదాలను తొలగిస్తే ఇది అచ్చంగా ముత్యా లసరమే. గురజాడవారి
మొదటి ముత్యా లసరము తోకచుక్క లోనిది. దీనిని వీరు కొత్తపాతల మేలు కలయిక అంటారు. కొత్త
భావాలను కొత్త భాషలో పాత సంస్కా రాన్ని అవలంబిస్తూ రాస్తున్నా రని మనం అనుకోవచ్చు .
మిశ్రగతి నడకతో ఉండే ముత్యా లసరాలను మాత్రమే కాదు, వీరు చతుర్మా త్రలను కూడా
ఉపయోగించారు తమ కవనాలలో. మచ్చు కు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లోని ఆఖరు పద్యం –
00:00 00:00
పూర్ణమ్మ
కన్యా శుల్కం సినిమా, ఘంటసాల
చిత్ర కవిత్వ ము, గర్భ కవిత్వ ము, బంధ కవిత్వ ము, కష్టమైన పదాలు, నీరసమైన భావాలతో
శృంఖలాబద్ధను చేశారని సరస్వ తీదేవి నారదునితో చెప్పు కొంటుంది కందుకూరి వీరేశలింగం
పంతులుగారు రాసిన సరస్వ తీనారదసంవాదములో. అంటే ఆడంబరాలు కవిత్వా నికి అందాన్ని
ఇయ్య దని పంతులుగారి వాదన. ఆ విషయాన్ని ఎలా చెప్పా రో ఇక్క డ చూడండి –
ఆధునిక తెలుగు కవిత్వా నికి నాందీగీతం పాడినవారు ఇద్దరు మహనీయులు, వారు రాయప్రోలు
సుబ్బా రావు, గురజాడ అప్పా రావు. భావకవిత్వా నికి నాంది బహుశా రాయప్రోలువారి “లలిత”.
రాయప్రోలుగారు తెలుగులో సామాన్య ముగా వాడబడే ఛందస్సు లోనే లలితను తీర్చి దిద్దా రు.
ఫలించని ప్రేమ ఇందులోని కథావస్తువు. వేంకటపార్వ తీశ్వ ర కవులు దేశి ఛందస్సై న ద్వి పదలో తమ
ఏకాంతసేవను లోకప్రియముగా రాశారు. కృష్ణ శాస్త్రిగారు భావకవిత్వంలో శిఖరాలనే చేరుకొన్నా రు.
కాని ఇవన్ని యు ఛందోబద్ధమైనవే. ఐనా కూడా జనసామాన్యా నికి సులభంగా అర్థమయ్యే టట్లు కూడా
ఇట్టీ కవులు కొన్ని కవితలను రాశారు. వాటికి కింద కొన్ని ఉదాహరణలు –
లయ పెంచుతూ మధ్య
లయ దించుతూ పాట
రయ మెంచుతూ కిన్నె
రటు సోలి యిటు సోలి
తెలి నీటి మేనితో
తలిరాకు మేనితో
ఒయ్యా రములు పోయెనే
కిన్నె రా
అయ్యా రె యనిపించెనే
– విశ్వ నాథ సత్య నారాయణ, కిన్నె రసాని పాటలు, కిన్నె ర నృత్య ము
నువ్వ టే నువ్వ టే
పువ్వు విరిసిన వయసు
నవ్వు లలమిన సొగసు
రువ్వి నా ఎదపైన
చివ్వు నంతర్హివే
నువ్వ టే నువ్వ టే
నువ్వ టే నువ్వ టే
కవ్వించి నా కాంక్ష
త్రవ్వించి నా కలలు
ఉవ్వి ళ్ళు గొన మనసు
దవ్వై తివే దెసల
నువ్వ టే నువ్వ టే
నువ్వ టే నువ్వ టే
జవ్వ నీ ప్రణయినీ
మువ్వంపు వగలాడి
అవ్వా రు ముద్ది మా
నవ్వు తూ నను వదలి
రివ్వు రివ్వు న మిన్ను
పవ్వ ళింపయితివే
నువ్వ టే నువ్వ టే
– అడవి బాపిరాజు, శశికళ
అభ్యు దయ కవిత్వంలో అపారమైన కీర్తి గడించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. గురజాడ తరువాత
సాహిత్యా కాశంలో ఉన్న ట్లుండి మెరిసిపోయిన మరొక తోకచుక్క శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వం చదువని
తెలుగువాడు తెలుగువాడు కాదు. ఛందోబద్ధమైన కవిత్వంతో ప్రారంభించి కొత్త కొత్త దారులను
తొక్కా రు వీరు. కాని ఇక్క డ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీరి కొన్ని కవితలు వాడుక భాషలో లేదు.
అందులోని కొన్ని పదాలకు నిఘంటువును వెదకాల్సిందే! ఉదాహరణకు కింది గేయంలోని పదాలు
వ్యా వహారికభాషకు చెందినవి కావు.
ఎగిరించకు లోహవిహంగాలను
కదిలించకు సుప్తభుజంగాలను
ఉండనీ
మస్తిష్క కులాయంలో
మనోవల్మీ కంలో
– సాహసి
శ్రీశ్రీ కొత్త కొత్త ఛందస్సు లలో రాశారు. మాత్రాఛందస్సు ను తెలుగు కవితలలో అతి రమ్యంగా వాడిన
ఘనత వీరిదే. తెలుగు కవులు నిరసించిన ఎదురు నడక (లఘువు-గురువుతో ప్రారంభం) వీరి
గేయాలలో పదేపదే ప్రత్య క్షమవుతాయి.
మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
– మహాప్రస్థా నం
తిరుగుబాటు కవులలో తనకై ఒక స్థా నాన్ని నిర్మించుకొన్న , కాదు లాగుకొన్న , “భావకవి కాని అహంభావ
కవి” పఠాభి. “నా ఈ వచన పద్యా లనే దుడ్డు కర్రల్తో పద్యా ల నడుముల్ విరుగదంతాను,
చిన్న యసూరి బాలవ్యా కరణాన్ని చాల దండిస్తా ను” అన్నా రు పఠాభి. వీరి ఫిడేల్ రాగాల డజన్లో
పాశ్చా త్య ప్రభావం ఉంది, వ్యంగ్యం కూడా ఉంది. పదాలతో ఆడుకోగలిగిన శక్తి, నిబ్బ రము వీరికుంది.
వీరి కవితకు కింద ఒక ఉదాహరణ –
హవాయి కడుతీ
యవాయి పడతీ (కడు తీయ వాయి)
భవచ్చ తురిమన్
విలాస గరిమన్
నుతింప నసహా
యుడీతడు సహా (అసహాయు డితడు సహా)
సఖి నీకలహా
సమాలీ కలహా (నీ కలహాస మాలిక లీక లహా)
వసంత కుసుమా
లసంత లుసుమా (కుసుమాల సంతలు సుమా)
ప్రియా విపులనే
త్రయుగ్మ ములనే
నుతింప గలనా
అలోహ లలనా
– యాత్రాఛందస్సు లు – హ్యో ల
గ్రామీణ భాషను సాహిత్యంగా తీర్చి దిద్ది అందరి మన్న లను పొందిన కవి నండూరివారు. వీరి యెంకి
పాటలు పల్లెపడుచుల అమాయకత్వా న్ని , ముగ్ధత్వా న్ని , స్నే హాన్ని మనముందు చిత్రించి సంతృప్తి
కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక యెంకి పాట –
ఆరిపేయవే దీపమూ
యెలుగులో నీమీద నిలపలేనే మనసు
ఆరిపేయవే దీపమూ
00:00 00:00
కొల్లా యి గట్టితే నేమి మా గాంధి
బసవరాజు, మాలపిల్ల చిత్రంలో
స్వా తంత్ర్యం వచ్చి న తరువాత దేశంలో జరిగే అవినీతి పనులను, పాలకుల దౌర్జన్యా న్ని ప్రజల
దుస్థితిని గురించి కూడా వాడుక భాషలో వచన పద్యా లు రాస్తూ నే ఉన్నా రు కవులు, కవయిత్రులు.
కింద ఒక రెండు ఉదాహరణలు –
అమ్మా భారతమాతా
ఎండిన పాలిండ్లనుంచి
స్తన్యం రాక
రుధిరపానం చేస్తున్నా డు
ఈ భావి భారత బాలుడు
ఓ మగమద మృగాల్లా రా
మీరు మీ ఇళ్లల్లో చావండి
మీరు మీ భార్య ల ఒళ్లల్లో చావండి
మీ తల్లుల గుండెలపై చావండి
మీరు చావటానికి మా దగ్గరకు రాకండి
బతకటానికి నానా చావూ చస్తున్న వాళ్లం
– ఓల్గా
స్త్రీల కవిత్వం
స్త్రీ ఒక తల్లికి కూతురు, ఒక శిశువుకు తల్లి, ఒక అన్న కు చెల్లి, ఒక తమ్ము నికి అక్క , ఒక పురుషునికి
భార్య , ప్రియురాలు, ఒక అత్తకు కోడలు. ఇలా స్త్రీకి ఎన్నో అవతారాలు. పురుషునితో సమానంగా
ఇప్పు డు స్త్రీలు కూడ ఆఫీసులలో, కంపెనీలలో, కళాశాలలో పని చేస్తున్నా రు, కానీ తక్కు వ వేతనంతో.
సంఘంలో స్త్రీని ఇంకా ఒక ఆటవస్తువుగానే కొందరు భావిస్తున్నా రు. స్త్రీ హృదయంలో కలిగే భావాలు,
క్షోభలు, సుఖ దుఃఖాలు, కన్నీ ళ్లు , ప్రేమలు, కామాలు – ఇవన్నీ కవితకు మంచి సారవంతమైన క్షేత్రం.
ఒక వంద సంవత్స రాలుగా స్త్రీల కవితలు ఎంతగానో ముందడుగు వేసింది. స్వా తంత్ర్యా నికి ముందు
ముగురమ్మ లు దీనికి మూలకారకులు. వారు – విశ్వ సుందరమ్మ , బంగారమ్మ , సౌదామిని. మచ్చు కు
వారి కవిత ఒకటి కింద ఇస్తున్నా ను. సౌదామినిగారి “దురదృష్టా న్ని ” చదివిన తరువాత కళ్ల నీళ్లు
బెట్టుకోని వాళ్లు అరుదుగా ఉంటారు.
అరవైయవ దశకమునుండి స్త్రీల కవిత్వ ము, స్త్రీవాద కవిత్వ ము తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యే క
స్థా నాన్ని ఏర్ప రచుకొన్న ది. జయప్రభ, ఓల్గా , రేవతిదేవి, ఈశ్వ రి, సావిత్రి వంటి కవులు ఒక కొత్త చేవను,
బలాన్ని , దృక్ప థాన్ని సాహిత్యంలో సృష్టించారు. అమెరికాలాటి విదేశాల్లో ఉండే స్త్రీలు కూడా ఈ
ఉద్య మంలో ముఖ్య పాత్రలే. వీరి కవితలను చదువుతుంటే ఒక కథను చదివేలా అనుభూతి
కలుగుతుంది. కింద కొన్ని కవితాభాగాలను ఉదాహరణలుగా ఇస్తున్నా ను.
….
ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
ఇద్దరి రక్తమూ ఉప్ప గానే వుంది
అంతే
ఆ తర్వా తెప్పు డూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీ కుల్ని
ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సు తో నేను
ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
అనుసరించేవాణ్ణి ఏది యోగ్య మనిపిస్తే దాన్ని
– పెళ్ళ కూరు జయప్రద, నేస్తం ఆలోచించు
వచన కవితలు
అప్పా రావుగారైనా సరే, శ్రీశ్రీ ఐనా సరే – వీళ్లందరు కొత్త కొత్త ఛందస్సు లను సృష్టించి పాడుటకు
అనువుగా ఉండేటట్లు కవితలను అల్లినారు. పాశ్చా త్య రచనల ప్రభావంవల్ల కవులు కవితలను
వచనాలుగా అల్లడానికి ఆరంభించారు. పంక్తికీ పంక్తికీ మధ్య ఉండే అంతరము, చదివేటప్పు డు వచ్చే
విరామాలు ఇట్టి రచనలను ఇంకా పటిష్ఠము చేస్తా యి. మనసులో ఉదయించిన భావాలను ఏ
నిర్బంధం లేకుండా బహిర్గతం చేయడానికి వీలవుతుంది. ఇవి ఆంగ్లములోని blank verse లాంటిది,
మాడర్న్ ఆర్ట్ వంటిది. ఇందులో ప్రాసలు, శబ్ద సౌందర్యా లు కేవలం ఐచ్ఛి కము. ఏ పత్రిక చదివినా, ఏ
కవితాసంకలనం చదివినా వచన పద్యా లు అందులో తప్ప కుండా ఉంటాయి. ఇట్టి పద్యా లకు వస్తువు
ఏదైనా కావచ్చు . ఇక్క డ ఈ మాధ్య మంలోని కొన్ని కవితలను మీముందు ఉంచుతున్నా ను –
ఏ మహారాణి మెళ్లో దో
నీలాలపేరు ఇట
తెగి పడిపోయిందేమి
కాదు – విష్ణు క్రాంత
కడు చిన్ని పూలు
తీగెపై అడనద తీరుగా ఉన్నై
నీలాల కంటేను మేలుగా ఉన్నై
– టేకుమళ్ల కామేశ్వ ర రావు, మిణుగురు పురుగు
00:00 00:00
అదిగదిగో గగనసీమ
కృష్ణ శాస్త్రి, నా యిల్లు
అదిగదిగో గగనసీమ
అందమైన చందమామ ఆడెనోయీ
నీకోసమె జగమంతా
నిండెనోయి వెన్నె లలు
తేలెనోయి గాలిపైన
తీయనైన కోరికలు
చెరుచుకోకు నీ సౌఖ్యం
చేతులార ఆనందం
ఏనాడును పొరబడకోయి
ఏమైనా త్వ రబడకోయి
00:00 00:00
[…]
00:00 00:00
00:00 00:00
జో జో జో జో
– నారాయణ రెడ్డి, స్వా తిముత్యం
ముగింపు
నాకు ఛందస్సు అంటే ఇష్టం. తాళవృత్తా లు, మాత్రాఛందస్సు నాకు ప్రియమైనవి. ఈ రంగంలో కొన్ని
ఏళ్లు గా నేను పరిశోధన కూడా స్వ తంత్రంగా చేస్తున్నా ను. ఐనా కూడా, నా మనసు లోతులలో ఉండే
కొన్ని భావాలకు ఆకృతి ఇవ్వా లనే అపేక్ష కలిగినప్పు డు, గేయ కవితనో లేక వచన కవితనో
ఎన్ను కొంటాను. ముఖ్యంగా, హృదయాన్ని స్పందింపజేసే శక్తి ఈ మాధ్య మానికి ఉంది. ఈ ఇంటర్నె ట్
యుగంలో మనం దైనందినం మాట్లా డే వాడుక భాషలో చాలా మంది కవితలను రాస్తున్నా రు,
అంతకంటే ఎక్కు వగా చదువుతున్నా రు. ఆన్లైన్ పత్రికలు, బ్లా గులు కూడా వీటికి ప్రోత్సా హం
ఇస్తున్నా యి. ఈ విధంగా ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నా యి. పాతంతా మంచీ
కాదు, చెడూ కాదు. కొత్తంతా చెడూ కాదూ, మంచీ కాదు. ఒక్కొ క్క దానికి ఒక్కొ క్క గుణం ఉంది, ప్రభావం
ఉంది. కవి యోచించి మాధ్య మాన్ని ఎన్ను కోవాలి. అందుకే నారాయణ రెడ్డిగారంటారు –