Professional Documents
Culture Documents
చైతః
్ర శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః, యౌవరాజ్యాయ రామస్య
సర్వమేవోపకల్ప్యతామ్. ఇది చైతమ
్ర ాసము కనుక పుష్యమీ నక్షత్రము ఉండగా నేను
రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తా ను అని సంకల్పము చేసాడు. సరే దానికి
తగినట్టు వశిష్టా ది మహర్షు లు అందరూ కూడా కావలసిన సంభారములు అన్నీ సేకరించి సిద్ధము
చేసారు. రాచనగరు ఎక్కడ చూసినాకూడా పుష్యమీ నక్షత్రములో అభిషేకము జరుగుతుందని
తెలియగానే ఇంక కోసలదేశములో అయోధ్యా పట్ట ణములో ఉన్నటువంటి పౌరుల యొక్క
ఆనందానికి అంతులేదు. ఎందుకని సకల సుగుణాభిరాముడయినటువంటి రాముడు యువరాజుగా
వస్తు న్నాడు, వాళ్ళ కోరిక తీరుతోంది. అందుకని ఎక్కడ చూసినా కళాపి చల్లా రుట, రాత్రి
యవ్వరాజ్య పట్టా భిషేకము పూర్తి అయ్యేసరికి ఆలస్యము అవుతుందని దీపాల యొక్క
స్వరూపముతో చెట్లను అలంకారము చేసారుట. అంటే ఆ రహదారులకు ఇరువైపులా కూడా చెట్ల
స్వరూపముతో దీపాలు వెలిగేటట్టు అమరిక చేసారు, రహదారులన్నీ చాలా కాంతివంతముగా
ఉండాలని. ఎక్కడచూసినా సరే నటులు, గాయక సంఘముల వాళ్ళు పాటలు పాడుతూ నాట్యాలు
చేస్తూ పరమ సంతోషముగా ఉన్నారు. ప్రజలందరూ చాలా మంచి బట్ట లు అలంకారము
చేసుకున్నారు.
అంత ఆనందసంరంభములో ఉంది అయోధ్యా పట్ట ణము అంతా. ఒకటి జ్ఞా పకము
పెట్టు కోండి, ఆ సమయములో అప్పుడేమిటి ఇప్పుడు అయోధ్య దుర్భేద్యము, దానిని ఎవరూ
పడగొట్ట లేరు. అందునా దశరధమహారాజుగారు అతిరధుడు, గోప్ప బలవంతుడు, దేవేంద్రు డి
అంతటివాడికి సాయము చేసినవాడు. ఇక రామచంద్రమూర్తో ప్రపంచ ప్రఖ్యాతమయినటువంటి
అతిరధుడు. ఆయనకు తెలియనటువంటి శస్త్రా స్త ్ర సంపద లేదు. అటువంటివాడు రామచంద్రమూర్తి
సర్వకాలములయందు తండ్రిని రక్షిస్తు ండగా, ఎవ్వరిచేతా కూడా చూడరానిబడదయి,
దుర్నిరీక్షమయి, శత్రు వులకి అభేద్యమయి, ఆ ఇక్ష్వాకు వంశీయుడయినటువంటి దశరధమహా
రాజుగారి చేత పరిపాలింపబడుతూ, సర్వాలంకార శోభితముగా ఆనంద తరంగాలలో తేలియాడుతోంది
అయోధ్య.
ఒకరి సంతోషము ఇంకొకరికి ఖేదము అయితే అది కూడా పొ రబాటే, కొన్ని వేలమంది
సంతోషము ఒక్కడికి దుఖఃదాయకము కావడము చాలా ఆశ్చర్యకరమయినటువంటి విషయము,
అది కుసంస్కారము. అందుచేత అంతమంది ఆనందిస్తు ంటే ఆవిడ ఆశ్చర్యపో యింది, అదే
సమయములో కౌసల్య దగ్గ ర దాసిగా ఉన్నటువంటి వనిత అటువైపుగా వెడుతోంది
పరమసంతోషముతో. ఆవిడ్ని పిలిచింది, పిలిచి ఆ ప్రజలందరినీ చూపించింది, వాళ్ళ సంతోషాన్ని
చూపించింది, ఒక మాట అడిగింది. ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత సంతోషముగా ఉన్నారు అని
అడిగింది అనుకోండి ఆ తీరు వేరు, ఆవిడ ఎంత గమ్మత్తు గా అడిగిందో చూడండి ప్రశ్న. అందుకే
మీకోక మాట విజ్ఞా పన చేసి ఉన్నాను. అది ఆది కావ్యము, కావ్యభాష చాలా గమ్మత్తు గా ఉంటుంది,
మీరు తరచు చూడాలి. ఆవిడ అంటుంది ఉత్త మేనాభిసంయుక్తా హర్షేనార్థ పరా సతీ, రామమాతా
ధనం కిన్ను జనేభ్యః సంప్రయచ్చతి.
ఆవిడ కౌసల్య అనదు, ఎందుకు అనదు, ఎప్పుడయినా కౌసల్య ఆవిడ్ని నిందించిందా,
ఏమో రామాయణములో మహర్షి చెప్పలేదు. కౌసల్య అటువంటి శీలము ఉన్నది కాదు. కానీ తను
కైకేయి దగ్గ ర పనిచేస్తో ంది కాబట్టి ఆవిడ కౌసల్య అన్నమాట కూడా అనదు మంధర. ఏమంది
రామమాత, రాముడి తల్లి అని పిలిచింది. రాముడి తల్లి ఎటువంటిదిట, హర్షేనార్థ పరా సతీ డబ్బులు
దాచుకునేటటువంటి లోభి, ఎన్నడూ ఒకరికి ఒక పైస పెట్టనిది, కౌసల్య అటువంటిది అని
రామాయణములో చెప్పలేదు. నిత్యము యజ్ఞ యాగాములు చేసుకుంటూ, అఘ్నిహో త్రము
చేసుకుంటూ, మహాతల్లి బ్రా హ్మణులకు దానము చేస్తూ , అనేక వ్రతములు చేసన
ి టువంటి
సౌశీల్యవతిగా చెప్పబడింది.
ఈ మాట వింది, ఆ పరిచారిక వెళ్ళిపో యింది, ఈవిడ గబగబా ప్రా సాదము మీంచి దిగి కిందకు
వచ్చింది. కిందకు వచ్చేటప్పటికి కైకమ్మకు అప్పటికి తెలియదు, కైకమ్మ పరమ సంతోషముగా ఒక
హంసతూలికాతల్పము మీద పడుకుని ఉంది. ఆవిడ దగ్గ రకు వెళ్ళింది. అక్షయ్యం సుమహద్దేవి
ప్రవృత్త ం త్వద్వినాశనమ్, రామం దశరధో రాజా యౌవరాజ్యే2 భిషేక్ష్యతి. నీకు నాశనము
ప్రా రంభము అయ్యింది కైకా అంది వెళ్ళి. అంటే ఆవిడ ఆశ్చర్యపో యింది, ఎంత పడుకున్నదయినా
నీకు నాశనము ప్రా రంభము అయ్యింది అంటే ఏమిటీ ఈ అల్ల రి అనుకోదా, నీకు నాశనము
ప్రా రంభము అయ్యింది, రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టా భిషేకము జరుగుతోంది అంది. నాకు
అలవాటయిపో యి రామచంద్రమూర్తి అంటాను కానీ అలా ఏమీ మంధర అనదు.
రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము జరుగుతోంది, అందుకని నీ నాశనము ప్రా రంభము
అయ్యింది అంది. కైక ఆశ్చర్యపో యింది, అదేమిటి రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము ఏమిటి,
నాకు నాశనము ప్రా రంభము అవ్వడము ఏమిటి. అసలు ఆ మాట అనగానే కైకమ్మ నోర్ముయ్ ఏం
మాట్టా డుతున్నావు, నీ పరిమితి నువ్వు జ్ఞా పకము పెట్టు కో, పో బయటకు అని ఓ మాట అని ఉండి
ఉంటే, రామాయణము వేరొకలా ఉండి ఉండేది. ఆ మాట కైక అనలేదు, ఆ మాట కైక అనదు కాబట్టే
మంధరను కైక దగ్గ రకు పంపించారు దేవతలు.
అందుకని మంధర కైక దగ్గ రకు వెళ్ళింది ఈ మాట చెప్పడానికి . అందుకే ఒక మాట
చెప్పారు. అసలు మంధర రాజ్య ప్రా సాదము ఎందుకు ఎక్కింది అంటే యాధృచ్చికము అన్నారు,
అది దైవ సంఘటన, దానికో కారణము లేదు. పైన కైక ఒడియాలు ఆరపెట్టా ను తీసుకురా అనేమీ
చెప్పలేదు. ఎందుకు ఎక్కుతుంది కుబ్జ , గూనిది ఎక్కడము కష్ట ము, ఎక్కింది, ఎందుకు ఎక్కింది
దైవఘటన, పైకి ఎక్కింది. అందుకని ఈ మాట చెప్పింది. కైకమ్మ ఆశ్చర్యపో యింది, ఆవిడ అంది
మీరు అవకాశము ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో
ఆలోచించండి. ఆవిడ అంది పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొ ందుతున్నావే, చూసావా
కొద్దికాలములో కౌసల్య రాజమాత అవుతోంది, నువ్వో నాశనము కావలిసినటువంటి సమయము
నీకు ఆసన్నమవుతోంది, నీ భర్త బహుచతురుడు, ద్రో హి.
ఎందుచేత చాలా తెలివితేటలుగా మెత్తగా, నయవంచనతో మాట్లా డుతూ వృద్ధా ప్యములో
ఉన్నవాడు యవ్వనములో ఉన్న నిన్ను కట్టు కుని తనకి కావలిసినటువంటి భోగాలన్నిటినీ నీ దగ్గ ర
అనుభవిస్తూ , ఏమీ తెలియనివాడిలా, తేనె పూసిన కత్తి లా నీ దగ్గ ర ప్రవర్తిస్తూ నీకు ఎంత
మాహాపకారము చెయ్యాలో అటువంటి అపకారము చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుచేత నీ
కుమారుడు అయిన భరతుడు ఉండగా, భరతుడికి పట్టా భిషేకము చెయ్యడము మాని, కౌసల్య
కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తికి పట్టా భిషేకము చెయ్యడానికి నిర్ణ యము చేసాడు.
గమనించావా కైకా అంది, అప్పటికి కూడా పాపము కైకమ్మలో మార్పు లేదు.
కైకమ్మకు రాముడంటే ప్రా ణముతో సమానము. భరతుడిని కూడా అంత ప్రేమించిందో లేదో
కూడా మనకు తెలియదు అంత ప్రేమ రాముడంటే. ఆవిడంది, రాముడు కౌసల్యను తల్లిగా మిగిలిన
వారిని పినతల్లు లుగా ఎన్నడూ చూడలేదు. కౌసల్యను ఎలా సేవిస్తా డో మమ్మల్ని అలా సేవించాడు.
అటువంటి రాముడు యవ్వరాజ్య పట్టా భిషేకము పొ ందడము అంటే ఇంకింత కన్నా గొప్ప వార్త
ఎక్కడుంటుంది. ఓ కుబ్జా ఎటువంటి శుభవార్త తెచ్చావే నువ్వు, రా ఈ బహుమానము తీసుకో అని
ఒక బహుమతిని ఇచ్చింది. ఇస్తే ఆ కుబ్జ కు ఉన్న తెగింపు చూడండి, మాట్లా డడానికి అవకాశము
ఇవ్వడము పొ రపాటు అందునా తన భర్త పరమ ధర్మాత్ముడయిన దశరధమహారాజుగారి గురించి
మాట్టా డుతుంటే ఖచ్చితముగా ఒక పరిచారిక తన అవధి మీరినట్టే.
ఏమిటి నువ్వు చేసిన పొ రపాటు, అంటే బాల ఏవ హి మాతుల్యం భరతో నాయిత స్త ్వయా,
సన్నికర్షా చ్చ సౌహార్ద ం జాయతే స్థా వరేష్వసి. ఆ భరతుడు ఇక్కడే ఉంటే అయోధ్యాపట్ట ణములో
దశరధమహారాజుగారు ప్రతీరోజు భరతుడి వంక చూస్తా డు. చూసినప్పుడు భరతుడు దుర్మార్గు డు
కాడు కదా, రాముడు ఎంత గుణవంతుడో భరతుడూ అంతే గుణవంతుడు. రోజూ భరతుడి వంక
చూడ్డ ములో భరతుడి మీద ప్రేమ ఉంటుంది. మనము ఒక మాట అంటాము ఔట్ ఆఫ్ సైట్, ఔట్
ఆఫ్ మైండ్ అంటాము. దగ్గ ర లేకపో తే ప్రేమ తగ్గిపో తుంది అంటాము, అందుచేత నువ్వు
ప్రయత్నపూర్వకముగా భరతుడిని తీసుకువెళ్లి మేనమామగారి ఇంట్లో దిగపెట్టేసావు. ఇప్పుడు
ఏమయిపో యింది, రోజూ రాముడు పితృ సేవ పితృ సేవ పితృ సేవ అని తండ్రిదగ్గ ర తిరుగుతున్నాడు.
భరతుడు కూడా అంత యోగ్యుడే, పాపము దూరముగా ఉండిపో యాడు, ఎవరిదీ పొ రపాటు,
నువ్వు చేసిన పొ రపాటు. నువ్వు చేసిన పొ రపాటు వలన ఇవ్వాళ ఫలితము ఎవరు
అనుభవిస్తు న్నారు నీ కొడుకు అనుభవిస్తు న్నాడు. ఇప్పుడు ఏమవుతుంది కైకమ్మ హృదయములో,
నేను పొ రపాటు చేసాను, నేను రక్షించాలి నా కొడుకుని అన్న భావన వచ్చేస్తు ంది. ఆ భావన
తీసుకువస్తో ంది అందుచేత చూసావా, ఇప్పుడు భరతుడు లేడు పో నీ ఇప్పుడు తీసుకురాగలవా,
తీసుకురాలేవు. ఎందుకని తీసుకువస్తే రాముడు సంహరించేస్తా డు, అందుకని ఇక రాలేడు.
ఇప్పుడు ఇంక ఉన్న అవకాశము ఏమిటి అడవులు పట్టి పారిపో వడమే నీ కొడుకు బతకాలంటే .
నువ్వేం చేస్తా వు గోప్ప స్థితిని పొ ందుతావు రేపటినుంచి ఏమిటి నీ పరిస్థితి, రామచంద్రమూర్తి
సహజముగా గొప్ప గుణములు కలిగినవాడు కనుక, యవ్వరాజ్య పట్టా భిషేకము జరగగానే
ప్రజలందరి మద్ద తు ద్విగుణీకృతము అయిపో తుంది. బాగా వెళ్ళూంచుకుంటాడు,
ఊంచుకోవడములో ఇంక తనకి శత్రు వర్గ ము అన్నది చేసస
ే ుకుంటాడు రాజ్యమంతా. చేసేసుకున్న
తరువాత కౌసల్య ఇన్నాళ్లు పెద్దభార్య అయినా అందగత్తేనన్న అతిశయముతో భర్త ను కొంగుకి
ముడేసుకున్నానన్న అతిశయముతో ప్రవర్తించావు, ఇప్పుడు నీకు పాఠము కౌసల్య చెప్పడము
మొదలుపెడుతుంది.
ఎందుకని ప్రా ప్తా ం సుమహతీ౦ ప్రీతి౦ ప్రతీతాం తాం హతద్విషమ్, ఉపస్థా స్యసి కౌసల్యా౦
దాసీవత్ త్వం కృతాంజలిః. కౌసల్య రామచంద్రమూర్తి యొక్క తల్లి, రాజమాత. నువ్వెవరు
ఏమీకాదు, అడవులు పట్టి పారిపో యిన కొడుకికి తల్లివి. కాబట్టి దినసరి బత్తేనికి తినడానికి నువ్వేం
చెయ్యాలి, కౌసల్య దగ్గ రకు వెళ్ళి ఇలా నమస్కారము పెడుతూ నిలబడి కౌసల్యకు దాసిగా బతకాలి.
దశరధమహారాజుగారి భార్యగా కాదు, రాముడు యవ్వరాజ్య పట్టా భిషిక్తు డు అవుతున్నాడు, ఎంత
ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నావో చూసావా, ఇంత ప్రమాదము వచ్చింది కైకా నీకు అంది.
అనేటప్పటికి ఇప్పటివరకు లేనటువంటి దుర్భుద్ది కైక యందు ప్రవశి
ే ంచింది. ఎందువల్ల
మాట్లా డడానికి అవకాశము ఇచ్చింది కైకమ్మ మంధరకి అంతే పాడుచేసెసంి ది హృదయాన్ని. ఇక
ఎవ్వరూ తియ్యలేరు ఆ అనుమానాన్ని అటువంటి అనుమానము లోపల పెరిగప
ి ో యింది.
పెరిగిపో యి అయితే ఇప్పుడు ఈ ఉపద్రవము తప్పాలంటే మంధరా నా కొడుకు రక్షింపబడాలంటే
నేనేమి చెయ్యాలి అని అడిగింది. అంటే ఆవిడంది, దీనికి ఒక్కటే పరిష్కారము ఉంది.
ఇక్ష్వాకు వంశములో పెద్ద తుఫాను ప్రా రంభము అవ్వడానికి గాలికి ఊగుతున్న పద్మముతో
చెప్పేసారు మహర్షి. పైగా అంది ఓ కుబ్జా భరతుడికి పట్టా భిషేకము అవ్వగానే నేనేమి చేస్తా నో తెలుసా
నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తా నే, నీకు బంగారముతో బొ ట్టు పెట్టిస్తా నే, నీ గూనికి పట్టు బట్ట లు
కప్పుతానే అది గూనా, అమ్మబాబో య్ రాజుల బుర్రలలో ఎన్ని తంత్రా లు ఉంటాయో ఎన్ని
మాయలు ఉంటాయో ఎన్ని ఆలోచనలు ఉంటాయో నీ గూనిలో అన్ని ఉన్నాయే కుబ్జా అంది.
అదెంత సంతోషపడిపో యిందో ఆ కుబ్జ , ఆవిడంది, నాతో మాట్లా డము కాదమ్మా ఆ పట్టు బట్ట
విప్పేయి, పెట్టు కున్న ఆభరణములు కొన్ని కోట్ల విలువయిన ఆభరణములు కైకమ్మ పెట్టు కున్నవి.
సరే అందుచేత నువ్వు ఈ విలువైన పట్టు బట్ట లు తీసి పక్కన పారెయ్యి, వేసుకున్నటువంటి
హారములన్నీ పక్కన పారెయ్యి, పక్కన పారేసి ఒక కోపముతో ఉన్నటువంటి వనితా ఏ రకముగా
అయితే చాలా ముతకగా ఉన్న వస్త మ
్ర ు కట్టు కోవాలో అటువంటి వస్త మ
్ర ు కట్టు కో. పూర్వము
కోపగృహము అని ఒకటుండేది, రాజులు మళ్ళీ కోపముగా ఉందో ప్రసన్నముగా ఉందో
తెలుసుకోక్కరలేదు. అక్కడ ఉందనుకోండి ఆవిడ కోపముగా ఉందని గుర్తు అన్నమాట, అందుకని
కోపానికి ఒక గది కట్టించేవారు.
నృశంసే దుష్ట చారిత్రే కులస్యాస్య వినాశని, కిం కృతం తవ రామేణ పాపం పాపే మాయాపి వా,
కౌసల్యా౦ వా సుమిత్రా ం వా త్యజేయమపి వా శ్రీయమ్, జీవితం వాత్మనో రామం న త్వేవ
పితృవత్సలమ్, యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ, భార్యావద్భగినీవచ్చ
మాతృవచ్చోపతిష్ఠ తీ, సతతం ప్రియకామా మే ప్రియపుత్త్రా ప్రియంవదా, న మయా సత్కృతా దేవీ
సత్కారార్హా కృతే తవ, వైదేహీ బత మే ప్రా ణాన్ శోచంతీ క్షపయిష్యతి, హీనా హిమవతః పార్శ్వే
కిన్నరేణేవ కిన్నరీ, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః, గురూన్ శుశ్రూ షయా వీరో
ధనుషా యుధి శాత్రవాన్, మమ వృద్ధ స్య కైకేయి గతా౦తస్య తపస్వినః, దీనం లాలప్యమానస్య
కారుణ్యం కర్తు మర్హసి, సా నూన౦ విధవా రాజ్యం సపుత్త్రా కారయిష్యసి, న హి ప్రవ్రా జితే రామే దేవీ
జీవితుముత్సహే, అనార్య ఇతి మామార్యః పుత్త వి
్ర క్రా యికం ధృవం, ధిక్కరిష్యంతి రథ్యాసు సురాప౦
బ్రా హ్మణం యధా, యది మే రాఘవః కుర్యాత్ వనం గఛ్ఛేతి చోదితః, ప్రతికూలం ప్రియం మే స్యాత్
నతు వత్సః కరిష్యతి, కౌసల్యాం మాం రామం చ పుత్త్రో పుత్త్రౌ చ యది హాస్యతి, దుఃఖాన్యసహతీ
దేవీ మామేవానుమరిష్యతి, ప్రియంచేద్భరతస్యైతత్ రామప్రవ్రా జనం భవేత్, మా స్మ మే భరతః
కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః, స భూమిపాలో విలపన్ననాధవత్, స్త్రీయా గృహీతో
హృదయే2 తిమాత్రయా, పపాత దేవ్యాశ్చరనౌ ప్రసారితౌ, ఉభావ సంస్పృశ్య యధాతురస్త ధా.
ఎంత అందముగా అంటే కొన్ని శ్లో కాలు మాత్రమే నేనింకా ఇందులో చెప్పాను
ప్రధానమయినవి. దశరధుడు అంటాడు ఎంత భయంకరమయిన మాట మాట్లా డేవు కైకా, ఇటువంటి
మాట వినవలిసివస్తు ంది జీవితములో అని నేనెన్నడూ అనుకోలేదు, ఆ రాముడు నీకేమి
అపకారము చేసాడు, ఎన్నడూ మా అమ్మ కౌసల్యా అని కౌసల్య సేవ మాత్రమే చేసన
ి వాడు రాముడు
కాడే, నీకు సేవ చేసాడు, సుమిత్రకు సేవ చేసాడు కౌసల్యకు ఎలా సేవ చేసాడో మిమ్మల్ని అలా
సేవించాడు. ఒక్కనాడు మాట తప్పినవాడు కాడే, రాముడి గురించి వ్యతిరేకముగా మాట్లా డిన
వాళ్ళు ఈ కోసలరాజ్యము మొత్త ము మీద ఒక్కళ్లు లేరు. నీ దగ్గ రకు వచ్చి ఎప్పుడు మాట్లా డినా
యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తే రాముడికే చెయ్యాలండి, రాముడికి భరతుడికి తేడా లేదు అని
చెప్పేదానివి, అటువంటిదానివి కైకా ఇవ్వాళ నువ్వు ఎవ్వరి చెప్పుడు మాటలు విన్నావు, నీకు
ఎందుకు కలిగింది ఈ అభిప్రా యము, ఎందుకు రాముడిని పద్నాలుగు సంవత్సరములు
దండకారణ్యమునకు పంపించేద్దా మనుకుంటున్నావు.
నా రాముడు ఇంతకాలము వ్రతాలు చేసాడు, గురువుల దగ్గ ర శుశ్రూ ష చేసాడు, నిన్న కాక
మొన్న వివాహము అయ్యింది, హంసతూలికా తల్పము మీద పడుకొని భోగములను
అనుభవించవలసినటువంటి వాడు, మంచి యవ్వనములో ఉన్నటువంటి వాడు, వంట బ్రా హ్మణులు
కుండలములు పెట్టు కున్నటువంటి వారు రాముడికి వంట చేసి మేము పెడతామంటే మేము
పెడతామని సంతోషపడిపో తూంటారు. అటువంటి రాముడు దండకారణ్యములోకి ముతకవస్త మ
్ర ు
కట్టు కుని పాదములకు పాదుకలు లేకుండా, ముళ్లు కాళ్ళలో గుచ్చుకుని నెత్తు రు కారుతుంటే
జిల్లేడిపాలు తలమీద పో సుకుని జటలు కట్టేసినటువంటి తలతో ఆకలేస్తే ఉత్త మమయిన
మాంసాహారము తినడానికి అవకాశము లేక ఆ చెట్టు ని ఆ చెట్టు ని తేనె పట్టు ని కొట్టు కుని తేనె తాగి
కందమూలాలు తిని ఒక చెట్లకింద రాముడు పడుకోవడమా, అది ఊహించి నేను బతకగలనా, పైగా
నీకొక్క మాట చెపుతున్నాను చూడు, నేను వృద్ధా ప్యములో ఉన్నాను, జీవితానికి చిట్ట చివరి దశకు
వచ్చేశాను ఇంక బ్రతికినంతకాలము బతకను, కైకా రాముడిని విడిచిపెట్టి నేనుండలేను, కైకా నువ్వు
నన్ను అడుగు కౌసల్యను విడిచిపెట్టేసెయ్యి అను వదిలిపెట్టేస్తా ను సుమిత్రను వదిలెయ్యి అను,
వదిలిపెట్టేస్తా ను, దశరధా నీ ప్రా ణాలు విడిచిపెట్టేయి అను నీ పాదాల దగ్గ ర విడిచిపెట్టేస్తా ను, రాజ్య
బ్రష్టు డివి అయిపో సింహాసనము దిగప
ి ో అను దిగిపో తాను, ఒక్క కోరిక నీ పాదములు పట్టి
ప్రా ర్ధిస్తు న్నాను కైకా, రాముడిని పద్నాలుగేళ్లు పంపించేయమని అడక్కు.
అందుకని నా మాట విను, నాకొక్కటే కోరిక, రాముడు నేను నీకు రాజ్యము ఇవ్వను అంటే
నువెవ్వడివిరా రాజ్యము ఇవ్వడానికి అని నా మీద తిరగబడి నాన్నా నూవ్వెందుకు ఇస్తా వు
రాజ్యము నేను పుచ్చుకుంటాను అని నను ఖైదులో పెట్టేస్తే నేను సంతోషపడిపో దును, కానీ
రాముడు అలా చెయ్యడు, నాన్నా నువ్వు చెప్పావు నేను అరణ్యానికి వెళ్లి పో తాను నాన్నా అంటాడు.
అది నేను తట్టు కోలేను కైకా నాతో ఆ మాట అనిపించద్దు వెర్రిరాముడు, రాముడికి పితృవాఖ్య
పరిపాలన తప్ప వేరొకటి తెలియదు. ఎంత పిచ్చి ప్రేమో నేనంటే, నాన్నా ఇప్పుడు
సంతోషించవలసిన వయస్సురా, భోగాలు అనుభవించరా అని చెప్పవలిసినవాడిని తెల్లటి గొడుగు
కింద కొడుకు కూర్చుంటే చూడవలసిన వాడిని నేను నా చేజేతులారా అడవిలో రాముడు
తిరుగుతుంటే, నేను పరమాన్నాలు తిని అంతఃపురములో బ్రతకనా, నేను అలా బ్రతకగలనని
అనుకుంటున్నావా, అలా నేనుండలేను. రాముడు నన్ను నిగ్రహించి నా మాటకు ఎదురు తిరిగే
వాడు కాదు అందుకు నేను బాధపడుతున్నాను కైకా నా మాట విను, నేను బ్రతకను మరణిస్తా ను
నువ్వు వైధవ్యము పొ ందుతావు.
పడితే తన పాదముల మీద పడుతున్నాడని దూరము జరిగంి ది. శిరస్సు నేలకు తగిలి
మహానుభావుడు పక్కకు దుళ్ళి సృహతప్పి పడిపో యాడు. పడిపో తే లేపలేదు, లేపకపో తే అలాగే
సృహతప్పి పలవరిస్తూ పడిపో యి ఉండిపో యాడు. ఎంత దారుణమయిన స్థితికి వెళ్లి పో యాడో
చూడండి, ఒక్క చెప్పుడు మాటలు వినడము చేత ఒక మహాపురుషుడు దశరధుడు నేనింకా కొన్ని
శ్లో కాలు ఆపాను ఎందుకు ఆపానంటే యధార్ధ మునకు నేనే చెప్పలేను, నేను చెప్తే ఉపన్యాసానికి
వచ్చి నేనేడస
ి ్తే అసహ్యముగా ఉంటుందని నేను చెప్పలేదు.
ఇది అంత భయంకరముగా ఉంటుంది దశరధుడి పరివేదన, ఎంత భాధ పడ్డా డో
మహానుభావుడు. ఇన్ని చెప్పి పడిపో తే కూడా కాళ్ళు దూరముగా లాగేస్తే కైకమ్మ, పాదములు
దూరముగా తీసేసుకుంటే మూర్ఛవచ్చి పడిపో తే, పడిపో యినతరువాత అప్పుడు ఒక్కసారి మళ్ళీ
కొంతసేపటికి తెలివొచ్చింది. తెలివొచ్చినతరువాత ఆవిడ అంటుంది ఏమయ్యా, ఇక్ష్వాకు వంశములో
పుట్టా నంటావు సత్యధర్మములు పాటిస్తు న్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, రెండు వరాలు
అడిగేటప్పటికి నీకు ఇంత కష్ట ము వచ్చిందా, ఎందుకు ఇంత కష్ట ము వచ్చింది. ఏం ఎవరయినా
వచ్చి రాముడు ఎక్కడికి వెళ్లా డని అడిగితే దండకారణ్యానికి పంపించాను అని చెప్పలేను కైకా
అంటున్నావు కదా.
శైబ్యః శ్యేనకపో తీయే స్వమాంసం పక్షిణే దదౌ, అలర్కః చక్షుషీ దత్వా జాగామ
గతిముత్త మామ్. పో రా ఉత్త మగతులకి ఎలా వెళ్లా రు నీ వంశములో వాళ్ళు, ఆనాడు ఒక
డేగరూపములో ఇంద్రు డు, పావురము రూపములో అఘ్ని వచ్చారు మహానుభావుడు ఆ
సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు ఆ సమయములో రాజు. కూర్చుని ఉండగా ఆ
వచ్చినటువంటి డేగ పావురాన్ని తరుముతూ వస్తే ఆ పావురము వచ్చి రాజు కాళ్ల మీద పడింది.
పడితే నీకు శరణు ఇచ్చాను అన్నాడు. ఆ పావురానికి శరణు ఇచ్చావు మరి నాకు ఆహారము
ఎక్కడనుంచి వస్తు ంది అని అడిగాడు ఆయన ధర్మనిష్ట కనిపెట్టడానికి డేగరూపములో ఉన్న
ఇంద్రు డు. నీకు పావురము ఎత్త ంత మాంసము కావాలి కనుక నేనిస్తా ను మాంసము అని
పావురాన్ని తక్కిటలో ఒక పక్కన పెట్టి, తన శరీరములోంచి అంత బరువున్న మాంసాన్ని కోసి
అక్కడ పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినటువంటివాడు నీ వంశములో పూర్వములో పుట్టినటువంటి
శిబిచక్రవర్తి.
అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గ రకు ఇంద్రు డు బ్రా హ్మణరూపములో వచ్చి నిలబడితే
నీకేమికావాలో కోరుకోమన్నాడు. నీ కళ్ల ను ఇచ్చేస్తా వా అన్నాడు బ్రా హ్మణుడు. ఇస్తా నన్నాడు
కాబట్టి అలర్కుడు తన రెండు కళ్ళు తీసి ఇచ్చేసాడు. అటువంటివారి వంశములో పుట్టి రెండు
వరాలు భార్యకు ఇస్తా నని ఇవ్వకుండా తప్పించుకోవడానికి నీకు సిగ్గు గా లేదా అని అడిగింది. అడిగి
భర్త ని ఏమని పిలిచిందో తెలుసాండీ కైకమ్మ ఆ రోజున దేవతలు ఆవహించారు, బహుశా ఏ భార్యా ఏ
భర్త ను అలా పిలవకూడదు దుర్మతే బుద్ధిహీనుడా, దుష్ట బుద్ధి కలిగినవాడా నీ పన్నాగము ఏమిటో
నాకు తెలీదు అనుకుంటున్నావా.
అంటే ఆయన అన్నాడు ఒకవేళ ఇదే నీ పట్టు దల అయితే కైకా నేను చెప్పినటువంటి
మాటలు కూడా నువ్వొక్కసారి జ్ఞా పకము పెట్టు కో అని ఆయన అంటాడు ప్రతామ్య వా ప్రజ్వల వా
ప్రణస్య వా, సహస్రా సో వా స్ఫుటితా మహీం వ్రజ, న తే కరిష్యామి వచస్సుదారుణమ్, మమాహితం
కేకయ రాజపాంసని. కైకా నువ్వు నిలువునా మండిపో , నేలమీద పడిపో యి ముక్కలయిపో ,
నువ్వు సర్వనాశనము అయిపో , లేదా దుఃఖించి దుఃఖించి చెడప
ి ో నీ కోరిక మాత్రము నేను తీర్చను.
ఎందుకంటే నువ్వు ధర్మాభద్ద మయిన కోరిక కోరలేదు, లోకమంతా ఎవరిని రాజుగా ఉండాలని
కోరుకుంటోందో , ఎవరు యవ్వరాజ్య పట్టా భిషేకము పొ ందాలని కోరుకుంటోందో , ఎవరిగురించి లోకము
అంతా ఒక్క అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఏ అపవాదు లేకుండా, ఏ ఆరోపణా
లేకుండా పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పంపమంటున్నావు. ఇది నేను చెయ్యను, నువ్వు
నాశనము అయిపో యినా సరే నేను మాత్రము నీ కోరిక తీర్చను అన్నాడు.
నీకేమి కావాలో చెప్పు, ఈ రాజ్యములో ఉన్న ఐశ్వర్యము కావాలా ఇచ్చేస్తా ను, నీకు
ధనము కావాలా ఇచ్చేస్తా ను, నీకేది కావాలంటే అది చేస్తా ను నేను కోరుకునేది ఒక్కటే రాముడిని
చూడకుండా ఉండి రామా రామా రామా అంటూ ఏడుస్తూ చచ్చిపో యే దురదృష్ట ము నాకివ్వకు, నా
ఒక్క కోరిక రాముడిని చూస్తూ చచ్చిపో తాను కైకా ఎలాగూ చివరికి వచ్చేసాను, ఇంక నేను బతకను
ఎక్కువకాలము వృద్ధు డను అయిపో యాను. రాముడ్ని చూస్తూ చచ్చిపో యే అదృష్టా న్ని కైకమ్మ
ఇచ్చింది అన్న వరము ఇయ్యి, ఆ వరముతో నేను చచ్చిపో యేటట్టు గా నన్ను అనుగ్రహించు. ఆ
ఒక్క అవకాశాన్ని నాకు దూరము చెయ్యకు అని మాట్లా డుతున్నాడు రాత్రి గడిచిపో తోంది. కైకమ్మ
అంగీకరించడము లేదు. ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారికి పరుషముగా మాట్లా డుతోంది, మాట్లా డుతుంటే
ఆయన అంటాడు దిక్కులేక ఎంతబాధ పడిపో యాడో చూడండి దశరధమహారాజుగారు.
కిటికీలోంచి రాత్రివంక చూసాడు, రాత్రి గడిచిపో వడానికి సిద్ధము అయిపో తోంది, ఈ కైక
నామాట వినదు, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా జుట్టు అంతా విరబో సేసుకున్నాడు ఏడ్చి ఏడ్చి
ఎన్నడూ తెలియనటువంటివాడు పరమవృద్ధు డేమో కళ్ళన్నీ వాచిపో యి ఎర్రగా అయిపో యాయి.
నీరసపడిపో యాడు, అప్పటికి ఎన్నిమార్లు స్పృహతప్పేడో , ఎన్నిమార్లు మూర్ఛపో యాడో . నేల
పడుతున్నాడు లేస్తు న్నాడు, చంపలనిండా కారిపో యినటువంటి కన్నీళ్ళు అట్ట లు కట్టేసి ఉన్నాయి.
స్పృహ వస్తే పిచ్చివాడయిపో తున్నాడు, ఏదో రోగము వచ్చినవాడిలా, అపత్యము తిన్నవాడిలా,
ఉన్మాధిలా తెల్లవారిపో తుందేమో అని బెంగపెట్టేసుకున్నవాడిలా అయిపో తున్నాడు.
తెల్లవారితే రాముడు వస్తా డు, ఏం చెప్తా డు అంత బాధ తట్టు కోలేకపో తున్నాడు. అందుకని
కైక నా మాట వినదు అని నిషాకాంతా అనిపిలుస్తా డు రాత్రిని. పిలిచి అంటాడు న ప్రభాతం
త్వయేఛ్ఛామి నిశే నక్షత్రభూషణే, క్రియతాం మే దయా భద్రే మయా2 యం రచితోంజలిః. ఈ కైక
నామాట వినదు రాముడిని చూస్తూ చచ్చిపో యే ఒక్క వరాన్ని నాకివ్వదు, ఓ రాత్రీ
నక్షత్రములనేటటువంటి ఆభరణములు పెట్టు కున్నటువంటి రాత్రి అనబడేటటువంటి ఓ కాంతా
నువ్వు నాకు ఒక్క వరము ఇయ్యి ఈ రాత్రి తెల్లవారకూడదు, ఇలాగే ఉండిపో . ఎందుకనంటే
తెల్లవారిపో తే రాముడు వస్తా డు పట్టా భిషేకము చేసుకుందామని, సకలసుగుణాభిరాముడు.
అని ఇటు చూసాడు, అక్కడే కూర్చుని వెర్రినవ్వు నవ్వుతూ ఉంది కైకమ్మ, చూసి మళ్ళీ
చీకటివంక చూసాడు, చూసి అంటాడు ఎంత వెర్రెక్కిపో యి ఉన్నాడో చూడండి, ఎంత భ్రా ంతిలో
ఉన్నాడో చూడండి దశరధమహారాజుగారు. కావ్యభాష వాల్మీకి మాట్లా డతారు ఆయన అంటారు
అధవా గమ్యతా౦ శీఘ్రం నాహమిఛ్ఛామి నిర్ఘృణామ్, నృశంసామ్ కైకయీం ద్రష్టు ౦ యత్కృతే వ్యసనం
మహత్. ఓ రాత్రీ నన్ననుగ్రహించు, నువ్వయినా నా మాటవిను తొందరగా వెళ్లి పో , తెల్లవారపో నీ.
ఎందుకోతెలుసా, నువ్వలా ఉండిపో తే నేనిక్కడ ఉండిపో వాలి. చీకట్లో రాత్రివేళ రాజు నడిచి వెడత
ి ే
బాగుండదు. అందుకని నువ్వలా ఉండిపో తే నేనీగదిలో ఉండిపో వాలి, నా ఎదురుగుండా కైక
ఉంటుంది, ఆ కైకను చూస్తూ ఒక్క క్షణము కూడా ఇక్కడ ఉండలేను తొందరగా తెల్లవారితే నేను
వెళ్లి పో తాను ఇక్కడనుంచి, అందుకని తెల్లవారిపో నీ. కనీసము నా మాట అదయినా విను ఓ
నిషాకాంతా చీకటి అనబడేటటువంటి ఓ స్త్రీ స్వరూపమా తొందరగా నువ్వెళ్లిపో . అంటే ఇంక ఎవరితో
మాట్లా డుతున్నాడో , ఏది మాట్లా డుతున్నాడో కూడా తెలియని ఉన్మాధావాస్త ను పొ ందాడు. పొ ంది
ఇంతగా భాధ పడుతున్నాడు, తెల్లవారిపో తోంది, బ్రా హ్మీముహూర్త ము ఆసనమ్మవుతోంది,
దూరముగా వేదపఠనము చెవినపడుతోంది.
అక్కడ రామచంద్రమూర్తి ఉపవాసము చేసారు, సంధ్యావందనాది క్రతువులు పూర్తి
చేసుకున్నారు, ఇంక యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తా డు తండ్రి సూర్యోదయము కాగానే అని మంచి
కాంతివంతమయినటువంటి స్వరూపముతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అయోధ్య
పట్ట ణము అంతా ఎక్కడ చూసినా జేజేలు పలుకుతున్నారు. అంతఃపురములో రాజు యొక్క పరిస్థితి
ఇంత దౌర్భాగ్యముగా ఉంది. ఆవిడ అంటుంది కైకమ్మ తెల్లవారడానికి సిద్ధమవుతోంది నువ్వు
సూర్యవంశ ప్రభువివి, ఇప్పటివరకు నీ బుద్ధి గడ్డితింది, కనీసము సూర్యవంశప్రభువువి కనుక
సూర్యదర్శనము చేసయినా బుద్ధి తెచ్చుకోవయ్యా. సత్యానికి ధర్మానికి కట్టు బడడము నేర్చుకో, అని
ఆవిడ అంది. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తా డు, రాముడిని చూసినతరువాత
పుత్రవ్యామోహముతో మాట మార్చినా, భరతుడికి రాజ్యాభిషేకము ఇవ్వకపో యినా, రాముడిని
దండకారణ్యానికి పంపకపో యినా ఒక్క విషయము జ్ఞా పకము పెట్టు కో.
యస్తే మంత్రకృతః పాణిః అగ్నౌ పాపే మయా దృతః, తం త్యజామి స్వజ౦ చైవ తవ పుత్త ౦
్ర
త్వయా సహ. ఈ మాట మార్చడానికి రామచంద్రమూర్తి యుద్ధ కాండలో అడగవలిసివచ్చింది
దశరధమహారాజుగారు వస్తే, నువ్వు నన్ను ఇంత భాద పెట్టా వు కనుక ఏ రాముడ్ని చూస్తూ
చనిపో తానని అడిగితే నాకు ఆపాటివరము కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకముగా ఏ
అఘ్నిసమక్షములో నీ పాణిగ్రహణము చేసానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తు న్నాను. ఇక
నువ్వు నాకు భార్యవు కావు, నా మరణము తధ్యము, నేను మరణించి తీరుతాను నువ్వు విధవవు
అవుతావు, విధవారాజ్యాన్ని నిర్వహించుకో, నువ్వు నీ కొడుకు కలిసి విధవ విధవ కొడుకు కలిపి
రాజ్యము ఏలుకోండి, ప్రజలందరూ ఛీ కొడతారు. నా మృతదేహము అంతఃపురములోంచి బయటకు
వెళ్లి పో తుంటే నీ కొడుక్కి పట్టా భిషేకము చేసుకుని మురిసిపో కైకా.
అందుకని ధర్మము తెలుసున్నటువంటి తల్లి కనుక సీతమ్మ తల్లి గడపవెనక ఉండిపో యింది
రామచంద్రమూర్తి గడప దాటి బయటకు వచ్చి సీతమ్మతల్లి ఆయనకు మంగళాశాసనము చేసింది,
మీకు విజయము కలగాలి, యవ్వరాజ్య పట్టా భిషేకము జరగాలని ఎంతో సంతోషముగా మాట్లా డింది.
మహానుభావుడు బయలుదేరాడు, రధము ఎక్కాడు, సుమంత్రు డితో కలిసి వెళ్ళాడు, వెనకాతలే
లక్ష్మణుడు ఉంటాడు, ఆ శ్వేతఃచత్రా న్ని పట్టు కున్నాడు. అందరూ రాముడి రధము వెనకాతల
పరుగులు తీస్తు న్నారు, దశరధమహారాజుగారి అంతఃపురము దగ్గ రకు వెళ్లా రు, రధము దిగాడు,
రెండవ కక్ష్యనుంచి నడక ప్రా రంభించాడు. మిగిలిన స్నేహితులను వారిని అందరినీ ఆపేసాడు, తన
తండ్రిని చూడ్డా నికి వెడుతున్నాడు కాబట్టి ఒక్క లక్ష్మణుడితో కలిసి లోపలకు వెళ్ళాడు. లోపల
అంతఃపురములో దశరధమహారాజుగారు కైకమ్మతో కలిసి ఆ శయనాగారములో ఉన్నారు.
అడిగితే ఆవిడ అంది కైకమ్మ ఎలా మాట్లా డిందో చూడండి నోట మాట మాట్లా డలేక స్పృహ
వచ్చి కొడుకువంక ఇలా చూడలేక దశరధమహారాజుగారు తల ఇలా వంచేసుకుని కంటివంె ట
భాష్పధారలు ఇలా ఒళ్ళో పడిపో తుంటే కట్టు కున్నటువంటి ఆ వస్త మ
్ర ంతా తడిసప
ి ో తుంటే
చేతులమీంచి ఇలా నీళ్ళు కారిపో తుంటే ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు దశరధుడు. ఆవిడ అంది
చెపుతానయ్యా మీ నాన్నగారు ఎందుకు ఏడుస్తు న్నాడో యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వా
శుభమ్, కరిష్యసి తతస్సర్వం ఆఖ్యాస్యామి పునస్త ్వహం. నీకు చెపుతాను రామా కానీ ఏం చేస్తే
మీనాన్నకు ఈ శోఖము చేస్తేకూడా ఉపశమిస్తు ందో కూడా చెపుతాను, కానీ చెప్పాక అమ్మా ఇది
నాకు అంత సుఖము కాదే అమ్మా లేకపో తే ఇది అంత కష్ట మే అని నువ్వు అనకూడదు, అది నీకు
కష్ట మే అవ్వనీ శుభమే అవ్వనీ ఏదయినాకూడా నువ్వు ఆ పని కానీ చేసావా మళ్ళీ మీ నాన్న
సంతోషముగా ఉంటాడు, అలా నువ్వు మాట ఇయ్యి రామా నీకు చెపుతాను అంది.
ఈ మాట రాముడితో మాట్టా డుతూ ఉంటే అక్కడున్న దశరధమహారాజుగారు కైక వంక చూసి
చ్ఛీ అని ఒక్కసారి తలవొంచేసుకున్నాడుట. ఇంకేం అంటాడు అంతకన్నా పాపము, ఎంత
ఆక్రో శములో ఉన్నాడో చూడండి మహానుభావుడు. అంటే ఆయన అన్నాడు రామచంద్రమూర్తి
ఏమిటమ్మా చాలా గమ్మత్తు గా మాట్లా డుతున్నావు, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో
యదభికా౦క్షితమ్, కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. అమ్మా రాముడికి రెండు మాటలు
చేతకావమ్మా నీకు తెలీదా, రాముడు అంటే ఒక్కటే మాట, రాముడు కష్ట మా సుఖమా ఇవి
చూడ్డ మ్మా నువ్వు అడుగు అది ఏదయినా కానీ చేసస
ే ్తా ను. దానివల్ల నాన్నగారు సంతోషముగా
మళ్ళీ కూర్చుంటే అంతకన్నా నాకింకేమీ అక్కరలేదమ్మా, అది నాకు ఎంత కష్ట ము అవ్వనీ అఘ్నిలో
దూకెయ్యి రామా అని నాన్నగారంటే నేను దూకేస్తా నమ్మా, కానీ నాన్నగారు సంతోషముగా
కూర్చోవాలి. రామా నిష్కారణముగా నువ్వు సముద్రములో దూకి మునిగిపో అంటే ఎందుకని
అడగనమ్మా నేను దూకేసి మునిగిపో తాను కానీ నాన్నగారు సంతోషముగా కూర్చోవాలమ్మా నాకు
అది చాలు. రామా నువ్వు అరణ్యములు పట్టి వెళ్లి పో , వెళ్లి పో తానమ్మా నాకక్కరలేదు కానీ మా
నాన్నగారు సంతోషముగా కూర్చోవాలి.
నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్ ఋషిభిస్తు ల్యం కేవలం
ధర్మమాస్థితమ్. అమ్మా రాముడు రాజ్యము కోసము, ధనము కోసము, ఐశ్వర్యము కోసము
ప్రా కులాడేవాడు కాదమ్మా, నాకన్నవాళ్ళకి నే చెప్పుకోనా నా గురించి మీకు తెలీదామ్మా,
నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్ ఋషిభి నేను ఋషి లాంటి వాడినమ్మా,
నాకు పితృవాఖ్య పరిపాలనము తప్ప ఇంక ఏదీ అక్కరలేదమ్మా, నాన్నగారు చెప్పినమాట
కొడుకుగా నేను ఆచరించాను నాకు చాలు, నేను వెళ్లి పో తాను. పరమసంతోషముగా వెళ్లి పో తాను,
దానికెందుకమ్మా అంత స్నానము చెయ్యను భోజనము చెయ్యను ఎందుకమ్మా నాన్నగారు అంత
పట్టు బట్టా రు. అయ్యయ్యో పిచ్చినాన్నగారు నేను వెళ్లనని బెంగపెట్టు కున్నారా, ఇప్పుడే
వెళ్లి పో తున్నాడమ్మా రాముడు, మీరు బెంగపెట్టు కోకండి.
అమ్మా నాకు ఒక్కటే అర్ధ ము కావడము లేదు, న నూనం మయి కైకేయి కించిదాశంససే
గుణమ్, యద్రా జాన మావోచస్త ్వ౦ మమేశ్వరతరా సతీ. అమ్మా రాత్రి దశరాధమహారాజుగారిని నువ్వు
రెండు వరాలు అడిగాను నేను వెళ్లి పో వాలని, భరతుడికి పట్టా భిషేకము చెయ్యాలని
అడిగానంటున్నావు అమ్మా నీకయినా తెలియదా నాగురించి. రాముడు ఒకటి భరతుడు
ఒకటీనామ్మా నీకు, నీకు రామభరతులు ఇద్ద రూ ఒక్కటేనమ్మా, నీకు ఎప్పుడూ ఇద్ద రు కుమారుల
తల్లివే నువ్వు. నువ్వు నన్ను పిలిచి రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్లి పో , భరతుడు
పట్టా భిషేకము చేసుకుంటాడు అంటే నేను సంతోషముగా వెళ్లి పో నా అమ్మా, దానికి రెండు వరాలు
అడిగావా. అయ్యో అమ్మా నా గుణాలు నీకు ఇవా అర్ధ మయ్యాయి, ఎంత అమాయాకురాలవమ్మా,
ఇప్పుడే వెళ్లి పో తున్నాను, కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకు నీ పాదాలకు నమస్కారము చేసి
వెళ్లి పో వచ్చామ్మా అని అడిగాడు. ఎందుకని వెళ్లి పో తే తప్ప స్నానము చెయ్యడు అన్నము తినడు
అందని తొందరగా నమస్కారము చేసి వెళ్లి పో రామా అంది ఆవిడ.
అంటే ఈ మాటలు విని నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్
ఋషిభిస్తు ల్యం కేవలం ధర్మమాస్థితమ్. అమ్మా నాన్నగారు సంతోషిస్తే అఘ్నిలో దూకేస్తా నమ్మా
అని అమాయకముగా రాముడు ధర్మప్రతిజ్ఞ కు కట్టు బడినవాడయి, తండ్రి యందు అంత ప్రేమతో
మాట్లా డుతుంటే తట్టు కోలేక నా మాట కాదనే కొడుకు పుట్ట నందుకు ఇప్పుడు ఏడుస్తు న్నాను, నా
మాట వినే కొడుకు పుట్టా లి నా మాట వినే కొడుకు పుట్టా లి తండ్రిమాట కొడుకు వినాలని ఇన్నాళ్లు
అనుకున్నాను, నా మాట వినే కొడుకు పుట్ట డము నాకెంత శాపము అని ఇప్పుడు ఏడుస్తు న్నాను
కైకా, ఈ రాముడు నన్ను ఎదిరించడు, ఇది నా దుఃఖానికి కారణమయినది, నా మరణానికి
కారణమవుతోందని ఆ భాధ చేత స్పృహ తప్పి మరొకసారి ఒరిగిపో యాడుట దశరధమహారాజు.