You are on page 1of 13

 

Home
Contact Us

Sripada Vallabha »
SSGSS Trust »
Biksha Donation
Vratalu & Pujalu »
Downloads
Contact Us »
SSGSST Groups »

Menu

Dattachalam

Women Special Datta Kshetram – Dattachala Kshetram (Dattalaya Gutta)

మహిళా దత్త క్షేత్రం – దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట )

(Published in 2012)

దత్త బంధువులందరికీ నమస్కారములు,

రెండవ దత్తా వతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి గురించిన రహస్య సమాచారమేదైనా ఉంటే తెలపమని శ్రీపాద శ్రీ వల్ల భుల వారిని నేను తరచూ నా మనసు
లోనే అడిగే వాడిని. ఒక రోజు నాకు ప్రముఖ శ్రీపాద శ్రీ వల్ల భ భక్తు లైన శ్రీ మల్లా ది వెంకట భాస్కర రావు గారి (న్యూ ఢిల్లీ) దగ్గర నుండి స్పీడ్ పో స్ట్ లో ఒక పార్సిల్
వచ్చింది. ఆ పార్సిల్ ఇవ్వడానికి వచ్చినతను నాదగ్గర సంతకం తీసుకుంటుంటే నా మొబైల్ ఫో న్ మోగింది నా మొబైల్ ఫో న్ కు నేను రింగ్ టోన్ గా
“దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్ల భ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..” అనే ట్యూన్ సెట్ చేసుకున్నాను. అది విన్న అతను “ఈ
నరసింహ సరస్వతి ఎవరు? మా జోగిపేట దగ్గర ‘ఒక గుట్ట’లో కుడా ఇదే పేరుని విన్నాను” అని చెప్పాడు. నేను నరసింహ సరస్వతి స్వామీ వారి గురించి చెప్పి అతని
దగ్గర ఉన్న అస్పష్టమైన సమాచారాన్ని, అడ్రస్ ను తీసుకోని మొత్తా నికి అతను చెప్పిన గుట్ట చేరాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది ఒక అతి రహస్యమైన
దత్త క్షేత్రమనీ , శ్రీపాదుడు తన పాద స్పర్శతో పునీతం చేసిన ప్రదేశమనీ, నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రాంతమనీ,
గురుచరిత్ర వ్రా సిన నామధారకుడు తన అంత్యకాలంలో ఇక్కడే గడిపాడని తెలుసుకొని ఆశ్చర్యపో యాను. అక్కడ ఉండే దత్తా త్రేయుని రూపం చూసి మరింతగా
ఆశ్చర్యపో యాను. వెంటనే స్థా నికులను, పూజారి గారిని కలిసి భక్తు లందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తు న్నాను. ఆస్వాదించండి.

దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్ల భ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..

- Keerthi Vallabha (keerthivallabha@gmail.com)


 

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట ) ఎక్కడుంది?

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట) మెదక్ జిల్లా లో నర్సాపూర్ కు దగ్గర లో గల హత్నురా మండలం లోని Madhira (Maadaram Village) మాధిర (మాదారం) గ్రా మ
శివార్లలో ఉంది.

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట ) ను ఎలా చేరుకోవాలి?

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట) ను సొంత వాహనాలలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కీ.మీ. దూరం ఉంటుంది. అక్కడి
ప్రజలని రూట్ అడిగేటప్పుడు ‘మాధిర’ కు బదులుగా ‘మాదారం’ అని అడిగితే సులభంగా గుర్తు పడతారు. టూవీలర్ మీద వెళ్ళేవారు హత్నురా ITI లోపల నుండి /
ఫో ర్ వీలర్ పై వెళ్ళేవారు ITI పక్కనగల మట్టి రోడ్డు ద్వారా సులభంగా దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట) ను చేరుకోవచ్చు.

Dattachalam (Dattalaya Gutta, Madhira / Maadharam Village) Route


Balanagar----> Jeedimetla----> Gandi Maisamma X Roads ----> ORR ----> Narsapur Road---->Dundigal----> Gummadidala---->Nallapalli
Forest Belt---->Narsapur----> Left Side Road At Narsapur Ambedkar Statue---->Doulatabad Road -----> Doulatabad-----> Right Side Road At
Doulatabad 'Y' Junction---->Hatnura Road----> Hatnura---->Konyaal Road---->Maadhira Village -----> Dattachalam (Dattalaya Gutta)

Dattachalam (Dattalaya Gutta, Madhira / Maadharam Village) Route

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట ) ప్రత్యేకత ఏంటి?

ఏక పాద దత్త క్షేత్రం


శ్రీపాద శ్రీ వల్ల భులు తమ 16వ ఏటా పిఠాపురంలో సన్యాస దీక్ష తీసుకోని, ఇంటినుండి బయలుదేరి ఉత్త రదేశ ముఖంగా వెళ్లి అనేక క్షేత్రా లను దర్శించి తరువాత
గోకర్ణం చేరి అక్కడ 3 సంవత్సరాలకాలముండి, దత్తా చలం చేరి అక్కడి గుహలలో గల మహాసిద్ధు లను ఆశీర్వదించి, దగ్గరలో గల మంజీరా నదిలో
స్నానమాచరించి, దత్తా చలక్షేత్రం మీదుగా శ్రీశైలం చేరారని ఇక్కడి స్థ ల పురాణం.
నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రదేశమిది
నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుడు మరియు గురుచరిత్ర వ్రా సిన నామధారకుడు తన అంత్యకాలం మొత్తం ఇక్కడే గడపడం విశేషం
మంజీరానది కి (సుమారు 8 కీ.మీ. దూరంలో) సమీపం లో గల దత్త క్షేత్రం
దత్తా లయగుట్టకు సమీపంలోనే అన్ని విధాలా కాశీ విశ్వేశ్వరుడిని పో లిఉన్న కాశీపతి దేవాలయం కలదు. ఈ గుడి వద్ద నే శ్రీగురుని ఏక పాదముద్ర గలదు
శ్రీచక్రా న్ని కలిగి ఉన్న ఏకైక దత్తా త్రేయుడు
ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తా త్రేయుడు కొలువుతీరి ఉండడం వల్ల ఈక్షేత్రం “మహిళా దత్త క్షేత్రం” గా వెలుగుతోంది (ఇక్కడి గుడి నిర్మాణ కార్యక్రమమును
ప్రా రంబించింది కుడా ఒక మహిళా మంత్రే!)
ఇక్కడ న్యాయబద్ధ మైన కోరిక కోరిన మహిళలు, అవి తీరకుండా నిరాశ పొందిన మహిళ ఒక్కరు కుడా లేరట.
ఇక్కడ కొలువుతీరిన దత్తు డి రూపం మనం ఊహించనిదిగా, ముందెప్పుడూ చూడని విధంగా ఉంటుంది.

శ్రీచక్రం లేదా శ్రీయంత్రం అంటే ఏమిటి? ప్రా ముఖ్యత ఏంటి?

కొన్ని అవ్యక్త తాంత్రిక సిద్ధాంతలాధారంగా గొప్ప గణిత శాస్త్రీయ విధానంలో, తనకు తానై ఆవిష్కరించుకొన్నటువంటి మహాయంత్రం శ్రీచక్రం. సృష్టి వైచిత్రినీ, రహస్యాలను
ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టములను సిద్ధింప చేయగలిగినటువంటి యంత్ర రాజం మరొకటి లేదు.

శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఒక పవిత్రమైన యంత్రం. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన త్రిభుజాలు కేంద్రంలోని బిందువు చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీలలితా
లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతుంది. దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వ ముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుషుణ్ణి సూచిస్తా యి. అయిదు త్రిభుజాలు
నిమ్న ముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తా యి. అందువలన శ్రీచక్రం స్త్రీ-పురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని
నవయోని చక్రం అని కూడా అంటారు.

శ్రీచక్రం గురించి ఇంకా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

దత్తా చలక్షేత్ర సందర్శనలో ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి?

దత్తా చలక్షేత్రా న్ని దర్శించు కోవాలనుకునే వారు పుజాసామగ్రిని వెంటతీసుకోని వెళ్ళడం మంచిది. అలాగే దత్తా చలక్షేత్ర పూజారి అయిన శ్రీ సభాపతి శర్మ గారిని ఫో న్
ద్వారా (09247334660) సంప్రదించి వెళ్ళడం మంచిది. దయచేసి గమనించండి దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట) పరిసర ప్రాంతాలలో పాములు (Indian King Cobra),
చిరుతపులుల (Chita) సంచారం ఉన్నట్లు గా సమాచారం. కాబట్టి తగినన్ని రక్షణ చర్యలు తీసుకోని వెళ్ళడం మంచిది. సాయంత్రం, పొ ద్దు పో యే వేళల్లో వెళ్ళడం
నిషేదం. గుమ్మడిదల నుండి నర్సాపూర్ మధ్యలోగల దట్టమైన అటవీ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వచ్చే హెవీ ట్రక్కులు, ఆర్టిక్యులేటేడ్ లారీలతో నిండి ఉండే ఈ
ఘాట్ రోడ్లో డ్రైవింగ్ జాగ్రత్త లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం పూట అయితే (6.30 AM To 12.30 PM వరుకు) డుండిగల్ దగ్గర గల SGS (శ్రీ గణపతి
సచ్చిదానంద) ఆశ్రమాన్ని కుడా ఇదే దారిలో దర్శించుకోవచ్చు.

దత్తా చలక్షేత్ర (దత్తా లయగుట్ట ) స్థ లపురాణం

రెండవ దత్తా వతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాణ్గా పురము నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి వద్ద గల శిష్యులకు సనాతన ధర్మములను
ఉపదేశించేవారు. వారి శిష్యగణంలో అతి ముఖ్యమైనవారు శ్రీ నామాధారకులు. నామధారాకుల వారు గురు ఆశీర్వాదం మెండుగా కలిగినవారు, మరియు గృహస్తు
కుడా. వారు అనేక వేదములను అధ్యయనం చేసి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సేవలో గడిపి శ్రీగురుని (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) వద్ద నుండి అనేక
గురుసేవా రహస్యాలను తెలుసుకున్న దత్త దైవాంశ సంభూతులు. అలాగే గురు చరిత్రను మనకి అక్షర రూపంలో అందించినది కుడా ఈయనే. ఇటువంటి స్థి తిలో గల
నామధారాకుల వారు శ్రీగురుని విడిచి క్షణమైనా ఉండలేకపో యేవారు. ఒకానొక సమయంలో శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) 12 సంవత్సరాల పాటు
గాణ్గా పురమును విడిచి తపస్సు చేసుకొనుటకు వేరే ప్రాంతానికి వెళతారు. ఆ ‘గురు ఎడబాటు’ తట్టు కోలేని నామధారకుడు గురువు గారి జాడ కోసం అనేక
ప్రయత్నాలు చేసి ఆఖరుకు శ్రీగురుడు దత్తా చలక్షేత్రం లో తపస్సు చేసుకొంటున్నట్లు గా తెలుసుకుంటారు. ఆ తరువాత ఒకానొక మాఘ బహుళ పాడ్యమి రోజు
శ్రీగురుడు నిర్హరితం చెందినట్లు గా తెలుసుకొని ఎంతో దుఃఖించి, విరక్తి చెంది, ముందు లాగే మళ్లీ ఎలాగైనా దత్తా చలక్షేత్రం లో కనబడవచ్చనే నమ్మకంతో దత్తా చలం వచ్చి
శ్రీగురుని కోసం ఘోరంగా తపస్సు చేస్తా రు. నామధారాకుల వారి అచంచల గురు భక్తికి మెచ్చి శ్రీచక్ర సమేతంగా శ్రీదత్తా త్రేయుల వారు ప్రత్యక్షమై, వెంటనే శ్రీ నరసింహ
సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చి జనన-మరణ-వైరాగ్య బో ధనలను ఉపదేశించి, వారి పాదుకలను (నిర్గు ణ పాదుకలు – ప్రస్తు తం మనం చూసే నిర్గు ణ పాదుకలు
అవే) శ్రీ నామధారాకులవారికిచ్చి, వాటిని గాణ్గా పుర ఆశ్రమంలో ప్రతిష్టించి నిత్యపూజలు చేస్తూ సనాతనధర్మములను భక్తు లకు భోదించమని చెప్పి
అంతర్ధా నమవుతారు. అంతట శ్రీగురుని ఆదేశానుసారం శ్రీ నామదారకులు శ్రీగురుని పాదుకలను ప్రతిష్టించి సనాతనధర్మప్రచారం చేస్తూ కాలం గడుపుతారు. శ్రీ
నామదారకులు వృద్దా ప్యం లోకి వచ్చిన తరువాత మళ్లీ శ్రీగురుని వెతుక్కుంటూ దత్తా చలం చేరి దత్తా చలగుట్ట వద్ద గల దత్త కొలను లో నీటి మీద కుర్చుని అన్న,
పానీయాలు మాని శ్రీగురుని దర్శనభాగ్యం కోసం తపో నిష్టలో ఉండేవారు.

దాదాపుగా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే నవాబ్ (రాజు – King) గారి ఒక్కగానొక్క కూతురికి రాచపుండు (Cancer) వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ నవాబ్
గారు కూతురుని బతికించమని అనేక మంది వైద్యులను కలుస్తా రు. అందరు వైద్యులు కుడా ఈ జబ్బు తగ్గదని, త్వరలోనే మరణం తధ్యమని చెపుతారు.
అయినప్పటికీ నవాబ్ గారు ఏదైనా ఉపాయం చెప్పమని వైద్యులని వేడుకుంటాడు. ఆ వైద్యులలో ఒక వైద్యుడు ” మీ కూతురు మరణించకుండా ఆపలేము కాని ఆ
మరణాన్ని వాయిదా వేయుటకు ఒక సలహాగలదు” అని చెపుతాడు. అంతట ఆ నవాబ్ గారు ఆ సలహా ఏమిటో చెప్పమని వేడుకొనగా “మీ కూతురిని నగర కాలుష్యం
నుండి దూరంగా అడవికి తీసుకుని వెళ్లి అక్కడ లభించే సహజ ఫలాలు, తెనేవంటివి ఇస్తే మరొక రెండు నెలలు బ్రతకవచ్చు” అని సలహా ఇస్తా డావైద్యుడు.

వెంటనే నవాబ్ గారు రాజ్యాన్ని వారి తమ్ముడికి అప్పజెప్పి కొంత మంది పని వారిని తీసుకోని కూతురితో సహా దట్టమైన అడవులలోకి వెళతారు. పనివారు ఆహార
సేకరణ లో భాగంగా దత్తా చలగుట్ట దగ్గరకు వస్తా రు. అక్కడ గల కొలనులో నీటి మీద కుర్చుని తపో నిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆశ్చర్యపో యి ఆ
సమాచారాన్ని నవాబ్ గారికి అందిస్తా రు. అప్పుడు ఆ నవాబ్ గారు నీటి మీద కుర్చుని తపో నిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆయన వద్ద కు వెళ్ళాలా? వద్దా ?
పైగా ఆయన హిందూ మతస్తు డు, నేనేమో మహామ్మదియుడిని అని ఆలోచిస్తా రు, ఈయన ఎలాగైనా నా కూతురుని రక్షించగలరని మనసులో అనుకోని శ్రీ
నామదారకుడి వద్ద కు వెళతారు, తమ కూతురిని రాచపుండు (Cancer) వ్యాధి నుండి రక్షించమని వేడుకుంటారు. దానికి సమాధానంగా శ్రీ నామదారకుడు “అయ్యా
రాజు గారు, నేను ఒక సాధారణ బ్రా హ్మణుడను. నావద్ద ఎలాంటి మంత్ర విద్యలు కాని, వైద్య విద్యలు కాని, సంజీవిని కాని లేదు. జీవితం పై విరక్తి చెంది, పెళ్ళాం బిడ్డ లను
వదిలి సన్యశిస్తు న్న సాధారణ సన్యాసిని నేను, తపో భంగం కలిగించవద్దు దయచేసి వెళ్ళిపోండి” అని చెబుతారు.

నవాబ్ గారు ఆరోజుకు వెళ్లి పో యినా ఆరోజు నుండి ప్రతీ రోజు వచ్చి శ్రీ నామదారకుల వారిని తగిన నివారణోపాయాన్ని తెలపమని ప్రా ర్ధిస్తూ నే ఉంటారు. ఆఖరుకు ఒక
రోజు శ్రీ నామదారకుల వారు ఈ దత్త కొలను లోని నీటిని తీసుకువెళ్లి మీ కూతురికి త్రా గించి, రాచపుండు కురుపును (Cancer Wound) రోజూ కడుగుతూ ఉంటే

శ్రీగురుని దయతో నయం అవుతుందని చెపుతారు. శ్రీ నామదారకుల ఆజ్ఞా నుసారం ప్రతీ రోజూ నవాబ్ గారు వారి కూతురికి దత్త కొలను లోని నీటిని తీసుకు వెళ్లి
త్రా గించి, రాచపుండు కురుపును (Cancer Wound) కడుగుతూ ఉండగా కొద్ది రోజులలనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన
కూతురుని తిరిగి రాజ్యంలో దిగబెట్టి సంతోషంతో నవాబ్ గారు దత్తా చలం చేరి శ్రీ నామదారకుల వారిని కలసి ఏమైనా బహుమతి కోరుకోనమనగా సన్యాసి అయిన నాకు
ఏమి అవసరం లేదని, ఏదైనా ఉంటే దత్తు డికి ఇచ్చుకోమని, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెబుతాడు. అంతట ఆ నవాబ్ గారు దత్తా చలగుట్ట నుండి
అష్టదిక్కులలో ఎటు చూసినా 1000 ఎకరాల భూమి స్వామీ వారి పేరు మీద రాగి పత్రా ల పై రాయించి అక్కడ పెట్టి వెళ్లిపో తాడు. ఆవిధంగా శ్రీ నామదారకుల వారి పేరు
ఇతరప్రాంతాలకు వ్యాపించింది.
శ్రీ నామదారకుల వారి జాడ తెలిసిన వారి భార్య- పుత్రు లు దత్తా చలక్షేత్రం వచ్చి కుటుంబ పో షణ కష్టంగా ఉంది, దయచేసి సన్యాసదీక్ష విరమించవలసిందిగా కోరతారు.
అందుకు ససేమిరా అన్ననామదారకుడు ఈ గుట్టకు దూరంగా నవాబ్ గారు ఇచ్చిన 1000 ఎకరాల భూమిలో కేవలం ఉదార పో షణ నిమిత్తం ఎంత అవసరమో అంత
భూమిని మీరు సాగుచేసుకోవచ్చని చెప్పి, తనకు మాత్రం తపో భంగం కలిగించవద్ద ని , తాను అనతి కాలంలోనే గొప్ప ఆధ్యాత్మిక స్థి తికి చేరుకోబో తున్నట్లు గా చెప్పి
దత్తా చలక్షేత్ర గుట్ట మీద గల గుహలో తీవ్ర తపమాచరించడానికి సమాయత్త మవుతారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత ఒక రోజూ వారి కుమారుడైన
శ్రీ సూర్యభట్టు కు స్వప్నంలో శ్రీ నామదారకుల వారు కనబడి “కుమారా… నేను దత్తా త్రేయస్వామీలో లయం చెందాను. దత్తు డుకి ప్రతీ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ షష్టి
నుండి మార్గశీర్ష పౌర్ణమి వరకు (దత్త జయంతి) ఉత్సవాలు జరిపి, చివరి రోజైన దత్త జయంతి రోజున అన్నసంతర్పణ జరిపించవలసిందిగా మనవి” అని చెపుతారు.

శ్రీ నామదారకుల వారు దత్తా త్రేయునిలో లయం చెందిన కారణంగా ఈ ప్రాంతాన్నే “దత్తా లయగుట్ట” అనికూడా పిలుస్తా రు. శ్రీ నామదారకుల ఆదేశానుసారం నాటినుండి
(600 సంవత్సరాల నుండి) నేటి వరుకు వారి వంశస్థు లు ప్రతీ సంవత్సరం ఉత్సవాలను జరుపుతున్నారు.

శ్రీ నామదారకుల వారిని లయం చేసుకోవడానికి విచ్చేసిన శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) మొదటి పాదం మాధురగ్రా మ పరిసరాల్లో గల కాశీపతి
దేవాలయం దగ్గర పెట్టగా రెండవపాదం దత్తా చలగుట్ట మీద మొదటి పాదానికి అభిముఖంగా పెడతారు. ఈ రెండు చోట్లా ఏకపాద ముద్రలే ఇక్కడ ఉంటాయి, మరియు
ఈ రెంటి మధ్య సుమారు 1 కీ.మీ. పైన దూరం ఉంటుంది. ఇవి శ్రీగురుని అసలైన పాదముద్రలు. వెంటనే శ్రీ నామదారకులు దత్తా చలగుట్ట పై రెండవ పాదముద్రను
ప్రతిష్టించి శ్రీగురునిలో లయంఅవుతారు.

ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు

ప్రతీ పౌర్ణమి మరియు అమావాస్యలకి ఇక్కడ అర్ధరాత్రి 2.00 గంటల నుండి 2.30 గంటల మధ్య ఈ గుట్టలో ‘ఓం’ కార శబ్దం ధ్వనిస్తుంది. శక్తి, ధైర్యం,ఈ ఓంకార
శబ్దా న్ని వినాలనుకునే ఆశక్తిగల వారు ఇక్కడి పూజారి అయిన శ్రీ సభాపతిశర్మ గారికి చెబితే వారు మీరు రాత్రికి దత్తా చలగుట్ట మీద ఉండడానికి బస ఏర్పాటు
చేస్తా రు.
దత్తా చలగుట్ట మీద వెలసిన దత్తా త్రేయుని పాదముల వద్ద మన చెవిని ఆనించి ప్రశాంతంగా వింటే అన్నివేళలా “ఓం” కార శబ్దం వినిపిస్తుంది.
మనుష్య సంచారం ఉండని సాయంత్ర వేళల్లో , తెల్ల వారు ఝామున భయానకరూప దిగంబరులని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు.
అప్పట్లో నవాబ్ గారు రాసిచ్చిన 1000 ఎకరాల భూమి లో ప్రస్తు తం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 ఎకరాలూ “శ్రీ దత్తా త్రేయ స్వామి” వారి పేరు మీద
రిజిస్ట్రేషన్ చేయబడినది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను మనం చూడవచ్చు. ( గడచిన 600 సంవత్సరాలలో నవాబులు పో యారు, నిజాం పాలన పో యింది, బ్రిటీష్
పాలన పో యింది, ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది, మద్రా స్ తో పాటు ఉన్న ఉమ్మడి రాష్ట్రం పో యింది, కర్నూల్ రాజధాని మారి హైదరాబాద్ వచ్చింది,
కరణీకం పో యింది – ఇన్ని మార్పులు రావడం వల్ల రికార్డు లు మార్చి విలువైన దత్తా త్రేయుని భూమి కబ్జా చేయబడినది)

దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట ) క్షేత్ర నిర్వాహకుల సమాచారం

శ్రీ సభాపతి శర్మ(బాబు పంతులు) – శ్రీ నామధారకుల వంశీకులు మరియు దత్తా చలక్షేత్ర పూజారి Mobile No: 09247334660, కాశీపతి దేవాలయం తాళం చెవి
ఉన్న, ఏక పాద ముద్రను చూపించగల మాధుర గ్రా మ స్థా నికులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ Mobile No: 9949687780.

Photos of Dattaachla Kshetram (DattaalayaGutta) దత్తా చలక్షేత్రం (దత్తా లయగుట్ట ) ఫో టోలు


Jai Guru Datta

Notice Board
Events
Unrevealed Secrets of Sripada
SPSV Travel Desk
Shodasa Dattavataaralu
Sri Vasavi Kanyaka

Sacred Trees of SPSV


SPSV Charitamrutham
Malladi G Deekshitulu
Siddhamangala Sthotram
SPSV Stuthi
Sri Guru Astakam

FAQs
Over View Of Trust
Trustees & Members
Activites
Biksha Donation
Deekshalu

Pujalu
Vrathalu
Anaghastami Vratham
Downloads
Reach Us
Sripada Vallabha

© 2022 KeerthiVallabha

You might also like