You are on page 1of 23

కామాఖ్యాదేవి

ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి.


Learn more

ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు.


Learn more

ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి


ఎవరనే వాదం అనవసరం. ఎన్నో కోట్ల మైళ్ల
దూరంలో ఎప్పటినుంచో అలా ఉన్న నక్షత్రా లు
భూమ్మీదకు రాలిపడకుండా ఉన్నాయంటే దానికి
ఇప్పటి శాస్త్రజ్ఞు ల ప్రయోగాలు కారణం కాదు!
ప్రస్తు తం వాటిమీద ప్రయోగాలైతే చేస్తూ , ఇంకా
కొత్తవి ఉన్నాయంటున్నారు గానీ, ఇతమిత్థంగా
నిర్ణయించలేక పోతున్నారు. కాబట్టి నీకు, నాకూ,
మనకందరకూ ఆ శక్తే దైవంతో సమానం. సమాన
మేమిటి దైవమే. ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు
వెయ్యలేం. చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే!
శివునికి, శక్తికి తేడాలేదు. శివ అంటే శివుడు. శివా
అంతే శివానీ అని అర్థం. అందుకే జగద్గు రు
ఆదిశంకరాచార్యుల వారు ‘శివశ్శక్త్యాయుక్తో ’…
అంటూ తమ సౌందర్యలహరిని ప్రా రంభిస్తా రు.
కాళిదాస మహాకవి కూడా ఆది దంపతులను వాక్కు,
అర్థంగా పోల్చాడు. అలాంటి ఆ శక్తి స్వరూపుణి
వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం
కామాఖ్యాదేవిమందిరం. సుప్రసిద్ధమైన అష్టా దశ శక్తి
పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి
క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డు న,
గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. అస్సాం రాజధాని
గౌహతికి రైలు, విమానం, యాత్రా ట్రా వెల్స్ ద్వారా
కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు ,
రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని
మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే
సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ
సీమలో చెరగని స్థా నాన్ని పదిలపరచుకుంటుంది. ఆ
అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి
ఇక్కడికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలాచల
పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తా యి.
గుబురుగా, దట్టంగా దారి కనిపించనంత ఎత్తు గా
పెరిగిన చెట్టతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న
నీలాచలం - ఈ పర్వతం దిగువ అంచు తాకుతూ
ప్రవహిస్తు న్న బ్రహ్మపుత్ర నదీ జలం. ఇంత
రామణీయకతను దర్శించిన భక్తు ల జన్మ సఫలం.
దీన్నంతా చూసిన భక్తు లు ఎంతగానో పరవశులై
పోతారు. ఇంత అందమైన ప్రకృతి సోయగాన్ని తమ
మనుగడకు వరంగా ఇచ్చిన పరమేశ్వరికి
కృతజ్ఞతానుభూతిని తెలియచేసుకుంటారు. ఈ
పర్వతంపైనే శక్తి పీఠం ఉంది. ఒకటిన్నర కిలోమీటర్ల
ఎత్తు న్న ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీలపై
చేరుకోవచ్చు. అమ్మను దర్శించుకోవచ్చు.
Kamakhya

సంస్కృత అనువాదం Kāmākhyā

అనుబంధం దేవి
నివాసం కామాఖ్య
మంత్రం కామాఖ్యే వరదే దేవి
నీలాపర్వత వాసిని త్వం
దేవి జగతాం మాతా
యోనిముద్రే నమోస్తు తే
ఆయుధములు sword, trident, discus,
shield, bow, arrows,
club, lotus, bell, goad,
kapala, conch

భర్త / భార్య శివుడు


వాహనం సింహం

ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి


అని పిలుస్తా రు. సామాన్యంగా కామం అంటే శారీరక
చిత్త చాంచల్యంగా భావిస్తా రు. కానీ, అసలు
కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న
రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని
అర్థం. అలా చెయ్యగలగిన శక్తిమంతురాలు కాబట్టే
కామరూపిణి అయింది. కామాఖ్య దేవి అనేక
రూపాలు ధరించి భక్తు లకు చేరువై వారి వారి
కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది.
కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా
కొలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మూడు
ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది.
అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర
భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని
పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా
ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది.
పరమే శ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు
త్రిపురసుందరిగా మారుతుంది. ఇంకా అనేక
రూపాలు ధరించగల తల్లి ఈమె. ఆలయానికి
వచ్చిన భక్తు లకు ముందుగా స్వాగత ద్వారం
ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో
ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో
చూడముచ్చటగా కనిపిస్తూ భక్తు లను అమ్మవారి
దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తు న్నట్టుంటుంది. స్వాగత
ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే అక్కడ
స్థూ పాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం
దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి
శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి
చూపిస్తుంటాయి. ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు
మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా
కనిపిస్తుంది. కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం
కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి
ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు
కలశం స్థా పితమై ఉంది. అలాగే, మిగిలిన గోపుర
శిఖరాలపై త్రిశూలాలు స్థా పితమై ఉన్నాయి. ప్రధాన
గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి
ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు
విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. ఇందుకో పురాణ
కథ ఉంది. భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా
తన తండ్రి దక్షప్రజాపతి యాగాన్నే చేయాలను
కోవడమే కాకుండా, వచ్చిన తనను కూతురని కూడా
చూడకుండా అవమానించినందుకు సహించలేని
సచీదేవి యజ్ఞ గుండం వద్దనే అగ్నికి ఆహుతై
పోతుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు
అగ్రహోదగ్రు డై వీరభద్రు ణ్ణి సృష్టించి యజ్ఞా న్ని భగ్నం
చెయ్యమని పంపిస్తా డు. తనలో అర్థభాగమైన భార్య
తనను విడిచి ఎక్కడకూ పోలేదని తెలిసిన
పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని
పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య
మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా
తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణు వు
పార్వతీ దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తా డు. అలా
ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లా చెదురై వివిధ
ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మ వారి
ప్రధానమైన యోనిభాగం గౌహతి వద్ద నీలాచలంపై
పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థా నం
కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లో కెల్లా అత్యంత
ప్రా ముఖ్యతను సంతరించుకుంది. అంతే కాకుండా
ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థా నంగా
భావిస్తా రు. అలాగే, ఈ శక్తి పీఠాన్ని మహాయోగ
స్థలమని పిలుస్తా రు. నీలాచలంపై దేవి యోని భాగం
పడి ఈ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ రాతి
యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని
అంటారు. ఇక్కడకు వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి
తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి
చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు. దేవతల
పంపుపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు
వచ్చిన మన్మథుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు
దగ్థం చేశాడు. అనంతరం రతీదేవి ప్రా ర్థనను ఆలించి
ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు
అమ్మాఅయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప
ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలూ పర్వత
రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు.
ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠా న దేవత నీల పార్వతి.
రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుని పట్ల భక్తి
భావంతో ఉండే వాడు. అందుకు మహావిష్ణు వు
మోచ్చి అతనికి ప్రా గ్జ్యోతషపురానికి రాజును
చేస్తా డు. కామాఖ్యాదేవిపై భక్తితో ఉంటే నీవా
పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని
చెబుతాడు. కానీ, మరో ద్వాపరయుంగాంతంలో
శోణితపురానికి బాణాసురుడు రాజయ్యాడు. అతని
ప్రో ద్బలంతో నరకుడు దేవతలకు శత్రు వుగా మారి
కామాఖ్యాదేవినే పెళ్ళి చేసుకొమ్మని కోరతాడు.
అప్పుడా తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గా న్ని
తలపించే విధంగా భవనాల్ని సృష్టించ గలిగితే
చేసుకుంటానంటుంది.వెంటనే అతను విశ్వకర్మను
పిలిచి ఆ పని అప్పచెబుతాడు. పని పూర్తయ్యే
సమయానికి మాయా ప్రభావంతో కోడి కూస్తుంది.
దాంతో వివాహం ఆగి పోతుంది. అందుకే కామాఖ్యా
మందిరం వెళ్లే మార్గా న్ని నరకాసురమార్గంగా
పిలుస్తా రు. కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని
కామదేవ మందిరంగా పిలుస్తా రు. ఈ లోపలెక్కడా
నరకుని ప్రసక్తి వినిపించదు. అలాంటి
కామమోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని
దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తు లిక్కడకు
తరలి వస్తా రు.

ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.12వ శతాబ్దం


వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి
తమ శాసనాల్లో ఆలయం ప్రస్తా వన ఎక్కడా
తీసుకురానప్పటికీ, తరువాతి వారి శాసనాల మేరకు
కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు
తెలుస్తోంది.13వ శతాబ్దం మొదట్లో గుత్తా ధిపత్యం
కోసం రాజుల మధ్య యుద్ధా లు ఎక్కువగా
జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా
విశ్వసింహ్ రాజయ్యాడు. ఒకసారి జరిగిన
యుద్ధంలో అయినవాళ్లనందరినీ కోల్పోయి వారిని
వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తా డు
విశ్వసింహ్. ఇక్కడితనికి ఒక వృద్ధు రాలు కనిపించి
సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన
మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్ని స్తా డు రాజు.
ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ
కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే
రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని
కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు
వస్తా రు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు
శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తా నని
మొక్కుకుంటాడు. అలాగే, అతని రాజ్యం
సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు
రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా
అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది.
ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తు లో
బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార
గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తా డు.
కామాఖ్యా దేవీ మందిరం అధిష్ఠా న దేవత భైరవి
కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా
అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా
అమ్మాఅయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు
ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి
తూర్పుభాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి
ఉన్నాడీ స్వామి. అందుకే మందిరం కింద
ప్రవహిస్తు న్న నీటి ప్రవాహాన్ని కూడా మనం
చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగస్వరూపంలో
దర్శనమిస్తా డు. ఈ లింగాన్ని చూడగానే మనసంతా
భక్తిభావంతో పులకించి పోతుంది. ఇక్కడకు
పడవలపై చేరుకోవచ్చు. అమ్మవారిని దర్శించేందుకు
ముందే ఈ స్వామిని దర్శించాలి. ఈ స్వామిని
దర్శించని పక్షంలో అమ్మ వారి యాత్ర పూర్తిగానట్టే
పరిగణిస్తా రు భక్తు లు. అందుకే తప్పనిసరిగా
ఇక్కడకు వచ్చిన వారంతా ముందుగా ఉమానంద
భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతారు.
ఇక్కడకు చేరుకుంటుంటే వశిష్ఠు డు తపస్తు చేసుకునే
ప్రాంతం కనిపిస్తుంది. వశిష్ఠా శ్రమాన్ని చూస్తుంటే
నిజంగా మనం మునివాటికకే వచ్చామా అనిపించక
మానదు. ఎటు చూసినా చూసినా పచ్చ దనమే.
బండరాళ్ల మధ్య నుంచి జలజల పారుతున్న నీటి
ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది. దీన్ని
వశిష్ఠ గంగ అంటారు. ఆ ప్రవాహ ఝరికి పైకి లేచే
నీటి తుంపరులు పరిసరాల్ని ఆహ్లా దపరుస్తా యి.
ఇక్కడ ఎంతో మంది స్నానాలు చేస్తా రు. ఇక్కడ
విఘ్న నివారకుడైన వినాయకుని విగ్రహం, విద్యలకు
అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనం
ఇస్తా యి. ఇక్కడ ఉన్న ఒక మందిరం కనిపిస్తుంది.
దాని బయటా, లోపలా కూడా ఆద్యంతం దేవతా
మూర్తు లు, రాజుల విగ్రహాలు చెక్కి కనులకు విందు
చేస్తా యి. లోపల గీతాచార్యుని విశ్వరూప
సందర్శనం, త్రిమూర్తు ల తైలవర్ణ చిత్రా లు
కనిపిస్తా యి. ఇంకా గోడలపై అనేక భంగిమల్లో
వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు.
ముద్దు లయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు
భక్తిని కూడా పెంపొందింపచేస్తు న్నాడు.
లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో
దేవతా మూర్తు ల విగ్రహాలు దర్శనమిస్తా యి.
అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందే ఒక పుష్కరిణి
కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని
ఇంద్రా ది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి
ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం
వస్తుందని భక్తు ల భావన. ఇందులో నీరు
ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం,
పాతక వినాశ కుండం అని పిలుస్తా రు. అమ్మ వారి
యోని స్రా విత పవిత్ర జలలాతో పునీతమైన ఈ
కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా
నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ
మవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా
వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి
కుండం. ముందు కుండంలో స్నానం చేసిన
భక్తు లంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి
దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో
స్నానం చేసిన భక్తు లు ఆలయంలోని యోని
శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి
యోని స్రా విత జలాన్ని తీర్థంగా సేవిస్తా రు. ఈ
కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో
మరో సారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని
ఇక్కడి పూజార్లు చెబుతారు. కామాఖ్యాదేవిని
దర్శనానికి లోనికి వచ్చిన భక్తు లకు అక్కడకు
సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తా డు.
ఆయనను దర్శించుకుని అనంతరం అమ్మవారి
దర్శననానికి వెడతారు. కామాఖ్యే వరదే దేవీ:
నీలపర్వత వాసినీ… త్వం దేవీ జగతం మాతా:
యోనిముద్రా నమోస్తు తే’ అని ప్రా ర్థిస్తూ లోనికి
ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు.
అనంతరం అమ్మవారి దర్శనానికి బారికేడ్లలో
నిల్చొని క్రమపద్ధతిలో ముందుకు నడుస్తా రు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగుపెడుతుంటే
మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తు లకు పన్నెండు
స్తంభాల మంటపం మధ్య దేవి ఉత్సవ మూర్తి
కనిపిస్తుంది. ఈ తల్లినే హరగౌరి మూర్తి, భోగమూర్తి
అని పిలుస్తా రు. ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ
వాహనుడు, పంచవక్త్రుడు, దశాభుజ విశిష్టు డు,
కామేశ్వర మహాదేవ మూర్తు లు కనిపిస్తా రు. దక్షిణ
భాగంలో షడాననుడు, ద్వాదశ బాహు విశిష్టు డు,
అష్టా దశలోచన, సింహవాహిని, కమలాసనదేవి
మూర్తి దర్శనమిస్తుంది. ఈ తల్లినే మహామాయ
కామేశ్వరీ పేరుతో పిలిచి కొలుచుకుంటారు.
వీరందరిని చూసుకుంటూ మెట్లు దిగుతుంటు
కామాఖ్యాదేవి శిలాయోని పీఠ మందిరం వస్తుంది.
ముందు చెప్పు కున్నట్టు కామాఖ్యా దేవి విగ్రహం
రూపంలో ఉండదు. శిలారూపంలో యోనిముద్రలో
పూజలందుకుంటుంది తల్లి . ఈ శిలారూపంపై తెల్లని
వస్త్రం కప్పి ఉంటుంది. భక్తు లంతా మెట్లు దిగి
గర్భగుడిలోపల ఉన్న శిలారూప భగేశ్వరీ మాతను
దర్శిస్తా రు. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల
మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు
ఋతుస్రా వం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం
మూడవ పాదంతో మొదలుఎట్టి ఆరుద్ర నక్షత్రంలో
మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రా వం
జరిగే ప్రత్యేక రోజులు. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక
రోజుల గురించి ప్రస్తా వన స్పష్టంగా ఉంది. ఈ
రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రా వం
వెలువడుతుంది. ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న
సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ
ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి
ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తు లో ఉత్సవం
నిర్వహించి గుడి తలుపులు తెరుస్తా రు. అంతకు
ముందే చాలా మంది భక్తు లు అమ్మవారి శిలపై
ఉంచమని వస్త్రా లను సమర్పిస్తా రు. ఆ వస్త్రా లను
అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని
వేలం పద్ధతిలో విక్రయిస్తా రు. ఆ వస్త్రా లు కొనుగోలు
చేసేందుకు భక్తు లు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే
వారికి ఋతుస్రా వ దోషాలు, రజస్వల అయిన
సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తు ల విశ్వాసం.
ఇక ప్రతీ ఆషాఢమాసంలో అయిదు రోజుల పాటు
అంబుబాచి మేళా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ
మేళా జరుగుతుందా అని ఎంతోమంది భక్తు లు
ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ అంబుబాచి
మేళానే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తా రు. ఈ
మేళా కనీవినని రీతిలో జరుగుతుంది. దీని
వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు
భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం
రాగానే వేలాదిమంది పండాలు, సిద్దు లు వంటి వాళ్లే
కాక సామాన్య భక్తు లు కూడా ఆలయానికి
తరలివచ్చి ఈ మేళాలో పాల్గొ ని అమ్మపై తమకున్న
భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు
చేసే తప్పెట్లు , తాళాలు వాయించుకుంటూ చేసే
విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత
బారున జటలు కట్టిన జుట్టు తో ఉన్న సాధులు,
సాధ్విలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా
ఉంటాయి. చాలామంది భక్తు లు ఈ మేళా రోజులు
జరిగినన్ని రోజులూ ఇక్కడే బస చేస్తా రు. సాధారణ
రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు,
తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని
పూజలు నిర్వహిస్తా రు. అన్నట్టు ఈ ఆలయం
ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు
కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థా నంగా చెబుతారు.
ఈ నీలాచలం పైనే భువనేశ్వరీ మాత మందిరం
కూడా ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ భక్తు లతో
రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో విధిగా ఆషాఢ,
జ్యేష్ఠ మాసాల్లో నూ, దసరానవరాత్రి పర్వదినాల్లో నూ,
ఇంకా విశేషమైన రోజుల్లో నూ ఉత్సవాలు
నిర్వహిస్తా రు.
"https://te.wikipedia.org/w/index.php?
title=కామాఖ్యాదేవి&oldid=2327061" నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 1 ఏప్రిల్ 2018న 12:57కు
జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద
లభ్యం

You might also like