You are on page 1of 5

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రా ంతి కోసమో, ఆహ్లా దం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు.

ప్రత
సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞా నిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం
నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం
వలన మనిషి జీవనం వికసిస్తు ందో , ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తు ందో ,
గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షు లు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ
మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి.
ఆధ్యాత్మిక మార్గ ంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో
గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు,
మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తా రు. ప్రా పంచిక లక్ష్యాలతో ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రు వులందరినీ
జయించిన రోజుగా చూస్తా రు.
కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాష పర్వతంతో ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో,
పర్వతంలా అయిపో యాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రా నికి
మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తా రు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత
ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపో యి
సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తా రు.
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది.
పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది
శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొ ందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి.
పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణ పక్షంలో చతుర్థశినాడు
జరుపుకుంటాం.

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రు లు మొత్త ం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి,
మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గ శిరమాసంలో
బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్ట మైన తిథి అది. అందుకే ఈరోజున
శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషో త్త ముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ
ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన
కుమారస్వామి కన్నా ఇష్టు లవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్ట త ఏంటో అర్థం చేసుకోవచ్చు.

శివరాత్రి ..”శివ” అంటే “శివుడు; – “రాత్రి” అంటే “పార్వతి” వీరిద్దరికీ వివాహమైన రాత్రే “శివరాత్రి”. వీరికి పూర్వం
వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను “ఆదిదంపతులు” అన్నారు.
వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే “శివరాత్రి” విశ్వానికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు,
తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణు వులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు
తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞా నోపదేశం చేసినది ఈ “శివరాత్రి” నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు
అర్థరాత్రి సమయాన్ని “లింగోద్భవ” కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి
పర్వదినం నాడే “శివపార్వతులకు” కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపో యింది.

అభిషేకం ఎందుకు చేయాలి ?


”అభిషేక ప్రియం శివః” అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్ట ం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే - “నీరము” అంటే “నీరు” నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణు వును
“నారాయణుడు” అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు “నీరు” అంటే చాలా యిష్ట ం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తు న్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో “శివాయ విష్ణు రూపాయ
శివరూపాయ విష్ణ వే శివస్య హృదయం విష్ణు ర్ విష్ణో శ్చ హృదయం శివః” శివునకు అభిషేకం చేసే ప్రకయ
్రి లో
క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ … చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ
అభిషేకాలన్నింటికన్న “జలాభిషేకం” అంటేనే శివునకు ప్రీతికరం. అందులోనూ “గంగా జలాభిషేకం” అంటే మహా యిష్ట ం.
ఎందుకంటే “గంగ” “విష్ణు పాదో ద్భవ” విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను
తన శిరసున ధరించి గౌరవించాడు. ఆ తర్వాత శివుడు ఇష్ట పడే అభిషేకం “చితాభాస్మాభిషేకం” ఎందుకంటే ఆయన
“చితాభస్మాంగదేవుడు” కదా! ఈ అభిషేకం, ఉజ్జ యినిలో “మహాకాలేశ్వరునికి” ప్రతినిత్యం ప్రా తఃకాలంలో తొలి
అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమయినా, శివాభిషేకం … సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్త మం
ఎందుకంటే ”జలధార శివః ప్రియః” అన్నారు కదా! ఈ అభిషేకాన్ని “రుద్రైకాదశిని” అనబడే నమక, చమకాలతో చేయాలి.
అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి. నమకంలోని “నమశ్శివాయ” అను పంచాక్షరీ మంత్రంలో
”శివ” అనే రెండు అక్షరాలు “జీవాత్మ” అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి ”శివాభిషేకం”
అత్యంత ఉత్త మైన సులభమార్గ మని, “వాయుపురాణం” చెబుతుంది. “వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః”
అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో , వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది.
నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దో షాలు, గ్రహబాధలు తొలగిపో తాయని
ఆవస్త ంబు ఋషి చెప్పాడు. అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని
వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొ ందుతారు.
“శివరత్రౌ అహో రాత్రం నిరాహారో జితేంద్రియ: |
ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||
యత్ఫలం మమమ పూజాయాం వర్షమక
ే ం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త ం్ర చెప్పిన విధంగా నన్ను
అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క “శివరాత్రి” అర్చనవలన లభిస్తు ందని” “శివపురాణంలో
సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్త ం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రా ంగణంలో
నిదురించాలి. మరునాడు “మాఘబహుళ చతుర్దశి” శివరాత్రి పర్వదినం కనుక, ప్రా తఃకాలాన్నేలేచి, స్నానాదికాలు
పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్త ం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ , శివుని
అర్చించాలి. లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి
ఘడియలు పో కుండా అన్నసమారాధన చేయాలి.
నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, “ఓం నమశ్శివాయ” అనే మంత్రా ని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని
అనుగ్రహిస్తా డు సాంబశివుడు.
బిల్వపత్రా ల విశిష్ట త.
శివపూజకు బిల్వపత్రా లు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం … అని
శాస్త ప
్ర మ
్ర ాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తు ంది. బిల్వం
లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్ట ం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు
విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొ రబాటున కాలికి
తగిలితే ఆయష్షు క్షీణిస్తు ందంటారు. ఇది శివుడి అజ్ఞ .బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం.
తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో
శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.
సాలగ్రా మ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసన
ి ఫలం, కోటి కన్యాదానాలు చేసిన
ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తు ంది అని ”బిల్వాష్ట కం” లో చెప్పబడింది.
“ఏకబిల్వం శివార్పణం” అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తా యి. బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త ్వ,
రజ, స్త మోగుణాలకూ, శివుని త్రినేత్రా లకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తు లు. బిల్వాదళం ముందు
భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ
పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దో షం
లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

గమనిక
శివలింగానికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది కాదు.
మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను ఎప్పటికీ సమర్పించకూడదు.
శివ లింగానికి ప్యాకెట్ పాలు సమర్పించకూడదని గుర్తు ంచుకోవాలి. ఆవు పాలు మాత్రమే శ్రేష్టమైనవని గుర్తు ంచుకోవాలి.
పురుషుడు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి.
శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహో ర ఉండేలా చూసుకోవాలి.
శివలింగానికి అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని తాకరాదు.

జాగరణ ఎందుకు చేయాలి..


క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ
మరణిస్తా డో … అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లా ర్లూ శివసంకీర్తనం
చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే “శివరాత్రి”నాడు భక్తు లు ఆచారమైంది. “జాగరణ” అంటే నిద్రపో కుండా సినిమాలు
చూస్తూ , గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం. శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు.
శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రా క్షమాలలూ ధరిస్తా డు. మహాదేవుడు ఎంతటి
నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో,
చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.
ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను “ఆదిభిక్షువు” అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము.
ఆయన నివాసస్థా నము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.ఈ “నిర్జనుడు” మనకేం
వరాలిస్తా డో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.
ఈశ్వర భక్తు డైన “రావణుడు” ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.బ్రా హ్మణ వంశంలో జన్మించి,
వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ
చేసి, శివప్రసాదం తిన్న “గుణనిధి” మరణానంతరం శివసాన్నిధ్యం పొ ందాడు.అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన
కుబేర
ె ుడుగా జన్మించి ఉత్త ర దిక్పాలకుడయ్యాడు. అదే”శివరాత్రి” మహత్యం.
రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దో షాన్ని పో గొట్టు కోవడానికి సాగరతీరంలో “సైకతలింగ” ప్రతిష్ఠ చేసి
పాపవిముక్తు డు అయ్యాడు. ఆ క్షేత్రమే “రామేశ్వరం”.శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తు డై
చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రా లతో అర్చించిన “తిన్నడు” భక్త కన్నప్పగా వాసికక
ె ్కాడు.ఇలా చెబుతూ పొ తే
ఎందరోమహాభక్తు ల చరితల
్ర ు మనకు దృష్టా ంతాలుగా కనిపిస్తా యి. అట్టి నిరాకార, నిర్గు ణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ
“నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్ల లులేనిది ఆయన మమకారం. “శివా”అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత
వత్సలుడాయన. దేహం నుండి జీవం పో యి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య
గుమ్మంవరకే వస్తు ంది. బిడ్డ లు, బంధువులు మరుభూమి వరకూ వస్తా రు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు.
కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపో యిందని వెళ్ళిపో తారు. దిక్కులేక అనాథకాష్ట ంలా కాలుతున్న ఆ కాష్ట ం
దగ్గ ర… “నీకు నేనున్నారురా దిక్కు” అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు “శివుడు” ఒక్కడే.
పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి . ఆ
పరమేశ్వరుడు ఒక్కడే..ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు
నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా “నమశ్శివాయ” అంటూ
నమస్కరించడం తప్ప.అందుకే “మహాశివరాత్రి”నాడైనా మహాదేవుని స్మరిద్దా ం. మోక్షసామ్రా జ్యాన్ని అందుకుందాం
“ఈశానస్సర్వ విద్యానాం – ఈశ్వర స్సర్వభూతానాం – బ్రహ్మాధిపతిర్ |బ్రా హ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు .
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..

You might also like