You are on page 1of 5

శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

శివ కేశవులకి భేదం లేదు.శివుడే విష్ణు వు,విష్ణు వే శివుడు.శివుడు ఎక్కడ వుంటాడో

అక్కడ విష్ణు వు వుంటాడు.విష్ణు వు వున్నచోటే శివుడు కొలువై వుంటాడు.

శివ కేశవుల ఏకత్వాన్ని తెలియచేసే పవిత్ర క్షేత్రౌ లు మన ఆంధ్రపద


్ర ేశ్ లో పంచారామాలు

గా విలసిల్లు తున్నాయి.శివస్య హృదయం విష్ణు ర్విర్ణో శ్చ హృదయం శివః అనగా శివుని

హృదయం లో కొలువై వుండేది విష్ణు వే అలానే విష్ణు వు హృదయం ఆవాసం గా చేసుకుని

వుండేవాడు శివుడు.ఈ ఆబేదాన్ని మనకి చెప్పడానికి ఈ పంచారామాలు.

పంచ అంటే ఐదు ,ఆరామం అంటే కొలువై వుండే స్థ లం.ఈ ఐదు ప్రదేశాలలో సాక్షాత్తు

శివుడు కొలువైవున్న క్షేత్రా లు .ఈ క్షేత్రా లలో శివుడు కొలువుతీరి పూజలు అందుకుంటే

ఈ ఐదు క్షేత్రా లలో విష్ణు వు క్షేత్ర పాలకుడు గా వున్నాడు.ఇంకా అద్బుతమైన విశేషం

యేమిటంటే ఈ ఐదు శివలింగాలు ఒకే లింగం నుండి ఉద్భవించాయి.

మన ఆంధ్రపద
్ర ేశ్ లో వున్న ఈ పంచారామాల గురించి చాలా కథలు ప్రా చుర్యం లో

వున్నాయి.అందులో ఎక్కువగా ప్రా చుర్యం పొ ందినవి ఒకటి శ్రీనాధుడు రచించిన భీమేశ్వర


పురాణం లో ఈ పంచారామాల ఉద్భవం గురించి వున్న ఒక కథ మరియొకటి స్కంద

పురాణం తారకాసుర వధ ఘట్ట ం లో ఈ పంచారామల పుట్టిక గురించి చెప్పబడింది.

మొదటిగా మన శ్రీనాధ కవి సార్వభౌముడు రచించిన బీమేశ్వర పురాణము ప్రకారం

క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణు వు మోహినీ రూపం ధరించి

దేవతలకు, రాక్షసులకు పంపిణీ చేసినప్పుడు త్రిపురాసురులు  అనే రాక్షసులు పంపకం

లో తమకు అన్యాయం జరిగింది అని అసంతృప్తి వ్యక్త ం చేసి శివుని కొరకు ఘోరమైన

తపస్సు చేస్తా రు. ఆ త్రిపురాసురుల తపస్సుకి మెచ్చిన శివుడు వారికి అనేక విదములైన

వరములను ప్రసాదిస్తా రు.ఆ శక్తి తో రాక్షసులు దేవతలను అనేకరకాల బాధలకి గురి

చేస్తా రు.వారి దుర్మార్గా లు భరించ లేక దేవతలు అందరూ కలిసి ఆ దేవ దేవుడు అయిన

శివుడిని రక్షించమని వేడుకుంటారు.దేవతల మొర ఆలకించిన మహాదేవుడు

త్రిపురాంతకుడి రూపంలో తన పాశుపతంతో రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద

చేస్తా డు.మహాశివుని యొక్క ఈ రుద్ర రూపాన్ని త్రిపురాంతకుడుగా పూజిస్తా రు.కానీ ఈ

యుద్ధ ంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా

ఉంటుంది. ఈ లింగాన్ని మహదేవుడు ఐదు ముక్కలుగా చేదించి ఐదు వేరు వేరు

ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను దేవతలకు పంచిపెట్టడం జరిగింది.అలా పంచబడిన


ఐదు లింగ భాగాలని దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా

ప్రసిద్ధి చెందినట్లు గా శ్రీనాధుని బీమేశ్వర పురాణము లో చెప్పబడింది.

మరోయొక గాధ స్కంద పురాణం లో వుంది అనుకున్నాము కదా.స్కంద పురాణం లో

తారకాసుర వధ ఘట్ట ం ప్రకారం హిరణ్య కశిపుడి మనుమడైన తారకాసురుడు శివుని

కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొ ందుతాడు. ఒక బాలుడి

చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుకుంటాడు. రాక్షస

ప్రవృత్తి సహజముగా వున్న తారకాసురుడు శివుడు ప్రసాదించిన వరముల కారణముగా

ముల్లో కాలను బాధించటం మొదలు పెడతాడు. తారకాసురుని ధాటికి తట్టు కోలేని

దేవతలంతా విష్ణు మూర్తికి మొరపెట్టు కోగా, ఆ శ్రీహరి తారాకసురుడు శివ భక్తు డు నేను

వధించలేను కానీ శివపార్వతుల తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థు డు

అన్న ఉపాయాన్ని సూచిస్తా డు.అప్పుడు దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక

అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రా ర్ధిస్తా రు. అలా తారకాసురుని

సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తా డు కుమారస్వామి. దేవతలతో కలిసి బాలుడైన

కుమారస్వామి తారకాసుడిపై యుద్ధా నికి దిగుతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రా లను

ప్రయోగించినా ,ఆఖరికి శక్తి అనే ఆయుధము తో యెన్ని సార్లు ఆ అసురుని శరీరాన్ని


ముక్కలు చేసిన అవి మరలా అతుక్కుపో తువుంటాయి .ఏమి చెయ్యాలో తెలియని

స్తితిలో వున్న షణ్ముఖినికి శివుడు ప్రత్యక్షమై తారుకుని కంఠం లో నా ప్రా ణలింగం

వున్నంత వరకు అతనికి మరణం సంభవించదు అందుకని ఆ ఆత్మలింగాన్ని ముక్కలుగా

ఛేదించాలి అని చెపుతారు.అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త ం్ర తో ఆ ఆత్మలింగాన్ని

ఐదు ముక్కలుగా ఛేదించగా ఆ ఆత్మలింగం గోదావరి, క్ర్సిష్ణ నది తీరాలలో ఐదు చోట్ల

పడింది . ఆ అయిదు ప్రా ంతాలే పంచారామాలుగా పసిద్దిగాంచాయని స్కంద పురాణం

చెపుతోంది.అంతే కాక ఓంకార నాదం తో అవి ఏకం అవుతుండగా విష్ణు మూర్తి ఆదేశం

మేరకు ఆ లింగ శకలాలు పడ్డ చోట దేవతలు వెనువెంటనే లింగాలు ప్రతిష్టించి ఆలయాలు

నిర్మించారని అని కూడా పురాణాలు చెపుతున్నాయి.అవే పంచారామ క్షేత్రా లుగా

పిలువబడుతున్నాయి. నాలుగు పంచారామాలు గోదావరి తీరం లో, ఒకటి కృష్ణా తీరం లో

వున్నాయి అవి వరుసగా

దక్షారామము- భీమేశ్వరుడు- ద్రా క్షారామము, తూర్పు గోదావరి జిల్లా

కుమారభీమారామం – భీమేశ్వరుడు- సామర్ల కోట, తూర్పు గోదావరి జిల్లా

క్షీరారామము- రామలింగేశ్వరుడు - పాలకొల్లు , పశ్చిమ గోదావరి జిల్లా

భీమారామము- సో మేశ్వరుడు - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా


అమరారామము- అమరేశ్వరుడు - అమరావతి, గుంటూరు జిల్లా

ఒక్కో పంచారామ క్షేత్రం గురించి ఇంకా ఆక్షేత్రం కి దగ్గ రలో వున్న దర్శనీయ ప్రదేశాల

గురించి వరుస బ్లా గ్ లో విపులంగా చెపుతాను.

నా తరువాతి బ్లా గ్ లో మొదటిగా మనం సామర్ల కోట లో వున్న కుమారభీమారామం

గురించి తెలుసుకుందాము.

You might also like