Professional Documents
Culture Documents
పద్దెనిమిది పురాణాలు
పద్దెనిమిది పురాణాలు
పద్దెనిమిది పురాణాలు
కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర
యుగారంభంలో భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రు డై అవతరించాడు. పరాశర మహర్షి
పుత్రు డైన వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించాడు. వేదవ్యాసుడికి
పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన
క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల
ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని
పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.
పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా
ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ సంహిత అనేవారు. దానిని సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా
అధ్యయనం చేశారు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. సామవేదాన్ని నేర్చుకున్న
జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. క్రమేపీ శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి
చెందింది.
పద్దెనిమిది మహా పురాణాల పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో
కూడి వున్న గ్రంథం. పద్మ పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత
పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం
15400, భవిష్యోత్తర పురాణం 14500, బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ
పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య
పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల శ్లోకాలు వుంటాయి.
పద్మ పురాణంలో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తా వన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు)
గురించి వున్నది. ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ
విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు
తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా
విష్ణువును కీర్తించే, కొంచెం శివుని కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను
గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు.
విష్ణు పురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రు డు
అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తు న్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు
రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మాలు తెలుసుకునేందుకు వజ్రు డు అర్హుడని భావించి వైష్ణవ ధర్మమును
తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రు డు వినమ్రు డై మునులను విష్ణు ధర్మము చెప్పమని
ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు
ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రు డు మార్కండేయ మహార్హి
సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది. జంబుద్వీప వర్ణన, భారత వర్షం విశేషాలు ఇందులో వున్నాయి.
శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు. శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు:
సృష్టి ప్రశంస అజిత; తరణోపాయము; శివుడు చంద్రు ని ధరించుట, ప్రకృతి మహత్వము; శివునకు ప్రియమైన
పుష్పాలు, మారేడు చెట్టు పుట్టు క; శివుడు
హనుమంతుడగుట, అర్జు నుడు, కపిధ్వజము, అర్జు నునకు, ఆంజనేయునకు వివాదము; అంజనాదేవి
చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము; నంది, భృంగుల జన్మ వృత్తాంతము; పరశురామోపాఖ్యానము;
కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జు నుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల
మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము; పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము
పొందుట; పరశురామ కార్తవీర్యుల యుద్ధము; సుచంద్రు ని యుద్ధము; పరశురాముని
జననము, పరశురాముడు తల్లిని చంపుట; ముక్తి సాధనములు; పిండోత్పత్తి
విధానము; బృహస్పత్యోపాఖ్యానము.
గరుడ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని
వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే
నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే
శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల
వర్ణన ఉంటుంది.
నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తా రు. నారద పురాణంలో వేద వేదాంగాల
గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని
రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది. నారద
పురాణంలో విశేషంగా జ్యోతిఃశాస్త్ర విశేషాలు, మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డా యి. నారద పురాణాన్ని
మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు. ఇందులో ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, నవగ్రహ
మంత్రములు, కార్తవీర్య మంత్రం, హయగ్రీవ మంత్రోపాసన, హనుమాన్ మంత్రం సంగ్రహించబడ్డా యి.
ఉత్తరభాగంలో వివిధ పుణ్యక్షేత్రాల గూర్చి చెప్పబడింది. కాశి, గయ, ప్రయాగ, పురుషోత్తమక్షేత్ర, పుష్కర
క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, రామ సేతు, అవంతి తీర్థం, ద్వాదశి, ఏకాదశి వ్రత విధానం గురించి చెప్పబడింది.
బ్రహ్మవైవర్త పురాణం పరబ్రహ్మ వ్యాప్తము గురించి వివరిస్తుంది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణం
అన్నారు. ఈ పురాణం నాలుగు భాగాలుగా విభజింపబడింది. బ్రహ్మ ఖండము-బ్రహ్మాండోత్పత్తి గురించి; సృష్టి
గురించి; ప్రకృతి ఖండము-ఆదిశక్తి గురించి; ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి; గణేశ ఖండము-
గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము; శ్రీకృష్ణ ఖండము-పరబ్రహ్మమే కృష్ణునిగా
అవతరించి చేసిన చర్యలు. ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు.
శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన
వామన అవతారంపై ఆధారమైనది వామన పురాణం. బ్రహ్మ వామనుని స్తు తించుట, బలి యజ్ఞం
మొదలుపెట్టడం, ప్రహ్లా దుడి తీర్ధయాత్ర, బలిచక్రవర్తి ఆదర్శ పాలన, శివకేశవుల అభేధం శివుడే
తెలియజేయుట, కుమారస్వామి జననం, దేవసేనాధిపతిగా పట్టా భిషేకం, శివపార్వతుల
కల్యాణం, కురుక్షేత్రం, ధరక్షేత్రం, జంబుద్వీపం, భారతవర్షం, ప్రహ్లా ద నరనారాయణుల యుద్ధం, మహాకాల
రూపం, 12 రాశులవర్ణన మొదలైన అంశాలు వున్నాయిందులో.
వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ
పురాణంలో ఉన్నాయి. ప్రియవతోపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానము, శ్రాద్ధ వర్ణనము, శ్రాద్ధ
విధి, ద్వాదశివ్రతము, నారాయణార్చన విధానం మొదలైన అంశాలున్నాయి ఇందులో.
శ్రీ కూర్మ మహాపురాణం మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం. ఈ పురాణం, పురాణ
పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. కుర్మ అంటే, అత్యంత ఆసక్తికరమైన మతం-
నేపథ్యం కలిగిన పురాణాంశం. ఎందుకంటే దీనికి విష్ణు అవతారంలో ఒకదాని పేరు పెట్టబడినప్పటికీ
వాస్తవానికి ఇది విష్ణు, శివులకు సంబంధించిన ఇతిహాసాలు, తీర్థ (తీర్థయాత్ర), వేదాంతశాస్త్రా ల కలయికను
కలిగి ఉంది. ఈ కథలు ఇతర పురాణాలలో కనిపించే కథల మాదిరిగానే ఉంటాయి. ఎక్కువగా శైవ ప్రదేశాల
గురించి వివరించబడింది. ఇతర పంచరాత్ర కథలు, విష్ణువు గాథలను ప్రముఖంగా వివరిస్తుంది. అందరికీ శక్తిని
అందించే అత్యున్నత శక్తి మూలంగా భావించబడుతూ విష్ణు, శివ, బ్రహ్మాది దేవతలు దేవతలుగా ఉంటారని
భావించబడుతుంది.