You are on page 1of 7

వృత్రా సురుడు

వేదవాజ్మయములోని ఒక రాక్షసుడు

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

శుకుడు పరీక్షిత్తు మహారాజుకి మహాభాగవత కథను వివరిస్తూ గురువు ప్రా శస్త్యం చెబుతూ వృత్రా సుర వృత్తాంతాన్ని
వివరిస్తా డు. ఈ వృత్తాంతం భాగవతంలో షష్టస్కందములో వివరించబడుతుంది.

ఇంద్రు డు సభ - ఇంద్రు డు బృహస్పతిని ఉపేక్షించుట

వృత్రా సుర వథ

ఒకరోజు ఇంద్రు డు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తా డు. అందరి వద్ద పూజలు
అందుకొంటున్న ఇంద్రు డు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ
బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తా డు. ఆ తరువాత ఇంద్రు డు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి
బయలుదేరుతాడు. ఇంద్రు డు తన ఇంటికి వస్తు న్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రు నికి కనిపించకుండా
అంతర్థా నమౌతాడు. ఇంద్రు నికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి, అసురులు శుక్రా చార్యుల
అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రా దులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. అప్పుడు ఇంద్రు డు ఏమి
చేయాలో తోచక బ్రహ్మవద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెబుతాడు.

రాక్షసులు స్వర్గా న్ని అధిరోహించుట-ఇంద్రు డు బ్ర హ్మ వద్ద కు వెళ్ళుట-బ్ర హ్మ


విశ్వరూపుని గురువుగా అర్థించమని సూచించుట

అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రు నితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి, త్వష్ట ప్రజాపతి కుమారుడైన
విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. విశ్వరూపుడు చాల పిన్నవయస్సులో ఎన్నో
యాగాలు చేసి బ్రహ్మజ్ఞా నాన్ని సంపాదించాడు. ఇంద్రు డు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి
గురుస్థా నాన్ని తీసుకోవలసిందిగా, తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి, ఆ స్వర్గసుఖాలు ఆనందించమని
కోరుతాడు. విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం
తింటాడు. మరో ముఖంతో సురాపానం చేస్తా డు. మూడో ముఖంతో సోమరసం త్రా గుతాడు. యజ్ఞా లలో
విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని, బ్రహ్మజ్ఞా నం కలవాడినని, తాను తన జీవనం పొలంలో
పడిపోయిన ఒడ్లు ఏరుకొని జీవనం చేస్తుంటానని అంటాడు. "నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు
పౌరోహిత్యం చేస్తే, మీ కోరికలకొఱకు నేను యజ్ఞా లు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది" అని అనగా, ఇంద్రా దులు,
విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తా డు.

విశ్వరూపుడు నారాయణ కవచం ప్రా శస్త్యం చెప్పటం-నారాయణ కవచం


ఉపదేశించుట

దస్త్రం:Narayanakavaca prasasthi.jpg

నారాయణ కవచ ప్రా శస్త్యం

తరువాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి, ఇంద్రు డికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు.
నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రా హ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ
ఒక ఎడారిలో ప్రా ణాలు విడిచి పెట్టేశాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలను పాటేసింది. ఆ విధంగా ప్రా ణాలు
విడిచిన కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడి ఉండిపోయింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు భార్యలతో
కలిసి ఆకాశమార్గంలో విమానంలో ఆమార్గంగుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికలు ఉన్న
ప్రదేశం వద్ద ఆగిఫొయింది, విమానం క్రింద పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు.
అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి వృత్తాంతం తెలిపి, నారాయణ కవచం
ప్రభావం వల్ల విమానం ఆగిఫొయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమర్జనం చేసి, ఆచమానం చేస్తే విమానం
కదులుతుందని తెలిపి అక్కడనుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. చిత్రవధుడు వాలకీయుడు చెప్పినట్లు చేస్తే విమానం
ముందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ ఇంద్రు నికి నారాయణ కవచాన్ని
ఉపదేశిస్తా డు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రు డు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకొన్నాడు.

ఇంద్రు డు విశ్వరూపుడితో అమరావతిలో ఉన్న భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు, గురువులకు శిష్యులే
ధనం అని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞా లలో హవిస్సులు తీసుకొని అని ఇంద్రా దులకు ఇస్తుండేవాడు.

విశ్వరూపుడు రాక్షసుల కోరిక మేరపు హవిస్సులు రాక్షసులకు ఇచ్చుట-


ఇంద్రు డు విశ్వరూపుని తలలు నరుకుట

విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు
మేనమామ అయిన విశ్వరూపుడిని, యజ్ఞా లలో హవిస్సులను ఇంద్రు డికి తెలియకుండ తమకు ఇవ్వమని కోరుతారు.
బ్రహ్మ జ్ఞా నం కలిగి తరతమ భేదాలు లేని విశ్వరూపుడు, రాక్షసులు కోరినవిధంగా ఆ హవిస్సులలో కొంతభాగం
రాక్షసులకు ఇస్తుండేవాడు. కొద్దిరోజుల తరువాత ఇంద్రు డికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రు డు యుక్తా యుక్త
విచక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను నరికి వేస్తా డు.

ఇంద్రు డు బ్ర హ్మహత్యాపాతకం పంచుట-వరాలు ఇచ్చుట

సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది.అన్నం
తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని
సూచిస్తా యి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రు డి చెవ్వుల్లో రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక
బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రు డు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు,
నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు
నాలుగు వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లు గా,
వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము
పెరిగేటట్లు గా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు.
బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రా లు),
నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రా వం.

త్వష్ట ప్ర జాపతి యజ్ఞం చేసి వృత్రా సురుని పొందుట- వృత్రా సురుడు
ఇంద్రు డి మీదకు వచ్చుట
తన కుమారుడైన విశ్వరూపుడి మరణవార్త త్వష్ట ప్రజాపతికి తెలుస్తుంది. త్వష్ట ప్రజాపతి ఇంద్రు ని సంహరించే కొడుకు
కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రా రంభించాడు. యజ్ఞపరిసమాప్తి సమయానికి యజ్ఞ గుండం నుండి ఒక పెద్దరూపం ఆ
యజ్ఞ గుండంలో నుండి బయటకు వచ్చింది. ఆ విధంగా పుట్టిన వేంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా వ్యాపించేసింది.
బ్రహ్మాండం అంతా నిండి పోయింది కావున దానికి వృత్రా సురుడు అని నామకరణం జరిగింది. ఆ వృత్రా సురుడు
ఆకాశాన్ని చప్పరించాడు, గ్రహాలను నాకాడు, ఇంద్రు డు ఎక్కడ ఉంటాడని గర్జనచేశాడు. ఆ విషయం తెలిసిన
ఇంద్రు డు తన సైన్యాన్ని అంతా తీసుకొని వృత్రా సురుడితో యుద్ధా నికి వెళ్ళాడు. దిక్పాలురు వేసిన అస్త్రా లన్ని
వృత్రా సురుడు గుర్రిటితో తీసుకొని నోటిలోవేసుకొని చప్పరించాడు.అప్పుడు ఇంద్రు డు ఏమి చేయాలో పాలుపోక బ్రహ్మ
వద్దకు వెళ్ళాడు.

ఇంద్రు డు మహావిష్ణు వు ని అర్థించుట- దధీచి మహర్షి వెన్నుముక ని


అర్థించమని కోరుట

అది చూసి నిశ్చేష్టు లై ఏమి చేయాలో తోచక మహావిష్ణు వు వద్దకు వెళ్ళి తమ బాధ మొర పెట్టు కొన్నారు. ఆ ఆర్తత్రా ణ
పరాయణుడు గదా, శంఖ, చక్రముతో కౌస్తు భంతో, పద్మాలతో, శ్రీవత్సంతో, వనమాలతో వారికి ప్రత్యక్ష్యమైయ్యాడు
అభయ ప్రకటన చేశాడు. వారి రాకకు కారణాన్ని వివరించమనగా జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. ఆప్పుడు
మహావిస్ణు వు వృత్రా సురుడి వధ దధీచి మహర్షి వెన్నుముక నుండి తయారు చేసిన వజ్రా యుధం వల్ల మాత్రమే
జరుగుతుంది అని తెలిపాడు.

దధీచి మహర్షి ని ఇంద్రు డు వెన్నుముక అర్థించమని కోరుట - దధీచి మహర్షి


వృత్తాంతం

ఆర్తత్రా ణ పరాయణుడైన శ్రీ మహావిష్ణు వు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి వెన్నెముక కోరవలసిందిగా చెబుతాడు. ఆ మాట
విని ఇంద్రు డు వృత్రా సురుడుని సంహరించడం వల్ల మళ్ళి బ్రహ్మహత్యాపాతకం చుట్టు కొంటుందని ఆలోచిస్తుండగా
దిక్పాలురు శ్రీమహావిష్ణు వు చెప్పినట్లు చేయవలసినదని, వచ్చిన బ్రహ్మహత్యపాతకం అశ్వమేధయాగం చేయడం వల్ల
పోయేటట్లు తాము చేస్తా మని ఊరట పరుస్తా రు. ఇంద్రు డు దిక్పాలురతో దధీచీ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు.
దధీచీ మహర్షిని శరీరాన్ని కోరడానికి ఇంద్రు డు ముందుకు వెళ్లక పోవడం చూసి, దిక్పారులు ఇంద్రు డుని ముందుకు
తోస్తా రు. అప్పుడు ఇంద్రు డు వృత్తాంతాన్ని చెప్పి తనకు దధీచి శరీరాన్ని ఇవ్వవలసినదిగా కోరుతాడు. దధీచీ మహర్షి
అప్పటికే రెండు సార్లు జన్మ పొందినవాడు. ఇదివరలో అశ్వనీ దేవతలు దధీచి మహర్షీ వద్దకు వెచ్చి అశ్వశిరము అనే
విద్య కోరుతారు, అప్పుడు దధీచీ తాను యాగం చేసుకొంటున్నాని కొంతకాలం తరువాత వస్తే ఆ విద్య ఉపదేశం
చేస్తా నని చెప్పగా వారు వెళ్ళిపోతారు. అశ్వనీదేవతలు అట్లా వెళ్ళిన వేంటనే ఇంద్రు డు వచ్చి వారికి విద్యని భోధిస్తే
వారు అమరులు అవుతారు ఆ విద్యని భోధిస్తే నిన్ను సంహరిస్తా నని దధీచితో చెబుతాడు. తరువాత అశ్వనీదేవతలు
దధీచి వద్దకు రాగా దధీచీ ఇంద్రు డు వచ్చి వెళ్ళిన కథ చెబుతాడు. అప్పుడు అశ్వనీదేవతలు తరుణోపాయంగా వారు
ముందే తాము దధీచి తలనరికేటట్లు , ఆ గుఱ్ఱం తలని అక్కడ అమర్చేటట్లు చేస్తా నని, అప్పుడు అశ్వశిరస్సుతో
అశ్వశిర విద్య బోధించిన వేంటనే తాము దధీచి తమకు విద్య బోధించనట్లు అరుస్తా మని, ఆ మాట విని ఇంద్రు డు
వచ్చి అశ్వశిరాన్ని నరికి వేస్తా డని, ఆ తరువాత దేవవైద్యులమైన మేము దధీచీ అసలు శిరస్సు ఉంచి ప్రా ణ ప్రతిష్ఠ
చేస్తా మని చెబుతారు. ఆ విధంగా దధీచి అప్పటికే రెండు సార్లు జన్మ ఎత్తినవాడు. దధీచి ఎల్లకాలములో నారాయణ
కవచమును స్తు తిస్తూ నరనరాలలో, ఎముకలలో నారాయణ మంత్ర ప్రభావితమైనది. అప్పుడు ఇంద్రు డు తన
వృత్తాంతం చెప్పి శరీరాన్ని కోరగా దధీచి మహర్షి ఎవరైన తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగిన ఇచ్చేస్తా డా, సత్వ
గుణ సంపద కలిగిన తన శరీరాన్ని తునకలు చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆఏముకలని
హింస చేయడానికి వాడుతారా! అని అనగా దేవేంద్రు డు తమకు ఇప్పుడు గత్యంతరము లేదని తమని కాపాడమని
అర్థిస్తా డు. అప్పుడు దధీచీ మహర్షి ఏదో పరిహాసానికి ఆ ప్రశ్న వేశాను కాని ఈ శరీరం తనది కాదని ఈశ్వరుడిదని, తన
యోగ విద్యతో తనలో ఉన్న ప్రా ణావాయువును పైకి లేపి అనంతంలో కలిపి, శరీరాన్ని పడగొట్టేశాడు. అప్పుడు
ఇంద్రా దులు ఆ శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మ కిచ్చి ఆ విశ్వకర్మ చేత నూరంచులు కలిగిన వజ్రా యుధం తయారు
చేయించారు.

ఇంద్రు డు వృత్రా సురుడుని వధించుట

అలా తయరు చేసిన వజ్రా యుధం తీసుకొని తన సైన్యముతో ఐరావతం ఎక్కి వృత్రా సురుడి మీద యుద్ధా నికి
వెళ్ళాడు. అలా యుద్ధా నికి వచ్చిన ఇంద్రు నిచూచి వృత్రా సురుడు ఇంద్రు డితో ఒరేయ్ నువ్వేనా ఇంద్రు డివి, నువ్వేనా
నా అన్న విశ్వరూపుడుని సంహరించింది, నువ్వు మహావిష్ణు వు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దధీచి ఎముకలతో
వజ్రా యుధం చేయించుకోవడానికి వచ్చావు. ఈ రోజు నిన్ను సంహరిస్తా ను, లేదు లేదు, నీకు శ్రీమన్నారాయణుడి
అండఉండడం వల్ల నేనే మరణిస్తా ను అని అనగా ఇంద్రు డు ఆశ్చర్యపోయి తన శూలంతో ఐరావతాన్ని ఒక పోటు
పొడుస్తా డు. అలా పోటు పొడవడం వల్ల ఇంద్రు డు ఐరావతం నుండి క్రిందపడి పోతాడు.

వృత్రా సుర వధ బ్ర హ్మహత్యపాతకం చుట్టు కొనుట - ఇంద్రు డు ఈశాన్యం


దిక్కున తామర పువ్వులొ దాగుకొనుట

వాహనము లేక ఆయుధం లేక క్రిందపడిన ఇంద్రు డిని చూసి ఆయుధం తీసుకోమని, ఆయుధం లేని వానితో యుద్ధం
చేయనని, తాను ఇంద్రు డు చేతులలోనే నారాయణ పతి పొందుతాను అని చెబుతాడు. వృత్రా సురుడి యుద్ధనీతికి
ఆశ్చర్యపడి ఇంద్రు డు కారణం అడుగుతాడు. అప్పుడు వృత్రా సురుడు తాను తన సొదరుడి మరణానికి కారణమైన
ఇంద్రు డిని చంపడానికి పుట్టా ను కాబట్టి తన కర్తవ్యం నిర్వహిస్తు న్నాను అని అంటాడు. యుద్ధం జరుగుతుండగా
వృత్రా సురుడు ఇంద్రు డిని మ్రింగివేస్తా డు. అప్పుడు ఇంద్రు డు వృత్రా సురుడి ఉదరములో నారాయణ మంత్ర ప్రభావం
వల్ల జీర్ణం కాకుండా, తన వజ్రా యుధంతో పొట్ట చీల్చి బయట పడతాడు. తరువాత తన వజ్రా యుధంతో వృత్రా సురుడి
తలని నరకడం ప్రా రంభించి ఉత్తరాయన దక్షిణాయాన మధ్యాకాలములో నరుకుతాడు. ఆ విధంగా వృత్రా సురుడి వధ
జరుగుతుంది. వృత్తా సురుడి వధ జరిగిన వెంటనే అందరు దిక్పాలురు వారి గృహములకు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే
వృత్రా సురుడు వధ జరిగిందో మళ్ళీ బ్రహ్మ హత్యాపాతకం ఇంద్రు డిని వెంబడిస్తుంది, ఇంద్రు డు తన రక్షణ కోసం అన్ని
దిక్కులు తిరిగితాడు. ఎక్కడా శరణు దొరకదు. చివరికి ఈశాన్య దిక్కు వైపు వెళ్తా డు. బ్రహ్మహత్యాపాతకం ఈశాన్యం
వైపు రాలేక పోతుంది. ఇంద్రు డు ఈశాన్యం దిక్కులో ఉన్న ఒక కమలంలో దూరి అక్కడ నారాయణ మంత్రం ఒక
వెయ్యి సంవత్సరాలు పఠిస్తా డు. అక్కడ స్వర్గములో ఇంద్రు డి పదవి ఖాళీగా ఉండకూడదు కాబట్టి నహుషుడిని
ఇంద్రు డీ పదవిలో కూర్చోబెడాతాడు. నహుషుడు శచీదేవీని కామించి ఆమెను అనుభవించ దలుస్తా డు. అప్పుడు
శచీదేవి ఆర్తత్రా యణపరాయణుడైన నారాయణుడిని ప్రా ర్థించగా తరుణోపాయంగా నహుషుడికి శచీదేవి వద్దకు
సప్తరుషులు మోస్తు న్న పల్లకీలో రమ్మని కోరమంటాడు. నహుషుడు ఆవిధంగా సప్తరుషుల పల్లకీలో వస్తుండగా,
అగస్త్య మహర్షి పొట్టిగా ఉండడం వల్ల పల్లకీ ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది. దానికి కోపించి నహుషుడు అగస్త్య మహర్షిని
ఒక తన్ను తంటాడు. అప్పుడు అగస్త్యుడు నహుషుడిని శపిస్తా డు. తరువాత అందరు దేవతలు ఇంద్రు డిని తామర
పువ్వు నుండి తీసుకొని వచ్చి అశ్వమేధ యాగం చేయించి బ్రహ్మహత్యాపాతకం నివృత్తి చేస్తా రు.

వృత్రా సురుడు పూర్వ జన్మ వృత్తాంతం

రాక్షసుడైన వృత్రా సురుడికి విష్ణు భక్తి యెలా కలిగింది అని సందేహం . అందుకు అతని పూర్వ్జ జన్మ వాసనే కారణం.
కిందటి జన్మలో అతడు చిత్రకేతుడనే రాజు. ఆ రాజుకి కోటి మంది భార్యలు ఉన్నా సంతానం కలుగలేదు. అందుకని
చాలా విచారిస్తూ ఉంటే ఒక నాడు అంగీరస మహాముని అతని దగ్గరకు వచ్చి, "సకల భోగాలూ అనుభవిస్తు న్నా నీకీ
విచారం ఎందుకు" అని అడిగాడు. " అన్నీ తెలిసిన వారైనా మీకు తెలియకుండా ఉండదు. ఐనా నా నోటి నుండి
వినాలనే అలా అడుగుతున్నారు" అని తన విచారానికి కారణం ఆ మహామునికి విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ
ముని, రాజు చేత స్వయంగా యాగం చేయించి, " ఈ యాగప్రసాదం వలన , రాజా, నీకు తప్పక కొడుకు పుడతాడు.
వాడి వలన నీకమితానందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది" అని చెప్పి దీవించి వెళ్లిపోయాడు.

ఆ రాజు, అందరిలోకీ గుణవంతురాలు, పెద్దదీ అయిన కృతద్యుతి రాణికి ఆ యాగ ప్రసాదమిచ్చాడు. ముని
చెప్పినట్లు గానే కృతద్యుతి ఆ తరువాత ఒక చక్కటి పిల్లా డిని కన్నది. ఆ రోజు నుంచీ ఆ రాజు ప్రపంచమంతా ఆ
రాజకుమారుడే. వాడు పెరిగి పెద్దవుతూంటే ఆ దంపతుల ఆనందం యేం చెప్పాలి? కొడుకు పుట్టిన దగ్గర నుంచీ రాజు
కృతద్యుతి అంతఃపురంలోనే గడుపుతూంటే మిగతా రాణులకి అసూయ పుట్టు కొచ్చింది. కాని చేసేదేమీ లేక వాళ్లు
కూడా బాబు అంటే యెంతో ముద్దు అన్నట్లు వచ్చి నటిస్తూ , ఆ పిల్లా డితో ఒంటరిగా ఉండే సమయం కోసం కాచుకుని
చూడ మొదలు పెట్టా రు.

ఒక నాడు ఆ సమయం చిక్కగానే ఆ పిల్లా డి పాలల్లో విషం కలిపారు. వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతద్యుతితో
పాటు వారు కూడా దొంగయేడ్పులు మొదలుపెట్టా రు. చిత్రకేతు దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడివలే చనిపోయిన
పిల్లా డేనే తలచుకుంటూ, నిద్రా హారాలు మానివేసాడు. అప్పుడు అంగీరసుడు నారదునితో కలిసి వచ్చి, "అలా
చనిపోయిన వారి గురించి పరితపించడం అవివేకం. ఇలా సంసారబంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోకు. ఆ
నారాయణుని భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో" అని బోధపరిచాడు. నారదుడు నారాయణ మంత్రం
ఉపదేశించాడు.

వారు చెప్పినట్లు గానే తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై, భక్తికి మెచ్చానంటూ, "ఆత్మానుసంధానం చేసుకో.
దాని వలన నీవు సిద్ధు డవవుతావు" అని దీవించి ఒక విమానాన్ని చిత్రకేతుడికిచ్చి అంతర్థా నమయ్యాడు. భగవంతుడు
చెప్పినట్లే చేసి సిద్ధు డయి, శ్రీహరిని స్త్రో త్రం చేస్తూ తన కెక్కడ మనసైతే అక్కడికి దేవుడిచ్చిన విమానంలో విహరిస్తూ
చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఒక నాడు విమానంలో ఆకాశవిహారం చేస్తుండగా ఒక చోట శివుని చూశాడు.
పార్వతిని తొడపై కూర్చుండబెట్టు కుని మునులతో సభ చేస్తు నట్లు ఉన్నది చూసి, "శివుడు అలా నలుగురిలోనూ
పార్వతిని కూర్చోబెట్టు కో దలచినా , పార్వతికైనా సిగ్గు ఉండొద్దూ ? వీళ్లకి మతిపోతే, ఆ మునులైనా అక్కడి నుంచి లేచి
వెళ్లిపోవద్దూ ?" అని ఆ సభలోని వారికి వినపడేలా తన నిరసన వ్యక్తపరిచాడు.
మిగతావాళ్లు యేమీ అనలేదు కాని పార్వతి కోపంతో, "ఈ మహామునులకు తెలియని ధర్మపన్నాలు వీడికి తెలుసా?
ఎలా విర్రవీగిపోతున్నాడో, చూసారా? పరమేశ్వరుడైన శివునికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లు
పొగరుపోతుతనంతో యేం విర్రవీగుతున్నాడో చూసారా? ఈ కండకావరానికి వీడు శిక్ష పొందవలసినదే. రాక్షసుడై
పుట్టు గాక" అన్నది.

తన తప్పిదం తెలుసుకుని చిత్రకేతుడు, "నా ప్రా రబ్ధ మే నాకు నీ శాపం తెచ్చింది. నను మన్నించు దేవి" అని పార్వతిని
వేడుకున్నాడు. ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృత్రా సురుడిగా పుట్టా డు. ఆ తరువాత దేవేంద్రు ని చేతిలో నారాయణ
శక్తి ఉన్న వజ్రా యుధంతో మరణించి, మరు జన్మలు లేకుండా విష్ణు పదం చేరుకున్నాడు.

"https://te.wikipedia.org/w/index.php?
title=వృత్రా సురుడు&oldid=3276542" నుండి వెలికితీశారు


Last edited 7 months ago by Chaduvari

You might also like