You are on page 1of 9

పంచారామాలు- కుమారభీమారామం-శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరస్వామి

పంచారామలలో ఒకటి అయిన శ్రీ కుమారామా భీమేశ్వర క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా

సామర్ల కోట లో వుంది.ఇక్కడ కుమారస్వామే స్వయం గా లింగాన్ని ప్రతిష్టించారని

అందుకే ఈ క్షేత్రా నికి కుమారామం అని అంటారని ప్రతీతి. సామర్ల కోట లోని

భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు 9 వ శతాబ్ధ ం చివరలోనిర్మించాడని

పిఠాపురం లో దొ రికిన ఒక శాశనం ద్వారా తెలుస్తో ంది. . ఈయనే ద్రా క్షరామ

దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు దేవాలయాలు ఒకేవిదముగా

వుంటాయి.అంతే కాక ఈ రెండు గుడుల నిర్మణానికి ఉపయోగించిన రాయి మరియు

నిర్మాణ శైలి కూడా ఒకటే. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రా రంభమై సుమారు క్రీ.శ.

922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు

లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. ఈ దేవాలయం లో

కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను

తేలికగా గుర్తించవచ్చును.

సామర్ల కోట లోని భీమేశ్వర స్వామిని కుమారస్వామి నే స్వయంగా ప్రతిష్టించడం వలన

దీనికి “కుమారారామ” అని పేరు వచ్చింది అని పౌరాణిక ప్రశస్తి.


చారిత్రికంగా చూస్తే క్రీ.శ 872 నుండి 971 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు

కమారామము ను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన సాగించారు.ఆ చాళుక్య మహారాజు

ఆ స్వామి యందు అమితమైన భక్తి అందుకని సువిశాల ప్రా కర మందపాడులని నిర్మించి

తన భక్తిని చాటుకున్నాడు.ఆ పారమైన భక్తి వలనే స్వామి చాళుక్య కుమారామ

భీమేశ్వరుడు అయినాడు .రాజు పేరు తో స్వామి పేరు తో ఊరు చాళుక్య

భీమవరమైంది.అంతే కాక సామర్ల కోట పేరు వెనుక చాలా కధలు వున్నాయి.అందులో

ఒకటి పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారని , ఈ గ్రా మం వారికి కోట

వలె చాలా సురక్షితం గా వుండేదని కాబట్టి స్వాముల కోట అనేవారని అదే కాలక్రమేణ

సామర్ల కోట గా మారింది అని కొందరు చెపుతారు.

ఇంకొక కధ యేమిటంటే ఇక్కడ శ్యామలాంబ గూడు వుండేదని దాని చుట్టూ కోట

వుండేదని ఆ కారణం గా శ్యామలకోట అని పిలిచివారని అదే కాలాంతరంలో సామర్ల కోట గా

మారింది అని అంటారు.ఏది ఏమైనా ఇవన్నీఈ మద్యకాలం లో వచ్చిన పేర్లు కావొచ్చు

కానీ చాళుక్య భీమవరం,కుమారామం అనేవి సామర్ల కోటే కోట కు ఎప్పటినుందో వున్న

పేర్లు అని మనకి శ్రీనాధుని సాహిత్యం వలన తెలుస్తు ంది.అంతే కాక శిలశాసనాలు కూడా

ఈ విషయాన్నే బలపరుస్తు న్నాయి.ఇప్పుడు శ్రీ కుమారామ భీమేశ్వర ఆలయం వున్న


భీమవరం గ్రా మాన్ని,సామర్ల కోట ని గోదావరి పంటకాలువ వేరు చేస్తూ ప్రవహిస్తు ంది.ఈ

కాలువకి ఉత్త రాన పట్ట ణం,దక్షిణాన ఆలయము వున్నాయి.

ఆలయ నిర్మాణ శైలి చూస్తే ద్రా క్షారామం లోని భీమేశ్వర ఆలయాన్ని పో లి వుంటుంది.ఈ

గుడి చుట్టూ చెక్కిన ఇనుపరాతి తో కట్టిన రెండు ప్రా కరాలు వున్నాయి.బయట ప్రా కరానికి

నాలుగు వైపులా నాలుగు గోపురాలు వుంటాయి.ఈ గోపుర ద్వారానికి ఇరువైపుల

అర్ధమండపాలు వుంటాయి.ఇంకా లోపలి ప్రా కారం లోకి వస్తే ఇది సమతలం గా రెండు

భాగాలుగా చేయబడి మద్య లో ఒక చూరు వుంటుంది.ఈ లోపలి ప్రా కారం వెనుక గోడ ను

ఆధారం గా కెఃసుకొని రెండు అంతస్తు ల మండపం నిర్మించారు.ఈ లోపలి మండపం లో

క్రింద భాగం లో దక్షిణం వైపున గణపతి ,సూర్యుని గుడి,తూర్పున అమ్మవారు గిరిజ

సుందరి గుడి వుంటాయి.భీమేశ్వరుని దేవాలయం లోపలి ప్రా కారం మద్యలో

చతురాస్రా కారంగా రెండు అంతస్తు లలో నిర్మించారు. రెండో అంతస్తు వరకు దాదాపు 14

అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో

వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు

వరకుండును. భక్తు లు పూజలు, అర్చనలు ఇక్కడ చేస్తా రు. మొదట మొదటి అంతస్తు లో

వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తు లు


దర్శించుకుంటారు. మొదటి అంతస్తు కు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి

మొదటి అంతస్తు కి దక్షిణ వైపుగా వున్న మెట్ల మీదుగా ప్రవేశించాలి.ఈ రెండు

అంతస్తు లు ద్రా విడ శైలి లో వుంటాయి.

గుడి ఆవరణ లో భీమేశ్వర ఆలయం పో లిక తో చేసిన ఒక చిన్న నమూనా గుడి

వుంటుంది.

ఆలయ శైలి లో ఒక విశేషం ఏమిటంటే ప్రతి శిలా స్త ంభం దేని కదే ప్రత్యేకం గా

వుంటుంది.ఏ రెండు స్త ంభాలు ఒకేలా వుండవు,ప్రతి స్త ంభం నిర్మాణం లోనూ ఎంతో కొంత

వైవిద్యం వుంటుంది. ఆలయము లోని మండపం నూరు స్త ంభల్తో

నిర్మించబడింది.గుడిలోకి ప్రవేశించగానే కనిపించే ఏక శిలా నంది విగ్రహం ఒక సజీవ

శిల్పం ,చాలా అద్భుతం గా ఉంటుంది.రెండవ అంతస్తు లో ప్రదక్షిణ చేసే మార్గ ం లో

స్వామి ఎదురుగా నిలచినప్పుడు కుడి ప్రక్కన స్త ంభం పైన జ్యోతిర్లింగం అయిన శివుని

యొక్క ఆద్యంతాలు కనుక్కునే పందెంలోవిష్ణు మూర్తి వరాహ రూపం లింగం మొదలు

కనుక్కోవటానికి, బ్రహ్మ లింగం యొక్క చివరి భాగం కనుక్కోవటానికి హంస వాహనం పై

ప్రయాణించే దృశ్యాన్ని అత్యంత అద్భుతం గా స్త ంభం పై చెక్కబడి వుంటాయి.ఇంకా


లింగోపరితలం నుండి జారీ పడే కేతకు పుష్పం, సురభి ఆవు ల దృశ్యాలని కూడా ఈ

స్త ంభం పై చెక్కిన శిల్పాలలో చూడవచ్చు.

ఉత్త మ సాధన కై సాధన యందు కొన్ని మెట్లు ఎక్కితేనే కానీ భగవంతుని అనుగ్రహం

లభించదు అనే సత్యాన్ని తెలియచెప్పటానికి అన్నట్టు వుంటాయి మనం ఎక్కవలిసిన

మెట్లు .అవి కూడా చాలా చిత్రంగా రెండు దార్లు వుంటాయి.గర్భ గుడికి ఆగ్నేయం వైపున

సూరి ద్వారం,ఉత్త రం ఈశాన్యం వైపు నా చంద్ర ద్వారం.ఇవి ఎలా వుంటాయి అంటే

గర్భగుడికి రెండు నాసికా రంధ్రా ల లా వుంటాయి. ఎలా అంటే మనిషి యొక్క నాసిక

రంధ్రా లలో ఎడమ వైపుది చంద్ర నాడీ,కుడి వైపుది సూర్య నాడీ ,యోగి యోగ మార్గ ం లో

ఈ రెండు నాదుల ద్వారా ప్రా ణమయము ప్రక్రియ ద్వారా ప్రా ణము ని సహస్రా రమున

వుంచి ఆ ప్రా ణం తో తన మనస్సు ను కూడా అక్కడికి చేర్చి ఆనందమయుడై

వుంటాడు.ఈ భీమేశ్వర స్వామి దర్శనం కూడా ఈ రెండు మెట్ల దారి ద్వారా మనకి ఈ

యోగమార్గా న్నే చెపుతుంది.

అమ్మలు గన్న అమ్మ ముగ్గు రమ్మల మూలపుటమ్మ ఇక్కడ బాల త్రిపుర సుందరి పేరు

తో స్వామి వారి దేవేరి గా కొలువై వుంది.ఆ చల్ల ని తల్లిని చూడటానికి రెండు కళ్ళు

చాలవు .ఆ కరుణామయి తన చల్ల్ని చూపులతో తాన భక్తు లు అయిన బిడ్డ లను సదా
కాపాడుతువుంటుంది.ఈ ఆలయం లో అమంవారి తో పాటు ఆలయం చుట్టూ వున్న

మండపం లో చిన్న చిన్న గదులలో ప్రధాన దేవతలు కొలువు తీరి స్వామి ని సేవిస్తూ

దర్శించ వచ్చిన భక్తు లను అనుగ్రహిస్తూ వుంటారు.మహా గంపతి,కుమార

స్వామి,వీరబధ్రు డు,దత్తా త్రేయులు,బ్రహ్మ,సర్స్వతి,సూర్యనారాయణుడు,మహిషాసుర

మర్ధిని ఇంకా సప్త మాతృకలు కొలువు తీరి ఆ భీమేశ్వరుడిని దర్శించటానికి విచ్చేసిన

భక్తు ల కోరికలు పాలిస్తు వున్నారు.ఇక్కడ వున్న మహిషాసుర మర్ధిని విగ్రహం

తవ్వకాలలో బయట పడింది.దీనిని కొండవీటి రాజు అయిన కాటయ వేమారెడ్డి 15 వ

శతాబ్ధ ం లో ప్రతిష్టించినట్టు చెపుతారు.ఈ మహిషాసుర మర్ధినికే శ్యామల శక్తి అని కూడా

అంటారు.

ఈ ఆలయ నిర్మాణం లో మరో విశేషం ఏమిటంటే చైత,్ర వైశాఖ మాసాలలో సూర్య దేవుని

కిరణాలు ఉదయం పూట అయ్యవారి పాదాలను ,సంద్య వేళ అమ్మవారి పాదాలను

తాకుతూవుంటాయి.ఆలయం పడమటి గోడ మీద వున్న గణపతి ని వజ్ర గంపతి అంటారు

ఎందుకంటే ఆయన నాభి లో కాంతివంతమైన వజ్రం వుండేది ఆట.ఆ వజ్రం నుండే వచ్చే

కాంతి రాత్రి పూట భక్తు లకు మార్గ దర్శకముగా వుండేది ఆట.ఇప్పుడు ఆ వజ్రం లేదు
కాని నాభి వజ్రం వున్న చోట ఖాళీ గా కనిపిస్తు ంది.ఆలయం లో లోపలి ప్రా కారం బయట

కల భైరవ స్వామి క్షేత్ర పాలకుడా గా మనకి కనిపిస్తా రు.

ఈ ఆలయానికి తూరుపు దిక్కున పుష్కరిణి వుంది .దీనిని భీమగుండం

అంటారు.ఇక్కడినుండి నీళ్ళు తెచ్చుకొని గుడి ఆవరణ లో వున్న శివలింగానికి భక్తు లే

స్వయంగా అభిషేకం చేయవచ్చు.ఈ దేవాలయానికి పడమట వైపున ఏక శిలా స్త ంభం

వుంది.దీని కప్ప స్త ంభం అంటారు.దీని పైన చెక్కబడి వున్న శిలా శాసనం బట్టి నిధి ఆశతో

కొందరు దొ ంగలు నంది ని తొలగించినట్టు గాను నరసిముడి భార్య రాజమండ్రి లోని

కోటిలింగాల నుండి రాతిని తెప్పించి కొత్త నందిని పునః ప్రతిష్ట చేయించి నట్టు తెలుస్తు ంది.

 శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి

బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహో త్సవం జరిపిస్తా రు. అయిదు రోజులపాటు

జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై

ఊరేగిస్తా రు.

ఈ గుడి నుండి బయటికి వచ్చిన తరువాత ఒక 200 గజాల దూరం లో 5 నిమిషాల

నడక దూరం లో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది. భీమేశ్వర ఆలయం కి


వెళ్లి నప్పుడు తప్పకుండ చూడాలిసిన ఆలయం .ఈ ఆలయం కూడా కాలువ పక్కనే

వుంటుంది ,ఎలాంటి ప్రయాణ సాధనాలు అక్కరలేదు నడిచి వెళ్లవచ్చు.

ఇక్కడ మాండవ్య అనే ఒక మునీశ్వరుడు నారాయణ స్వామి కొరకు తప్పస్సు చేసి

నారాయణుడుని ప్రసన్నం చేసుకున్నారని ఆ నారాయణ్ స్వామి ఇక్కడ వెలిశారని

అందుకే ఈ గుడిని మాండవ్య నారాయణ స్వామి ఆలయం అని చెపుతారు.ఈ ఆలయం

కూడా అందమైన శిల్పా కళ తో నిర్మించారు.ఇక్కడికి మాండవ్య మహర్షి దర్శనం

చేసుకోవటానికి ఇంద్రు డు పుష్పక విమానం పై వచ్చేవాడని చెపుతారు.

ఇవే కాకుండా పై రెండు ఆలయాలకంటే కూడా ఇంకా పురాతనమైన ఆలయం వుంది అధి

త్రిముఖ లింగాలయం గా పిలవబడుతోంది.ఇక్కడ వున్న శివ లింగం మూడు

ముఖములతో వుండటం వలన త్రిముఖ లింగం గా పిలవబడుతోంది.మూడు ముఖములు

త్రిమూర్తు లు అయిన బ్రహ్మ,విష్ణు ,మహేశ్వరులుగా బావిస్తా రు.ప్రస్తు తం ఈ గుడి పూర్తిగా

శిధిలావస్థ లో వుంది లింగం యొక్క పై బఃగమ్ మాత్రమే చూడగలము.లింగ ఎత్తు

సూమారుగా 14 అడుగులే వుంటుంది.


సామర్ల కోట చేరుకోవటం చాలా సులువు . సామర్ల కోట సొ ంతంగా రైల్వే స్టేషన్ కలిగి

ఉన్నది. రైల్వే స్ట ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రా ంతాల నుండి వచ్చే రైళ్లన్నీ

ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న

కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు. సామర్ల కోట కు రాజమండ్రి, కాకినాడ మరియు

దాని సమీప ప్రా ంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు.కాకినాడ నుండి సామర్ల కోట

ప్రయాణంచాలా బావుంటుంది .గోదావరి వెంబడి చుట్టూ పచ్చని పొ లాలు రోడ్ కి

ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లా దముగా వుంటుంది. అంతే కాకుండా , ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట ్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే

యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తు న్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర కార్తీక మాసం

లో ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు

ముగుస్తు ంది.

You might also like