Professional Documents
Culture Documents
Gudimallam Temple History
Gudimallam Temple History
ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న
ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది....ఈ దినోత్సవం ను పురస్కరించుకుని మన దేశంలో నే తొలి
శివాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. గుడిమల్లం, చిత్తూరు జిల్లా , ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం..
చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3
శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన
మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నదిఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు
ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థా నంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు
చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా
పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ
మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు
మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష
లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తు గానూ
లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లు గా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థా నకమూర్తి)
రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టు కొనగా,
ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టు కొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార
(జటలన్నీ పైన ముడివేసినట్లు ) తలకట్టు తో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి,
మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము
మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తు న్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లు గా అందుండి స్వామివారి
శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తు న్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము, క్రింది పొడవైన
స్తంభభాగములను విడదీస్తు న్నట్లు గా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి
ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.
గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా
రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు.
గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం
అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టు ను అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని
చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టా రు. అక్కడ దీన్ని చూడవచ్చు.ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు
జిల్లా లోని గుడిమల్లం గ్రామంలో ఉన్ందే.[ఆధారం చూపాలి] ఇది క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు.
1911 లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో
ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను
పట్టు కుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రు ని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రు ని వస్త్రధారణ రుగ్వేద
కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి
ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్ఠా కారం లో గంభీరంగా ఉంటుంది.ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని
పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దా నికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు
బయట పడ్డా యి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని
1954 లో గుడిమల్లం గ్రామస్తు ల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు
ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్సై ట్లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం
లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.ఏ ఎస్ ఐ ధర్మాన కనీసం పూజలు కూడా
చేసుకోలేక పోతున్నామని……వాపోతున్న గుడిమల్ల గ్రామస్తు ల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండి 2008 వరకు డైరెక్టర్
జనరల్ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టా డు.ఈ గుడికి
సంబంధించిన ఆస్తు ల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది.
ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009 లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తు లకు అనుమతి సాధించాడు.
గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం
ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘డెవలప్ మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్
అర్కిటెక్చర్ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర
సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్ దేముడి మాయలో పడబోతుంది. కోట్లరూపాయల హెరిటేజ్ ప్రాజెక్టు లో ఇదీ
భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగపూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్హౌస్ కట్టే ప్లా న్లో ఉన్నారు.ఉజ్జయినిలో
లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3 వ శతాబ్ధా నికి చెందినవిగా
గుర్తించబడ్డా యి.