You are on page 1of 3

🎻🌹🙏తూర్పుగోదావరి కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న...!!

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు…తూర్పుగోదావరి జిల్లా . గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ
పుణ్యథామంగా విలసిల్లు తున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా
విడి సుమారు 100 కిమీ మేర ప్రయాణించి సముద్రు ణ్ణి చేరుతుంది.

🌿రాజమండ్రి నుండి అటు ధవళేశ్వరం మీదుగా 30 కిమీ ప్రయాణం చేసినా.. ఇలా రావులపాలెంనుడి 8 కిమీ ప్రయాణం చేసినా
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామం చేరుకోవచ్చు.

🌸ఇప్పుడు బాగా వినిపిస్తు న్న మాటేమంటే ఒక ఏడువారాలు వాడపల్లి వెంకన్నను దర్శిస్తే అనుకున్నది నెరవేరుతుందని.
పుణ్యతీర్థా ల దర్శనం గురించి మనకు పురాణేతిహాసాలు చెబుతూనే ఉన్నాయి.

🌿భారతంలో ప్రతీపుడు అనేక పుణ్య తీర్థా ల్లో స్నానం ఆచరించిన తర్వాతే శంతనుడు జన్మించాడు.తీర్థ స్నానాన్ని గురించి
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నదీ ప్రవాహం అనేక మూలికా ద్రవ్యాలతో కూడుకున్నది.

🌸ఎన్నో వనాలనుండి నీరు ప్రయాణించుకుంటూ వస్తోంది. అందుకే నదీ స్నానం పరమ పుణ్యఫలం. అక్కడే భగవంతుని
ప్రతిష్టలు జరిగాయి. ఈ వాడపల్లి క్షేత్రంకు అదే మహత్తు ఏర్పడటానికి కారణం.

🌿చందన వెంకన్న అని ఈయనకు పేరు. చందన వృక్షం మానులో ఈయన ఉన్న విషయాన్ని గ్రామ వాసులు కనుగొని
ప్రతిష్టించారు. ఒకసారి పురాణ చరిత్రను చూద్దాం!

🌷స్థల పురాణం🌷

🌸కలియుగంలో ప్రజలు ఆహార విహారాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తు న్నారు. అధర్మం పాలు పెరిగింది. స్వార్థం పెరిగి కామ
క్రోథాదులతో జనం అధర్మజీవనం గడుపుతన్నారని వైకుంఠంలో సనకసనందనాదులు శ్రీమన్నారాయణుణ్ణి వేడుకున్నారు.
🌿తాను గౌతమీ నదీతీరంలోని నౌకాపురం వద్ద్ద లక్ష్మీ సమేతుణ్ణై చందన వృక్షపేటికలో వెలుస్తా ను అని చెప్పడం, నారదుడు
ఈవిషయాన్ని అందరికి చేరవేయడం జరిగింది.

🌸కొంతకాలానికి నౌకాపురం(ఇప్పటి వాడపల్లి) ప్రజలకు గౌతమీ గోదావరిలో కొట్టు కొస్తు న్న వృక్షం కనిపించింది. తీరా ఒడ్డు నకు
తీసుకొద్దా మంటే దారిలో మాయమయ్యేది. కలి కల్మషం వల్ల మీరు దీనిని గుర్తించలేకపోతున్నారని పండితులకు స్వామి కలలో
కనబడి ‘నదీగర్భంలో కృష్ణ గరుడ వాలినచోట చందనపేటికలో ఉన్నానని‘

🌿తెలుపడంతో అందరూ వెళ్ళి చందన పేటికను కనుగొన్నారు. దానిని ఒడ్డు నకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపిస్తే దానిలో
శంఖ, చక్ర, గదలతో కంఠంలో వనమాలతో నుదుట ఊర్ధ్వపుండ్రాలతో పద్మాలవంటి కనులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ
విగ్రహం కనబడింది.

🌸దేవర్షి నారదుడు అక్కడికి చేరుకుని గతంలో స్వామి మునులకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకుని ఇది విష్ణువు అర్చావతారంగా
గుర్తెరిగి పురజనులకు తెలిపాడు. కలియుగంలో పాపం పెచ్చుమీరిన తరుణంలో స్వామి దర్శనంతో ఆలోచన సవ్యమై జీవనం
సుఖంగా సాగుతుందనేది పురాణ ఇతివృత్తం.

🌿పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల(చిన్నతిరుపతి)లానే కోనసీమ తిరుపతిగా నౌకాపురమనే ఇప్పటి వాడపల్లి క్షేత్రం ఎంతో ఖ్యాతి
గడించింది. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం చూడగానే ఆనందింప చేసే రూపంగా లక్ష్మీ స్వరూపుడై వెంకన్నదర్శనమిస్తా డు.

🌷ఆలయం🌷

🌸మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసి లయం ముందుభాగంలో పదహారు స్తంభాలతో
కూడిన యజ్ఞశాల కనిపిస్తా యి. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు మరియు ద్వాదశ గోపాలాలలో ఒకటిగా
చెప్పుకునే నారద

🌿ప్రతిష్టితమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాలస్వామి, త్తరం వైపున అలివేలుమంగ, ఆగ్నేయ భాగంలో
రామానుజులు, ఆలయ అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తా యి. అలాగే ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత
విశ్వేశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది.

🌸పెద్దా పురం సంస్థా నాధీశుడు రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజు 1759 లో స్థిరాస్థు లు సమర్పించారు.
గజేంద్రు డు అనే ఓడల వ్యాపారి ఇక్కడే నివసించేవాడు. దీనికి ఓడపల్లి అనే గ్రామంగా విలసిల్లి తర్వాత వాడపల్లిగా
వినుతికెక్కింది.

🌿తన ఓడలన్నీ భ్రదంగా ఒడ్డు కు చేరితే గుడి కట్టిస్తా నని మొక్కుకుని గజరాజు ఈ క్షేత్రం నెలకొల్పినట్టు స్థా నికుల వాక్కు.

🌷చైత్రశుద్ధ ఏకాదశి🌷

🌸చైత్ర శుద్ద ఏకాదశి రోజున స్వామి కల్యాణం తీర్థం జరగుతాయి. వాడపల్లి తీర్థం అంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశస్థి కెక్కింది.
మరో విశేషమేమంటే సంతానం కలగని వారు ఈయనను దర్శించుకున్న తర్వాత సంతానవంతులౌతారు.

🌿అందుకే పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తర్వాత తూకం వేసి స్వామికి సమర్పించడం కద్దు . అంతేకాదు
హారతికర్పూరం తోను తులాభారం వేస్తా రు. ఈ వేడుకలు చూసి తరించాల్పిందే. కలియుగంలో పాప ప్రక్షాలన కోసం
భగవదారాధన తప్పనిసరి.

🌸పుణ్యక్షేత్రాల ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవతార్చన ప్రాంతాల్లో మంత్ర శక్తి (వైబ్రేషన్స్) ఉంటాయనడానికి

ఆధునిక కాలంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి....స్వస్తి....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

You might also like