You are on page 1of 6

4. ఓంకారమమలేశ్వరం......

ఇప్పుడు ఆ శ్లో కంలోని నాలుగో క్షేత్రా న్ని చూద్దా ం. అదే మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరంలో వున్న
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నర్మదానది ప్రవహించే ప్రా ంతం. నర్మదానది ఇక్కడ వున్న ఒక కొండ
వల్ల రెండుగా చీలి నర్మదా, కావేరి అనే రెండు పేర్లతో ప్రవహించి మళ్ళీ ఇక్కడే ఆ రెండు పాయలూ
కలిసి తిరిగి నర్మదగానే ప్రవహిస్తు ంది. ఈ కొద్ది ప్రా ంతం అంతా ఒక లంక వలే ఏర్పడి నదికి
ఒకవైపు కొండమీద ఓంకారేశ్వర లింగం, నదియొక్క రెండో వైపు భూమిమీద మమలేశ్వరలింగం
ఉంటాయి. ఈ కావేరి వేరు, కర్ణా టక, తమిళనాడులో ప్రవహించే కావేరీనది వేరు. కేవలం పేరు

ఒక్కటే, అంతే. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ కూడా పుష్కలం. ఈ కొండ ॐ అనే ఆకారంలో
ఉండటం వల్ల ఈ ప్రా ంతం అంతా ఓంకారేశ్వరం అంటారు. ఆదిశంకరులు ఈక్షేత్రం గురించి
ఈవిధంగా చెప్పారు.

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జ నతారణాయ |


సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే || 

ఈ శ్లో కార్ధం ఏమిటంటే, నిత్యమూ వసంతాన్ని తలపించే ప్రదేశంలో కావేరీ, నర్మదా నదుల సంగమ
స్థ లమైన మాంధాతృపురిలో సజ్జ నులందరినీ తరింప చేయటానికి వెలసిన ఓంకారేశ్వరునకు
ప్రణామాలు అని. ఇక్కడ మధ్యప్రదేశ్ టూరిజం వారి హో టల్ వుంది. అక్కడ అన్ని వసతులూ
వున్నాయి. మేము అక్కడ దిగి మా యాత్ర మొదలుపెట్టా ము. అక్కడ నర్మదను దాటితే కానీ
జ్యోతిర్లింగ మందిరం చేరుకోలేము. నదిని దాటడానికి పడవలు చాలా వున్నాయి. ఆ పడవల్లో నే
నర్మదానదీ పరిక్రమ కూడా చేశాము. అప్పుడు ఆ కొండ ఓంకార ఆకారంలో ఉందని ఆ పడవలు
నడిపేవారు చూపిస్తా రు. మమ్మల్ని కాస్త లోపలికి పెద్ద పెద్ద రాళ్లు వున్న ప్రా ంతానికి తీసుకువెళ్లి
అక్కడ స్నానం చేయమన్నారు. నిజంగానే అక్కడ లోతు ఎక్కువ లేదు. మేము మామూలుగానే
అలవాటుగా ఎందుకైనా మంచిదని, తోడుంటాడని, మా క్యాబ్ డ్రైవర్ సో నూని మాతో తీసుకు
వెళ్లా ం. రమేష్ గారు కొంచం నీళ్ళల్లో కి జారారు. సో నూ వెంటనే పట్టు కున్నాడు. మునిగిపో యే
లోతూ, ప్రమాదమూ లేదు కానీ, పడితే దెబ్బలు తగులుతాయి కదా. థాంక్స్ టు సో ను.
స్నానాలు అయ్యాక మమలేశ్వర్ సేతు ద్వారా నడిచి కొండ మీదకు డైరెక్ట్ గా చేరుకున్నాం. ఈ
మమలేశ్వర్ సేతువు నిర్మాణంలో ఎక్కడా పిల్లర్లు లేవు. ఇటు భూమీ, అటు కొండా రెండు వైపుల
నుంచి గట్టి లావైన ఇనపమోకులతో గట్టిగా బిగించి కట్ట బడి ఉంటుంది. ఐదారుగురు మనుషులు
నడవగల వెడల్పుతో ఉంటుంది. దీన్ని భక్తు ల సౌకర్యార్థం 2004 కుంభమేళా
సమయంలో నిర్మించారట.

ఆ బ్రిడ్జి దాటి కొండకు చేరగానే ఒక సన్నని త్రో వ మనల్ని గుడి దగ్గ రకు తీసుకువెళ్తు ంది. మేము
వెళ్లి న రోజు ఎక్కువమంది జనం లేరు. మేము చాలాసార్లు దర్శనం చేసుకున్నాం. అక్కడ ఒక
పూజారి మమ్మల్ని తీసుకువెళ్లి స్థ లగాధ చెప్పి, ఒక మండపంలో కూర్చోబెట్టి సంకల్పం చెప్పించి
మాంధాత విగ్రహం చూపించాడు. శ్రీరాముడి పూర్వీకులైన ఇక్ష్వాకు కుల రాజు మాంధాత ఈ
కొండపై తపస్సు చేసుకుని ఓంకారేశ్వరుడు ప్రత్యక్షమైయాక ఆ దేవుణ్ణి అక్కడే కొలువై ఉండమని
కోరాట్ట . అప్పటినుంచీ మాంధాత కోరిక మేరకు ఓంకారేశ్వరుడు ఇక్కడే స్థిరంగా వుండి భక్తు లను
కరుణిస్తు న్నాడట. ఆ ఊరిపేరు ఆరాజు పేరు మీద మాంధాతృపురి అని వచ్చిందని చెప్పాడు.
అందుకే కాబో లు ఆది శంకరులు తన శ్లో కంలో ఈ లింగాన్ని తన తరువాత తరాల వారు కూడా
తేలికగా గుర్తించటానికి వీలుగా కావేరీ నర్మదా నదీ సంగమం వద్ద మాంధాతృపురిలో అని
చెప్పాడు. తరువాత మమ్మల్ని లోపలి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వద్ద కు తీసుకువెళ్ళాడు. నిరంతర
అభిషేకాలు, రాపిడి వల్ల లింగం అరిగిపో తోందని చుట్టూ గాజుపలకలతో దడి లాగా కట్టి ఉంచారు.
కానీ లింగానికి అడుగు దూరం వరకూ వెళతాము. అభిషేకాలు చేయటానికి సో మనాథ్ లో లాగా
చిన్న చిన్న పైపులు పెట్టా రు. మనం మనదగ్గ ర వున్న పాత్రలో నీరు పో స్తే అది పైపుల ద్వారా
స్వామిని అభిషేకిస్తు ంది. అక్కడి నుంచే అభిషేకం పూజా చేయించారు. అన్నీ సంతృప్తిగా
జరిగాయి. లింగం చిన్నదే గానీ చూడంగానే స్వయంభూలింగం అని తెలుస్తో ంది. ఒక రకం
దివ్యమైన శక్తి, స్పర్శ స్పష్ట ంగా తెలిసింది. బైటకు వచ్చినా మనసు నిండక మళ్ళీ మళ్ళీ వెళ్లి
దర్శనం చేసుకున్నాం. అయినా చివరకు వదలలేక వదలలేక వెళ్లి నట్టు బయటకు వచ్చాము.
 

ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి, మరునాడు వూళ్ళో వున్న ఇతర ముఖ్య దేవాలయాలను
చూసుకుంటూ మమలేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళాము. పూర్వకాలంలో నర్మదానది ఉధృతంగా
ప్రవహిస్తూ వున్న రోజుల్లో కొండ మీది ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోవడం అసాధ్యమయ్యేదట.
ఆదిశంకరులు తన గురువు గోవిందపాదుణ్ణి మొదటిసారిగా కలుసుకుని సన్యాసదీక్ష తీసుకున్నది
ఇక్కడనే అని శంకరచరితల
్ర ో కనపడుతుంది. అప్పుడు అది శంకరులు చెప్పిన నిర్వాణషట్కము
ఇక్కడి ఆలయం గోడలమీద చెక్కించారు. శంకరులు ఈ ప్రా ంతంలోనే ఎన్నో స్తో త్రా లూ, రచనలూ
చేసాడని ప్రతీతి. నిరంతరమూ ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకునేవారికి ఎటువంటి వ్రతభంగమూ
కలగకుండా, ఆదిశంకరులు ఒడ్డు పైన మమలేశ్వరుణ్ణి ప్రతిష్టించి, ఈ మమలేశ్వరుణ్ణి దర్శనం
చేసినా ఓంకారేశ్వరుణ్ణి దర్శనం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు. అప్పటినుంచీ అందరూ
ఈ క్షేత్రా న్ని కూడా సందర్శించడం అలవాటు అయిపో యింది. కానైతే ఈ రోజుల్లో నది ఉధృతంగా
వున్నప్పుడు కూడా నదిని దాటే సౌకర్యాలు వచ్చాయి. ఇక్కడ రెండు జ్యోతిర్లింగాల దర్శనం
చేసినందువల్ల మేము దర్శనం చేసిన జ్యోతిర్లింగాల సంఖ్య ఒకటి పెంచాను. మరో రెండు కూడా,
ఇలాగే రెండు రెండు చూసాము. అందుకే మొత్త ం పదిహేను జ్యోతిర్లింగాలను చూశామని ముందు
మాటలో చెప్పాను.

ఇక్కడ అదిశంకరుల గుహ వున్నది. ఆది శంకరులు చాలాకాలం ఇక్కడ తపస్సు చేసాడు. ఇక్కడ
ఋణముక్తేశ్వర ఆలయం కూడా వుంది. ఆ ఆలయంలో స్వామిని పూజిస్తే జన్మజన్మల ఋణం
తీరిపో తుందనీ, ఋణాలు తీరిపో వటం వల్ల మోక్షప్రా ప్తి కలుగుతాయనీ చెప్పారు. ఈ క్షేత్రంలో
కూడా ఆలయానికి ఒక వెబ్ సైట్ వుంది. లైవ్ దర్శన్ కూడ వుంది. కానీ అది అంత చక్కగా పని
చేయటం లేదు. అయినా ఒకసారి ప్రయత్నించి చూడండి. లైవ్ దర్శనం కాకపో యినా,  కనీసం
ఆలయం ఇతర వివరాలూ, బుకింగ్ సౌకర్యాలూ తెలుస్తా యి. 

http://shriomkareshwar.org/HVisheshDarshan.aspx
ఓం శ్రీ మహాకాళేశ్వరాయనమః, ఓం శ్రీ మమలేశ్వరాయనమః, 
ఓం శ్రీక్షిప్రా యైనమః 

       తరువాత మనం వైద్యనాథ్ ధామ్ గురించి చెప్పుకుందాం.

భట్టిప్రో లు విజయలక్ష్మి
9885010650

You might also like