Professional Documents
Culture Documents
భారతదేశం - జాతీయ చిహ్నాలు - వికీపీడియా
భారతదేశం - జాతీయ చిహ్నాలు - వికీపీడియా
చిహ్నాలు
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని భారత
జాతీయతా సూచికలు వ్యాసంలో విలీనం
చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
ప్రతి దేశానికి కొన్ని ప్రత్యేక చిహ్నాలున్నట్లే
మనదేశానికి కూడా ప్రత్యేక చిహ్నాలున్నాయి
జాతీయ పతాకం
త్రివర్ణ పతాకంగా పిల్వబడుతున్న మన దేశ
జాతీయ పతాకంలో అడ్డంగా 3 రంగులుండి
మధ్యలో ధర్మచక్రం కల్గు ఉంటుంది. పైన కషాయం,
మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులను కల్గి
24 ఆకులు కల ధర్మ చక్రం నీలపు రంగులో
ఉంటుంది. పతాకపు పొడువు, వెడల్పులు 3:2
నిష్పత్తిలో ఉండి ధర్మ చక్రం పైన ఉండే కషాయం
రంగుకు, క్రిందనుండే ఆకుపచ్చ రంగుకు తాకుతూ
ఉంటుంది. పైన ఉండే కషాయం రంగు సాహసం,
త్యాగానికి చిహ్నం, మధ్యలో ఉండే తెలుపు రంగు
శాంతి, స్వచ్ఛతలకు గుర్తు , చివరన ఉండే ఆకుపచ్చ
రంగు విశ్వాసానికి చిహ్నం. ధర్మ చక్రం
నిరంతరాయమైన చలనానికి చిహ్నం.
జాతీయ ముద్ర
సారనాథ్ లోని అశోక చక్రవర్తి చెక్కించిన 4 తలల
సింహపు చిహ్నమే మనదేశ జాతీయ చిహ్నం.
సారనాథ్ స్థూ పంలో వాస్తవానికి 4 సింహాల స్థూ పం
ఉన్ననూ మనకు బొమ్మలో వెనక వైపు మరో తల
కన్పించక 3 తలలే దర్శనమిస్తా యి. సింహాల క్రింద
పీటం మధ్యలో ఒక చక్రం ఉంటుంది. జాతీయ
పతాకంలో ఉన్నది ఈ చక్రమే. ఈ చక్రా నికి
కుడివైపున వృషభ చిహ్నం, ఎడమ వైపున గుర్రపు
చిహ్నం ఉన్నాయి. పీటం అడుగున సత్యమేవ
జయతే అనే అక్షరాలు దేవనాగరి లిపిలో
కన్పిస్తా యి. సత్యమే జయించును అని దీని
భావం.
భారత రాజ్యాంగం అసలు కాపీని అందంగా
తీర్చిదిద్దే పనిని కాంగ్రెస్ నందలాల్ బోస్ (అప్పటి
శాంతినికేతన్ లోని కళా భవన్ శాంతి నికేతన్
ప్రిన్సిపాల్) కు ఇచ్చింది. బోస్ తన విద్యార్థు ల
సహాయంతో ఈ పనిని పూర్తి చేయడానికి
బయలుదేరాడు, వారిలో ఒకరు 21 సంవత్సరాల
వయసున్న దిననాథ్ భార్గవ. అశోక లయన్
కాపిటల్ ను రాజ్యాంగం యొక్క ప్రా రంభ పేజీలలో
చేర్చడానికి బోస్ ఆసక్తి చూపించాడు. సింహాలను
వాస్తవికంగా చిత్రీకరించాలని కోరుకుంటూ, కోల్కతా
జంతుప్రదర్శనశాలలో సింహాల ప్రవర్తనను
అధ్యయనం చేసిన భార్గవను ఎన్నుకున్నాడు.
జాతీయ గీతం
జనగణమణ
జాతీయ గేయం
వందే మాతరం
జాతీయ సెలవలు
డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)
రిపబ్లిక్ దినోత్సవం (జనవరి 26)
స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్టు )
గాంధీ జయంతి (2 అక్టో బర్)
జాతీయ భాష
భారతదేశానికి జాతీయ భాషగా ఏ భాష లేదు.
కేవలం అధికార భాషగా ఆంగ్లం, హిందీ ఉన్నాయి.
అనగా వీటిని కేవలం ప్రభుత్వం సందేశాలకి
వాడుతుంది. అంతే కానీ ఇవే జాతీయ భాషలు
కావు. పైగా ప్రతి రాష్ట్రానికి అధికారిక భాషలు వేరు
వేరుగా ఉన్నాయి.
జాతీయ పక్షి
భారతదేశ జాతీయ పక్షి నెమలి.
జాతీయ జంతువు
బెంగాల్ టైగ్రిస్ పులి.
1948 లో గుజరాత్ నేచురల్ హిస్టరీ సొసైటీ చేసిన
ఒక ఉద్యమం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ను
ఆసియా సింహాన్ని జాతీయ జంతువుగా
ప్రకటించవలసి వచ్చింది. కానీ 1972 లో, భారత
వన్యప్రా ణి బోర్డు సమావేశంలో బెంగాల్ పులిని
జాతీయ జంతువుగా స్వీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతయినా పులి దేశంలోని 16
రాష్ట్రాలలో ఉండగా, ఆసియా సింహం
గుజరాత్లోని గిర్లో మాత్రమే ఉండడమే దీని
ప్రధాన కారణం. వేట కారణంగా పులి జనాభా
తగ్గు ముఖం పట్టడంతో, దీనిని జాతీయ జంతువుగా
ప్రకటించడం ప్రజావగాహన పెంచడానికి, దాని
పరిరక్షణకు సహాయపడుతుంది అని ఇంకా పులి
భారతదేశం యొక్క వన్యప్రా ణుల సంపదకు చిహ్నం
అని కూడా కొన్ని కారణాలు.
జాతీయ పుష్పం
తామర పువ్వు
జాతీయ క్రీడ
హాకి
జాతీయ వృక్షం
మర్రి చెట్టు
జాతీయ క్యాలెండరు
భారతదేశ జాతీయ క్యాలెండర్ శక క్యాలెండర్.
జాతీయ ఫలం
మామిడిపండు
మూలాలు
1. https://police.py.gov.in/Re-
Notification%20of%20Tiger%20and%
20Peocock%20as%20National%20ani
mal%20and%20bird.PDF#page=2
"https://te.wikipedia.org/w/index.php?
title=భారతదేశం_-_జాతీయ_చిహ్నాలు&oldid=3872394"
నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 28 మార్చి 2023న 05:54కు
జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద
లభ్యం