Professional Documents
Culture Documents
శిక్షింపబడతారు
1.నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపో వువరకు కొంచెముసేపు
దాగియుండుము. యెషయా 26:21.
ఈ వాక్యమందు దేవుడు తన ప్రజలకు lock down ప్రకటించెను. ఇప్పడు మనము lock down ప్రకటించుకొని మనలను
కాపాడుకొనుటకు తలుపులు వేసికొంటున్నాము దీనికి కారణం ఏమిటి ?దేవుడు ఏవిధముగా తనను తాను పరిశుద్ధ
పరచుకొంటున్నాడో తెలుసా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు
ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. యెషయా 45 -12.
కాని ఈ భూమిని మనుష్యులు విపరీతముగా మలినము చేసేస్తు న్నారు. అదెట్లనగా, ఒక వైరస్ మహమ్మారి విపత్తు
వచ్చినప్పుడు ఇప్పుడు lock down పాటించాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి విపత్తు లు రాకముందు ఈ
మనుష్యులు ఎలా జీవిస్తు ఈభూమిని విషతుల్యం చేస్తు న్నారో ఆలోచించారా? సాతాను సింహాసనమున్న స్థ లములో నీవు
కాపురమున్నావని గ్రహిస్తు న్నావా? నేనెరుగుదును. నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా,
1. సంఘము-దేవుని ఆలయము:- ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము
ప్రా ర్థన మందిరము అని వ్రా యబడియున్నది.
అయితే మీరు దానిని దొ ంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
2.భక్తిహీనత:- భక్తిహీనతయను త్రా ళ్ల తో దో షమును లాగుకొను వారికి శ్రమ.
3. పాపము:- బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ
4. కీడు- చీకటి క్రియలు:- కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను
వారికి శ్రమ.
5. అన్యాయపు తీర్పు:- వారు లంచము పుచ్చుకొని దుష్టు డు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని
దుర్నీతిగా కనబడచేయుదురు.
6. త్రా గుబో తులు:- Bars,Club Culuture:- . మద్యము త్రా గుదమని వేకువనే లేచి ద్రా క్షారసము తమకు మంట పుట్టించు
వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు
ద్రా క్షారసము త్రా గుచు విందు చేయుదురుగాని యెహో వా పని యోచింపరు ఆయన హస్త కృత్యములను లక్ష్యపెట్టరు.
7. జారత్వము- వ్యభిచారము :- ఆలకించుడి, వారు దేశములో దుర్మార్గ ము జరిగించుచు, తమ పొ రుగువారి భార్యలతో
వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞా పింపని అబద్ధ పు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి,
8. నరహత్యలు:- మీ చేతులు రక్త ముతో నిండియున్నవి. యెహో వా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి
తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రా గిన రక్త మును బయలుపరచును.
9. విగ్రహారాధన:- అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు
బలియిచ్చిన వాటిని తినునట్లు ను, జారత్వము చేయునట్లు ను, ఇశ్రా యేలీయులకు ఉరి యొడ్డు మని బాలాకునకు నేర్పిన
బిలాముబో ధను అనుసరించువారు నీలో ఉన్నారు జనులు కేవలము పశుప్రా యులు, అవివేకులు; బొ మ్మల పూజవలన
వచ్చు జ్ఞా నము వ్యర్థము.
ఈ విధముగా ఈ ప్రజల ప్రవర్త న వలన భూమి మలినమై పో యినది. అందుకే దేవుడు తనను తాను
పరిశుద్ధ పరచుకొనవలెననుకొనుచున్నాడు అలసిపో యి, మలినమైన ఈ శరీరమునకు ప్రతిరోజు స్నానము ఎంత అవసరమో
స్నానము చేయకపో తే మనకు ఎంత చిరాకుగా ఉంటుందో అలాగే భూమి నాదే అన్న దేవుడు మన హేయక్రియలవలన ఈ
భూమిని విషతుల్యంచేస్తే ఆ దేవునికి కూడ చిరాకుగా ఉండదా తనను తాను పరిశుద్ధ పరచుకొనడా ఇప్పుడు lock down,
social distance వలన ఈ భూమి మీద ఉన్న నదులు, సముద్రా లు, నేల శుభ్రం చేయబడుచున్నది. వాతావరణంలో ఉన్న
కాలుష్యం తగ్గి ప్రకృుతి కూడా స్వచ్ఛంగా కనబడుతుంది. Lock down వలన హేయమైన దుష్క్రియలు జరుగకుండా
కొంతకాలం అడ్డు కట్ట వేయబడినది. ఈవిధముగా దేవుడు తన నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనుచున్నాడు.
కావున నా ప్రజలు జ్ఞా నము లేకయే చెరపట్ట బడి పో వుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు
సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.
అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టు కొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది Ex-Death
వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపో వుదురు.
అల్పులు అణగద్రొ క్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠు ల చూపు తగ్గు ను
సైన్యములకధిపతియగు యెహో వాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధు డైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ
పరచుకొనును. Lock Down, social distance.
నీశరీరమునకు, నీ మనస్సునకు, నీ ఆత్మకు,పరిశుభ్రత, పరిశుద్ధ త ఎలా అవసరమో అలాగే ప్రకృుతికి,ప్రకృుతిని సృుష్టించిన
ఆ దేవునికి కూడా పరిశుభ్రత, పరిశుద్ధ త అలాగే అవసరం. కాబట్టి ఇప్పటి lock down ఎటెల్లకాలం ఉండే వీలుపడదుకదా
కాబట్టి ఇప్పటికైన పరిశుద్ధ క్రియలు చేయుటకు lock down ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా విధించుకోవాలి లేకపో తే మరల మరల
ఇటువంటి విపత్తు లు వస్తు నే ఉంటాయు ఎందుకంటే దేవుని ప్రా ణం, ఆత్మ ఈ భూమికి ఉంటుంది కనుక దేవుడు కూడా
పరిశుభ్రత, పరిశుద్ధ త కోరుకుంటాడు. అందుకే కావున మారుమనస్సు పొ ందుము; నీవేలాగు ఉపదేశము పొ ందితివో యేలాగు
వింటివో జ్ఞా పకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొ ందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను
దొ ంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది
జ్ఞా పకము చేసికొని మారు మనస్సుపొ ంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొ ందితేనే సరి;
లేనియెడల నేను నీయొద్ద కు వచ్చి నీ దీపస్త ంభమును దాని చోటనుండి తీసివేతును. మారుమనస్సు పొ ందుటకు నేను
దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొ ందనొల్లదు.
నీ బ్రతుకు మారకపో తే ఇటువంటి విపత్తు లు వస్తు నే ఉంటాయి.
ఆజ్ఞా తి క్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. మొదటి మనుష్యుడైన ఆదాము అతిక్రమము వలన
మరణము వచ్చెను. భూమి అనగా నేల శపింపబడెను.
దేవుని ఆశీర్వాధము:- దేవుడు ఆదామును, భూమిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధిపొ ంది విస్త రించి భూమిని నిండించి
దానిని లోపరచుకొనుడి; అని దేవుడు వారిని ఆశీర్వ దించెను; మరియు దేవుడైన యెహో వాఈ తోటలోనున్న ప్రతి వృక్ష
ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;
దేవుడు ఆజ్ఞా పించెను:-. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున
నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞా పించెను.
ఆజ్ఞా తి క్రమము వలన పాపము వచ్చెను :-
పాపము :- దేవుడు మనుష్యులను యధర్దవంతులనుగా సృుష్టించెను కాని వారు వివిధ తంత్రములను కల్పించుకొని
పాపమును సమకూర్చుకొనిరి.
దేవుని చేత శిక్ష వేయబడెను :-
1.నేల శపింపబడెను :- ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్ద ని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివి
గనుక నీ నిమిత్త ము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; నీవు
నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు;
పాపము వలన వచ్చు జీతము మరణము:-.
2. మరణము విధించబడెను:- ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపో దువని
చెప్పెను. అప్పటి నుండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టు కొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది
మరణము నుండి విడుదల ఇస్తా నని దేవుడు ప్రమాణము చేసెను:-
సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద
ఆయన తీసివేయును
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహో వా ప్రతివాని ముఖముమీది బాష్ప
బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహో వా
సెలవిచ్చియున్నాడు.
మరణశాసనము :- మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రా సినవాని మరణము అవశ్యము.
ఆ శాసనమును వ్రా సినవాడు మరణము పొ ందితేనే అదిచెల్లు ను; అది వ్రా సినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను
చెల్లు నా? మనుష్యులొక్కసారే మృతిపొ ందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
మరణముపై జయము :- ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు
కనిపెట్టు కొని యుండువారి రక్షణ నిమిత్త ము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
పాపక్షమాపణ – విమోచన :- ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన
తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
రక్షణ:-
ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టు కొని యున్న మన దేవుడు మనము
కనిపెట్టు కొనిన యెహో వా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.
ఆత్మ సంభంధమైన వారిగా ఏర్పరచబడిన దేవుని కుమారులు శరీర సంబంధమైన వారిగా తమ క్రియలు మార్చుకున్నప్పుడు
దేవునికి ఎంత భాధ కలుగుతుందో వారిని ఎలా శిక్షించాడో దేవుని వాక్యంలో చదవండి.
శిక్షింపబడతారు :-
దేవునికి కోపము వచ్చినప్పుడు ఎలాంటి ఉపదృువాలు జరుగుతాయో దేవుని వాక్యములో చదివి తెలుసుకొనండి. దేవుని
వ్యక్తిత్వంలో కూడా మనుష్యులు లాగానే భాధా , దుంఖము, కోపము, సంతోషము, సహనము వంటి స్వభావము
వుంటుంది.గనుక ఈ మనుష్యులు వారి ప్రవర్త నతో దేవుని సహనానికి పరీక్షగా మారుతున్నారు.
2.ఎందుకు భూమి శిక్షించబడుతుందంటే :- భూలోకము దేవుని సన్నిధిని చెడిపో యియుండెను; భూలోకము
బలాత్కారముతో నిండియుండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపో యి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గ మును
చెరిపివేసుకొని యుండిరి. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి
అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. అని అనుకొనును.
3.ఈ భూమి జల ప్రవాహము వలన శిక్షింపబడెను :- ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ
కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్త మును చని పో వును;
ఇది ఎలా జరిగింది?
ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్త రించి ఓడను తేలచేసినందున అది
భూమిమీదనుండి పైకి లేచెను.
జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్త రించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను.
ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు
మునిగిపో యెను.
పదిహేను మూరల యెత్తు న నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పో యెను. అప్పుడు పక్షులేమి
పశువులేమి మృగములేమి భూమిమీద ప్రా కు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి
చచ్చిపో యిరి.
పొ డి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పో యెను.
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి
భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్ల ప్పుడు
కేవలము చెడ్డదనియు యెహో వా చూచి
4.తాను భూమిమీద నరులను చేసినందుకు యెహో వా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను:- అప్పుడు
యెహో వా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద
నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించి
5.దేవుడు ఈ భూమిమీద నీతిమంతులు ఉన్నారా లేదా దేవుని యెడల భయ భక్తు లు కలిగినవారు ఉన్నారా లేదా అని
పరిశీలన చేస్తు ఉన్నాడు:- అయితే నోవహు యెహో వా దృష్టియందు కృప పొ ందినవాడాయెను. నోవహు నీతిపరుడును తన
తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
యెహో వాఈ తరమువారిలో నీవే నా యెదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో
ప్రవేశించుడి.
అప్పుడు యెహో వానా ఆత్మ నరులతో ఎల్ల ప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రు లై యున్నారు;
6.దేవుడు మనుష్యులను యధార్ధవంతులనుగా సృష్టించెను గాని వారు వివిధ తంత్రములను కల్పించుకొనిరి
కాబట్టి ఈ మనష్యులు వారి విపరీత ప్రవర్త న వలన దేవునిని విసికించినప్పుడు ఆ దేవుడు కూడ తన సహనాన్ని కోల్పోతాడు.
అప్పుడు ఈ ప్రజలను శిక్షించాలని అనుకుంటాడు. అదే ఈ ప్రజలు ప్రశ్చాత్తా ప హ్రు దయంతో దేవునికి భయపడితే వారిని
క్షమించాటానికి రక్షించటానికే దేవుడు ఇష్ట పడతాడు. ఎవరైతే వారి హృుదయమును కఠినపరచుకొని దేవుని భయము వదలి
దేవునిని నిర్ల క్ష్యపెడతారో, దేవునిని తుృణీకరిస్తా రో అప్పుడు దేవుడు కూడా తన సహనాన్ని కోల్పోయి
శిక్షించాలనిఅనుకుంటాడు. ఈవిధముగానైనా ఈ ప్రజలలో దేవుని భయము వచ్చి తమ ప్రవర్త న మార్చుకొని దేవుని వైపు
తిరుగుతారనే ఉధ్దేశముతో దేవుడు శిక్ష విధించక తప్పడంలేదు. అయినను ఈ ప్రజలు తమ హృదయములను
కఠినపరచుకొనిరి.
7.దేవుని కోపము ఈ భూమి మీద నుండి, మనుష్యుల మీద నుండి తొలగింపబడాలంటే ఏమి చేయాలి:- యెహో వా
యెహో వాయే నిత్యాశ్రయదుర్గ ము యుగయుగములు యెహో వాను నమ్ముకొనుడి.
నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహో వాతట్టు కు తిరుగుము. మనుష్యు లందరు తమ దుర్మార్గ ములను
విడిచి తాము చేయు బలా త్కారమును మానివేయవలెను, మనుష్యులే జనులు మనఃపూర్వ కముగా దేవుని
వేడుకొనవలెను
ఈ మనుష్యులు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్త ప్తు డై వారికి
చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానును. కాబట్టి మాటలు సిద్ధ పరచుకొని యెహో వాయొద్ద కు తిరుగుడి;
మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్ల కు బదులుగా నీకు మా పెదవుల
నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అని 8.దేవుని యెదుట హృుదయములను చింపుకొని
పశ్చాత్తా ప హృుదయముతో దేవుని పాద సన్నిధికి రండి.
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు
విశ్వాసముంచి యున్నాడు.
కాల్చివేయబడిరి ఎందుకు?
Written by,
Kiran Kumari John