Professional Documents
Culture Documents
రామమోహనరావు
నండూరి రామమోహనరావు (ఏప్రిల్ 22, 1927- సెప్టెంబర్ 3, 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు.
పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా పేరొందాడు. చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు
నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రిక లోనూ 1940 వ దశకంలో వీరి రచనలు ఎన్నో
ప్రచురింపబడ్డా యి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు
పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేయిన్ నవలలకు తెలుగు
అనువాదాలు కూడా చేసారు.
నండూరి రామమోహనరావు
నండూరి రామమోహనరావు
విజయవాడ
జీవితం
నండూరి రామ్మోహనరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రా మంలో 1927, ఏప్రిల్ 24 న
జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. రాజమండ్రి
గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే
‘విజ్ఞా నం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థా నం ప్రా రంభించారు.
1944 ఏప్రిల్ 30 వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ
తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబ్ ఎడిటర్
ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థా యిల్లో "ఆంధ్రపత్రిక"లో పనిచేశారు. 1960-1994 దాకా
ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ స్థా యుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే
"జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థా పక సంపాదకులుగా ఉన్నారు.
అతను జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రా రంభమైంది. 1948 నుంచి 1960 వరకు అతను ‘ఆంధ్ర పత్రిక’లో
పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టా రు.1960 నుంచి 1994 దాకా…
అంటే 34 సంవత్సరాల కాలం అతను ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. అతను ఎంతో మందిని పాత్రికేయులుగా
తీర్చి దిద్దా రు. సూటిగా, సరళంగా ఉండే అతను సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం
సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980 లో నండూరి
రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థా యి బాధ్యతలు చేపట్టా రు. అతను 1962, 1978, 1984,
1992 లలో అమెరికా లోను, 1982లో రష్యా లోను పర్యటించారు.
అనువాద హనుమంతుడు
బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ
తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్ట్వేయిన్ రచించిన
టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్లను అవే పేర్లతో అనువదించారు. మార్క్ట్వేయిన్ మరో రెండు రచనలను రాజు – పేద,
విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే… కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్సన్) అనే మరో అనువాద రచన కూడా
చేశారు.
61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రా లను
పరిశోధించి ‘విశ్వరూపం’ అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం,
తత్త్వశాస్త్రా న్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’ అతను కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో
రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ
సుధానిధి (లేదా యూసఫ్?) కూడా అతను రచనే.
మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి ‘మహా సంకల్పం’ అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను
పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి అతను ఇతర రచనలు. నండూరి రామమోహనరావు రాసిన ఐదు పుస్తకాలను
న్యూస్టూ డెంట్ బుక్ సెంటర్ ఆధినేత బాబ్జీ ప్రచురించి 2006 మే 9వ తేదీన ఆవిష్కరించారు. వీటిని పద్మశ్రీ తుర్లపాటి
కుటుంబరావు, కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణ, స్వాతంత్ర్య సమరయోధుడు పరకాల పట్టా భిరామారావు,
పాత్రికేయులు వీరాజీ, ఎస్.ప్రకాశరావులు ఆవిష్కరించారు. ఆ రోజున నండూరి రామమోహనరావును సత్కరించారు.
హేమాహేమీలతో అనుబంధం
రచనలు
నరావతారం
విశ్వరూపం
హరివిల్లు (పిల్లలగేయాలు)
అనువాదాలు
టామ్ సాయర్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్)
హకిల్బెరీ ఫిన్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్)
టామ్ సాయర్ ప్రపంచయాత్ర (మూలం: మార్క్ ట్వేన్ రచన - టామ్సాయర్ అబ్రా డ్)
అవార్డు లు
ర్డు
“జమీన్ రైతు” వజ్రో త్సవంలో నెల్లూ రి వెంకట్రా మానాయుడు స్మారక అవార్డు (1990)
సిద్ధా ర్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
Yarra RamaraoAWB చివరిసారి 3 నెలల క్రితం దిద్దు బాటు చేసారు