Professional Documents
Culture Documents
బహ్వ్యగ్ గాదగ్
బహ్వ్యగ్ గాదగ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రా సారో తెలపలేదు.
Learn more
ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) అనేది ఆంధ్ర రాష్ట్రం లోని ఉత్తర భాగం. ఉమ్మడిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
జిల్లా లు ఉత్తరాంధ్రగా పరిగణించబడేవి.[2] ఆంధ్రప్రదేశ్ జిల్లా ల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన వీటితోపాటు కొత్తగా
ఏర్పడిన,పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూ రి సీతారామరాజు జిల్లా ,అనకాపల్లి జిల్లా కూడా ఉత్తరాంధ్రలో భాగమే. ఈ
ఆరు జిల్లా లని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తా రు. ఇక్కడి భాష తెలుగు, ఒడియా .
ఉత్తరాంధ్ర
ప్రాంతం
దేశం భారతదేశం
అనకాపల్లి జిల్లా
శ్రీకాకుళం జిల్లా
విశాఖపట్నం జిల్లా
విజయనగరం జిల్లా
భాషలు
• అధికారికం తెలుగు
సంస్కృతి
భాష
తెలుగు
పుణ్యక్షేత్రా లు
సింహాచలం దేవస్థా నం, రామతీర్ధం, పుణ్యగిరి, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, కనకమహాలక్ష్మి
అమ్మవారు, పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దేవాలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారు, రామతీర్థం
ఆలయం ప్రసిద్ధ మైన పుణ్యక్షేత్రా లు
ఆహారపుటలవాట్లు
ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తా రు. దీనినే
బెల్లం పప్పుగా వ్యవహరిస్తా రు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.
మెంతులని ఉపయోగించి మెంతిపెట్టి న కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టి న కూర, నువ్వులని ఉపయోగించి
నువ్వుగుండు కూర లని తయారు చేస్తా రు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం
చేస్తా రు.
పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న
తర్వాత బియ్యపు పిండితో చేయబడే ఉప్పిండిని సేవిస్తా రు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారుని
తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసుని చేస్తా రు.
ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి.. నువ్వుల నూనెలో ఉప్పు, ఆవపిండి, కారం కలిపిన మామిడి
ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ
వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు
రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.
వాతావరణం
నైఋతి రుతుపవనాల వలన వర్షపాతం 1000-1100 ఎంఎం వరకు నమోదౌతుంది. అత్యధిక ఉష్ణో గ్రత 33-36
డిగ్రీలు, అత్యల్ప ఉష్ణో గ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ నమోదౌతుంది. ఇక్కడి భూమి ఎర్ర రేగడి నేలలు కలిగి ఉంటుంది.
వరి, వేరుశెనగ, చెరుకు, నువ్వులు, సజ్జలు ఎక్కువగా పండుతాయి.
చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తు లకై ఈ ప్రాంతంలో అనేక సహకార కార్మాగారాలు గలవు.
విద్యాసంస్థ లు
ఐఐఎం, విశాఖపట్నం
ప్ర ముఖులు
నేపథ్య గాయకులు
పి.సుశీల
కథా రచయితలు
పింగళి నాగేంద్రరావు
గణేష్ పాత్రో
ఘండికోట బ్రహ్మాజీరావు
సహాయ నటులు
గొల్లపూడి మారుతీరావు
జె.వి. సోమయాజులు
వంకాయల సత్యనారాయణ
సంగీత దర్శకులు
సాలూరు రాజేశ్వరరావు
చెళ్ళపిళ్ళ సత్యం
సిరివెన్నెల సీతారామశాస్త్రి
భాస్కరభట్ల రవికుమార్
కోస్తా
రాయలసీమ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మూలాలు
వెలుపలి లంకెలు
"https://te.wikipedia.org/w/index.php?
title=ఉత్తరాంధ్ర&oldid=3729863" నుండి వెలికితీశారు
Chaitanyavijay005 చివరిసారి 1 నెల క్రితం దిద్దు బాటు చేసారు