Professional Documents
Culture Documents
ఖగోళ గణిత శాస్త్రం
ఖగోళ గణిత శాస్త్రం
కూడా అంటారు భూగోళంపై ఉత్త ర దక్షిణ ధ్రు వ బిందువులను కలుపుతూ నిలువుగా గీసిన ఊహా రేఖను రేఖాంశాలు
అని లాంగిట్యూడ్ అని కూడా అంటారు అక్షాంశాలు అన్నియు వృత్తా లు అక్షాంశాలు అన్నిట్లో భూమధ్యరేఖ అది
పొ డవైనది ఈ ప్రాంతంలో భూమి చుట్టు కొలత 4007 కిలోమీటర్లు ఉంటుంది మిగతా అన్ని అక్షాంశాలు పో ను పో ను
తగ్గి ధ్రు వాల వద్ద బిందువుగా ఏర్పడుతుంది భూమధ్యరేఖ ఉత్త ర దక్షిణ వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాలు చిన్నవిగా
కనిపిస్తా యి 90 డిగ్రీల వద్ద అక్షాంశము బిందువు లాగా ఉంటుంది భూమధ్యరేఖను ఈక్వేటర్ అని జీరో అక్షాంశం అని
గ్రేటర్ సర్కిల్ అని కూడా అంటారు భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్థ భాగాలుగా విభజిస్తుంది భూమధ్య రేఖకు
ఉత్త రం వైపున 90 రేఖలు దక్షిణం వైపున 90 రేఖలు మొత్తం కలిపి 181 రేఖలు ఉంటాయి అక్షాంశానికి అక్షాంశానికి
మధ్య 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దీర్ఘ వృత్తా కార కక్షలో సూర్యుని
చుట్టూ 23.5 డిగ్రీల వంగి తిరుగుతుంది దీనివల్ల మన రుతువులు ఏర్పడుతున్నాయి రేఖాంశములు ఉత్త ర దక్షిణ
దృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండించుకుంటూ భూమికి నిలువుగా గీయబడిన ఊహారేకలను రేఖాంశాలు
అని అంటారు వీటినే లాంగిట్యూడ్ అని కూడా అంటారు భూమధ్యరేఖ చుట్టూ పూర్వార్త గోళంలో 180 మరియు
పశ్చిమార్థ గోళంలో 180 మొత్తం కలిపి 360 రేఖలుగా విభజించారు ఒక రేఖాంశ గల అన్ని ప్రదేశాలలో సూర్యోదయం,
మధ్యాహ్న, కాలము సూర్యాస్త మయం ఒకే సమయానికి ఉంటుంది జీరో డిగ్రీ రేఖాంశా ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్
ప్రదేశం మీదుగా వెళుతుంది అందుకే దీనిని ప్రధాన రేఖాంశ అని ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటారు దీనినే
అంతర్జా తీయ దిన రేఖా అని కూడా అంటారు గ్రీన్ విచ్ రేఖకు తూర్పున ఉన్న రేఖలను తూర్పు రేఖాంశం అని
పడమర ఉన్న రేఖను పశ్చిమ రేఖాంశాలు అని అంటారు భూమి ఒక డిగ్రీ రేఖాంశ తిరగడానికి నాలుగు నిమిషాల
సమయం పడుతుంది. 15 డిగ్రీలకు ఒక కాలమండలంగా నిర్ణయించి ప్రపంచం మొత్తా న్ని 24 కాల మండలాల
విభజించారు రేఖాంశాలు ధ్రు వాల వద్ద కేంద్రకతమవుతాయి. రేఖాంశాలు పూర్ణ వృత్తా లు కావు అర్ధా లు భూమధ్యరేఖ
వద్ద రేఖాంశకు రేఖాంశకు మధ్య ఎక్కువగా ఉంటాయి.
ఖగోళ, గణిత, పంచాంగ సాధనా పద్ధ తులు (కంప్యుటేషన్స్) - విశ్లేషణ
ఆది నుండి విజ్ఞా నానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో
సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞా న సంపద భావి తరాలకు
అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తు లు కాలనుగుణంగా ప్రవహిస్తూ నే ఉన్నాయి. ఈ
శక్తు ల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ , జీవిత
సాఫల్యానికి దో హదపడుతున్నాయి.
ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తు వులు నిక్షిప్త మై ఉన్నాయి. భారత
దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తు న్న, అనేక జ్ఞా న, విజ్ఞా న, పరిజ్ఞా న విశేషాల
సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త , పరమార్ధా లను విశ్లేషించి తదనుగుణ విషయాలను
సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞా న భారతీయం " శీర్షికలో ప్రస్తు తీకరిస్తు న్నాం.
చాణుక్యుడి కాలం ముందు (500 బీ సీ) నుండి, ఖగోళ గణిత శాస్త్రా ధ్యయనం చేయాలంటే - సంస్కృతం, వ్యాకరణం,
తర్కం, (లాజిక్) ప్రా ధమిక గణితం చదివి మంచి ప్రా వీణ్యం గడించి ఉండాలి. ఈ నాలుగు కీలక అంశాలు నేర్చుకోనిదే,
ఖగోళ శాస్త్రం (ఖగోళ గణిత శాస్త్రం) లో ప్రవేశం దుర్లభమే. సిధ్ధాంతాలు లోకానికి తెలియచేయడానికి చక్కని భాష
అవసరం. ఇంతేకాక గ్రంధాధ్యయనం చేయాలంటే వెరే దారి లేదు. భాషా పటిమ పెరగాలంటే వ్యాకరణం బాగా
వచ్చివుండాలి. తర్కం ఓ సమస్యని క్రమబద్ధ శైలిలో విశ్లేషించేందుకు దో హదపడుతుంది. గణితం చదివి ఉండటంతో
వివిధ గణాంక పద్ధ తులు ప్రయోగం చేసి సమస్యలను సాధన చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ చతుర్-క్షేత్రా లు
నేర్చుకోవాలన్న నియమం సూచించారు ప్రా చీన భారతీయ శాస్త్రవేత్త లు, వైజ్ఞా నికులు. ఈ పూర్వాకాంక్షిత పాత్రమైన
పాండిత్యం లేక పో తే ఖగోళ గణితం వైపు మొగ్గు చూపటం అనవసరమని కూడా కొందరు వైజ్ఞా నికులు (బ్రహ్మగుప్త ,
మధవాచార్య వంటి వారు) చెప్పారు.
విశ్వవిఖ్యాత ఖగోళ గణిత శాస్త్రవేత్త , "న్యూమరికల్ అనాల్సిస్" పితామహుడు, బ్రహ్మగుప్త (628 ఏ డీ లో) ఇలా
రాసారు – "సూర్యుడు తారల కాంతిని తన ప్రకాశంతో అధిగమించినట్లు మహాజ్ఞా ని పరిషత్తు లలో బీజగణిత సమస్యల
సాధనతో గణితవేత్త లు వెలుగొందుతారు. ఈ సమస్యలను పూర్ణిస్తే ఇంకా ప్రజ్వలమానమవుతాడు" అని. నేటి
గణితకారులు కూడా ఈ దృక్పదాన్ని సమర్దిస్తా రు. భారత శాస్త్రవేత్త లు యే ప్రా ధమికమైన గణితానికి ఎంత
ప్రా ధన్యతనిచ్చేరో దీనిద్వారా తెలుస్తోంది.
ఖగోళ, గణిత, పంచాంగ క్షేత్రా లకు ప్రా ధమికమైన, ముఖ్యమైన, ప్రభావాత్మకమైన సాధనా పద్ధతులూ, గణాంకాల
విశ్లేషణలు కొన్ని ఈ వ్యాసంలో ప్రస్తా వించబడ్డా యి. భారతీయ ఖగోళ, గణిత శాస్త్ర పరమైన గ్రంధాలు అపారమైనవి.
వీటిలోని అన్నీ అంశాలు, పద్ధతుల గురించి ఒక్క వ్యాసంలో చెప్పడం దుస్సాధ్యం. అనేక గ్రంధాలు
వెలువడించాల్సిందే. కొన్ని కీలక అంశాలు, పద్ధతులను సమీకరిస్తూ అవి ఈ క్షేత్ర రంగాలలో తెచ్చిన పరిణామాత్మక
మార్పులను వివరించే ప్రయత్నం ఈ వ్యాసం ఉద్దే శ్యం.
ప్రపంచానికి దిశామార్గం చూపిన భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్త లు, గ్రంధాలు
వివిధ భారతీయ గణిత సాధనా పద్ధతులు ప్రపంచ - గణిత, ఖగోళ, ఖగోళ గణిత రంగాలను పూర్తిగా మార్చేసాయి.
ఆయా క్షేత్రా లకు ఓ కొత్త దిశ, మార్గం రూపొందించాయి. మరి కొన్ని కొత్త క్షేత్రా లకు, అంశాలకు బీజం వేసి, స్థి ర రూపం
ప్రదానం చేశాయి. ఈ శాస్త్రా లలో ప్రా ధమిక సమస్యా పరిష్కరాలు చేసిన, ప్రశస్తి చెందిన మహత్త ర గ్రంధాలు:
శుల్బ సూత్రా లు (800 బీ సీ నుండి 300 బీ సీ) - వీటిలో విభిన్న జ్యామితీ శాస్త్ర (జామెట్రీ) సంబంద విషయాలు
పేర్కొనబడ్డా యి. ముఖ్య మైన శుల్బ సూత్రా లు - బౌధాయన శుల్బ సూత్రం, ఆపస్తంభ శుల్బ సూత్రం, కాత్యాయన
శుల్బ సూత్రం, మనవ శుల్బ సూత్రం, మైత్రేయ శుల్బ సూత్రం, వరాహ శుల్బ సూత్రం, వాధుల శుల్బ సూత్రం;
పాణిణి అష్టా ధ్యాయి; గణితానుయోగ; ప్రా ముఖ్యం చెందిన జైన ఖగోళ, విశ్వాంతరాళ, గణితశాస్త్ర సంబంద గ్రంధాలు -
సూర్యప్రజ్ఞా ప్తి , జంబూ ద్వీపప్రజ్ఞా ప్తి , భగవతి సూత్రం, ఉత్త రాధ్యయన సూత్రం; అనుయోగద్వార సూత్రం. సూర్య
సిద్ధాంతం వాటి భాష్యాలు; ఆర్యభట్ట ఆర్యభాటీయం; భాస్కరుడి - మహాభాస్కరీయం; లఘుభాస్కరీయం; బ్రహ్మగుప్త -
బ్రహ్మస్పుట సిద్ధాంతం; ఖండాకాధ్యాయక; మహావీరాచార్య గణిత సారసంగ్రహము; భాస్కరాచార్య - లీలావతి గణితం;
సిద్ధాంత శిరోమణి - ఈ విఖ్యాత గ్రంధం మీద వెలువడైన భాష్యాలు, టికలు - గణిత కౌముది (1350 ఏ డీ),
గణితామృతసార (1420 ఏ డీ.), బుద్ధి విలాసిని (1540 ఏ డీ), గణితామృత (1538 ఏ డీ), సూర్యప్రకాశ (1541 ఏ డీ), "
వాసన భాష్య " రంగనాథ (1573 ఏ డీ); బీజగణితం, గోళాధ్యాయ; గ్రహగణితం; త్రైశతిక; చయాగణితం; కాల శంకలిత;
దామోదర దృక్ గణిత స్ద్ధాంతం; కమలాకర భట్ట " సిద్ధాంత తత్త్వవివేక "; నీలకంట సో మయాజి - " తంత్ర సంగ్రహ ", "
గ్రహపరీక్ష కారణ "; ఉమాస్వతి తత్త్వార్థా ధిగమ సూత్ర; వారహమిహిర పంచసిద్ధాంతిక, శ్రీపతి సిద్ధాంత శేఖర, కర్న
కుతూహలం, గ్రహాగమ కుతూహలం, బ్రహ్మతుల్యం, సిద్ధాంత దర్పణ; జ్యేష్ఠ దేవ యుక్తిభాశ; అన్నంభట్ట
తర్కసంగ్రహము;బౌధాయన (800 బీ సీ) శుల్బ సూత్రం లో - " బౌధాయన సిద్ధాంతం " (ఇది నేడు పైతాగొరుస్ తీరం
గా కూడా వ్యవహారంలో ఉంది), వేదీల నిర్మాణాల విషయాలున్నాయి. ఈ గ్రంధంలోనే వేది (యజ్ఞా లకు ఉపయోగించే
చతురశ్రం) లో వలయం యెలా మలచాలో విశదంగా ప్రస్తా వించారు. ప్రపంచంలో తొలి సారిగా చతురశ్రంలో వృత్తం
యెలా నిర్మించాలన్న సూత్రా లు ప్రస్తా వించారు. మహావీరాచార్య (850 ఏ డీ) గణిత సార సంగ్రహంలో క్రమచయనం
(పెర్ముటేషన్స్), సంయోగాలకు (కాంబినేషన్స్) సంబంధిమిన సూత్రా వళి తొలిసారిగా ప్రపంచానికి అందించారు. అంతే
కాదు - "సంభావ్యత" సూత్రా లు ప్రతిపాదించారు. ఇది తరువాతి కాలంలో గణిత రంగంలో ఓ కొత్త శాఖగా ఏర్పడింది.
నేడు ఆంగ్లంలో దీన్ని " ప్రా బబిలిటీ తీరీ " గా వ్యవహరిస్తు న్నారు.
వటేశ్వర (880 ఏ డీ), శ్రీధరాచార్య (991 ఏ డీ), శ్రీపతి (1000 ఏ డీ), శతంద (1100 ఏ డీ) మరికొన్ని గణిత సంబంధ
గ్రంధాలు ప్రకటించారు. పరమేశ్వర (1430 ఏ డీ) ఆర్యభాటీయం మీద భాష్యం రాసి "భటదీపిక "రూపంలో
అందించారు. ఇవి కాక భాస్కర గ్రంధాల మీద" కర్మదీపిక", "సిద్ధాంతదీపిక "వివరణలు ప్రకటించారు. ఆ తరువాత
భాస్కరాచార్యుని లీలావతి గణితం పై వ్యాఖ్యానం వ్రా శారు. కేరళ ఖోగళ శాస్త్ర పరంపరలో వాసికెక్కిన ఇంకొన్ని ఖగోళ
గణిత గ్రంధాలు - "కారణపద్ధతి", "సద్రత్నమాల", "యుక్తిభాశ", "గణితయుక్తిభాశ". గోవిందస్వామి (800 – 850 ఏ
డీ), సూర్యదేవ, భాస్కరుని మహాభాస్కరీయం వ్యాఖ్యానాలు రచించారు. శంకరనారాయణ (869 ఏ డీ),
ఉదయదివాకర (1073 ఏ డీ), పరమేశ్వర లఘుభాస్కరీయం భాష్యాలు వ్రా శారు. మంజులాచార్య (950 ఏ డీ) "
లఘుమానస ", " బ్రహ్మమానస " అన్న కారణ గ్రంధాలను ప్రకటించారు. ఈ కారణ గ్రంధం విశేషం ఏమిటంటే ఇది "
ఆర్యపక్ష ", " అర్ధరాత్రికపక్ష " పద్ధతులను అనుసరించాయి. ప్రశస్తా ధర (958 ఏ డీ), సూర్యదేవ యజ్వన్ (1248 ఏ
డీ), పరమేశ్వర (1409 ఏ డీ) దీని మీద భాష్యాలు ప్రకటించారు.
తెలుగు నాట పావులూరి మల్ల న (1120 ఏ డీ) మహావీరాచార్య గణిత సార సంగ్రహం భాష్యం తెలుగులో వ్రా సి
తెలుగులో గణితశాస్త్రా ధ్యానికి నాందీ పలికేరు. యల్ల య్య (1482 ఏ డీ) " లఘుమానస " భాష్యం రాసేరు. మల్లికార్జు న
సూరి (1178 ఏ డీ) సూర్య సిద్ధాంతం భాష్యం తెలుగులో రచించారు; నరసిమ్హ (1500 ఏ డీ ప్రాంతం) కారణ గ్రంధం "
తిథి చక్ర " ప్రకటించారు; ఇది బాగా ప్రసిద్ధి చెంది, పంచాంగ గణితసాధనకు ఉపయోగించాడానికి వాడడం
మొదలుపెట్టే రు.
వీటన్నిటికీ మునుపు వాడకంలో ఉన్న పద్దెనిమిది సిద్ధాంతాలు విశ్వాంతరాళం, అందులోని గ్రహాల గూర్చి,
తదనుబంధ విషయాలు చెప్పాయి. అవి - సూర్య సిద్ధాంతం; సో మ సిద్ధాంతం; వశిష్ట సిద్ధాంతం; రోమక సిద్ధాంతం;
పౌలిస సిద్ధాంతం; బృహస్పతి సిద్ధాంతం; గర్గ సిద్ధాంతం; వ్యాస సిద్ధాంతం; పరాశర సిద్ధాంతం; భోజ సిద్ధాంతం; వరాహ
సిద్ధాంతం; బ్రహ్మస్ఫుట సిద్ధాంతం; సిద్ధాంత శిరోమణి; సుందర సిద్ధాంతం; తత్త్వవివేక సిద్ధాంతం; సార్వభౌమ
సిద్ధాంతం; లఘు ఆర్య సిద్ధాంతం; బృహదార్య సిద్ధాంతం.
ఖగోళ - గణిత కోవిదుడు పరమేశ్వర గ్రహణలను పరిశోదిస్తూ , 1393 ఏ డీ నుండి 1432 ఏ డీ వరకు రాత్రిళ్ళు
పరిశీలనలు చేసి లభించిన విషయాలతో తదనుగుణ " సంస్కరణలు" చేసి కొన్ని పద్ధతులను మెరుగు పరిచారు. ఈ
ధోరణినే అనుసరించారు ఆయన శిష్య, ప్రశిష్యులు. అచ్యుత పిశారతి (1550 - 1621 ఏ డీ) సూర్య చంద్ర గ్రహణాల
మీద " ఉపరాగక్రియాక్రమ " రూపంలో రాసారు. అదే రీతిలో నందగ్రా మ మిశ్ర (1730 - 1800 ఏ డీ) గ్రహణాలను
విశిదీకరిస్తూ , " గ్రహణ పద్ధతి " అన్న కారణ గ్రంధాన్ని వ్రా శారు. శంకర వారియార్ (1500-1560 ఏ డీ) " కారణసార "
అన్న ఖగోళ గణిత గ్రంధాన్ని రచించారు. దీని మీద చిత్రభాను (1530 ఏ డీ లో), అచ్యుత పిశారతి " కారణోత్త మ "
రూపంలో భాష్యాలు ప్రకటించారు. శంకర వారియార్ నీలకంట సో మయాజి "తంత్ర సంగ్రహం" మీద "లఘువివృత్తి "
రూపంలో భాష్య గ్రంధం ప్రకటించారు.
జ్ఞా నరాజ (1503 ఏ డీ), గొదావరి నదీ తీరంలోని పార్తపురంలో " సిద్ధాంత సుందర " గ్రంధాన్ని ప్రచురించారు. ఆయన
కుమారుడు చింతామణి (1530 ఏ డీ) ఈ గ్రంధంపై భాష్యం రాసారు. జ్ఞా నరాజ శిష్యుడు ధుందిరాజ (1541 ఏ డీ) అనేక
గణిత శాస్త్ర భాష్యాలు రాసారు. గణేశ దైవజ్ఞ (1507 ఏ డీ) "గ్రహలాఘవ " రచించారు. గణేశ రచించిన " బుద్ధి
విశాలిని", భాస్కరాచార్య లీలావతి గ్రంధం మీద భాష్యం. ఇది గణిత క్షేత్ర రంగంలో ప్రా మాణిక గ్రంధంగా ఉపయోగంలో
ఉంది.
సూర్య సిద్ధాంతం
తర తరాల పరీవ్యాప్త జ్ఞా న సంపదకు నిదర్శనం భారతం. ప్రపంచ ఇతిహాశంలో మరే ఇతర ఖగోళ గణిత గ్రంధం ఈ
ద్రంధమంత ప్రచురణ, ప్రా చుర్యం పొందలేదు. గత 1700 యేళ్ళలో అనేక వివరణ గ్రంధాలు, కారణ గ్రంధాలు, టికలు
ప్రకటించబడ్డా యి.
ఈ అతి విశిష్ట ఖగోళ గణిత ప్రధానమైన గ్రంధాన్ని - భటోట్పల (966 ఏ డీ), దివాకర (1606 ఏ డీ), కేశవ,
విజయనంది, చిత్రభాను, శ్రీ రంగనాథ, మకరంద, నరసిమ్హ స్వల్ప సవరణలతో, మెరుగులతో భాష్యాలు ప్రకటించారు.
భాస్కరాచార్య " సిద్ధాంత శిరోమణి " లో తాను సాధించిన కొన్ని ఫలితాలను, సూర్యసిద్ధాంతం లో పేర్కున్న కొన్ని
అంశాలను సమీకరించారు.
ఇవే కాక - తెలుగానువాధం మల్లికార్జు న సూరి చేయగా, చందేశ్వర, మదనపాల, పరమేశ్వర, యల్ల య, రామకృష్ణ
ఆరాధ్య (1472 ఏ డీ), భుధర (1572 ఏ డీ), తమ్మ యజ్వన్ (1599 ఏ డీ), రంగనాథ (1603 ఏ డీ), నరసిమ్హ (1611 ఏ
డీ), విశ్వనాధ (1628 ఏ డీ), కమలాకర (పదిహేడవ శతాబ్ధం), దదా బాయి (పద్దె నిమిదవ శతాబ్ధం) సూర్య సిద్ధాంతంపై
భాష్యాలు, వివరణలు, టికలు ప్రకటించారు. దదాపు పదిహేడు వందల సంవత్సరాలకుపైగా అవిచ్చినంగా
ఓ శాస్త్ర గ్రంధం ప్రమాణిక గ్రంధంగా మన్నన పొందడం ప్రపంచంలో మరెక్కడా తటస్థించలేదు. ఇలా మెరుగు
దిద్దు కుంటూ కాల ప్రవాహంలో అత్యంత ఉపయుక్త ఖగోళ, గణిత, పంచాంగ క్షేత్ర గ్రంధంగా నడుస్తూ వస్తోంది.
జ్య వై' - జ్య వై = (వై' - వై) కోటిజ్య వై; ఇది (జ్య వై ) = (కోటిజ్య వై) వై (ఇందులో - జ్య అంటే సైన్; కోటిజ్య అంటే
కోసైన్;)
1150 ఏ డీ లో "సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో భాస్కరాచార్య అనేక విషయాలు, అంశాలు పేర్కున్నారు. వాటిలో కాల
పట్టి కలు కూడా ఉన్నాయి:
ఇవి కాక గణిత కోవిదులు ఆచార్య మంజుల (932 ఏ డీ), శ్రీపతి (1039 ఏ డీ) చంద్ర గతి అంతర్భేద సమీకరణం ఇచ్చి
దానికి (" ఎవెక్షన్ ") అసమానతను కూడా కలిపేరు. ఇది వారు కనుగొన్న మార్పు. మంజుల ఇచ్చిన సమీకరణం:
1150 ఏ డీ లో ఖగోళ, గణిత శాస్త్ర ఉద్దండ మహా పండితుడు, గణిత చక్ర చుడామణి భాస్కరాచార్య చంద్ర గతిలో
మూడవ అసమానతను తన విశ్లేషణలో కనుగొన్నారు. దాన్ని లెక్కవేసేందుకు ఈ సమీకరణం ఇచ్చారు: