Professional Documents
Culture Documents
సాహిత్యాకాశంలో సగం - rachapalem
సాహిత్యాకాశంలో సగం - rachapalem
రాచపాళం చంద్రశేఖరరెడ్డి
Posted on March 10, 2014 by gdurgaprasad
పుస్త కంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని
గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తా యి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు
వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల
కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ
నాయకుడు మావో. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని
‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు.
ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దా లలో సదస్సుల కోసం రాసినవి
కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్త కాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు
స్త్రీవాదం తెలుగులో ప్రా రంభమౌతున్న దశలో మొదలై అది స్థి రమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక
ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రా తినిధ్యం వహించే ఈ వ్యాస
సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.
మార్క్సిస్టు విమర్శకు చారిత్రక దృష్టి ప్రధానం. విమర్శకు తీసుకున్న సాహిత్యాన్ని అది రాయబడిన
కాలం నేపథ్యంలో అధ్యయనం చేయడం మార్క్సీయ విధానం. చారిత్రక పరిణామ క్రమంలో రచయితను,
రచనను అంచనా కట్టడం ఈ పద్ధతి. చిల్ల ర భవానీదేవి ‘వర్ణనిశి’ కవితల్ని 1996-2000 మధ్య
రాసినవంటూ ఆ కవితలు ఆ కాలానికి ఎలా ప్రా తినిధ్యం వహిస్తు న్నాయో వివరించారు కాత్యాయని.
కాలానికి అతీతంగా ఏ రచనా జరగదు అనే సూత్రం ఈ పరిశీలనలో దాగి ఉంది. శ్రీశ్రీ ఈ (20 వ) శతాబ్దం
నాది అన్నారు. 1970-80 దశాబ్దా న్ని విరసం దశాబ్దం అన్నారు విమర్శకులు. కత్తి పద్మారావు ‘ఈ
యుగం మాది’ అంటున్నారు.
కాత్యాయని చాలా వ్యాసాలలో 1985-95 దశాబ్దా న్ని స్త్రీవాద సాహిత్య దశాబ్దంగా గుర్తించారు,
నిర్వచించారు. ఇందులో తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణంలో మహిళల కృషిని గుర్తించే ఆసక్తి
కనిపిస్తుంది. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు రచయిత్రిగా ఆమె పరిణామాన్ని
చారిత్రక క్రమంలో పరామర్శించడం కాత్యాయని విమర్శ పద్ధతి. రంగనాయకమ్మ మీద రాసిన పెద్ద వ్యాసం
ఈ దృష్టితో గొప్ప పరిశోధన పత్రం. రంగనాయకమ్మ ఎన్ని కథలు రాశారు, ఏ దశలో ఏయే కథలు
వచ్చాయి. ఆయా దశలలో ఆమె దృక్పథం ఎలా పరిణామం పొందింది- వంటి అధ్యయన పద్ధతి తెలుగు
సాహిత్య విమర్శలో చారిత్రక విలువల్ని పెంచింది.
సాహిత్యాధ్యయనంలో కాత్యాయని సాధారణంగా పాజిటివ్ విషయాలనే ఎక్కువగా ప్రస్తా విస్తా రు.
రచయిత్రు ల పరిమితులను, వాళ్లలోని వ్యతిరేకాంశాలను సూచనప్రా యంగా చెబుతారు తప్ప, వాళ్లతో
యుద్ధా నికి దిగరు. ఈమెది సాధ్యమయినంత వరకు కలుపుకొనిపో యే పద్ధతి.
సాహిత్య విమర్శలో రచయిత ప్రా ధాన్య దృష్టి, విమర్శక ప్రా ధాన్య దృష్టి అని రెండు దృష్టు లుంటాయి.
మొదటి దృష్టి గలవారు రచయితను ఎక్కువగా ముందుకు నెడతారు. రెండవ దృష్టి గలవారు తమ
పాండిత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తా రు. కాత్యాయనిది మొదటి రకం దృష్టి. అందుకే ఆమె విమర్శలో
ఉటంకింపులు పరిమితంగా ఉంటాయి.
స్త్రీల సాహిత్య విమర్శకులుగా కాత్యాయని నిర్వహిస్తు న్న పాత్రను నిర్వచించాలంటే ‘ఖాళీల పూరణ’ అని
చెప్పవచ్చు. ఒక భాషా సాహిత్య చరిత్ర నిర్మాణంలో స్త్రీలు పురుషులు పాల్గొ న్నా, పురుషాధిపత్య
సమాజంలో చరిత్ర రచన పురుష ప్రధానంగా జరుగుతుంది. స్త్రీల కృషి గుర్తింపు పొందదు,
విస్మరింపబడుతుంది. స్త్రీలు చైతన్యవంతులైనప్పుడు ఆ ఖాళీలను పూరిస్తా రు. కాత్యాయని చేస్తు న్న పని
అదే. ‘విప్ల వోద్యమ కథలో తెలంగాణ రచయిత్రు లు’ అనే వ్యాసం ఇలాంటిదే. ‘సాహిత్య చరిత్రలోని ఈ
ఖాళీలను పూరించి సమగ్రం చేయటం ఇప్పటి అవసరం’ అని కాత్యాయని గుర్తించారు. విప్ల వోద్యమ
కథమీద ఇంతకుముందే రుక్మిణి, కాత్యాయని, రాచపాళెం మొదలైనవాళ్లు రాశారు. వాటిలో ఈ
కథయిత్రు ల ప్రసక్తి లేదు. కాత్యాయని ఆ ఖాళీని ఇప్పుడు పూరించారు.
రచయిత్రు లను సంఘటిత పరచడానికి ‘మనలో మనం’ అనే వేదిక ఏర్పడిన తర్వాత, దళిత బహుజన
రచయిత్రు లు స్త్రీలంతా ఒక్కటి కాదంటూ, తమదైన ‘మట్టిపూలు’ వేదికను స్థా పించుకున్నారు. ‘మనలో
మనం’ వేదిక బాధ్యులుగా ఉంటూనే, కాత్యాయని, ‘మట్టిపూలు’ రచయిత్రు ల కృషిని గౌరవించారు. చరిత్ర
రచనలో ప్రజాస్వామిక లక్షణ మిదే. ‘తెలుగు కథ-స్త్రీవాదం’ అనే వ్యాసం ఇందుకుదాహరణ.
కాత్యాయని స్థూ ల స్థా యి విమర్శలో ఎంత సిద్ధహస్తు లో, సూక్ష్మస్థా యి విమర్శలో కూడా అంతే
సిద్ధహస్తు లు. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లే , ఒక రచయిత్రి రాసిన అనేక
రచనల్లో ఒకదానిని అధ్యయనం చేస్తా రు. ‘రంగనాయకమ్మ – కథలు, కథన రీతులు’ మొదటిరకం కాగా,
‘పెళ్లా నికి ప్రేమలేఖ కథా విశ్లేషణ’, ‘విమల వంటిల్లు ’ వ్యాసాలు రెండవ రకంవి. ఒక ఉద్యమ నేపథ్యంలో
సాహిత్యాధ్యయనానికి ‘విప్ల వోద్యమ కథ- తెలంగాణ రచయిత్రు లు’ నమూనా వ్యాసం కాగా, ఒకవాదం
నేపథ్యంలో సాహిత్యాధ్యయనానికి ‘తెలుగు కథ-స్త్రీ వాదం’ నమూనా వ్యాసం. కాత్యాయని సాహిత్య
విమర్శలో అనేక రకాల పరిధులు ఉంటాయి. ఇవి భావి విమర్శకులకు దారి చూపిస్తా యి. సాహిత్యాన్ని
ఎన్ని కోణాలలో, ఎన్ని పరిధులలో అధ్యయనం చేయవచ్చో నేర్పిస్తా యి.
సాహిత్య చరిత్రలో ఆద్యతను (తొలితనం) గుర్తించడం తెలుగువారికి తొలి నుంచీ ఆసక్తి.
ఆదికవి, తొలి ప్రబంధం, తొలి కథా కావ్యం, తొలి శతకం, తొలి స్త్రీవాద కవిత- ఇలా తెలుగు విమర్శకులు
అనేక ఆద్యతలను గుర్తించారు. కాత్యాయని కూడా కొన్నిటిని గుర్తించారు. విప్ల వ కథలు రాసిన తొలి
మహిళ రత్నమాల అని, ప్రజాయుద్ధ రాజకీయాల మీద మహిళ రాసిన తొలి కథ లక్ష్మీ రాసిన ‘గమ్యం
చేరే దాకా’ అని తెలిపారు. అలాగే మనకెంత గుంపుదృష్టి ఉన్నా, ప్రతి రచయితకూ ఒక ప్రత్యేకతను
చూపడానికి ఆసక్తి చూపుతాం. కాత్యాయని రుక్మిణి కథల మీద వ్యాసం రాస్తూ , పట్టణ మధ్య తరగతి
దగ్గర ఉన్న స్త్రీవాద కథను ఆమె వ్యవసాయ గ్రా మీణ పేద, మధ్య తరగతి స్త్రీల దగ్గరికి
విస్త రింపజేశారన్నారు. అలాగే స్త్రీల కథను స్త్రీవాద కథగా పరిణమింపజేయడంలో అబ్బూరి ఛాయాదేవి,
రంగనాయకమ్మ, పి.సత్యవతి కృషి ఉందన్నారు. స్త్రీల కథ తాత్వికార్థంలో స్త్రీవాద కథగా రూపాంతరం
చెందడం సావిత్రి కథ ‘ఇదో వర్గం’తో పూర్తయిందన్నారు.
మార్క్సీయ స్త్రీవాదం అనే ఒకే ఒక్క కొలమానంతో విమర్శ రాస్తు న్నా కాత్యాయని విమర్శలో మొనాటనీకి
స్థా నం లేకపో వడం విశేషం. ఆవేశానికి ఆమె విమర్శలో చోటు లేదు. ముద్రలు, నిందలు ఉండవు.
నెమ్మదిగా ప్రవహించే నదిలా సాగుతుంది ఆమె విమర్శ. అందమైన పఠనీయమైన వచనం, పటిష్టమైన
వ్యాస నిర్మాణం పాఠకున్ని ఆకర్షిస్తా యి. ఆమె విమర్శ వీరంగంగా గాక, విమర్శగా ఉండడానికి
విమర్శకుల ప్రా థమిక ధర్మమైన సంయమనం కాత్యాయనిలో పుష్కలంగా ఉండడమే కారణం. ఉత్త మ
సాహిత్య విమర్శకు ఫలితం ఉత్త మ సాహిత్యాన్ని పాఠకులతో చదివించడమే అయితే, ఈ పనిని
కాత్యాయని విమర్శ శక్తివంతంగా నిర్వహిస్తుంది. ‘సాహిత్యాకాశంలో సగం’కు, సాధారణ దృష్టితో, సాహిత్య
అకాడమీ పురస్కారం రావడం కొండ గుర్తే కాని, అసలైన గుర్తింపు స్త్రీ పురుష సమాన సమాజం
ఏర్పడినప్పుడే.
– రాచపాళం చంద్రశేఖరరెడ్డి