Professional Documents
Culture Documents
శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 37
శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 37
బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యువు యొక్క
ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలిగిపోతాయి. అజ్ఞానం అంటే నేను ఈ శరీరం,
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు నేను అన్న భావన ఉండడమే. ఇవి నేను కాదు అని
తెలుసుకోవడమే జ్ఞానం. దీన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం అనుభవపూర్వకంగా కలగడమే సకల
అనిష్టా ల నివృత్తి. “బ్రహ్మవిదాప్నోతిపరం” బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. సాయిని
గురువుగా నమ్మిన వారు ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చక్కగా చెప్పారు. సాయియే అంతటా
ఉంటె వేరే వస్తు వు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి
యోగక్షేమాలు సాయే స్వయంగా చూస్తా రు. అదే విధంగా చెవులతో సాయి అన్న శబ్ధం తప్ప మరో
శబ్ధం వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని
ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి
వచనామృతాన్ని సేవించినవారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం. పాలల్లో నెయ్యి బయటకు
తీసినట్లే మనం సాధన ద్వారా అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవాలి. పరమార్ధం ప్రాప్తించే వరకు భక్తిని
వీడకూడదు. ఇక్కడ భక్తి అంటే సాయి చెప్పిన మార్గంలో నడవడమే. ఈ మార్గం తెలియాలి అంటే
సాయి సత్చరితను అధ్యయనం చేయాలి. కేవలం సాయి కోసమే సాయిని పూజిస్తే సాయి మనలను
పరమార్ధం వైపు నడిపిస్తా రు.
ఈ అధ్యాయంలో చావడి ఉత్సవం కన్నుల పండుగగా వర్ణించడం జరిగింది. బాబా ఒక రోజు మసీదులో
ఇంకోనాడు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబర్ 10 వ తేదినుండి చావడిలో హారతులు జరపడం
మొదలు అయ్యింది. చావడిలో నిద్రించే రోజు భక్తు లు మసీదులో చేరి భజనలు చేసేవారు. అక్కడ
రధము,తులసి బృందావనం మధ్యలో భక్తు లు, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ
ఉంటుంది. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజీరా, మద్దెలలు పట్టు కొని భజన చేస్తూ
ఉంటారు. బయట కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరిస్తే, కొందరు
మసీదుకు తోరణాలు కడుతూ ఉంటె, కొందరు సాయినాథ మహారాజుకి జై అని భక్తితో నామం
పలుకుతుంటారు. శ్యామకర్ణి అనే గుఱ్ఱం సజ్జితమై బయట నిలిచిఉండును. అప్పుడు తాత్యా వచ్చి
బాబాను సిద్ధంగా ఉండమని చెప్పి తరువాత బాబా చంకలో చేయివేసి లేవనెత్తు ను. బాబా కఫినీ ధరించి,
సటకా తన చంకలో పెట్టు కొని, చిలుము, పొగాకు తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని సిద్ధంగా ఉండే
వారు. ధునిలో కట్టెలు వేసి, అక్కడ ఉన్న దీపం తన చేతితో నార్పి, చావడికి బయలుదేరేవారు. అన్ని
వాయిద్యాలతో, మందు సామానులు అనేక రంగులతో కాలుతూ ఉంటె, భక్తు ల భజనలతో,
చామరములు విసురుతూ ఉంటె, కొందరు నాట్యం చేస్తూ ఉంటారు. మహల్సాపతి కుడిచేతిని, తాత్యా
ఎడమచేతిని బాపుసాహెబు జోగ్ ఛత్రము పట్టు కునే వారు. ముందు శ్యామకర్ణి దారి తీయుచుండును.
బాబా చావడివైపు ముఖం పెట్టి నిలిచియొక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటే తన కుడి చేతిని
ఆడిస్తూ ఉండేవారు. అప్పుడు కాకా దీక్షిత్ వచ్చి వెండిపళ్లెంలో ఉన్న పుష్పాలు గులాల్ పొడిలో అద్ది
బాబాపై చల్లు చుండును. భక్తు లందరూ బాబాకు ఇరుపక్కలా నడుస్తూ ఉండే దృశ్యమును, శోభను
వర్ణించుటకు మాటలు చాలవు.
శిరసుపైన జలతారు శాలువాతో చత్ర ఛామరాల సేవలతో వైష్ణవ భక్తు ని వలె తేజస్సుతో భాసిల్లే వారిని
ఫకీరని అనగలమా?మంగళవాయిద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో పంచారతిని పట్టు కొని బాబాకు
ఆరతి ఇచ్చేవాడు. తరువాత కర్పూర నీరాజనం ఇచ్చేవాడు. ఆ ఆరతి ముగిసిన తరువాత
ఒక్కొక్కరుగా వచ్చి భక్తు లు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసే వారి వారి ఇళ్లకు వెళ్లేవారు. చివరకు
అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి తాత్యా బయలుదేరగా. బాబా అతనితో “వెళ్తే వెళ్ళు
కాని రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు” అని చెప్పే వారు. తరువాత అక్కడ ఉన్న దుప్పట్లు
పరుచుకొని బాబా పడుకునే వారు. ఇలా హేమద్పంత్ గారు చావడి ఉత్సవాన్ని ఎంతో చక్కగా
వర్ణించారు.
ఓం శ్రీసాయినాథార్పణమస్తు !