You are on page 1of 66

పరిప్రశ్న – పత్రీ జీ పరి సమాధానం

“పరిప్రశ్న – పత్రీ జీ పరి సమాధానం”

 
ప్రశ్న: “‘సన్యాసం’ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు?”
పత్రీ జీ: “సమ్యక్” .. అంటే “సరియై న”
“న్యాసం” .. అంటే “త్యజించడం”
సమ్యక్ + న్యాసం = సన్యాసం
“సన్యాసం” అంటే “సరియై న వాటిని త్యజించడం” సన్యాసం అన్నది నాలుగు రకాలు:
1. మర్కట సన్యాసం: చిన్ని చిన్ని కారణాలకే సన్యాసులుగా మారి ఉన్న సంసారాన్ని వదిలిపెట్టే యడం
.. మర్కట సన్యాసం. ఇది “శూద్రసన్యాసం” .. మరి ఇలాంటివారు కొన్నిరోజులకు మరొక సంసారంలో
తగులుకుంటూ ఉంటారు.
2. ఆపత్ సన్యాసం: ఇప్పుడో .. మరి కాస్సేపట్లో నో చనిపోతానని తెలిసి “స్వర్గంలో స్థా నం పొందాలి”
అన్న ఆశతో సన్యాసాన్ని స్వీకరించడం ఆపత్‌సన్యాసం; ఇది “వై శ్య సన్యాసం”.
3. వివిధిష సన్యాసం:  సత్యాన్ని తెలుసుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష మరి జ్ఞా న తృష్ణతో తమకు ఉన్న
ప్రతి దానినీ త్యజించి తీసుకునే సన్యాసం వివిధిష సన్యాసం. మేధో తత్వానికి చెందిన వివేకానందుని
లాంటివారు ఇందుకు ఉదాహరణ; ఇది “క్షత్రి య సన్యాసం”.
4. విద్వత్ సన్యాసం: సన్యాసాల్లో కెల్లా అత్యున్నత ఆత్మస్థా యికి చెందిన సన్యాసమే విద్వత్ సన్యాసం!
బ్రహ్మాజ్ఞా నులై న విద్వత్ సన్యాసులు .. తమ సంసారాన్ని కాకుండా సంసారం పట్ల తమకు ఉన్న అజ్ఞా నాన్ని
మాత్రం వదిలిపెడతారు.
వారు తమ దై నందిన జీవితంలో అనవసరమై న వాటిని వదిలిపెట్టి అవసరమై న వాటికే పరిమితం అవుతూ
“సంసారంలోనే నిర్వాణం” చెందుతూ ఉంటారు; ఇది బ్రా హ్మణ సన్యాసం; ఇది పిరమిడ్ మాస్టర్లకు స్వంతం!
 
ప్రశ్న: “ధ్యానం నేర్చుకోవాలంటే ఏమై నా పెట్టు బడి పెట్టా లా?”
పత్రీ జీ: పెట్టా లి! “పెట్టు బడి” అంటే “ఇన్‌పుట్”! 24 గంటల్లో కొం‍తసమయాన్ని ప్రత్యేకంగా ధ్యానం కోసం
పెట్టు బడిగా పెట్టా లి! ఒక వ్యాపారంలో ఇన్‌పుట్‌ను బట్టే   లాభం ఉన్నట్లు .. మనం పెట్టు బడిగా పెట్టే
“సమయం” అనే  “ఇన్‌పుట్” ని బట్టే మనకు  “ధ్యానఫలితం” అనే లాభం వుంటుంది.
 
ప్రశ్న: “‘శాస్త్రం’ అంటే ఏమిటి?”
పత్రీ జీ: ఏ పని చేస్తే , ఏ ఫలితం వస్తు ందో .. ఏ కారణం ఏ పరిణామంగా మారుతుందో .. విశద పరిచేదే
“శాస్త్రం”!
 
ప్రశ్న: “మీ జీవితాన్ని ధ్యానానికే అంకితం చేశారా?”
పత్రీ జీ: క్రి కెట్ ఆటకు కూడా అంకితం చేశాను .. మొన్న మ్యాచ్ అంతా చూశానుగా! నా జీవితాన్ని TV లోని
అన్ని ఛానెల్స్ చూడడానికి అంకితం చేశాను! నా జీవితాన్ని ప్రపంచ జనులందరితో స్నేహానికి అంకితం
చేశాను!
 
ప్రశ్న: “జీవితం ఒక ఉత్సవం ఎప్పుడు అవుతుంది?
పత్రీ జీ: ధ్యాన – జ్ఞా నాదుల వలన మనకు సృష్టి యొక్క మూల సిద్ధా ంతాలన్నీ అవగతం అయినప్పుడు
మనకూ మరి విశ్వంలో ఉన్న అనేకానేక నక్షత్రలోకవాసులకూ మధ్య వున్న సంబంధాన్ని తెలుసుకోగలిగే
“ఆత్మజ్ఞా న ప్రకాశం” మన స్వంతం అవుతుంది. “ఆత్మజ్ఞా న ప్రకాశాన్ని” పొందిన మనం యుక్తా యుక్త
విచక్షణతో కూడి ఉంటూ మన జీవితాన్ని ప్రతిక్షణం ఒక ఉత్సవంలా జీవిస్తూ ంటాం!
 
ప్రశ్న: “ఈ మధ్య చాలా మంది డాక్ట ర్స్ .. తమ తమ ప్రి స్క్రిప్షన్స్‌లో మందులతో పాటు మెడిటేషన్ కూడా
చెయ్యమని వ్రా స్తు న్నారు!?”
పత్రీ జీ: “సత్యం” కావాలని కోరుకోకుండా ఎవరు ఉంటారు? వారు ‘డాక్ట ర్’ కానీ .. ‘పేషెంట్’ కానీ .. ‘గృహిణి’
కానీ .. ‘రాజు’ కానీ .. ‘పేద’ కానీ .. ‘పండితుడు’ కానీ .. ‘పామరుడు’ కానీ .. ‘ప్రధానమంత్రి ’ కానీ .. మరి
‘బంట్రో తు’ కానీ .. ఎవరెవరికై తే సత్యం కావాలో .. మరి ఎవరెవరై తే జీవితాన్ని శాంతిమయంగా జీవించాలని
కోరుకుంటారో .. వాళ్ళంతా కూడా ధ్యానం చెయ్యాల్సిందే! విధిగా సత్యంతో జీవిస్తూ ఆత్మజ్ఞా నాన్ని
పొందాల్సిందే! ధ్యానం ద్వారానే మరి ఆరోగ్యం అన్నది సమకూరుతుంది కనుక డాక్ట ర్లు కూడా మందులతో
పాటు “ధ్యానం చెయ్యండి” అని పేషంట్లకు సూచించడం ఆనందించదగ్గ విషయం.
 
ప్రశ్న: “ధ్యానం చేసేవాళ్ళకు ఫ్యామిలీ ఉండొచ్చా?!”
పత్రీ జీ: అంటే వుండకూడదనా మీ ఉద్దే శ్యం?! యోగీశ్వరుడై న కృష్ణు డికి ఎనిమిది మంది భార్యలతో కూడిన
పెద్ద ఫ్యామిలీ ఉంది! వశిష్ఠు డు మరి అరుంధతి గొప్ప యోగీశ్వరులే కదా! సుఖమయ సంసారంలోనే ..
నిర్వాణమయ ఆత్మవత్ జీవితం అన్నదే “పిరమిడ్ సిద్ధా ంతం”.
 

ప్రశ్న: పాపాలు చేసేవాళ్ళంతా మళ్ళీ జన్మల్లో క్రి మికీట కాదులుగా పుడుతారని పురాణాల్లో వ్రా సింది నిజమేనా?
పత్రీ జీ: అవన్నీ కూడా ఆధ్యాత్మికపరంగా కొందరు వ్రా సిన పనికి వచ్చే చిలిపి వ్రా తలు! మానవజన్మ
తరువాత మానవజన్మలే పరంపరగా వుంటాయి! ఒక మానవజన్మలో నేర్చుకోని పాఠాలు మరు
మానవజన్మల్లో సరిచేసుకునే తీరాలి!
 
ప్రశ్న: “సమాజం పట్ల మన కర్తవ్యం?”
పత్రీ జీ: సమాజంలో ఇతరుల అందరూ సుఖంగా, సంతోషంగా మరి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా
ఉంటాం! అందుకు గాను మన దగ్గర ఉన్న సర్వ వనరులను మనకు అవసరమై నంత మేర మాత్రమే
ఖర్చుపెట్టు కుంటూ మిగిలిన వాటిని ఇతరులతో పంచుకోవాలి.
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి దానాలతో పాటు .. “ధ్యాన దానం” మరి “జ్ఞా నదానం” వంటి
ధ్యానులను మరి శక్తి మేరకు చెయ్యాలి!

ప్రశ్న: “మనుష్యులందరూ నా ఇల్లూ , నా కుటుంబం అనుకుంటూ వారికోసం పాటుపడుతూంటే మీరు దానికి


భిన్నంగా ‘ప్రపంచమంతా నా కుటుంబమే” .. మరి ‘అందరినీ ఉన్నతీకరించాలి’ అని ఎందుకు
అనుకున్నారు?”
పత్రీ జీ: “నేను, నా పిల్లలు” అనేది ఎవరికై నా కొంత కాలం వుండి తీరుతుంది. స్వంత తల్లి దండ్రు ల దగ్గర ఒక
కుటుంబంలో పెరిగి, ఆ తర్వాత మనం స్వయంగా తల్లి దండ్రు లమై ఒక కుటుంబం స్థా పించటానికి
ఆరాటపడతాం. అది తీరిన తరువాత “వసుధై క కుటుంబం” కోసం తహతహలాడే దశ కూడా అందరికీ వచ్చి
తీరుతుంది. సృష్టి లో చాలా మందికి ఆ స్థి తి వచ్చినట్లే మరి నాకూ వచ్చింది, అంతే!

ప్రశ్న: “మీ వద్ద ధ్యానం నేర్చుకుని కొంత సాధన చేసి జ్ఞా నం పొందిన తరువాత కూడా కొందరు జారిపోతూ
వుంటారు? ఎందుకని?”
పత్రీ జీ: అదంతా సహజమే. పౌర్ణమి తరువాత అమావాస్య వచ్చే తీరుతుంది. ఆ అమావాస్య తరువాత మళ్ళీ
పౌర్ణమి వచ్చే తీరుతుంది. ఈ అమావాస్య పౌర్ణమిల మధ్య ఊగిసలాటలోనే క్ర మక్ర మంగా స్థి తప్రజ్ఞత్వం
వస్తు ంది. ఆటుపోటలను తట్టు కునేదే స్థి తప్రజ్ఞత. ‘స్థి తప్రజ్ఞత’ అన్నదే ఆధ్యాత్మికతకు సూచిక.
ప్రశ్న: “మీరు ఎవరికై నా ఒక విషయం చెప్పినప్పుడు దానిని యధాతధంగా అనుసరించకుండా తమ తెలివిని
ఉపయోగించి, దానికి మార్పులు చేర్పులు చేసి అదే మధ్యేమార్గం అనీ. అదే ఉన్నతమై నదనీ భావించటం
సరియై నదేనా?”
పత్రీ జీ: తప్పకుండా సరియై నదే. ఎప్పుడూ మన ఇంగితజ్ఞా నాన్ని ఉపయోగిస్తూ నే ఉండాలి. మిగతా వాళ్ళు
వాళ్ళ వాళ్ళ జ్ఞా న పరిధిని బట్టి ఎంతయినా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఎవరికి అనిపించిందే వారు
చేయాలి. అందరూ అలానే చేస్తు న్నారు కూడా. ఎవరి దృక్పధం, ఎవరి ధర్మం వారి వారికి ప్రత్యేకం. “ప్రతి
ఒక్కరూ వారి వారి దృష్టి కోణాల నుండి సరిగ్గా నే వున్నారు” అని గ్రహించగలిగినదే విశాల దృక్పధం. ఒక ప్రక్క
ప్రత్యేక దృక్పధంతోనూ, ఇంకో ప్రక్క విశాల దృక్పధంతోనూ రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా కూడానూ,
ఈ రెండింటితోనూ మనగలగాలి. అదే మధ్యేమార్గం అంటే. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క జీవితమూ
ఆధ్యాత్మికత అన్నదానికి ఒక క్రొ త్త మలుపు కావాలి. ఆధ్యాత్మిక జీవితం మూసపోసినట్లు గా అందరికీ ఒకే
విధంగా ఉండదు. దృక్పధాలు ఎన్ని విధాలుగా వున్నా అంతా చిరునవ్వుతో స్వీకరించడమే ఆధ్యాత్మికత!

ప్రశ్న: “భూమి మీద అందరితోనూ మిత్రత్వంతో వ్యవహరిస్తూ చక్కటి సంబంధాలను కలిగి ఉండి, ఇంగిత
జ్ఞా నంతో వ్యవహరించడం ముఖ్యమా? ఇతర లోకాల జ్ఞా నం తెలుసుకోవడం ముఖ్యమా?”
పత్రీ జీ: మొదటి ఒక ఇంట్లో పుట్టి , పెరిగి నెమ్మదిగా ప్రక్క ఇంటికి ఉత్సుకతతో వెళతాం. ఆ తరువాత
మెల్లి మెల్లి గా ఆ ప్రక్క ఇంటికీ, ఇంకో ప్రక్క ఇంటికీ వెళతాం. గోడలు దూకి వాటి వెనుక ఏముందో చూస్తా ం.
తరువాత ప్రక్క ఊరికి పిక్‌నిక్‌కు వెళతాం. దూరంగా కన్పించే కొండ ఎక్కి అన్నీ చూసి తిరిగి వస్తా ం. కొంత
దూరంలో ఉన్న అడవికి వెళ్ళి, అడవి అంతా చూసి తిరిగి వస్తా ం. తరువాత దగ్గరలోని నగరానికి వెళ్ళి అక్కడి
వింతలూ విశేషాలు చూసి వస్తా ం. వీలై నంతలో దేశవిదేశాలన్నీ తిరిగి వస్తా ం.
ఇదంతా ప్రా పంచిక జీవితంలో అందరూ అనుభవిస్తు న్నదే. ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంలో కూడానూ
ఇటువంటి క్ర మమే వుంది. “సరే ఈ జన్మలో ఇక్కడ వున్నాను; గత జన్మలో ఏమై వుంటాను?” అన్నప్రశ్న
ఉదయిస్తు ంది. గత జన్మలన్నీ దర్శించాలని ఆకాంక్షి స్తా ము. అ అపై న “జన్మకూ జన్మకూ మధ్య ఎక్కడ
వున్నాను? అక్కడ ఏం చేస్తా ము?” అన్నది తెలుసుకుంటాము! ఆ తరువాత “ఎన్ని గెలాక్సీలలో ఎన్ని
జీవరాసులు ఉన్నాయి? మనుష్యులలాంటి వారు వున్నారా? గ్రహాంతర వాసులను కలుసుకోవచ్చా? వారితో
మాట్లా డవచ్చా?” .. వంటివన్నీ ఆధ్యాత్మిక జీవితంలో సహజం.

ప్రశ్న: “ధ్యానం తెలిసిన వెంటనే కొందరు గంటలు, గంటలు రోజులు రోజులు ధ్యాన సాధన చేస్తూ వుంటారు.
కొందరు నిరంతరం ధ్యానప్రచారంలోనూ దానికి చెందిన అనేక పనులలోనూ మునిగి తేలుతూ వుంటారు, దేనిని
అనుసరించాలి?”
పత్రీ జీ: గత జన్మలలో అధికంగా ధ్యానసాధన చేసినవారే ఈ జన్మలో అధికంగా ధ్యానప్రచారం చేస్తూ
వుంటారు. “ఈ జన్మలో ధ్యానం చెయ్యాలి .. అదొక్కటే నాకు కావాలి”అన్న వారికి అదొక్కటే సత్యం. “నాకు
ధ్యాన సాధన కన్నా ధ్యాన ప్రచారమే ఇష్టం; అది లేకుండా నేను ఉండలేను” అనే వారికి అదే సత్యం. ఎవరి
సత్యంలో వాళ్ళు జీవించాలి.

ప్రశ్న: ‘ప్రా పంచికత’ – ‘ఆధ్యాత్మికత’ రెండూ ఒక్కటేనా? వేరువేరా?”


పత్రీ జీ: సత్యం తెలుసుకోనంత వరకూ అవి రెండూ వేరు వేరే. సత్యం తెలిసిన తరువాత అవి రెండూ ఒక్కటే.
“ప్రా పంచికత” అంటే ప్రపంచంలో మనం జీవించే తీరుతెన్నులు. “ఆధ్యాత్మికత” అంటే ఆత్మస్ఫూర్తి తో మనం
జీవించే తీరుతెన్నులు. ఈ ప్రపంచంలో పుట్టడం, జీవించడం, మరణించడం – ఇదంతా ఆత్మ యొక్క ఎంపికే.
ఆధ్యాత్మికత తెలిసినవాడికే “ఆధ్యాత్మికత, ప్రా పంచికత రెండూ ఒక్కటే” అని తెలుస్తు ంది. ఆధ్యాత్మికత
తెలియని వారే “ఆధ్యాత్మికత వేరు ప్రా పంచికత వేరు” అని భ్రమ పడుతూ వుంటారు. ప్రా పంచికంలో వుండే
ప్రతి చిన్న విషయం ఆధ్యాత్మికతలో మహా విషయమే. ఏది మాట్లా డాలి, ఎంత మాట్లా డాలి, ఎలా
మాట్లా డాలి, ఎక్కడ మాట్లా డాలి .. ఇదంతా ఆధ్యాత్మిక విజ్ఞా న విషయమే. ఆధ్యాత్మికత అన్నదే
ప్రా పంచికతకు అర్థవంతమయిన చుక్కాని. ఒకానొక నావ యొక్క ప్రధానభాగం చుక్కాని గదా, ప్రా పంచికత
యొక్క అత్యంత ప్రధాన భాగమే ఆధ్యాత్మికత. శాంతిమయ, ప్రగతిమయ ప్రా పంచికత కోసమే ఆధ్యాత్మికత.

ప్రశ్న: ధ్యానం చెయ్యడం మొదలు పెట్టి న దగ్గర నుంచి నాకు ఉన్న రోగాలన్నీ పోయాయి. గత మూడు
సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తు న్నాను. ఇప్పుడు మళ్ళీ రోగాలు వేదిస్తు న్నాయి. ధ్యానం చేస్తే రోగాలన్నీ
పోవాలి కదా?
పత్రీ జీ: చేసిన కర్మల చిట్టా ఎన్ని జన్మల నుంచీ వుందో ఎవరికి తెలుసు? లోగట్టు పెరుమాళ్ళకెరుక! కొంత
ధ్యానం చేస్తే కొంత బాగుపడుతాం. అంతా బాగుపడాలంటే ఎంతో ధ్యానం చేయాలి.
కొంత ధ్యానం చేస్తే కొంత బాగుపడి కొంతే బాగుంటాం. మళ్ళీ గతజన్మల నుంచి కర్మ మళ్ళీ ఎక్కడో ఎదురై
శరీరం చెడిపోతుంది. దానర్థం ఏమిటంటే మన ధ్యానం ఎంత చేశామో అంత బాగుపడ్డా ము. మరి ఇంకా ఎన్నో
జన్మల నుండి వచ్చిన దానిని బాగుచేసుకోవటానికి ఇంకా ఎంతో ధ్యానం చేయాలి. అంతేకానీ “చిన్న
ధ్యానానికి అన్ని రోగాలు పోతాయి” అనుకోవడం చాలా మూర్ఖత్వం.
మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో వాటిలో ఎన్ని హీనమయిన కర్మలు వున్నాయో ఆ చిట్టా మనకు
తెలియదు కదా! తెలియనప్పుడు ఇలాంటి లెక్కలు అడగకూడదు. మనకు మన గతజన్మలలోని లెక్కలు
తెలియనప్పుడు నిరంతరంగా ధ్యానం చేస్తూ నే వుండాలి. మన ప్రణాళికలో కొన్ని తెలుసుకోవలసినవి
వుంటాయి, కొన్ని అనుభవించవలసినవి వుంటాయి. ఆ విధంగా “ఎంత ధ్యానం చేసినా కొన్ని జబ్బులు
తగ్గటం లేదు, కొన్ని క్రొ త్త జబ్బులు వస్తు న్నాయి” అంటే అవి మనం విధిగా ప్రణాళికాబద్ధంగా అనుభవించే
తీరాలి కనుక వస్తు న్నాయి. కొన్ని రోగాలు ధ్యానం చేసి తప్పించుకునేలా వుంటాయి.
రోగాలు, దుఃఖాలు రకరకాలుగా వుంటాయి. అన్నీ అనుభవించటం కోసమే మనం వచ్చాం. తగ్గే వి
తగ్గు తాయి. తగ్గనవి తగ్గవు. మనం మట్టు కు ఎప్పుడూ ధ్యానాభ్యాసం చేస్తూ నే వుండాలి. దీనావస్థలో వున్నా
కూడా తప్పనిసరిగా, విడిచిపెట్టకుండా చేస్తూ నే వుండాలి ధ్యానం. అప్పుడే మనకు జీవితం యొక్క
గొప్పతనం మహా గొప్పగా తెలుస్తు ంది.

ప్రశ్న: అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా, ఆనాపానసతినే ఎందుకు అనుసరించాలి?
పత్రీ జీ: నిజమే! అనేకానేక ధ్యానపద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు ఓషో రజనీష్ గారు 108 పద్ధతులు
చెప్పారు. ఇంకా మిగతా మాస్టర్లు అనేక రకాల ధ్యాన పద్ధతులను అనాదిగా చెప్పారు, చెప్తు న్నారు, చెప్తూ నే
వుంటారు కూడా, తమ అనుభవజ్ఞా నాన్ని అందరితో పంచుకోవడం సహజమే కదా!
అయితే ఎవరి అనుభవం వారిది, ఎవరి జ్ఞా నం వారిది. మొదటి జన్మల్లో ఉన్నప్పుడు ఒక విధమై న
అవగాహన వుంటుంది. జన్మలు పెరిగే కొద్దీ అవగాహనలు అత్యంత స్వచ్ఛంగా వుంటాయి, అందువల్ల వారి
బోధనలు అత్యద్భుతంగా వుంటాయి.
గౌతమబుద్ధు డు అనేక జన్మల క్రి ందటే అరిహంతుడు. ఆ తరువాత జన్మలలో బోధిసత్వుడిగా విరాజిల్లా డు;
అంతిమ జన్మగా గౌతమ బుద్ధు నిగా మనందరికీ ఆయన జీవితం, ఆయన బోధనలు సుపరిచితమే!
బుద్ధి డి జన్మలో కూడా సుమారు 500 గురువుల వద్దకు వెళ్ళి ఎన్నెన్నో రకాల ధ్యానపద్ధతులు నేర్చుకుని
అభ్యాసం చేయడం జరిగింది; అయితే ఆయన వున్న స్థా యికి అవి తూగక చివరికి ఆనాపానసతిని
కనుక్కోవడం జరిగింది! వెంటనే తన లక్ష్యంలో కృతకృత్యుడు కావటం కూడా జరిగిపోయింది! అంతిమంగా
బుద్ధు డు ప్రవచించిన “ఆనాపానసతి”యే మన పిరమిడ్ ధ్యానానికి మూలమై నది. “ఆనాపానసతి సాధన”లో
పిరమిడ్ ధ్యానులు కూడా విశేషంగా కృతకృత్యులై బుద్ధు ళ్ళై విరాజిల్లు తున్నారు.

ప్రశ్న: మందులు, మరి ముఖ్యంగా అల్లో పతి మందులు వాడవద్దు అనడానికి కారణం ఏమిటి?
పత్రీ జీ: ప్రతి చిన్న తలనొప్పికీ, కడుపు నొప్పికి మాత్రలు మ్రి ంగటం అందరికీ రివాజు అయిపోయింది. ఏది
వచ్చినా డాక్ట ర్ వద్దకు పరిగెత్తటం .. అతను ఏది పొడిస్తే దానిని పొడిపించుకోవటం, ఇచ్చింది మ్రి ంగటం,
“అంతా బాగై పోతుంది” అనుకుంటూ ఇంటికి వచ్చేయడం అలావాటై పోయింది.
నిజమై న  “MBBS” అంటే “Bachelor of Meditation and Bachelor of Spirituality” అని అర్థం.
“M” for “Medicine కాదు .. “M” for Meditation .. “S” for Surgery కాదు .. “S” for
Spirituality అని అర్థం చేసుకోవాలి.
కొన్ని సంవత్సరాల క్రి ందట న్యూజిల్యాండ్‌లో “విలియమ్స్” అనే ఆయన ముఖానికి, గొంతుకూ క్యాన్సర్
సొకితే డాక్ట ర్లు కిమోథెరపీ కూడా చేసి “ఇక తగ్గదు” అని చెప్పారు. కానీ ఆయన కేవలం రెండు నెలలలో అక్కడి
మన పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఆనాపానసతి ధ్యానం చేసి మరి దానిని పూర్తి గా తగ్గి ంచుకున్నారు! ఇది ఎలా
జరిగింది?
అన్నమయకోశం వెనుక ప్రా ణమయకోశం వుంది. ప్రా ణమయకోశ శుద్ధి జరిగితేనే అన్నమయకోశం
బాగుపడుతుంది. అల్లో పతి వై ద్యుల సూదులు మందులు అన్నీ అన్నమయకోశానికి చెందినవే! వారికి ఆ పై న
వుండే ప్రా ణమయ, మనోమయ, విజ్ఞా నమయకోశాలు వుంటాయని తెలియదు. తెలియని వారి వద్దకు వెళ్ళి
చికిత్స చేయించుకుంటే చికిత్స జరుగుతుందా? జరగదు! ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నది “తల్లి వేరు” అయితే
శారీరక ఆరోగ్యం దాని యొక్క “వృక్ష ఫలం”! “ఆధ్యాత్మిక ఆరోగ్యం” అన్నది ఆనాపానసతి ధ్యాన సాధన
ద్వారానే మరి సాధ్యం.

ప్రశ్న: కర్మకూ, ఎరుకకూ సంబంధం వుందా?


పత్రీ జీ: సృష్టి అంతా “ఎరుక” నుండి వచ్చిందే. సృష్టి పర్యంత మహాశుద్ధ చై తన్యమే “ఎరుక”అంటే.
“ఎరుక” అనేది మూల పదార్థం; పదార్థం పదార్థం కాని పదార్థం. “ఎరుక” అన్నది శాశ్వతమై నది. పుట్టు క,
చావులు లేనిది, అజరామరమై నది. “సృష్టి పర్యంత మహా శుద్ధ ఎరుక” నుండి మన “స్వీయ ఎరుక”
బయల్పడింది. మన స్వంత “ఎరుక” నుంచి మన స్వంత కర్మ ప్రకటితమౌతుంది .. సదా ప్రకటితమౌతూనే
వుంటుంది.
జన్మలన్నీ “ఎరుక”  నుంచి వచ్చేవే. జన్మలోకి వచ్చిన తరువాత చేసే కార్యక్ర మాలన్నీ కూడా మళ్ళీ
ఎప్పటికప్పుడు ఎరుక నుండి వచ్చేవే. ప్రతి జన్మలోని కర్మలన్నీ ఎరుక జనితాలే. ప్రతి కర్మకూ కర్త ఎరుకే.
చేసిన కర్మల ఫలితాలను అధ్యయనం చేసి, బేరీజు వేసుకునేది ఎరుకే.
ఆ విధంగా “ఎరుక” అన్నది సంతోషంగా సముజ్వలమవుతూనే వుంటుంది మరి! ఎప్పటికప్పుడు ఎరుక
యొక్క మహాప్రస్థా నం ఏమని చెప్పవలె! ఎంతని చెప్పగలం!! ఎరుకను మరింత బాగా ఎరుక చేసే
మహాప్రయత్నమే ధ్యానం, ధ్యానకర్మ, ధ్యాన ప్రక్రి య. ధ్యానమహాకర్మల ద్వారా మన ఎరుకను ప్రతిదినం
మనం దేదీప్యమానం చేసుకుందుము గాక!

ప్రశ్న : “సమాజంలో చుట్టూ జరుగుతూన్న అనర్థా లను చూస్తూ ంటే చాలా బాధ కలుగుతోంది.”
పత్రీ జీ : చెడ్డవాళ్ళు చెడ్డపనులు చక్కగా చేస్తు న్నారు! మరి మంచివాళ్ళేం చేస్తు న్నారు? వాళ్ళు
దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తా రు కానీ .. అక్కడ ఇంకా ఏం చేయాలో వాళ్ళకు తోచదు. చర్చ్‌లకు,
మసీదులకు వెళ్ళి ప్రా ర్థనలు చేస్తా రు కానీ .. ఇంకా ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియదు. ఇది సరిఅయిన పద్ధతి
కాదు!
చెడ్డవాళ్ళ చెడ్డ పనులవల్ల జరగాల్సిన అనర్థా లు జరుగుతోంటే .. మంచివాళ్ళ నిష్క్రియాపరత్వం వల్ల
ప్రపంచంలో రావల్సిన మంచి మార్పులు రావడం లేదు. కాబట్టి మంచివాళ్ళంతా కూడా ధ్యానం చేసి
సాధ్యమై నంత ఎక్కువగా తమదై న ఆత్మశక్తి ని సృష్టి స్తే .. ఆ శక్తి తరంగాలు ఈ భూమి మీద వ్యాపించి .. చెడ్డ
వాళ్ళల్లో మంచి మార్పులను సత్వరంగా కలుగజేస్తా యి.
గౌతమబుద్ధు ని ధ్యానశక్తి తరంగాలు పరమ కిరాతకుడై న అంగుళీమాలుడిని పరివర్తన చెందించినట్లు ..
భూమిపై వున్న అనేకానేకమంది బుద్ధు ళ్ళ ధ్యానశక్తి తరంగాలు సమాజంలోని చెడునంతటినీ ప్రక్షా ళం చేస్తా యి!
కనుక ఊరికే బాధపడుతూ కుర్చోకుండా విస్తృత ధ్యాన-జ్ఞా న ప్రచారాల ద్వారా అజ్ఞా త బుద్ధు ళ్ళను తట్టి
లేపుతూ ధ్యానశక్తి తరంగాలను విశ్వవ్యాప్తం చెయ్యాలి.
ప్రశ్న: “ధ్యానం .. ఖచ్చితంగా 40 రోజులు చెయ్యాలా?”
పత్రీ జీ : నలభై రోజుల ధ్యానం అన్నది తప్పనిసరి! ఒక రాయిని సుత్తి తో గట్టి గా కొడుతూ ఉంటే పదిహేను
దెబ్బలవరకు ఏమి జరిగినట్లు కనపడదు; ఆ తరువాత కేవలం ఒక చిన్ని దెబ్బకే అది రెండుగా
పగులుతుంది. అయితే అది చివరి దెబ్బ గొప్పతనం కాదు;అది అంతవరకు శ్ర మించి కొట్టి న పధ్నాలుగు
దెబ్బల ఫలితమే !
అలాగే ధ్యానం కూడా 40 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి !ముందు కొన్ని రోజులు పాటు బయటికి ఏమీ
కనపడకపోయినా .. ఒక్కొక్క దెబ్బకు రాయి లోపల ఉన్న పరిస్థి తిలో కొద్ది కొధ్ది గా మార్పు వచ్చి చివరికి
పగిలిపోయినట్లే .. ఒక్కొక్క రోజు ధ్యానం వల్ల మన అంతరంగం లోపలి ఒక్కొక్క చక్ర స్థా యిలో చిక్కుకుపోయిన
జన్మజన్మల చెడు కర్మ ఫలితాలు విఘటితం చెందుతూ మన నాడిమండలాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటూ
వుంటాం.
తపనతో కూడిన శ్ర ద్ధతో ధ్యానసాధన చేస్తూ వుంటే రాయిలా ఉన్న మనం .. పగలక ముందు నరుడై న
అర్జు నుడిలా పదే పదే దుఃఖానికి గురవుతూ వున్నవారం ధ్యానం ద్వారా పగిలి రెండుగా విడిపోయాక ..
నారాయణుడై న కృష్ణు డిలా ఆత్మజ్ఞా నంతో విలసిల్లు తూ ప్రతిక్షణం ఆనందంగా గడుపుతూంటాం ! అంతకు
ముందు అనేకానేక సందేహాలతో నిండి వున్న మనకు నలభై రోజుల ధ్యాన సాధన తరువాత ప్రతి ఒక్క
సందేహానికీ మన అంతరంగం నుంచే సమాధానం వస్తు ంది.

ప్రశ్న : జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టు కోలేక ఒక్కోసారి నేను బాగా ఏడ్చేస్తూ ంటాను. ఒక్కోసారి
ధ్యానం చేసి ‘ఇది కూడా ఒక అనుభవమే’ అని తెలుసు కుంటూంటాను. ఇందులో ఏది సరై నది?”
పత్రీ జీ: “ఏడవడం” అన్నది మనకూ మరి మన చుట్టూ ఉన్నవారికీ మన భావాలను తెలియజేసే ఒకానొక
అద్భుతమై న భావ అభివ్యక్తీ కరణ చర్య! అది తప్పేమీ కాదు! అయితే బాగా ఏడ్చాక కుదురుగా కూర్చుని
ధ్యానం చెయ్యండి!

ప్రశ్న: కర్మఫలత్యాగం అంటే?”


పత్రీ జీ : చేస్తు న్న సకల కర్మలను లోకకల్యాణార్థమే చేపడతూ .. అలా చేపట్టి న కర్మల యొక్క అంతిమ
ఫలితాన్ని తిరిగి ఆశించకపోవడమే కర్మఫలత్యాగం.

ప్రశ్న: “ఒక్కోసారి ఎంత నిగ్రహించుకున్నా ఆవేశం వచ్చేస్తో ంది?”


పత్రీ జీ : ‘ఆవేశం’ అన్నది ఒకానొక గొప్ప ‘శక్తి ’! ఒకానొక బుద్ధు డు ఎల్లవేళలా శాంతస్వరూపుడై ఉంటూ ..
అత్యవసరం అయినప్పుడు మాత్రమే తన ఆవేశశక్తి ని ఆపద్ధర్మంగా వాడుకుంటూంటాడు ! అలా వాడుతున్న
శక్తి పట్ల అతడు అత్యంత ఎరుకతో ఉంటాడు కనుక అతనికి ఏ విధమై న కర్మబంధాలూ అంటవు.
ప్రశ్న: “మనలో నిక్షి ప్తమై ఉన్న అంతర్గత శక్తి ని ఎలా తెలుసు కోవాలి?”
పత్రీ జీ : “అంతర్గత శక్తి ని తెలుసుకోవాలి” అనుకోవడమే చాలా గొప్ప విషయం! అయితే అంతర్గతశక్తి ని
తెలుసుకోవాలంటే ముందు మనం బయటి అనవసర విషయాలను గురించి ఆలోచించడం, వినడం, చూడడం
మరి మాట్లా డడం పూర్తి గా తగ్గి ంచాలి. అనవసరంగా బయట తిరగటం మానేయాలి మరి బయటి విషయాల
మీద వ్యామోహం తగ్గి ంచుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖులం కావాలి! అప్పుడే మనలోని
అపారమై న అంతర్గత శక్తి ని మనం తెలుసుకోగలుగుతాం.

ప్రశ్న : “‘మతబేధం’ అన్నది ఎందుకు వస్తో ంది?”


పత్రీ జీ :  ఆత్మజ్ఞా నలోపంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో ‘మతబేధం’ అన్నది వస్తో ంది. మనం
ఒకానొక జన్మలో ‘క్రి స్టి యన్’ గా, మరొక జన్మలో ‘మహ్మదీయుడి’ గా .. ఇలా అనేకానేక జన్మల్లో అనేకానేక
రీతులలో పుడుతూంటాం. కానీ పుట్టి న తరువాత ఆ ఆత్మ సత్యాన్ని మర్చిపోయి .. “నేను
మహ్మదీయుడిని”, “నేను క్రి స్టి యన్‌ని” లేదా “నేను హిందువుని” అన్న అజ్ఞా నంలో పడి మతబేధాల్లో
ఇరుక్కుంటూ ఉంటాం. జన్మ పరంపర పట్ల మరి కర్మ సిద్ధా ంతం పట్ల ఎరుకతో ఉండాలంటే .. తప్పనిసరిగా
ధ్యానం చెయ్యాల్సిందే!!

ప్రశ్న : ” ఈ మధ్య ఎక్కడ చూసిన ఇబ్బడి ముబ్బడిగా ఆధ్యాత్మిక సంస్థలు పుట్టు కొస్తు న్నాయి. ఇందులో
నాకు ఏది సరి అయినదో నేను ఎలా ఎంపిక చేసుకోవాలి?”
పత్రీ జీ : ఒక్కొక్క పద్ధతినీ నిశితంగా పరీక్షి స్తూ వెళ్ళాలి ; దానికి ఎంతో సహనం ఉండాలి! గౌతమ బుద్ధు డు
ఆరేళ్ళపాటు విసుగు విరామాలు లేకుండా సుమారు ఐదువందల మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాడు.
అక్కడ తాను గ్రహించిన విషయాల అన్నింటినీ ఆచరించి చూసి .. ఆ అనుభవ జ్ఞా నాన్నంతా క్రో డీకరించుకుని
.. తనదై న “ఆనాపానసతి” దారిని ఎన్నుకున్నాడు. బుద్ధు డికై నా ..మరెవరికై నా .. ఎంపిక పద్ధతి ఒక్కటే!

ప్రశ్న : “గత కొన్ని సంవత్సరాలుగా ఏవో తెలియని భయాలు నాలో పేరుకుపోయి నన్ను చాలా
బాధపెడుతున్నాయి. వాటినుంచి విముక్తి చెందడం ఎలా?”
పత్రీ జీ : ధ్యానంలో కూర్చుని .. గతంలో మీకు మాటల ద్వార చేష్టల ద్వారా ఎవరెవరి వల్ల బాధ కలిగిందో
వారందరినీ పేరు పేరునా గుర్తు కు తెచ్చుకుని .. వారిని బేషరతుగా క్షమించివెయ్యండి.
అలాగే .. మీరు మీ మాటల ద్వారా చేష్టల ద్వారా ఎవరెవరిని బాధపెట్టా రో గుర్తు తెచ్చుకుని పేరు పేరునా
వాళ్ళను క్షమాపణలు అడగండి. క్ర మక్ర మంగా మీ అంతశ్చేతనా మనస్సు యొక్క మూల మూలల్లో నిక్షి ప్తమై
ఉన్న బాధాకరమై న ఆలోచనల నుంచి మీరు విముక్తి చెందుతారు.
ఇంకా ఇంకా మీ ధ్యాన సమయాన్ని పెంచుతూ .. నవీన ఆధ్యాత్మికతకు చెందిన పుస్తకాలను చదువుతూ ..
ప్రతిరోజు దీనిని ఒక అభ్యాసంలా చేయండి.
ప్రశ్న : “ధర్మం ఎన్ని రకాలుగా సాక్షా త్కరిస్తు ంది?”
పత్రీ జీ : ధర్మం రెండు రకాలుగా సాక్షా త్కరిస్తు ంది. ఒకటి: “స్వధర్మం” రెండు : “పరధర్మం” 
ధ్యానం చేసి స్వానుభవంతో ఆత్మసత్యాన్ని తెలుసుకోవడం “స్వధర్మం” తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో
పెట్టి “నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాలాగే ఆత్మస్వరూపులు” అని తెలుసుకుని మసలుకోవడం
“పరధర్మం”.

ప్రశ్న: “ధ్యానం సరిగ్గా కుదరడానికి ఏవై నా ‘చిట్కాలు‘ ఉన్నాయా?!”


పత్రీ జీ: ఇంతకు ముందు ఏ విధమై న పూజలూ, మత క్రతువులూ, శాస్త్రచర్చలూ చేయని వారికి ధ్యానం
కాస్త చక్కగానే కుదురుతుంది! యాభై యేళ్ళ వయస్సు గల నూతన ధ్యానాభ్యాసికి మనస్సు మీద
పడిన పాత ముద్రలను చెరిపివేసుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది! యాభై యేళ్ళ
వయస్సులో క్రొ త్త భాష నేర్చుకునేవాడినికి కంటే అంతకు ముందు వేరే ఏ ఇతర ముద్రలు మనస్సు మీద
లేని చిన్న పిల్లవాడు ఎంతో తొందరంగా ఏదై నా నేర్చేసుకుంటాడు కదా! కనుక ఆలోచనలన్నీ వదిలేసి
కాస్సేపు మానసికంగా చిన్నపిల్లల్లా మారి అతి సహజమై న స్థి తిలో ధ్యానానికి ఉపక్రమించడమే .. చక్కటి
‘చిట్కా‘!

ప్రశ్న: “‘చదువు’ అన్నది వ్యాపారంలా మారిపోతూన్న ఈ తరుణంలో .. అసలు ఎలాంటి చదువు


చదువుకోవాలో అర్థం కావడం లేదు!”
పత్రీ జీ: “చదువు” అన్నది ప్రతి ఒక్కరిలో విజ్ఞా నాన్నీ, విజ్ఞతనూ మరి విచక్షణా జ్ఞా నాన్నీ పెంచి అసలై న
జీవితశాస్త్రాన్ని బోధిస్తు ంది. అందుకే ఈ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళను “అసలై న చదువున
చదువుకున్నవాళ్ళు” అంటారు! రామకృష్ణ పరమహంస, రమణమహర్షి , జీసస్‌క్రైస్ట్, షిరిడీ సాయిబాబా,
మహమ్మద్ ప్రవక్త వంటి ఎంతో మంది యోగులు ప్రా పంచిక చదువులేమీ చదువలేదు కానీ .. వాటిని చదివేసి
లెక్కలేనన్ని డిగ్రీ లను పేర్ల చివరన తగిలించుకున్న వాళ్ళెందరో వీళ్ళ దగ్గరికి అసలై న జీవితశాస్త్రాన్ని
నేర్చుకోవడానికి వచ్చారు!

ప్రశ్న: “ధ్యానం చేస్తే మనం ఎక్కడెక్కడో లోకాల్లో ఉన్నవాళ్ళను కలుసుకోవచ్చా??”


పత్రీ జీ: ఎంచక్కా కలుసుకోవచ్చు!! ఎక్కడెక్కడి లోకాల్లో ఉన్న మాస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు
వాళ్ళను చూడగలిగే శక్తి నీ .. వాళ్ళతో మాట్లా డగలిగే శక్తి నీ .. మరి వారి నుంచి సందేశాలను అందుకునే శక్తి నీ
.. మనం ధ్యానం ద్వారా మాత్రమే పొందగలం!
ప్రశ్న: “శ్వాస పై నే ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చెయ్యాలి?”
పత్రీ జీ: “శ్వాస” అన్నది ఈ రోజు, ఈ క్షణానికి చెందిన వర్తమాన అద్భుతం! అది నిన్నటి భూతకాలానికి
చెందిన ‘పెనుభూతం’ నుంచీ మరి రేపటి భవిష్యత్తు కు చెందిన ‘గాలిమేడల’ నుంచీ మనల్ని సంపూర్ణమై న
ఎరుకతో విముక్తి చెందించి .. వర్తమాన క్షణంలోని అద్భుత ఆనందంతో మనల్ని మమేకం చేస్తు ంది. అందుకే
“శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసే ఆత్మ విజ్ఞా న కాముకులందరూ వర్తమాన క్షణంలోని ప్రతి ఒక్క
అనుభవాన్ని కూడా గొప్ప జ్ఞా నంలా స్వీకరిస్తూ తమ తమ ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఉంటారు.

ప్రశ్న: “మిమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరికీ మీరు ఎంతో ఆత్మీయులుగా కనిపిస్తా రు .. ఎందుకు?!!”
పత్రీ జీ: ఎందుకంటే నేను అందరికీ ఒక “అద్దం”లా ఉంటాను కనుక! “అద్దం” అన్నది ఎప్పుడూ తన ముందు
ఉన్నవాళ్ళ నిజరూపాలనే ప్రతిబింబిస్తు ంది! మరి ప్రతి ఒక్కరికీ “అద్దం”లో తమను తాము చూసుకోవడం
ఎంతో నచ్చుతుంది కదా! నేను కూడా “అద్దం”లాగే నా దగ్గరికి వచ్చిన వారి గుణగణాలను అచ్చంగా
ప్రతిబింబిస్తూ ఉంటాను కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా తమను తాము ప్రే మించుకున్నట్లే ..
తమకు “అద్దం”లా ఉన్న నన్ను కూడా అంతగానే ప్రే మిస్తూ ంటారు.

ప్రశ్న: ” ‘దేవుడు’ ఎక్కడ ఉంటాడు?”


పత్రీ జీ: “సర్వం ఖల్విదం బ్రహ్మ” .. అంటే “ఈ వున్నదంతా దై వమే” .. అందుకే నేను నా కంటికి కనిపించే
జీవదేవుళ్ళందరినీ కొలుస్తూ ంటాను; మరి ప్రతి ఒక్క దేవుడితో మాట్లా డుతూంటాను; అందరితో కలిసి మెలిసి
వుండటానికి ఉవ్విళ్ళూరుతూ వుంటాను!

ప్రశ్న: ” ‘ఆధ్యాత్మికత’ అంటే?”


పత్రీ జీ: “మనం పూర్ణదేవుళ్ళనుంచి విడివడిన అంశ దేవుళ్ళం .. మనం దేవుళ్ళచే తయారు చేయబడిన
దేవుళ్ళం” అని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి గాను మన దై నందిన
జీవితంలో మనం చేయాల్సిన అతి ముఖ్యమై న పని ధ్యానాభ్యాసం! నీటిలో మునిగితే – స్నానం .. శ్వాసలో
మునిగితే – ధ్యానం .. సత్యంలో మునిగితే – జ్ఞా నం!

ప్రశ్న: “మనలో శక్తి ఎన్ని రకాలుగా ప్రకటితం అవుతుంది?”


పత్రీ జీ: “తామసిక”, “రాజసిక”, “సాత్విక” .. “నిర్గు ణ” .. తామసిక శక్తి భౌతిక శరీరంతో .. రాజసిక శక్తి
మనస్సుతో .. సాత్విక శక్తి బుద్ధి తో .. మరి నిర్గు ణ శక్తి ఆత్మతో కలిసి ప్రకటితం అవుతూ వుంటుంది.
ప్రశ్న: “జంతులోకానికి కూడా ప్రకృతి సూత్రా లు వర్తి స్తా యా?”
పత్రీ జీ: ఖచ్చితంగా వర్తి స్తా యి! పశుపక్ష్యాదులన్నీ కూడా ప్రకృతి సూత్రా లకు బద్ధు లై అతి సహజంగా జీవిస్తూ
ఆనందంగా వుంటాయి. అందుకే విచారంగా ఉంటూ, చావునూ, బాధలను తలచుకుని తలచుకుని
భయపడుతూ భయపడుతూ కుమిలిపోయే జంతువులనూ, పక్షు లనూ మనం ఎప్పుడూ చూడం!

ప్రశ్న: “‘జ్ఞా నం’ ఎలా సేకరించుకోవాలి?”


పత్రీ జీ: ప్రతి పువ్వులోనూ అంతో ఇంతో మకరందం ఉన్నట్లే .. ప్రతి మనిషిలో కూడా స్వల్పంగానో, అధికంగానో
ఇంగితజ్ఞా నం అన్నది విధిగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచీ మకరందాన్ని
గ్రో లినట్లు ఒకానొక ముముక్షు వు ఏ ఒక్కరినీ విస్మరించకుండా ప్రతి ఒక్కరి నుంచీ ఇంగిత జ్ఞా నాన్ని విధిగా
సేకరించుకోవాలి. అలా సేకరించుకున్న జ్ఞా నాన్ని ఆచరణ ద్వారా తన అనుభవ జ్ఞా నంలా మలచుకుంటూ ..
దానిని మళ్ళీ పది మందితో పంచుకోవాలి; సర్వకాల సర్వావస్థల్లో నూ “జ్ఞా న సేకరణ”సూత్రం ఇదే.
బొట్టూ బొట్టూ చేరి సముద్రం అవుతుంది కదా!

ప్రశ్న : ఆత్మ .. “పురోగమన దిశ” లో ఉందని తెలుసుకోవడం ఎలా ?


పత్రీ జీ: “ఆత్మ యొక్క పురోగతి” అన్నది .. ఆ ఆత్మ తన జీవితకాలంలో తాను స్వయంగా ఎంపిక
చేసుకున్న రకరకాల భౌతిక మరి ఆధ్యాత్మిక ప్రయత్నాల యొక్క విశాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ఆయా ప్రయత్నాల యొక్క “తుది ఫలితం ” అన్నది జయం కావచ్చు లేదా అపజయం కావచ్చు కానీ …
పురోగమనం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ” జయం ” అన్నది ఆ ఆత్మకు పునరుత్సాహాన్ని అందిస్తే .. ”
అపజయం ” అన్నది ఆ ఆత్మలో విశేష సహనాన్ని పెంచుతుంది ! అందుకే ఆత్మ పురోగతికి ”
జయాపజయాలు ” రెండూ కూడా సరిసమానమై న నిష్పత్తి లో అవసరం అయిన కీలక అంశాలు!
అసలు ప్రయత్నమే లేనప్పుడు .. జయం ఉండదు .. అపజయం ఉండదు .. మరి ” పురోగమనం ”
అంతకన్నా ఉండదు. ఎన్ని జన్మలు ఎత్తి నా ఆత్మస్థి తి అన్నది ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా
వుంటుంది.

ప్రశ్న: చాలా మంది తమ తమ జీవితాలను హాయిగా ఆనందించలేక పోతున్నారేమో అనిపిస్తో ంది ?


పత్రీ జీ: అది మీ అవగాహనలో లోపమే! ఎందుకంటే .. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను
హాయిగానే ఆనందిస్తు న్నారు .. ప్రతిక్షణం క్రొ త్త క్రొ త్త పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు.
ఇలా ” నిరంతర నేర్చుకోవడం ” అన్నది వారి వారి ఆత్మ యొక్క ఎదుగుదలను బట్టి ” ఎరుకతో ”
జరుగవచ్చు లేదా ” ఎరుకలేకుండా ” కూడా జరుగవచ్చు. కానీ ఆ నేర్చుకున్న ఫలితం మాత్రం వారి
భవిష్యత్ జీవితంపై తన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తు ంది.
ప్రశ్న: “తృప్తి ” అన్నది ఎలా కలుగుతుంది?
పత్రీ జీ: జీవితంలో ఏ రంగం కూడా ఎవ్వరికీ సంపూర్ణమై న సంతృప్తి ని ఇవ్వజాలదు ! అయితే, ధ్యాన,
స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదులతో కలిగే దివ్యజ్ఞా నప్రకాశాన్ని పొందిన తరువాతే ఎవ్వరికై నా .. వారి వారి
జీవితంలోని ఏ కార్యక్షే త్రమై నా కూడా .. తనదై న సంతృప్తి ని కొద్ది గానై నా అందించగలుగుతుంది.

ప్రశ్న: కర్మ ఎలా చెయ్యాలి ? భగవంతుడు అంటే ? ఆత్మ అంటే ?


పత్రీ జీ: కర్మ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే ధ్యానం చెయ్యాలి .. భగవంతుడు ఎవరో గుర్తి ంచాలంటే
ధ్యానం చెయ్యాలి .. ఆత్మ అన్నది తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి.

ప్రశ్న: మూర్తి పూజలు ఎందుకు చెయ్యకూడదు ?


పత్రీ జీ: హిందూ సమాజంలోని అనేకానేక మూఢ నమ్మకాలపై పోరాడిన స్వామి దయానంద సరస్వతి గారు
అందించిన ” సత్యార్థ ప్రకాశం ” అనే గ్రంథరాజాన్ని అధ్యయనం చెయ్యాలి! ” మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త
” అని వారు అందులో స్పష్టంగా సెలివిచ్చారు ! మహమ్మద్ ప్రవక్త మూర్తి పూజలను నిరసించారు .. మరి
బుద్ధు ని బోధనల సారాంశం కూడా అదే ! ” దేవుని రాజ్యంలో నువ్వూ, నేను ఒక్కటే ” అన్న ఏసుక్రీ స్తు
సందేశాన్ని కూడా విని .. మేలుకుని .. మీరు ఎవరో .. ఏం చెయ్యాలో తెలుసుకోవాలి !

ప్రశ్న : “కావలసినవి అన్నీ కూడా ప్రకృతే మనకు సమకూర్చి పెడుతూండగా .. ఇక మనం కష్టపడి పని
చెయ్యాల్సిన అవసరం ఏముంది ?” అని నా స్నేహితుడు అంటున్నాడు !
పత్రీ జీ : అలా మూర్ఖంగా మాట్లా డే స్నేహితులను తక్షణం విడిచిపెట్టా లి ! ప్రకృతి నుంచి ఏది పొందాలన్నా
కూడా మనం తగినంతగా కష్టపడాల్సిందే ! ఛార్లె స్ డార్విన్ మహాశయులు అందించిన జీవపరిణామ
సిద్ధా ంతాలై న ” Struggle for Existance ” మరి ” Survival of the Fittest ” ల గురించి ఎప్పుడూ
వినలేదా?! ప్రకృతి ఎప్పుడూ సరియై న వాటినే ఎన్నుకుంటుంది .. మరి సరికాని వాటిని నిర్మూలించి వేస్తు ంది
!
ప్రశ్న: సాధకుడికి ఆహారపరిమితులు ఎలా ఉండాలి ?
పత్రీ జీ: కేవలం యోగ సాధకుడే కాదు .. బుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ శ్రే ష్ఠమై న శాకాహారం మాత్రమే తినాలి ! అది
కూడా అధికంగా తింటే దేహం బలిసి ఇంద్రి యాలు మందగిస్తా యి కనుక క్ర మక్ర మంగా దేహ ఆహారాన్ని తగ్గి స్తూ
ఆత్మ ఆహారమై న ధ్యానసమయాన్ని పెంచుతూపోవాలి.

ప్రశ్న: “ధ్యాన శక్తి తో, మన దేహంలోని రెండు ప్రో గుల DNA పన్నెండు ప్రో గుల DNA గా అభివృద్ధి చెందడం
సాధ్యమేనా !”
పత్రీ జీ : సాధ్యం ! అయితే అది మనం చేసే ధ్యాన, స్వాధ్యాయ సజ్జనసాంగత్యాది సాధనలను బట్టే ఉంటుంది !
ఆత్మ పరిణామక్ర మంలోని అతి సాధారణ మానవ స్థా యి అయిన రెండు ప్రో గుల పరిమిత DNA నుంచి
రకరకాల జీవిత అనుభవాల సారంతో ఉచ్ఛస్థి తికి చేరిన 12 ప్రో గుల DNA తో కూడిన అధిమానవ .. Higher
Universal Man .. స్థా యికి ఎదగడమే మానవ జీవిత పరిపూర్ణ లక్ష్యం !
ఆ లక్ష్యసాధన దిశగానే మనం చేసే వివిధ సాధనలను బట్టి ముందు సూక్ష్మలోకాల్లో మన మనోమయ,
కారణమయ, మహాకారణమయ మరి నిర్వాణమయ కోశాలు అన్నీ కూడా 12 ప్రో గుల DNA స్థా యికి
ఉన్నతీకరించబడతాయి. ఆ తరువాతే భూలోకంలో ఉన్న మన భౌతిక దేహ కణజాలాల్లో ని క్రో మోజోములపై
ఉన్న DNA కూడా రెండు ప్రో గుల నుంచి 12 ప్రో గులకు ఉన్నతీకరించబడి మనం బహుముఖ ప్రజ్ఞా శాలులుగా
విరాజిల్లడం ప్రా రంభం అవుతుంది !

ప్రశ్న: “జ్ఞా నం అన్నది ఎన్ని రకాలు ? “


పత్రీ జీ : “జ్ఞా నం” అన్నది మౌలికంగా రెండు రకాలు :
ఒకటి .. “ఆత్మపరమై న ఇంగిత జ్ఞా నం”
రెండు .. “భౌతికపరమై న ఇంగిత జ్ఞా నం”
మనకు ఆత్మపరంగా అవసరం అయ్యేది ఏమిటో .. అవసరం కానిది ఏమిటో .. తెలుసుకోవడం అన్నదే
“ఆత్మపరమై న ఇంగిత జ్ఞా నం” .
మన భౌతిక అవసరాలతో పాటు .. ఇతరుల భౌతిక అవసరాలను కూడా అవసరం అయ్యింది ఏమిటో ..
అవసరం కానిది ఏమిటో .. తెలుసుకోవడం అన్నది ” భౌతికపరమై న ఇంగిత జ్ఞా నం “

ప్రశ్న : “ధర్మబద్ధంగా ఎలా జీవించాలి ?”


పత్రీ జీ : మనిషై పుట్టి న ప్రతి ఒక్కరూ మౌలికంగా మూడు ధర్మాలను తప్పక పాటించాలి .. 
మొదటిది : “దేహం పట్ల ధర్మం” : ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమై న జ్ఞా నాన్ని
పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమై న మనందరికీ .. దేహం ఒక ‘ వాహనం ’ !
ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శ్రు తిబద్ధంగా, లయబద్ధంగా చుసుకుంటేనే అది మనకు సరి అయిన
విధంగా సహకరిస్తూ వుంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎప్పటికై నా ప్రయాణం చెయ్యగలం .. మరి
మనం వచ్చిన పనిని చక్కబెట్టు కోగలం ! కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరి అయిన పోషణను అందిస్తూ ,
ధ్యానంతో దానిని శక్తి వంతం చేయాలి.
మన శరీరంలో కోటానుకోట్ల కణాలు వున్నాయి. వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు కానీ .. మనకే
వాటి గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు
గురిచేస్తు న్నాం. పెట్రో లు కారులో డీజెల్ పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు ..
మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మనం అభాసుపాలు అవుతున్నాం !
ఈ కోటానుకోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞా నవంతమై ంది ! మన కణజాలం అంతా కూడా
ప్రతిక్షణం ఒకదానిని ఒకటి సమన్వయ పరచుకుంటూ క్ర మక్ర మంగా ఆత్మ ఉద్దీ పన దిశగా సాగుతూంతుంది.
కనుక వాటితో మనం సరియై న విధంగా ప్రవర్తి ంచాలి అంటే .. మనకు నిరంతర ధ్యానసాధన మరి అహింసా
ధర్మాచరణయే మార్గం !
రెండవది “సమాజం పట్ల ధర్మం” : సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక అందరూ సుఖంగా
సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం ! అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థి క సంపదనూ
ఆధ్యాత్మిక సంపదనూ అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక
దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యానప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే .. మిగతా
అన్ని దానాలు కూడా వ్యర్థమై పోతాయి.
మూడవది “ఆత్మ పట్ల ధర్మం” : మనం ఏ పని కోసం ఈ భూమ్మీద జన్మ తీసుకున్నామో .. విశేషంగా ఆ పని
మీదే ధ్యాస ఉంచుకుంటూ .. మరి ఇతర దై నందిన కార్యక్ర మాలను నిర్వహించుకుంటూ వుండాలి. వచ్చిన
పనిని సజావుగా పూర్తి చేసుకోకపోతే .. ఇక్కడ గడిపిన మన జన్మకాలం తో పాటు మనం సంపాదించిన
సంపదలన్నీ వ్యర్థమై పోతాయి ! ఆ తరువాత చనిపోయి పై లోకాల్లో కి వెళ్ళాక .. జరిగిన అనర్ధా నికి చింతించినా
లాభం వుండదు .. మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేచి ఉండాల్సి ఉంటుంది. కనుక సమయాన్ని అనవసరమై న
కాలక్షే పాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా .. ఇతోధికంగా ధ్యాన సాధనలో ఆత్మను పరిపుష్టం చెయ్యాలి !
విశేషంగా స్వాధ్యాయ సాధన చేస్తూ ండాలి .. విస్తృతంగా సజ్జన సాంగత్యం చేయాలి!

ప్రశ్న : “మరణానంతరం మన పరిస్థి తి ఏంటి ?”


పత్రీ జీ : ” మరణం ” అంటే .. భౌతిక శరీరానికీ మరి సూక్ష్మశరీరానికీ మధ్య వున్న “వెండిప్రో గు -Silver cord”
యొక్క సంబంధం తెగిపోవడం మాత్రమే. మరణం ద్వారా ” చై తన్యంతో కూడిన ఎరుక ” మన భౌతికశరీరం
నుంచి విడివడి .. “సూక్శ్మశరీరం” తో శాశ్వతంగా అనుసంధానించబడి .. ఇక అక్కడి నుంచే తన యొక్క
కార్యకలాపాలు సాగిస్తూ వుంటుంది.
ఒకానొక సగటు మూమూలు వ్యక్తి యొక్క సూక్ష్మశరీరం .. మరణం తర్వాత కూడా .. ఈ భూమి మీద కనీసం
మూడు రోజుల పాటు తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో “ఒకానొక ఆస్ట్రల్ మాస్టర్” మరి “ఒకానొక
ఆస్ట్రల్ అప్రె ంటీస్” కలిసి ఆ వ్యక్తి కి సూచనలిస్తూ శక్తి నిస్తూ ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తా రు. అక్కడ కాస్త సేద
తీయించిన తర్వాత అతనితో అంతవరకూ ఆ జన్మలో అతడు గడిపిన జీవితాన్ని సింహావలోకనం
చేయిస్తా రు.
అప్పుడే అతని పాప మరి పుణ్యకార్యాల చిట్టా సరిచూడబడి, అతని కర్మలస్థా యిని అనుసరించి మళ్ళీ
పునఃపరిశీలించబడిన లక్ష్యాలతో .. మరి పునర్ వ్యవస్థీ కరించబడిన గమ్యాలతో .. అతని ” పునర్జన్మ
ప్రణాళిక ” రచించబడుతుంది.

ప్రశ్న : ధ్యానం మన నిత్యజీవితంలో ఎలంటి సహాయం చేస్తు ంది?


పత్రీ జీ : నిరంతర ధ్యానం ద్వారా మనం పొందే “విశ్వశక్తి ” వల్ల మనలోని “శక్తి కేంద్రా లన్నీ” ఉత్తే జితం చేయబడి
మనం “శక్తి స్వరూపాల్లా ” పరిమారిపోతాం. దీనివల్ల మనం చేస్తో న్న పనులన్నింటిలో .. సునిశితమై న నాణ్యత,
నై పుణ్యతలు పెరిగి ఎంతటి పనినై నా అవలీలగా మరి ఆనందంగా ఒక ఆటలా పూర్తి చేయగలుగుతాం.
ధ్యానం అన్నది మనల్ని ఒక “నిశ్చలానందస్థి తి” లో వుంచడం వల్ల మనం ఆత్మశాంతితో .. సాక్షీ తత్వంతో
కళ్ళముందు వున్న పరిస్థి తులు ఏ రకమై న మార్పు చెందుతున్నా సరే .. సమతా స్థి తిలో వాటి ఫలితాలను
గ్రహిస్తూ .. మనం చేస్తూ న్న పని మీద మాత్రమే ధ్యాస ఉంచగలుగుతాం.
ధ్యానం అన్నది మనల్ని క్ర మక్ర మంగా “అత్యంత చక్కగా అధ్యయనం చేయబడిన శాస్త్రీయ దృక్పథాల” తో
కూడిన “బుద్ధి జీవులు” గా పరిమార్చుతుంది. దానివల్ల పరిస్థి తులను ఆకళింపు చేసుకోవడంలో మరి ఎదుటి
మనిషిని అర్థం చేసుకోవడంలో మనలో ఎంతో గొప్ప మార్పు వస్తు ంది. ప్రతి విషయాన్ని పరిపక్వ శాస్త్రీయ
అవగాహనతో అర్థం చేసుకుంటూ మరి “సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ” తో మన నిర్ణయాలు మనమే
తీసుకుంటూ మరి ఇతరుల ఆత్మయుతస్వేచ్ఛ ను కూడా గౌరవిస్తూ .. వారితో అద్భుతమై న
అనుబంధాలను నెరపుతాం. ఇలా ” విశ్వపు ఏకత్వం ” వై పు మనం ప్ర్రయాణం చేస్తూ .. సదా బ్రహ్మానంద
స్థి తిలో వుంటాం.
“సరియై న ధ్యానం” అనేది మనల్ని 1. శక్తి స్వరూపాల్లా 2. నిశ్చలానందస్వరూపాల్లా 3. బుద్ధజీవుల్లా
పరిమార్చివేస్తు ంది.

ప్రశ్న: “దివ్యజ్ఞా న ప్రకాశం పొందడానికి ప్రత్యేక పద్ధతులు ఏవై నా ఉన్నాయా ?”


పత్రీ జీ: “దివ్యజ్ఞా న ప్రకాశం” అన్నది అలనాటి గౌతమ బుద్ధు డికి మాదిరిగానే .. నేర్చుకునే క్షమతను బట్టి ..
నేర్చుకోగలిగిన పరిస్థి తులను బట్టి .. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత శాతం ఉంటూనే ఉంటుంది. మరి నిరంతర
ధ్యాన – జ్ఞా న సాధనల ద్వారా తమ బుద్ధి ని మరింత పదును పెట్టు కునే వాళ్ళంతా కూడా బుద్ధు ళ్ళే!
బుద్ధు ళ్ళుగా వున్నవాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుసుకుంటూ “ఎలా ఉండాలి ? ” .. “ఎలా
ఉండకూడదు? ” .. “ఎలా మాట్లా డాలి ?” .. “ఎలా మాట్లా డకూడదు ?” .. “ఏం తినాలి ?” … “ఏం
తినకూడదు ? ” లాంటి అనేకానేక విషయాల పట్ల సంబంధించిన మేలై న బుద్ధి నీ, మౌలిక ఇంగిత జ్ఞా నాన్నీ
ప్రతిక్షణం ధారాపాతంగా పొందూతూనే ఉంటారు.

ప్రశ్న : “జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టు కోలేక ఒక్కోసారి నేను బాగా ఏడ్చేస్తూ ంటాను. ఒక్కోసారి

‘ఇది కూడా ఒక అనుభవమే’ అని సమాధాన పడుతూంటాను. ఇందులో ఏది సరై నది?

పత్రీ జీ : “ఏడవడం” అన్నది మన భావాలను మనకూ మరి చుట్టూ వున్నవారికీ తెలియజేసే ఒకానొక చక్కటి

అభివ్యక్తీ కరణ చర్య! అది తప్పేమీకాదు కాబట్టి , బాగా ఏడ్చాక కూర్చుని కుదురుగా ధ్యానం చెయ్యండి ..

“ధ్యానం”, “తీరిగ్గా కూర్చుని ఏడవడం”.. రెండూ కూడా ఆత్మప్రగతికి దోహదం చేసేవే!


ప్రశ్న : “గౌతమబుద్ధు డు తన జాతకరీత్యా యోగీశ్వరుడయ్యాడా? లేక ..”

పత్రీ జీ :గత అనేకానేక జన్మలనుంచే .. గౌతమబుద్ధు డు గొప్ప యోగీశ్వరుడు! అయితే ఇక్కడ మనం

తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ..”గౌతముడిలా మనం ఎప్పుడు యోగీశ్వరులం అవుతాము? ఒకానొక

బుద్ధు డిలా మనం ఎలా జీవించగలుగుతాము?” అన్నదే కానీ మరింకోటి కాదు! అనేకానేక మంది

యోగీశ్వరులు మనకు అందించిన అనుభవపరమై న శాస్త్రీయ ఆత్మజ్ఞా నాన్ని అందుకుంటూ దానిని మన

స్వీయ అనుభవజ్ఞా నంలా మలుచుకోవడమే మనం చెయాల్సిన పని కానీ .. వాళ్ళ జాతకాలను

విశ్లే షించుకుంటూ కూర్చోవడం వల్ల మనకు జరిగేదేమీ వుండదు.

ప్రశ్న : “గతకొన్ని సంవత్సరాలుగా నాలో ఏవో తెలియని భయాలు పేరుకుపోయి నన్ను చాలా

బాధపెడుతూ వున్నాయి. వాటి నుంచి విముక్తి చెందడం ఎలా?”

పత్రీ జీ : ధ్యానంలో కూర్చుని .. గతంలో మీకు ఎవరెవరి వల్ల బాధకలిగిందో వారిని గుర్తు తెచ్చుకుని ..

వాళ్ళందరినీ పేరు పేరునా బేషరతుగా క్షమించివెయ్యండి. అలాగే మీరు ఎవరెవరిని బాధించారో వాళ్ళను

కూడా గుర్తు కు తెచ్చుకుని .. పేరు పేరునా వాళ్ళను క్షమాపణలు అడగండి. క్ర మక్ర మంగా మీ అంతశ్చేతనా

మనస్సు యొక్క మూల మూలల్లో నిక్షి ప్తమై వున్న బాధాకరమై న ఆలోచనల నుంచి మీరు విముక్తి

చెందుతారు. ఇంకా మీ ధ్యాన సమయాన్ని పెంచుతూ .. నవీన ఆధ్యాత్మికతకు చెందిన పుస్తకాలను

చదువుతూ ప్రతి రోజూ ఇది ఒక అభ్యాసంలా చేయండి.

ప్రశ్న : “మనం పొందవలసినవి అన్నీ కూడా అడక్కుండానే ప్రకృతి మనకు సమకూర్చి పెడుతుంది కనుక

మనం ఏ పని చెయ్యకపోయినా ఫరవాలేదు’ అని నా స్నేహితుడు అంటున్నాడు ..”

పత్రీ జీ : అటువంటి మూర్ఖశిఖామణి మీకు స్నేహితుడు కాకూడదు! వెంటనే వాడి స్నేహాన్ని వదిలి పెట్టండి!

చార్లె స్ డార్విన్ మహాశయులు అందించిన సిద్ధా ంతాలను గురించి మీరు చదువుకోలేదా? పరిణామక్ర మంలో

భాగంగా ప్రకృతి ఎప్పుడూ మన అస్తి త్వానికి సంబంధించిన రకరకాల పరీక్షలకు మనల్ని గురిచేస్తూ

వుంటుంది: Struggle for Existence. ఆ పరీక్షల్లో నెగ్గి న వారినే అర్హు లుగా ఎంచి .. క్ర మక్ర మంగా అప్పుడు

వారికి చెందవలసినవి వారికి అందజేస్తూ వుంటుంది: Survival of The Fittest.


ప్రశ్న : “ఇంటగెలిచి రచ్చగెలవమని పెద్దలు చెప్తా రు .. అది ఎలా?!”

పత్రీ జీ : ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్నవి మూడు కలిసిన “ఆధ్యాత్మిక జీవితం 50 శాతంగా”

ఉన్నప్పుడే “మిగతా 50 శాతం ప్రా పంచిక జీవితం” అన్నది సమత్వపు స్థి తిలో సాగుతుంది. “ఆత్మ ఇంట”

గెలిచిన ఒకానొక బుద్ధు డు మాత్రమే “ప్రా పంచిక రచ్చ”లో కూడా గెలుస్తూ సమత్వపు స్థి తిలో తన జీవితాన్ని

సంపూర్ణంగా జీవిస్తూ ంటాడు!

ప్రశ్న : “ఇప్పుడు ఎక్కడ చూసినా ఇబ్బడి ముబ్బడిగా ఆధ్యాత్మిక సంస్థలు పుట్టు కొస్తు న్నాయి. వీటిల్లో ఏది

నాకు సరిఅయినదో ఎంపిక చేసుకోడానికి ఏదయినా Short Cut పద్ధతి ఉందా?!

పత్రీ జీ : “Short Cut ” అన్నది ఎక్కడా లేనేలేదు! ఒక్కొక్క పద్ధతినీ నిశితంగా పరీక్షి స్తూ వెళ్ళాల్సిందే! ..

దీనికి ఎంతో సహనం వుండాలి. గౌతమబుద్ధు డు ఆరేళ్ళ‌పాటు విసుగు విరామం లేకూండా సుమారు 500

మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. అక్కడ తాను గ్రహించిన విషయాలన్నింటినీ ఆచరించి ఆ

అనుభవజ్ఞా నాన్నంతా క్రో డీకరించుకుంటూ చివరికి తనదై న ఆనాపానసతి దారిని ఎన్నుకున్నాడు.

గౌతమబుద్ధు నికై నా .. మరెవరికయినా “సునాయాస చిట్కా పద్ధతులు” అంటూ ఏవీ లేవు!

ప్రశ్న : “‘కోపం, ఏడ్పు, కరుణ ప్రే మ, దయ సానుభూతి అన్న భావాలను బయటికి వ్యక్త ం చేస్తే నే’ వాటి నుంచి

విముక్త ం చెందుతాడు’ అని నేను చాలా సందర్భాల్లో చదివాను. కానీ అలా చేయడం వల్ల నా సన్నిహితులే

నన్ను అర్థం చేసుకోకుండా నన్ను చిత్రంగా చూస్తూ న్నారు.”

పత్రీ జీ :క్షీ రసాగర మధనంలో ముందు హాలహలం వచ్చి ఆ తరువాత ‘ కల్పవృక్షం ’, ‘ కామధేనువు’,

‘ఐరావతం’, ‘వజ్రా యుధం’ లాంటివన్నీ వచ్చి చివరిగా అమృతం దక్కుతుంది. ఆధ్యాత్మిక సాధనాక్ర మంలో

ముందు నా అనుకున్న వాళ్ళనుంచే ఛీత్కారాలూ, వెటకారాలూ వస్తా యి! అన్నింటినీ తట్టు కుంటూ మరి

మనోనిబ్బరం కోల్పోకుండా సత్యసాధన చేస్తూ వుంటే క్ర మక్ర మంగా మనకు దక్కవలసినవి అన్నీ వస్తూ

వుంటాయి.అప్పటికి .. మన ధ్యానసాధనా తరంగాల ప్రభావం వల్ల అందరి స్థి తిగతుల్లో కూడా మార్పువచ్చి

క్ర మక్ర మంగా వాళ్ళు కూడా ఈ రహదారిలోకే వచ్చి అంతవరకు అపార్థం చేసుకున్న వాళ్ళంతా కూడా

అప్పుడు కొంతై నా అర్థం చేసుకుంటారు.


ప్రశ్న : “నేను ధ్యానం చేస్తూ .. మాంసాహారం యొక్క అనర్థా లను తెలుసుకుని వెంటనే పూర్ణ శాకాహారిగా

మారిపోయాను. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మా ఇంట్లో వాళ్ళంతా నన్ను మాంసాహారం తినమని

బలవంతం చేస్తు న్నారు. వాళ్ళ మాట ‘సరే’ అన్నప్పుడల్లా నాకు ధ్యానం సరిగ్గా కుదరకపోగా నా హృదయం

అంతా వేదనతో నిండిపోతోంది. కిం కర్తవ్యం?!”

పత్రీ జీ : తక్షణం మీరు మీ ఇంటి నుంచి బయటపడండి! మిమ్మల్ని పాపపంకిలంలోకి త్రో సేవాళ్ళు మీ వాళ్ళు

ఎలా అవుతారు? “ప్రహ్లా దుడు -హిరణ్యకశ్యపుడు” కథ వినలేదా?!

ప్రశ్న : “గురువుగారు! సత్యయుగం మొదలై నట్లే నా?!”

పత్రీ జీ : భిన్నత్వంతో కూడిన ఈ సృష్టి లో అందరికీ ఒకేలా ఉండదు! మీకు సత్యయుగం మొదలై మీ ఇంట్లో

వాళ్ళు ఇంకా కలియుగంలోనే ఉండవచ్చు! లేదా మీ వాళ్ళంతా సత్యయుగంలోకి వెళ్ళిపోయి మీరు ఇంకా

కలియుగంలోనే కొట్టు మిట్టా డుతూ ఉండవచ్చు!

ప్రశ్న : “జీవితాన్ని ఎలా జీవించాలి?!”

పత్రీ జీ : “ఈ జన్మ మనకు తెలియకుండా అకస్మాత్‌గా జరిగిన సంఘటన ఎంతమాత్రం కానేకాదు” అన్న

సత్యాన్ని మనం తెలుసుకుని జీవితం గురించి నిరంతరం జాగ్రత్తగా ఆలోచించాలి. మన స్వ-ఇచ్ఛతో

ఏరుకుని, కూర్చుకున్నటువంటి అత్యంత ప్రణాళికాబద్ధమై న మన జీవితాన్ని అజ్ఞా నంతో, మూర్ఖత్వంతో

దుర్భరం చేసుకోకుండా ప్రతిక్షణం ఆత్మజ్ఞా నపు ఎరుకతో జీవిస్తూ దానిని “చాన్నాళ్ళ అద్భుతం” లా

మలచుకోవాలి!

ప్రశ్న : “మరణం తరువాత ఆత్మకు ఏమవుతుంది?”

పత్రీ జీ : ఏమీ కాదు!! మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది? అలాగే..

మరణం తరువాత తాత్కాలికమై న శరీరాన్ని ధరించి వున్న శాశ్వతమై న ఆత్మకు కూడా ఏమీకాదు!

శరీరానికి బట్ట ఎలాంటిదో .. ఆత్మకు శరీరం అలాంటిదే కనుక మరణం ద్వారా శరీరం నశించిన తరువాత

కూడా ఆత్మ మరిన్ని అనుభవాలకోసం మరిన్ని జన్మలను తీసుకుంటూ మరిన్ని క్రొ త్తక్రొ త్త శరీరాలను

ధరిస్తూ తన అనంతకాల ప్రయాణాన్ని కొనసాగిస్తూ నే వుంటుంది.


ఫ్రశ్న : “అందరూ ‘దేవుడు ఉన్నాడు’ అంటున్నారు కదా! అసలు దేవుడిని చూడడం ఎలా?!

పత్రీ జీ : సర్వం ఖల్విదం బ్రహ్మ .. కనపడేదంతా దేవుడే! అందరూ దేవుళ్ళే!

“నేను ప్రతిక్షణం .. ప్రతి ఒక్కదేవుడినీ చూస్తు న్నాను; ప్రతి ఒక్కదేవుడితో మాట్లా డుతున్నాను” అన్న

సత్యాన్ని మరిచిపోయిన దేవుళ్ళంతా కూడా విజయవాడ నుంచి తిరుపతికీ .. కోదాడ నుంచి షిరిడికీ వెళ్ళి

“దేవుడెక్కడా?” “దేవుడెక్కడా?” అని దేవులాడుతున్నారు!

ఫ్రశ్న : “మీకు మొండిధై ర్యం ఎక్కువ!”

పత్రీ జీ : నాకు సత్యం ఏదో, అసత్యం ఏదో ఖచ్చితంగా తెలుసు! కాబట్టే .. ఆ తెలుసుకున్న సత్యాన్ని

అందరికీ స్పష్టంగా చెబుతూ వస్తు న్నాను. సత్యాన్ని ‘సత్యం’ అనీ ఐస్‌క్రీ మ్ ని ‘ఐస్‌క్రీ మ్’ అనీ చెప్పడానికి

మొండిధై ర్యం అవసరంలేదు. దానిని గురించిన వాస్తవం తెలిస్తే చాలు.

ప్రశ్న: “క్లి ష్టమై న పరిస్తి తుల్లో ఎలా రియాక్ట ్ కావాలి?”


పత్రీ జీ :  REACTION చెందేవాడు పురుషాధముడు
CREATION చేసేవాడు పురుషోత్తముడు.

“REACTION” అన్న ఆంగ్ల పదంలోని అక్షరాలను మరోవిధంగా కూర్చి తెలుసుకుంటే “CREATION”

అని వస్తు ందిగదా! కాబట్టి నో రియాక్షన్!! “కరుణ”ను చూపించాలి; “కరుణ” ను “సృష్టి ంచి”, ఆచరించి,

చూపించాలి. నా వ్యక్తి త్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి నేను నా జీవితంలో ఈ సూత్రా న్నే

అనుసరిస్తు న్నాను.

ప్రశ్న : “ఓ ఎన్‌లై టెన్డ్ మాస్టర్‌ను గుర్తి ంచడం ఎలా?”

పత్రీ జీ : ఎన్‌లై టెన్డ్ మాస్టర్‌ను గుర్తి ంచడం చాలా సులభం! అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకుని

మరీ జీవిస్తూ ంటాడు. అతడు కష్టా లకు కృంగిపోడు; బాధలకు తలవంచడు. అందరితో మమేకం అవుతూ

అందరినీ సరిసమాన స్నేహదృష్టి తో చూస్తూ .. ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, దూషించినా

బాధపడకుండా .. ఒక బుద్ధు డిలా సదా బ్రహ్మానందస్థి తిలో వుంటాడు.


ప్రశ్న : “‘పనియే ప్రా ర్థన’ అనే సంస్కృతి ప్రబలిపోయిన ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ధ్యానం చేసి

అంతరాత్మను పట్టి ంచుకునేంత తీరిక ఎవరికి వుంటుంది?

పత్రీ జీ : మరేం ఫరవాలేదు! ఈ జన్మలో కాకపోతే మరో వందజన్మల తరువాత కూడా ధ్యానం చేసుకుని

అంతరాత్మను పట్టి ంచుకుని ఆత్మజ్ఞా నాన్ని పొందవచ్చు. కాకపోతే .. ఆత్మసాక్షా త్కారం పొందేంతవరకూ క్రొ త్త

జన్మ తీసుకున్నప్పుడల్లా ప్రా పంచిక కష్టా ల్లో , బాధల్లో పడి నలుగుతూనే వుండాలి. అందుకే .. ఊరికే పుట్టడం,

గిట్టడం కాకుండా .. ఆ ధ్యానమేదో ఇప్పుడే చేసి ఈ జన్మలోనే ఆత్మ సాక్షా త్కారం పొందితే ఎంతో బాగుంటుంది

.. అదే అసలై న ‘పని!

ప్రశ్న : “ధ్యానం చక్కగా కుదరాలంటే?”

పత్రీ జీ : ధ్యానం చక్కగా కుదిరిన వాళ్ళతో సాంగత్యం చేయాలి; ధ్యానం అనునిత్యం ప్రబోధించే వాళ్ళతో.. ఆ

సంఘంతో .. చేరాలి! “పిరమిడ్ సంఘం శరణం గచ్ఛామి” అని నిశ్చయించుకోవాలి!

ప్రశ్న : “సమాజం పట్ల మన కర్తవ్యం?”

పత్రీ జీ : “దానం!” సమాజంలో అందరూ సుఖంగా, సంతోషంగా వుంటేనే సంఘజీవులమై న మనం కూడా

సుఖంగా సంతోషంగా వుంటాం! అందుకుగాను మనం అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేకానేక

ఆర్థి కపరమై న దానాలతో పాటు .. ధ్యాన-జ్ఞా న దానాలవంటి ఆధ్యాత్మికపరమై న దానాలను కూడా విశేషంగా

చెయ్యాలి.

ప్రశ్న : “విదేశాల్లో నివసిస్తూ న్నప్పుడు ఒక్కోసారి శాకాహారం దొరకడం కష్టంగా వుంటోంది?”

పత్రీ జీ :“ధ్యానం”-“శాకాహారం” అన్నవి రెండూ .. మనకు రెండు పాదాలలాంటివి. ఇందులో ఏ ఒక్కటి మనకు

లేకపోయినా మనం వికాలాంగుల్లా కుంటి బ్రతుకు ఈడవాల్సిందే! ఒకవేళ శాకాహారం బొత్తి గా దొరకని ప్రదేశాల్లో

కనుక ఉండాల్సి వస్తే .. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే .. నిర్ద్వందంగా దానిని వదిలి పెట్టె య్యాలి.

ధర్మబద్ధంగా జీవించడానికి అనువుగాలేని అలాంటి దుర్భరప్రదేశాలు డాలర్లను కురిపిస్తూ మనల్ని

తాత్కాలిక మాయకు గురిచేసినా .. ఆత్మ పరిణామక్ర మంలో మాత్రం అవి మనకు ప్రతిబంధకాలుగా

నిలుస్తా యి.
ప్రశ్న : “ప్రకృతితో కలిసి జీవించడం ఎలా?”

పత్రీ జీ : ప్రకృతి రెండు పార్శ్వాలుగా వుంటుంది. స్థూ ల ప్రకృతి .. చర్మచక్షు వులతో చూసేది. సూక్ష్మ ప్రకృతి ..

దివ్యచక్షు వులతో చూసేది. ఒకే జీవిత కాలంలో ఈ రెండు పార్శ్వాలతో కూడిన ప్రకృతితో విశేషంగా కలిసి

జీవించడమే .. శాస్త్రీయమై న జీవనవిధానం. చర్మచక్షు వులతో చూడగలిగిన స్థూ లప్రకృతి అయిన కొండ –

కోనలు .. చెట్లు – చేమలు .. పక్షు లు – జంతువులు .. నదులు – సెలయేళ్ళు .. స్వచ్ఛమై న గాలి –

సముద్రా లు వంటి శక్తి క్షే త్రా లలో సమయం గడుపుతూ వాటి నుంచి ఇతోధికంగా విశ్వమయప్రా ణశక్తి ని పొందాలి.

ధ్యానం ద్వారా దివ్యచక్షు వును ఉత్తే జపరచుకుని మామూలు చర్మచక్షు వులతో చూడలేని సూక్ష్మకారణ,

మహాకారణ వంటి అనేకానేక ఉన్నత లోకాలను దర్శించి .. ఆ యా లోకాల నుంచి విశ్వశక్తి నీ, ఆ యా లోకాల

భావసంపదనూ గ్రహించి నూతన ఔన్నత్యంతో కూడిన మనోవికాసాన్ని పొందాలి.

ఇలా స్థూ ల, సూక్ష్మ ప్రకృతులతో కూడి శాస్త్రీయ పద్ధతిలో ఏకకాలంలో జీవించగలిగినప్పుడే మనం

విశ్వజీవులుగా పరిణమిస్తా ం!

ప్రశ్న : “ఆనందం ఎలా వస్తు ంది?”

పత్రీ జీ : మనసా, వాచా, కర్మణా త్రి కరణశుద్ధి గా, నిజాయితీగా ఉన్నప్పుడు మనకు ఆనందం అన్నది విశేషంగా

లభ్యం అవుతూ వుంటుంది. ధ్యాన అనుభవం ద్వారా మనం తెలుసుకున్నదానినే మాట్లా డుతూ .. అలా

మాట్లా డిన దానినే ఆచరిస్తూ .. నిత్య ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆనందమయులుగా ఉంటాం.

ఈ నిత్య జీవన ఆనందమయ సూత్రా న్ని పిల్లలకూ, పెద్దలకూ, బంధువులకూ మరి మనల్ని శత్రు వులగా

చూస్తు న్నవాళ్ళకు కూడా అందజేస్తూ వారిని కూడా ఆనందమయుల్లా మలుస్తూ ఉంటే మనం బ్రహ్మానందంతో

విలసిల్లు తూ ఉంటాం.

ప్రశ్న : “యోగభ్రష్టత్వం అంటే ఏమిటి?”

పత్రీ జీ :సరియై న ధ్యాన సాధనను విశేషంగా చేసిన ప్రతి ఒక్కరికీ అపరమితమై న శక్తి సామర్థ్యాలు సంక్ర మిస్తూ

ఉంటాయి. తద్వారా వారు ఏది కోరుకుంటే అది ప్రా పంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా

సునాయాసంగా కలిసివస్తూ ఉంటాయి.


“ప్రా ప్తి ” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధు ల వల్ల మనం గర్వం, అహంకారం

మరి డంబాతిశయాలను పెంచుకుంటే .. అది మన ఆధ్యాత్మిక మరి ప్రా పంచిక పతనాలకు దారితీసి మనల్ని

యోగభ్రష్ఠు ల్లా మలిచి మరు జన్మల్లో మరింత క్లి ష్టపరిస్థి తుల్లో జన్మతీసుకునేలా చేస్తు ంది.

అలా కాకుండా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు సంక్ర మిస్తో న్న సిద్ధు ల పట్ల ఎరుకతో కూడిన

సమదృష్టి ని కలిగి ఉండాలి! కోరుకున్నవై నా .. లేదా అనాలోచితంగా నై నా సరే .. మనకు సంప్రా ప్తి స్తో న్న

అద్భుత ఫలితాలు పట్ల కృతజ్ఞతతో కూడి ఉంటూ గర్వానికి లోబడిపోకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే

ఆత్మ తన పరిణామ క్ర మంలో ముందుకు వెళ్తూ ఉంటుంది.

ప్రశ్న : “సాధన ఎంత వరకు?”

పత్రీ జీ :ఆత్మసాక్షా త్కారం అయ్యేంతవరకూ ధ్యానసాధన కొనసాగుతూనే ఉండాలి. దివ్యచక్షు వును ఉత్తే జితం

చేసుకోవాలి .. సూక్ష్మ శరీరయానాలు చేయాలి .. గత జన్మల జ్ఞా న సంపదంతటినీ తిరిగి పొందాలి .. పరలోక

గురువులతో సంపర్కం కలిగి ఉంటూ ఆత్మజ్ఞా నాన్నంతా ఔపోసన పట్టా లి. “ఈ ప్రక్రి య అంతా ఇప్పుడే

మొదలుపెట్టి ఈ జన్మలోనే పరాకాష్ఠను సాధించాలి” అన్న దృఢనిశ్చయంతో ముందుకు సాగడం ఉత్తముల

లక్షణం!

ప్రశ్న : గురువు యొక్క అవసరం ఎంత వరకు?”

పత్రీ జీ : పరిమితమై న అలోచనలతో కూడిన ప్రా పంచిక మాయలోంచి బయటపడేంత వరకూ మనకు బాహ్య

గురువుల సూచనలూ, సలహాలూ, అవసరం! ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం సంపూర్ణంగా అర్థం

చేసుకున్నప్పుడు స్వయంప్రకాశంతో కూడిన గురువుల్లా మనకు మనమే మార్గదర్శనం చేసుకుంటాం.

ఇందుకు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదులు మనకు ఇతోధికంగా సహాయపడతాయి!

ప్రశ్న : “టెన్షన్ అన్నది లేకుండా ఎప్పుడూ శాంతంగా ఎలా వుండవచ్చు?”

పత్రీ జీ :‘టెన్షన్’ అన్నది మీకే కాదు .. అందరికీ వుంటుంది! మహాభారతయుద్ధం చేయడానికి అస్త్రశస్త్రాలతో

బయలుదేరిన అర్జు నుడికి కూడా తీరా యుద్ధరంగం మధ్యలోకి రాగానే “టెన్షన్” మొదలై ంది! “శత్రు సై న్యంలో

వున్న ఆ ద్రో ణాచార్యుడిని ఎలా చంపాలి?”, “కురువృద్ధు లై న భీష్మపితామహులను ఎలా మట్టు పెట్టా లి?”..
“అసలు ఇప్పుడు యుద్ధం చెయ్యడం అవసరమేనా? అంటూ అనేకానేక ఉద్రే కాలకు గురిఅయిన అర్జు నుడి

పరిస్థి తికి జాలిపడిన శ్రీ కృష్ణు డు” అర్జు నా! నువ్వు ముందు యోగివి కా!” అని చెప్పాడు.

మహావీరుడు మరి ఎన్నెన్నో ఆయుధాలను చేతిలో కలిగివుండికూడా అర్జు నుడు టెన్షన్ పడ్డా డేకానీ .. చేతిలో

ఏ ఆయుధం లేకుండా యుద్ధరంగంలో రధాన్ని తోలుతూ కూర్చున్న శ్రీ కృష్ణు డు మాత్రం ఏ టెన్షన్ లేకుండా

కులాసాగా కూర్చున్నాడు! కారణం అతడు చిన్నతనం నుంచే ధ్యానసాధనలో తన జీవితాన్ని పండించుకున్న

గొప్ప యోగీశ్వరుడు! ధ్యానవిద్యలో నిష్ణా తులు అయినవారికి శ్రీ కృష్ణు డిలాగా ఎప్పుడూ టెన్షన్ అన్నది

ఉండదు.

ప్రశ్న : “‘ధ్యానసాధనలో వుండే ప్రతిబంధకాలు ఏవేవి ?”

పత్రీ జీ : ధ్యానసాధనలో ఉండే ప్రా థమిక ప్రతిబంధకాలు :

1. సోమరితనం .. 2. భయం .. 3 అహం

1. సోమరితనం : పీకలదాకా తిని త్రా గి పడుకోవడం .. టీవీలో వచ్చే ప్రో గ్రా మ్‌లను కళ్ళప్పగించేసి చూస్తూ

కూర్చోవడం .. ఏ కాస్త తీరిక దొరికినా పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమై న కాలక్షే పపు చెత్తకబుర్లు

మాట్లా డుతూ కాలాన్ని హరించివేయడం.

2. భయం : ఎంత రోతవై నా పాత విషయాలను బంగారంలా కాపాడుకుంటూ వాటిని వదలడానికి భయపడడం

.. బంగారంలాంటి క్రొ త్త విషయాలను స్వీకరించి ఆచరించడానికి భయపడడం.

3. అహం: ‘దేవుడు’, ‘బుద్ధి ’, ‘ఆత్మ’ ల గురించి అక్షరంముక్క తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు

మాట్లా డడం .. తెలుసుకోవాల్సిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం.

ఈ మూడు మౌలిక ప్రతిబంధకాలు ధ్యానసాధకులకే కాదు .. ఎవరికై నా .. సుతరామూ పనికిరావు.

ప్రశ్న : “‘క్రొ త్త కట్టడాల నిర్మాణాన్ని మొదలుపెట్టే ప్పుడు భూమి పూజ చెయ్యాలా ?”

పత్రీ జీ : తప్పనిసరిగా చెయ్యాలి ! క్రొ త్త నిర్మాణం మొదలు పెట్టబోయే నేలపై చక్కగా ధ్యానంలో కూర్చుని

కాస్సేపు చిత్తవృత్తు లన్నీ నిరోధం చేయాలి ! మన ఎరుకను ఆ నేల తల్లి లో ప్రవేశింపజేసి ఆ తల్లి తో మమేకమై

.. అక్కడ కట్టబోయే క్రొ త్త నిర్మాణానికి ఆమె అనుమతి తీసుకోవాలి ! నేలతల్లి తో అలాంటి
అవినాభావసంబంధాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ఇద్దరూ కలిసిచేసే పనులన్నీ అవిఘ్నంగా

నెరవేరుతాయి!

మంచి సువాసనలు వెదజల్లే అగరువత్తు లను ఆ ప్రదేశంలో వెలిగించి .. కొబ్బరికాయనో, అరటిపండునో,

స్వీటునో అక్కడ క్రి మికీటకాదులకు విందుభోజనంలా పెట్టా లి ! చక్కటి శ్రా వ్యమై న బిస్మిల్లా ఖాన్ లాంటి

సంగీతాన్ని వింటూ ధ్యానం చెయ్యాలి!

ప్రశ్న : “ఆచార్యుడు అంటే ఎవరు?”

పత్రీ జీ : ” యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ .. సః ఆచార్య ” అన్నది శాస్త్రం !

అనేకానేకమంది గురువుల దగ్గర ఆత్మజ్ఞా నాన్ని యాచించి, యాచించి పొంది .. అలా యాచించి యాచించి

పొందిన దానిని సాధన ద్వారా తన స్వానుభవంగా మార్చుకుని .. తాను చేసిన ఆ ఆత్మాభ్యాసాన్నే ఇతరుల

చేత కూడా చేయించేవాడే ఆచార్యుడు !

ఈ భూమి మీద జన్మతీసుకున్న ప్రతి ఒక్కరూ ఆచార్యుడు కావడానికి ప్రయత్నించాల్సిందే .. మరి

ఆచార్యుడిగా అయ్యేంత వరకు తిరిగి తిరిగి ఇక్కడ పుట్టా ల్సిందే !

ప్రశ్న : “‘స్వేచ్ఛ’ ను నిర్వచించండి!”

పత్రీ జీ : స్వ = స్వంత .. ఇచ్ఛ = కోరిక .. “స్వేచ్ఛ” అంటే మన “స్వంత ఇచ్ఛ”!

“మనం ఎక్కడ వున్నా, ఏ లోకంలో తిరిగినా మన వాస్తవాన్ని మన స్వంత కోరికల ప్రకారం మనమే

సృష్టి ంచుకుంటున్నాం” అన్న ఆత్మజ్ఞా నపు ఎరుకతో సదా ఆనందంగా జీవించడమే సేచ్ఛ !

ప్రశ్న: “కర్మయోగం అంటే ఏమిటి ?”

పత్రీ జీ : * మనం చేయవలసిన కర్మలను గుర్తి ంచి వాటిని శ్ర ద్ధగా చేయడానికి ప్రయత్నించడమే ” కర్మయోగం

”!
* మనం చేస్తు న్న వృత్తు ల మీద గౌరవభావాన్ని కలిగి వుండడమే .. “కర్మయోగం” !

* సమయాన్ని దుర్వినియోగం చేయకుండా అనేకానేక సుకర్మల్లో మనల్ని మనం ఎప్పటికప్పుడు

నియమించుకోవడమే .. “కర్మయోగం”!
* రకరకాల విద్యలనూ, కళలనూ సదా నేర్చుకుంటూ వుండడమే .. “కర్మయోగం” !

* సంసార చక్ర ంలో పై న వున్నప్పుడు మిడిసిపడకుండా .. క్రి ంద వున్నప్పుడూ క్రు ంగిపోకుండా స్థి రచిత్తంతో

ధై ర్యంగా నిలబడగలగడమే .. “కర్మయోగం”!

* కర్మఫలితం మీద ఎక్కువగా ఆధారపడకుండా కర్మచేయడంలో మాత్రమే శ్ర ద్ధగా నిమగ్నమై ఉండడమే ”

కర్మయోగం ” !

* మన ఆలోచనలూ, మాటలూ, చేష్టలూ .. అన్నింటి పట్ల సమయ సందర్భాలను అనుసరించి

జాగురూకులుగా వుండడమే .. ” కర్మయోగం ” !

* ప్రతి కర్మ కూడా మరొక కర్మకు కారణభూతమవుతుందన్న కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుని

కర్మచక్రా న్ని జాగరుకతతో పరిశీలించడమే .. ” కర్మయోగం ” !

* ” చేసుకున్న వాడికి చేసుకున్నంత ” అన్న సిద్ధా ంతాన్ని అర్థం చేసుకుని ఆ పరిధిలో జీవించడమే

“కర్మయోగం”

ప్రశ్న : “తప్పులను ఎలా సరిదిద్దు కోవాలి ?”

పత్రీ జీ : ప్రతి మనిషి కూడా తన ప్రగతి పథంలో తప్పులు విధిగా చేస్తూ నే ఉంటాడు. అయితే వాటిని

నడకనేర్చుకోవడంలో దొర్లే చిన్ని చిన్ని తప్పటడుగుల్లా గానే గుర్తి ంచాలి ! అంతేకాక ఒకవేళ నిజంగా తప్పు

జరిగినా కూడా దానిని మరిచిపోయి మళ్ళీ వెంటనే క్రొ త్త క్రొ త్త సృజనాత్మక కార్యక్ర మాల్లో మునిగిపోవాలి.

” నేను పాపిని .. నేను పాపిని ” అని పదే పదే అనుకుంటూ ఆత్మనూన్యతకు గురికావడం కానీ .. ” నువ్వు

పాపివి .. నువ్వు పాపివి ” అంటూ మరొకరిని నిందించడం కానీ చెయ్యకూడదు. తప్పులు చేస్తు న్న వాళ్ళ

దగ్గరి నుంచి కూడా సదా పాఠాలు నేర్చుకోవడమే మనం చెయ్యవలసిన పని.

ప్రశ్న : “సజ్జన సాంగత్యానికీ, ఆచార్యసాంగత్యానికి తేడా ఏమిటి ?”

పత్రీ జీ : “సజ్జన సాంగత్యం” అంటే “‘సత్యం ’ తెలుసుకున్న వారితో కలిసి ఉండడం” .. అంటే ఆత్మవిద్య

గురించీ, ఆత్మశక్తి గురించీ స్పష్టమై న అవగాహన కలిగి ఉన్న సజ్జనులతో కూడిన సాంగత్యం !
“ఆచార్యులు” అంటే “తాము తెలుసుకున్న సత్యంలో సదా జీవిస్తూ తమతమ జీవితాలను మరింత

సత్యసాధనకే అంకితం చేసినవారు, చేస్తు న్నవారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణ ప్రగతిని సాధించిన ఇలాంటి

ఆచార్యులతో కలిసిమెలిసి జివించడమే” ఆచార్య సాంగత్యం”.

ప్రతి ఒక్క సాధకుడు కూడా ధ్యానంతో పాటు ” సజ్జన సాంగత్యం ” మరి ” ఆచార్యసాంగత్యం ” అన్నవి విధిగా

చెయ్యాలి. అప్పుడే అతని ఆత్మ ప్రగతిపధంలో ముందుకు నిశ్చితంగా సాగిపోతూ వుంటుంది.

ప్రశ్న : “బుద్ధు డి మూర్తు లను .. కూర్చున్న భంగిమలో, నిలుచున్న భంగిమలో మరి పడుకున్న భంగిమలో

చూస్తూ ంటాం ! వాటి అంతరార్థా లు ?”

పత్రీ జీ : ధ్యానస్థి తిలో కూర్చుని వున్న బుద్ధమూర్తి .. ” ధ్యానం ద్వారా జ్ఞా నం ” అన్న శివ పార్వతీ తత్త్వాన్ని

సూచిస్తూ వుంటుంది. నిశ్చలంగా నిలబడి వున్న బుద్ధమూర్తి .. “కార్యోన్ముఖతకూ, సృజనాత్మకతకూ

ప్రతిరూపంగా వున్న బ్రహ్మవాగేశ్వరీ తత్త్వాన్ని సూచిస్తు ంది.

ఇక పడుకుని వున్న బుద్ధమూర్తి .. పాలసముద్రంలో యోగనిద్రా పరవశుడై ముక్త స్థి తిలో వున్న విష్ణు తత్త్వాన్ని

సూచిస్తు ంది.

ప్రశ్న : “జీవన్ముక్తు డు ఎలా ఉంటాడు ?”

పత్రీ జీ : దేనికీ తాపత్రయపడని ప్రశాంత నిర్మల తత్వంతో బుద్ధి పరిణితిని సాధించి ఉన్నవాడే ” ఒకానొక

జీవన్ముక్తు డు “; అలాంటి నిష్కామ నిశ్చలమూర్తి అయిన జీవన్ముక్తు నికి సిరి దాస్యం చేస్తు ంది .. విజయం కోరి

తలుపు తడుతుంది.

అన్నింటా తృప్తు లై ఉన్న జీవన్ముక్తు ల వాక్కులూ, కర్మలూ ఆత్మహితకరాలుగా, లోకహితకరాలుగా

విరాజిల్లు తూ వుంటాయి.
ప్రశ్న : “రాజకీయాలంటే జనాలకు ఏ మాత్రం సదభిప్రా యం లేని ఈ రోజుల్లో ‘ధ్యానులే పరిపాలుకులు

కావాలి’ అన్న నినాదంతో ఓ రాజకీయ పార్టీ ని ప్రా రంభించి, ఎన్నికల సంరంభంలో ధ్యానులను విస్తృతంగా

పాల్గొ నేలా చేయటంలో మీ ఉద్దే శ్యం?”

పత్రీ జీ: “జీవితంలో అన్ని రకాల ఆటలూ ఆడాలి, అన్ని రకాల పాటలూ పాడాలి, అన్ని రకాల రుచులూ

అనుభవించాలి, అన్ని రకాల రసాలూ గ్రో లాలి, అనేకానేక సంఘపరమై న క్రి యాత్మక కార్యకలాపాలలో

‘రాజకీయం’ అనేది కూడా ఒకానొక ప్రముఖ కార్యకలాపం. బాధ్యత గల ప్రతిపౌరుడికీ రాజకీయ స్పృహ,

‘రాజకీయ అవగాహన’ అన్నది చాలా ముఖ్యం.మామూలు పౌరులకే రాజకీయ చై తన్యం ఎంతో

అవసరమై నప్పుడు ఆధ్యాత్మిక పౌరులకు అది ఇక మరింత అవసరమవుతుంది.

ఆధ్యాత్మిక పౌరులు తమ స్వంత వ్యక్తి గత సంక్షే మాన్ని పూర్తి గా సాధించినవారు. తమ స్వంత వ్యక్తి గత

జీవితాలను ‘కడిగిన ముత్యాలు’ గా చేసుకున్న వారు. ఆ తదుపరి కార్యక్ర మమే ‘సంఘాన్ని కడిగిన ముత్యం

గా చేయటం’ ఈ నేపథ్యంలో సాంఘిక కార్యకలాపాల్లో ప్రధాన భూమికను నిర్వహిస్తు న్న ‘రాజకీయాలను

ప్రక్షా ళన చేయటం’ అన్నది ఆధ్యాత్మిక పౌరుల ప్రథమ కర్తవ్యం.

పిరమిడ్ ధ్యానులకూ, పిరమిడ్ ఆత్మజ్ఞా న పరాయణులకూ ఒక ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ ని పెట్టటమనేది,

స్ఠా పించటమనేది, ఆ పార్టీ ఆశయాల ప్రచారం అనేది, ఎన్నికలలో పాల్గొ నటమనేది ఇదంతా ఒక నూతన ఆట

-ఒక వినూత్న పాట -క్రొ త్త నినాదం -క్రొ త్త రుచి క్రొ త్త విద్యాభ్యాసం – క్రొ త్త విజ్ఞా నం క్రొ త్త సాంఘిక కార్యకలాపం

-క్రొ త్త కర్తవ్యం -క్రొ త్త వికాసం”

ప్రశ్న : “గెలుపు ఓటముల పై నె నేటి సమాజం వ్యక్తు లకిచ్చే విలువ ఆధారపడి ఉంటుంది కదా! ‘పిరమిడ్

పార్టీ ’ పేరుతో మీరు ‘చేసిన సాహసం’ వెనుక గల స్ఫూర్తి ఎంతో ఉన్నతమై నదై నా, దానివలన

ఎదుర్కొనవలసి ఉన్న విమర్శలు, అప్రతిష్టల గురించి మీ వ్యాఖ్యానం?”

పత్రీ జీ : “భారతదేశం స్వతంత్రదేశం. ప్రతి వారికీ ఇతరులను విమర్శించటానికీ, వాఖ్యానించటానికీ

నిర్ద్వందంగా పూర్ణ హక్కు ఉంది. ముఖ్యంగా ఒక క్రొ త్త రాజకీయ పార్టీ వచ్చినప్పుడు, విమర్శలూ, చర్చలు

అత్యమంత సహజం.

అజ్ఞా నులూ, అల్పజ్ఞా నులూ 99% ఉన్న ఈ వర్తమాన సమాజంలో అజ్ఞా నపు, అల్పజ్ఞా నపు విమర్శలే,

వ్యాఖ్యానాలే బహుళంగా ఉండటం అన్నది కూడా అత్యంత సహజం. అజ్ఞా నుల మూర్ఖ విమర్శలకూ, వివేక
రహిత వ్యాఖ్యానాలకూ ఏ మాత్రం లక్ష్య పెట్టకపోవటం జ్ఞా నులకూ అత్యంత సహజం. అందులోనూ పిరమిడ్

ధ్యానులకూ, పిరమిడ్ ఆత్మజ్ఞా న పరాయణులకూ వెన్నతొ పెట్టి న విద్య.

చివరి మాటగా చెప్పాలంటే, ధ్యానయోగులు మాత్రమే పరిపాలకులుగా ఉండటానికి సామర్థ్యం కలవారు.

ఎందుకంటే ధ్యానులే, ఆత్మజ్ఞా నపరాయణులే నిస్వార్థు లుగా నిపుణులుగా ఉంటారు కనుక.

ప్రశ్న : “ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందా ?”

పత్రీ జీ : ధ్యానం చెయ్యడం వల్ల పెరిగేదే .. ఆత్మవిశ్వాసం. ” ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ..

పర్వతాలను సై తం కదలించవచ్చు ” అన్నారు జీసస్ క్రైస్ట్. కనుక ధ్యానం చేసేవాళ్ళకు కొండంత

ఆత్మవిశ్వాసం వుంటుంది .. మరి వాళ్ళు ఏది అనుకుంటే దానిని సాధించుకోగలుగుతారు.

ప్రశ్న : “‘కోపం’, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమై న లక్షణాలను పోగొట్టు కోవడం ఎలా ? “

పత్రీ జీ : “‘కోపం ‘, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమై న లక్షణాలను పోగొట్టు కోవడం కాకుండా ..

ఏవి, ఎక్కడ, ఎప్పుడు ఎలా ఉంచాలో .. అక్కడ, అప్పుడు, అలా ఉంచడం అలవాటు చేసుకోవాలి.

బాత్‌రూమ్‍లో మంచాలు పెట్టడం మరి డ్రా యింగ్ రూమ్‌లో బాత్‌టబ్ పెట్టడం వంటి మూర్ఖపు పనులు చెయ్యం

కదా! ప్రతి ఒక్క వస్తు వుకీ ఒక నిర్ది ష్టమై న స్థా నం వున్నట్లే .. కోపం, భయం, చిరాకు, నవ్వు, ఆనందం .. వంటి

ప్రతి ఒక్క లక్షణానికీ కూడా ఒకానొక నిర్ది ష్టమై న స్థా నం తప్పకవుంటుంది.

నిరంతర ధ్యానసాధన వల్ల మన అంతరంగం మనకు తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు

తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు అవగాహనకు వస్తూ ంటాయి. జీవితంలో ఏది ఎక్కడ

ఎలా ఉండాలో అక్కడ అలా సవ్యమై న రీతిలో వుంటూ .. ప్రతి ఒక్క క్షణంలోని ఆనందాన్ని మనకు

అనుభవంలోకి తెస్తా యి. ధ్యానం చెయ్యకపోతే ఈ లక్షణాలన్నీ ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదో అలా

అపసవ్యంగా వుంటూ జీవితాన్ని అమిత గందరగోళంలో పడవేస్తూ ంటాయి.

ప్రశ్న : “బుద్ధత్వం అంటే ఏమిటి ?”

పత్రీ జీ : మనకు ప్రయోజనం లేని పనులు చేయకపోవడమే బుద్ధత్వం. అలాగే అవతలివారికి ప్రయోజనం లేని

పనులను కూడ చేయకపోవడమే బుద్ధత్వం. మన జీవితావసరాలతో పాటు .. ఇతరుల అవసరాలను కూడా

గుర్తి ంచి చూడగలగటమే .. బుద్ధత్వం. బుద్ధి తో కూడి మట్లా డుతూ .. అన్నింటిలోనూ మితంగా వుండటమే
బుద్ధత్వం. తిండి, నిద్ర, చదువు, సంపాదన, సేవ .. ఇలా అన్ని రకాల జీవన వ్యాపారాల్లో కూడా

మధ్యేమార్గా న్ని అవలంబించడమే .. బుద్ధత్వం.

అందుకే ఏ పని అయినా టెన్షన్ లేకుండా చెయ్యాలంటే .. ప్రొ ద్దు న్నే లేవగానే ధ్యానం చెయ్యాలి. లేకపోతే

అర్జు నుడిలాగా .. టెన్షన్ ఎక్కువై .. ” అసలు సమస్య నుంచే పలాయనం చిత్తగించాలి ” అనిపిస్తు ంది.

ప్రశ్న : “ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ హాయిగా వుండే పిల్లలకు ధ్యానం అవసరమా ?”

పత్రీ జీ : ఆటలు ఇంకా బాగా ఆడటానికీ, పాటలు ఇంకా బాగా పాడటానికీ .. మరి ఇంకా హాయిగా ఆనందంగా

ఉండటానికీ .. ధ్యానం తప్పనిసరిగా అవసరం.

ప్రశ్న : “మతబేధం అన్నది ఎందుకు వస్తో ంది ?”

పత్రీ జీ : ఆత్మజ్ఞా నంలోపంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో మతబేధం అన్నది వస్తో ంది. మనం ఒకానొక

జన్మలో ‘ క్రి స్టి యన్ ‘ గా, మరొక జన్మలో ‘ మహ్మదీయుడి ‘ గా .. ఇలా అనేకానేక జన్మల్లో అనేకానేక రీతులలో

పుడుతూంటాం. కానీ పుట్టి న తరువాత ఆ ఆత్మ సత్యాన్ని మర్చిపోయి .. ” నేను కేవలం మహ్మదీయుడిని “,

నేను కేవలం క్రి స్టి యన్ని “, లేదా ” నేను కేవలం హిందువుని ” అన్న అజ్ఞా నంలో పడి మనం మన

జన్మపరంపరను మరిచిపోతూ మతబేధాల్లో ఇరుక్కుంటూ ఉంటాం. జన్మ పరంపరపట్ల మరి కర్మ సిద్ధా ంతం

పట్ల ఎరుకతో ఉండాలంటే .. తప్పనిసరిగా ధ్యానం చెయ్యాల్సిందే.

ప్రశ్న : “ఆత్మజ్ఞా నాన్ని బోధించాల్సిన గురువులూ, స్వామీజీలు ‘కాళ్ళు పట్టు కుంటే పది వేలు, ఇంటిని

పావనం చేస్తే ఇరవై వేలు’ అంటూ భక్తు లను దోచుకుంటున్నారు ?! దీనికి తరుణోపాయం లేదా ?

పత్రీ జీ : వాళ్ళు అలా రేట్లు పెట్టడంలో తప్పు లేదు కానీ .. మీరు అక్కడికి పోవడంలోనే తప్పువుంది. వాళ్ళు

మిమ్మల్ని దోచుకోవడం లేదు .. మీరే దోచుకోబడుతున్నారు. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది

ఏమిటంటే .. వాళ్ళను తిట్టడం మాని, మీ అజ్ఞా నానికి మిమ్మల్ని మీరే తిట్టు కుని తక్షణం ధ్యానాన్ని

ఆశ్ర యించడం మంచిది. ధ్యానంలో మీ స్వీయఆత్మ మిమ్మల్నెప్పుడూ దోచుకోదు .. పై గా ఇంతవరకూ

జన్మజన్మల అజ్ఞా నంతో మీరు కోల్పోయిన సంపదలన్నింటినీ తిరిగి మీరు పొందేట్లు గా చేస్తు ంది.
ప్రశ్న : “ధ్యానం చేయడానికి ప్రశాంత వాతావరణం కావాలి అంటారు కదా ! మరి అలాంటి ప్రశాంత

వాతావరణం లేనప్పుడు ధ్యానం ఎలా చెయ్యాలి ?”

పత్రీ జీ : “ధ్యానం చెయ్యడానికి ప్రశాంత వాతావరణం కావాలి” అన్నది సరియై నదే. మీరు క్రొ త్తగా స్కూటర్

నడపడం నేర్చుకోవాలంటే రద్దీ గా ఉన్న రోడ్లమీద ప్రయత్నిస్తా రా ? లేక జన సమ్మర్దం లేని మై దానంలోకి వెళ్ళి

నేర్చుకుంటారా ? అలాగే ఇంట్లో అందరూ నిద్రపోయాక మీరు లేచికూర్చుని ధ్యానం చెయ్యండి. అలాంటి

ప్రశాంతమై న వాతావరణంలో ధ్యానం చక్కగా కుదురుతుంది.

ప్రశ్న : “అనేకానేక మంది గురువులు అనేకానేక రకాలై న బోధనలు చేస్తో న్న ప్రస్తు త తరుణంలో సరియై న

గురువును ఎలా ఎంచుకోగలం ?”

పత్రీ జీ : రాశిలోంచి ఏదో ఒకటి ఎంచుకునే లాటరీ విధానం కాదు ” గురువుని ఎంపిక చేసుకోవడం ” అంటే !

అలా చేసే ఓటి కుండలో నీళ్ళు నింపుతూన్నట్లే .

శాస్త్రీయపద్ధతిలోనే ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్తూ ండాలి. సహనంతో మౌనంగా మీ ధ్యానసాధన మీరు

చేసుకుంటూ వెళ్తూ ంటే .. మీ చై తన్యస్థా యికి తగిన గురువును మీరు ఎప్పటికై నా కలుసుకోగలుగుతారు.

ప్రశ్న: “గురూజీ! నేనొక సమస్యలో చిక్కుకున్నాను .. దాంతో నాకు జీవితమంతా సమస్యల వలయంలా

కనబ డుతోంది. ఇందులోంచి బయటపడటానికి ఒక గురువుగా నాకు మీ సహాయం కావాలి. నన్నేం

చేయమంటారు?“

పత్రీ జీ : ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం తప్పక వుంటుంది. మరి పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే మన

అంతరంగంలోనే వుంటుంది. బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు. బయటివాళ్ళెవ్వరూ అసలు మన

సమస్యను పరిష్కరించజాలరు.

మనకు ఎదురై న ప్రతి ఒక్క సమస్య కూడా మనలోంచి ఒక ప్రశ్నను ఉదయింపజేస్తు ంది. మరి ఆ ప్రశ్నే ..

మనకు సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికిపెడుతుంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడల్లా

మన మనస్సుల్లో ంచి ఎన్నెన్నో ప్రశ్నలు కూడా ఉద్భవిస్తూ వుంటాయి. వాటన్నింటికీ మన అంతరంగంలోంచి

ఎప్పుడై తె సరియై న సమాధానాలు లభిస్తా యో .. ఇక అప్పుడు మనం మానసికకల్లో లం నుంఛి బయటపడి ..

ఆ సమస్య యొక్క పరిష్కారం వై పుగా మన భౌతికపరమై న చర్యలు మొదలుపెడుతాం. ఎప్పుడై తే ఇలా


మనం భౌతికపరమై న చర్యలను సమర్థవంతంగా చేపడతామో అప్పుడు ఆ సమస్యకు సంపూర్ణమై న మరి

అద్భుతమై న పరిష్కారం తప్పక లభ్యమవుతుంది.

చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాలూ, మరి పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద పరిష్కారాలూ

అవసరమవుతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధై ర్యం అవసరం లెకపొయినా పెద్ద పెద్ద

సమస్యలను మాత్రం తగిన ధై ర్యస్థై ర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు

మామూలు భౌతికపరమై న చర్యలు చాలు కానీ .. పెద్దసమస్యల పరిష్కారానికి మాత్రం ” అత్మశక్తి ” చాలా,

చాలా అవసరం. ఇలాంటి సమయంలో .. ఒకవేళ మీకంటే ఎక్కువ ఆత్మశక్తి ని కలిగివున్న సరియై న గురువు

మీకు దొరికితే మాత్రం .. పెద్ద సమస్యలకే కాకుండా అతిచిన్న సమస్యల పరిష్కారానికి కూడా వారి నుంచి

సహకారాన్ని కోరవచ్చు. అయితే .. ఇక్కడ అసలు ‘సమస్య” ఎమిటంటే .. ‘ఎవ్వరికి సరియై న గురువు

లేకపోవడం”. ఇలాంటి క్లి ష్టపరిస్థి తుల్లో మనం బయట ఎవర్ని పడితే వాళ్ళనే “గురువులు” అని నమ్మకుండా

.. ధ్యానంద్వారా శాస్త్రీయ పద్ధతిలో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ మన “అంతరాత్మ”నే గురువుగా

ఎంచుకుని, ఆ ‘అంతరాత్మ” తోనే అనుసంధానం చెందుతూ .. ఆ “అంతరాత్మ”నుంచే సందేశాలు

అందుకోవాలి. ఒకవేళ అదృష్టం బాగుండి మన అంతరాత్మకు ప్రతిరూపమై న గురువు బాహ్య ప్రపంచంలో

కనుక లబిస్తే .. ఇక మనకు మన అంతరాత్మతో ఎక్కువగా పనిలేదు.

ఇలా లభించిన అసలు గురువు మన అంతరాత్మ యొక్క బాహ్యరూపమే కాబట్టి అలాంటి గురువు

బోధనలను బోధనలను మనకు అర్థం అయినా, కాకపోయినా సరే మారు పలుకకుండా అమలు పరచాల్సిందే

.. ఎందుకంటే గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రబోధాలే కనుక. ఇలాంటి గురువు బోధనలు

మనకు .. మన సత్వర జ్ఞా నోదయానికీ, మన సత్వర సమాధానాలకూ మరి మన సత్వర పరిష్కారాలకూ

ఒకానొక దగ్గరి దారి మాత్రమే.

“ధ్యానం” మనలో వున్న ఆత్మశక్తి ని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్థా న్నీ, మరి బుద్ధి కుశలతతో

సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థి రచిత్తా న్నీ ఇస్తు ంది. తద్వారా మనం అందుబాటులో వున్న

భౌతికపరమై న వనరులతో పాటుగా ఆత్మకు వున్నటువంటి అనంత శక్తు లను కూడా కూడగలుపుకుని ..

సమస్యను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అప్పుడు గెలుపు, ఓటముల సంగతి ప్రక్కకి పెడితే

“అసలు సమస్య్ పట్ల మనం ఏ మేరకు అవగాహన సాధించాం” అన్నదాని మీదే ఫలితం అన్నది ఆధారపడి

వుంటుంది.
ఇక్కడ తెలుసుకోవల్సినదేమిటంటే .. ఏ గురువు కూడా వేరే ఎవరి సమస్యను కూడా తన భుజాన వేసుకోడు.

అయితే ఒక గురువు సమస్యల పట్ల మనకు శాస్త్రీయదృక్పథాన్ని ఏర్పరుస్తా డు; కావలసిన ధై ర్యం

చెబుతాడు; అంతో, ఇంతో శక్తి పాతం కూడా చేయడానికి ఇష్టపడితే ఇష్టపడవచ్చు .. అంతే కానీ సమస్యలు

మాత్రం ఎవరికి వారే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే గురువుకి కూడా తన సమస్యల “యుద్ధా లు”

తనుకుంటాయి. అలాగే మన యుద్ధా లు మనవి. “జీవితం” అంటేనే .. “ఒక యుద్ధరంగం” దానికి ఆది, అంతం

లేవు, అక్కడ ఎవరికి వారు ఒంటరిగా పోరాడాల్సిందే.

ఆత్మజ్ఞా నం లేనివాళ్ళకు జీవితమంటే ఒక దుర్భరమై న .. మరి భీభత్సమై న”యుద్ధం” లా కనిపిస్తు ంది. మరి

అదే జీవితం ఒక ఆత్మజ్ఞా నికి తన ఆత్మోన్నతికై ఆడే ఒక “మహాక్రీ డ” లా అనిపిస్తు ంది. ఎప్పుడై తే మనం

పూర్తి గా ప్రా పంచికంలో పడిపోయి ఆత్మజ్ఞా న లోపంతో కూడి “జీవితం ఒక ఆట మాత్రమే” అన్న సంగతి

మర్చిపోతామో .. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా

భయపడతాయి అదే మనం సరియై న ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞా నప్రకాశకుల్లా మారి సమస్యల

పట్ల చక్కటి అవగాహనతో మెలుగుతే .. ఇక సమస్యలు అన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోతాయి.

జీసస్ “నేను స్వర్గా ధిపతియై న దేవుని కుమారుడను” అంటారు. అంటే “నేను స్వర్గ నియమాలతో

కూడుకుని వున్న ఒకానొక గురువు యొక్క ఒకానొక శిష్యుణ్ణి ” అని తనను తాను చెప్పుకుంటారు.

ఇక్కడ “స్వర్గం” అంటే ఆత్మ యొక్కస్థి తి మరి “గురువు అంటే అలాంటి స్వర్గస్థి తిలో వున్న ఒకానొక

పురుషోత్తముడు “స్వర్గం” అంటే ఒక ప్రదేశం, లేదా స్థలం కాదు. “స్వర్గం అంటే అంతా ఆనందమే. ఎవరై తే

తమ అంతరాత్మకు ప్రతిరూపమై న గురువుతో కలిసి సదా వుంటారో వారు స్వర్గంతో కలిసి వున్నట్లే .. లేకపోతే

వారికి స్వర్గం చేజారినట్లే .

మన అంతరాత్మకు ప్రతిరూపమై న సరియై న గురువు .. స్వర్గకళను చక్కగా ఔపోసన పట్టి న స్వర్గా ధిపతి

కాబట్టి మనందరం కూడా జీసస్ లా .. అంటే స్వర్గా ధిపతి కుమారుల్లా వుందాం. మరి గురువుతో కూడి మన

సమస్యలను మనమే పరిష్కరించుకుందాం.

ప్రశ్న : “‘ధ్యానం’ లో ఏం జరుగుతుంది ?”

పత్రీ జీ : ధ్యానాభ్యాస సాధనలో మన మనస్సులో క్ర మక్ర మంగా శూన్యస్థి తి ఏర్పడినప్పుడు విశ్వం మన వై పుకు

ప్రవహించడం ప్రా రంభం అవుతుంది. మన శ్వాసతో మనం కూడి ఉన్నప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు
ప్రత్యక్షమై తమ శక్తి ని మనకు ధారపోస్తా రు. మనం వాళ్ళను తలచుకోవాలని కానీ, పూజించాలని కానీ వారు

కోరుకోరు కానీ .. ” స్వయంప్రకాశం అయిన మాస్టర్లు గా మనం ఎదగాలి ” అనుకుంటోన్న మనపట్ల వారు

ఎంతై నా ఆనందంతో ఉంటారు. ధ్యానంలో ఏ ఆలోచనలూ లేని పసిబిడ్డలుగా మనం మారినప్పుడు .. తల్లి

తన స్తన్యాన్ని బిడ్డకు అందించినట్లు ఆస్ట్రల్ మాస్టర్లు కూడా తమ శక్తి ని మనకు ధారపోస్తా రు.

ప్రశ్న : “కర్మయోగం గురించిన మీ ఉపన్యాసంలో ‘మన ఆత్మ స్థా యి .. ఉదా :- శై శవాత్మ, బాలాత్మ,

ప్రౌ ఢాత్మ, విముక్తా త్మ మరి పరిపూర్ణ ఆత్మ .. ని బట్టి మనం కర్మచేస్తూ ండాలి ‘ అని విన్నాను. నా ప్రశ్న

ఏమిటంటే ‘ మన ఆత్మస్థా యిని ఎలా తెలుసుకోవాలి ? ‘” అని!

పత్రీ జీ : ధ్యానం చేయడం అంటూ మొదలు పెడితే .. ఎవరి స్థా యిని .. వారే క్ర మక్ర మంగా అర్థం

చేసుకోగలుగుతారు. మీ జీవిత ధ్యేయం ఏమిటో తెలియకపోతే మీరు ఒక బాలాత్మ! ధ్యానానికి ముందు ప్రతి

ఆత్మ కూడా ఒక బాలాత్మ స్థా యిలోనే ఉంటుంది. మీరు ఏ స్థా యిలో ఉన్నా సరే .. ముందు ” ధ్యానం ”

అన్నది మొదలు పెట్టండి. వివరాల జోలికి వెళ్ళవద్దు . నెమ్మది నెమ్మదిగా మీరు ఏ స్థా యిలో ఉన్నారో మీకు

మీరే తెలుసుకుంటారు. మరి మెల్లి మెల్లి గా ఒక దాని సహాయంతో ఇంకొకటి .. ఇలా అన్ని స్థా యిలను కూడా

దాటుతారు.

ప్రశ్న : ” ‘ పిరమిడ్స్ ‘ , ‘ క్రి ష్టల్స్ ‘ , ‘ క్రా ప్ సర్కిల్స్ ‘ .. వీటి మీద ఆధారపడడం అనేది ఒక మాస్టర్‌కు

ఎంతవరకు అవసరం ? “

పత్రీ జీ : ఒక మాస్టర్‌కు దేని సహాయం కూడా అవసరం లేదు ! ఒక అంధునికీ, ఒక బాలునికీ, ఒక వృద్ధు నికీ,

ఒక రోగికీ మాత్రం రోడ్డు దాటడానికి ఇంకొకరి సహాయం తప్పనిసరిగా అవసరం. మనం ఆనందంగా, ఆరోగ్యంగా

ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండానే రోడ్డు దాటగలం.

ప్రా రంభదశలో వున్నవాళ్ళకుగానీ, ఏవై నా తీవ్రమై న సమస్యలు వున్న మాస్టర్లకుగానీ మీరు

ఉదహరించినవన్నీ కొంతవరకు తప్పకుండా సహాయం చేస్తా యి. అక్కడ .. ఆ సమయంలో .. అవన్నీ

అందుబాటులో ఉన్నప్పటికీ .. అజ్ఞా నంతో గానీ, అహంకారంతో గానీ .. వాటిని ఉపయోగించుకోకపోతే అది

వారి ‘ ఖర్మ ‘! ఎప్పుడు సహాయం తీసుకోవాలో, ఎప్పుడు స్వీయశక్తి ని ఉపయోగించుకోవాలో అన్న

విచక్షణాజ్ఞా నాన్ని ఉపయోగించే వాడే మాస్టర్.


ఎవరై న రోడ్డు దాటడానికి సహాయం చేస్తే సహాయం తీసుకుని కృతజ్ఞతలు తెలిపినట్లే .. పిరమిడ్ శక్తి ,

సామూహిక ధ్యానశక్తి , పౌర్ణమి ధ్యానశక్తి , ప్రకృతిశక్తి , క్రి స్టల్‌శక్తి .. ఇలా ఏది అందుబాటులో ఉంటే దాని సహాయం

తీసుకుంటూ ఆయావాటిపట్ల మనం ఎంతై నా కృతజ్ఞతతో ఉండాలి. మీరు ఒక ‘ ధ్యాని ‘ అయినా

కాకపోయినా .. ఒక ‘ మాస్టర్ ‘ అయినా కాకపోయినా సహాయపడే విషయాలు అందరికీ విధిగా

సహాయపడుతూనే వుంటాయి !

ప్రశ్న : “‘అహం ‘ అంటే ఏమిటి ? దానిని ఏ విధంగా గుర్తి స్తా ము ?”

పత్రీ జీ : మనం అందరం తెలుసుకోవలసిన ఒకానొక పరమసత్యం ఏమిటంటే .. ఈ లోకంలో ‘అజ్ఞా నం ‘ అన్నది

వుంది కానీ “అహంకారం” అన్నది లేనేలేదు ; లోపల, అంతరంగంలో, అందరూ స్వచ్ఛత మరి అమాయకత

కలబోసిన వారే. అయితే సంఘప్రభావం వల్ల మాత్రమే వారు సమాజంలో అహంకారులుగా నటిస్తూ ంటారు.

మన పిరమిడ్ సిద్ధా ంతాల్లో “అహంకారాన్ని కోల్పోవడం” అనే మాటను మనం ఎప్పుడూ వాడం !

కళ్ళుమూసుకుని శ్వాసను గమనిస్తూ అంతర్ముఖులమై .. మనం ఏదై నా, మనం ఎలా వున్నా .. జీవితం

మనకు నేర్పే అనుభవాలను ఎరుకతో గ్రహిస్తూ వుంటే అదే పరమభాగ్యం !

ప్రశ్న : “నా గత జీవితంలోని బాధలను మరచిపోవడం ఎలా ?”

పత్రీ జీ : సరిక్రొ త్త స్నేహితులను చేసుకోవచ్చు గదా ?!

ప్రశ్న : “ఆత్మమూలం, ఆత్మగమ్యం .. ఒక్కటే అయితే దానికి అనేక జన్మలు, అనేక శరీరాలు ఎందుకు ?”

పత్రీ జీ : ప్రతిఒక్క జన్మ కూడా ఆత్మకు లెక్కలేనన్ని అనుభవాలను అందిస్తు ంది. అది మంచిదై నా, చెడ్డదై నా

.. ఆ అనుభవం ఆత్మను సుసంపన్నం చేస్తు ంది. చివరికి, జన్మజన్మల అనుభవసారంతో పండిపోయిన ఒకానొక

ఆత్మ .. స్థి తప్రజ్ఞత్వస్థి తిలో ఉంటూ .. నిర్వాణ స్థి తిలోని పూర్ణత్వాన్ని పొందుతుంది. అందుకే ఆత్మ అనేకానేక

భౌతిక వ్యవస్థలతో, అనేకానేక భౌతిక శరీరాలను ధరిస్తూ వుంటుంది. కాబట్టి ఆత్మయొక్క గమ్యం గరిష్ట

స్థా యిలో అనుభవాలే ! మరి ఆత్మయొక్క మూలం అనుభవశూన్యత్వమే ! ఒకానొక ఆత్మ .. ఆత్మగా తన

ఆత్మ జీవితాన్ని ప్రా రంభించినప్పుడు అది నిజంగా ఏమీ తెలియని ఒక విధమై న అమాయక, స్వచ్ఛ స్థి తి !
ప్రశ్న : “ఒక్కోసారి నేను, నాకు ఇవ్వవలసినంత ప్రా ధాన్యతను ఇతరులు నాకు ఇవ్వలేదని గింజుకుంటాను.

అది నాకు బాధ కలిగిస్తు ంది. కోపం తెప్పిస్తు ంది. అక్కడ బాధ కలిగేది నాకు కాదని ఆత్మస్థి తిలో నేను అర్థం

చేసుకోగలను .. అయినా అది ఇంకా నన్ను బాధిస్తూ నే ఉంది. నేను ఈ అహాన్ని దాటి నాలో శాంతినీ,

సమత్వాన్నీ పొంది క్షమా, కరుణా గుణాలను వ్యక్తీ కరించగలిగే మార్గం ఏదై నా వుందా ? అది ఋషులకు

మాత్రమే సాధ్యపడే విషయమా ?”

పత్రీ జీ : దయచేసి పనికిరాని మాటలను పూర్తి గా తగ్గి ంచేసుకుని మరి ఎక్కువగా ధ్యానం చేయడం అలవాటు

చేసుకోండి.

ప్రశ్న : “‘జ్ఞా నం’ అంటే ఏమిటి ?”

పత్రీ జీ : ‘ధ్యానం’ ద్వారా ముప్పై శాతం ప్రత్యక్ష జ్ఞా నాన్ని మనం పొందుతాం. ‘ స్వాధ్యాయం ‘ ద్వారా ముప్పై

అయిదు శాతం పరోక్ష జ్ఞా నాన్నీ .. ‘ సజ్జన సాంగత్యం ‘ ద్వారా మరో ముప్పై అయిదు శాతం పరోక్ష జ్ఞా నాన్నీ

మనం పొందుతాం.

ఈ ప్రత్యక్షజ్ఞా నం మరి పరోక్షజ్ఞా నం అంతా వెరసి మనకు ముక్తి ని ఇస్తు ంది.

“జ్ఞా నాన్ ముక్తి ః” కదా !

ప్రశ్న : ” ‘జీవిత పరమార్థం’ అంటే ఏమిటి? “

పత్రీ జీ : ప్రశాంతంగా .. తేలికగా .. హాయిగా అత్యంత ఉత్సాహంతో .. అపారమై న కరుణార్ధ్ర హృదయంతో ..

పరిపక్వత పొందిన జ్ఞా నంతో .. సంపూర్ణమై న ఎరుకతో జీవించడమే జీవితపరమార్థం. దీనిని సమర్థవంతంగా

సాధించాలంటే ..

 సాధ్యమై నంత ఎక్కువ మౌనంగా వుండటం

 వీలై నంత హాయిగా ఉండడానికి ప్రయత్నించటం

 జీవితోత్సాహాన్ని నిలిపివుంచే మన అంతరంగంలోని ‘స్వ-ఇచ్ఛ’లను తెలుసుకుని, వాటిని

నెరవేర్చుకోవడానికి స్వయంగా జాగ్రత్త వహించటం

 ఏ సమయంలోనై నా, ఏ విషయంలోనై నా అందరి పట్లా కరుణాతప్త హృదయంతో స్పందంచటానికి

సిద్ధంగా వుండటం
 మనకు బాహ్యంలోనూ, అంతరంలోనూ జరుగుతూన్న అన్ని విషయాల పట్ల సాధ్యమై నంత

ఎక్కువగా ఎరుకతో వుండటం

 మన లోపల, బయట నిరంతరంగా కొనసాగుతూన్న వై చిత్య్రాలన్నిటికీ సంబంధించిన జ్ఞా నాన్ని

సాధ్యమై నంత ఎక్కువగా పొందటానికి ప్రయత్నించటం.”

ప్రశ్న : ” ‘బంధరాహిత్యం’ అంటే ఏమిటి ? “

పత్రీ జీ : “మన అవసరం, మనకు ప్రయోజకత్వం లేవని స్పష్టంగా అర్థమై న తర్వాత, అది ఎంత ప్రా ముఖ్యత

కలిగిన ప్రదేశమై నా, సందర్భమై నా సరే మనకు మనంగా అక్కడి నుంచి వై దొలగటమే బంధరాహిత్యాన్ని

పొందటం అంటే”.

ప్రశ్న : ” సరికాని ఆలోచనా విధానాలను పూర్తి గా తొలగించుకోవటం ఎలా? “

పత్రీ జీ: ” ‘సరికాని ఆలోచనా విధానం’ అనడానికి బదులుగా ‘నిష్ప్రయోజనమై న ఆలోచనా విధానం’ అనటం

ఇంకా సత్యానికి దగ్గరగా వుంటుంది. ఎందుకంటే అసలు ‘తప్పు’ ‘ఒప్పు’ అనేవి లేనే లేవు. ప్రతీదీ కూడా ..

అయితే ఎక్కువ ప్రయోజనకరంగానూ లేదా ఇంకా కొన్ని తక్కువ ప్రయోజనకరంగానూ వున్నాయి అంతే.

“పదే పదే అప్రమేయంగా చేసే పనిని ‘అలవాటు’ అని అంటాం. ఆలోచనలకు సంబంధించిన అలాంటి

అలవాట్లే మన ప్రత్యేకమై న ‘మానసిక ప్రణాళికలు’గా మన మనో మండలంలో రూపుదాల్చుతాయి. అవే

కాలక్ర మంలో నెమ్మదిగా ఈ స్థూ లప్రపంచంలో ఆయా ఆలోచనా విధానాలకు అనుబంధిత వాస్తవాలుగా మన

అనుభవంలోకి వస్తా యి. మనం చేసే ప్రతి ఆలోచన, ఒకానొక ప్రక్రి యకు ప్రా థమిక స్వరూపమే. అందువల్ల

అలాంటి ఆలోచనలు పునారావృతమై నప్పుడు అవి ‘ఒక నిర్ది ష్టమై న మానసిక ప్రణాళిక’గా పరిణితి

చెందుతాయి. అలాంటి మన మానసిక ప్రణాళికలు, ప్రకృతి నియమాలకు అనుగుణంగా స్పందిస్తే , సహజంగానే

అలాంటి ప్రణాళికలు మనకెంతో ప్రయోజనకరంగా వుంటాయి. అలాకాకుండా మన ఆలోచనా విధానాలు

ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ధ్వనిస్తూ వుంటే అవి మనకు ఎలాంటి ప్రయోజనన్నీ చేకూర్చలేవు. అయితే

అటువంటి వ్యతిరేక మనోభావాల నుంచి మనం సంపూర్ణంగా విముక్తి చెందటానికి .. నిరంతర ధ్యానం మరి

సానుకూల ఆలోచనాధోరణి ఇతోధికంగా సహాయం చేస్తా యి. ఈ రెండింటితో కూడుకున్న ‘సాధన’ మొదట్లో

అంత తేలికగా అనిపించకపోవచ్చు. ఆ మాటకు వస్తే మనకు క్రొ త్తదై నప్పుడు అది ఏదై నా కొంత కష్టంగానే
అనిపిస్తు ంది. అయితే ఒక్కసారి ‘సరియై న సాధన’ను మొదలు పెట్టటం అంటూ జరిగితే .. నిష్ప్రయోజనమై న

ఆలోచనా ధోరణులన్నీ ఉత్కృష్ట ప్రయోజనం కల ఆలోచనా విధానాలతో క్ర మంగా తుడిచివేయబడతాయి.

‘ధ్యానం’ మరి ‘సానుకూల ఆలోచనాధోరణి’ల సహాయంతో.. నిదానంగా అయినా ఖచ్చితంగా ఒకానొక

సుస్థి రమై న పారవశ్య మానసిక స్థి తి మనకు అందటం తథ్యం.”

ప్రశ్న : ” మన ‘ఎరుక’ ను ఏ విధంగా పెంపొందించుకోవాలి? “

పత్రీ జీ: “మన ‘ఎరుక’ అంటే ‘ఏ విషయాన్నైనా అన్ని కోణాల్లో సంపూర్ణ చై తన్యంతో తెలసుకోవటం’ గా

నిర్వచించవచ్చు. ‘ఎరుక’ కు పర్యాయపదంగా ‘చై తన్యం’ ను చెప్పవచ్చు. ‘ఎరుకతో వుండటం’, ‘పూర్తి

చై తన్యంతో వ్యవహరించటం’ .. ఈ రెండూ కూడా ఒకే భావాన్ని స్ఫురింపజేస్తా యి.

“‘ఎరుక’ లేదా ‘చై తన్యమే’ మన స్వస్వరూపం. మనమే అది. ‘తత్వం అసి శ్వేతకేతు’. ‘తత్’ అంటే ‘అది’,

‘త్వం’ అంటే ‘నీవు’, ‘అసి’ అంటే ‘అయివున్నావు’ అని అర్థం. అంటే నువ్వు కేవలం ఈ స్థూ లశరీరానివి

కాదు, నువ్వు కేవలం ఈ ఎముకల గూడువో లేక ఇంద్రి యాల సముదాయమో కాదు సుమా. మనం సాక్షా త్తూ

‘చై తన్య స్వరూపులం’ .. అదే ‘సత్యం’ ఆ ‘సత్యం’ లో స్థి తం కావడమే ‘ఎరుక’.

“అందువల్ల .. ఆ ‘ఆత్మ చై తన్యాన్ని’ పెంపొందించుకోవాలి. ఆ అంతరంగిక చై తన్యంతో ఎక్కువసేపు ..

సాధ్యమై నంత ఎక్కువసేపు ఉండాటానికి ప్రయత్నించాలి. మనం మన స్థూ లకాయంతో సమయాన్ని ఎంత

ఎక్కువగా గడిపితే, అంత ఎక్కువగా ఎముకలూ, మాంసమూ, ఇంకా ఇంద్రి యాలూ .. ఇవే వృద్ధి

చెందుతాయి. అలా కాకుండా మనం మన ‘స్వస్వరూపం’ తో ‘చై తన్యం’ తో ఎంత ఎక్కువ సమయం

గడిపితే , అంత ఎక్కువగా మన ‘ఎరుక’ పెంపొందుతుంది. మనం ఎంత ఎక్కువగా మన ‘ఆత్మ చై తన్యం’

తో గడిపితే అంత ఎక్కువగా .. మనం మన చై తన్యానికి వున్న మహాద్భుతమై న సామర్థ్యాన్ని, దాని

అనంతత్వాన్నీ, ఇంకా ఆ ఎరుక మనకు అందిస్తు న్న ‘ఉత్సవ హేల’ నూ తెలుసుకోగలుగుతాం”.

ప్రశ్న : ” మన వ్యక్తి గత అవసరాలూ, మన వ్యక్తి గత బాధ్యతలూ మధ్య గల భేదం ఏమిటి? “

పత్రీ జీ: ” మనిషి అనేవాడు రెండు ‘నేను’ ల కలయిక. మొదటిది ‘వ్యక్తి గితమై న నేను’ ; రెండవది ‘అందరిలోని

నేను’, ప్రతి వ్యక్తీ ఈ రెండు ‘నేను’ లను సదా పరీక్షి ంచుకోవాలి.


“ప్రతి ఒక్కరూ తమ తమ ‘వ్యక్తి గత నేను’ ను పరిరక్షి ంచుకోవడంలో స్వార్థపూరితంగానే వ్యవహరించాలి.

చిన్ని చిన్ని కోరికలు, అరుదై న సుఖాలు .. మన ‘వ్యక్తి గతమై న నేను’ ఆనందంగా జీవించి ఉండటానికి చాలా

అవసరం. అయితే ఇలాంటివన్నీ తేలికగా ప్రా ప్తి ంచవు కాబట్టి ఇలాంటి వ్యక్తి గత అవసరాలు పొందటానికి

తప్పనిసరిగా మన శక్తి మేరకు తీవ్రంగా కృషిచేసి తీరాలి.

దాంతో పాటుగా మన తోటివారికి కుడా మనం చిన్ని చిన్ని సహాయాలను చేయాలి. దాని ద్వారా మనం మన

వ్యక్తి గత ఇచ్ఛలను నెరవేర్చుకోవటంలో వారి సహకారాన్ని కుడా పొందగలుగుతాం. ఈ మొత్తం

వ్యవహారమంతా మన ‘వ్యక్తి గత బాధ్యతల’ కోవలోకే వస్తు ంది.

ఇలాంటి చిన్న చిన్న బాధ్యతలతో పాటుగా, పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మనందరికీ వున్నాయి. మొత్తం

మానవాళికి, మనదై న ప్రత్యేకతను సూచించే విధంగా ఏదై నా ఇవ్వగలగడం ఈ కోవలోకే వస్తు ంది. ఇలాంటి

ఉన్నతమై న బాధ్యతను నిర్వహించటానికి, ప్రతి ఒక్కరూ .. ఏదై నా కళలో కానీ, ఆటలో కానీ, ఒకానొక

విజ్ఞా నశాస్త్ర విభాగంలో కానీ విశేషమై న పరిజ్ఞా నాన్ని పెంపొందించుకుని ఆయా అంశాల సహాయంతో వారిని

ఆనందింపజేస్తూ .. వారిని సేవించగలగాలి

ప్రశ్న : ” నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం భూమి మీద ప్రస్తు తం ఏ స్థి తిలో వుంది? “

పత్రీ జీ : ” నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం … ప్రా పంచిక భావజాలం యొక్క రూపురేఖలను అనూహ్యంగా

మార్చివేసింది. వారసత్వంగా అందించిన రకరకాల భయాలన్నీ, ఈ విప్లవం ధాటికి ఆవిరై , నింగికెగసి

కనుమరుగయ్యాయి.

వేలాదిగా ఆధ్యాత్మిక యోగుల నిస్వార్థ భరితమై న కార్యక్ర మాలు, భూమండల వ్యాప్తంగా విస్తృతంగా

నిర్వహించబడటం వలన, భూలోకానికి వున్న బాధాతప్తభరితమై న ఋణాలు చాలావరకు ఈ సరికే

తీర్చబడ్డా యి. మహోన్నతమై న యోగీశ్వరుల సంకల్ప ఫలితం వల్ల మనమంతా ఎన్నాళ్ళుగానో

ఆశిస్తు న్న ‘దివ్యజ్ఞా నోదయం’ త్వరలోనే ఈ భూమి మీద సాక్షా త్కరింపబడి ఒకానొక చారిత్రా త్మకమై న

మార్పు సంభవించబోతోంది.”

ప్రశ్న: “లంఖణం పరమౌషధం” అంటారు..”


పత్రీ జీ: ‘లంఖణం ’ అంటే నిరాహారంగా ఉండడం ..లంఖణాలు మూడు రకాలు:
1. “శారీరక లంఖణం ” 2. ” వాచిక లంఖణం ” 3.” మానసిక లంఖణం “.
శారీరక లంఖణం కన్నా ‘ వాచిక లంఖణం ’ శక్తి వంతమై ంది మరి ఆరోగ్యదాయకమై ంది ; దీనికన్నా

శక్తి వంతమై ంది మరి విశేష ఆరోగ్యదాయకమై ంది ‘ మానసిక ’ ‘ లంఖణం ’ .. అథవా ‘ ధ్యానం ’. కాబట్టి

లంఖణాన్ని కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ‘ మౌనం ’ ద్వారా మాటలనూ .. ‘

ధ్యానం ’ ద్వారా మనస్సునూ .. శూన్యపరచుకోవడం అభ్యాసం చేస్తూ వుండాలి.

ప్రశ్న: ” తప్పులను ఎలా సరిదిద్దు కోవాలి? “


పత్రీ జీ: ప్రగతిపథగాములు అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరి తప్పులు చేస్తూ నే వుంటారు. అయితే అవి ”
నడక నేర్చుకునే క్ర మం ” లో దొర్లే చిన్ని చిన్ని తప్పటడుగులు మాత్రమే ! వాటి నుంచి పాఠాలు
నేర్చుకుంటూ .. మళ్ళీ మళ్ళీ వెంటనే క్రొ త్త క్రొ త్త సృజనాత్మకమై న కార్యక్ర మాల్లో మునిగిపోతూండాలి. ” నేను
పాపిని .. నేను పాపిని ” అని పదే పదే అనుకుంటూ ఆత్మన్యూన్యతకు గురికావడం కానీ .. ” నువ్వు పాపివి ..
నువ్వు పాపివి ” అంటూ ఇతరులను నిందించడం కానీ ససేమిరా చేయరాదు. అందరి దగ్గర నుంచి కూడా
పాఠాలు సదా నేర్చుకుంటూ ఉండడమే బుద్ధి మంతుల లక్షణం !

ప్రశ్న: “మా తల్లి గారు ఇటీవలే చనిపోయారు; అందుకు నాకు చాలా బాధగా వుంది .. “
పత్రీ జీ: ‘చనిపోవడం’ అన్నది కొంపలు అంటుకునే వ్యవహారం ఎంతమాత్రం కాదు ! అది ‘ఒక కొంప’ నుంచి
‘మరొక కొంప’ కు ..‘ఒక స్థా నం’ నుంచి ‘మరొక స్థా నం’ కు .. ‘ ఒక దేశం ’ నుంచి ‘మరొక దేశాని’ కి మారే
సర్వసాధారణమై న కార్యక్ర మం !

అందరూ ఎందుకు చనిపోతున్నారో మీ తల్లి గారు కూడా అందుకే చనిపోయారు ; కాబట్టి ఇప్పుడు మీరు వారు

చనిపోయినందుకు బాధపడకుండా .. అసలు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారో .. మరి మీ తల్లి గారిలాగే

అందరూ చనిపొయీ ఏ ఏ లోకాలకూ వెళ్ళి మళ్ళీ మళ్ళీ వస్తు న్నారో .. ఆ ప్రదేసాల గురించి, మరి ఆ యా

లోకాల గురించి కూలంకషంగా విచారించండి ; మరి మరణానంతర జీవితం గురించి అధ్యయనం చేయడం

వెంటనే ప్రా రంభించండి !

ప్రశ్న: ” ‘తడిసి మోపెడు’ అని తరచూ వింటూంటాం .. “

పత్రీ జీ: ‘గుప్పెడు’ – ‘మోపుడు’ అన్నవి తెలుగుభాషలో వున్న రెండు పదాలు. ఏదై నా సరే తడవకపోతే

చేతిలో పట్టు కోగలిగినట్లు ‘గుప్పుడే’ ఉండి తడిసినప్పుడు మాత్రం తలపై మోయలేనంత బరువెక్కి

‘మోపుడు’ అవుతాయి.
పుట్టు కతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడూ గుప్పుడే వుంటాయి ! అయితే జీవనగమనంలో మనమే

వాటిని తడుపుకుని అంటే అజ్ఞా నంతో పెంచుకుని ‘ మోపుడు ’ చేసుకుని బెంబేలెత్తి పోతూంటాం.

ధ్యానం అనునిత్యం చేసుకుంటూ .. మరి శారీరక బాధలను కాస్త ఓర్చుకుంటూ ఓపిక పడితే గుప్పెడు రోగాలు

.. కష్టా లు .. సునాయసంగా సమిసిపోతాయి ! అలాకాకుండా .. “ఆ డాక్ట ర్ .. ఈ మందు” .. “ఆ దేవుడు .. ఈ

మంత్రగాడు” అంటూ అసహనంతో పరుగులు పెడితే అవి తడిపి మోపుడు అవుతాయి.

ధ్యానులు, ఆత్మజ్ఞా నులు అయిన వారు “కాసిని -గుప్పెడు” కష్టా లను ఓర్పుతో తేలిగ్గా అధిగమిస్తూ సదా

ఆనందంగా జీవించగలుగుతారు. మయసభలో ద్రౌ పది నవ్వుతో భంగపాటు చెందిన దుర్యోధనుడు ఆ

విషయాన్ని అక్కడితో వదిలివేయకుండా పదే పదే ఆలోచిస్తూ .. “నాకు ఇంత అవమానమా?” .. “నేను

ఇంత లోకువా?” అని ఆ విషయాన్ని తడుపుకుని తడుపుకుని మోపెడంత చేసుకుని .. మహాభారత

మహాయుద్ధా న్ని సృష్టి ంచి .. అందరి వినాశనానికి కారణభూతుడయ్యాడు !

ప్రశ్న: ” ‘ధ్యానసాధనలో ఉండే ప్రతిబంధకాలు ఏవేవి? “


పత్రీ జీ: ధ్యానసాధనలో ఉండే ప్రా థమిక ప్రతిబంధకాలు: 1. సోమరితనం.. 2. భయం.. 3.అహం
“సోమరితనం”: పీకలదాకా తిని, త్రా గి పడుకోవడం .. టీవీలో వచ్చే కార్యక్ర మాలను కళ్ళప్పగించేసి చూస్తూ ..
ఏ కాస్త తీరిక దొరికినా పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమై న కాలక్షే పపు చెత్తకబుర్లు మాట్లా డుతూ
కాలాన్ని హరించివేయడం.

“భయం” : ఎంత రోతవై నా పాత విషయాలను గట్టి గా పట్టు కుని ప్రా కులాడుతూ .. క్రొ త్త విషయాలను

వినడానికి కూడా భయపడడం: విన్నా ఆ క్రొ త్త విషయాలను పరిశోధించడానికి వెనుకాడడం.

“అహం”: ‘దేవుడు’ .. ‘బుద్ధి ’ .. ‘ఆత్మ’ అన్న విషయాల గురించి అక్షరంముక్క తెలియకపోయినా అన్నీ

తెలిసినట్లు మాట్లా డడం .. తెలుసుకోవాల్సిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం.

ఈ మూడు మౌలిక ప్రతిబంధకాలు ధ్యానసాధన విషయంలోనే కాదు .. ఇంకా ఏ విషయంలోనై నా సమానంగా

వర్తి స్తా యి.

ప్రశ్న: “చాలామంది జీవితాన్ని ఒక అందమై న ప్రవాహంలా ఈదలేక పోతున్నారు ఎందుచేతనో .. “


పత్రీ జీ: మీ దృష్టి కోణం తప్పు! ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలను హాయిగా ఆనందంగా ఈదలాడుతూనే
ఉన్నారు. “వారు సరిగ్గా లేరేమో” అని మీరనుకుంటున్న సందర్భాలు వారికి సరిగ్గా నే ఉన్నాయి! అందుకే ఆ
యా సందర్భాలను వారు ఎరుకతోనో .. మరి కాస్త ఎరుక లేకుండానో .. అయినా “చక్కగా
ఆస్వాదించుకుంటూ” అందుకు తగిన అనుభవజ్ఞా న పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు!
ప్రశ్న: “ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మస్థా యులకు తగ్గట్లు గా జీవిస్తూ సహజంగానే
అనుభవ జ్ఞా న పాఠాలను నేర్చుకుంటూ ఉంటే .. ఇక మనం వారికి ఇంకా ధ్యానబోధ చెయ్యాల్సిన అవసరం
ఏమిటి?”
పత్రీ జీ: “ధ్యాన బోధ/ధ్యాన ప్రచారం” అన్నది వాళ్ళతో పాటు మనకు కూడా అనుభవజ్ఞా న పాఠాలను
నేర్చుకునే విధానాన్ని త్వరితగతం చేస్తు ంది. “ధ్యాన బోధ” .. “ధ్యాన ప్రచారం” ల వలన మన స్వీయ
వ్యక్తి త్వం మరింత పటిష్టమవుతుంది.

ప్రశ్న: ” మానవులలో వివిధ శక్తి స్థా యిలు ఎలా ఉంటాయి?


పత్రీ జీ :భౌతిక శరీరానికి సంబంధించి తామసిక శక్తి ; మనోమయ శరీరానికి సంబంధించి రాజసిక శక్తి ;
బుద్ధి మయ శరీరానికి సంబంధించి సాత్విక శక్తి ; ఆత్మమయ శరీరానికి సంబంధించి నిర్గు ణ శక్తి .
వివిధ శక్తి స్థా యిలను అనుసరించి తామసిక శక్తి స్థా యిలో ఉన్నవాళ్ళు ఒకానొక వ్యక్తి యొక్క కంటికి కనిపించే
ఘనరూపంలో ఉన్న శరీరాన్నే చూడగలుగుతారు. వారు తమ కంటితో చూసిన దానినే నమ్ముతారు.
రాజసిక శక్తి స్థా యిలో ఉన్నవాళ్ళు ఆ వ్యక్తి యొక్క ద్రవస్థి తిలో ఉన్న మనస్సును చూడగలిగితే .. సాత్విక శక్తి
స్థా యిలో ఉన్నవాళ్ళు అదే వ్యక్తి యొక్క మంచిని చూడగలుగుతారు.
ఇక చిట్టచివరి నిర్గు ణస్థా యిలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఈథర్ స్థా యిలో ఉన్న ఆత్మ శక్తి ని
చూడగలుగుతారు.
తామసిక శక్తి స్థా యిలో ఉన్నవాళ్ళు కేవలం తమ కంటితో చూసిన దానినే అర్థరహితంగా నమ్ముతూ ..
పరిమిత శక్తి క్షే త్రంలో పనిచేస్తూ ఉంటే .. సాత్విక శక్తి స్థా యిలో ఉన్న వాళ్ళు కంటికి కనిపించిన దానిని అర్థం
చేసుకుని అర్థసహితంగా పనిచేస్తూ ఉంటారు.
ఇక నిర్గు ణ స్థా యిలో ఉన్న వాళ్ళు .. వీటన్నింటికీ అతీతంగా అత్యంత శక్తి వంతమై న ఆత్మశక్తి తో పనిచేస్తూ
తమ జన్మలను ధన్యం చేసుకుంటూ ఉంటారు.

ప్రశ్న: ” ‘సై న్స్’ అన్నది హేతుబద్ధమై న అంశాల మీద ఆధారపడి ఉండగా .. కేవలం నమ్మకాలపై ఆధారపడి
ఉన్న ఆధ్యాత్మికతను ‘సై న్స్’ అని ఎలా అనగలం?”
పత్రీ జీ: “సై న్స్” అన్నది ప్రయోగం, పరిశోధన మరి అనుభవ జ్ఞా నాలపై ఆధారపడి పనిచేస్తు ంది.
అలాగే “ధ్యానం” మరి “ఆధ్యాత్మికత” అన్నవి కూడా ప్రయోగాలూ, పరిశోధనలూ మరి అనుభవ జ్ఞా నాలపై
ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. అందుకే భగవద్గీ తలో ప్రతి ఒక్క అధ్యాయాన్నీ శ్రీ కృష్ణ పరమాత్ముల వారు”
బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రః” అని నిర్థా రించారు.
“అందుకే కేవలం మూఢ నమ్మకాలు మరి ఆచారాల వ్యవస్థపై ఆధారపడి పనిచేసేది ఎన్నటికీ ఆధ్యాత్మికత
కానేరదు” అని తెలుసుకోవడం బుద్ధి మంతుల లక్షణం!
ప్రశ్న: “అశ్ర మాలు అన్నవి నిజంగా ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడతాయా?!”
పత్రీ జీ: “ఆశ్ర మాలు అన్నవి భవిష్యత్తు కు మార్గనిర్దే శకాలు!! భవిష్యత్తు లో సమస్త భూగ్రహం అంతా కూడా
ఒకే “ఒక్క ఆశ్ర మం” లా రూపుదిద్దు కోనుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తి గత కుటుంబ జీవనం నుంచి “వసుధై క
కుటుంబ జీవనం” లోకి ప్రవేశిస్తూ .. దివ్యజ్ఞా న ప్రకాశాన్ని పొందనున్నారు.

ప్రశ్న: “ఒక్కోసారి ధ్యానం చేసిన తరువాత చాలా నీరసంగా మరి సత్తు వ లేనట్లు గా అనిపిస్తో ంది ..
ఎందుచేత?!”
పత్రీ జీ: మీరు గత అనేకానేక జన్మలుగా చేస్తూ వచ్చిన హింసాత్మక కర్మలకు సంబంధించిన కర్మ ఫలితాలన్నీ
కూడా సూక్ష్మలోకాలలో నమోదు కాబడి ఉంటాయి. తెలిసో తెలియకో అవన్నీ మరి అనుభవించి తీరాల్సిందే
కదా! అయితే .. ధ్యానం అన్నది కర్మల యొక్క తీక్షణతను ఒకింత తగ్గి ంచి .. వాటిని హాయిగా అనుభవించే
విధంగా మనల్ని మలుస్తు ంది.
“ఏది జరిగినా అది మన ఆత్మ అభ్యున్నతికే” అని అవగాహన చేసుకుని ధ్యానసాధనను మరింతగా
పెంచుకుంటూ పోవాలి!

ప్రశ్న: “ఆధ్యాత్మిక మార్గంలో ‘గురువు’ అంత అవసరమా?!”


పత్రీ జీ: “గురువు” అన్న అంశం ఎక్కడా ముఖ్యం కాదు. అయితే సమకాలీన దృక్పథాలను కలిగి వున్న
భావజాల సంపన్నులంతా ఒకరినొకరు వెతుక్కుంటూ వెళ్ళి ఒకానొక “బృందగాన సమూహం” లా మారడం
ఏ రంగంలో అయినా సహజమే. ఒకే జాతి పక్షు లన్నీ ఒకే గూటికి చేరుకుంటాయి కదా!

ప్రశ్న: “నేను గత రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తు న్నాను. నాకు ఇప్పటి వరకు మూడు సార్లు గర్భస్రా వం
జరిగింది. ప్రతిసారి గర్భస్రా వం జరగడానికి రెండురోజుల ముందు నా కడుపులో బిడ్డ నాకు దూరం కావడం నేను
చూసుకుంటున్నాను. కారణం తెలుసుకోవడానికి ఒకసారి ధ్యానంలో కూర్చోగా .. ఒకానొక జన్మలో నేను
గర్భవతిని హింసిస్తూ న్నట్లు మరి బాధిస్తూ న్నట్లు చూసుకున్నాను.
వెంటనే ఆ ఆత్మకు ధ్యానంలోనే క్షమాపణ చెప్పుకున్నాను. గతజన్మకు సంబంధించిన నా ఈ అజ్ఞా నపు
చర్యకు నేను ఇంకా ఎలాంటి ప్రా యశ్చిత్తం చేసుకోవాలి?!”
పత్రీ జీ: కర్మసిద్ధా ంతం అమలుపరచడంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు. కర్మఫలితాలను ప్రతి ఒక్కరూ
అనుభవించి తీరవలసిందే!
మీరు మరిన్ని మంచి పనులు చేయండి; ధ్యానం మరి ధ్యానప్రచారం మరింత మరింతగా చేస్తూ మీ
పాపకర్మను పుణ్యకర్మలతో బ్యాలెన్స్ చేసుకోండి!!
ప్రశ్న: “పిరమిడ్ శక్తి కి ఆధ్యాత్మికతతో ఏమిటి సబంధం?!”
పత్రీ జీ : సాధారణంగా నిర్ది ష్టమై న సమాన కొలతలతో కూడిన ఏ క్షే త్రమితీయ నిర్మాణం అయినా .. అసమాన
కొలతలతో నిర్మింపబడిన మామూలు నిర్మాణాలకంటే ఎక్కువ శక్తి క్షే త్రా లను కలిగి ఉంటాయి. “‘పిరమిడ్స్’
ఈ భూమి మీద ఉన్న అన్ని నిర్మాణాల కంటే కూడా అత్యంత నై పుణ్యంతో కూడిన సమాన కొలతలతో
నిర్మించబడిన శక్తి క్షే త్రా లు” అని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.
ఆ శక్తి క్షే త్రంలో కూర్చుని ధ్యానం చేసినవారికి అనేకానేక అతీంద్రి య మరి సూక్ష్మలోక అనుభవాలు సులభంగా
కలగడం వల్ల “‘పిరమిడ్’ అన్నది ఆధ్యాత్మిక ప్రయోగాలకు అనువై న స్థలం” అని ధ్యానయోగులు
తెలియుజేస్తు న్నారు.
ఇటీవల కాలంలో పిరమిడ్ శక్తి తో కూడిన వాణిజ్య ఉత్పత్తు లు మార్కెట్‌లోకి వస్తు న్నాయి. పిరమిడ్ శక్తి పై
విశేషప్రయోగాలు చేస్తో న్న PSSM, ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరి ఆధ్యాత్మిక ఉన్నతికి పిరమిడ్
నిర్మాణాలను ఇతోధికంగా ప్రో త్సహిస్తో ంది.

ప్రశ్న: “గత 8 నెలలుగా ప్రతిరోజూ రాత్రి ఆఫీసు నుంచి రాగనే నేను కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను.
గతంలో ఉన్న మాంసాహారం తినడం, మద్యం సేవించడం, సిగరెట్లు త్రా గడం మరి అతిగా సినిమాలు చూడడం
వంటి దురలవాట్ల నుంచి నేను క్ర మంగా బయటపడ్డా ను. “ఇలా చక్కటి సంస్కారాన్ని నాకు అందించిన మీరు
మళ్ళీ నేను ఆ చెడు అలవాట్లకు బానిసను కాకుండా ఏవై నా సూచనలు ఇవ్వండి..”
పత్రీ జీ: మీరు శాకాహారిగా మారినందుకు అభినందనలు! ప్రతిరోజు క్ర మం తప్పకుండా ధ్యానం చేస్తూ .. PSSM
ప్రచురిస్తో న్న నవీన ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞా న గ్రంథాలను చదువుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్!!

ప్రశ్న: “‘పనియే ప్రా ర్థన’ అన్న సామాజిక సంస్కృతిలోనే జన్మంతా గడిచిపోతూంటే .. ఇక నన్ను నేను
తెలుసుకోగలిగే ధ్యానసాధనకూ మరి నన్ను నేను ఉద్ధరించుకునే ఆధ్యాత్మిక అభివృద్ధి కీ ఇంకా టై మ్ ఎక్కడ
ఉంటుంది?”
పత్రీ జీ: ఈ జన్మ కాకపోతే .. మళ్ళీ ఇంకో జన్మ! ఇంకో భౌతికశరీరం.. ఇంకో ప్రా పంచిక జీవితం! అప్పుడు అసలు
ఈ మాత్రం వెసులుబాటు కూడా ఉంటుందో లోదో?! ధ్యానం చేసి ఎవరి ఆత్మ స్వరూపాన్ని వారు
గుర్తి ంచుకునేంతవరకూ ఈ పరంపర అలా సాగిపోతూనే ఉంటుంది వృధాగా! కనుక “ధ్యానమే అన్నింటి కంటే
పెద్ద పని” మరి “ఆ పనే అన్నింటి కంటే గొప్ప ప్రా ర్థన” అని తెలుసుకోండి!

ప్రశ్న: “మాంసాహారం తింటే బలం వస్తు ందని సై న్స్ చెబుతోంది కదా ..”
పత్రీ జీ: మాంసాహార సేవనం వల్ల కలిగే అనర్థా ల గురించి కూడా సై న్స్ విశేషంగా వివరిస్తో ంది! అంతర్జా లంలో
అనేకానేక వెబ్‌సై ట్‌లు ఈ విషయాన్ని అత్యంత శాస్త్రీయంగా తెలియజేస్తు న్నాయి.
“ఏది చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని విధిగా అనుభవించాల్సి వస్తు ంది” అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలియజేస్తో ంది
కనుక కాస్త మీ బద్ధకాన్నీ మరి మీ మూర్ఖత్వాన్నీ వదిలించుకుని సత్యం ఏదో తెలుసుకోండి!
ప్రశ్న : “పిరమిడ్ మాస్టర్ల విశేష కృషి వల్ల 2012 కల్లా ధ్యానజగత్ పూర్తి అయ్యింది అని PSSM ప్రకటించింది.
ఇక పిరమిడ్ మాస్టర్ల పరిస్థి తి?”
పత్రీ జీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ మేటి ఆధ్యాత్మికవేత్తలుగా
గుర్తి ంచబడుతున్నారు!

ప్రశ్న: “‘ అహం’ అంటే ‘నేను’ .. ‘నాది’ .. ‘అంతా నాదే’ అనుకోవడమేనా?”


పత్రీ జీ: నిజానికి “అహం” అన్నది అసలు లేనే లేదు! ఉన్నదంతా అజ్ఞా నమే! అమాయకత్వం మరి స్వచ్ఛత
అన్న మన జన్మ సహజ లక్షా ణాలు .. అజ్ఞా నం మరి మూర్ఖత్వాలతో కప్పివేయబడడంతో సమాజం దృష్టి లో
మనం అహంకారులుగా మభ్యపెట్టబడుతున్నాం.
అలా కాకుండా ధ్యానం ద్వారా మనం సకల అజ్ఞా నాల నుంచీ మరి మూర్ఖత్వాల నుంచీ విముక్తి చెందినప్పుడు
అహంకారం అన్న అపవాదులోంచి బయటపడి సత్యజ్ఞా నప్రకాశులుగా వెలుగుతాం.

ప్రశ్న : “కర్మ పరంపరను అనుసరించి మనం అంతా కూడ శై శవాత్మలుగా, బాలాత్మలుగా, ప్రౌ ఢాత్మలుగా,
విముక్తా త్మలుగా మరి పరిపూర్ణా త్మలుగా జన్మలు తీసుకుంటూ ఉంటాం అని కర్మ సిద్ధా తం తెలియజేస్తో ంది,
అయితే ‘మనం ప్రస్తు త జన్మలో ఏ రకంగా ఉన్నాం’ అన్నది మనకు ఎలా తెలుస్తు ంది?”
పత్రీ జీ: ధ్యానం చెయ్యకముందు .. అసలు తమను తాము ఆత్మస్వరూపాలుగా గుర్తి ంచుకోక ముందు
అందరూ శై శవాత్మలే! ధ్యానం చెయ్యడం మొదలుపెట్టా క అన్నీ వరుసక్ర మంలో అర్థం అవుతూనే ఉంటాయి.

ప్రశ్న: ” దివ్యజ్ఞా నప్రకాశం అంటే ‘నేను’ అన్నదంతా భగవంతుడిలో కలిసిపోవడమేనా?”


పత్రీ జీ: “నేను” అనే ఒకానొక నీటి చుక్కతాను సముద్రంలో ఒక భాగమని తెలుసుకుని .. సర్వసమర్పణ
భావంతో వెళ్ళి సముద్రంలో కలిసిపోయి తన అస్తి త్వాన్ని కోల్పోవడమే దివ్యజ్ఞా న ప్రకాశం” అని వేదాంత
శాస్త్రాలు బోధిస్తు న్నాయి. ఆ చిలుక పలుకులనే వల్లె వేస్తూ పండితులంతా ప్రజలను తరతరాలుగా
అజ్ఞా నాందకారంలోకి నెట్టే స్తు న్నారు. నిజానికి “దివ్యజ్ఞా నప్రకాశం” అంటే .. అంత వరకూ “నేను ఒక పరిమిత
దేహాన్ని .. నేను వేరు .. భగవంతుడు వేరు” అని అజ్ఞా నపు బ్రతుకు బ్రతుకుతూన్న ఒకానొక శై శవాత్మ,
అజ్ఞా నాత్మ .. ధ్యానం చేసి “నేను అపరిమితమై న శక్తి యుక్తు లను కలిగి ఉన్న ఒకానొక అనంతమై న ఆత్మ
స్వరూపాన్ని .. నేనే ఆ భగవంతుడిని” అని గుర్తి ంచుకుని ఇక ఆ విధంగా మసలుకుంటూ ఈ సృష్టి లో తన
ప్రత్యేక అస్తి త్వాన్ని నిలుపుకోవడమే!

ప్రశ్న: “ధ్యానం రోజువారీ జీవిత సమస్యలను కూడా పరిష్కరిస్తు ందా?..”


పత్రీ జీ: నిరంతర ధ్యాన సాధన మన యొక్క శక్తి లబ్ధతను పెంచి .. తడవ తడవకూ మనల్ని మరింత గొప్ప
శక్తి శకలాలుగా పరిమారుస్తు ంది. దాంతో మనం శారీరకంగా, మానసింగా మరి ఆత్మపరంగా కూడా మరింత
మరింత దృఢంగా మారి అంతవరకూ “అమ్మో” అని బెంబేలుపడి పోయిన జీవిత సమస్యలను కూడా
సునాయాసంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని పొందుతాం.
“విషయం చెయ్యిదాటి పోతోంది” అని అందరూ భయపడే సందర్భాలలో కూడా మనం ప్రశాంత చిత్తంతో
ఉంటూ నిబ్బరంగా పనులు చక్కబెట్టు కుంటాం. సమస్యనూ మరి ఆ సమస్యకు కారణం అయిన వారినీ
కూలంకషంగా అవగాహన చేసుకుని తెలివిమంతుల్లా సమస్యనుంచి బయటపడతాం.
అన్నింటినీ మించి స్థి ర చిత్తంతో సమస్య మూలాలను శోధించి అత్యంత శాస్త్రీయంగా సమస్యను శాశ్వతంగా
పరిష్కరించుకుంటాం.
బుద్ధి పూర్వకమై న కరుణా హృదయంతో సహా అనుభూతిని చెందుతూ సృష్టి లోని ఇతర జీవుల పట్ల
మహత్తరమై న సామరస్య భావనతో వెలుగుతూ ఉంటాం.

ప్రశ్న: “ఎవరి వయస్సు ఎంతో .. అంతసేపు ప్రతి రోజూ ధ్యానం చెయ్యాలి అన్నారు. నా వయస్సు 40
సంవత్సరాలు. నేను ప్రతిరోజూ 40 నిమిషాలు ధ్యానం చేస్తు న్నాను కానీ నా మనస్సును మాత్రం నిలకడగా
ఉంచుకోలేక పోతున్నాను. ధ్యానం చేసినంతసేపూ ఆలోచనలు వస్తూ .. పోతూనే ఉన్నాయి. చూసేవాళ్ళకు
నేను ధ్యానం చేస్తు న్నట్లు బయటికి కనిపించినా .. లోలోపల నేను చేసేది ధ్యానం కాదు అని నాకు అనిపిస్తో ంది.
కిం కర్తవ్యం?”
పత్రీ జీ: అభ్యాసం కూసు విద్య కదా .. మీరు మరింతగా ధ్యాన సాధన చెయ్యండి అప్పో దీపో భవ అని మీ
ధ్యానాన్నే మీరు నమ్ముకుంటూ మిమ్మల్ని మీరే ఒక బుద్ధు డిలా మలచుకోండి.
అయితే “ఇది అనేకానేక సంశయాలతో కూడిన కష్టతరమై న మార్గం” అనుకునే కంటే “ఇది శాస్త్రీయ
దృక్పథంతో కూడిన సత్య మార్గం” అని భావించుకుంటే .. మీరు సులభంగా మీ లక్ష్యాన్ని
చేరుకోగలుగుతారు! ఎంపిక మీదే!

ప్రశ్న: “గత మూడు సంవత్సరాల నుంచి నేను శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ శుద్ధ శాకాహారిగా
జీవిస్తు న్నాను. అయితే నాకంటే కూడా ఆర్థి కంగా మంచి స్థి తిలో ఆనందంగా ఉన్నమాంసాహారులయిన నా
బంధుమిత్రు లు ధ్యానం గురించి వారికి చెప్పినప్పుడు నన్ను గేలిచేసి అవమానిస్తు న్నారు. నాకు చాలా
బాధగా ఉంది ..”
పత్రీ జీ: ఎవరయినా మనల్ని గేలి చేసినప్పుడు బాధపడడం సహజమే కాని .. “బేలతనం” అన్నది
బుద్ధత్వపు లక్షణం ఎన్నటికీ కాజాలదు! బుద్ధు డు అన్నవాడు మానావమానాలను రెండింటినీ ఉపేక్షి స్తూ తన
లక్ష్యం మీదే గురి ఉంచి క్షణక్షణం ముందుకు సాగుతూ ఉంటాడు!
ప్రశ్న: “విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించీ మరి సూక్ష్మశరీరానికి సంబంధించీ మేడమ్ బ్లవాట్‌స్కీ,
డోలోరిస్ కెన్నాన్, పరమహంస యోగానంద వంటి తత్త్వవేత్తలు కొన్ని సిద్ధా ంతాలను మనకు అందించారు!
అవన్నీ నిజమే అంటారా లేక చిత్త భ్రమలు కావచ్చా ..”
పత్రీ జీ: ముందు మీరు చక్కగా ధ్యానం చేసి మీ మనస్సును ఆవరించి ఉన్న అజ్ఞా నాన్నీ మరి మూర్ఖత్వాన్నీ
వదలించుకోండి. మెల్లమెల్లగా అవి మీకే తేటతెల్లం అవుతాయి.

ప్రశ్న: “గత మూడు సంవత్సరాలుగా నేను ధ్యానం చేసినప్పుడల్లా అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా నా
ముందు నేను వుండి నన్ను నేను చూసుకుంటున్నాను. సూక్ష్మశరీరం అంటే అదేనా?”
పత్రీ జీ: అవును! సూక్ష్మశరీరాది విశిష్ట విషయాలను గురించి థియోసోఫికల్ సొసై టీ వారు విస్తా రంగా
తెలియజేశారు. వారి వెబ్‌సై ట్‌ని గానీ లేక చెన్నై అడయార్‌లో ఉన్న వారి ముఖ్యకార్యాలయాన్ని గానీ
సంప్రదించండి.

ప్రశ్న: “మెహర్ బాబా గారి ‘గాడ్ స్పీక్స్’ అనే గ్రంథంలో ‘భగవంతుడు అయిదుగురు సద్గు రువులతో కలిసి
ఈ భూమి మీద అవతరించి ఉన్న భగవంతుడు ఎవరు? ఆ అయిదుగురు సద్గు రువులు ఎవరు?”
పత్రీ జీ: ఏదై నా ఒక గ్రంథాన్ని చదివినప్పుడు అందులో మన ఆత్మను బలోపేతం చేసే స్పష్టమై న
సమాచారాన్ని మాత్రమే గ్రహించి సంశయాత్మకమై న విషయాలను తాత్కాలికంగా ఉపేక్షి ంచాలి. ఒకే గ్రంథాన్ని
పట్టు కుని వ్రే లాడకుండా అనేకానేక New Age మాస్టర్స్ అందించిన రకరకాల గ్రంథాలను కూడా అధ్యయనం
చేస్తూ ఉండాలి.

ప్రశ్న: నేను ఆత్మను అని తెలుసుకోవడం ఎలా? ఆత్మసాక్షా త్కారం పొందటం ఎలా? కర్మసిద్ధా ంతాన్ని
అవగతం చేసుకోవడం ఎలా?”
పత్రీ జీ: నేనే ఆత్మను అని తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. ఆత్మసాక్షా త్కారం పొందాలంటే ధ్యానం
చెయ్యాలి. కర్మసిద్ధా ంతాన్ని అవగతం చేసుకుని జీవించాలంటే ధ్యానం చెయ్యాలి.

ప్రశ్న: “ఆత్మ యొక్క మూలం మరి గమ్యం రెండూ ఒక్కటే అయినప్పుడు అది మళ్ళీ మళ్ళీ జన్మలు
తీసుకోవడం ఎందుకు?”
పత్రీ జీ: “మూలం” మరి “గమ్యం” అన్నవి రెండూ కూడా వేరు వేరు అంశాలు! మూల స్థా నంలో ఉన్న ఆత్మకు
అనుభవజ్ఞా నం శూన్యంగా ఉంటుంది! కనుక అది శై శవాత్మ నుంచి మొదలుకుని బాలాత్మ, యవ్వనాత్మ,
ఫ్రౌ ఢాత్మ, వృద్ధా త్మ మరి పరిపూర్ణ ఆత్మల స్థా యిలలో ఈ భూమి మీద రకరకాల స్థా యిల జన్మలు
తీసుకుంటూ రకరకాల పాఠాల ద్వారా విస్తా రంగా అనుభవ జ్ఞా నాన్ని పొందుతూ ఉంటుంది. తనను తాను
పరిపుష్టం చేసుకుంటూ మానవమానాలనూ, సుఖదుఃఖాదులనూ సమానంగా తీసుకోగలిగిన స్థి తప్రజ్ఞత్వంలో
“ఒకానొక నిర్గు ణ ఆత్మ”గా విలసిల్లడమే ప్రతి ఆత్మ చేరుకోవలసిన ప్రధాన గమ్యం!
ప్రశ్న: “సత్యం తెలుసుకుని కూడా సత్య పూర్వకంగా ఎందుకు జీవించలేకపోతున్నాం?”
పత్రీ జీ: సత్యం పట్ల సంపూర్ణ అవగాహన కలగాలంటే మనం ఎన్నెన్నో మానవ జన్మలు ఎత్తవలసి వుంటుంది.
భగవద్గీ తలో చెప్పినట్లు గా వేలకొద్దీ మనుష్యుల్లో “సత్యాన్ని తెలుసుకోవాలి” అనుకునేవారు కొంత మందే
అయితే .. అందులోనూ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు మరికొంతమందే ! అలా
ప్రయత్నించి సఫలత చెందేవారు .. ఇంకా కొంతమందే !
అంతిమంగా సత్య సాక్షా త్కారాన్ని పొందినవారే సత్యపూర్వకంగా జీవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక
అద్భుత పరిణామ ప్రక్రి య. ఇందులో ఎవ్వరూ “ఎక్కువ” కాదు .. ఎవ్వరూ ” “తక్కువ” కాదు. తక్కువ
జన్మల పరిమిత జ్ఞా నంతో కూడిన “శై శవాత్మ” మొదలుకుని ఎక్కువ జన్మల పరిపూర్ణ జ్ఞా నంతో కూడిన
“వృద్ధా త్మ” వరకు ప్రతి ఒక్కరి స్థి తి కూడా గొప్పదే!
ఈ సత్యాన్ని తెలుసుకుని .. మనం “నిన్నటికంటే ఈ రోజు కొద్ది గానై నా మెరుగ్గా ఉన్నామా, లేదా?” అన్న
అవగాహనతో జీవించడమే .. సత్యపూర్వకమై న జీవన విధివిధానం!

ప్రశ్న: ” ‘భయం’ అన్నది ఎలా పోగొట్టు కోవాలి?”


పత్రీ జీ : ఈ ప్రపంచంలో సగం మందికి “చావు” అంటే భయం .. సగం మందికి “బ్రతుకు” అంటే భయం ! సగం
మందికి “సంసారం” అంటే భయం .. సగం మందికి “సన్యాసం” అంటే భయం. ఇలా “భయం” అన్నది ప్రతి
ఒక్కరికీ వుంటుంది మరి అలాంటి భయాలలోంచే అనేకానేక సందేహాలు పుట్టు కొస్తూ వుంటాయి.
కురుక్షే త్ర సంగ్రా మంలో అర్జు నుడికి యుద్ధం పట్ల కలిగిన భయం వలన అనేకానేక సందేహాలు పుట్టు కొచ్చాయి!
అస్త్రశస్త్రాలను పడవేసి యుద్ధరంగం మధ్యలో కూర్చుని .. ఒక భీరువులా భయాన్ని నటిస్తూ లోకంలో అందరి
తరపున వకాల్తా పుచ్చుకుని మరీ శ్రీ కృష్ణు డిని అనేకానేక సందేహాలు అడిగి ఈ లోకానికి “భగవద్గీ త”
అందించబడడానికి ఏకై క కారకుడయ్యాడు.
ఇలా ఒక్కోసారి సుజ్ఞా నులకు కలిగే భయం వల్ల లోకానికి ఉపకారం కూడా జరుగుతూ వుంటుంది. కనుక
భయాన్ని తలచుకుని ఊరికే భయపడుతూ కూర్చోకుండా .. భయరహితులై న వారితో కలిసి తిరుగుతూ
ఉండండి. మీకు మేలు జరుగుతుంది.

ప్రశ్న: “మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? !”


పత్రీ జీ : ఎవ్వరూ .. ఎవ్వరినీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు! అసలు అలా “ఒకరు ఇంకొకరిని అర్థం
చేసుకోవడానికి ప్రయత్నించడం” అన్నది పరమ మూర్ఖపు చర్య!
“ఒకరు ఇంకొకరిని ఎన్నటికీ అర్థం చేసుకోజాలరు” అన్న సత్యం తెలుసుకున్న ఒకానొక ఆత్మజ్ఞా ని ..
ఇతరులను అర్థం చేసుకుంటూ తన సమయాన్ని వృధా చేసుకోవడానికి అవస్థలు పడదు. స్వీయ అంతరంగ
పరిశీలన ద్వారా తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఆత్మవత్ జీవనం గడపడానికి సదా
ప్రయత్నిస్తూ ంటాడు.
ప్రశ్న: “జంతువులను చంపితే వాటికి దుఃఖం కలుగుతుందా?”
పత్రీ జీ: జంతువులకు కలగదు !! వాటిని చంపి తిన్నవారికి అపారమై న దుఃఖం కలుగుతుంది. జంతువులకు
శరీరంతో పాటు సామూహిక ఆత్మ చై తన్యమే వుంటుంది! వాటికి ‘మనస్సు’ అనేది వుండదు కనుక
చంపబడుతూ ఉన్నప్పుడు .. ‘బాధ’ మాత్రం వుంటుంది !
మనిషికి మాత్రం శరీరానికీ, ఆత్మకూ మధ్య అనేకానేక కర్మలతో కూడిన ‘మనస్సు’ వుంటుంది. కనుక
జంతువులను చంపిన కర్మతో కూడిన “దుఃఖం” అతనికి తప్పకుండా వుంటుంది.
అందుకే “మానవ జీవితంలో దుఃఖం ఉండకూడదు” అంటే మూగజీవులను చంపడం మానెయ్యాలి!

ప్రశ్న: “చర్య (action) కు ప్రతిచర్య (reaction) ఉండవచ్చా?” 


పత్రీ జీ: “చర్య – ప్రతిచర్య” .. “action-reaction” అన్నవి రెండూ కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో
అత్యంత సహజంగా వుంటాయి.
అయితే ఉప్పు, కారం తినే సంసారేశ్వరులలో చర్యలకు బదులుగా “సర్వసాధారణ ప్రతిచర్యలు” ఉంటే ..
ప్రా ణశక్తి తో వరిపుష్టం అయిన యోగీశ్వరులలో చర్యలకు బదులుగా “సృజనాత్మక ప్రతిచర్యలు” ఉంటాయి.
కాబట్టి సంసారంలో ఉంటూనే ధ్యానయోగీశ్వరులులా బ్రతికితే మన జీవితం కూడా సృజనాత్మక
ప్రతిచర్యలతో విశేషంగా నిండిపోయి వుంటుంది.

ప్రశ్న: “పిరమిడ్ మాస్టర్లను మీరు ఎంతో గౌరవంగా చూస్తా రు. వాళ్ళంతా చాలా పర్‌ఫెక్ట ్‌గా మీకు కనిపిస్తా రు !
అది ఎలా సాధ్యం ? !”
పత్రీ జీ: నేను ఎలా ఉంటానో .. నాతో పాటు వున్న నా ఎదుటి వారు కూడా నాకు అలాగే కనిపిస్తా రు! నన్ను
నేను ఎలా గౌరవించుకుంటానో నాతో వున్న ఎదుటి వారిని కూడా నేను అలాగే గౌరవిస్తా ను!

ప్రశ్న: ” ‘అవధులు లేని ప్రే మ’ గురించి వివరించండి !”


పత్రీ జీ: ఈ ప్రపంచంలో లేనివి రెండే రెండు :
ఒకటి: “ప్రే మ” .. రెండు: “చావు” .. ఉండవలసినది ఒక్కటే .. అదే “మై త్రీ తత్వం”!
“బృహదారణ్యకోపనిషత్తు ” లో యాజ్ఞ్యవల్కుడు తన భార్య అయిన మై త్రే యితో “ఈ ప్రపంచంలో ప్రే మ
అన్నది ఎక్కడా లేదు. ఒకానొక మగవాడు కూడా ఒకానొక స్త్రీని తన కోసమే పెళ్ళి చేసుకుంటాడు; మరి ఆ
ఇద్దరూ కలిసి తమ కోసమే ఒకానొక బిడ్డకు జన్మను ఇస్తా రు.
“ఇదంతా కూడా మై త్రీ తత్వంతో కూడుకుని ఉంటే .. ఎక్కడా ఒకరిపై ఒకరికి పెత్తనాలు ఉండవు. ఒకరితో
ఒకరు హాయిగా జీవిస్తూ ఒకరి నుంచి ఒకరు సదా నేర్చుకోవడమే వుంటుంది!” అని చెబుతాడు.
ప్రశ్న: ” ‘అజ్ఞా నం’ మరి సుజ్ఞా నం’ ల మధ్య బేధం ఎలా తెలుసుకోవటం?”
పత్రీ జీ: ఒకానొక వస్తు వును గురించిన యధార్థం మనకు తెలిసి ఉండడం “సుజ్ఞా నం”! ఆ వస్తు వును గురించిన
యధార్థం మనకు తెలియకపోవడం “అజ్ఞా నం”.
సుజ్ఞా నం వల్ల మనకు దుఃఖం నుంచి విముక్తి లభిస్తే .. అజ్ఞా నం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. అందుకే
“లేనిది కోరరాదు .. ఉన్నది కాదనరాదు
వస్తూ ంటే వస్తు ందని సంబరపడరాదు
పోతూంటే పోతుందని బాధపడరాదు” 
… అన్నారు శ్రీ సదానందయోగి గారు.
వారు చెప్పినట్లు గానే నేను జీవితం యొక్క యథార్థా న్ని తెలుసుకుని సుజ్ఞా నపూర్వకమై న అవగాహనతో
జీవిస్తూ హాయిగా ఉన్నాను.

ప్రశ్న: “ద్వేషాన్ని ఎలా పోగొట్టు కోవాలి?”


పత్రీ జీ: ఈ ప్రపంచంలో రకరకాల సంఘాలు ఉన్నాయి. పేకాట ఆడాలంటే “పేకాట సంఘం” లో చేరాలి;
త్రా గుబోతు కావాలంటే “త్రా గుబోతుల సంఘం” లో చేరాలి! ధ్యానం నేర్చుకోవాలంటే “ద్యానుల సంఘం” లో
చేరాలి! ఒక బుద్ధు డిలా కావాలంటే “బుద్ధు ళ్ళ సంఘం” లో చేరాలి! అలాగే ద్వేషరహితులుగా కావాలంటే
“ద్వేష రహితుల సంఘం” లో చేరాలి!
కనుక ద్వేషరహితులుగా ఉన్నవారి సంఘంలో చేరి వారితో కలిసి తిరుగుతూ ఉంటే లోపల ఉన్న
ద్వేషభావాలన్నీ క్ర మక్ర మంగా అత్యంత సహజంగానే పోతాయి!

ప్రశ్న: “నిజమై న స్వేచ్ఛ ఎలా ఉండాలి?”


పత్రీ జీ: పరీక్ష హలులో కూర్చుని పరీక్ష వ్రా స్తు న్న ఒకానొక విద్యార్థి .. “నాకు స్వేచ్ఛ కావాలి” అనుకుని పరీక్ష
మధ్యలో నుంచి లేచి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ ‘స్వేచ్ఛ’ అతని అభివృద్ధి కి ప్రతిబంధకం
అవుతుంది.
సంవత్సరం పాటు కష్టపడి చదివి .. ఆ కాస్త పరీక్ష వ్రా సి అందులో ఉత్తీ ర్ణు డయితే అది అతడికే లాభం!
ఇంతలోనే “నాకు స్వేచ్ఛ లేదు” అని ఆక్రో శిస్తే అతడికి సంవత్సరం శ్ర మ, డబ్బు అంతా వృధా అయిపోతుంది.
అలాగే మనం కూడా అనెకానేక నక్షత్రలోకాలలో కొన్ని యుగాలు గడిపి ఎంతో సమాచారాన్ని సేకరించుకుని
దానిని అనుభవ జ్ఞా నంలా మలచుకోవడానికి ఈ “భూమి” అనే “పరీక్ష హాలు”లోకి వచ్చాం!
ఇక్కడి రూల్స్ .. రెగ్యులేషన్స్ అన్నీ అక్కడే క్షు ణ్ణంగా తెలుసుకునే వచ్చాం! అయినా “జీవితం” అనే
క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే దానిని పూర్తి చేయకుండా “నాకు స్వేఛ్ఛ కావాలి” అంటూ ఆక్రో శించడం మరి
పరీక్ష మధ్యలోంచి లేచి బయటికి రావడం “మూర్ఖత్వం” అనిపించుకుంటుంది.
పరీక్ష హాలు లోనే కూర్చుని ఒక్కొక్క ప్రశ్నకూ తన వద్ద వున్న జ్ఞా నంతో చక్కగా “సమాధానం” వ్రా స్తూ ..
అలా సమాధానం వ్రా స్తూ .. అలా సమాధానం వ్రా స్తూ ఉన్నప్పుడు పొందే స్వేచ్ఛను ఒక్కొక్క కోణంలో
అనుభవిస్తూ ఉండడమే ఉత్తమ విద్యార్థి లక్షణం!

ప్రశ్న: “కర్మలు చేస్తా ం సరే .. కర్మఫలితాలను ఎలా గుర్తి ంచాలి?”


పత్రీ జీ: మనకు మన శరీరం గురించి తెలుసు .. అలాగే మన శరీరాన్ని వెన్నంటి వస్తూ న్న ‘నీడ’ ను గురించి
కూడా తెలుసు. ఒక్కోసారి ‘నీడ’ మన వెనుక వుంటుంది .. ఒక్కోసారి ముందు వుంటుంది .. ఒక్కోసారి
మనకంటే పెద్దగా వుంటుంది .. మరి ఒక్కోసారి అది మనకంటే చాలా చిన్నదిగా అయిపోతుంది.
మన శరీరాన్ని వెన్నంటి వచ్చే ‘నీడ’ లాగే “కర్మ ఫలితాలు” అన్నవి కూడా మనం చేసే రకరకాల కర్మల
రూపంలో ‘నీడ’ లలా వెన్నంటే వుంటాయి. సాధారణంగా మనం మన నీడను పట్టి ంచుకోం .. మనం
పట్టి ంచుకోకపోయినా .. ఎప్పుడు, ఎక్కడ, ఏ మేరకు మనల్ని ప్రభావితం చేయాలో అక్కడ, అప్పుడు ఆ
మేరకు అవి మనల్ని ప్రభావితం కర్మఫలితాలను కూడా ఎంతమాత్రం పట్టి ంచుకునే అవసరం లేదు.
ఇదంతా కూడా “అవగాహన” చేసుకుని ఆత్మ చై తన్యవు ఎరుకతో జ్ఞా నపూర్వకంగా జీవించినప్పుడే కర్మలూ
బాగుంటాయి, పరంపరగా కర్మ ఫలితాలూ బాగుంటాయి ! వెరసి జీవితమంతా ఆనందదాయకంగా
ఉంటుంది!!

ప్రశ్న: “వ్యాధులు ఎలా తగ్గు తాయి??”


పత్రీ జీ: పూర్వజన్మల పాపాలే .. ఈ జన్మలో వ్యాధులు. ధ్యాన – జ్ఞా న సాధనలతో ఆ పాపాలఫలితాలను
పూర్తి గా తుడిచివేయకపోతే వ్యాధుల నుంచి బయటపడడం కల్ల! జీవిత గమనంలో మనం నేర్చుకున్న
అనుభవ జ్ఞా నపాఠాల తాలూకు గాయాలే మనల్ని వ్యాధుల నుంచి సంపూర్ణంగా విముక్తి చెందిస్తా యే కానీ ..
ఏ మందో .. ఏ మాకో కాదు!

ప్రశ్న: “ప్రా ర్థన కంటే ధ్యానం గొప్పదా?” ..


పత్రీ జీ: ఒకానొక జీవిత ప్రయాణంలో “ప్రా ర్థన” అన్నది .. “ఔట్‌పోస్ట్” లాంటిది అయితే .. “ధ్యానం” అన్నది
“హెడ్‌క్వార్టర్స్” లాంటిది. మన ప్రయాణం ఎప్పుడూ ఔట్‌పోస్ట్ దగ్గరే ఆగిపోకూడదు కదా!

ప్రశ్న : ” మాంసాహారం తింటే .. దారుణమై న తిప్పలు తప్పవు అంటున్నారు ! మాంసం తినేవారి ఇంట
పుట్టి న ఒక చిన్న బిడ్డకు .. తల్లి దండ్రు లే దానిని అలవాటు చేసి మరీ పెడతారు. ఆ చిన్న బాబుకు ఇలా శిక్ష
పడడం న్యాయమా?!”
పత్రీ జీ: న్యాయం కాదు! అందుకే ఆ చిన్ని బాబుకు పడాల్సిన శిక్ష కూడా కన్నవారికి బదిలీ అయ్యి .. అది
వారి పాలిట ఇంకా బలమై న పాపకర్మగా రూపుదిద్దు కుంటుంది.
అయితే ఆ చిన్నబాబు పెరిగి పెద్దయ్యాక మాత్రం ‘అది పాపపు కూడు’ అన్న జ్ఞా నాన్ని పొంది కూడా తింటే
అది అతడి స్వంతపాపకర్మగా రూపుదిద్దు కుంటుంది. అందుకే తల్లి ద్దండ్రు లు చిన్నతనం నుంచే పిల్లలకు
ఆత్మజ్ఞా నాన్నీ మరి శాకాహార ప్రా ముఖ్యతను బోధించి .. వారిని పాపకూపంలో పడకుండా కాపాడాలి. అదే
పిల్లల పట్ల వారి మౌలిక బాధ్యత!

ప్రశ్న: ” ‘లాజిక్’ కూ ‘రీజనింగ్’ కూ మధ్య ఉన్న తేడా?”


పత్రీ జీ: “లాజిక్” అన్నది అప్పటి వర్తమాన సంభాషణకు సంబంధించింది.
“వాక్చాత్యురం” మరి “సంభాషణా శక్తి ” ని కలిగిన వారు తమ తమ జిమ్మిక్కులను ఉపయోగించి అక్కడ
ఉన్న పరిస్థి తిని తాత్కాలికంగా తమకు అనుకూలంగా మలచుకోవడమే .. “లాజిక్”.
“శాశ్వతసత్యాన్ని” .. చక్కటి శాస్త్రీయ పరిజ్ఞా నంతో అందరికీ తగినట్లు గా చూపించగలిగే ప్రజ్ఞనే “రీజనింగ్”
అంటాం.

ప్రశ్న: “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసై టీస్ మూవ్‌మెంట్‌లో కొంతకాలం ఉండి .. ఏవో కారణాల వల్ల బయటికి
వెళ్ళిపోయి .. మళ్ళీ ఇదే గూటికి చేరుకునే వారి గురించి?”
పత్రీ జీ: ఇక్కడ ఉన్నంత కాలం పిరమిడ్ సంస్థకు వారు అందించిన ప్రా పంచిక మరి ఆధ్యాత్మిక ఉపకారాలకు
గుర్తి ంపు తప్పక ఉంటుంది.
అయితే .. ‘వాళ్ళు విడిగా ఉంటూ కూడా విశ్వకల్యాణానికి కారకులవుతున్నారు’ అని తెలిసినప్పుడు ఇంకా
ఎక్కువ సంతోషంగా ఉంటుంది!
మళ్ళీ సంస్థలోకి తిరిగి వచ్చాక మాత్రం అంతకు ముందు ఉన్న స్థా నాన్ని తిరిగి పొందడానికి వాళ్ళు మరి వేచి
ఉండాలి. ఎందుకంటే .. అప్పటికే ‘క్యూ’ లో వెనుక ఉన్నవాళ్ళంతా సహజంగానే ముందుకు వచ్చేస్తా రు! ఇది
ప్రకృతి ఏర్పరచిన నియమం!!

ప్రశ్న: ” లోకకల్యాణం గురించి చిత్తశుద్ధి తో కార్యక్ర మాలను చేపడుతూ ఉంటే విశ్వాత్మ మనకు
కుటుంబపరంగా సహాయం చేస్తు ందా?”
పత్రీ జీ: నిస్సందేహంగా చేస్తు ంది ! మనం అంతా కూడా ఆత్మస్వరూపులమే కాబట్టి .. విశ్వకల్యాణం కోసం
మనం మనకు ఇవ్వబడిన పనులను చేపట్టి నప్పుడు .. మూల విరాట్‌స్వరూపమై న మన విశ్వాత్మ మనల్ని
ప్రకృతితో అనుసంధానిస్తు ంది.
మన దేహానికీ, మనస్సుకూ, బుద్ధి కీ మరి ఆత్మకూ ఎనలేని .. అంటే మనకు మనం కూడా చేసుకోలేనంత
మేలు చేస్తూ మనల్ని సదా ఆనందస్వరూపుల్లా స్థి రంగా ఉంచుతుంది.
ప్రశ్న: “కొంతమంది .. గురువులను వారి అభిముఖంగా పొగుడుతూనే .. తెరవెనుక మరోలా మాట్లా డుతూ
ఉంటారు. అలాంటి వారి ‘ద్విపాత్రా భినయనం’ గురువులకు తెలుస్తూ ఉంటుందా?”
పత్రీ జీ: ఖచ్చితంగా తెలుస్తు ంది! ఎదుటివారి హృదయ శుద్ధత, మనోనిర్మలత మరి నిజాయితీ వారి
కదలికలలోనే తెలిసిపోతూ ఉంటుంది; వారి అమాయకత్వానికీ, వెర్రి తనానికీ గురువులు నవ్వుకుంటూ
ఉంటారు!
అయితే ఒకానొక డాక్ట ర్ .. ఒకానొక రోగి యొక్క శరీరంలోని పాడై పోయిన భాగాలను శస్త్రచికిత్స సమయంలో
తీసి బయటపడవేసి రోగిని కాపాడినట్లు .. గురువులు కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ
చూపులతో, మాటలతో లేదా తమ చేష్టలతో వారిలోని అజ్ఞా నాన్ని దూరం చేసి వారిని సరిచేస్తూ ఉంటారు.”

ప్రశ్న: “సార్! మీరు గొప్ప అవతారంగా అందరూ భావిస్తు న్నారు!”


పత్రీ జీ: “అవతారం” అంటే ఒకానొక ఉత్కృష్ఠమై న లక్ష్యాన్ని ఈ భూమిమీద సాక్షా త్కరింపజేయడానికి
పరిపూర్ణంగా దిగి రావడం!
మీ దృష్టి లో నేను ఒక అవతారాన్ని అయితే .. నా దృష్టి లో మీరు అందరూ కూడా మీ మీ స్థా యిలలో
పరిపూర్ణంగా దిగి వచ్చిన అవతారాలే!!

ప్రశ్న: “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసై టీస్ మూవ్‌మెంట్ ఇలా దేశవిదేశాలలో విస్తరిస్తు ందనీ .. ఇంత
పెద్దదవుతుందనీ ప్రా రంభంలో మీరు ఊహించారా?!”
పత్రీ జీ: “ఊహించలేదు” అంటే తప్పవుతుంది ! “ఊహించాను” అంటే కూడా తప్పవుతుంది.
ఎందుకంటే నేను ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాను; మరి వర్తమానంలో ఉన్న పనిని ఆనందంగా
చేస్తూ పోతాను.
కాకపోతే 2000 సంవత్సరం తరువాత “2004 – ధ్యానాంధ్రప్రదేశ్” .. “2008-ధ్యాన భారత్” .. “2012-
ధ్యాన జగత్” .. “2016 -పిరమిడ్ జగత్” మరి “2020-శాకాహార జగత్” పూర్తి చెయ్యాలని ఒక
నియమబద్ధమై న ప్రణాళిక మాత్రం వేసుకున్నాను. దాంతో ఆ యా లక్ష్యాల పట్ల ప్రతి ఒక్కరికీ ఒక “సామూహిక
స్ఫూర్తి ” ఏర్పడి అందరూ విశేష కృషిచేయడం ప్రా రంభం అయ్యింది.
ఈ అద్భుతమంతా ఏ ఒక్కరి కృషియో కాదు. వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ యా సమయాలలో, ఆ
యా సందర్భాలలో, ఆ యా ప్రదేశాలలో, ఆ యా అవసరాలకు తగ్గట్లు స్పందించిన ఒకానొక సరిక్రొ త్త గొప్ప
ఆధ్యాత్మిక విప్లవం!
ప్రశ్న: ” PSSM లోకి వచ్చిన వాళ్ళు వెంటనే క్రి యాశీలక కార్యకర్తలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ంటారు. ఇది
ఎలా సంభవం?!”
పత్రీ జీ: PSSM లోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి రోజే సరియై న ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు.
ఇది ఇంత సరళమనీ .. ఇంతకన్నా ఇంకా ఏమీ చెయ్యలేమనీ కూడా తెలుసుకుంటారు!
తెలుసుకున్న తరువాత .. ఇక పుట్టి బుద్ధె రిగినప్పటి నుంచీ తమను వేధీస్తూ న్న సందేహాలకు సమాధానాలూ
మరి తాము పరిశోధిస్తూ న్న ప్రశ్నలకు అవగాహనలూ ఆ ఒక్కరోజులేనే పొందేస్తా రు. దాంతో వారి ఆనందానికి
అంతే లేకుండా పోతుంది!!
అలా ఆత్మానందంతో చిందులేసే వాళ్ళకు “ధ్యాన ప్రచారం చెయ్యవయ్యా .. ” అని ప్రత్యేకంగా ఎవ్వరూ
చెప్పఖ్ఖరలేదు. ఎవరు చెప్పకపోయినా వాళ్ళు మాత్రం ఆగరు! ఒక్క దగ్గర కూర్చోకుండా వెళ్ళి అందరికీ
ధ్యానం నేర్పిస్తూ తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడుతూంటారు! ఆనందం యొక్క
లక్షణం వ్యాపకత్వమే కదా!

ప్రశ్న: “ధ్యానప్రచారం కోసం ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇలా బస్సుల్లో , కార్లల్లో , రై ళ్ళల్లో మరి విమానాలలో
నిర్విరామంగా ఎలా ప్రయాణాలు చెయ్యగలుగుతున్నారు? మీకు అలసట రాదా?!”
పత్రీ జీ: నేను ఏ రోజుకారోజే జివిస్తా ను! నా టార్గె ట్ ఎప్పుడూ 24 గంటలే! రోజుకు ఇరవై నాలుగు గంటలలో
నేను ఎంతగా పని చెయ్యగలనో అంతగా చేస్తూ నే ఉంటాను.
మిగతా ప్రా పంచిక వ్యాపారాలూ, వ్యవహారాలూ వేరు. అక్కడ మనం పని చేసేకొద్దీ శక్తి ని కోల్పోతూంటాం! కనుక
తొందరగా అలసట వచ్చేస్తు ంది. కానీ ధ్యానంలో, ఆధ్యాత్మికమై న ధ్యానప్రచారంలో మాత్రం అలా కాదు!
ఇక్కడ మనం ఎంతగా పని చేస్తూ ంటే అంతగా విశేషమై న శక్తి ని పొందుతూ ఉంటాం కనుక అలసిపోయే ప్రసక్తే
ఉండదు.
ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కు కూడా ఈ కిటుకు తెలుసు ! అందుకే నాతో పాటే వాళ్ళు వర్తమానంలో జీవిస్తూ
ఆనందంగా పని చేస్తూ ంటారు .. మరింత మరింత శక్తి వంతం అవుతూనే ఉంటారు.

ప్రశ్న: “మీకు కూడా సమస్యలూ, సవాళ్ళూ ఉంటాయా? “


పత్రీ జీ: సమస్యలూ, సవాళ్ళూ అన్నవి ఈ భూమి మీద పుట్టి న ఎవరికయినా ఉంటాయి. మనకు మరీ
ఎక్కువగా ఉంటాయి! ఎందుకంటే మనం విగ్రహారాధనలకూ, మూఢభక్తి సాంప్రదాయాలకూ, మూఢ
నమ్మకాలకూ, వ్యర్థ కర్మకాండలకూ .. మరి మాంసాహార సేవనాలకూ .. వ్యతిరేకంగా ప్రజలను జాగృత
పరుస్తూ ఉంటాం.
దాంతో ప్రజల అమాయకత్వాన్నీ, అజ్ఞా నాన్నీ ఆధారంగా చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ తాత్కాలిక
లాభాలను పొందుతూన్న వాళ్ళంతా కూడా మనమేదో తమ పొట్టలు కొడుతున్నామనుకుని పొరబడి మనపై
కోపగించుకుంటూ ఉంటారు.
ఇలాంటివి ఎన్నో సార్లు .. ఎన్నో చోట్ల రకరకాలుగా జరిగాయి. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఇవన్నీ జరగడం
సహజమే! జరగకపోతేనే అసహజం!
ఏసుప్రభువు కయితే ఏకంగా మేకులే కొట్టి శిలువవేశారు, స్వామీ దయానంద సరస్వతి కి గాజుపొడిని నీళ్ళలో
కలిపి త్రా గించారు. మరి ఓషో ని ఆర్సెనిక్ విషం ఇచ్చి చంపారు. ఇవన్నీ సహజమే! అలా జరిగిపోతూనే
ఉంటాయి!!

ప్రశ్న: “అహింస-శాకాహారం గురించి మీరు చాలా పట్టు దలగా ప్రచారం చేస్తా రు.. ఎందుకు?!”
పత్రీ జీ: ఈ సృష్టి లో ఉన్న కోడి, మేక, గొర్రె , కుందేలు వంటి సాధుజంతువులు అన్నీ కూడా నిస్సహాయజీవులు!
అవి కూడా మనలాగే ఈ భుమి మీద పుట్టి మనతో పాటే పరిణామం చెందుతోన్న మన సోదర ఆత్మ
స్వరూపాలు! “వాటిని చంపుకు తినడం ” అన్నది మానవత్వం ఎంత మాత్రం కాదు కనుక నేను వాటి కోసం
పోరాటం చేస్తు న్నాను. నోరులేని ఆ నిస్సహాయ జివుల హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తు న్నాను.
ఈ ప్రపంచం అంతా “అహింసా జగత్” గా మారేంత వరకూ .. ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా
అయ్యేంత వరకూ .. మరి ఈ జగతిలో ప్రతి జంతువూ, ప్రతి పక్షీ , ప్రతి చేపా మనలాగానే స్వేచ్ఛగా, హాయిగా
జీవించేంత వరకూ నేను పోరాడుతూనే ఉంటాను!

ప్రశ్న: “చాలా మంది ‘నేను పడుతూన్న కష్టా న్ని ఇతరుల అర్థం చేసుకుంటే బాగుండు’ అనుకుని
బాధలుపడుతూ ఉంటారు ..”
పత్రీ జీ: ఎవరికయితే తాము చేసే పనిమీద తమకే స్పష్టత లేదో వారు “ఇతరులు నన్ను అర్థం చేసుకుంటే
బాగుండు” అని వాపోతారు! తమ మీద తాము జాలిపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూ “ఇతరుల దృష్టి కోణం
లో నేనేంటి? ” అని ఆలోచిస్తూ ఇతరులను సంతృప్తి పరచడానికే కష్టపడుతూ ఉంటారు!
కానీ తాము చేసే పనిపట్ల సంపూర్ణమై న స్పష్టతతో ఉన్నవారికి ఎవ్వరి జాలీ అఖ్ఖరలేదు. మరి వారిని
ఎవ్వరూ అర్థం చేసుకోవలసిన పని లేదు. వారేం చెయ్యాలని అనుకుంటారో అది చేస్తూ నే ఉంటారు. అదే వారి
ఆత్మవిశ్వాసం !!

ప్రశ్న: ” ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ .. ‘ప్రత్యేకమై న లక్ష్యాలు ‘మరి’ సాధారణ లక్ష్యాలు’ అన్నవి
వేరువేరుగా ఉంటాయా?!”
పత్రీ జీ: ప్రతి ఒక్కరి జీవితానికి కూడా “జీవాత్మ” గా “ఒకానొక ప్రత్యేకమై న లక్ష్యం” మరి “సర్వాత్మ” గా
“ఒకానొక సర్వసాధారణ లక్ష్యం” తప్పకుండా ఉంటాయి.
ఎప్పుడయితే మనం సర్వాత్మలుగా .. నలుగురికీ క్షే మదాయకమై న .. “సర్వసాధారణ లక్ష్యం” కోసం .. పది
మందితో కలిసి పరస్పర సహకార ప్రవృత్తి తో కూడుకుని పరిశ్ర మిస్తూ ఉంటామో .. అప్పుడు జీవాత్మగా జన్మ
తీసుకున్న మన ప్రత్యేకమై న లక్ష్యం కూడా దానికదే నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటే లోకకల్యాణంతో పాటే
మన స్వీయకల్యాణం కూడా జరిగిపోతూ ఉంటుంది.
ప్రశ్న: ” ‘ఆత్మపిపాస’ అంటే?”
పత్రీ జీ: ఈ భూమి మీద మనం భౌతిక శరీరంతో ఉన్నన్ని రోజులు మనకు తిండి, నిద్ర, మై ధునం వంటి శారీరక
అవసరాల పట్ల ‘శారీరక పిపాస’ ఉంటుంది. శరీరం కొద్ది రోజులే ఉంటుంది కనుక దాని అవసరాల పిపాస కూడా
తాత్కాలికమే !
కానీ శరీరం ఉన్నప్పుడూ, దానిని వదిలివేసిన తరువాతా .. మళ్ళీ శరీరాన్ని ధరించేంతవరకూ .. మరి తిరిగి
క్రొ త్త శరీరాన్ని ధరించాక కూడా ఆ శరీరంలో ఉండే ఆత్మకు “ఆత్మశక్తి ” మరి “అనుభవజ్ఞా నం” వంటి
తప్పనిసరి అవసరాల పట్ల పిపాస ఉంటుంది.
“ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి; ఎంత చుసినా ఇంకా చూడాలి; ఎంత విన్నా .. ఇంకా వినాలి; ఎంత
అనుభవం పొందినా .. ఇంకా పొందాలి; ఎంత సేవ చేసినా .. ఇంకా చెయ్యాలి” అన్న ఈ ‘ఆత్మ పిపాస’
ఎప్పటికీ తరిగేది కాదు కనుక ఆత్మ యొక్క అవసరాల పిపాస శాశ్వతమై నది.
ధ్యానం ఒక్కటే ఈ సకల పిపాసలను తీర్చి .. శారీరకపరంగా ఆరోగ్యాన్ని బాగు చేస్తు ంది .. మరి ఆత్మపరంగా
ఆత్మ యొక్క బహుముఖ ప్రజ్ఞతో కూడిన సర్వవ్యాపక తత్వాన్ని మనకు అవగాహనకు తెస్తు ంది.

ప్రశ్న: “మీకు ఏవై నా అతీంద్రి య శక్తు లు ఉన్నాయా?”


పత్రీ జీ: నేను చాలా, చాలా సాధారణమై న వ్యక్తి ని. నా దగ్గర ఉన్నవల్లా “సత్యం యొక్క శక్తి ” .. “సకల
ప్రా ణికోటి పట్ల సహా అనుభూతితో కూడిన భుతదయ యొక్క శక్తి ” .. “నిరాడంబరత యొక్క శక్తి ” .. ”
సమయస్ఫూర్తి యొక్క శక్తి ” .. మరి “ప్రతి ఒక్క విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో వీక్షి ంచేశక్తి ”; వీటిని
మించి మరే ఇతర మానవాతీత శక్తు లు నా దగ్గర ఏమీ లేవు.
వాటి సహాయంతోనే నేను నా జీవితాన్ని సంపుర్ణంగా మరి ఆనందంగా జీవిస్తు న్నను !

ప్రశ్న: “మీ ఉద్దే శ్యంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసై టీస్ మూవ్‌మెంట్ అంటే ఏమిటి?”
పత్రీ జీ: “అత్యున్నతమై న ఆత్మజ్ఞా నాన్నీ .. సరియై న ధ్యాన శాస్త్ర జ్ఞా నాన్నీ .. మరి సరియై న రోజువారీ జీవన
విధానాన్నీ .. వీలయినంత అతి తక్కువ సమయంలో .. వీలయినంత అతి తక్కువ ఖర్చుతో ..
వీలయినంత అతి సరళమై న .. సామాన్యమై న వాడుక భాషారీతిలో .. వీలయినంత ఎక్కువమంది ప్రజలకు
అందించడం.”

ప్రశ్న: “నేటి సమాజానికి ఆత్మజ్ఞా న ప్రభుత్వం యొక్క అవశ్యకత ఎంత వరకు?”


పత్రీ జీ: పూర్వకాలంలో రాజులకూ, మహారాజులకూ ఆస్థా నాల్లో రాజగురువులు ఉండేవారు. ఆ యా రాజులకు
వారు పాలనాపరమై న సలహాలను ఇస్తూ ండేవారు. దశరథునికి “వశిష్ఠు డు” .. పాండవులకు “శ్రీ కృష్ణు డు”
..చంద్రగుప్తు నికి “చాణక్యుడు” .. ఛత్రపతి శివాజీకి .. “సమర్థ రామదాసు” వంటి గురువుల ఆధ్యాత్మిక శాస్త్ర
విజ్ఞా నపు నేపథ్యంతో కూడిన సలహాలతో వారు తమ ప్రజలను పరిపాలిస్తూ వుండేవారు!
ఇక శ్రీ రాముడు, శ్రీ కృష్ణు డు వంటి అవతారస్వరూపులై న రాజుల సంగతి సరేసరి! ఇలా ఆనాడే కాదు .. ఈనాడు
కూడా రాజగురువులు, ధర్మనీతిజ్ఞు లయిన పాలకులులేని ప్రభుత్వం చుక్కానిలేని పడవలా ఎప్పుడు
మునిగిపోతుందో తెలియకుండా వుంటుంది .. మరి “ఆధ్యాత్మికత లేని ప్రా పంచికత” గమ్యం లేని గమనం” లా
అస్తవ్యస్తం అవుతూ వుంటుంది.
” ‘కడుపునిండా తిండి’ .. ‘ఒంటినిండా వస్త్రం’ .. ‘ఉండడానికి ఇల్లు ’ అన్నవే ముఖ్యం .. మరి వీటిని ప్రజలకు
కల్పించడమే మహా మహా ఆదర్శం” అని ప్రభుత్వాలు అనుకున్నంత కాలం మనిషి యొక్క శాశ్వత తత్త్వం
అయిన “ఆత్మతత్త్వం” మరుగున పడిపోయి వుంటుంది. అలాంటి ప్రజలతో కూడిన సమాజంలో అశాంతి,
అనారోగ్యం, అసంతృప్తి అన్నవి శాశ్వత నిలయాలయి వుంటాయి.

ప్రశ్న: “‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్నది పెద్దల మాట! అయితే ఎవరితో కలిసి వుండాలి?”
పత్రీ జీ: మన స్వంత ఆత్మతో సదా కలిసి వుండాలి .. ఆత్మజ్ఞా న పరమరహస్యాలతో కలిసి వుండాలి ..
ఆత్మజ్ఞా న పరాయణులతో కలిసి వుండాలి .. పిరమిడ్ శక్తి తో కలిసి వుండాలి.

ప్రశ్న: “ముఖాన పులుముకునే ‘నిలువు నామాలు’, ‘అడ్డనామాలు’ అన్నవి ఆధ్యాత్మికతకు చిహ్నాలుగా


చెప్పుకోవచ్చా?!”
పత్రీ జీ: అసలు “నామాలు” అన్నవి తీసివేయడమే ఆధ్యాత్మికత!
“నామాలు” అంటే బాహ్యంగా ముఖం మీద పులుముకునే అలంకార ప్రా యాలు కావు. అవి ‘నా’ శరీరం ..
‘నా’ ఇల్లు .. ‘నా’ పిల్లలు .. ‘నా’ పొలం .. ‘నా’ వ్యాపారం తోపాటు .. ‘మా’ జాతి .. ‘మా’ వర్గం .. ‘మా’
కులం .. ‘మా’ దేశం .. అంటూ మానవజాతికి పట్టి న చీడ పీడలు!
ఆధ్యాత్మిక విజ్ఞా నశాస్త్రం మనల్ని ‘నా’, ‘మా’ అన్న చీడ పీడల నుంచి వేరు చేసి “మన” అన్న విశాల
సృష్టి తత్వంతో వికసించేట్లు చేస్తు ంది.

ప్రశ్న: ” ‘శివుడికి ఇద్దరు భార్యలు’ అని పురాణాల్లో వింటూంటాం! నిజమేనా?!”


పత్రీ జీ: నిజమే! శివుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు! మొదటి భార్య “పార్వతి” అయితే .. రెండవ భార్య
“ఆకాశగంగ”! పార్వతి అంటే ప్రా పంచికత .. ఆకాశగంగ అంటే ఆధ్యాత్మికత. ఇలా ఇద్దరు భార్యలతో కూడి
శివుడు .. కై లాసంలో సదా ఆనంద తాండవం చేస్తూ వుంటాడు.
శివుడిలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొదటి భార్య “ప్రా పంచికత”తోపాటు .. రెండవ భార్య
“ఆధ్యాత్మికత” కూడా వుండితీరాలి! అప్పుడే వారు శివుడిలా ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు. కేవలం
ప్రా పంచికత మీదగానీ .. కేవలం ఆధ్యాత్మికత మీద గానీ ఆధారపడి బ్రతికేవాళ్ళ జీవితంలో ఆనందం అన్నది
యాభై శాతం మాత్రమే వుంటుంది.
అలా కాకుండా నూటికి నూరు పాళ్ళు ఆనందంగా జీవించాలంటే పగలు ప్రా పంచికమై న జీవన వ్యాపారాలను
ధర్మబద్ధంగా సాగించుకుంటూనే .. రాత్రి ఆనాపానసతి ధ్యానసాధన విధిగా చెయ్యాలి .. ఆధ్యాత్మిక
రహస్యాలన్నింటినీ ఔపోసన పట్టా లి .. మరి సంసారం లో వుంటూనే నిర్వాణం చెందాలి. ఇదే ఇద్దరు భార్యలతో
కూడిన శివతత్త్వంలోని పరమార్థం !

ప్రశ్న: ” ‘చావు’ .. ‘నిద్ర’ .. ‘ధ్యానం’ .. వీటి మధ్య మౌలికమై న తేడా ఏమిటి?”


పత్రీ జీ: “చావు”, “నిద్ర”, “ధ్యానం” .. ఈ మూడు కూడా మౌలికంగా మనం మన స్థూ లశరీరాన్ని శాశ్వతంగానో
– అశాశ్వతంగానో .. పూర్తి గానో – కొద్ది గానో .. తెలిసో – తెలియకో వదిలివేసే ప్రక్రి యలు.
“చావు” లో మనం మన స్థూ లశరీరాన్ని శాశ్వతంగా వదిలివేస్తా ం. “నిద్ర” లో మనం మనకు తెలియకుండానే
మన స్థూ లశరీరంలోంచి బయటికి వచ్చి సూక్ష్మశరీరంతో కూడి విహరించి కొన్ని గంటల తరువాత మళ్ళీ
మనకు తెలియకుండానే తిరిగి స్థూ లశరీరంలోకి ప్రవేశిస్తా ం!
“ధ్యానం” లో మనం పూర్తి ఎరుకతో మన స్థూ లశరీరాన్ని వదిలి సూక్ష్మశరీరంతో కూడి అనేకానేక లోకాల్లో
సూక్ష్మశరీరయానాలు చేసి .. అక్కడి జ్ఞా నంతో తిరిగి ఎరుకతో మళ్ళీ స్థూ లశరీరంలోకి ప్రవేశిస్తా ం !
అంతేకాకుండా ధ్యానం చేయడం వలన మనం నిద్రా వస్థలో చేసే సూక్ష్మశరీర యాత్రల యొక్క పరమార్థం
కూడా తెలుసుకుంటాం .. మరి మరణానంతర జీవితం గురించి పూర్తి గా అర్థం చేసుకోగలుగుతాం !

ప్రశ్న: “మరణానంతరం ఏం జరుగుతోంది?


పత్రీ జీ: “మరణం” అంటే .. భౌతిక శరీరానికి మరి సూక్ష్మ శరీరానికీ మధ్య వున్న “Silver Cord –
వెండిప్రో గు” యొక్క సంబంధం తెగిపోవడం మాత్రమే. మరణం ద్వారా మన “చై తన్యంతో కూడిన ఎరుక” మన
భౌతికశరీరం నుంచి విడివడి .. “సూక్ష్మశరీరం”తో శాశ్వతంగా అనుసంధానించబడి .. ఇక అక్కడి నుంచే తన
యొక్క కార్యకలాపాలను సాగిస్తూ వుంటుంది.
“మరణం” తర్వాత కూడా ఒకానొక సగటు మామూలు వ్యక్తి యొక్క సూక్ష్మశరీరం .. ఈ భూమి మీద కనీసం
మూడురోజులపాటు తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో “ఒకానొక ఆస్ట్రల్ మాస్టర్” మరి “ఒకానొక ఆస్ట్రల్
స్టూ డెంట్” ఇద్దరూ కలిసి ఆ వ్యక్తి కి సూచనలిస్తూ శక్తి నిస్తూ ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తా రు.
అక్కడ కాస్త సేద తీయించిన తర్వాత అతనితో అంతవరకూ ఆ జన్మలో అతడు గడిపిన జీవితాన్ని
సింహావలోకనం చేయిస్తా రు. అప్పుడే అతని “అజ్ఞా నయుత” మరి “జ్ఞా నయుత” కార్యాల చిట్టా సరిచూడబడి,
అతని కర్మలస్థా యిని అనుసరించి మళ్ళీ పునఃపరిశీలించబడిన లక్ష్యాలతో .. మరి పునర్‍వ్యవస్థీ కరించబడిన
గమ్యాలతో .. అతని “పునర్జన్మ ప్రణాళిక” రచించబడుతుంది.

ప్రశ్న: ప్రకృతి మనతో ఏ విధమై న సంబంధాన్ని కలిగి వుంటుంది?


పత్రీ జీ: మీరు ఏ “ప్రకృతి” గురించి అడుగుతున్నారు? బహుశా మీరు “మన చుట్టూ ఉన్న ప్రకృతి”ని
గురించి అడుగుతున్నారు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనం “రకరకాల ప్రకృతుల”తో కలిసి
జీవిస్తు న్నాం. వీటన్నింటి గురించి మనం క్షు ణ్ణంగా తెలుసుకోవాలి:
“మొదటి రకం ప్రకృతి”
* “పంచభూతాలు” .. ఇందులోని ప్రకృతి పంచభూతాలతో నిర్మించబడి మన స్వంత భౌతిక ఎదుగుదలకు
మాత్రమే సహాయకారిగా ఉంటోంది. ఇందుకోసం మనం అడవులలోకి వెళ్ళడం, పర్వత శిఖరారోహణాలు
చేయడం, నదులు మరి సముద్రా లలోకి ఈతకొట్టడం వంటివి చేస్తూ .. భౌతికపరమై న ప్రకృతికి దగ్గరగా
సమయం గడపడం వల్ల పంచభూతాల నుంచి శక్తి ని గ్రహిస్తూ మనం ఇంకా ఇంకా శక్తి వంతుల్లా మారి సదా
ఆనందస్థి తిలో ఉండగలుగుతాం. ఇది “భౌతిక శరీరానికి” సంబంధించిన “భౌతిక ప్రకృతి” మాత్రమే సుమా!
“రెండవ రకం ప్రకృతి”
* “పంచతన్మాత్రలు”.. అంటే “సూక్ష్మలోకపు ప్రకృతి”. ధ్యానస్థి తిలో మనం సూక్ష్మశరీరయానం చేస్తూ
సూక్ష్మలోకపు వృక్ష సామ్రా జ్యాలకూ, సూక్ష్మలోకపు పర్వతశిఖరాలకూ, మరి సూక్ష్మలోకాల నదీనదాలకూ
దగ్గరగా వెళ్ళి .. వాటి నుంచి శక్తి ని పొందుతూ .. ఆత్మానందాన్ని అపారంగా పొందగలం. ఇది సూక్ష్మశరీరానికి
సంబంధించిన “సూక్ష్మప్రకృతి”
“మూడవరకం ప్రకృతి”
* “మూడవ ప్రకృతి” అంటే “సంపూర్ణ అద్వైత స్థి తిలో పూర్తి చై తన్యంతో నిండిన పురుషుడు”. ధ్యానం ద్వారా
ఇలాంటి “శుద్ధచై తన్యం”లో మనం సదా మునకలేస్తూ వుంటే .. “మనమంతా ఆత్మస్వరూపులం” అనీ ..
“అహం బ్రహ్మాస్మి” అనీ .. మనకు విశేషంగా అర్థమవడం మొదలవుతుంది. ఈ స్థి తి మనకు “బ్రహ్మానందం”తో
పాటుగా అనేకానేక శుద్ధచై తన్య లోకాలకు సంబంధించిన “అనంతజ్ఞా న ప్రకాశాన్ని” కూడా అందజేస్తు ంది. మన
మనస్సులను మనం మరిచిపోయిన ప్రగాఢ ధ్యానస్థి తిలో మాత్రమే మనలోని ఈ శుద్ధచై తన్యం .. ప్రకృతితో
మమేకమై మనకు ఇంతటి బ్రహ్మానంద స్థి తిని అందిస్తు ంది.
“నాల్గవ రకం ప్రకృతి”
* ఇప్పుడు మనం మన “నాల్గవ రకం ప్రకృతి” అయిన “సంస్కారాల చిత్తప్రకృతి” .. “వాసనల చిత్తప్రకృతి”
గురించి తెలుసుకుందాం.
“సంస్కార చిత్తం” అంటే మన యొక్క “పూర్వ జన్మల నుంచి సంతరించుకున్న మానసిక ప్రవృత్తు లు” ..
“పూర్వజన్మల నుంచి సంతరించుకున్న అంతఃకరణం”. ఇవి “నేను ఫలానా”, “నాది ఫలానా” అనే రకరకాల
చిత్రవిచిత్ర వ్యక్తి గత చిత్త అస్తి త్వాలతో కూడి ఎంతో సంక్లి ష్టంగా వుంటాయి.
“ప్రస్తు తం మనం ఉన్నటువంటి స్థి తి మన జన్మపరంపరలోని అనేకానేక సంభావనల మరి కర్మఫలితాల
సంపూర్ణ స్వరూపమే” అన్నది పరమసత్యం.
కనుక “సిద్ధా ంతపరం”గా మనం మన మూడవ ప్రకృతిలో వుంటూ మరి “ప్రయోగపరం”గా మన నాల్గవ ప్రకృతి
గురించి పరిపూర్ణమై న అవగాహన కలిగివుండాలి. ఎందుకంటే, భౌతికతలంలో మనయొక్క ప్రా పంచిక
కార్యకలాపాలు ఇతరులతో కూడి కలిసిమెలిసి నిర్వహించాల్సి వుంటుంది.
సర్వసాధారణంగా మనం .. ఆత్మజ్ఞా నం లోపించి “నేను ఫలానా”, “నువ్వు ఫలానా” అనే ప్రకృతిలో .. అంటే
“ద్వైతం”లో .. వుంటూ మూడవ ప్రకృతికి సంబంధించిన ఆత్మచై తన్యపు మౌలిక అవగాహన లోపంతో
అనేకానేక ఇబ్బందికర భావనాక్షే త్రా లతో .. అనేకానేక సంక్లి ష్ట పరిస్థి తులలోకి ప్రయాణిస్తూ .. జీవితాన్ని
దుఃఖభాజనం చేసుకుంటూంటాం.
ఇలాంటి ద్వైతప్రకృతిని “సై కోఎనాలసిస్” ద్వారా విశ్లే షించే .. సిగ్మండ్ ఫ్రా యిడ్ వంటి మనోవై జ్ఞా నిక
శాస్త్రవేత్తలు సై తం “ఆత్మతత్వాన్ని” పట్టి ంచుకోకుండా, దానిని పూర్తి గా విస్మరించారు.
“ఆలోచనల సముదాయమై న మనస్సు” అనేది మెదడుకు సంబంధించిన భౌతిక వ్యాపారం మాత్రమే .. కానీ
“శుద్ధ చై తన్యం వీటన్నిటికీ అతీతమై ంది” అన్న మౌలికసత్యాన్ని గ్రహించని ఈ మానసికశాస్త్ర నిపుణులంతా
.. “మనిషి అంటే కేవలం భౌతికశరీరం మాత్రమే” అన్న భావనతోనే మనిషి యొక్క సమస్యల పరిష్కారం పై
దృష్టి పెడుతూ వచ్చారు.
“అయితే ప్రతి మనిషి తన యొక్క ఆత్మలక్ష్యాలనూ, మరి తన ఆత్మ గమ్యాలనూ అర్థం చేసుకోనంతవరకు
ప్రా పంచిక సమస్యలకు పరిష్కారం లభించనే లభించదు” అన్న ప్రా థమిక సత్యాన్ని తప్పకుండా అవగాహన
చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతై నా వుంది. ఇక్కడే “ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నది మనకు చక్కటి
మార్గదర్శకత్వాన్ని ఇస్తు ంది .. మరి దానివల్ల మనం ఆత్మజ్ఞా నంతో కూడిన అవగాహనతో ఎలాంటి
సమస్యనై నా తేలికగా పరిష్కరించుకోగలుగుతాం.
ఇలా ఎవరై తే “మూడవ రకం ప్రకృతి”లోని శుద్ధచై తన్యం పట్ల ఎరుకతో తమ తమ “నాల్గవ రకం ప్రకృతి”
అయిన అనేకానేక జన్మల జనిత సంస్కారాల వాసనలతో కూడిన “చిత్ర విచిత్ర చిత్త ప్రకృతి” పట్ల అవగాహన
కలిగివుంటూ ప్రా పంచిక కార్యకలాపాల పట్ల సదా అర్థవంతంగా మరి ఆనందంగా జీవించగలుగుతారో వారే
జీవన్ముక్తు లు.
మరి వారి చై తన్యమే .. “శ్రీ కృష్ణ చై తన్యం”

ప్రశ్న: “ధ్యానం” మన నిత్యజీవితంలో ఎలాంటి సహాయం చేస్తు ంది?


పత్రీ జీ: నిరంతర ధ్యానం ద్వారా మనం పొందే “విశ్వమయప్రా ణశక్తి ” వల్ల మనలోని “శక్తి కేంద్రా లన్నీ” ఉత్తే జితం
చేయబడి మనం “శక్తి స్వరూపాల్లా ” పరిమారిపోతాం. దీనివల్ల మనం చేస్తో న్న పనులన్నింటిలో.. సునిశతమై న
నై పుణ్యత పెరిగి ఎంతటి పనినై నా అవలీలగా మరి ఆనందంగా ఒక ఆటలా పూర్తి చేయగలుగుతాం.
ధ్యానం మనల్ని ఒకానొక “నిశ్చలానంద స్థి తి” లో వుంచడం వల్ల మనం ఆత్మశాంతితో .. సాక్షీ తత్వంతో
కళ్ళముందు వున్న పరిస్థి తులు ఏ రకమై న మార్పు చెందుతున్నా సరే .. సమతా స్థి తిలో వాటి ఫలితాలను
గ్రహిస్తూ .. మనం చేస్తూ న్న పని మీద మాత్రమే ధ్యాస ఉంచగలుగుతాం.
ధ్యానం మనల్ని క్ర మక్ర మంగా “అత్యంత చక్కగా అధ్యయనం చేయబడిన శాస్త్రీయ దృక్పథాల”తో కూడిన
“బుద్ధి జీవులు”గా మరి “వివిధ రీతులుగా ఉండే ప్రకృతి తత్త్వాలతో సామరస్యం”లో ఉండే “ప్రకృతి అనుగుణ
జీవులు”గా పరిమార్చుతుంది. దానివల్ల పరిస్థి తులను ఆకళింపు చేసుకోవడంలో మరి ఎదుటి మనిషిని అర్థం
చేసుకోవడంలో మనలో ఎంతో గొప్ప మార్పు వస్తు ంది.
ప్రతి విషయాన్నీ శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకుంటూ మరి “సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ”తో మన
నిర్ణయాలు మనమే తీసుకుంటూ మరి ఇతరుల”సంపూర్ణ ఆత్మయుతస్వేచ్ఛ”ను కూడా అద్భుతంగా
గౌరవిస్తూ .. అందరితో అద్భుతమై న అనుబంధాలను నెరపుతాం.
ఇలా “విశ్వపు ఏకత్వం” వై పు .. మరి “విశ్వసమభావన” వై పుగా మనం ప్రయాణం చేస్తూ .. సదా బ్రహ్మానంద
స్థి తిలో వుంటాం.
“సరియై న ధ్యానం” అనేది మనల్ని 1. శక్తి స్వరూపాలలా, 2. నిశ్చలానంద స్వరూపాలలా మరి 3. బుద్ధి
జీవులలా పరిమార్చివేస్తు ంది.

ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?”


పత్రీ జీ: చాలామంది కేవలం ప్రా పంచిక తల్లి దండ్రు లు “క్లా స్లో నువ్వే ఫస్ట్ రావాలి .. నువ్వే ఇంజనీయర్ కావాలి
.. నువ్వే డాక్ట ర్ కావాలి .. నువ్వే కలెక్ట ర్ కావాలి .. నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి” .. అంటూ
చిన్నప్పటి నుంచీ పిల్లలకు 100% ప్రా పంచికతను నూరిపోస్తూ వుంటారు.
ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ .. చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ ఉంటారు.
ఫలితంగా వారు తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకూ, అపజయాలకూ గురవుతూ ఉంటారు!
కాబట్టి “నేను అందరి కన్నా ముందుండాలి” అన్న భావన కంటే “అందరూ పక్వంగా ఉండాలి .. అందులో
నేను కూడా ఒకానొక పక్వంగా ఉండాలి” అన్న సరై న భావనతో పిల్లలను పెంచాలి! నిజానికి విద్యార్థి
జీవనానికి కావలసినవి ‘ఏకాగ్రత’ .. ‘పట్టు దల’ .. ‘జ్ఞా పకశక్తి ’ .. ‘ఏక సంధాగ్రా హ్యత’ .. ‘చురుకుదనం’ ..
‘ఉత్సాహం’ .. ‘శక్తి ’! ఇవి అన్నీ కూడా పిల్లలు పుట్టు కతోనే సహజంగా కలిగి ఉంటారు అయితే ప్రతిరోజూ
వాళ్ళతో నిర్ణీ త సమయంలో ధ్యానం చేయిస్తూ ంటే తమలోనే నిక్షి ప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను
వారు సహజ ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.

ప్రశ్న: ” ‘నిజమై న గురువు’ను గుర్తి ంచడం ఎలా?”


పత్రీ జీ: ‘గురువు’ కానివాడు .. గురువుని గుర్తి ంచడం అసంభవం! ఏ జాతి పక్షు లు ఆ జాతినే గుర్తి ంచి ఆ
జాతిలోనే సంచరించినట్లు .. ‘గురువు’ను గుర్తి ంచగలిగిన వాడు మాత్రమే గురువుతో కూడిన సంచరిస్తా డు.
గురువు కాని వాడికి గురువుల గుర్తు లు చెప్పినా లాభం లేదు .. మరి గురువు అయిన వాడికి గురువుల
గుర్తు లు చెప్పడం అంతకంటే అనవసరం. కాబట్టి ‘నిజమై న గురువును గుర్తి ంచడం ఎలా?’ అని
తికమకపడేకంటే ముందు ‘నేను గురువును ఎలా కావాలి?’ అన్న ప్రయత్నం మొదలుపెట్టడం ముఖ్యం.

ప్రశ్న: “జీవితాన్ని మనం ఎలా ‘సార్థకం’ చేసుకోవలి?”


పత్రీ జీ: ‘సార్థకం’ అంటే ‘స + అర్ధకం’ అర్థం తో కూడుకుని వున్నది’ అని అర్థం! ‘జీవితం’ అంటే అది మనిషి
పుట్టు క నుంచి మరణం వరకూ ఉన్న దేశకాల పరిస్థి తుల పరంపరలో కలిగిన స్పందన మరి ప్రతిస్పందనల
ప్రవాహం.
కేవలం “ఒక గంట” సేపో “ఒకరోజు”లోనే .. “ఒక ఊరి”లోనో .. లేదా “ఒక మనిషి”తోనో జీవితాన్ని
అర్థవంతంగా జీవిస్తే .. అది కేవలం అంతవరకే సార్ధకత. అలాకాక ప్రతి ఒక్క దేశకాల పరిస్థి తిలోనూ .. క్షణక్షణం
సృజనాత్మకంగా, క్రి యాశీలకంగా, అర్ధసంహితంగా, దుఃఖరహితంగా మరి అందరికీ శ్రే యస్సును కలిగించే
విధంగా ఉంటూ .. సత్యస్థి తులై , ధర్మవర్తు లై .. ఆఖరి శ్వాస వరకు జీవిస్తే .. దానినే ‘జీవితం యొక్క సంపూర్ణ
సార్ధకత’ అంటాం. జీవితంలో ఇలాంటి సార్థకత ను పొందాలంటే .. మనం వదిలిపెట్టా ల్సింది .. ‘హింస’ మరి
పట్టు కోవాల్సింది ‘హంస’.

ప్రశ్న: “ధ్యానం చెయ్యడం వల్ల ఇంటిలో వున్న వాస్తు దోషాలు పోతాయా?”


పత్రీ జీ: “తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు ” అసంఖ్యాకమై న దోషాలు మనలో నిండి ఉండి మనం
ఆధ్వాన్నంగా వుంటే .. మరి మన చుట్టూ వున్న వస్తు సముదాయంలో కూడా లేనిపోని అధ్వాన్నాలు
పుట్టు కొస్తా యి! కాబట్టి ‘వాస్తు ’ పేరుతో మనం చుట్టూ వున్న ప్రపంచంలోని దోషాలను సరిచెయ్యడం కాకుండా
.. ముందు మనలో ఉన్న దోషాలను సరిచేసుకోవాలి. ఇందుకుగాను స్వీయపరిశీలనా శక్తి ని కలిగించే ‘ధ్యానం’
ఒక్కటే మనకు మార్గం; నిరంతర ధ్యానసాధన ద్వారా మనలో వున్న దోషాలన్నీ దూరమై పోయి .. మన
దృక్పథంలో విశేషమై న మార్పువస్తే .. మనచుట్టూ వున్న దోషాలన్నీ కూడా తదనుగుణంగా
సరిచేయబడతాయి.

ప్రశ్న: “ఎలాంటి పనులు చేస్తూ ంటే ఆత్మపరంగా మరి భౌతికపరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం?”
పత్రీ జీ: మనం ఏ పని చేస్తు న్నా .. అది మంచి కానీ .. చెడుకానీ .. దానివల్ల మనం నిరంతరం అభివృద్ధి
చెందుతూనే వుంటాం. ఏ స్థా యికి ఉండే పాఠాలు ఆ స్థా యికి ఉండనే ఉంటాయి. ఏ విత్తనాన్ని నాటితే ఆ
ఫలమే పొందుతాం .. కనుక తగిన పాఠాలను నేర్చుకుంటూ నిరంతరం .. ఎదుగుతూనే ఉంటాం. అయితే
ధ్యానం, ధ్యానప్రచారం, స్వాధ్యాయ సత్సంగాదులు మన ఆత్మయొక్క అభివృద్ధి ని మరింత వేగవంతం
చేస్తా యి.

ప్రశ్న: “జీవితాన్ని ఒక ‘ఉత్సవం’లా జీవించడం ఎలా?”


పత్రీ జీ: నిరంతర ధ్యాన – జ్ఞా నాభ్యాసాల వల్ల మనకు సృష్టి యొక్క మూల సిద్ధా ంతాలన్నీ క్ర మక్ర మంగా,
సావధానంగా అవగతం అవుతూంటాయి. అప్పుడు ఇక “మనకూ – మనకూ” .. మరి “విశ్వంలోని నక్షత్ర
లోకాలకూ – మనకూ” మధ్య ఉన్న సంబంధాలు స్పష్టంగా, తేటతెల్లం అవుతూంటాయి. అదే మరి
దివ్యజ్ఞా నప్రకాశం! ఆ దివ్యజ్ఞా నప్రకాశాన్ని పొందిన క్షణం నుంచీ మన ఆహార-వ్యవహారాల తీరులన్నీ
మారిపోయి మన జీవితం నిత్యనూతనంగా వెలిగిపోతుంది. యుక్తా యుక్త విచక్షణా జ్ఞా నంతో అప్పుడు మనం
ముక్త జీవుల్లా మన జీవితాలను ప్రతి క్షణం ఒక ‘ఉత్సవం’లా జీవిస్తా ం..

ప్రశ్న: “తల్లి లాంటి ప్రకృతి మనపట్ల చూపించే ప్రే మలో తేడాలు ఉంటాయా?!”
పత్రీ జీ: తప్పకుండా ఉంటాయి. ఒకానొక తల్లి లా ప్రకృతి తన బిడ్డలను సదా ప్రే మిస్తూ నే ఉంటుంది. కానీ వారు
చేసే పనులవల్ల ఒక్కోసారి ఆమె ప్రే మలో కొంత వై విధ్యత కనబడుతుంది. ఇందులో 
మొదటి రకం బిడ్డలు: వీరు పూర్తి హింసామార్గంలో జీవిస్తూ న్నా సరే .. వారు చేసే ఆగడాలను, దారుణాలను,
దౌర్జన్యాలను ఎంతో శాంతంగా ప్రకృతిమాత సహిస్తూ నే ఉంటుంది! సాగినంత వరకు “నా అంతటి వారు లేరు”
అని వాళ్ళు అనుకున్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ ఏ జన్మ కర్మఫలితమో అనుబవించాల్సి
వచ్చినప్పుడు మాత్రం ఆ మహా ప్రకృతి, ఆ మహా తల్లి ఆ హింసాత్ములకు సహాయం చెయ్యడం సరికదా ..
వారి నుంచి తన మొహం త్రి ప్పేసుకుంటుంది!
రెండవ రకం బిడ్డలు: వారు “అహింసా పరమో ధర్మః” అన్న సిద్ధా ంతాన్ని “తు.చ.”తప్పకుండా ఆచరిస్తూ
ఇతర జీవులకు హింస కలిగించకుండా తమ బ్రతుకేదో తాము గడుపుతూ వుంటారు. అలాంటి వాళ్ళు
ఎదురయినప్పుడు ప్రకృతిమాత చక్కగా పలుకరించి .. వారిని వెయ్యేళ్ళు జీవించమని ఆశీర్వదిస్తు ంది! 
మూడవ రకం బిడ్డలు: వారు ధ్యాన సాధన ద్వారా తమను తాము తెలుసుకుని, విశ్వప్రణాళికలో తమ వంతు
కర్తవ్యాన్ని గుర్తి ంచి ఆ దిశగా ప్రయాణిస్తూ సమస్త ప్రా ణికోటి ఉద్ధరణ కోసం లోకకల్యాణ కార్యక్ర మాలను
చేపడుతూ అహర్నిశలు శ్ర మిస్తూ ంటారు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించే వీరిని చేసి ప్రకృతి
మాత పులకరించిపోతూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తు ంది!!

ప్రశ్న: “ధ్యానం యొక్క ప్రభావం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉందా .. లేక భారతదేశంలో ఎక్కువుగా
ఉందా?”
పత్రీ జీ: అసలు “భారతదేశం” మరి “పాశ్చాత్య దేశాలు” అన్నవి వేరు వేరు కాదు. భౌగోళికంగా ఉన్నది
భూమి ఒక్కటే! ఒక్కడే సూర్యుడు .. ఒక్కడే చంద్రు డు .. మరి ఒక్కటే భూమి! రకరకాల సముద్రా లలో ఉన్న
నీరు కూడా ఒక్కటే! రకరకాల ఎల్లలు ఏర్పరచి ఇలా దేశాలన్నింటినీ విభజించడం మానుకుంటే మన
మనస్సు శుభ్రపడుతుంది. కనుక “ఇక్కడ ఏదీ పరదేశం కాదు .. ఏదీ మాతృదేశమూ కాదు” అని
తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే “వసుధై క కుటుంబం”!! ధ్యానం సర్వవ్యాపకమై ంది. కనుక ఈ వసుధై క
కుటుంబంలో ప్రతి ఒక్కరిపై నా దాని ప్రభావం ఉంటుంది.

ప్రశ్న: ” ‘యుక్త జీవనం’ అంటే ..”


పత్రీ జీ: “యుక్త జీవనం” అన్నది యుక్తా హారం నుంచి మొదలవుతుంది. యుక్త మై న శాకాహారంతో మన శరీరం
పోషింపబడితే మనకు మనమే మిత్రు లం అవుతాం మరి ఇతర జీవులను చంపి వండే అయుక్తి కమై న మాంసాన్ని
తింటే .. మనకు మనమే శత్రు వులం అయిపోతాం! కనుక మాంసాన్ని విసర్జి ంచి .. శుద్ధ శాకాహారాన్నే మితంగా
భుజిస్తూ .. శ్వాసాహారులుగా జీవించడమే యుక్త జీవనం.

ప్రశ్న: “పిరమిడ్స్ అన్నవి ఈజిప్ట్ దేశపు సాంప్రదాయం కదా .. దానిని మీరెలా తీసుకున్నారు?”
పత్రీ జీ: మీ జేబులోని సెల్‌ఫోన్ మన సాంప్రదాయమా? మీ చేతిలోని మై క్ మన సంప్రదాయమా? అయినా మనం
వాటిని వాడడం లేదా? సై న్స్ మరి సాంకేతికత అన్నవి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలాగే పిరమిడ్స్ అన్నవి
కూడా శాస్త్రీయమై న కొలతలతో నిర్మించబడిన జియోమెట్రి కల్ శక్తి నిక్షే ప కట్టడాలు .. వాటి లాభాలను
ఎవ్వరయినా .. ఎక్కడయినా ఉపయోగించుకోవచ్చు.
ప్రశ్న: “యోగభ్రష్టత్వం అంటే ..”
పత్రీ జీ: సరియై న ధ్యాన సాధనను విశేషంగా చేసే ప్రతి ఒక్కరికీ అపరిమితమై న శక్తి సామర్ధ్యాలు ఖచ్చితంగా
సంక్ర మిస్తూ ఉంటాయి. తద్వారా వారు ఏది కోరుకున్నా.. అది ప్రా పంచికంగా అయినా సరే లేదా
ఆధ్యాత్మికంగా అయినా సరే .. సునాయసంగా తీరిపోతూ ఉంటాయి.
“ప్రా ప్తి ” .. “ప్రకామ్యం” .. “ఈశత్వం” .. “వశిత్వం” అనబడే ఇలాంటి సిద్ధు ల వల్ల మనం గర్వం, అహంకారం
మరి డంబాతిశయాల వంటి లక్షణాలను పెంచుకుంటే అవి మన ప్రా పంచిక మరి ఆధ్యాత్మిక పతనాలను
దారితీస్తా యి. దానివల్ల మనం యోగభ్రష్టు ల్లా మిగిలిపోతాం! అందుకే ఆత్మజ్ఞా న సముపార్జన ద్వారా మనకు
సంక్ర మిస్తో న్న ఇలాంటి సిద్ధు లపట్ల అప్రమత్తతతో ఉండాలి! అలాంటి సమదృష్టి తో మనం ఉన్నప్పుడే మరి
ఎక్కడా దిగజారకుండా ఆత్మపరిణామక్ర మంలో ముందుకు వెళతాం!

ప్రశ్న: “ధ్యానం చెయ్యడానికి ఏవై నా అర్హ తలు ఉండాలా?!” (‘భారత్ టుడే’ సౌజన్యం)
పత్రీ జీ: ఈ స్టూ డియోని స్థా పించడానికి మీకు ఉన్న అర్హ త ఏమిటి?! తీవ్రమై న అభిలాష మరి అంకితభావంతో
కూడిన కార్యాచరణ! అంతేకదా!
అలాగే ధ్యానం చెయ్యడానికి కూడా మౌలికంగా ధ్యానం చెయ్యాలన్న తపన మరి అందుకు తగిన తీవ్రతర
సాధన ఉంటే చాలు!

ప్రశ్న: “ఎవ్వరయినా బ్రహ్మర్షి కావచ్చా?!”


పత్రీ జీ: కావచ్చు!! బ్రహ్మజ్ఞా నం కలిగి ఉన్న ఎవ్వరయినా బ్రహ్మర్షు లే! వంటగది నుంచి మొదలుకుని
అంతరిక్షం వరకూ ఏదై నా సరే ఆ విషయాన్ని గురించిన సంపూర్ణ పరిజ్ఞా నం మనకు ఉండాలి. అది నిరంతర
ధ్యానసాధన ద్వారా మాత్రమే సాధ్యం! అలా ధ్యానసాధన ద్వారా సేకరించుకున్న పరిజ్ఞా నాన్ని ఆచరణ
ద్వారా అనుభవై క ఆత్మజ్ఞా నంలా జీవించే వాళ్ళంతా కూడా బ్రహ్మజ్ఞా నులే!

ప్రశ్న: “ధ్యానం తెలిసిన వెంటనే కొందరు గంటలు, గంటలు రోజులు రోజులు ధ్యాన సాధన చేస్తూ వుంటారు.
కొందరు నిరంతరం ధ్యానప్రచారంలోనూ దానికి చెందిన అనేక పనులలోనూ మునిగి తేలుతూ వుంటారు; దేనిని
అనుసరించాలి?”
పత్రీ జీ: గత జన్మలలో అధికంగా ధ్యానసాధన చేసినవారే ఈ జన్మలలో ధ్యానప్రచారం చేస్తూ వుంటారు. “ఈ
జన్మలో ధ్యానం చెయ్యాలి .. అదొక్కటే నాకు కావాలి” అన్న వారికి అదొక్కటే సత్యం.
“ధ్యానసాధన కన్నా నాకు ధ్యానప్రచారమే ఇష్టం; అది లేకుండా నేను ఉండలేను” అనే వారికి అదే సత్యం;
ఎవరి సత్యంలో వాళ్ళు జీవించాలి.
ప్రశ్న: “మరణం తరువాత ఆత్మకు ఏమవుతుంది?”
పత్రీ జీ: ఏమీ కాదు!! మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది?? అలాగే ..
మరణం తరువాత తాత్కాలికమై న శరీరాన్ని ధరించి వున్న శాశ్వతమై న ఆత్మకు కూడా ఏమీ కాదు!
శరీరానికి బట్ట ఎలాంటిదో .. ఆత్మకు శరీరం అలాంటిదే కనుక మరణం ద్వారా శరీరం నశించిన తరువాత
కూడా ఆత్మ మరిన్ని అనుభవాలకోసం మరిన్ని జన్మలను తీసుకుంటూ మరిన్ని క్రొ త్త క్రొ త్త శరీరాలను
ధరిస్తూ తన అనంతకాల ప్రయాణాన్ని కొనసాగిస్తూ నే వుంటుంది.

ప్రశ్న: “ఒకానొక ఎన్‌లై టెన్‌డ్ మాస్టర్‌ను గుర్తి ంచడం ఎలా?”


పత్రీ జీ: ఎన్‌లై టెన్‌డ్ మాస్టర్‌ను గుర్తి ంచడం చాలా సులభం! అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకుని
మరీ జీవిస్తూ ంటాడు. అతడు బాధలకు కృంగిపోడు; కష్టా లకు తలవంచడు. అందరితో మమేకం అవుతూ
అందరినీ సరిసమాన స్నేహదృష్టి తో చూస్తూ .. ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, ఎవరు తనను
దూషించినా బాధపడకుండా .. ఒకానొక బుద్ధు డిలా సదా బ్రహ్మానందస్థి తిలో వుంటాడు.

ప్రశ్న: “విదేశాలలో నివసిస్తూ న్నప్పుడు ఒక్కోసారి శాకాహారం దొరకడం కష్టంగా వుంటోంది!”


పత్రీ జీ: “ధ్యానం” – “శాకాహారం” అన్నవి రెండూ .. మనకు రెండు పాదాలలాంటివి. ఇందులో ఏ ఒక్కటి
మనకు లేకపోయినా మనం వికలాంగుల్లా కుంటి బ్రతుకు ఈడవాల్సిందే!
ఒకవేళ శాకాహారం బొత్తి గా దొరకని ప్రదేశాలలో కనుక ఉండాల్సి వస్తే .. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే ..
నిర్ద్వందంగా దానిని వదిలి పెట్టే యాలి. ధర్మబద్ధంగా జీవించడానికి అనువుగాలేని అలాంటి దుర్భరప్రదేశాలు
డాలర్లను కురిపిస్తూ మనల్ని తాత్కాలిక మాయకు గురిచేసినా .. ఆత్మపరిణామక్ర మంలో మాత్రం అవి
మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తా యి.

ప్రశ్న: “భూమి మీద అందరితో చక్కటి సంబంధాలను కలిగి వుండి .. ఇంగిత జ్ఞా నంతో వ్యవహరించడం
ముఖ్యమా? లేక ఇతర లోకాల జ్ఞా నం తెలుసుకోవడం ముఖ్యమా?”
పత్రీ జీ: మొదట మనం ఒక ఇంట్లో పుట్టి .. పెరిగి .. ఉత్సుకతతో నెమ్మదిగా ప్రక్క ఇంటికి వెళతాం. ఆ
తరువాత మెల్లి మెల్లి గా ఆ ప్రక్క ఇంటికీ, ఇంకో ప్రక్క ఇంటికీ వెళతాం. క్ర మేణా గోడలు దూకి వాటి వెనుక
ఏముందో చూస్తా ం. తరువాత ప్రక్క ఊరికి “పిక్‌నిక్” కు వెళతాం. దూరంగా కనిపించే కొండ ఎక్కి అన్నీ చూసి
తిరిగివస్తా ం. కొంత దూరంలో ఉన్న అడవికి వెళ్ళి, అడవి అంతా చూసి తిరిగి వస్తా ం.
తరువాత దగ్గరలోని నగరానికి వెళ్ళి అక్కడి వింతలూ విశేషాలూ చూసి వస్తా ం. వీలై నంతలో దేశవిదేశాలన్నీ
తిరిగి వస్తా ం. ఇలా ప్రా పంచిక జీవితంలో అందరూ అనుభవించినట్లే .. “ఆధ్యాత్మిక జీవితం” లో కూడా
ఇటువంటి క్ర మమే ఉంటుంది!
“సరే .. ఈ జన్మలో ఇక్కడ వున్నాను కదా .. గత జన్మలో ఏమై వుంటాను?” అన్న ప్రశ్న ఉదయించి ..
గత జన్మలన్నీ దర్శించాలని ఆకాంక్షి స్తా ము. ఆపై న ” జన్మకూ జన్మకూ మధ్య ఎక్కడ వున్నాను? అక్కడ ఏం
చేస్తా ం?” అన్నది తెలుసుకుంటాము!
ఆ తరువాత “ఎన్ని గెలాక్సీలలో ఎన్ని జీవరాసులు ఉన్నాయి? మనుష్యుల లాంటి వారు ఉన్నారా?
గ్రహాంతర వాసులను కలుసుకోవచ్చా? వారితో మాట్లా డవచ్చా??” అంటూ ఉత్సాహంగా ఆధ్యాత్మిక
అన్వేషణ మొదలుపెడతాం!
ఇదంతా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి సహజంగా జరిగే సుందరమై న ఆత్మపురోగమనప్రక్రి య!

ప్రశ్న: “జీవిత ధ్యేయాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి?”


పత్రీ జీ: ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే “జీవిత ధ్యేయం”! కలిమిలోనై నా, లేమిలోనై నా .. జయంలోనై నా,
అపజయంలోనై నా .. మానంలోనై నా, అవమానంలోనై నా .. ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా .. పుట్టు కలో
అయినా, మరణంలో అయినా .. అన్ని పరిస్థి తులలో కూడా శాంతంగా, ఆనందంగా జీవించగలగాలి!
మన ఆనందం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఆనందం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి. మన
మౌనం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి మౌనం కూడా మనకు అంతే ముఖ్యంగా ఉండాలి. మన ఏకాంతం
మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి.
ఇలా ప్రతిక్షణం ఎరుకతో జీవించగలగడమే .. “జీవితధ్యేయం”!

 
No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and
Spiritual Science to the whole world | Designed & Powered by Puremindz

You might also like