You are on page 1of 2

ఇలా జరిగత

ి ే పితృదో షం ఉన్నట్టే..

కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, యాక్సిండెంట్లు జరగడం, పిల్లలలో


దుష్ప్రవర్త న, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపో వడం,
భార్యాభర్త ల మధ్య కలహాలు, పిల్లలు పుట్ట కపో వడం జరుగుతుంటాయి.

అలాగే కెరీర్‌
లో అభివృద్ధి లేకపో వడం, ప్రా రంభించిన కార్యాలు పూర్తికాకపో వడం ఇలా మీరు
ఇక్కట్లు పడుతున్నట్ల యితే మీకు పితృదో షం ఉండవచ్చు. వెంటనే పితృదో ష నివారణ
చేయించవలసి ఉంటుంది.

పితృదేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపో తే, పరిహారం కోసం
మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం
తిలతర్పణపురి అనే గ్రా మంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఈ
ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు.

పితృదో షాలు ఉన్నవారు తిలతర్పణపురి గ్రా మంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్
ఆలయాన్ని దర్శిస్తే దో షాలు పో తాయట. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసన
ి ా
ముక్తి లభించకపో వడంతో శివుడిని ప్రా ర్ధించాడు.

శివుడు ప్రత్యక్షమై ఈ ఊరులోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని


చెప్పాడు. ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలతర్పణపురి అయింది.

తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థ లం. రాముడు తిలలు
వదిలిన స్థ లం ఇది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు
పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది.

అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది


పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ
దో షాల నుంచి విముక్తి పొ ందగలరు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.
ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి దర్శనమిస్తా డు. గణపతి తొండం లేకుండా బాలగణపతి
రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా
ఉంటుంది.

ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధిపొ ందింది.


తమిళనాడులోని తిరునల్లా ర్ శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు
సరస్వతీ ఆలయంకు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది..

You might also like