You are on page 1of 3

*సర్పశాపయెాగము*

*నిర్వచనము*- పంచమస్థా నమునందు రాహువుండి కుజునిచే చూడబడినను లేదా


పంచమము కుజస్థా నమై రాహువు అందున్నను పంచమాధిపతి రాహువుతో
కలసివుండగా,పంచమమందు శని చంద్రు నితో కలసినను లేదా చూడబడినను
సంతానకారకుడు కుజునితోను,రాహువు లగ్నమునందు,పంచమాధిపతి
దుస్థా నమునందున్నను - పంచమము కుజస్థా నమై,రాహువుతో కూండి బుధునిచే
చూడబడినను - పై యెాగములన్ని సర్ప శాపయెాగములు అవుతాయి.
*ఫలితములు*- ఈ యెాగమునందు జన్మించినవారు సర్పశాప కారణముగా సంతానము
లేనివారగుదురు.
*వివరణ*- పైయెాగములను అనుసరించి పంచమస్థా నమునకు సంబంధించి అశీస్సులు లేదా
శాపములు సంతానము కలుగకపో వడానికో లేదా గర్భస్రా వములు అవ్వడానికో
కారణమౌతాయి.పై యెాగములందు పంచమము,పంచమాధిపతి,కారకడు మరియు రాహువు
ప్రధానముగా కారకులవుతారు.
*పితృశాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము* - రవి పంచమందుండగా నీచస్థా నమైనను లేదా మకర,కుంభ
అంశములైనను లేదా పాపగ్రహముల మధ్య ఉన్నను ఈయెాగము ఏర్పడును.
*ఫలితములు*- జాతకమందు ఈ యెాగము ఏర్పడిన పితృశాపము కారణంగా సంతానము
లేనివారగుదురు.
*మాతృశాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము*- అష్ట మాధిపతి పంచమమందు,పంచమాధిపతి అష్ట మమందు,చంద్రు డు
చతుర్థా ధిపతితో కూడి షష్ఠ మందున్నపుడు ఈ యెాగము ఏర్పడుతుంది.
*ఫలితములు*- తల్లి శాపము కారణంగా సంతాన నష్ట ము అవుతుంది.
*భాతృ శాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము* లగ్న పంచమాధిపతులు అష్ట మస్థా నమునందుండగా,తృతీయాధి పతి కుజ
రాహువులలో ఎవరితోనైనా కలసి పంచమమందుండగా ఈ యెాగము ఏర్పడును.
*ఫలితములు*- సో దర శాప కారణముగా సంతాన నష్ట ము అవుతుంది.
*వివరణ*- ఈ యెాగములో లగ్న,తృతీయ,పంచమ,అష్ట మ,రాహు,సో దర కారకుడైన
కుజుల మధ్యలో సంబంధము ఉండడం గవనించవచ్చును.కొద్ది కొద్దిగా భేదాలతో అనేక
రకములుగా ఈ యెాగము ఏర్పడుతుంది.పంచమాధిపతి కుజునితోను లేదా కుజుడు
రాహువు పంచమమునందున్నను ఈ యెాగము ఏర్పడుతుంది.ఇక్కడ ప్రధానమైనయది
తృతీయ,పంచమ స్థా నములు,కుజుడు వీరి పాపత్వములు ఇక్కడ ప్రధానమైన విషయమని
గ్రహించవచ్చును.
*ప్రేతశాప యెాగము*

*నిర్వచనము* -రవి,శనులు 5 నందు,క్షీణచంద్రు డు 7 లోను,రాహువు


లగ్నమందు,గురుడు 12 నందున్నపుడు అది ప్రేతశాపయెాగము అవుతుంది.
*ఫలితములు*- ప్రేతశాపములు లేదా పితృదేవతల శాపముల కారణంగా సంతాన నష్ట ము
కలుగును.
*వివరణ*- ఒక వక్తి మరణించడంతో స్ధూ లదేహమున వదలి అంత్య సంస్కారములు
పూర్త య్యేవరకు అనగా సుమారు రెండువారముల వరకు ఒకప్రత్యేకమైన రూపంతో ఉంటారని
శస్త మ
్ర ులలో చెప్పబడింది.ఈ రూపమునే ప్రేత రూపము అంటారు.ఆజీవి బ్రతికి ఉన్నపుడు
చేసుకున్న కర్మఫలమును అనుసరించి,వారి సంతానముచే ఆచరించబడిన ప్రేత
సంస్కారమును అనుసరించి ఏకరమైనస్థితి ఏర్పడేది ఇక్కడ నిర్ణయించ బడుతుంది.ఈ ప్రేత
సంస్కారము విధిని అనుసరించి జరుగనపుడు తరువాత స్థితిని చేరుకునే అవకాశము
లేకపో వడంతో ఈ ప్రేతముల కోపములు శాపములుగా ఆ కర్మను చేసన
ి వారిని బాధిస్తా యని
చెప్పబడింది.ఈ యెాగమునందు అటువంటి ప్రేతశాపములచే సంతాన నష్ట ము కలుగుతుందని
చెప్పబడింది.ఇది నిజమాకాదా అనే సంశయము లేకుండా కొన్నివిషయాలను నమ్మవలసి
వస్తు ంది.మరణమంటే భౌతిక శరీరమునుండి ఆత్మగా చెప్పబడే శక్తివెలువడి సూక్ష్మ శరీరాన్ని
ధరించి,ఆ జీవి స్థూ లశరీరంతో చేసుకున్న కర్మానుసారము తదనుగుణమైన రూపం
పొ ందుతుంది.మహర్షు లు తమ మనోనేతమ
్ర ులతో అతీంద్రీయ జ్డా నముతో ఆత్మ
పరిణామమును తెలుసుకున్నారు.మనకు తెలిసిన శాస్త మ
్ర ులలో మరణానంతరము
ఏమిజరుగుతుందనే విషయంపై ఎటువంటి వివరములు ఉండవు.మరణమంటే కేవలము
భౌతికశరీరాన్నివదలడం కాదని చెప్పవచ్చును.
బలహీనుడైన చంద్రడు సప్త మమునందు,రాహువు లగ్నమునందు,రవి శనులు
పంచమమందున్నపుడు,చంద్రు డు అనేక రకములుగా పాపత్వం పొ ందడంతో అనగా చంద్రు నితో
కేతు యుతి,శని రాహువుల దృష్టి ఏర్పడడం జరిగింది.జాతకములో
చంద్ర,రాహు,శనులసంబంధము ఏ విధంగా ఏర్పడినను అతీంద్రీయ
శక్తు లు,దెయ్యములు,పిశాచములు రూపములో ఇబ్బందులు కలిగిస్తా యి.
*మీ మిత్రు డు యస్ నాగేశ్వర శర్మ (ప్రకాష్)*

You might also like