You are on page 1of 39

స్థూ లం నుండి ప్రజ్ఞా మయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రా లను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది
సహస్రా రంగా వర్ణిస్తా రు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది,
ఏడవది యగు సహస్రా రమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే
నిర్వాణం. ఇదియే అద్వైతస్థి తి.

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ,


స్వాధిష్టా నం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును.
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం
వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తి యే.
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన
గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును
మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లో కం (రజస్సు), సువర్లో కం
(సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రా రచక్రం
గురించి తెలుసుకుందాం.

సహస్రా రచక్రం : -
సహస్రదళపద్మస్థా సర్వవర్ణో పశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థి తా సర్వతోముఖా సర్వౌదన
ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత


వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.

మస్తి ష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థా నం. పరమాత్మ
స్థా నం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం.
ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ
సహస్రా రం. పరిపూర్ణ జ్ఞా నానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


షట్చక్రా లు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ
అలసిపో తుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు.
ఈ చక్ర మానసిక స్వభావం -
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు.
తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థి తి. ఈశ్వరత్వం
పొందుతారు.
ఈ చక్రమును శుద్ధి చేసుకోవాలంటే -
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం,
బ్రహ్మతత్త్వజ్ఞా నం, స్థి తప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం
అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ
చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టు కునే
ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని,
మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత
సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రా రం శక్తివంతమై,
తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రా లు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి
మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా
కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ , సూర్యభగవానుని
శక్తి మన సహస్రా రం గుండా అన్నిచక్రా లయందు నిబిడీకృతమవుతున్నట్లు
భావిస్తూ , ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని
శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తు లవుతాం.

కుండలినీశక్తి స్థూ ల శరీరం నుండి ప్రజ్ఞా మయ శరీరం వరకు


వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర
దేవతలను ప్రా ర్ధించాలి. {ప్రా ర్ధన అంటే దైవస్మరణ మాత్రమే
కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి
ఏదో ఒకపేరుతో నుతించడం, స్తు తించడం కాదు, శ్లో కపూరితమైన
అనుష్టా నాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు
అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన,
శ్లో కమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును
ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని,
దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని
గ్రహించి అందుకు తగ్గ ప్రా ర్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి
కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను
అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని
పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో,
ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ ) సప్త చక్రా లను
చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన
సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తు న్న కొలది ... ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో
విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థి తులలోనూ
సంయమనం, స్థి తప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత
స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్త మస్థి తి తనంతటదియే
సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి
సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే.
ఈవిధంగా సరైనరీతిలో సప్త చక్రా లను సాధన చేస్తే , సంసారం నందు తిరిగి
జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధు లు కారు.

మనలో వున్న సప్త చక్రా లను చైతన్యవంతం చేసే సాధనతో స్థూ లంనుండి ప్రజ్ఞా మయం వరకు
పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థి తిని పొందడమే జీవన పరమావధి.
జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]

గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టా నం, మణిపూరక, అనాహత,


విశుద్ధ చక్రా లు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన
ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం -
ఆజ్ఞా చక్రం -

ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సో హం, సశ్శివ ఆజ్ఞా దిష్టా న


దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని.
ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార
ప్రీతి. ఈమె మజ్జా ధాతువునకు అధిపతి.
భ్రూ మధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో
అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థా నం మనస్సుకు మనకు సంధానం
చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది.
ధ్యానమను స్థి తిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు
కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం,
ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థి తి. 'హ'కారం, 'క్ష'కారం
అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థి తిని సూచిస్తుంది.
ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థి తి. ఈ
ధ్యానంను సాధన చేస్తే జ్ఞా ననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది.
ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థి తి బ్రహ్మత్వపు
స్థి తి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థి తి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి
జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞా ని అవుతాడు.

'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది.


స్థూ లశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్ల డ్ లో ఆక్సిజన్
సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం.
అందులోని వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా
పెంచటానికి ప్రా ణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన
వచ్చేశక్తి స్థూ లశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే
అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి,
తిరిగి పైకి వస్తూ స్వాధిష్టా న చక్రంలో చైతన్యం పొంది ప్రా ణశక్తిగా, జీవశక్తిగా
మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా
ఆజ్ఞా చక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి
క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ
కారణమౌతుంది. ఈ చక్రా న్నే దివ్యనేత్రమనీ, జ్ఞా నచక్షువనీ అంటారు.
అలానే ఈ స్థా నాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి
మరికొంత వివరణకై ఇక్కడ చూడండి.
ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞా నమయకోశంతో సంబంధం. శారీరక
వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థ తో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


రక్తక్షీణత, రక్తస్రా వం అను వ్యాధులు సంభవించును. వినాళ
గ్రంధులవ్యాధులు, అధిక రక్తపో టు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు
కలుగును.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపో వడం వలన మానసిక స్థి రత్వం లేకపో వటం, కనులలో
లోపాలు,క్షమాగుణం లేకపో వటం, నిరాశ నిస్పృహలతో కూడిన
అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.
తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థి రత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ
బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని
నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను
పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపో యినట్లు 'నేన'ను అహం
అంతర్యామి యందు కరిగిపో వును.
ఈ చక్రమును శుద్ధి చేసుకోవడం ఎలా???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు హాకీని అధిష్టా నదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ
చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి
అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను
బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు.
ఓంకారం వేదమునకు మొట్ట మొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై
ఇక్కడ ఓంకారం - 1&2 చూడండి.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం
ఇందుకు ఉపకరిస్తుంది.
ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రు డు. మనిషి మానసిక స్థి తికి, ధన
సంపాదనకు చంద్రు డు కారకుడు. చంద్రు డు ఎప్పుడూ ఒకేలా వుండడు.
వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రు డు సరిగ్గా
లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రు డు నీటికి కారకుడు.
అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రా గాలి. అలాగే చంద్రు డు
తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు
వస్త్రా లు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా
అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రా నుగ్రహం
సాధించినట్లే . తత్ఫలితంగా ఆజ్ఞా చక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
మాటే మంత్రం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఐదవభాగం]

అర్ధవంతమైన ఆదర్శవంతమైన జీవితానికి, నైతికవర్తనతో కూడిన


జీవనానికి ఆధ్యాత్మిక పురోగామిత్యమే మార్గదర్శకంగా వుంటుంది. ఈ
ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమో తెలియజేస్తు న్నాయి మన
శాస్త్రములు. శాస్త్రములు అంటే యోగులు, జ్ఞా నులు స్వానుభవం బట్టి
నిర్ణయించిన సరళధర్మములు. వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే
పారమార్ధికంగా పురోగతి సాధించవచ్చు.

నా అవగాహన మేరకు మనలో ఉన్న సప్త చక్రములు గురించి, ఆ


సప్త చక్రా లలో జాగృతి తీసుకువచ్చే సప్త గ్రహాలు గురించి తెలిపే ప్రయత్నం
కొన్ని టపాలా ద్వారా తెలియజేస్తు న్నాను.

ప్రతీ చక్రా నికీ, ప్రతీ గ్రహానికీ శారీరక, మానసిక, లేక ప్రా పంచిక,
పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము,
ఉత్తే జం కలిగించు శబ్ద ములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ
క్రమమైన పద్ధ తిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తి ల యందు
మార్పులు కలిగి ఆ చక్రా లలో తేడాలు సర్దు బాటుయగును. దానివలన
వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధ తిలో
ధ్యానించడం వలన అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక
వికారములు కూడా పో యి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన
సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన
యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా,
ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు.
గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న
చక్రా లుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం
చేయాలో సూచించారు. ఆ సూచన సద్గు ణాల సాధన. ఈ విధమైన అంటే
గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ,
ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా
అంతరంగం నుండి వికాసం నొందును. ధ్యానమంటే మనలో వున్న
మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు
వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం
సాధ్యమవుతుంది.
గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టా నం, మణిపూరక, అనాహత
చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన
విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాం -

విశుద్ధి చక్రం -

ఐం హ్రీం శ్రీం రాం సో హం హంసశ్శివం: విశుధ్యధిష్టా నదేవతాయై డాకినీ


సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః

ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని.


ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః
అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు
ప్రీతి. తెల్ల ని ఏనుగు (ఐరావతం) వాహనం.
కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344
నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి )
చేసేది అని అర్ధం. ఈ చక్రా న్ని సాధిస్తే పరమ పవిత్రు లై, ఆత్మదర్శనానికి
వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని
ఇతరులకు చక్కగా బో ధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో
విజ్ఞా నమయకోశంతో సంబంధం. జ్ఞా నేంద్రియం చెవి.

ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను


వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును
తెలిపేది వాక్కే. అందుకే పెద్ద లంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది'
అని! ఊరికే మాట్లా డడం కాదు, చక్కగా మాట్లా డగలగాలి. మృదుభాషణం
చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు,
వక్రభాషణం ఎన్నో అనర్ధా లను అంటగడుతుంది. మంచి స్నేహాలను,
మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది.
అలానే మాట్లా డకూడని సమయంలో మాట్లా డినా, మాట్లా డవలసిన
సమయంలో మాట్లా డకపో యినా పొందవలసిన జీవితం చేజారిపో యినట్లే .
ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధ చక్రమే.
మాట ఎలా వుండాలంటే ... వివరణకై ఇక్కడ చూడండి

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన
వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు
వచ్చును. మాటలు సరిగ్గా రాకపో వడం, ఎలర్జీ, ఆస్త మ, టాన్సిల్స్
మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత
కారణం.

ఈ చక్ర మానసిక స్వభావం:-


మూసుకుపో వడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక
అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది.

తెరుచుకుంటే వాక్సుద్ధి . కవితాశక్తి, స్వర విజ్ఞా నం, శాంతచిత్తం, శోకం


లేకపో వడం, దీర్ఘా యువు.

విజ్ఞా నమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం.


చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థి తిని
పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపో కుండా
ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞా నం కల్గు తుంది. అహం నశిస్తుంది.
నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న
భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి,
వాగ్మి, బ్రహ్మజ్ఞా ని అవుతాడు. భూత, భవిష్యత్తు , వర్తమానములను
దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల
జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా
జీవిస్తా డు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని
లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి,
ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం.

ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల


పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి
వరకు గల చంద్రు ని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రు డు
మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై
యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థి తిని
తెలియజేయును.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???


శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు డాకిని అధిష్టా నదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి.
ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను
బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ , 'హం' అను
బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం


చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది.
నిర్మలమౌతుంది.
ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన
గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు.
అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థి రత్వముందో,
ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపో తున్నా చలించని ఆత్మవిశ్వాసముందో,
ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి
అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి
పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి
చక్రం సానుకూలం.
ప్రేమమయం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [నాల్గ వభాగం]

గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టా నం, మణిపూరక చక్రముల


గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గ వ చక్రమైన అనాహతచక్రం
గురించి తెలుసుకుందాం -
అనాహతచక్రం :-
ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టా న దేవతాయై రాకినీ
సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః

ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క


ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ అను యోగినులచే
సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధో దన ప్రియా' అంటే స్నిగ్ధా న్నమందు
ప్రీతి గలది. జింక వాహనం.

హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో


19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే
జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థా నం. ఆగని శబ్ద బ్రహ్మం ఈ ప్రదేశంలో
నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తు వుల వల్ల ఉత్పన్నమైనది
కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రా న్ని జయిస్తే
సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ
దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత,
క్షమ అనేవి ఈ చక్రా నికి సంబంధించిన అంశాలు. దిగువనున్న
మూలాధారాది మూడుచక్రా లకు, ఎగువనున్న విశుద్ధా ది
మూడుచక్రా లకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని
అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం
చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం.
శారీరకవ్యవస్థ లోని శ్వాసకోశవ్యవస్థ తో సంబంధం. జ్ఞా నేంద్రియం చర్మం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు,
రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు
కల్గు తాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గు తుంది.

ఈ చక్ర మానసిక స్వభావం :-


మూసుకుపో వడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ
ప్రలాపనలు, మానసిక ఒత్తి ళ్ళు.
తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ
నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత
వికసించటం.

మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు,


లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా,
సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం
చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???


శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు రాకినిఅధిష్టా నదేవత. ఈమెకు స్నిగ్ధా న్నం నందు ప్రీతి.
స్నిగ్ధా న్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా
వున్నప్పుడు ఈ స్నిగ్ధా న్నం స్వీకరిస్తూ , వ్యాధులబట్టి అవసరమైనచో
తగు ఔషదములను వినియోగిస్తూ , బీజాక్షరం "యం" ధ్యానించువారికి
ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -


ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు
క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల
ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర
లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం
వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఇక ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ
సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు
గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది.
తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి
తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ , స్థి రంగా
ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ
చక్రం సక్రమముగా పనిచేస్తుంది.
సాధనా లక్ష్యం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి {మూడవభాగం}

గత రెండు టపాల్లో మూలాధారం మరియు స్వాధిష్టా న చక్రా ల గురించి


తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం గురించి
తెలుసుకుందాం -
మణిపూరకచక్రం :-
ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టా నదేవతాయై లాకినీ
సహిత వైష్ణ వ స్వరూపిణ్యాంబాయై నమః

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని.


ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను
యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొ ట్టే లు.
'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/
సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్ల పు పొంగలి ప్రీతి.

బొ డ్డు నకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536


నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది.
ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రా ణామయకోశంతో సంబంధం.
శారీరకవ్యవస్థ లోని జీర్ణవ్యవస్థ తో సంబంధం. జ్ఞా నేంద్రియం నాలుక.
పుట్టు ట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన
త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టా నం, మణిపూరకం అను
మూడు కేంద్రా లతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే
భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రా లు భౌతిక జీవితం సజావుగా
సాగడానికి సహకరిస్తా యి.

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు
కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లు వలన జీర్ణశక్తి
మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గు తాయి. ఉదరకోశ
వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు,
అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గు తాయి.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపో వడం వలన కీర్తికండూతి, పెత్త నం చెలాయించాలనే అహం,
అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూ రత్వం, కటుత్వం,
స్వలాభపరులు, స్వార్ధపరులు. తనను గురించి తాను తక్కువగా
ఆలోచిస్తూ కుంగిపో వడం.

తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి , వ్యవహార దక్షత, ఉత్సాహం,


ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం
కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు.
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి
చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ , అన్నింటినీ అవగాహనతో
విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞా నంలను అలవర్చుకుంటూ
ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం,
అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు


ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం.
సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని,
నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని,
అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపో క
ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది
గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు
బెల్ల పు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్ల పు పులగంను
స్వీకరిస్తూ , వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను
వినియోగిస్తూ , బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన
వచ్చే బాధలు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -


అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం
గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్ల నీయాలి.
దీర్ఘంగా శ్వాసించడం చేయాలి.
అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు
కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి.
సప్త చక్రా లలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా
నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు
నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే.
చెడు అలవాట్లు జోలికి పో కుండా, ముందొకటి వెనుకొకటి మాట్లా డక,
నాస్తి కత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం
సక్రమంగా పనిచేస్తా యి.

ముఖ్యగమనిక :-
కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం
జలతత్త్వంనకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు
సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలదిగా నిర్ధా రణ
చేసుకోవచ్చు.

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా


స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది.


అంధకారంను పో గొట్టు మెరుపుతో గూడినది. నానావిధ
రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే
తప్తంలైన ముల్లో కములను చల్ల పరుచును.
సాధనాసో పనం --- చక్రశుద్ధి -ఆనందసిద్ధి {రెండవభాగం}

క్రిందటి టపాలో మొదటిచక్రమైన మూలాధారం గురించి తెలుసుకున్నాం.


ఇప్పుడు రెండవచక్రమైన స్వాధిష్టా నం గురించి తెలుసుకుందాం -

స్వాధిష్టా నచక్రం :-

ఐం హ్రీం శ్రీం కాం సో హం స్వాధిష్టా నదేవతాయై కాకినీ సహిత


బ్రహ్మస్వరూపిణ్యైనమః

ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె


బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం
మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త
హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టా నదేవతయైన
ఈమెకు పెరుగన్నం ప్రీతి.
స్వాధిష్టా నం (స్వ + అధిష్టా నం) తనను తానుగా సమాజంలో
నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది
సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను
అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది.

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం


మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో
ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రా ణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు
ప్రా ణశక్తినిచ్చే చక్రమిదే. జీవునకు తల్లి గర్భమునందు స్థా నమేర్పడుటకు
మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా
ఏర్పడుటకు కావాల్సిన ప్రా ణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది.
ఈ ప్రా ణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని
ఉష్ణో గ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి
తోడ్పడుతుంది. ప్రా ణవాయువు ఊపిరితిత్తు లనిండా వ్యాపించటానికి ఈ
చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో
ప్రా ణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థ లోని విసర్జక వ్యవస్థ తో
సంబంధం. జ్ఞా నేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది.
పునరుత్పత్తి కు సహాయకారి. దీనిలోశక్తి చైతన్యరూపంలో మనిషిలో
ప్రవహిస్తూ ప్రా ణమయ కోశానికి శక్తినందిస్తుంది
ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -
శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు
లాంటి రుగ్మతలకు కారణమౌతుంది.

ఈ చక్ర మానసిక స్వభావం -


మూసుకుపో వడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై
ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రో ధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం,
వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు.
స్వాధిష్టా నం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది. జీవియందలి
'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు
తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది
జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది.
తానేమిటో మర్చిపో యిన మనిషి ఆ మరిచిపో యిన సత్యానికై బయట
దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా
గోచరిస్తుందని భ్రమిస్తు న్నాడు, బయట నుండి సంపాదించవచ్చని
ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని
తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో,
పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే
రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది ఈ
చక్రశుద్ధి వలనే .
ప్రా ణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రా న్నిఅధిగమిస్తే
ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గు తుంది.
అలానే ఈ నాడీకేంద్రం అంతర్గత సంస్కారానికి వేదిక.

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???


శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు కాకిని దేవత. మేధోదాతువునకు అధిష్టా నదేవతయైన
ఈమెకు పెరుగన్నం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను
బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి
ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో
కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ , బీజాక్షరం "వం" ధ్యానించువారికి
ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గు ణాలను


అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ,
చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే
అహింస) ఆచరించాలి.
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రు డు. ఉల్లా సనికీ, మర్మాంగలకు,
కామప్రకోపానికీ అధిపతి శుక్రు డు. ఈ శుక్రు డు విశేషించి స్త్రీల జబ్బులకు
కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే -
హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం,
రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు
భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో
పాల్గొంటూ, ఒకింత కళాపో షణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రా న్ని
జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన
భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం
లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టా నం
అనుకూలించి జాగృతి అవుతుంది.

ముఖ్య గమనిక :-
కొందరు ఈ చక్రం జలతత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం అగ్ని
తత్త్వంకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో
తెలిపిన పద్యం ఓసారి గమనిస్తే ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధా రణ
చేసుకోవచ్చు.
తవస్వాదిష్టా నే హుతవహ మధిష్టా య నిరతం
తమిళేసంవర్తం జనని మహతీంతాం చ సమయాం
యదాలోకేలోకాన్ దహతి మహతి క్రో ధకలితే
దయార్ద్ర యాదృష్టి: శిశిర ముపచారం రచయితి
అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థా నమగు స్వాదిష్టా న కమలమున ప్రళయాగ్ని
జ్వాలారూపమైన శక్తి ద్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తు ల వలన
జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక
కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.
చక్రశుద్ధి - ఆనందసిద్ధి

ప్రతీ సాధకుడు ముందుగా ఈ విషయాల్ని గ్రహించాలి - 'ప్రా పంచికం,


పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం' అని.
'సానుకూలదృక్పదం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్
స్పృహ ... వీటన్నిటి సమాహారమే ఆధ్యాత్మికత' అని. 'మానసిక
కాలుష్యాన్ని తొలగించడమే ఆధ్యాత్మిక సాధన' అని. ఇహ పరంలో దేనిని
సాధించాలన్న ఆరోగ్యం చక్కగా ఉండాలి.
ఇక్కడ మరో విషయం గ్రహించాలి - ఆరోగ్యం అన్నది శరీరానికి మాత్రమే
సంబంధించినది కాదు, మనస్సుకీ, మనుగడకీ కూడా! ఇక ఈ
విషయంలో మన ప్రా పంచిక, పారమార్ధిక జీవన గమనంలో సప్త చక్రా లు
ఎలా పనిచేస్తు న్నాయో ఓసారి పరిశీలిద్దాం -

ఒకానొక ఆదిశక్తి నుండి సృష్టించే శక్తి, పెంచి పో షించే శక్తి, లయించే శక్తి
ఉద్భవించి, అందులో నుండి మరెన్నో కోట్లా ది శక్తు లు ఆవిర్భవిస్తూ ఈ
సృష్టి కొనసాగుతుంది.
విశ్వమునందు, సౌరమండలమునందు, భూమియందు,
మానవదేహమునందు ఏడు ప్రజ్ఞా మయ కేంద్రములు పనిచేయుచున్నవి.
విశ్వమునందలి ఏడులోకములకు (సత్యలోకం, తపో లోకం, జనోలోకం,
మహర్లో కం, సువర్లో కం, భువర్లో కం, భూలోకం)సప్త ర్షిమండలం అధ్యక్షత
వహించుచుండగా, సౌరమండలమునందలి ఏడులోకములకు
ఏడుగ్రహములు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని)అధిపతులుగా
వున్నవి. మానవదేహమునందు ఏడు ప్రజ్ఞా మయకేంద్రా లుగా వెన్నెముక
వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్న సప్త చక్రా లకు (మూలాధార,
స్వాధిష్టా న, మణిపూరక, అనాహత విశుద్ధి , ఆజ్ఞా , సహస్రా రచక్రములు)
పరాశక్తు లు ఏడుగురు (సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని,
యాకిని) ఆధిపత్యం వహించుచున్నారు.
ఈ సప్త లోకాలంటే ఏమిటో, శక్తిచక్రా లంటే ఏమిటో, సప్త గ్రహాలంటే ఏమిటో,
అవి శారీరక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక పరిణితికీ ఏ విధంగా
దోహదపడతాయో తెలుసుకుందాం.

మన శరీరంలోని సప్త చక్రా లు సప్త లోకములతో ఏయే స్థా నాల్లో ఏయే


గ్రహాలతో సంధానింపబడిందంటే -
7. సహస్రా రం - సత్యలోకం - ప్రమాతస్థా నం - రవి
6. ఆజ్ఞా చక్ర - తపో లోకం - జీవాత్మస్థా నం - చంద్రగ్రహం
5. విశుద్ధ చక్రం- జనలోకం - ఆకాశభూతస్థా నం - కుజగ్రహం
4. అనాహతం - మహర్లో కం - వాయుభూతస్థా నం - బుధగ్రహం

3. మణిపూరకం - సువర్లో కం - జలభూతస్థా నం - గురుగ్రహం


2. స్వాధిష్ఠా నం - భువర్లో కం - అగ్నిభూతస్థా నం - శుక్రగ్రహం
1. మూలాధారం - భూలోకం - పృథ్వీభూతస్థా నం - శని గ్రహం

విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రా లు ద్వారా ప్రవహిస్తుంది.


ఈ ఏడు దేవతా శక్తు ల ఆధీనంలో పనిచేస్తు న్నాయి. ఒక్కో శక్తిచక్రం
ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రా లు శారీరక
వ్యవస్థలతోనూ, మానసిక స్థి తులతోనూ సంబంధం కలిగియుంటాయి.
అలానే ప్రతిచక్రా నికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు
ఉంటాయి.పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రా రబ్దా లు) బట్టి ఈ చక్ర,
గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రా ల ద్వారా శరీరంలోనికి సరఫరా
చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు
అనుగుణంగా జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గు లు వ్యక్తీ మనస్సు
పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది.

ముందుగా మూలాధారచక్రం గురించి తెలుసుకుందాం


-

మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టా న దేవతాయై సాకినీసహిత గణనాధ
స్వరూపిణ్యైనమః
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థి తా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా
ముద్గౌ దనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది.
అధిష్టా నయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రా లు త్రినేత్రా లు కలిగి
సృణి,కమలం, పుస్త కం, జ్ఞా నముద్ర ధరించి, ఆస్థి ధాతువునాకు
అధిపతియై యున్నది. ముద్గా న్నప్రీతి కలది. వ శ ష స అను
యోగినీ శక్తు లచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది.
నల్ల ని ఏనుగు ఈమె వాహనం.

వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రా నికి సుమారు రెండు


అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776 నాడులతో
సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం.
ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర
శక్తు లన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక
మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో
అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థ తో
సంబంధం. జ్ఞా నేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది
మూలస్థా నం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి,
ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్ల నే.
జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్ల నే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది
యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపో తే పునసృష్టి
జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి
జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది.
బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను
అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధి కి అవసరమైన శక్తిని ధ్యానయోగం
ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి.
బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై ఇక్కడ చూడండి.

ఈ చక్రం శక్తివంతంగా లేకపో తే -


శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల
బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బో న్ కేన్సర్,
లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం,
గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు
కారణభూతమౌతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపో వడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం,
ఆక్రమణతత్త్వం, అస్థి రత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం.
ప్రా పంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థి తిలో వుంటుంది.
తెరుచుకుంటే ధైర్యం, స్థి ర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద
మమకారం, పారమార్ధికజ్ఞా నం కల్గు తాయి.
అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి ఎముకలపుష్టిని
అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌ దనా సత్తా చిత్తా ' అని వర్ణింపబడింది.
అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా
శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ
పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దు బాటగును.
వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ ,
బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు.
శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ
పుట్టు కొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన
అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం
మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి
ప్రా రబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది అసంగతమైనవి. పరిస్థి తికి ఎంతమాత్రం
పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.
చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని,
తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు -
'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన
జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన
అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి
మాట్లా డటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి
శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధ తులను బో ధించారు. మనిషిని
శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం
ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు
ఏమిటంటే -
మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం,
మొక్కలు చెట్లు ను కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం,
ధ్యానం చేయడం.
మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన
సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే
విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు
ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధ కస్తు లను
ముదుసలివారిపట్ల , రోగులపట్ల , ఆకలిగొన్నవారియందు అలక్షంగా
వున్నవారిని తీవ్రంగా దండిస్తా డు. కాబట్టి కష్టించి పనిచేసే తత్త్వం,
సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం
పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు.
ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ,
సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞా నసిద్ధి ని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా
మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన
సాధనములు) సేవ స్థూ లంగా మనస్సుని శుద్ధి చేస్తే , ధ్యానం సూక్ష్మంగా
మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తే గాని ధ్యానం చేసే శక్తి కలగదు,
ధ్యానం చేస్తే గాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే , చేసే సేవ
పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా
వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది.
సేవ వలన చిత్త శుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది.
అహంకారాన్ని జయించటమే ఈ చక్రా న్ని జయించటమౌతుంది.

You might also like