Professional Documents
Culture Documents
స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు
స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు
ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రా లను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది
సహస్రా రంగా వర్ణిస్తా రు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది,
ఏడవది యగు సహస్రా రమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే
నిర్వాణం. ఇదియే అద్వైతస్థి తి.
గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రా రచక్రం
గురించి తెలుసుకుందాం.
సహస్రా రచక్రం : -
సహస్రదళపద్మస్థా సర్వవర్ణో పశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థి తా సర్వతోముఖా సర్వౌదన
ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ
మస్తి ష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థా నం. పరమాత్మ
స్థా నం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం.
ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ
సహస్రా రం. పరిపూర్ణ జ్ఞా నానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.
ఈ విధంగా సాధన సాగిస్తు న్న కొలది ... ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో
విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థి తులలోనూ
సంయమనం, స్థి తప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత
స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్త మస్థి తి తనంతటదియే
సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి
సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే.
ఈవిధంగా సరైనరీతిలో సప్త చక్రా లను సాధన చేస్తే , సంసారం నందు తిరిగి
జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధు లు కారు.
మనలో వున్న సప్త చక్రా లను చైతన్యవంతం చేసే సాధనతో స్థూ లంనుండి ప్రజ్ఞా మయం వరకు
పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థి తిని పొందడమే జీవన పరమావధి.
జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]
ప్రతీ చక్రా నికీ, ప్రతీ గ్రహానికీ శారీరక, మానసిక, లేక ప్రా పంచిక,
పారమార్దికంగా విధులు ఉంటాయి. ప్రతీ చక్రకేంద్రమునకు ఉద్భోదనము,
ఉత్తే జం కలిగించు శబ్ద ములు లేక అక్షరములు కొన్ని కలవు. వీటిని ఓ
క్రమమైన పద్ధ తిలో ఉచ్చరించుటవలన ఈ కేంద్రముల ప్రవృత్తి ల యందు
మార్పులు కలిగి ఆ చక్రా లలో తేడాలు సర్దు బాటుయగును. దానివలన
వ్యాధులు నిర్మూలనమగును. ఈ బీజాక్షరములను సరైన పద్ధ తిలో
ధ్యానించడం వలన అనారోగ్యములు తొలగడమే కాకుండా మానసిక
వికారములు కూడా పో యి బుద్ధి వికసించును. అయితే ఈ విధమైన
సాధన కష్టమని భావించేవారికి కొన్ని సులభమార్గములను మన
యోగులు సూచించారు. గ్రహాలను సానుకూలపర్చుకోవడం ద్వారా,
ధ్యానసాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమేనని తెలిపారు.
గ్రహాలనుండి అనుగ్రహ ప్రవాహాన్ని స్వీకరించే శక్తి మనలో వున్న
చక్రా లుకు వుంది. అందుకే గ్రహాలను సానుకూలంగా పనిచేయాలంటే ఏం
చేయాలో సూచించారు. ఆ సూచన సద్గు ణాల సాధన. ఈ విధమైన అంటే
గ్రహాలను సానుకూలపరుచుకునే సాధన సాగించిన కొలదియు భక్తీ,
ధ్యానం, చక్రజాగృతి, ఆత్మార్పణం ... ఇతరసుగుణములు ఒకటొకటిగా
అంతరంగం నుండి వికాసం నొందును. ధ్యానమంటే మనలో వున్న
మాలిన్యాన్ని తొలగించుకోవడమే. ధ్యానం ద్వారా మాత్రమే మనస్సుకు
వారసత్వంగా సంక్రమించిన స్వభావంనుండి విడుదల కావడం
సాధ్యమవుతుంది.
గత నాలుగు టపాల్లో మూలాధారం, స్వాధిష్టా నం, మణిపూరక, అనాహత
చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదవ చక్రమైన
విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాం -
విశుద్ధి చక్రం -
ముఖ్యగమనిక :-
కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం
జలతత్త్వంనకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు
సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలదిగా నిర్ధా రణ
చేసుకోవచ్చు.
స్వాధిష్టా నచక్రం :-
ముఖ్య గమనిక :-
కొందరు ఈ చక్రం జలతత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం అగ్ని
తత్త్వంకు సంబంధించినది. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో
తెలిపిన పద్యం ఓసారి గమనిస్తే ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధా రణ
చేసుకోవచ్చు.
తవస్వాదిష్టా నే హుతవహ మధిష్టా య నిరతం
తమిళేసంవర్తం జనని మహతీంతాం చ సమయాం
యదాలోకేలోకాన్ దహతి మహతి క్రో ధకలితే
దయార్ద్ర యాదృష్టి: శిశిర ముపచారం రచయితి
అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థా నమగు స్వాదిష్టా న కమలమున ప్రళయాగ్ని
జ్వాలారూపమైన శక్తి ద్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తు ల వలన
జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక
కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.
చక్రశుద్ధి - ఆనందసిద్ధి
ఒకానొక ఆదిశక్తి నుండి సృష్టించే శక్తి, పెంచి పో షించే శక్తి, లయించే శక్తి
ఉద్భవించి, అందులో నుండి మరెన్నో కోట్లా ది శక్తు లు ఆవిర్భవిస్తూ ఈ
సృష్టి కొనసాగుతుంది.
విశ్వమునందు, సౌరమండలమునందు, భూమియందు,
మానవదేహమునందు ఏడు ప్రజ్ఞా మయ కేంద్రములు పనిచేయుచున్నవి.
విశ్వమునందలి ఏడులోకములకు (సత్యలోకం, తపో లోకం, జనోలోకం,
మహర్లో కం, సువర్లో కం, భువర్లో కం, భూలోకం)సప్త ర్షిమండలం అధ్యక్షత
వహించుచుండగా, సౌరమండలమునందలి ఏడులోకములకు
ఏడుగ్రహములు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని)అధిపతులుగా
వున్నవి. మానవదేహమునందు ఏడు ప్రజ్ఞా మయకేంద్రా లుగా వెన్నెముక
వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్న సప్త చక్రా లకు (మూలాధార,
స్వాధిష్టా న, మణిపూరక, అనాహత విశుద్ధి , ఆజ్ఞా , సహస్రా రచక్రములు)
పరాశక్తు లు ఏడుగురు (సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని,
యాకిని) ఆధిపత్యం వహించుచున్నారు.
ఈ సప్త లోకాలంటే ఏమిటో, శక్తిచక్రా లంటే ఏమిటో, సప్త గ్రహాలంటే ఏమిటో,
అవి శారీరక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక పరిణితికీ ఏ విధంగా
దోహదపడతాయో తెలుసుకుందాం.
మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టా న దేవతాయై సాకినీసహిత గణనాధ
స్వరూపిణ్యైనమః
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థి తా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా
ముద్గౌ దనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది.
అధిష్టా నయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రా లు త్రినేత్రా లు కలిగి
సృణి,కమలం, పుస్త కం, జ్ఞా నముద్ర ధరించి, ఆస్థి ధాతువునాకు
అధిపతియై యున్నది. ముద్గా న్నప్రీతి కలది. వ శ ష స అను
యోగినీ శక్తు లచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది.
నల్ల ని ఏనుగు ఈమె వాహనం.