Professional Documents
Culture Documents
గాయత్రి మంత్ర ప్రయోజనాలు
గాయత్రి మంత్ర ప్రయోజనాలు
మూడు సంధ్య ల్లోనూ గాయత్రీ మంత్రాన్ని జపించడం, సంధ్యావందనం చేయడం విధి. ఆ విధంగా
చేస్తే దరిద్రాలు తొలగడం, పితృదేవతలకు తృప్తి, వంశవృద్ధి, గ్రహ దోషాలు సమసిపోవడం, సుఖ
జీవనం, చేసిన పాపాలు నశించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కులదేవతారాధన
భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ
కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టా లు చవి చూస్తు న్నాయి. సంతానం
లేకపోవడం , భార్యా-భర్తల మధ్య మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య
మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....ఇలాంటి వన్నీ కుల
దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తా యి.
విశ్వబ్రాహ్మణుల కులదైవం మహామ్మాయి – ఆమే కాళికాంబ, దశమహా విద్యల్లో మొదటిది కాళి.
కాలమనే మాటలోంచి పుట్టినది కాళి. ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో,
పురాణములలో ఎన్నో కధలున్నాయి. రామకృష్ణ పరమహంస ను అనుగ్రహించినది, వివేకానందుడిని
భరత భూమికి ప్రసాదించిన శక్తి ఈమే, కాలాన్ని నడిపించేది, సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టేదీ
కాళికాదేవి. "మానవులలో విజయం సాధించాడినికున్న మొదటి విఘ్నం వాళ్ళ భయం. చేసే ప్రతి
పనిని, విషయాన్ని బూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి
బానిసలై అనుక్షణం ఛస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరంచేసే నిర్భయ శక్తి ఆ కాళి”
అలాంటి కాళికా మూర్తు ల వర్ణన ఏమిటంటే- 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక
4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక.
గురు ఆరాధన
హైందవం గురువును ఒక వ్యక్తికాదు ఒక శక్తి, ఒక వ్యవస్థ గా భావిస్తుంది. తిమిరాంధకారాన్ని
పారద్రోలేవానిగా గురువు మహోన్నతస్థా నంలో కీర్తించ బడుతాడు. గురు అనుగ్రహాన్ని పొందిన వారికి
త్రిమూర్తు లు సైతం కింకరులుగానే ఉంటారు.
గురు స్థా నం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నలువైపులకు ప్రసరింప
చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. 'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే
నిరోధించేవాడు అని అర్ధం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుకనే గురు స్థా నానికి
ప్రాముఖ్యత ఉంది. ‘గురుర్బ్ర హ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ
గురవేనమః అంటూ నిరంతరం మన గురువు లను స్మరించుకోవాలని మన సనాతన హైందవ ధర్మం
చెపుతోంది. విశ్వబ్రాహ్మణుల కుల గురువైన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని అనుగ్రహానికి
పాత్రత సంపాదించిన విశ్వబ్రాహ్మణులు తమ పూర్వవైభవంతో ఈ జగాన వెలుగొందుదురునుటలో
సందేహం లేదు.