ఈసందర్భ ములో ఒక కథ గుర్తు కు వస్తోంది. ఇది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. ఒకసారి దండి,భవభూతి,మరియు కాళిదాసు _ఈ ముగ్గు రిలో ఎవరు గొప్ప వారు అనే వాదన వచ్చింది.ఎవరికి వారు తామే గొప్ప వారమనే నమ్మకం ఉంది.ఎటూ తేలకపోతే చివరకు సరస్వతీ దేవినే అడిగి తెలుసు కుందామనే నిర్ణ యానికి వచ్చారు.వారు ముగ్గు రూ సరస్వతీ దేవిని ప్రా ర్థి స్తా రు.అప్పుడు ఆ దేవత ప్ర త్యక్ష మై సమస్య తెలుసు కునిఇలా సమాధానం చెబుతుంది. "కవిర్దండీ కవిర్దండీ భవభూతిస్తు పండితః " అని చెప్పిందట. అసలు కాళిదాసు మహాకవిగదా.ఆయన గురించి ఏమీ చెప్పలేదు. కానీ దండి _కవి,కవి అని రెండు సార్లు చెప్పింది. భవభూతి మాత్రం పండితుడు అని చెప్పింది. దానితో కాళిదాసు కు చాలా కోపం వచ్చింది. అప్పుడు ఇలా అడుగుతాడు. "కోహం రం…"అని అడిగాడట. అప్పుడు అమ్మ వారు ఇలా చెప్పిందట. " త్వమేవాహం త్వమేవాహం న సంశయః" నేనే నీవు, నీవేనేను.ఇందులో సందేహం లేదు. చివరకు దండి గొప్ప తనం, భవభూతి గొప్ప తనం ఎవరైనా సాహిత్య వేత్త లు చెబితే ధన్యుడను అవుతాను. నాకు తెలిసి నంత ల పండితులు ఎవరో ,కవి ఎవరో కొంచెం చెప్పే సాహసం చేస్తా ను. వి ద్యా వినయసంపన్నే బ్రా హ్మణే గవి హస్తి ని శునిశ్చ శ్వపాకేచ పండితాః సమదర్శినః విద్యా వినయ సంపఅన్నుడైన బ్రా హ్మఅణుని,గోవును,ఏనుగును,కుక్కను,కుక్కమాంసముతో చేసే వంటకమును కూడా ఒకటేనని భావించేవారు పండితులు. ఇది గీతావాక్యము. రవిగాంచనిచో కవి గాంచునే అని అన్నారు.సూర్యుడు చూడని దానిని కూడా చూడ గలిగే వాడు కవి.