Professional Documents
Culture Documents
ఒగ్గు కథలు - వికీసోర్స్
ఒగ్గు కథలు - వికీసోర్స్
కళారూపాలు/బగ్గు గొల్లల
ఒగ్గు కథలు
< తెలుగువారి జానపద కళారూపాలు
కురుమల కథ:
మల్లన్న బీరప్ప కథలను కురుమలు చెప్పుకుంటారు. అవే ఒగ్గు కథలు. ఈ
కురమలనే బగ్గు వాళ్ళు, ఒగ్గో ళ్ళు అనే పేర్లు . ప్రస్తు తం వీరు ఆ రెండు
కథలనే కాక ఇతర కథలను కూడ చెపుతున్నారు. ముఖ్యంగా మల్లన్న
కథను కురుమల వివాహ సందర్భాలలో చెపుతూ వుంటారు. ఈ కథలను
చెప్పే కురుమలే ఆ కులంలో పురోహితులు. మల్లన్న కథను చెప్పిన
తరువాతే కురుమ వధూవరులకు వివాహం జరిపిస్తా రు. వీరికి కూడ
గ్రా మాలు, తాలూకాలు హద్దు లుండేవట . ఒకరి హద్దు లోకి మరొకరు వచ్చి
వివాహాలు చేయకూడదట . పురోహితుడు కూడ ఇతర సమయాల్లో కథలు
చెప్పకూడదట . దీన్ని అతిక్రమిస్తే కులబహిష్కారం వుంటుందట . చుక్కా
సత్తెయ్య అనే నేటి ప్రసిద్ధ ఒగ్గు కథకుడు ఒకప్పుడు బహిష్కార శిక్షకు
గురయ్యాడని చెపుతారు. అతను ఈ కథను కళారూపంగా ప్రచారంలోకి
తెచ్చి ధనాన్ని, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించిన తరువాత కురుమ
కులగురువులు అతనినే ఆశ్రయించి, అతని మార్గంలోనే కుల హద్దు ల్ని
పాటించ కుండా ఈ కథలను చెపుకున్నారనీ, అలా ఈ ఒగ్గు కథ ఒక
కళారూపంగా రూపు దిద్దు కున్నదనీ బిట్టు వెంకటేశ్వర్లు గారు అంటున్నారు.
చుక్క సత్తయ్య:
ఈ నాడు ఒగ్గు కథను ప్రతిభావంతంగా చెపుతూ , దాని కొక మన్నననూ ,
గుర్తింపునూ కలగ జేసి అది ఒక వుత్తమ జానపద కళారూపమని
నిరూపించిన వారు వరంగల్ జిల్లా జనగామ వాస్తవ్యులు చుక్క సత్తయ్య
గారు. ఆయన ఒగ్గు కథను గురించి ఈ విధంగా వివరిస్తు న్నారు.
కథా బృందం:
ఈ ఒగ్గు కథలు చెప్పే వారు అయిదు నుంచి పది మంది వరకూ వుంటారు.
అయితే ఇంత మంది వుండాలనే నబంధా లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి
బృందాలను ఎర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిగురు
సభ్యులైనా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రధాన కథకుడు.
మరొకరు సహాయకుడు. వీరిద్ద రూ ముందు భాగంలో వుంటారు. వారి
వెనుక భాగంలో ముగ్గు రు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు
తాళం , ఇంకొకరు కంజిరా ధరిస్తా రు. వీరందరూ ఒక వంక వాయిద్యాన్ని
సాగిస్తూ వంత గానాన్ని కూడ అందుకుంటారు. ప్రధాన కథకుడు
సందర్భాన్ని బట్టి ఆ యా పాత్రలు ధరిస్తూ కథాగానం చేస్తూ వుంటాడు.
వంత దారుడు కూడ పాత్ర ధారణలో సందర్భాన్ని బట్టి సహకరిస్తూ
వుంటాడు. వీరిరువురూ పాత్రా నుగుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని
మారుస్తూ వుంటారు. అయితే ఈ ఆహారం మార్పుల్లో కథ ఏమాత్రం
కుంటుపడదు.
స్త్రీ వేషం:
ప్రథాన కథకుడే చీర కట్టి , కొప్పు పెట్టి ,ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తా డు.
ఇప్పటి వరకూ ఈ కథ తెలంగాణా హద్దు లు దాటి లేదు. కథనంలో ముఖ్య
కథకుడు, ముఖ్యవంత లిద్ద రూ ఒకే రకమైన నటనను అభినయిస్తా రు.
ఏడమచేతిని చెవికి అడ్డంగా గానీ నడుంపైనగానీ పెట్టి , కుడి చేతిని పైకి ఎత్తి
కథను వివరిస్తూ కథానుగుణంగా చేతితో అభినయిస్తా రు. ప్రధాన కథకుని
రాగాన్ని అందరూ అందుకుంటారు. పాత్రకు తగినట్లు స్త్రీ పాత్రల
సందర్భంలొ కంఠాన్ని స్త్రీలా అనుకరిస్తా రు. చేతులు తిప్పడంలోనూ ,
మూతి తిప్పడంలోనూ , శోకాలు పెట్ట డంలోనూ , సిగ్గు ను
అభినయించడంలోనూ , స్త్రీ పాత్రభినయాన్ని చక్కగా ఆభినయిస్తా రు.
తాళాలు డోలు మాత్రం ప్రా రంభం నుండీ చివరి దాకా ఉపయోగిస్తా రు.
"https://te.wikisource.org/w/inde
x.php?
title=తెలుగువారి_ జానపద_ కళారూపా
లు/
బగ్గు _ గొల్లల_ ఒగ్గు _ కథలు&oldid=2149
46" నుండి వెలికితీశారు