Professional Documents
Culture Documents
SriDosageetha by Neti Suryanarayana Sarma
SriDosageetha by Neti Suryanarayana Sarma
రీ దోసగీత
నేతి సూర్యనారాయణ శర్మ
శ్రీదోసగీత a 150
చంపను. ఎప్పుడూ ఏదో ఒకటి తినబెట్టడానికే ప్రయత్నిస్తుంటాను. కానీ మీ
మానవులేం చేస్తారంటే దొరికింది దొరికినట్లు ఆబగా తినేస్తూ, పుట్టింది మొదలు
తిన్నది అరిగించుకునే శక్తిని రోజుకు కొంత చొప్పున చంపుకుంటూ ఉంటారు.
అయినా పోన్లే ఆ సన్నాసుల్ని వదిలేద్దాం అని నేనెప్పుడూ అనుకోను. దేహం
విడిచిన జీవుడికి కొత్త దేహాన్ని ప్రసాదిస్తూ ఉంటాను. కర్మఫలాన్ని అనుభవింప
చేస్తుంటాను. మళ్లీ నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లు పూటపూటకూ నైవేద్యం
పెడుతూనే ఉంటాను. పార్ధా! అదీ సంగతి’’ అన్నాడు కృష్ణుడు ఒకచేతిలో
పిల్లనగ్రోవిని, రెండోచేత అభయముద్రను ఓపిగ్గా కంటిన్యూ చేస్తూ.
‘‘బావా! మహానుభావా! నాకింకో డౌటు పీకుతోంది. నాలుగు కూరలు,
నాలుగు పచ్చళ్లలో నీకే కూరంటే ఇష్టం? పప్పుతో మిళాయించినా, ఉత్తగా పోపేసి
దింపేసినా ఏ కూర అన్నింటిలోనూ శ్రేష్టమైనది? ఏ కాయగూరతో పచ్చడి చేస్తే
భగవంతునివైన నువ్వు మెచ్చుకుంటావు? అన్నట్టుగా మర్చేపోయాను... పన్లోపనిగా
దప్పళం సంగతి కూడా చెప్పు బావా!’’ మోకాళ్లపై నిలిచి ప్రార్థనగా అడిగాడు
పాండవ మధ్యముడు.
‘‘అర్జునా! అప్పుడే మనం గీతలోని పదిహేనో అధ్యాయంలోకి వచ్చేశాం.
ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇంతకుముందే నీకు నా విశ్వరూపం చూపెట్టాను.
అది చూశాక అయినా నీ అనుమానాలన్నీ పటాపంచలు కావాల్సింది. కానీ నువ్వేమో
జడుసుకున్నావు. అందుకే ఏదైనా సూక్ష్మంలో మోక్షంలా ఉండాలని నా ప్రవచనం
మరికొంచెం పొడిగించాను. ఇప్పుడు చెబుతున్నాను విను. పురుషోత్తముడైన నన్ను
సూక్ష్మంలో ఎక్కడైనా చూడవచ్చు. హాయిగా చూడాలనుకుంటే దోసకాయలో చూడు.
గమ్మత్తేంటంటే దాంట్లో అస్సలు ఫ్యాట్ ఉండదు. వెయిట్ లాస్ కి చాలా మంచిది.
పోతే దానిక్కూడా శివుడికి ఉన్నట్లే మూడుకళ్లుంటాయి. కాస్త వెనక్కి తిప్పిచూడు.
అంబకం అంటే తండ్రి, కన్ను, బాణం అని మూడు అర్థాలున్నాయి. శివయ్య
మూడు కన్నుల తండ్రి. ఆయన ధనుస్సుకు మూడు బాణాలుంటాయి. అవే అన్నము,
వాతము, వర్షము. ఇలా చెబితే అందరికీ అర్థం కాదేమో అని ఆ మూడింటికీ మరో
మూడు పేర్లను కూడా నమకం చెప్పింది. అవే ద్రవ్యము, వేడిమి, నీరు. ఈ మూడే
శివుని బాణాలు. జీవుని దేహంలో ఈ మూడూ సమతౌల్యంగా ఉండాలి. ఈ
మూడింటినీ సక్రమంగా ఉంచుతూ పుష్టిని కలగచేసేవాడే శివుడు.
ఇడ, పింగళ, సుషుమ్న నాడులు మూడూ కలిసే భ్రుకుటి వద్ద ఆజ్ఞాచక్రం
మేలుకుంటుంది. దోసకాయను తరిగి చూస్తే మూడోనేత్రం తెరుచుకుంటుంది.
నేతి సూర్యనారాయణ శర్మ a 151
అలా మూడోనేత్రం తెరుచుకున్నందువల్లనే శివుడు మహోన్నతమైన గోలోకంలో
నా దర్శనం పొందగలిగాడు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలనే నాలుగు వెరైటీల్లోనూ
దోసకాయను వినియోగించినవారు మృత్యుంజయులవుతారని శివుడే శాసనం
చేశాడు. మిగిలిన ఏ కూరలో అయినా దైవాసుర సంపద్విభాగాలు ఉండవచ్చు. కానీ
దోసకాయలో మాత్రం ఏ దోషాలూ లేవు. అది దైవికమైన విత్తనం.
సత్త్వ రజస్తమో గుణాలలో దోసకాయ సత్త్వమహత్తు కలిగినది. నీ శ్రద్ధ
దానిపై పెట్టు. పిచ్చివాడా! తొందరపడి మోక్షం కోరకు. నిత్యమూ దోసకాయను
సేవిస్తే, నీవునాతో సాయుజ్యం పొందినట్లే. నేను నీ వెంటే ఉంటాను. మొత్తంమీద
దోసకాయను గురించి నీకు సమగ్రంగా చెప్పాను. ఏ రకంగా దోసకాయను
తింటావో నీ ఇష్టం. నువ్వు కేవలం తింటున్నవాడివేనని మర్చిపోకు. అరిగిపోతున్న
వాణ్ణి, అరిగిస్తున్నవాణ్ణి నేనే అని గుర్తుపెట్టుకో’’ అని ముగించి రథంవైపుకి నడిచాడు
కృష్ణుడు.
మోకాళ్ల మీద నుంచి పైకి లేచి, కృష్ణుడి వెంటబడి వస్తూ, ‘‘అది సరేకానీ
బావా! దోసకాయను యధాశక్తి సేవించి, మోక్షసామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న
వారెవరైనా ఉన్నారా? దీనికంటూ ఓ ప్రత్యేకమైన వ్రతం ఉందా? దయచేసి ఆ
వివరాలు కూడా నాకోసం చెప్పు’’ అడిగాడు అర్జునుడు.
నొగలు కిందినుంచి కొంతగడ్డి బయటకు తీసి, గుర్రాలకు వేస్తూ
వాసుదేవుడు కొనసాగించాడు. ‘‘పూర్వం సూతమహర్షి శౌనకాది మునులకు ఆ
వివరమంతా తెలియచేశాడు. తీరని కోరికలు ఉన్నవారు, మోక్షాన్ని కోరుకునేవారు,
సమాజక్షేమాన్ని ఆశించినవారు దోసయజ్ఞాలు చేస్తుంటారు. ఇది నూరురోజులపాటు
జరిగే విశేష క్రతువు. మాఘమాసంలో శిశిరరుతువులో భూమిని సమంత్రకంగా
దున్ని, దోసవిత్తనాలు చల్లాలి. ప్రతినిత్యం రుద్రహోమం, మృత్యుంజయ
హోమం చేయాలి. దోసతీగను నేలపై పాకిస్తూ రుత్విక్కులు యజ్ఞశాలలోనికి,
ఆమీద హోమగుండంలోకి మళ్లించాలి. పూర్తిగా పండిన దోసకాయ, తీగనుంచి
శ్రీదోసగీత a 152
విడిపోయిన తరువాత దానితో పూర్ణాహుతి చేయాలి. మంత్రప్రభావమో, దోసలో
ప్రకృతిసిద్ధంగా ఉన్న లక్షణమో కానీ రోజురోజుకీ కొంతచొప్పున జరుగుతూ
దోసకాయ ప్రయత్నపూర్వకంగా తొడిమనుంచి విడిపోతుందని మన వ్యవసాయ
శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.’’
‘‘ఇంతకూ బావా! ఈ దోసకాయ కొంపతీసి విశ్వామిత్ర సృష్టి కాదు కదా?!’’
మళ్లీ డౌటు పడ్డాడు అర్జునుడు.
ఆ మాట వింటూనే నాలిక బయటపెట్టి, ముక్కుమీద వేలేసుకున్నాడు
పార్థసారధి. ‘‘ఎంతమాట! విశ్వామిత్ర సృష్టి అయితే ఆబ్దికాల్లో పనికిరాకుండా
పోయేది కదా! అయినప్పటికీ దోసకాయ కూడా విశ్వామిత్రునితో సాటి రాగలిగినదే.
బ్రహ్మర్షి పదవి కోసం వశిష్టునితో విశ్వామిత్రుడు పోటీ చేసినట్లు దోసకాయ కూడా
మామిడికాయతో పోటీచేసింది. చివరకు తాను కూడా ఆవకాయ అయ్యేందుకు
అర్హత సంపాదించుకుంది. అయితే ఇది విశ్వామిత్ర సృష్టి కాదు. దోసకాయను
సంస్కృతంలో ఉర్వారుక, కర్కటిక, చర్మటికా అనే పేర్లతో పిలుస్తారు. ఈ మూడు
పేర్లు రావడం వెనుక మూడు ప్రసిద్ధమైన కథలు మన ప్రాచీన వాఙ్మయంలో
ఉన్నాయి’’ అంటూ లోకసమ్మోహనంగా నవ్వాడు సత్యాపతి.
‘‘బావా! ఆ కథలు తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉంది.
యుద్ధం మొదలైతే మళ్లీ ఖాళీ చిక్కదు. పన్లోపనిగా ఇప్పుడే చెప్పేసి పుణ్యం కట్టుకో’’
పసిపిల్లాడిలా బతిమాలాడు పార్థుడు.
‘‘అర్జునా! అదుగో... నకులుడు శంఖం పూరించాడు. ఈ అశ్వరాజాలు
లద్దెలు వేసే సమయం ఆసన్నమైనట్లుంది. మనం మర్యాదగా ఆ కనిపించే జమ్మిచెట్టు
కింద తూముమీద కూచుని మిగతా కథ సావధానంగా చెప్పుకుందా పద’’ అంటూ
దారితీశాడు కృష్ణుడు. అనుసరించాడు అర్జునుడు.
మొదటి కథ ఇలా చెప్పాడు.
‘‘యోగవాశిష్ఠంలో వశిష్ట మహర్షి శ్రీరామచంద్రమూర్తికి బోధించిన కథ ఇది.
పూర్వం జంబూద్వీపంలో కర్కటి అనే రాక్షసి ఉండేది. దానికళ్లలో అగ్నిపర్వతాలు
నిప్పులు చిమ్ముతుండేవి. అది నడిచివస్తుంటే నల్లటి కొండ నడిచొస్తున్నట్లుండేది.
సముద్రంలో పుట్టే నిప్పులాంటి బడబానలం దాని కడుపులో ఉంది. ఎంతతిన్నా,
ఏం తిన్నా దాని ఆకలి తీరేది కాదు. జంబూద్వీపంలో ఉండే అందరినీ ఒక్కదెబ్బలో
తినేసినా తన ఆకలి తగ్గదేమో అనిపించేది. అందరినీ ఒక్కసారే తినేస్తే రేపటి
శ్రీదోసగీత a 158
లేదా? పరాయికూరల పెత్తందారీతనంలో మన నేటివ్ దోసకాయలు ఇలా
మగ్గిపోవలసిందేనా?’’ కంటనీరు కవచం కిందినుంచి జారి ఛాతీని తడిపేస్తుంటే
తుడుచుకోలేని అసహాయతలో అర్జునుడు ఆగకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
‘‘అర్జునా! ఎంత విజ్ఞానం పెరిగితే మాత్రం లాభమేముంది? మానవుడు
మరణాన్ని జయించలేని నిస్సహాయుడు. అతడికి అమృతత్వాన్ని ప్రసాదించే దివ్యఫలం
దోసకాయే. ఆ విషయం దానికి పెట్టిన మూడుపేర్లే రుజువు చేస్తున్నాయి. సృష్టిలో
మరణమే లేని జీవి కర్కాటకం అంటే ఎండ్రకాయ. అది బిడ్డను ప్రసవిస్తూ పాతదేహాన్ని
విడిచిపెట్టేస్తుంది. ఆ కర్కాటకం స్మరణకు వచ్చేలా దోసకాయను కర్కటికా ఫలం
అన్నారు. చర్మంపై మోజు లేదు కనుక చర్మటికా అన్నారు. ఇక పొట్టమీద పాకే
లక్షణం ఉన్నది కనుక ఉర్వారుకమని చెప్పారు. దానికి సహజ సుగంధం ఉందని,
పుష్టి కలిగిస్తుందని, ఈశ్వరుడే దానిని సేవించి మృత్యుంజయుడు అయ్యాడని
చెప్పారు. పూర్తిగా పండిన దోసపండు సునాయాసంగా తీగనుంచి విడివడినట్లుగా
మృత్యుబంధనం నుంచి త్రయంబకుడు నన్ను దూరం చేయుగాక! అమృతత్వం
నుంచి మాత్రం కాదు అని త్రయంబకం యజామహే అనే మృత్యుంజయ మంత్రానికి
అర్థం. ఇంత విన్న తర్వాత కూడా దైవకణం ఎక్కడో లేదు... దోసకాయలోనే ఉందని
అర్థం కాకపోతే....ఇదిగో ఇప్పుడు గీతాసారాంశంగా మోక్షసంన్యాస యోగాన్ని
అనుగ్రహిస్తున్నాను విను...’’ అంటూ గొంతు సవరించుకుని లేచి నిలబడ్డాడు
భగవానుడు.
అర్జునుడు మోకాళ్లపై నిలిచి పాతపోజులో నమస్కరించాడు.
గీతాకృష్ణుడు చెబుతున్నాడు... ‘‘పొటాషియం, మెగ్నీషియం అధికంగా
కలిగిన దోసకాయలు బిపికి చాలా మంచివి. మా చిన్నతనాల్లో జగ్గయ్యపేట
నక్కదోసకాయలు మహారుచిగా చిరుపులుపుతో ఉండేవి. గాదెల్లో పోస్తే చాలాకాలం
నిల్వ ఉండేవి కూడా. దోసకాయకు కందిపప్పు సరైన కాంబినేషను. ముక్క నలగకుండా
పచ్చడి చేయడంలో రుక్మిణీదేవి అందెవేసిన చేయి. సత్యభామ మాత్రం వంకాయలాగా
కాల్చి పచ్చడి చేస్తుంది. బుడందోసకాయ ఒరుగులు లేకుండా జాంబవతి ఇంటిలో
భోజనం పూర్తికాదు. చిన్నపాటి గుమ్మడికాయల్లాంటి తినే దోసకాయలు... వాటిని
మిత్రవింద అవంతీ రాజ్యం నుంచి పుట్టింటిసారెగా తెచ్చుకుంది. కాళిందికి పందిరి
దోసకాయమీద ప్రేమ ఎక్కువ. నాగ్నజితి దోసకాయలో గింజలు తీసేసి వండుతుంది.
మా మరదలైన భద్ర చెక్కుసైతం తీయడానికి ఒప్పుకోదు. మద్రదేశాధిపతి కూతురైన
లక్షణ మహా చలాకీ అయినది. దోసగింజల పైతోలు తీసి పప్పులన్నీ ఏరి భోజనం
శ్రీదోసగీత a 160
నువ్వు మామూలుగా శ్లోకాల్లో చెప్పు చాలు. ఆ పుస్తకాల సంగతి మిగతావాళ్లు
చూసుకుంటారు. నువ్వొక్కడివే ఎంతని కష్టపడతావు చెప్పు!’’ అన్నాడు కడుపునిండిన
కృతజ్ఞతతో.
శ్రీకృష్ణుని కంఠం పాంచజన్యంలా మోగింది.
‘కుదరదు. దోసకాయకు మూలము, అగ్రమూ కూడా నేలమీదే ఉంటాయి.
దోస విషయంలో అయినా, నా విషయంలో అయినా
అందరూ సమానమే. గీతాజ్ఞానం కొందరికే సొంతం
కాదు, అందరికీ అందవలసిందే. స్వతంత్రంగా
నేనే యుద్ధం చేయకపోయినా ప్రతివాడి యుద్ధానికి
మూలకారణము, సన్నాహము, నిర్వహణ, ముగింపు నేనే
అని తెలుసుకో.
ఇప్పటికి స్వస్తి.
శంకర సాహిత్యానికి...
సరళానువాదాలు అందించాలనే
ప్రణాళికలో భాగంగా త్వరలో...
• భుజంగ ప్రయాతం
• కనకధారా స్తోత్రం
• భజగోవిందం (మరికొన్ని శంకరుల ఉపదేశగ్రంథాలు)
ప్రతులకు :
ఫోన్ : 99 5174 8340
follow us on
www.facebook.com/groups/sankaravijayam
శ్రీదోసగీత a 162