Professional Documents
Culture Documents
Aryabhatta
Aryabhatta
ఆర్యభట్టు
ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా.
ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా)లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య
సిద్ధాంతం,గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రా న్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా
కనుకున్నట్లు చెప్తా రు. గణితంలో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా"గా నిర్వచించాడు.
ఆయన్ను ఆర్డు వేరియస్ (Arduverius) అనీ, అరబ్బులు అర్జా వస్ (Arjavas) అని వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన
సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్ ను సందర్శించిన
అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తా వించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి
చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తు న ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు.
దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తు ను కొలిచాడని అర్థమవుతుంది.
1 పుట్టు పూర్వోత్తరాలు
2 రచనలు
3 గణిత శాస్త్రం
4 ఖగోళ శాస్త్రం
5 వారసత్వం
6 మూలాలు
పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని
ఆస్థా నంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహురుడికి సమకాలికుడిలా భావిస్తు న్నారు.
విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థా నంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు.
వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను
ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తుంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు
ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేక పోతే అతడు
తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23
ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లు గా భావిస్తు న్నారు. అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో
చాలా విశేషాలతో పాటు, ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలుకలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని
ఆర్యభట్టు డాతని గ్రంథాలలో శాలివాహన శతకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే
చెప్పేడు.అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే ఈతను జన్మించివుంటాడు. వరాహమిహిరుడు తనగ్రంధాల్లో
సిద్ధాంత గ్రంథాల్లో శాకనృపసమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు.ఈరెండు శకాలు
వాడుకలోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం.కాని ఇవి రెండు వాడుకలోనికి రాక పూర్వమే ఆర్యభట్టు డు
వరాహమిహిరునికి కన్నా పూర్వుడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంథాలు శ్రీసేనుడు రోమక
సిద్ధాంతం మీదా, విష్ణుచంద్రు డు వశిష్ట సిద్ధాంతం మీదా అధారపడి ఉన్నాయి. ఈరెండు సిద్ధాంతాలు ఆర్యభట్టు ని సిద్ధాంతాలను
ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తు దు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టు డు బ్రహ్మగుప్తు డికి, వరాహమిహిరునికి
పూర్వుడన్నమాట మనం నమ్మవచ్చు. బ్రహ్మగుప్తు డు శాలివాహన శకంలో ఆరవ శతాబ్దా నికి చెందినవాడు. వరాహమిహిరులు
ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఐదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన
శతాబ్దా నికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధా రణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టు డు క్రీ.శ.426 లో
ఆర్యభట్టు డు ఎప్పుడూ కూడా ఆకాశంవైపు చూస్తూ కంటికి కనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకి గల
వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవునిగూర్చి తపస్సు చేసేడట. దానిఫలితమే దశ గీతిక అనేచిన్న గ్రంథం. ఈయన రచించిన
ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు రెండు -దశాగీతిక, ఆర్యాష్టోత్తరశతకము. ఈదశగీతికలో పదమూడు శ్లోకాలున్నాయి. ఇవన్నీ
వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డవి. ఈగ్రంథంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని
ఇమిడ్చిపెట్టా డు. గణితపాదం, కాలక్రియపాదం, గోలార్ధ ప్రకాశిక అనేవి మూడు ఆర్యాష్టోత్తరశతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టు ని
గ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతిప్రకాశిక వ్రాసిన సూర్యదేవదీక్షితుడు, కేరళకు
చెందిన నీలకంఠసోమయాజి.
రచనలు[మార్చు]
ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రంలో అనేక రచనలు చేశాడు. ప్రస్తు తం వాటిలో కొన్ని అలభ్యం. అతని ముఖ్యమైన
రచన ఆర్యభట్టీయం గణిత, ఖగోళ శాస్త్రా ల సంగ్రహము. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తా రంగా ప్రస్తా వించడమే కాకుండా
ఈ రచన కాలపరీక్షకు తట్టు కుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని అష్మకతాంత్ర అని పిలిచే వాడు. ఆర్యశతాష్ట
2. గణితపాద
3. కళాక్రియపాద
4. గోళపాద
ఈ ఆర్యభట్టీయం అనే రచనకు ఆయన స్వయంగా పేరేమీ పెట్టలేదు. ఇది తరువాత భాష్యకారులు చేసిన పదప్రయోగమే. అత్యంత
క్లు ప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు రాసి విస్తరించాడు.
గణిత శాస్త్రం[మార్చు]
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తు ల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.
బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తా న్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టా డు.
'"`UNIQ--postMath-00000001-QINU`"'
and
'"`UNIQ--postMath-00000002-QINU`"'
ఖగోళ శాస్త్రం[మార్చు]
భూమి నీడ చంద్రు ని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తా యని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ
అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి
స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రు ని
మీద గోళాకారం (elliptical shape)లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది
ఆర్యభట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.
ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టా లకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే
తన గోళాధ్యాయంలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం
సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాలను కచ్చితంగా లెక్క కట్టా డు.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులుగా
లెక్కగట్టా డు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క
ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మద, గోదావరి మధ్య
ప్రాంతమైన అస్మకలో పుట్టా డని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య
భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తు న్నాయి. అయితే ఇతర గ్రంథాలు
అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తా విస్తు న్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.[1]
ఆర్యభట్టు డు భూగోళః సర్వతోవృత్తః అని వ్రాసాడు.భూగోళ మనే మాటలో ఇమిడిఉంది భూమియొక్క వర్తు లత్వం
తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు. " భప్ంజరః స్థిరో
ప్రాచీన సిద్దంతాలకున్నూ వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండేకొరకో,
ఎందుకోగానీ వెంటనే మళ్ళీ భూమి తిరక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలూ, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ
భూర్యదితత్కుతో వ్రజేత్కనుధ్వానుం, ఆవర్తన మర్వాక్చే న్నపతంతి సముచ్ఛ్హాయాః కస్మాత్"- భూమి ఒకప్రాణంలో ఒకకల
కనక కదలినట్లైతే, ఎక్కడికి వెళుతోంది? అది తిరుగుతోంటే ఎత్తైన వస్తు వులు పడిపోవెందుచేత?. కానీ దీనిని బ్రహ్మగుప్తు ని
భూమి మొదలగు గ్రహాలయొక్క గతి పూర్తిఅయినవృత్తంలో లేదనీ దీర్ఘవృత్తంగా (elliptical) ఉందనీ తెలియజేసిన వారిలో
మొదటి హిందువుడు ఆర్యభట్టు డే. సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని గ్రహించక ఆర్యభట్టు డు,
చంద్రు డు భూచ్ఛ్హాయలోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్నికూడా తెలియపరిచాడు. ఇదీకాక,
ఈ చంద్రు డు మొదలయిన గ్రహాలు స్వయంప్రకాశములు కావనీ, సూర్యకాంతివల్లనే ప్రకాశిస్తు న్నాయని చెప్పినవాడు కూడా
భూమికాకర్షణశక్తి కలదని, అన్ని మాటల్లో చెప్పకపోయినా, అతనికావిషయం తెలుస్తు న్నట్లు గా రెండుమూడుచోట్ల, ఆ శక్తిని
గురించి ఆతడు చేసిన సూచనలవల్లన ఊహించవచ్చునని కొందరంటారు. భాస్కరుడు మాత్రం ఆకర్షణశక్తి అనేపదాన్ని
వాడాడు.
భూమి చుట్టు కొలత, వ్యాసమూ మొదలైనవి, ఆర్యభట్టు డు ఇచ్చిన కొలతలకున్నూ, ఇప్పటి నవీన శాస్త్రజ్ఞల పరిమాణాలకు
దగ్గరగా ఉన్నాయి.
వారసత్వం[మార్చు]
ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రా న్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల
సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లా మిక్ స్వర్ణ యుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డా యి. అల్-
ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనల్లో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తా వించారు. ఈతని కుమారుని పేరు దేవరాజు.