Professional Documents
Culture Documents
Shataghninews09 05 2023
Shataghninews09 05 2023
తహశీల్దార్ కార్యాలయానికి
డాక్టర్ పిల్లా శ్రీధర్ వినతిపత్రం
శతఘ్ని న్యూస్: పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్
అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు
ఒక ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని పిఠాపురం
నియోజకవర్గం రైతుల తరఫున పిఠాపురం తహశీల్దార్ వారికి వినతిపత్రం అందించడం
జరిగింది. జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ముందుగా పిఠాపురం నియోజకవర్గ
రైతులతో కలిసి తహసిల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నీట మునిగిన పంట వల్ల
కళ్ళల్లో తడిచి మొలకెత్తిన ధాన్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరానికి 30
వేల రూపాయలు చొప్పున పెట్టుబడి అవ్వగా కౌలు రైతు ఎకరానికి 20 వేల రూపాయలు చొప్పున కౌలు ఇవ్వాలి మొత్తం 50వేల రూపాయలు అవుతుంది పంట చేతికొచ్చే
సమయానికి అకాల వర్షాల కారణంగా రైతు తీవ్ర నష్టానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 50 వేల రూపాయలు
చొప్పున పంట నష్ట పరిహారం అందించాలని సంబంధిత తాసిల్దార్ వారి కార్యాలయానికి వినతిపత్రం అందిస్తున్నట్లు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ
కార్యక్రమంలో భాగంగా గుర్రం గంగాధర్, సైతన రాజబాబు, జీను శ్రీను, గుర్రం గణేష్, కటారి చంటిబాబు, సైతన ఆనంద్ మరియు నియోజకవర్గ రైతులు, జనసైనికులు
పాల్గొనడం జరిగింది.
సత్యవేడు నియోజకవర్గంలో
x
జనం కోసం జనసేన
శతఘ్ని న్యూస్: సత్యవేడు నియోజకవర్గం: జనం కోసం జనసేన 3వ రోజు కార్యక్రంలో
భాగంగా సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలం, కాలమనాయుడుపేట
పంచాయతీలో సోమవారం జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఆశయాలను ఇంటింటికి ప్రజలకు తెలియజేస్తూ సరికొత్త రాష్ట్రాన్ని
చూడాలంటే రాబోవు తరాల పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి
వల్ల మాత్రమే సాధ్యపడుతుందని, అనుక్షణం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ,
మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారి వెన్నంటూ ఉంటూ, జనసేన పార్టీ
ద్వారా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేము
ఉన్నాము అనే ఒక ధైర్యాన్నిస్తూ, నిరంతరం ప్రజలు బాగుండాలని ప్రజా సమస్యలు
తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరడం జరిగింది.
ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాలనతో విసుగు చెంది పవన్ కళ్యాణ్
గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు
హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి. ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, టి.
కుమార్ ప్రసన్న కుమార్, కార్యదర్శి మునిశేఖర్ పాల్గొనడం జరిగింది.
SRI TV MEDIA NETWORKS LLP, Hyderabad, Ph,: +91 9440176789, info@sritvtelugu.com www.sritvtelugu.com