Professional Documents
Culture Documents
Raithu
Raithu
()(_Eenadu Mag_15/07/12
రైతు ఎడ్ల బండే ఎందుకు తోలాలి? దర్జా గా ట్రా క్టరు నడపొ చ్చుగా! సేద్యగాడు
డొ క్కు మోపెడ్మీదే ఎందుకు తిరగాలి? కారు కొనుక్కోవచ్చుగా!
రైతన్న నివాసం పెంకుటిల్లేనా? ముచ్చటైన మేడ కట్టు కోవచ్చుగా!
కృషీవలుడికి ఎప్పుడూ నష్టా లేనా? ఉద్యోగిలా నెలకో యాభైవేలు
సంపాదించుకోవచ్చుగా!
ముత్తా త తాతకూ, తాత నాన్నకూ, నాన్న బిడ్డ కూ నేర్పిన పద్ధ తుల్నే ఇప్పటికీ
పాటించాలా? అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చుగా!అవును,
ఎందుకు సాధ్యం కాదు? అయితీరుతుందని నిరూపించడానికే 'అభినవ్ఫార్మర్స్
క్ల బ్' ప్రా ణంపో సుకుంది. రైతు బతుకంటే పుట్టెడు కష్టా లు కానేకాదు... పుట్ల కొద్దీ
ధాన్యపురాశులని చాటిచెప్పింది. దాదాపు రెండువేల ఎకరాల్లో 'అభినవ్' సేద్యం
నడుస్తో ంది. ఒక్క పుణె క్ల బ్లోనే 250 మంది సభ్యులున్నారు. మహారాష్ట ల
్ర ోని
మిగిలిన ప్రా ంతాలతోపాటు, గుజరాత్, మధ్యప్రదేశ్రాష్ట్రా ల్లో అనేక బృందాలు
చురుగ్గా పనిచేస్తు న్నాయి. పరోక్షంగా వేలమంది రైతులు సలహాలూ
సూచనలూ సాంకేతిక సహకారాలూ అందుకుంటున్నారు.
'అభినవ్ఫార్మర్స్క్ల బ్' వ్యవస్థా పకుడు ధ్యానేశ్వర్మధ్యతరగతి కుటుంబంలో
పుట్టా డు. పుణె దగ్గ ర్లో ని హింజేవాడి సొ ంతూరు. తండ్రి పదహారణాల రైతు. సేద్యం
తప్ప మరో సంపాదన మార్గ ం తెలియని మనిషి. గిట్టినా గిట్టకపో యినా, పంట
వచ్చినా రాకపో యినా వ్యవసాయం చేస్తూ నే వచ్చాడు. ఎప్పుడో అవసరం కొద్దీ
తీసుకున్న ఇరవైవేల అప్పు... లక్షా నలభైవేలై కూర్చుంది. పంటలేమో...
అంతంతమాత్రం! ఉన్న పదిహేను ఎకరాల్లో ఐదెకరాలు అమ్మక తప్పలేదు.
అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో ఇద్ద రు కూతుళ్ల పెళ్లి ళ్లు చేశాడు. జేబు ఖాళీ
అయిపో యింది. ఓ దశలో పూటగడవడం కూడా కష్ట మైంది. అల్లు డు
దారిచూపకపో తాడా అన్న ఆశతో ఒక్కగానొక్క కొడుకును పెద్దకూతురి ఇంటికి
పంపాడు. అప్పటికి ఆ కుర్రా డు పదో తరగతి చదువుతున్నాడు. అక్కయ్య ఇంట్లో
పశువుల కాపరి అవతారం ఎత్తా డు ధ్యానేశ్వర్. తీరిక సమయంలో టైపింగ్
నేర్చుకునేవాడు. చదువు ఆగిపో యినా, పస్తు ల బాధ తప్పింది. అయినా,
మనసంతా అమ్మానాన్నల మీదే. ఎలా బతుకుతున్నారో, ఏం తింటున్నారో
అన్న బెంగ. టైపు పరీక్ష ఫలితాలు వెల్లడైనరోజే... 'నా మిత్రు డు పుణెలో పెద్ద
ఆర్కిటెక్ట్. తన దగ్గ ర టైపిస్టు ఉద్యోగం ఖాళీగా ఉంది. ఓసారి వెళ్లి రా...' అని
చెప్పారు బావగారు. వెంటనే బయల్దే రాడు ధ్యానేశ్వర్. రెండ్రో జుల్లో వచ్చి
చేరమన్నాడు ఆ పెద్దమనిషి. జీతం... రెండువందలు! అమ్మానాన్నలు
సంతోషించారు. సొ ంతూరు హింజేవాడికి పుణె మరీ దూరమేం కాదు. సైకిలు
మీద గంటన్నర ప్రయాణం. పొ ద్దు న్నే బయల్దే రి వెళ్లే వాడు. ఇంటికి చేరేసరికి
అర్ధ రాత్రి దాటేది. ఆ శ్రమ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కీబో ర్డు మీద పట్టు
రావడంతో... చకాచకా పనులు పూర్తిచేసుకునేవాడు. ఆ చురుకుదనం చూసి
యజమాని ముచ్చటపడ్డా డు. ఇంటీరియర్డిజైనింగ్కోర్సులో చేర్పించాడు.
కొత్త అర్హతతో జీతం పెరిగింది. రెండువందలతో బతికిన వాడికి నెలకు అయిదు
వేలంటే..పెద్దమొత్త మే! ముంబయి, పుణె నగరాల్లో ని డొ మినోస్పిజ్జా , వెంకీస్
ఫాస్ట్ఫుడ్దుకాణాల ఇంటీరియర్డిజైనింగ్బాధ్యతలు తనే చూసేవాడు.
పొ దుపు చేసుకున్న డబ్బుకుతోడు మరికాస్త అప్పుచేసి మిగిలిన ఇద్ద రు చెల్లెళ్ల
పెళ్లి ళ్లూ చేశాడు. మంచి సంబంధం రావడంతో తనూ ఓ ఇంటివాడు అయ్యాడు.
బాధ్యతలు తీరిపో యాయి. బరువు తగ్గింది. జీతం పెరిగింది. అయినా ఏదో
అసంతృప్తి. ధ్యానేశ్వర్కు సేద్యమంటే ప్రా ణం. ఏ కాస్త తీరిక దొ రికినా వ్యవసాయ
రంగంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఎన్నో ఆలోచనలు...
'ఏ రైతూ సంతోషంగా లేడు. అప్పులతో కుదేలైపో తున్నాడు. బాధ్యతలతో
కుంగిపో తున్నాడు. అతనికున్న ఆస్తీ ఆధారం... పొ లమే! మరోదారిలేక
..తెగనమ్ముతున్నాడు. పొ లంలేని రైతంటే - ఆత్మలేని శరీరమే - జీవచ్ఛవమే!
ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదు. చిన్న కమతాలు, నిధుల కొరత, ఆధునిక
పద్ధ తుల మీద అవగాహన లేకపో వడం, మార్కెటింగ్నైపుణ్యం కొరవడటం...
భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు'
కలసి మెలసి...
'ఏం పండించాలి?' అన్నది మన ఇష్ట ం కాదు. మార్కెట్ను బట్టి నిర్ణ యించాలి.
'ఎప్పుడు పండించాలి?' అన్నది కూడా 'గిరాకీ-సరఫరా' సూత్రం ప్రకారమే
జరగాలి. కూరగాయలకూ పండ్ల కూ అలంకరణ పుష్పాలకూ పుణె, ముంబయి,
ఢిల్లీ తదితర నగరాల్లో చాలా గిరాకీ ఉంది. అందుకే, క్ల బ్ఆ పంటల్నే
ప్రో త్సహించింది. ఎవరి పొ లంలో వారు సేద్యం చేసుకుంటారు. కానీ విత్త నాలూ
ఎరువులూ క్రిమిసంహారకాలూ కలిసే కొంటారు. దీనివల్ల బేరమాడే శక్తి వస్తు ంది.
పంటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని క్ల బ్బే అందిస్తు ంది. పంట
చేతికిరాగానే.. ఆ సరుకంతా నేరుగా పుణెలోని 'అభినవ్' కార్యాలయానికి
తరలిస్తా రు. అక్కడున్న స్వయంసహాయక బృందాల మహిళలు నాణ్యత
ప్రకారం సరుకును విభజిస్తా రు. శుభ్రంచేసి నిల్వచేస్తా రు. గిరాకీని బట్టి
మార్కెట్కు పంపుతారు. పుట్టీపుట్ట గానే... అభినవ్ఫార్మర్స్క్ల బ్ఇంత
వ్యవస్థీకృతం కాలేదు. అంచెలంచెలుగా ఎదిగింది. ఆధునిక సాంకేతిక
పరిజ్ఞా నాన్ని సొ ంతం చేసుకుంది.
క్ల బ్కార్యకలాపాల్లో మహిళలకు ప్రా ధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ధ్యానేశ్వర్
స్వయం సహాయక బృందాల్ని ప్రో త్సహించాడు. పంట గిడ్డంగికి చేరడం మొదలు
మార్కెట్కు వెళ్లే దాకా... అన్ని బాధ్యతలూ ఆ బృందానివే. ప్రస్తు తం
నూటయాభైదాకా స్వయంసహాయక బృందాలు పనిచేస్తు న్నాయి. ఎంతోమంది
మహిళలు ఉపాధి పొ ందుతున్నారు. ఇక్కడ పనిచేస్తు న్నవారికి... వసతి,
కూరగాయలు, పాలు పూర్తిగా ఉచితం. పిల్లల్ని కూడా క్ల బ్బే చదివిస్తు ంది.
రోజువారీ వ్యవహారాల్లో సహకరించడానికి అరడజనుమంది ఎంబీయే
పట్ట భద్రు లను నియమించుకున్నారు. వ్యవసాయశాస్త ం్ర లో పట్టా అందుకున్న
యువతీయువకుల్ని క్షేత్రస్థా యి అధికారులుగా తీసుకున్నారు.
కార్యాలయాన్ని పూర్తిస్థా యిలో కంప్యూటరీకరించారు. ఎవరి పంటకు ఎంత ధర
వచ్చింది, పెట్టు బడి పో నూ ఎంత లాభం వచ్చింది..వగైరా లెక్కలు పక్కాగా
ఉంటాయి. ఎప్పటికప్పుడు చెల్లి ంపులు జరిగిపో తాయి. క్ల బ్లో రోజుకు వేయి
రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారు. పదివేలు సంపాదించే రైతులూ
ఉన్నారు.దళారులకు దూరం..
రైతుకు ధర మీద అవగాహన ఉండదు. దళారీ చెప్పిందే నిజమనుకుంటాడు.
ఆకలితో అలమటిస్తు న్న వారికి బేరమాడే శక్తి ఎలా వస్తు ంది? ఏదో ఓ ధరకు
పంట అమ్ముడుపో తే చాలనుకునే పరిస్థితి. రైతుల్ని మధ్యవర్తు ల వలలోంచి
బయటికి తీసుకురావాలన్నది 'అభినవ్' ప్రధాన లక్ష్యం. అప్పుడప్పుడే మాల్స్
హడావుడి మొదలైంది. కార్పొరేట్దిగ్గజాలు రిటైలింగ్రంగంలోకి వస్తు న్నారు.
ధ్యానేశ్వర్నేరుగా వెళ్లి వారితో మాట్లా డాడు. దళారులు చెల్లి స్తు న్న ధర
కంటే..కనీసం 30 శాతం ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డా రు. కాకపో తే,
రెండుమూడు నెలల సమయం అడిగారు. కొంతకాలం వేచి ఉండగలిగే రైతులకు
ఇది మంచి బేరమే. కానీ మిగిలినవారి మాటేమిటి? హో టళ్ల మీదా హాస్ట ళ్ల మీదా
దృష్టిపెట్టా డు. భారీమొత్త ంలో ఆర్డ ర్లు రావడం మొదలుపెట్టా యి. కోరినన్ని
కూరగాయలను కోరుకున్న సమయానికి సరఫరా చేయడం కత్తి మీద సామే.
ముందు, గిరాకీకి సరిపడా సరఫరా పెంచాలి. అంటే, దిగుబడి పెరగాలి. సేద్యంలో
అనిశ్చితి తొలగిపో వాలి.
పెరటి రుచులు...
ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఎన్ని పెద్దనోట్లు ఖర్చుపెట్టినా చిన్న
కూరగాయల సంచీ కూడా నిండటంలేదు. మధ్యతరగతి జీవికి పళ్లె ంముందు
కూర్చుంటే కడుపునిండిపో దు, మండిపో తుంది - ఆ ధరల్ని తలుచుకుని. ఈ
పరిస్థితుల్లో ... మీ కూరగాయలు మీరే పండించుకోండి! అంటూ 'అభినవ్
ఫార్మర్స్క్ల బ్' సగటు మనిషికి చల్ల ని కబురు చెబుతోంది. అవును, ఎందుకు
పండించుకోకూడదు? బాల్కనీ, టెర్రస్, పార్కింగ్ఏరియా, పెరడు... ఎక్కడో ఓ
చోట, ఎంతోకొంత జాగా ఉంటే చాలు. విత్త నాలు, మట్టి, కుండీలు, చిన్నాచితకా
పనిముట్లు ... అన్నీ క్ల బ్బువాళ్లే ఇస్తా రు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
బో ధిస్తా రు. వంటింటి వ్యర్థా లనే ఎరువుగా వాడుకోవచ్చు. వంకాయ, కాలీఫ్ల వర్,
బీన్స్, క్యారెట్, క్యాబేజీ... ఏమైనా పండించుకోవచ్చు. నిశ్చింతగా
వండుకుతినొచ్చు. 'ఎంతైనా, మన పెరట్లో పండిన కూరగాయల రుచే వేరు.
ఆహా! ఎంత తాజాగా ఉంటాయి! ఎంత కమ్మగా ఉంటాయి..' అంటూ
పొ ంగిపో తారు రత్నా జయ్దేవ్అనే గృహిణి. ఈ ప్రయోగం కూడా
విజయవంతమైంది. దాదాపు మూడువందల ఫ్లా ట్ల లో పెరటి పంటలు
పండుతున్నాయి. రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించగలిగితే... వారానికి
కనీసం రెండు కిలోల కూరగాయలు పండించుకోవచ్చని చెబుతారు ఫార్మర్స్క్ల బ్
సభ్యురాలు యోగిత. ఓ ఏడాదిదాకా నిర్వహణ బాధ్యత క్ల బ్బువాళ్ల దే. దీని
ద్వారా వచ్చే నిర్వహణ రుసుము కూడా 'అభినవ్'కు ఓ ఆదాయ
వనరే.'సేంద్రియ' మంత్రం
రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ లేకుండా సేంద్రియ పద్ధ తిలో
పండించిన కూరగాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అందులోనూ పుణె
పరిసర ప్రా ంతాల్లో కొత్త కొత్త ఐటీ కంపెనీలు వస్తు న్నాయి. సాఫ్ట్వేర్
ఉద్యోగులు..ఆర్గా నిక్రకాల కోసం కొంత ఎక్కువ చెల్లి ంచడానికి కూడా సిద్ధంగా
ఉన్నారు. అలాంటి కస్ట మర్స్కోసమే అభినవ్ఫార్మర్స్క్ల బ్సేంద్రియ
వ్యవసాయాన్ని ప్రా రంభించింది. చూడముచ్చటైన అలంకరణతో చిన్నచిన్న
దుకాణాల్ని తెరచి
ి ంది. మిగతా కూరగాయలతో పో లిస్తే ధర పదిహేను శాతం
దాకా ఎక్కువగా ఉంటుంది. 'అభినవ్' ఆర్గా నిక్ఫలాల్నీ పండిస్తో ంది. ఈ
ఉత్పత్తు లకు 'ఎకోసర్ట్' ధ్రు వీకరణ కూడా వచ్చింది. ఢిల్లీ , కోల్కతా, ముంబయి
పట్ట ణాలకు వీటిని ఎగుమతి చేస్తు న్నారు.
'అభినవ్' ఆర్గా నిక్చిరుతిళ్ల వ్యాపారాన్ని నడుపుతోంది. ధాన్యాల సూప్,
కొత్తి మీరా అల్ల ం టీ, చెర్రీ టమోటా చాట్, ఉడికించిన మొక్కజొన్న గింజలు.. ఈ
స్టా ల్స్లో దొ రుకుతాయి. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్వయం సహాయక
బృందాలదే. మహిళలోని సృజనాత్మకకోణాన్ని, పూలసాగుకు జోడిస్తే... ఎలా
ఉంటుంది? అద్భుతమైన వ్యాపార ఆలోచన! ఐటీ కార్యాలయాల్లో
పుష్పాలంకరణకు సంబంధించి... 'అభినవ్' అనేక సంస్థ లతో ఒప్పందం
కుదుర్చుకుంటోంది.విదేశీ కూరగాయలు...
నియంత్రిత వాతావరణంలో విదేశీకూరగాయల్ని పండించడం సాధ్యమే? ఏ
అమెరికాలోనో సాగుచేయడానికి అయ్యేఖర్చులో పావుభాగం కూడా ఇక్కడ
ఉండదు. ఎందుకంటే, మన దగ్గ ర శ్రమ చాలా చౌక. విదేశాలతో పో లిస్తే...
సాంకేతిక పరిజ్ఞా నం, ఎరువుల ధరలూ తక్కువే.దిగుమతి ఖర్చులు ఉండవు.
విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే గోవాలోని కొన్ని రెస్టరెంట్ల కు వాటిని
విక్రయించడం ద్వారా... ఈ వ్యాపారంలోకి వచ్చింది అభినవ్. కాప్సికమ్,
బేబీకార్న్, చైనీస్క్యాబేజీ తదితర రకాల్ని పండిస్తు న్నారు రైతులు. ఇంట్లో నే
విదేశీ వంటలు వండుకోవాలనుకునేవారు కూడా ఈ ఖరీదైన కూరగాయల్ని
ఇష్ట ంగా కొంటున్నారు. విదేశాల నుంచీ ఆర్డ ర్లు వస్తు న్నాయి.
కూరగాయల్ని నేరుగా అపార్ట్మెంట్ల కే సరఫరా చేయడం, బియ్యం-పప్పు
దినుసుల వ్యాపారం, పాల వ్యాపారం, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం,
ఆర్గా నిక్సాగు, పూల అలంకరణలు, శిక్షణ కార్యక్రమాలు... రకరకాల మార్గా ల్లో
అభినవ్ఫార్మర్స్క్ల బ్సభ్యులు నెలనెలా నలభై నుంచి యాభైవేల దాకా
సంపాదించుకుంటున్నారు. 'క్లా స్వన్స్థా యి అధికారి జీతం కంటే, నా సంపాదనే
ఎక్కువ' సగర్వంగా చెబుతాడు టమోటా రైతు బాలాజీరావ్. చక్కని ఇల్లు ,
వాహనం, బ్యాంక్బ్యాలెన్స్... ఆ చూడముచ్చటైన జీవితాలు సేద్యానికి సరికొత్త
నిర్వచనాన్ని ఇస్తు న్నాయి.
పొ లాల్ని అమ్ముకోవద్దు !
- ధ్యానేశ్వర్
పొ లం... రైతు ఆస్తి, ఆత్మాభిమానం! రియల్ఎస్టేట్
భ్రమల్లో పడి.. బంగారం లాంటి భూమిని అమ్ముకోకండి!
నిజంగా, భూమి బంగారమే. మా పల్లె పరిసరాల్లో ఐటీ
సంస్థ లు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
లక్షలకు లక్షలు వచ్చేస్తు ండటంతో చాలామంది
అమ్ముకున్నారు. నడమంత్రపు సిరి... ఎక్కువకాలం
నిలబడదు. ఏవో వ్యసనాలు చుట్టు ముడతాయి. ఆ డబ్బు
కరిగిపో డానికి ఎంతో సమయం పట్ట దు. మా వూళ్లో నూ అదే
జరిగింది. ఉన్నదంతా పో గొట్టు కుని తమ పొ లాల్లో నిర్మించిన
భవనాలకే కాపలాదార్లు గా పనిచేస్తు న్నవారూ ఉన్నారు. ఆ
పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు. సేద్యానికి కష్ట మే కాదు,
తెలివితేటలూ అవసరం. వందల ఎకరాలు అక్కర్లేదు. ఒకటి
రెండెకరాలు చాలు... దర్జా గా బతకొచ్చు. ప్రభుత్వాలకు నా
విన్నపం ఏమిటంటే..రైతులకు సబ్సిడీలు అవసరం లేదు.
రుణ మాఫీలూ అవసరం లేదు. చక్కని రవాణా సౌకర్యం
కల్పించండి. కోతల్లేని విద్యుత్ఇవ్వండి. అవినీతిలేని పాలన
వ్యవస్థ ను ప్రసాదించండి. అంతకు మించి మేం ఏమీ అడగం!
రైతులకు పాఠాలు...