Professional Documents
Culture Documents
భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు
భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు
క్రీస్తు పూర్వం
- భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి
* 327-326
ఏర్పడింది.
* 145 - 101 - చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
క్రీస్తు శకం
* 78 - శక యుగం ప్రారంభం
- భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ
* 1001
ఓడించాడు.
* 1192 - తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను
వరించింది.
* 1526 - మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థా పన.
* 1853 - బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తా లో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
* 1875 - స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
* 1911 - ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
* 1919 - మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
* 1930 - సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
* 1941 - రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
* 1942 - క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8 న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
- ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా
* 1942-44
బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
- వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం
* 1945
ముగింపు.
* 1949 - కశ్మీర్ లో శాంతిస్థా పనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
* 1950 - గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26 న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
* 1966 - తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.
* 1967 - నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
* 1971 - కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లా దేశ్.
* 1974 - భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రు ద్దీన్ అలీ అహ్మద్.
- ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం
* 1977
సంజీవరెడ్డి.
- ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20 న చరణ్ సింగ్ రాజీనామా,
* 1979
ఆరో లోక్ సభ రద్దు .
- ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో
* 1980
సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
- మార్చి 19 న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1 ఏ ప్రయోగం; జులై 15 న రాష్ట్రపతిగా జైల్ సింగ్;
* 1982 నవంబరు 5 న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15 న ఆచార్య వినోబా మరణం;
నవంబరు 19 న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
* 1984 - పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టా ర్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.
* 1985 - రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
- అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి
విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5 న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27 న పృథ్వి
* 1989 రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29 న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి
తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా
ఎన్నిక.
- వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన;
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు ; మండల్ కమిటీ నివేదిక
* 1990
అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో
హింసాకాండ.
- జనవరి 17 న గల్ఫ్ యుద్ధం; మే 21 న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20 న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన
* 1991
మంత్రిగా పీవీ నరసింహారావు.
- ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23 న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే
* 1992 మరణం; జులై 25 న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7 న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా
తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
- జనవరి 29 న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300
* 1993
మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
- పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి
* 1994
వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
- ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం
* 1995 ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2 సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
* 1996 - హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
* 1998 - మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
- డిసెంబరు 24 న భారత విమానం ఐసీ – 814 హై జాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థా న్ తీవ్రవాదులు; ఆ
విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి
* 1999 విడుదల చేసింది; పాకిస్థా న్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల;
పాకిస్థా న్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన
ఇండియన్ ఆర్మీ.
- అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రా ల ఆవిర్భావం; 100
* 2000
కోట్లు దాటిన భారత్ జనాభా.
- జులైలో భారత్- పాకిస్థా న్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల
* 2001 ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు , మంత్రు ల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా
లెక్కలు.
- అబ్దు ల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27 న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ
* 2002
ప్రకటన.
- ఇన్ శాట్ – 3 ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని
* 2003
సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3 ఇ ప్రయోగం సఫలం.
* 2004 - సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.